వికీవ్యాఖ్య tewikiquote https://te.wikiquote.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.47.0-wmf.11 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీవ్యాఖ్య వికీవ్యాఖ్య చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk ఆధునిక భారతీయ చిత్రకళ 0 6991 26547 26542 2026-07-20T07:14:37Z Veera.sj 1008 /* వ్యాఖ్యలు */ ** జతిన్ దాస్ (13:55 - 14:14) 26547 wikitext text/x-wiki [[File:Raja Ravi Varma - Mahabharata - Shakuntala.jpg|thumb|భారతీయ పౌరాణిక పాత్రలను పాశ్చాత్య శైలిలో, మానవ రూపాలలో, అప్పటి వరకూ భారతీయ చిత్రకళలో లేని తైలవర్ణాలతో చిత్రీకరించటంతో అతని అద్భుత ప్రతిభను ప్రశంసించిన వర్గం ఒకటైతే, పాశ్చాత్య శైలిని అనుకరించటం భారతీయ చిత్రకళకు అవమానమని విమర్శించిన వర్గం మరొకటి]] '''[[w:ఆధునిక భారతీయ చిత్రకళ|ఆధునిక భారతీయ చిత్రకళ]]''' సాంప్రదాయిక [[w:భారతీయ చిత్రకళ|భారతీయ చిత్రకళ]] పై పాశ్చాత్య ప్రభావాలకు ప్రతిస్పందనగా ఏర్పడిన ఒక అధునాతన చిత్రకళా శైలి. == వ్యాఖ్యలు == * వలస పాలన వచ్చిన తర్వాత (సాంఘిక అవసరాలకు, వ్యక్తిగత భావోద్వేగాలకు మధ్య ఉండే సమతౌల్యతను) కొనసాగించటంలో ఒక పెద్ద విరామం వచ్చింది. ఆ విరామం వల్ల వచ్చిన ప్రభావాలనే భారతీయ కళాకారులు గత నూరేళ్లుగా ఎదుర్కొంటూ, దానికి తగినట్టు తమ పనిని మార్చుకుంటూ వచ్చారు ** దూరదర్శన్ ప్రసారం చేసిన '''The Paintings of India''' శీర్షిక -, ''Development of the Modern Idiom Part -I'' అనే లఘుచిత్రంలో రంజిత్ హొస్కోటే (03:20 - 03:36)({{Cite web|url=https://www.youtube.com/watch?v=Pnjt34Mpr6A&list=PLPahQu0Yh9xDgnKMM1wq7hP9J7xULD4vP&index=4|title=The Paintings of India - Development of the Modern Idiom Part -I|last=National|first=Doordarshan|date=|website=youtube.com|url-status=live|access-date=10 May 2026}}) * ఒకప్పుడు చిత్రకళలో సామాజిక అవసరాలు, వ్యక్తిగత వ్యక్తీకరణ—ఈ రెండింటి మధ్య ఒక అద్భుతమైన సమతుల్యం ఉండేది. ఆ సమతుల్యం… సామ్రాజ్యవాదం వచ్చిన తర్వాత పూర్తిగా దెబ్బతింది. సాంప్రదాయిక కళాశాలలు/శిక్షణా విధానాలు చెదిరిపోయాయి; కొత్తగా వచ్చిన రూపాలు మాత్రం చారిత్రక నేపథ్యం లేకుండా వచ్చాయి. ఈ మార్పు వలన, భారతీయ చిత్రకారుడు ఒకరకంగా తటస్థుడు అయిపోయాడు. ఒక వైపు—తన ఆలోచనలు, తన కళాత్మక భావనలను సూత్రీకరించే వ్యవస్థ ఏదీ లేకపోవడం; మరో వైపు—తన భావనను వ్యక్తపరచాలనే బలమైన తపన ఉన్నా, దానికి స్ఫూర్తి అయిన సంప్రదాయం, గతం ఏదీ లేకపోవడం వల్ల భారతీయ కళాకారుడు అంతులేని అయోమయంలో చిక్కుకున్నాడు. ** యశోదర దాల్మియా ((03:36 - 04:31) * సాధారణంగా ఆధునిక భారతీయ చిత్రకళా చరిత్రను చెప్పేటప్పుడు మనం అబనీంద్రనాథ్ ఠాగూర్ నుండి ప్రారంభిస్తాం—ఆయన మొదలుపెట్టిన ఉద్యమం తర్వాత ‘[[w:బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్|బెంగాల్ స్కూల్]]’గా ప్రసిద్ధి చెందింది. కానీ...చరిత్ర పుటలను ఇంకాస వెనక్కి తిరగేసి చూస్తే...అంటే పదొమ్మిదో శతాబ్దం మధ్యకాలానికి, అదే భారతదేశంలో మొదటి కళాశాలలు ఏర్పడిన సమయానికి. ఎందుకంటే ఆ కాలంలోనే ఒక కొత్త సామాజిక, వృత్తిపరమైన కళా వర్గం—కళాకారుల కొత్త తరగతి—పుట్టుకొచ్చింది. అంటే, అప్పటి వరకు ఉన్న కళాకారులకు పూర్తిగా భిన్నమైన, మధ్యతరగతిలోనే నిపుణులైన కళాకారుల సమూహం రంగంలోకి వచ్చింది. మొదట్లో వీరిలో చాలామంది ఆయిల్ పెయింటింగ్, అకాడెమిక్ రియలిజం వంటి పాశ్చాత్య శైలులను అభ్యసించినవారే. అయినప్పటికీ, ఆ కాలపు కళా ప్రపంచాన్ని వీరే ప్రధానంగా నడిపించారు. దక్షిణంలో [[w:రాజా రవి వర్మ|రాజా రవి వర్మ]] వంటి వ్యక్తి—జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పొందిన వ్యక్తి—మనకు వెంటనే గుర్తుకు వస్తాడు. అదే సమయంలో, ఈ తొలి పాశ్చాత్య-శైలి అకాడెమిక్ కళాకారుల్లో చాలామంది ఆధునిక భారతదేశానికి ‘జాతీయ కళ’ అనే వర్గాన్ని నిర్మించాలనే ప్రయత్నంలో కూడా సమానంగా పాల్గొన్నారు. భారతీయ అంశాలను చిత్రీకరించడం, భారతీయ కళారాధకులలో ఒక కొత్త రకమైన రసవత్తరమైన కళను వ్యాపింపజేయటం—ఇవన్నీ వారి ఆసక్తులలో భాగం. ** తపతి గుహ-ఠాకుర్తా (06:35 - 08:03) * ...ప్రాథమికంగా రవివర్మ పాశ్చాత్య శైలిని ఉపయోగించి భారతీయ పురాణాలలో నిక్షిప్తమైన ధార్మిక భావాలు, రంగులు, వస్త్రాలు, ఆచార-సాంప్రదాయాలు, [[రామాయణం]], మహాభారతం, వంటి ఇతిహాసాలు, భారతీయ సంస్కృతిలో నాటుకుపోయిన ఇతర కథలను [[చిత్రలేఖనం|చిత్రకళ]] లోకి తీసుకువచ్చాడు. అయితే, తను ఉపయోగించిన శైలి మాత్రం, భారతీయ సాంప్రదాయనికి పూర్తిగా భిన్నమైనది. ** నైవేలి తులి (08:41 - 9:10) * రవివర్మ పాశ్చాత్యులు అధికారంలో ఉన్నప్పుడు పని చేస్తూ, సామ్రాజ్యవాద వ్యవస్థలో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకోవటానికి ప్రయత్నించాడు. అతను ఏ విషకోరలకు బలి కాలేదు, వారి ప్రభావానికి అతని కళ బానిస కాలేదు. తైలవర్ణ చిత్రకళ అనే ఒక సరిక్రొత్త మాధ్యమాన్ని తన ఇష్టంతోనే నేర్చుకుని దానిని తాను ఎలా అర్థం చేసుకొన్నాడో ఈ ప్రపంచానికి తన చిత్రకళ ద్వారా తెలిపాడు. పంథొమ్మిదవ శతాబ్దపు చివరి రోజుల్లో చిత్రకళలో సంభవిస్తోన్న మహత్తర మార్పులకు అవగతం చేసుకొని కళా రూపాంతరం అనే బృహత్కార్యాన్ని చేపట్టాడు. ఐరోపా