వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.1
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
శ్రీమన్నారాయణ
0
3855
555624
261203
2026-05-07T08:55:52Z
~2026-27668-84
7296
/* */
555624
wikitext
text/x-wiki
ప|| శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ | శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ||
చ|| కమలాసతీ ముఖకమల కమలహిత | కమలప్రియ కమలేక్షణ |
కమలాసనహిత గరుడగమన శ్రీ |
కమలనాభ నీపదకమలమే శరణు ||
చ|| పరమయోగిజన భాగధేయ శ్రీ |
పరమపూరుష పరాత్పర |
పరమాత్మ పరమాణురూప శ్రీ |
తిరువేంకటగిరి దేవ శరణు ||
===బయటి లింకులు===
http://balantrapuvariblog.blogspot.in/2012/05/annamayya-samkirtanalu-adhyatmikam_14.html
----
{{అన్నమయ్య పాటలు}}
[[Category:అన్నమయ్య పాటలు ]]
t79qlf37kylczgp8m9cxxvyfam1byp4
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/570
104
204202
555575
531892
2026-05-06T12:00:02Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555575
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఆ అనుభవం పురస్కరించుకునే చాణక్యాదులు కొత్త సంప్రదాయాలు నెలకొల్పారు. ఆ వాదం అంగీకరించారు మీరు, నాగేశ్వరరావుగా రంగీకరించ లేక పోయా రది" అన్నారు వారు, మొదట.
“అయితే, వీరపూజ అచ్చువేయించి యివ్వడానికి మాత్రమే నాగేశ్వరరావుగారికి పూనిక. మీ రచనలో లేశమూ లేదు, వారికి ప్రమేయం వారి యిష్టానికీ అనిష్టానికీ గూడా అతీతం మీ రచన. అంచేత, మీ రచన విమర్శించడానికీ
ఖండించడానికీ మాత్రమే వారి కధికారం. మీ స్వేచ్ఛకు అడ్డు తగలడంలో, తమ ధనికత పురస్కరించుకుని వారు కొంత తప్పుదారి తొక్కారనే చెప్పాలి" అన్నారు తరువాత.
"మీ రచన సమర్థించడంలో భానుమూర్తిగారు కనబరిచిన ఔదార్యమూ, ఔచిత్యమూ చాలా స్తవనీయాలు" అని వొప్పుకున్నారీ కారణం పురస్కరించుకుని.
"అయితే, వొకటుంది. "అయితే, చాణక్య ప్రభృతులగునప్పటి రాజనీతిజ్ఞుల దృష్టిలో, రాజనీతి ప్రవృత్తి యిట్టిదని నిర్వచించుటకు వలనుపడదు” అని నాగేశ్వరరావుగారి సవరణ. అగతికమైన స్థితిలోనే మీ రచనలో మీ రా సవరణ
చేర్చుకున్నారు మీరు, సందేహం లేదు. ఈ కొత్త సంప్రదాయం ప్రారంభించినవారు మీరు కారు. మన పూర్వులే - చాలా చాలా పూర్వులే మిక్కిలీ సమర్థులయినవారే చేశారావని. నాగేశ్వరరావుగారే యిది అంగీకరించారు. అయితే, తాము పాత సంప్రదాయం అంగీకరించేటట్టే, మీ రెందు కంగీకరించగూడదూ కొత్త సంప్రదాయం? ఈ జిజ్ఞాస కలగలేదని మాత్రమే చెప్పాలి వారికి" అని నిర్ధారణ చేశారు, దృఢంగా.
"చివరికి తేలిందేమిటీ? విదేశీయులతో ఘర్షణవచ్చినప్పుడు, మనవాళ్ళ క్కలిగిన కొత్త అనుభవంతో, మనవాళ్ళే ప్రారంభించిన కొత్త సంప్రదాయం సమర్థించడం మీ పూనిక అయితే, అంతకిముందు, నాగేశ్వరరావుగారు, మన
అసలు సిద్ధాంతం బాగా వివరించమని మిమ్ము కోరి వుండవలసింది. తరవాతే కొత్త సంప్రదాయం బలపరుచుకోమనీ కోరి వుండవలసింది. మీ రయినా చేసి వుండవచ్చు స్వయంగా అది, మీ తప్పు కాదు. కాని మిమ్మల్నందుకు నిర్బంధించడం మాత్రం ధర్మం కాదెవరికీ," అని వొప్పుకున్నారు కూడా.