చిత్రకళతో సేవలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుని, అతడి ప్రజ్ఞాపాటవాలను వినియోగించి చిత్రకళారంగంలో అతిపెద్ద చారిత్రక మార్పులకు శ్రీకారం చుట్టాడు ** గీతా కపూర్ (09:50 - 10:31) * రవి వర్మకు ప్రతిస్పందనగా, ఆయన ప్రోత్సహించిన చిత్రకళా ధోరణికి వ్యతిరేకంగా, అబనీంద్రనాథ్ ఠాగూర్, ఆనంద కుమారస్వామి, ఎర్నెస్ట్ బిన్ఫీల్డ్ హేవెల్ ల త్రయం కలిసి [[w:బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్|బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్]] ను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. భారతీయ సాంప్రదాయ చిత్రకళ అయిన అజంతా చిత్రాలను, భారతీయ సూక్ష్మచిత్రకళా సంప్రదాయాలైన [[w:మొఘల్ చిత్రకళ|మొఘల్ చిత్రకళ]], పహారీ సూక్ష్మచిత్రకళ వంటి వాటిని స్ఫూర్తిగా పరిగణించి, ఈ శైలి పురాణం–ధర్మం వంటి విషయాలను చిత్రకళా సారాంశాలుగా పరిగణించినా, ఇందులోని రేఖానిర్మాణం, రంగులను వినియోగించే తీరు, దృశ్యం యొక్క కూర్పు వంటి అంశాలు రవి వర్మ శైలికి పూర్తి భిన్నంగా — వినూత్నంగా ఏర్పరచటం జరిగింది.. ** నైవేలి తులి (11:25 - 12:11) * (బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనబడే ఈ) కొత్త కళా ఉద్యమం (Academic Realism అనే) ఈ పాశ్చాత్య ప్రభావాన్ని ఏ మాత్రం అనుకరణాత్మకమైనది కాదని, సామ్రాజ్యవాద ప్రభావితమైనదని, కళా సౌందర్య విలువ లేనిదని ముద్రలు వేసి పూర్తిగా తిరస్కరించటానికి ప్రయత్నించలేదు. అబనీంద్రనాథ్ మరియు ఆయన తొలి దశ శిష్యులు చేయాలనుకున్నది — ఒక కొత్త జాతీయ కళను పునర్నిర్మించడం. అయితే వారి ప్రధాన ఆందోళన పాశ్చాత్య అకాడెమిక్ విధానాల నుండి బయటపడటం, మరియు వారు ‘ఆదర్శవాద ఆధ్యాత్మిక కళ’గా భావించిన కొత్త శైలిని నిర్మించడం. అబనీంద్రనాథ్ ఉద్యమంలో కళాకారుల సమూహాన్ని నిర్మించడంపై సమానమైన ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే ఆయనకు ఒక క్రొత్త శైలిని ఏర్పరచాలనే సంకల్పం ఉంది; జాతీయ భావంతో కూడుకొన్న ఈ సరికొత్త కళ అనే ప్రాజెక్టు ఒక వ్యక్తి చేత సాధ్యం కాదని ఆయన నమ్మాడు. దానికి ఒక ఉద్యమం కావాలి, దానికి అనుచరులు కావాలి అని గుర్తించాడు. ఇక్కడే ఒక విరోధభావం ఉత్పన్నమవుతుంది — నిజమైన భారతీయ కళ అంటే ఇదే - అనిపించేలా ఒక నిర్ధిష్ట రూపకల్పనను విస్తృతంగా వ్యాప్తి చేయటం పైనే ఆ కాలంలో ఈ బెంగాలీ శైలి కళాఉద్యమం యొక్క విజయం ఆధారపడి ఉండేది. ఈ బలమే, తర్వాత ఈ ఉద్యమం యొక్క ప్రధాన బలహీనతగా కూడా మారింది. నిజమైన భారతీయ కళ - అనే భావన పునరావృత్తం అవుతూ ఉండటం, ఒక విధమైన సూత్రీకృత రూపంలోకి మారిపోవటంతో తర్వాతి తరం యొక్క ఆధునిక భారతీయ చిత్రకళాకారులు ఈ భావన నుండి నిదానంగా దూరం అవ్వటం మనం చూశాము. ** తపతి గుహ-ఠాకుర్తా (13:28 - 28:43) * 1920లో కళాభవన్ స్థాపించబడినప్పుడు, అది జాతీయవాద కళా ఉద్యమం లో ఒక ప్రధానమైన విరామాన్ని సూచించింది. నిజానికి, జోరాసాంకో (రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క) ఇంట్లో అభివృద్ధి చెందిన భారతీయ శైలి, చిత్రకళలో ఉన్న ప్రతిబంధకాలు, అత్యంత సాంప్రదాయబద్ధమైన స్వభావం అని కళకు ఉండే అడ్డుగోడ పట్ల రవీంద్రనాథ్‌కు ఉన్న అసంతృప్తియే ఆయనను ఈ కొత్త కళా కేంద్రాన్ని స్థాపించడానికి ప్రేరేపించింది. ఈ కేంద్రం యొక్క ప్రధాన లక్ష్యం — కళను ప్రకృతితో, దైనందిన జీవితంతో, ముఖ్యంగా ఆయన చెప్పినట్లుగా జీవించి ఉన్న జానపద మరియు గ్రామీణ సంప్రదాయాలతో మళ్లీ అనుసంధానించడం. ఇది ఆధునిక భారతీయ కళా ఉద్యమంలో ఒక పెద్ద మార్పును సూచిస్తుంది, ఎందుకంటే భారతీయ కళ తన ప్రాచీన, శాస్త్రీయ మూలాల నుండి లేదా మధ్యయుగ సభా సంప్రదాయాల నుండి దూరమై, చుట్టూ ఉన్న జీవన సంప్రదాయాలను — దైనందిన జీవితాన్ని — కళగా చూడడం ప్రారంభించింది. 1920ల నాటికి, అతీత తత్వవాదం, ఆదర్శవాదం వంటి భావాలపై చర్చ తగ్గి, భారతీయ కళను పునరుజ్జీవింపజేయడం, భారతదేశపు ఆత్మను కళలోకి తీసుకురావడం వంటి ఆలోచనలు ముందుకు వచ్చాయి. ఎందుకంటే వారు కనుగొన్న ‘జీవించి ఉన్న భారతదేశం’ అనేది గ్రామీణ భారతదేశమే. ** తపతి గుహ-ఠాకుర్తా (15:42 - 28:43) * బెంగాల్ స్కూల్ నుండి పుట్టిన ఉద్భవించిని ప్రముఖ కళాకారులలో ఒకరు నందలాల్ బోస్ — ఈయన ఆధునిక భారతీయ చిత్రకళక్లోని అత్యుత్తమ కళాకారుల్లో ఒకరు. ఆయన మొదట అభనింద్రనాథ్ టాగోర్ శిష్యుడిగా ప్రారంభించి, తరువాత రవీంద్రనాథ్ ఆయనను శాంతినికేతన్ కు ఆహ్వానించినప్పుడు, ఆయన దృష్టికి యొక్క వైశాల్యం పెరిగింది. అక్కడి గ్రామీణ వాతావరణం, కళాకారుడి దైనందిన జీవితం, సాధారణ ప్రజల జీవన విధానం, అలాగే ప్రకృతి — ఇవన్నీ ఆయనకు సహజమైన ప్రేరణలుగా మారాయి. ** నైవేలి తులి ((17:55 - 18:24) * నందలాల్ బోస్ ఆధునిక కళాకారుడి భావజాలాన్ని జానపద సంప్రదాయాలతో మళ్లీ అనుసంధానించే ప్రయత్నంలో నిజంగా అగ్రగామిగా నిలిచాడు. ఈ అనుసంధానికి ప్రధాన మలుపు (19)30వ దశకంలో వచ్చింది. 1938లో హరిపుర కాంగ్రెస్ సభ కోసం చిత్రలేఖనం చేయమని ఆహ్వానించినపుడు, ఈ పరిణామం చోటు చేసుకొంది. దైనందిన గ్రామ జీవితం నుండి గ్రహించబడ్డ వివిధ పాత్రలను నందలాల్ బోస్ ఒక వెల్లువ లాగా చిత్రీకరించాడు. ఆ చిత్రపటాలలో అతని యొక్క ముద్ర/శైలి ప్రస్ఫుటంగా కనబడేలా రూపకల్పన చేశాడు. వాటిని మనం ఇప్పుడు చూస్తే మాత్రం అవి మనకు ఆ నాటి గ్రామీణ ప్రజల సంప్రదాయాలను ప్రతిబింబించగలిగే ఆధునిక కళాఖండాల లాగా కనబడతాయి ** తపతి గుహ ఠాకుర్తా (18:25 - 28:43) * ఆధునిక భారతీయ చిత్రకళలో జామిని రాయ్ కూడా ప్రాధాన్యం కలిగినవాడే. భారతీయ జానపద/ఆదివాసీ చిత్రకళా సంప్రదాయాల వైపు తిరిగి వెళ్ళాలని సంకల్పించడమే అతనికి ఈ ప్రధాన స్థానాన్ని సంపాదించి పెట్టింది. కాలిఘాట్ మరియు ఇతర జానపద శైలుల నుండి స్ఫూర్తిని పొంది ఆయన వినియోగించే రంగులు/రేఖలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని రుఫొందించుకొని కళకు నూతన భాష్యాన్ని పలికాడు. ఆయనకు సంబంధంలేని, పూర్తిగా భిన్నమైన క్రైస్తవ ఇతివృత్తాలు, బైబిల్ అధ్యయనం వంటి అంశాలను, 1940లలో చిత్రీకరించి తన నూతన శైలిని స్పష్టం చేసాడు. తన ఇతివృత్తాలను దూరమైనా, ఇలాంటి అన్య ఇతివృత్తాలను కూడా తాను ఒక కొత్త శైలిలో చిత్రీకరించగలడని, వాటికి ప్రాతినిధ్యం వహించగలడని, తెలుసుకొన్నాడు. ** నైవేలి తులి (19:55 - 20:42) * జామిని రాయ్ తో బాటు, గగనేంద్రనాథ్ కూడా కొంతవరకు తనకంటూ ప్రత్యేకంగా ఒక శైలిగల కళాకారుడు. ఏ ఒక్క సమూహాన్ని, భావనను, ఉద్యమాన్ని అనుసరించకుండా, అనేకమంది కళాకారులను ప్రోత్సహించి, పెంపొందిచిన నిజమైన కళాభిమాని. 1920లలోనే పాశ్చాత్య కళను ప్రేరణామూలంగా పరిగణించిన తొలి భారతీయ ఆధునిక చిత్రక్రారులలో గగనేంద్రనాథ్ కూడా ఒకరు. రవీంద్రనాథ్ ఠాగూర్ తో కలిసి విదేశాలకు వెళ్ళాడు. జర్మన్ ఎక్స్ప్రెషనిస్టుల ప్రభావం, భారీ వుడ్ కట్ ప్రదర్శనలు, ఇవన్నీ ఆ కాలంలో క్యూబిజం వైపు దృష్టి మరల్చాయి. క్యూబిజం అప్పట్లో అత్యంత ముఖ్యమైన కళా ఉద్యమం అయినప్పటికీ భారతదేశంలోకి అది అంత త్వరగా చేరలేదు. ** నైవేలి తులి (20:42 - 21:31) * 1940ల ప్రారంభంలో, యూరోపియన్ మాడర్నిజం పట్ల భారతీయ కళా ప్రపంచంలో ఒక కొత్త ఆసక్తి పుట్టుకొచ్చింది. ఆ మార్పు ఆసాంతంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి [[అమృతా షేర్-గిల్]]. పాశ్చాత్య ప్రభావాన్ని స్వాగతించిన ఆమె, భారతీయ కళలో అప్పటివరకు కనిపించని పోస్ట్–ఇంప్రెషనిస్టు రంగుల భావన, ఆకృతుల విన్యాసాన్ని తీసుకువచ్చింది. 1930ల చివర్లో ఆమె ఒక ప్రతీకాత్మక వ్యక్తిగా ఎదిగి, అనేకమంది కళాకారులను రంగుల వినియోగం, నిర్మాణం గురించి అధ్యయనం చేయడానికి స్ఫూర్తినిచ్చింది. ఈ విధంగా ఆమె [[ఆధునిక భారతీయ చిత్రకళ]]కు ఒక దృఢమైన పునాదిని వేసింది. ** నైవేలి తులి (22:06 - 22:48) * భారతీయులను ఆమె (అమృత) చూసింది అన్యుల దృక్కోణంలో అయినా ఆమె కోరిక మాత్రం భారతీయ ఆంతరంగికులతో కలిసి పోవాలనే! ** ముల్క్ రాజ్ ఆనంద్ (22:50 - 23:03) * అజంతా గుహలు ఆమె (అమృత షేర్ గిల్) సందర్శించవలసిన స్థలాల జాబితాలో ఉండేది. అక్కడి కుడ్యచిత్రాలు మరియు దక్షిణ భారత దేవాలయాలలోని కుడ్యచిత్రాల సందర్శన తనకు సరిక్రొత్త పునరావిష్కరణలు అయ్యాయి. కళను విద్యాభ్యాసంగా, శిక్షణగా పరిగణించటం, ఆధునిక దృక్కోణంలో వీక్షించటం వంటి వాటి పాశ్చాత్య ధోరణి నుండి బయటపడుతూ భారతీయ పారంపర్యాన్ని పునర్వీక్షించింది. భారతీయ చిత్రకళ అప్పటికి డోలాయమాన స్థితిలో ఉందని పొరబడిన అమృతకు భారతీయ కళాత్మక గతం యొక్క వైభవాన్ని, గొప్పదనాన్ని అజంతా తెలిపింది. అజంతా చిత్రకళ, భారతీయ సూక్షచిత్రకళలోని సాంప్రదాయాలు ప్రభావితం చేసినంతగా తన చుట్టూ కనిపించినది వేరే ఏవీ తనని ప్రభావితం చేయలేకపోయాయి. అజంతా చిత్రాలలోని ఆ రంగులు, ఆ శైలులు, ఆ ముఖకవళికలు తనకంటూ ప్రత్యేకమైన దృశ్య సంకేతాలను ఏర్పరచుకొనే స్ఫూర్తిని అందించాయి. ముప్పైయవ దశకపు తుది దశలో ఆధునిక భారతీయ కళాకారులకు ఒక వారసత్వాన్ని నిర్వచించటంలో, కళా చరిత్రలో మరొక కీలక ఘట్టాన్ని సూచించటంలో అజంతా ముఖ్యకేంద్రంగా మారిందని నేను భావిస్తున్నాను. ** తపతి గుహ ఠాకుర్తా (23:17 - 24:20) * నేను ఒక వ్యక్తివాదిని. కొత్త సాంకేతికతను రూపొందిస్తోన్నాను. ఈ సాంకేతికత యొక్క సాంప్రదాయిక భావన భారతీయత కాకపోవచ్చు. కానీ దీని ఆత్మ మాత్రం ప్రాథమికంగా భారతీయతయే. రూపం మరియు రంగుకు అనంతమైన ప్రాముఖ్యతను ఇస్తూ నేను భారతదేశాన్ని, ప్రధానంగా భారతదేశంలో పేదవారిని అర్థం చేసుకొంటున్నాను. కేవలం భావోద్వేగ ఆసక్తిని కలిగించేది కాదు. నాకు ఈ నేల అంతకు మించినది ** అమృత షేర్ గిల్ (24:23 - 25:03) * ఆమె (అమృత షేర్ గిల్) అప్పటికే పారిస్ నగరంలో నివసించింది. రెండు ప్రపంచ యుద్ధాల నడుమ ఏర్పడిన మానవతావాదం, యథార్థవాదం, వంటి వాటిలో ఆధునిక దృక్పథాన్ని చవిచూసినది. అటువంటి దృక్పథంలో, ఇక్కడ కూడా అప్పటికే నివాసం ఉండి, ఇక్కడి ప్రజలకు ప్రాతినిధ్యం వహించదలచే ప్రయత్నం అప్పటికే చేయటం వలన భారమైన గతస్మృతులతో భారతదేశం తనకి ఎదురైంది. ** వివాన్ సుందరం (25:03 - 25:38) * ఒక విధంగా చూస్తే, కళారాధకుల-కళాకారుల-వీక్షకుల మధ్య ఒక సాంఘిక ఒప్పందం ఉండేది. మనకి ఇది రుచించకపోవచ్చు, కానీ ఈ సాంఘిక ఒప్పందం తునాతునకలు అయ్యింది. రద్దయిన ఈ ఒప్పందం యొక్క పర్యవసానాలే నా దృష్టిలో 1947 నుండి, ఇప్పటివరకు భారతీయ కళను నిర్వచించాయి. ** రంజిత్ హోస్కోటే (04:10 - 04:30) (దూరదర్శన్ లో ప్రసారం అయిన '''The Paintings of India''' అనే శీర్షికన ''Development of the Modern Idiom Part -II'', అనే లఘుచిత్రంలో ({{Cite web|url=https://www.youtube.com/watch?v=voQnMRaAMHE&list=PLUiMfS6qzIMywfcZB9u9T77GjZQeoFdrB&index=9|title=The