“అయితే, ఆ కొత్త సంప్రదాయం అంగీకరించడం మాత్రం తప్పనిసరి అయింది నాగేశ్వరరావుగారికి. ఇదీ వారు చేసిన సవరణ ఆంతర్యం" అని నిర్ధారణ చేశారు, చివరికి, వారు.
ఇది నాకు విజయమా అపజయమా? పోనీ, నేను భానుమూర్తిగారి సలహా అంగీకరించడం తప్పనడమా యిది, వొప్పనడమా?
“మరి, కనక?” అనడిగాన్నేనీ జిజ్ఞాసతో, వినివిని.
చూశారు చూశారు లక్ష్మణరావుగారు.
నా పట్టుదల గుర్తించారు.
బహూ సమర్థులు వారు.
నిండుకుండ.
ఎలాంటి ఘర్షణా కూడా అతి తెలివిగా చల్లబరచగలవారు.<noinclude><references/>
{{rh|546||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude>
7r0rqi20hq7i8q3tq6d9e9nz3n22yd9
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/571
104
204203
555576
531893
2026-05-06T12:03:28Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555576
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>"ఇందులో జయాపజయాల ప్రసక్తి తేనక్కరలేదు. ఔచిత్యం మాత్రం కొంచెం దెబ్బతింది, అంతే" అన్నారు కూడా.
ఎలాగో వొకలాగ నా రచన నలుగురికీ అందుబాటయింది.
నా వాదం బోధపడింది.
కనక, నాగేశ్వరరావుగారి ఆక్షేపణే పట్టుకొని పాకులాడ్డంలో సొగసులేదు.
ఇది గుర్తించుకున్నా న్నేను.
లక్ష్మణరావుగారి వివరణతో తృప్తిపడి వూరుకున్నానంచేత.
వారే ప్రారంభించారు, మళ్ళీ.
“ఇక పృథ్వీరాజు చేసిన పనివుంది, అది విమర్శించారు మీరు. భీమసింహాదులు చేసిందీ అలాంటిదే. అదీ విమర్శించారు మీరు. మీ వాదం చాలా క్లుప్తంగా వుంది. అయినా చాలా బలంగా వుంది. కొంచెం ఆలోచించాలి నేను. లోతుగానే పరిశీలించాలి. పంక్తి సమన్వయించడంలోనూ, వ్యాఖ్యానం చెయ్యడంలోనూ కొత్తదారి తొక్కారు మీరు. అదీ పరిశోధించాలి బాగా" అన్నారు వారు.
"ఏమయినా, మీ రచన బహూ గంభీరం. దానికి స్వాగతం చెబుతున్నా”నన్నారు. చివరికి, వారు.
{{c|<big><big>33</big></big>}}
లక్ష్మణరావుగారు గొప్ప పండితులు.
బహుశ్రుతులు.
సర్కారులో సివిల్ క్రిమినల్ అధికారాలు నిర్వహిస్తున్న వారు కాకపోయినా, వొక సంస్థానం దివాను.
వారు రాజసమే చూపించుకుంటే నిరాఘాటంగా చెల్లిపోతుం దది.
కనక, తలుచుకుంటే నన్ను తిరస్కరించవచ్చు, వారు.
నాకు ముఖపిథానం చెయ్యవచ్చు.
కనీసం, నా యెడల నిరసన భావం అయినా కనపరచవచ్చు, బాహాటంగా.
కాని, నా విషయమై వారు చాలా గంభీరంగా ప్రవర్తించారు.
చాలా స్తవనీయంగా ప్రవర్తించారు.
నేను మొదటే చెప్పినట్టు, నాగేశ్వరరావుగారి ఆక్షేపణ ప్రసక్తానుప్రసక్తం మాత్రమే యిక్కడ.
లక్ష్మణరావుగారి రాతల్లో నేను చూపించిన వివాదాంశాలే ప్రధానాలిక్కడ.
మరి, నా ఆక్షేపణ లంగీకరించినట్టా వారు, తిరస్కరించినట్టా?
ఈ జిజ్ఞాసే కలగలేదు నాకు.
విషయ విగరణంలో వారు చూపించిన ఔచిత్యం కారణం దానికి.
మరి, చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారికీ లక్ష్మణరావుగారికీ సాపత్యం యేమిటీ?
పండితుల ప్రసక్తి వచ్చినప్పుడు, వారంతర్ముఖులా, గతానుగతికం భాపతువారా అన్నది, యిలాంటి సందర్భాలను బట్టే వ్యక్తం అవుతుంది బాగా.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||547}}</noinclude>
3w0nr72c4thvvdfyjkacevkczpn1xn4
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/572
104
204204
555577
531894
2026-05-06T12:06:27Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555577
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>పాండిత్యానికి, సత్యధర్మాల్లోనేగాని, బుకాయింపుల్లోనూ, పిడివాదాల్లోనూ కాదు వినియోగం.
స్వవిషయం వచ్చినప్పుడు, పండితులయినవారు, కొంచెం దారి తప్పడం తటస్థించనే వచ్చు.
అదీ వొక అందమే పరకాయిస్తే.
కాని, వారిని సత్రకాయలంటారు కొందరు.
ఎగిసెగిసి పడతారు వారు.
తమ పెండే కాసులకు ప్రతిఘటన రావడం వొక్కటే చూసుకుంటారు వారు.
శివమే యెక్కేస్తుంది వారికి.
వారి పరిజ్ఞానం పూర్వపక్షం అయిపోతుంది, దాంతో.
వారి ఔచిత్యవిచారశక్తి భంగపడిపోతుంది, పూర్తిగా.
చదువుకున్నవారే అయివుంటారు వారు, సందేహం లేదు.
కాని, చదువంటనివారికింద జమ అయిపోతారు వారు.
అనారోగ్యానికీ, వ్యాథులకూ క్రిములూ, దోమలూ హేతు భూతాలయేటట్టు పండితులయివారిలో ముఠా లేర్పడ్డానికీ అసహనం యేర్పడ్డానికీ కారణభూతు లవుతారు, వారు.
ఎదటివారి ఔచిత్యం విషయమే చూస్తారు గాని, వారు తమ పెండేకాసుల మర్యాదా తిక్రమణం గుర్తించలేరు.
మరి, వారిది అజ్ఞానం-మౌఢ్యం- మౌర్ఖ్యమూ కాక పోతే మరే మనాలీ?
మిక్కిలీ దయనీయమైనది వారిస్థితి.
అయితే వొక్కటుంది.
లక్ష్మణరావుగారిలాగ, అలాంటి అభందరం మనుష్యులకు అదుపు చేసేవారు. పండితుల్లో బహు అరుదుగా వుంటారు.
ఆకర్ణేజపుల మాటలమీద పైకి రావాలని చూసేవారే అధికంగా వుంటారు, లోకంలో.
ధిక్!
{{c|<big><big>34</big></big>}}
నాగేశ్వరరావుగారు నన్ను చూడమన్నవారిలో లక్ష్మణరావుగా రొకరు.
అయితే, వారు, వారిని చూడమన్న దెందుకోసం?
"ఇందుకోసమే” అనుకోలేదు నేను.
రెండువైపులా పదునుగల కత్తివంటిది లక్ష్మణరావుగారి శక్తి.
ఇటు పండితులు వారు.
సాటిలేని పండితులు.
పండిత ధర్మం మూర్తీభవించిన పండితులు.
అటు ధనికులున్ను.
కనీసం నాకంటే ధనికులు.<noinclude><references/>
{{rh|548||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude>
e0n3dz8vweiycvf7vpxbpfk8x3ry6zz
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/573
104
204205
555578
531895
2026-05-06T12:10:02Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555578
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఎంతో కొంత ఇవ్వగల ధనికులు.
కాని, వారివిషయమై మనం చూడవలసిన దీ ధనికత్వం కాదు.
మునగాల రాజాగారి దివాను, వారు.
బహూ సరసులా ప్రభువు.
అలాగే, బహూ సరసులా దివాను.
“మణినా వలయం, వలయేన మణి" లాంటి సన్నివేశం వారిది.
మరి, నా స్థితి?