Paintings of India - Development of the Modern Idiom Part -II|last=National|first=Doordarshan|website=youtube.com|url-status=live|access-date=13 May 2026}})) * పలువురి దృష్టిని ఆకర్షించిన, పలు విమర్శకుల మన్ననలు పొందిన ప్రోగ్రెసివ్ ఆర్టిస్టు గ్రూపు అప్పటి బొంబాయిలో ఉన్న సాంప్రదాయాలను సవాలు చేసిన ఆరుగురి కళాకారులచే స్థాపించబడింది. ** నెవిల్లే తులి (05:37 - 06:10) * స్వతంత్ర సిద్ధితోనే ఇదంతా మొదలు అయ్యింది. అప్పట్లో అదంతా ఒక క్రొత్త బంగారు లోకం. ** ఎస్. హెచ్. రజా పదాలను చదివిన గీతి సేన్ (06:11 - 06:21) * అప్పట్లో పర్వతాలను కదిలించే శక్తి మాకు ఉంది అనిపించేది, అది మేము మేముగా మారుతోన్న ప్రక్రియ. ** సయ్యద్ హైదర్ రజా (06:32 - 06:38) * కలకత్తా గ్రూపు, ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్స్ గ్రూపు రెండూ ఆధునికత వైపు అడుగులు వేశాయి, కాబట్టి రెండూ ప్రముఖమైనవే. శరణార్థుల, పుస్తకాల, ముద్రణల వంటివి 40వ దశకంలో భారతదేశంలోకి ప్రవేశించి అంతర్జాతీయ ఆధునికత గురించి స్థానిక కళాకారులకు తెలిపాయి. ఇక్కడి కళాకారులకు తమలాంటి పాశ్చాత్య కళాకారుల గురించి తెలిసింది. ఇలా ఒక వైపు మనకి ఆధునిక కళ యొక్క పరిచయం జరుగుతూ ఉంటే మరొక వైపు స్వాతంత్రం సిద్ధించే సమయం కావటంతో భారతీయ కళాకారులు వారి గతాన్ని పునరావిష్కరించుకొని వారి చారిత్రక-సాంస్కృతిక మూలాలను అర్థం చేసుకొని, అప్పటి కాలానికి వాటిని అన్వయించుకొన్నారు. ** యశోదర దాల్మియా (06:39 - 07:47) * అన్ని భారతీయ శైలులను గమనించిన తర్వాత నేను చిత్రీకరించవలసినది వేరే అని నాకు అనిపించింది. ఆ కళా ప్రదర్శన శాలను సందర్శించిన తర్వాత గుప్తుల కాలం నాటి ఆకారాలను, బసోహ్లీ లోని గాఢమైన రంగులను, జానపదం చిత్రాల లోని అమాయకత్వాన్ని, ఈ మూడింటినీ కలిపివేశాను. ** ఎం ఎఫ్ హుసేన్ (08:03 - 08:29) * ఆధునిక భారతీయ చిత్రకళలో హుసేన్ మహోన్నతుడు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయనలో ఉన్నంత అపారమైన శక్తి, మరే ఇతర కళాకారునిలో కనబడదు. ఎవరైనా ఠక్కున గుర్తుపట్టగలిగేంత ప్రత్యేక శైలి అతని సొంతం. ఒక గొప్ప కళాకారుడి శాశ్వత లక్షణం అదే! ** నెవిలే తులి (08:48 - 09:06) * రజా మరియు గాడే, ఇరువురూ ప్రకాశవంతమైన రంగులను వాడేవారే. రజా యొక్క కళా ప్రయాణం బహుదూరమైనది, లోతైనది, బహుముఖమైనది, 40 ఏళ్ళుగా బహువిధంగా కొనసాగినది...ఇరువురూ వివిధ మార్గాలలో వివిధ శైలులకు ప్రాతినిధ్యం వహించి సాంప్రదాయ భారతీయ కళను పుణికిపుచ్చుకొన్నారు. పాశ్చాత్య, ప్రత్యేకించి పారిస్ యొక్క కళా ప్రభావాలను ప్రకటిస్తూ వారిని వారు వ్యక్తపరచుకొన్నారు. ** నెవిలే తులి (09:07 - 09:40) * వివిధ సంస్కృతులు, అనుభవాలు, సంఘటనలను ఒకే చోట సమన్వయించి వాటిని ఒక సమగ్ర ఆధునిక అవ్భివ్యక్త రూపంలో మలచగలిగిన సామర్థ్యంలోనే ఆధునిక భారతీయ చిత్రకారుల ప్రాధాన్యత కలదు. ఈ ఆధునిక శైలియే తర్వాతి దశాబ్దాలలో భారతీయ కళను ప్రభావితం చేయబోయే కీలక పరిణామంగా మారింది. ** యశోదర దాల్మియా (09:41 - 10:01) * ఆధునిక భారతీయ చిత్రకళలో పరిచయం అవసరం లేని పేరు హుసేన్. అతని కళలోని జవసత్వాలు, అందులో ఇమిడి ఉన్న శక్తిసామర్థ్యాలు; కళని ఆవిష్కరించి, పునరావిష్కరించే తత్వం అతని ప్రాధాన్యతను తెలుపుతుంది. కళను చారిత్రాత్మకంగా ఆలోచించగలిగే వాడు. కళ ఏ దిశలో పయనించబోతోందో, భారతీయ తత్వం ఉంటూనే అంతర్జాతీయతను ఎలా ఆపాదించుకోబోతోందో ముందే పసిగట్టిన ఉద్దండుడు. 40/50వ దశకాలలో కొన్ని కళాఖండాలను సృష్టించాడు. ** యశోదర దాల్మియా (10:02 - 10:42) * పాత కళను యుక్తవయసుకు తీసుకువచ్చేందుకు వేరే దారి లేదు. కళ మళ్ళీ పుట్టాలి, శైశవ దశ దాటాలి, క్రొత్త దారిగా ఏర్పడాలి, ఈ భయాలలోనే, ఇలా వణుకుతూనే మోక్షం కోసం ప్రయత్నించాలి. ** ఎఫ్ ఎన్ సూజా (11:10 - 11:26) * సాంప్రదాయిక భారతీయ చిత్రకళలోని కళా సౌందర్యం అనే భావనలో సామరస్యం చాలా ప్రధానమైనది. వీక్షకుడు, వీక్షించబడే దృశ్యం, ఆ దృశ్యం కలిగించే అనుభవం, ఆ అనుభవం యొక్క సారాంశం, వీటన్నింటి మధ్య ఒక రకమైన సామరస్యం, ఏకత్వం, ఏర్పరచటం సాంప్రదాయ చిత్రకళ యొక్క లక్ష్యం, లక్షణం. కానీ ఆధునిక చిత్రకళలో ఈ సామరస్యం కొరవడింది. కళ యొక్క అనుభవం అనేది, కేవలం అందాన్ని ఆస్వాదించటానికి మాత్రమే పరిమితం చేయకుండా తప్పనిసరిగా భయాన్ని గుర్తించటం, వైచిత్ర్యాన్ని ఎదుర్కోవటం వంటివి కూడా అని తెలిసేలా చేసింది. ఆధునిక చిత్రకళలో కళా సౌందర్యం కంటే ముందు వరుసలో నిలబడే కళాత్మక పరిస్థితులు చాలావరకు వికృతమైనవి, భయానకమైనవి, అసహజమైనవి. ఆధునిక చిత్రకళలో చాలా భాగం ఇలాంటి పరిస్థితులనే చిత్రీకరించి చూపటం జరిగింది. ఆధునికత అనే అనుభవం అనివార్యం అని అనిపిస్తోంది. విభజనవాదం, వేర్పాటువాదం వంటి అవలక్షణాలతో కూడుకొన్న ఈ ఆధునికత తరతరాలుగా కళాకారులు నమ్మిన సామరస్య వ్యవస్థలను పతనం చేస్తోంది. ** రంజిత్ హోస్కోటే (12:28 - 13:54) * ప్రపంచమంతటా, భారతదేశంలో కూడా, ఈ రోజు ఉద్రిక్తతలు విపరీతంగా పెరిగాయి. అసమానతతో బాటు, కల్లోలం, ఘర్షణ, పరస్పర అవమానాలు ఇవన్నీ మనకి కనబడుతోన్నాయి. తన అమాయకత్వాన్ని ఈ ప్రపంచం కోల్పోయింది. ఒకప్పుడు ఉన్న ఆ నిర్మలత్వం, సౌమ్యత ఇప్పుడు అరుదైపోయింది. ** జతిన్ దాస్ (13:55 - 14:14) {{Wikipedia}} [[వర్గం:భారతీయ చిత్రకళ]] 