ప్రెస్సుబిల్లు చెల్లించవలసింది.
“సాధ్యమైనంత త్వరగా చెల్లించ" వలసింది, ఆ బిల్లున్ను.
భరించలేని భారం నాకిది.
కనక - లక్ష్మణరావుగారిని చూస్తే?
ఆ భారం కొంత తగ్గవచ్చు నాకు.
అంటే, యిక్కడ, అర్థం చేసుకోవలసిన సంగతి మరొకటి వుంది.
అది నాగేశ్వరరావుగారి సూచన.
ఆ సూచన నా భారం త్వరగా తగ్గించడాని కుద్దిష్టం, అంతే.
“నాగేశ్వరరావుగారు తమ బిల్లు త్వరగా చెల్లిపోడానికి చేసింది ఆ సూచన” అని అర్థం చేసుకుంటే, అంతకంటే అనౌచిత్యం మరి వుండదు.
పైగా, ఇంగిత జ్ఞానం లేని అర్థజ్ఞానం అవుతుంది.
పరమ అవివేకి - ద్విపాత్పశువున్ను అవుతాడా అర్థగ్రహీత.
కనక, ఇదిగో యింత గ్రంథం నడిచాక - అప్పుడా విషయం ప్రస్తావించాను లక్ష్మణరావుగారి దగ్గిర నేను.
ప్రస్తావించాను, అంతే, "వెళ్ళి రాజాగారిని చూడండి" అన్నారు లక్ష్మణరావుగారు.
1. నా పుస్తకంలో విలవలేదు. 2. పైగా అసందర్భంగా వుంది. 3. దాని విషయమై రాజాగారి దగ్గర ప్రస్తావన చెయ్యడానికి లక్ష్మణరావుగారి కిష్టం లేదు. 4. ఎవరినిగురించీ వారలా చెప్పరు. 5. రాజాగా రూరిలో లేరు. 6. ఉండినా
వారినిప్పుడు చూడతగిన సమయం కాదు - ఇలాగ పరిపరివిధాల ధ్వనించింది నాకు "వెళ్ళి రాజాగారిని చూడండి" అన్న లక్ష్మణరావుగారి మాట.
నిజానికి, నేను స్వయంగానే వెళ్ళి రాజాగారిని చూడ్డానికి నా కాక్షేపణాలేదు, సందేహమూ లేదు.
మునగాల రాజాగారిది. అడగనివాడిదే దోషం అన్న ఔదార్యం.
ఎన్నో సందర్భాల్లో - ఎందరో చెప్పగా విన్న దీమాట.
కనక, వా రూరికే పంపెయ్యరు.
ఎంతో కొంత యిస్తారు.
నిజానికా మొత్తం నిర్ణయించుకో వలసినవారు వారే, కాని, నేను వెడితే అది స్వల్పం అయితే?
కనీసం లక్ష్మణరావుగారే నన్ను వారిదగ్గరికి పంపితే?
అది కొంచెం పెరుగుతుంది.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||549}}</noinclude>
dm34e0n4x76h3x35sacb14bnbtqfb52
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/574
104
204206
555579
531896
2026-05-06T12:16:26Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555579
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>కాని, “నన్ను లక్ష్మణరావుగారు పంపా"రని రాజాగారితో చెప్పుకోడానికి అవకాశం కనపడలేదు నాకు లక్ష్మణరావుగారి మాటలో.
కనక, వెళ్ళడమా మానడమా?
ఈ విచికిత్సతో వూరుకున్నా న్నేను.
"వెళ్ళిరండి" అని మళ్ళీ అన్నారు లక్ష్మణరావుగారు.
విసుగ్గా కాదు, బహూ సౌమ్యంగా అన్నారు వారామాట.
వెంటనే బయలుదేరాన్నేను.
"ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు, రాజుగా రనుసరించడాని కేదయినా వొక పథకం తయారుచేసే వున్నారేమో లక్ష్మణరావుగారు" అనిపించింది నాకు, వారు మళ్ళీ ఆ మాట రెట్టించడంతో.
కాక,-
"ప్రాప్తవ్యమర్థం లభతే మనుష్యః”
ఎవడి కెక్కడ ఎంత ప్రాప్తం వుందో అంతా చేతికి వచ్చే స్తుంది.
దానికి విఘాతం వుండదు.
నా నమ్మకం చిన్నప్పణ్ణుంచీ యిది.
నేను వెళ్ళాటప్పటికి రాజాగారింట్లోనే వున్నారు.
నేను చీటీ పంపించాను.
వారు దర్శనం యిచ్చారు.
పుస్తకం వారి కందించా న్నేను.
తరవాత నా పరిస్థితులు చెప్పుకున్నాను.
ప్రెస్సు బిల్లు సంగతి కూడా చెప్పాను.
"మీ విషయం - మీ వీరపూజ విషయం యిదివరకే చెప్పి వున్నారు లక్ష్మణరావుగారు" అన్నారు రాజాగారు.
చకితుణ్ణయిపోయా న్నేను, మళ్ళీ.
నా విషయం నేను లక్ష్మణరావుగారికే చెప్పించుకో వలసి వున్న స్థితిలో, లక్ష్మణరావుగారు, నా విషయమై తామే రాజాగారితో చెప్పడమా?
సంభవమేనా యిది?
మొదటిమాటు — క్షణంకిందట - కొద్ది నిమిషాల సేపు మాత్రమే లక్ష్మణరావుగారితో మాట్టాడివున్నా నేనిది నమ్మ గలనా?
అడిగితే - దేహీ అంటే, యివ్వకుండా చేసేవారుంటారు లోకంలో.
ఉంటారేమిటి మళ్ళీ, ఉన్నారు.
బహువచనం మీదే వున్నారు, మహోదారులయిన ఆ దాతల రక్తం తామే పీల్చేస్తూ.
ఈ "పడగొట్టడం" అన్నది పిఠాపురంలో నా కనుభూత పూర్వమున్ను.
“చి-త్తం” అని మాత్రమే అనగలిగా న్నేను, మాటరాక.
పర్సే పైకి తీశారు, రాజాగారీ లోపున.<noinclude><references/>
{{rh|550||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude>
bs43ssa0sei1xiiqf5ic1u9g01fnsbm
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/575
104
204207
555580
531897
2026-05-06T12:19:56Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555580
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>"ఇది మొదటి సంపుటం అన్నట్టు చెప్పారు లక్ష్మణరావుగారు. టైటిలు మీద కూడా అలాగేవుంది. తమ రిది యెన్ని సంపుటాలుగా రచిస్తే అంతా సంతోషిస్తాన్నేను. ఎన్ని సంపుటాలు ప్రకటిస్తే అన్ని యాభైరూపాయలిస్తాను కూడా"
అంటూ, అయిదు పదులందించేశారు కూడా, నా చేతికివారు.
లక్ష్మణరావుగారు నా పరోక్షంలో నా సంగతి చెప్పడమూ - రాజాగారు నాకు డబ్బివ్వడమూ - ఇది కాదు చూడవలసిందిక్కడ.
నిజాని కిందులో యెవరిదీ తక్కువదికాదు గాని, యీ ఔదార్యంలో, యెవరిదెంత జారా, లక్ష్మణరావుగార్లలో?
ఇవాళ లక్ష్మణరావుగారు లేరు.
చాలా రోజులకిందటే చనిపోయారు వారు.
జాతికి జాతి అంతా పరితపిస్తోంది. అదలా జరిగిపోయినందుకు.
కాని, వారి భావోన్నతి యెవరందుకో గలిగారు?
వారి హృదయ గాంభీర్యం యెవరర్థం చేసుకోగలిగారు?
వారి ఔదార్యం యెవరు పరిమితి కట్ట గలిగారు?
"నభూతో నభవిష్యతి" అన్న మూర్తిమంతం వారిది.
ప్రపంచంలో అపురూపమైన వ్యక్తిత్వం వారిది.
సృష్టిలోనే అపూర్వం అయిన అవతారం వారిది.
ఉండిన్నీ లేనిదయిపోయింది మనకది.
మన దురదృష్టం - ఆంధ్రజాతి దౌర్భాగ్యం యిది.
కనీసం యిప్పటిదాకా నైనా వారుంటే మన వాఙ్మయం- నవీనవాఙ్మయం సంపన్నం అయి ఇతరజాతుల నీరాజనాలందుకుంటూ వుండేది.