6hy2b38eonbgcdbrbzft95wszq853qe 26548 26547 2026-07-20T07:23:34Z Veera.sj 1008 /* వ్యాఖ్యలు */ ** రంజిత్ హోస్కోటే (14:15 - 14:39) 26548 wikitext text/x-wiki [[File:Raja Ravi Varma - Mahabharata - Shakuntala.jpg|thumb|భారతీయ పౌరాణిక పాత్రలను పాశ్చాత్య శైలిలో, మానవ రూపాలలో, అప్పటి వరకూ భారతీయ చిత్రకళలో లేని తైలవర్ణాలతో చిత్రీకరించటంతో అతని అద్భుత ప్రతిభను ప్రశంసించిన వర్గం ఒకటైతే, పాశ్చాత్య శైలిని అనుకరించటం భారతీయ చిత్రకళకు అవమానమని విమర్శించిన వర్గం మరొకటి]] '''[[w:ఆధునిక భారతీయ చిత్రకళ|ఆధునిక భారతీయ చిత్రకళ]]''' సాంప్రదాయిక [[w:భారతీయ చిత్రకళ|భారతీయ చిత్రకళ]] పై పాశ్చాత్య ప్రభావాలకు ప్రతిస్పందనగా ఏర్పడిన ఒక అధునాతన చిత్రకళా శైలి. == వ్యాఖ్యలు == * వలస పాలన వచ్చిన తర్వాత (సాంఘిక అవసరాలకు, వ్యక్తిగత భావోద్వేగాలకు మధ్య ఉండే సమతౌల్యతను) కొనసాగించటంలో ఒక పెద్ద విరామం వచ్చింది. ఆ విరామం వల్ల వచ్చిన ప్రభావాలనే భారతీయ కళాకారులు గత నూరేళ్లుగా ఎదుర్కొంటూ, దానికి తగినట్టు తమ పనిని మార్చుకుంటూ వచ్చారు ** దూరదర్శన్ ప్రసారం చేసిన '''The Paintings of India''' శీర్షిక -, ''Development of the Modern Idiom Part -I'' అనే లఘుచిత్రంలో రంజిత్ హొస్కోటే (03:20 - 03:36)({{Cite web|url=https://www.youtube.com/watch?v=Pnjt34Mpr6A&list=PLPahQu0Yh9xDgnKMM1wq7hP9J7xULD4vP&index=4|title=The Paintings of India - Development of the Modern Idiom Part -I|last=National|first=Doordarshan|date=|website=youtube.com|url-status=live|access-date=10 May 2026}}) * ఒకప్పుడు చిత్రకళలో సామాజిక అవసరాలు, వ్యక్తిగత వ్యక్తీకరణ—ఈ రెండింటి మధ్య ఒక అద్భుతమైన సమతుల్యం ఉండేది. ఆ సమతుల్యం… సామ్రాజ్యవాదం వచ్చిన తర్వాత పూర్తిగా దెబ్బతింది. సాంప్రదాయిక కళాశాలలు/శిక్షణా విధానాలు చెదిరిపోయాయి; కొత్తగా వచ్చిన రూపాలు మాత్రం చారిత్రక నేపథ్యం లేకుండా వచ్చాయి. ఈ మార్పు వలన, భారతీయ చిత్రకారుడు ఒకరకంగా తటస్థుడు అయిపోయాడు. ఒక వైపు—తన ఆలోచనలు, తన కళాత్మక భావనలను సూత్రీకరించే వ్యవస్థ ఏదీ లేకపోవడం; మరో వైపు—తన భావనను వ్యక్తపరచాలనే బలమైన తపన ఉన్నా, దానికి స్ఫూర్తి అయిన సంప్రదాయం, గతం ఏదీ లేకపోవడం వల్ల భారతీయ కళాకారుడు అంతులేని అయోమయంలో చిక్కుకున్నాడు. ** యశోదర దాల్మియా ((03:36 - 04:31) * సాధారణంగా ఆధునిక భారతీయ చిత్రకళా చరిత్రను చెప్పేటప్పుడు మనం అబనీంద్రనాథ్ ఠాగూర్ నుండి ప్రారంభిస్తాం—ఆయన మొదలుపెట్టిన ఉద్యమం తర్వాత ‘[[w:బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్|బెంగాల్ స్కూల్]]’గా ప్రసిద్ధి చెందింది. కానీ...చరిత్ర పుటలను ఇంకాస వెనక్కి తిరగేసి చూస్తే...అంటే పదొమ్మిదో శతాబ్దం మధ్యకాలానికి, అదే భారతదేశంలో మొదటి కళాశాలలు ఏర్పడిన సమయానికి. ఎందుకంటే ఆ కాలంలోనే ఒక కొత్త సామాజిక, వృత్తిపరమైన కళా వర్గం—కళాకారుల కొత్త తరగతి—పుట్టుకొచ్చింది. అంటే, అప్పటి వరకు ఉన్న కళాకారులకు పూర్తిగా భిన్నమైన, మధ్యతరగతిలోనే నిపుణులైన కళాకారుల సమూహం రంగంలోకి వచ్చింది. మొదట్లో వీరిలో చాలామంది ఆయిల్ పెయింటింగ్, అకాడెమిక్ రియలిజం వంటి పాశ్చాత్య శైలులను అభ్యసించినవారే. అయినప్పటికీ, ఆ కాలపు కళా ప్రపంచాన్ని వీరే ప్రధానంగా నడిపించారు. దక్షిణంలో [[w:రాజా రవి వర్మ|రాజా రవి వర్మ]] వంటి వ్యక్తి—జాతీయ స్థాయిలో ప్రాధాన్యం పొందిన వ్యక్తి—మనకు వెంటనే గుర్తుకు వస్తాడు. అదే సమయంలో, ఈ తొలి పాశ్చాత్య-శైలి అకాడెమిక్ కళాకారుల్లో చాలామంది ఆధునిక భారతదేశానికి ‘జాతీయ కళ’ అనే వర్గాన్ని నిర్మించాలనే ప్రయత్నంలో కూడా సమానంగా పాల్గొన్నారు. భారతీయ అంశాలను చిత్రీకరించడం, భారతీయ కళారాధకులలో ఒక కొత్త రకమైన రసవత్తరమైన కళను వ్యాపింపజేయటం—ఇవన్నీ వారి ఆసక్తులలో భాగం. ** తపతి గుహ-ఠాకుర్తా (06:35 - 08:03) * ...ప్రాథమికంగా రవివర్మ పాశ్చాత్య శైలిని ఉపయోగించి భారతీయ పురాణాలలో నిక్షిప్తమైన ధార్మిక భావాలు, రంగులు, వస్త్రాలు, ఆచార-సాంప్రదాయాలు, [[రామాయణం]], మహాభారతం, వంటి ఇతిహాసాలు, భారతీయ సంస్కృతిలో నాటుకుపోయిన ఇతర కథలను [[చిత్రలేఖనం|చిత్రకళ]] లోకి తీసుకువచ్చాడు. అయితే, తను ఉపయోగించిన శైలి మాత్రం, భారతీయ సాంప్రదాయనికి పూర్తిగా భిన్నమైనది. ** నైవేలి తులి (08:41 - 9:10) * రవివర్మ పాశ్చాత్యులు అధికారంలో ఉన్నప్పుడు పని చేస్తూ, సామ్రాజ్యవాద వ్యవస్థలో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకోవటానికి ప్రయత్నించాడు. అతను ఏ విషకోరలకు బలి కాలేదు, వారి ప్రభావానికి అతని కళ బానిస కాలేదు. తైలవర్ణ చిత్రకళ అనే ఒక సరిక్రొత్త మాధ్యమాన్ని తన ఇష్టంతోనే నేర్చుకుని దానిని తాను ఎలా అర్థం చేసుకొన్నాడో ఈ ప్రపంచానికి తన చిత్రకళ ద్వారా తెలిపాడు. పంథొమ్మిదవ శతాబ్దపు చివరి రోజుల్లో చిత్రకళలో సంభవిస్తోన్న మహత్తర మార్పులకు అవగతం చేసుకొని కళా రూపాంతరం అనే బృహత్కార్యాన్ని చేపట్టాడు. ఐరోపా చిత్రకళతో సేవలను పరస్పరం ఇచ్చిపుచ్చుకుని, అతడి ప్రజ్ఞాపాటవాలను వినియోగించి చిత్రకళారంగంలో అతిపెద్ద చారిత్రక మార్పులకు శ్రీకారం చుట్టాడు ** గీతా కపూర్ (09:50 - 10:31) * రవి వర్మకు ప్రతిస్పందనగా, ఆయన ప్రోత్సహించిన చిత్రకళా ధోరణికి వ్యతిరేకంగా, అబనీంద్రనాథ్ ఠాగూర్, ఆనంద