{{c|<big><big>35</big></big>}}
పండిత, డి. గోపాలాచార్యులుగారి దగ్గిరికి బయలుదేరాన్నేను.
నేను వెళ్ళాటప్పటికి క్లాసుకు వెళ్ళడానికి సిద్ధంగా వున్నారు, వారు.
దక్షిణ భారతాని కంతకూ మహామహోపాధ్యాయులు వారు, ఆయుర్వేదంలో.
గొప్ప చికిత్సకులు.
వారి వైదుష్యానికీ, వారి నైపుణ్యానికీ మెచ్చి, వైద్యరత్న అన్న ఉన్నతబిరుదం యిచ్చి సత్కరించివున్నారు సర్కారు, వారిని.
స్వయంగా, ఆయుర్వేద కళాశాల నిర్వహిస్తున్నారు వారు.
తామే ప్రిన్సిపాలు దానికి.
ఆంధ్రపత్రిక ఆఫీసుకి అరఫర్లాంగులో వుందది.
గోపాలాచార్యులుగారూ, నాగేశ్వరరావుగారూ ప్రాణ స్నేహితులు.
ఇద్దరూ బందరువారు.
నేను చీటీ పంపగా "ఈ శ్రీపాదవా రెవరు?” అనడుగుతూ నే నున్నచోటికే వచ్చా రాచార్యులుగారు.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||551}}</noinclude>
7arv7duxs8xqvoaux06agpz9koalnmu
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/576
104
204208
555582
531927
2026-05-06T12:24:24Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555582
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>శ్రీపాద నరసింహశాస్త్రిగారని వొక పండితులు.
గొప్ప పండితులు.
విశేషించి, ఆయుర్వేదాశ్రమాస్థాన పండితులు వారు.
వారంటే, యెంతెంతో ఆదరాభిమానా లాచార్యులుగారికి.
వారి సాహచర్యం వల్లనే "ఈ శ్రీపాదవా రెవరు?" అనడం ఆచార్యులుగారు.
పశ్చిమ గోదావరిజిల్లా లొల్ల గ్రామం నరసింహశాస్త్రి గారిది.
మాకూ మాకూ జ్ఞాతిత్వం లేదు; కాని, వారి అత్తవారి పరంగా బంధుత్వం మాత్రం వుంది.
అయితే, మద్రాసులోనే వారితో నాకు పరిచయం.
రెండు నిమిషాల్లో నా సంగతి చెప్పుకున్నా నాచార్యులు గారితో.
“ఇక్కడ కాదు, రండీ" అంటూ వెంటనే తమ ఆఫీసు గదిలోకి తీసుకు వెళ్ళా రాచార్యులుగారు, నన్ను.
మరో రెండు నిమిషాలు కూచున్నారు నా కోసం.
అక్కడే అందించాను వీరపూజ, వారిచేతికి.
పుచ్చుకున్నా రంతే, మాట్టాడలేదు, పుస్తకం విప్పారు.
పద్మినీదేవిని చెరపట్టడానికి వచ్చిన అల్లావుద్దీనుకి మేవాడు రాణాలు స్వాగత సత్కారాలు చెయ్యడమూ, తనని సాగనంపేటప్పుడా అల్లాఉద్దీనే పద్మినీదేవిని, భర్తను పట్టెయ్యడమూ, ఆ సందర్భంలో నేను మన వాళ్ళ నీతిని విమర్శించడమూ--ఈ ఘట్టం వచ్చింది, వారది తెరిచాటప్పటికి.
అది పూర్తిచేసేదాకా నా కేసి చూడలేదు వారు.
“భేష్" అన్నారు పూర్తిచేసి.
“మంచి విమర్శ. కొత్త వ్యాఖ్యానం. సరిఅయిన దృక్పథం మీది” అన్నారు.
"ఏమిటి మీరు వచ్చినపని?" అని అప్పుడడిగారు నన్ను.
అంతా చెప్పాన్నేను, టూకీగా.
“నాగేశ్వరరావుగారే చెల్లించ మన్నారాబిల్లు?" అనడిగారు వారు.
“అవు”నన్నాన్నేను.
వింతగా చూశారు నాకేసి వారు.