కుమారస్వామి, ఎర్నెస్ట్ బిన్ఫీల్డ్ హేవెల్ ల త్రయం కలిసి [[w:బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్|బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్]] ను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. భారతీయ సాంప్రదాయ చిత్రకళ అయిన అజంతా చిత్రాలను, భారతీయ సూక్ష్మచిత్రకళా సంప్రదాయాలైన [[w:మొఘల్ చిత్రకళ|మొఘల్ చిత్రకళ]], పహారీ సూక్ష్మచిత్రకళ వంటి వాటిని స్ఫూర్తిగా పరిగణించి, ఈ శైలి పురాణం–ధర్మం వంటి విషయాలను చిత్రకళా సారాంశాలుగా పరిగణించినా, ఇందులోని రేఖానిర్మాణం, రంగులను వినియోగించే తీరు, దృశ్యం యొక్క కూర్పు వంటి అంశాలు రవి వర్మ శైలికి పూర్తి భిన్నంగా — వినూత్నంగా ఏర్పరచటం జరిగింది.. ** నైవేలి తులి (11:25 - 12:11) * (బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనబడే ఈ) కొత్త కళా ఉద్యమం (Academic Realism అనే) ఈ పాశ్చాత్య ప్రభావాన్ని ఏ మాత్రం అనుకరణాత్మకమైనది కాదని, సామ్రాజ్యవాద ప్రభావితమైనదని, కళా సౌందర్య విలువ లేనిదని ముద్రలు వేసి పూర్తిగా తిరస్కరించటానికి ప్రయత్నించలేదు. అబనీంద్రనాథ్ మరియు ఆయన తొలి దశ శిష్యులు చేయాలనుకున్నది — ఒక కొత్త జాతీయ కళను పునర్నిర్మించడం. అయితే వారి ప్రధాన ఆందోళన పాశ్చాత్య అకాడెమిక్ విధానాల నుండి బయటపడటం, మరియు వారు ‘ఆదర్శవాద ఆధ్యాత్మిక కళ’గా భావించిన కొత్త శైలిని నిర్మించడం. అబనీంద్రనాథ్ ఉద్యమంలో కళాకారుల సమూహాన్ని నిర్మించడంపై సమానమైన ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే ఆయనకు ఒక క్రొత్త శైలిని ఏర్పరచాలనే సంకల్పం ఉంది; జాతీయ భావంతో కూడుకొన్న ఈ సరికొత్త కళ అనే ప్రాజెక్టు ఒక వ్యక్తి చేత సాధ్యం కాదని ఆయన నమ్మాడు. దానికి ఒక ఉద్యమం కావాలి, దానికి అనుచరులు కావాలి అని గుర్తించాడు. ఇక్కడే ఒక విరోధభావం ఉత్పన్నమవుతుంది — నిజమైన భారతీయ కళ అంటే ఇదే - అనిపించేలా ఒక నిర్ధిష్ట రూపకల్పనను విస్తృతంగా వ్యాప్తి చేయటం పైనే ఆ కాలంలో ఈ బెంగాలీ శైలి కళాఉద్యమం యొక్క విజయం ఆధారపడి ఉండేది. ఈ బలమే, తర్వాత ఈ ఉద్యమం యొక్క ప్రధాన బలహీనతగా కూడా మారింది. నిజమైన భారతీయ కళ - అనే భావన పునరావృత్తం అవుతూ ఉండటం, ఒక విధమైన సూత్రీకృత రూపంలోకి మారిపోవటంతో తర్వాతి తరం యొక్క ఆధునిక భారతీయ చిత్రకళాకారులు ఈ భావన నుండి నిదానంగా దూరం అవ్వటం మనం చూశాము. ** తపతి గుహ-ఠాకుర్తా (13:28 - 28:43) * 1920లో కళాభవన్ స్థాపించబడినప్పుడు, అది జాతీయవాద కళా ఉద్యమం లో ఒక ప్రధానమైన విరామాన్ని సూచించింది. నిజానికి, జోరాసాంకో (రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క) ఇంట్లో అభివృద్ధి చెందిన భారతీయ శైలి, చిత్రకళలో ఉన్న ప్రతిబంధకాలు, అత్యంత సాంప్రదాయబద్ధమైన స్వభావం అని కళకు ఉండే అడ్డుగోడ పట్ల రవీంద్రనాథ్‌కు ఉన్న అసంతృప్తియే ఆయనను ఈ కొత్త కళా కేంద్రాన్ని స్థాపించడానికి ప్రేరేపించింది. ఈ కేంద్రం యొక్క ప్రధాన లక్ష్యం — కళను ప్రకృతితో, దైనందిన జీవితంతో, ముఖ్యంగా ఆయన చెప్పినట్లుగా జీవించి ఉన్న జానపద మరియు గ్రామీణ సంప్రదాయాలతో మళ్లీ అనుసంధానించడం. ఇది ఆధునిక భారతీయ కళా ఉద్యమంలో ఒక పెద్ద మార్పును సూచిస్తుంది, ఎందుకంటే భారతీయ కళ తన ప్రాచీన, శాస్త్రీయ మూలాల నుండి లేదా మధ్యయుగ సభా సంప్రదాయాల నుండి దూరమై, చుట్టూ ఉన్న జీవన సంప్రదాయాలను — దైనందిన జీవితాన్ని — కళగా చూడడం ప్రారంభించింది. 1920ల నాటికి, అతీత తత్వవాదం, ఆదర్శవాదం వంటి భావాలపై చర్చ తగ్గి, భారతీయ కళను పునరుజ్జీవింపజేయడం, భారతదేశపు ఆత్మను కళలోకి తీసుకురావడం వంటి ఆలోచనలు ముందుకు వచ్చాయి. ఎందుకంటే వారు కనుగొన్న ‘జీవించి ఉన్న భారతదేశం’ అనేది గ్రామీణ భారతదేశమే. ** తపతి గుహ-ఠాకుర్తా (15:42 - 28:43) * బెంగాల్ స్కూల్ నుండి పుట్టిన ఉద్భవించిని ప్రముఖ కళాకారులలో ఒకరు నందలాల్ బోస్ — ఈయన ఆధునిక భారతీయ చిత్రకళక్లోని అత్యుత్తమ కళాకారుల్లో ఒకరు. ఆయన మొదట అభనింద్రనాథ్ టాగోర్ శిష్యుడిగా ప్రారంభించి, తరువాత రవీంద్రనాథ్ ఆయనను శాంతినికేతన్ కు ఆహ్వానించినప్పుడు, ఆయన దృష్టికి యొక్క వైశాల్యం పెరిగింది. అక్కడి గ్రామీణ వాతావరణం, కళాకారుడి దైనందిన జీవితం, సాధారణ ప్రజల జీవన విధానం, అలాగే ప్రకృతి — ఇవన్నీ ఆయనకు సహజమైన ప్రేరణలుగా మారాయి. ** నైవేలి తులి ((17:55 - 18:24) * నందలాల్ బోస్ ఆధునిక కళాకారుడి భావజాలాన్ని జానపద సంప్రదాయాలతో మళ్లీ అనుసంధానించే ప్రయత్నంలో నిజంగా అగ్రగామిగా నిలిచాడు. ఈ అనుసంధానికి ప్రధాన మలుపు (19)30వ దశకంలో వచ్చింది. 1938లో హరిపుర కాంగ్రెస్ సభ కోసం చిత్రలేఖనం చేయమని ఆహ్వానించినపుడు, ఈ పరిణామం చోటు చేసుకొంది. దైనందిన గ్రామ జీవితం నుండి గ్రహించబడ్డ వివిధ పాత్రలను నందలాల్ బోస్ ఒక వెల్లువ లాగా చిత్రీకరించాడు. ఆ చిత్రపటాలలో అతని యొక్క ముద్ర/శైలి ప్రస్ఫుటంగా కనబడేలా రూపకల్పన చేశాడు. వాటిని మనం ఇప్పుడు చూస్తే మాత్రం అవి మనకు ఆ నాటి గ్రామీణ ప్రజల సంప్రదాయాలను ప్రతిబింబించగలిగే ఆధునిక కళాఖండాల లాగా కనబడతాయి ** తపతి గుహ ఠాకుర్తా (18:25 - 28:43) * ఆధునిక భారతీయ చిత్రకళలో జామిని రాయ్ కూడా ప్రాధాన్యం కలిగినవాడే. భారతీయ జానపద/ఆదివాసీ చిత్రకళా సంప్రదాయాల వైపు తిరిగి వెళ్ళాలని సంకల్పించడమే అతనికి ఈ ప్రధాన స్థానాన్ని సంపాదించి పెట్టింది. కాలిఘాట్ మరియు ఇతర జానపద శైలుల నుండి స్ఫూర్తిని పొంది ఆయన వినియోగించే రంగులు/రేఖలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని రుఫొందించుకొని కళకు నూతన భాష్యాన్ని పలికాడు. ఆయనకు సంబంధంలేని, పూర్తిగా భిన్నమైన క్రైస్తవ ఇతివృత్తాలు, బైబిల్ అధ్యయనం వంటి అంశాలను, 1940లలో చిత్రీకరించి తన నూతన శైలిని స్పష్టం చేసాడు. తన ఇతివృత్తాలను దూరమైనా, ఇలాంటి అన్య ఇతివృత్తాలను కూడా తాను ఒక కొత్త శైలిలో చిత్రీకరించగలడని, వాటికి ప్రాతినిధ్యం వహించగలడని, తెలుసుకొన్నాడు. ** నైవేలి తులి (19:55 - 20:42) * జామిని రాయ్ తో బాటు, గగనేంద్రనాథ్ కూడా కొంతవరకు తనకంటూ ప్రత్యేకంగా ఒక శైలిగల కళాకారుడు. ఏ ఒక్క సమూహాన్ని, భావనను, ఉద్యమాన్ని అనుసరించకుండా, అనేకమంది కళాకారులను ప్రోత్సహించి, పెంపొందిచిన నిజమైన కళాభిమాని. 1920లలోనే పాశ్చాత్య కళను ప్రేరణామూలంగా పరిగణించిన తొలి భారతీయ ఆధునిక చిత్రక్రారులలో గగనేంద్రనాథ్ కూడా ఒకరు. రవీంద్రనాథ్ ఠాగూర్ తో కలిసి విదేశాలకు వెళ్ళాడు. జర్మన్ ఎక్స్ప్రెషనిస్టుల ప్రభావం, భారీ వుడ్ కట్ ప్రదర్శనలు, ఇవన్నీ ఆ కాలంలో క్యూబిజం వైపు దృష్టి మరల్చాయి. క్యూబిజం అప్పట్లో అత్యంత ముఖ్యమైన కళా ఉద్యమం అయినప్పటికీ భారతదేశంలోకి అది అంత త్వరగా చేరలేదు. ** నైవేలి తులి (20:42 - 21:31) * 1940ల ప్రారంభంలో, యూరోపియన్ మాడర్నిజం పట్ల భారతీయ కళా ప్రపంచంలో ఒక కొత్త ఆసక్తి పుట్టుకొచ్చింది. ఆ మార్పు ఆసాంతంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి [[అమృతా షేర్-గిల్]]. పాశ్చాత్య ప్రభావాన్ని స్వాగతించిన ఆమె, భారతీయ కళలో అప్పటివరకు కనిపించని పోస్ట్–ఇంప్రెషనిస్టు రంగుల భావన, ఆకృతుల విన్యాసాన్ని తీసుకువచ్చింది. 1930ల చివర్లో ఆమె ఒక ప్రతీకాత్మక వ్యక్తిగా ఎదిగి, అనేకమంది కళాకారులను రంగుల వినియోగం, నిర్మాణం గురించి అధ్యయనం చేయడానికి స్ఫూర్తినిచ్చింది. ఈ విధంగా ఆమె [[ఆధునిక భారతీయ చిత్రకళ]]కు ఒక దృఢమైన పునాదిని వేసింది. ** నైవేలి తులి (22:06 - 22:48) * భారతీయులను ఆమె (అమృత) చూసింది అన్యుల దృక్కోణంలో అయినా ఆమె కోరిక మాత్రం భారతీయ ఆంతరంగికులతో కలిసి పోవాలనే! ** ముల్క్ రాజ్ ఆనంద్ (22:50 - 23:03) * అజంతా గుహలు ఆమె (అమృత షేర్ గిల్) సందర్శించవలసిన స్థలాల జాబితాలో ఉండేది. అక్కడి కుడ్యచిత్రాలు మరియు దక్షిణ భారత దేవాలయాలలోని కుడ్యచిత్రాల సందర్శన తనకు సరిక్రొత్త పునరావిష్కరణలు అయ్యాయి. కళను విద్యాభ్యాసంగా, శిక్షణగా పరిగణించటం, ఆధునిక దృక్కోణంలో వీక్షించటం వంటి వాటి పాశ్చాత్య ధోరణి నుండి బయటపడుతూ భారతీయ పారంపర్యాన్ని పునర్వీక్షించింది. భారతీయ చిత్రకళ అప్పటికి డోలాయమాన స్థితిలో ఉందని పొరబడిన అమృతకు భారతీయ కళాత్మక గతం యొక్క వైభవాన్ని, గొప్పదనాన్ని అజంతా తెలిపింది. అజంతా చిత్రకళ, భారతీయ సూక్షచిత్రకళలోని సాంప్రదాయాలు ప్రభావితం చేసినంతగా తన చుట్టూ కనిపించినది వేరే ఏవీ తనని ప్రభావితం చేయలేకపోయాయి. అజంతా చిత్రాలలోని ఆ రంగులు, ఆ శైలులు, ఆ ముఖకవళికలు తనకంటూ ప్రత్యేకమైన దృశ్య సంకేతాలను ఏర్పరచుకొనే స్ఫూర్తిని అందించాయి. ముప్పైయవ దశకపు తుది దశలో ఆధునిక భారతీయ కళాకారులకు ఒక వారసత్వాన్ని నిర్వచించటంలో, కళా చరిత్రలో మరొక కీలక ఘట్టాన్ని సూచించటంలో అజంతా ముఖ్యకేంద్రంగా మారిందని నేను భావిస్తున్నాను. ** తపతి గుహ ఠాకుర్తా (23:17 - 24:20) * నేను ఒక వ్యక్తివాదిని. కొత్త సాంకేతికతను రూపొందిస్తోన్నాను. ఈ సాంకేతికత యొక్క సాంప్రదాయిక భావన భారతీయత కాకపోవచ్చు. కానీ దీని ఆత్మ మాత్రం ప్రాథమికంగా భారతీయతయే. రూపం మరియు రంగుకు అనంతమైన ప్రాముఖ్యతను ఇస్తూ నేను భారతదేశాన్ని, ప్రధానంగా భారతదేశంలో పేదవారిని అర్థం చేసుకొంటున్నాను. కేవలం భావోద్వేగ ఆసక్తిని కలిగించేది కాదు. నాకు ఈ నేల అంతకు మించినది ** అమృత షేర్ గిల్ (24:23 - 25:03) * ఆమె (అమృత షేర్ గిల్) అప్పటికే పారిస్ నగరంలో నివసించింది. రెండు ప్రపంచ యుద్ధాల నడుమ ఏర్పడిన మానవతావాదం, యథార్థవాదం, వంటి వాటిలో ఆధునిక దృక్పథాన్ని చవిచూసినది. అటువంటి దృక్పథంలో, ఇక్కడ కూడా అప్పటికే నివాసం ఉండి, ఇక్కడి ప్రజలకు ప్రాతినిధ్యం వహించదలచే ప్రయత్నం అప్పటికే చేయటం వలన భారమైన గతస్మృతులతో భారతదేశం తనకి ఎదురైంది. ** వివాన్ సుందరం (25:03 - 25:38) * ఒక విధంగా చూస్తే, కళారాధకుల-కళాకారుల-వీక్షకుల మధ్య ఒక సాంఘిక ఒప్పందం ఉండేది. మనకి ఇది రుచించకపోవచ్చు, కానీ ఈ సాంఘిక ఒప్పందం తునాతునకలు అయ్యింది. రద్దయిన ఈ ఒప్పందం యొక్క పర్యవసానాలే నా దృష్టిలో 1947 నుండి, ఇప్పటివరకు భారతీయ కళను నిర్వచించాయి. ** రంజిత్ హోస్కోటే (04:10 - 04:30) (దూరదర్శన్ లో ప్రసారం అయిన '''The Paintings of India''' అనే శీర్షికన ''Development of the Modern Idiom Part -II'', అనే లఘుచిత్రంలో ({{Cite web|url=https://www.youtube.com/watch?v=voQnMRaAMHE&list=PLUiMfS6qzIMywfcZB9u9T77GjZQeoFdrB&index=9|title=The Paintings of India - Development of the Modern Idiom Part -II|last=National|first=Doordarshan|website=youtube.com|url-status=live|access-date=13 May 2026}})) * పలువురి దృష్టిని ఆకర్షించిన, పలు విమర్శకుల మన్ననలు పొందిన ప్రోగ్రెసివ్ ఆర్టిస్టు గ్రూపు అప్పటి బొంబాయిలో ఉన్న సాంప్రదాయాలను సవాలు చేసిన ఆరుగురి కళాకారులచే స్థాపించబడింది. ** నెవిల్లే తులి (05:37 - 06:10) * స్వతంత్ర సిద్ధితోనే ఇదంతా మొదలు అయ్యింది. అప్పట్లో అదంతా ఒక క్రొత్త బంగారు లోకం. ** ఎస్. హెచ్. రజా పదాలను చదివిన గీతి సేన్ (06:11 - 06:21) * అప్పట్లో పర్వతాలను కదిలించే శక్తి మాకు ఉంది అనిపించేది, అది మేము మేముగా మారుతోన్న ప్రక్రియ. ** సయ్యద్ హైదర్ రజా (06:32 - 06:38) * కలకత్తా గ్రూపు, ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్స్ గ్రూపు రెండూ ఆధునికత వైపు అడుగులు వేశాయి, కాబట్టి రెండూ ప్రముఖమైనవే. శరణార్థుల, పుస్తకాల, ముద్రణల వంటివి 40వ దశకంలో భారతదేశంలోకి ప్రవేశించి అంతర్జాతీయ ఆధునికత గురించి స్థానిక కళాకారులకు తెలిపాయి. ఇక్కడి కళాకారులకు తమలాంటి పాశ్చాత్య కళాకారుల గురించి తెలిసింది. ఇలా ఒక వైపు మనకి ఆధునిక కళ యొక్క పరిచయం జరుగుతూ ఉంటే మరొక వైపు స్వాతంత్రం సిద్ధించే సమయం కావటంతో భారతీయ కళాకారులు వారి గతాన్ని పునరావిష్కరించుకొని వారి చారిత్రక-సాంస్కృతిక మూలాలను అర్థం చేసుకొని, అప్పటి కాలానికి వాటిని అన్వయించుకొన్నారు. ** యశోదర దాల్మియా (06:39 - 07:47) * అన్ని భారతీయ శైలులను గమనించిన తర్వాత నేను చిత్రీకరించవలసినది వేరే అని నాకు అనిపించింది. ఆ కళా ప్రదర్శన శాలను సందర్శించిన తర్వాత గుప్తుల కాలం నాటి ఆకారాలను, బసోహ్లీ లోని గాఢమైన రంగులను, జానపదం చిత్రాల లోని అమాయకత్వాన్ని, ఈ మూడింటినీ కలిపివేశాను. ** ఎం ఎఫ్ హుసేన్ (08:03 - 08:29) * ఆధునిక భారతీయ చిత్రకళలో హుసేన్ మహోన్నతుడు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయనలో ఉన్నంత అపారమైన శక్తి, మరే ఇతర కళాకారునిలో కనబడదు. ఎవరైనా ఠక్కున గుర్తుపట్టగలిగేంత ప్రత్యేక శైలి అతని సొంతం. ఒక గొప్ప కళాకారుడి శాశ్వత లక్షణం అదే! ** నెవిలే తులి (08:48 - 09:06) * రజా మరియు గాడే, ఇరువురూ ప్రకాశవంతమైన రంగులను వాడేవారే. రజా యొక్క కళా ప్రయాణం బహుదూరమైనది, లోతైనది, బహుముఖమైనది, 40 ఏళ్ళుగా బహువిధంగా కొనసాగినది...ఇరువురూ వివిధ మార్గాలలో వివిధ శైలులకు ప్రాతినిధ్యం వహించి సాంప్రదాయ భారతీయ కళను పుణికిపుచ్చుకొన్నారు. పాశ్చాత్య, ప్రత్యేకించి పారిస్ యొక్క కళా ప్రభావాలను ప్రకటిస్తూ వారిని వారు వ్యక్తపరచుకొన్నారు. ** నెవిలే తులి (09:07 - 09:40) * వివిధ సంస్కృతులు, అనుభవాలు, సంఘటనలను ఒకే చోట సమన్వయించి వాటిని ఒక సమగ్ర ఆధునిక అవ్భివ్యక్త రూపంలో మలచగలిగిన సామర్థ్యంలోనే ఆధునిక భారతీయ చిత్రకారుల ప్రాధాన్యత కలదు. ఈ ఆధునిక శైలియే తర్వాతి దశాబ్దాలలో భారతీయ కళను ప్రభావితం చేయబోయే కీలక పరిణామంగా మారింది. ** యశోదర దాల్మియా (09:41 - 10:01) * ఆధునిక భారతీయ చిత్రకళలో పరిచయం అవసరం లేని పేరు హుసేన్. అతని కళలోని జవసత్వాలు, అందులో ఇమిడి ఉన్న శక్తిసామర్థ్యాలు; కళని ఆవిష్కరించి, పునరావిష్కరించే తత్వం అతని ప్రాధాన్యతను తెలుపుతుంది. కళను చారిత్రాత్మకంగా ఆలోచించగలిగే వాడు. కళ ఏ దిశలో పయనించబోతోందో, భారతీయ తత్వం ఉంటూనే అంతర్జాతీయతను ఎలా ఆపాదించుకోబోతోందో ముందే పసిగట్టిన ఉద్దండుడు. 40/50వ దశకాలలో కొన్ని కళాఖండాలను సృష్టించాడు. ** యశోదర దాల్మియా (10:02 - 10:42) * పాత కళను యుక్తవయసుకు తీసుకువచ్చేందుకు వేరే దారి లేదు. కళ మళ్ళీ పుట్టాలి, శైశవ దశ దాటాలి, క్రొత్త దారిగా ఏర్పడాలి, ఈ భయాలలోనే, ఇలా వణుకుతూనే మోక్షం కోసం ప్రయత్నించాలి. ** ఎఫ్ ఎన్ సూజా (11:10 - 11:26) * సాంప్రదాయిక భారతీయ చిత్రకళలోని కళా సౌందర్యం అనే భావనలో సామరస్యం చాలా ప్రధానమైనది. వీక్షకుడు, వీక్షించబడే దృశ్యం, ఆ దృశ్యం కలిగించే అనుభవం, ఆ అనుభవం యొక్క సారాంశం, వీటన్నింటి మధ్య ఒక రకమైన సామరస్యం, ఏకత్వం, ఏర్పరచటం సాంప్రదాయ చిత్రకళ యొక్క లక్ష్యం, లక్షణం. కానీ ఆధునిక చిత్రకళలో ఈ సామరస్యం కొరవడింది. కళ యొక్క అనుభవం అనేది, కేవలం అందాన్ని ఆస్వాదించటానికి మాత్రమే పరిమితం చేయకుండా తప్పనిసరిగా భయాన్ని గుర్తించటం, వైచిత్ర్యాన్ని ఎదుర్కోవటం వంటివి కూడా అని తెలిసేలా చేసింది. ఆధునిక చిత్రకళలో కళా సౌందర్యం కంటే ముందు వరుసలో నిలబడే కళాత్మక పరిస్థితులు చాలావరకు వికృతమైనవి, భయానకమైనవి, అసహజమైనవి. ఆధునిక చిత్రకళలో చాలా భాగం ఇలాంటి పరిస్థితులనే చిత్రీకరించి చూపటం జరిగింది. ఆధునికత అనే అనుభవం అనివార్యం అని అనిపిస్తోంది. విభజనవాదం, వేర్పాటువాదం వంటి అవలక్షణాలతో కూడుకొన్న ఈ ఆధునికత తరతరాలుగా కళాకారులు నమ్మిన సామరస్య వ్యవస్థలను పతనం చేస్తోంది. ** రంజిత్ హోస్కోటే (12:28 - 13:54) * ప్రపంచమంతటా, భారతదేశంలో కూడా, ఈ రోజు ఉద్రిక్తతలు విపరీతంగా పెరిగాయి. అసమానతతో బాటు, కల్లోలం, ఘర్షణ, పరస్పర అవమానాలు ఇవన్నీ మనకి కనబడుతోన్నాయి. తన అమాయకత్వాన్ని ఈ ప్రపంచం కోల్పోయింది. ఒకప్పుడు ఉన్న ఆ నిర్మలత్వం, సౌమ్యత ఇప్పుడు అరుదైపోయింది. ** జతిన్ దాస్ (13:55 - 14:14) * ...వాస్తవంలో భయానకతను అంగీకరించటం తప్పితే, కొన్ని సమయాలలో, కళకు వేరే మార్గం కనిపించకపోవచ్చు. ఎదుర్కొని దానికి ప్రతిస్పందించవలసిందే. కళ ప్రతిబింబించే ప్రక్రియలోకి ఈ భయానకత ప్రవేశించకుండా, దానిని ఎదుర్కొనకుండా ఏదో ఒక విధంగా పరిష్కరించటం అసాధ్యం. ** రంజిత్ హోస్కోటే (14:15 - 14:39) {{Wikipedia}} [[వర్గం:భారతీయ చిత్రకళ]] jqdl3z43064iamqe98l6bw3swweuwqw