"ఏమయినా, వారనవలసినమాట కాదది. దానికేం, భారతవీరుల చరిత్ర కావాలి నాకు. మీరు రాస్తేనే బాగుండేటట్టుంది" అన్నారు.
“ఇంత అని పరిమితి వద్దు. ఎన్ని అయితే అన్నీ రాయండి, నా ప్రెస్సులో అచ్చువేయించి వుచితంగా యిచ్చేస్తాను మీకు. కాగితం ఖరీదు కూడా నేనే పెట్టుకుంటా" నని కూడా అన్నారు.
వారి వాఙ్మయప్రీతీ, వారి విషయ నిర్ణయమూ, నా యెడల వారి క్కలిగిన ఆదరభావమూ, వారి మహౌదార్యమూ - ఇవి గుర్తించి చకితుణ్ణయిపోయా న్నేను.
నాకున్నదే ఆ వుద్దేశం.
ముందు వీరపూజ రాయడావి కదే కారణం నేను.
దాల్లో చెయ్యి తిరుగుతుంది నాకే కొంచెమయినా.<noinclude><references/>
{{rh|552||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude>
pgah98ntow3i06p9fczkv6xqoe0gv4p
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/577
104
204209
555583
531931
2026-05-06T12:27:43Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555583
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>మన చారిత్రిక వీరులు అసాధారణులే.
అయితే, పరిస్థితుల ననుసరించినది వారి ప్రవృత్తి.
భారతవీరులది విశిష్ట ప్రవృత్తి.
అసలు, వారున్నారా, కల్పితపురుషులా వారన్న ప్రశ్న యెప్పుడూ లేదు నాకు.
ఆదర్శభూతాలయిన జీవితాలు వారివి.
ధర్మంకోసం బతికిన బతుకులు వారివి.
తన్మూలంగా, మన కారాధ్యులువారు.
పైపెచ్చు, వ్యాసమహర్షి దిద్దుపాటు వారికి.
కాని, వారి చరిత్రలు రాయడానికి నాకో చిక్కుంది.
కవిత్రయం వారి భారతం తెనుగుభాషకే ప్రమాణం మనకు.
తెనుగు కవిత్వానికిన్నే ప్రమాణం.
భారతకథకూ, భారతధర్మాలకూ అది ప్రమాణం కానేకాదు.
చాలా చోట్ల, సంస్కృతమూలానికి చాలా భిన్నంగా వుందది.
పండితులయినవారూ, విమర్శకులయినవారున్నే అనేకులనే మాట యిది.
కాగా, సవిమర్శగా, వీరపూజ వరవడిలో భారతవీరుల చరిత్ర రాయాలంటే, సంస్కృత భారతం చదవాలి, ముందు నేను.
అప్పటికీ తెనుగుభారతమే ఇతిశ్రీగా చదివివుండని స్థితి నాది.
కనక, ముందది చదవాలి.
తరవాత, చదవాలి సంస్కృత భారతం.
చదవాలి, చర్చించుకోవాలి, సమన్వయం కుదుర్చుకోవాలి, ఒక నిర్ణయం చేసుకోవాలి, ముందు నేను.
అప్పటికయినా నా కందు క్కావలసిన తాహతు అబ్బుతుందా అంటే, అది, వేరే విషయం; కాని గోపాలాచార్యులు గారి ఆజ్ఞ శిరసావహించాలంటే, అప్పుడు నేను సాహసించ వలసిన అవకాశం.
ఇదంతా మనవి చేసుకున్నా నాచార్యులుగారికి.
అది నచ్చింది వారికి.
"ఆ ప్రయత్నం చెయ్యం” డన్నారు వారు.
“ఎప్పుడు వీలయితే అప్పుడే చెయ్యండాపని. ఏమయినా, మన కాదర్శాలు భారతవీరుల చరిత్రలు. మన జాతి బాగుపడాలంటే అవి చదువుకోవాలి మనం. అవి పారాయణ చెయ్యాలి. అవి మననమున్నూ చేసుకోవాలి. ఉజ్వలమైన భాషలో - బిగువయిన రచనలో - భారతసంస్కార దర్పణాలుగా కావాలి మనకు. మీరు రాతప్రతి యెప్పుడు తెస్తే అప్పుడే అచ్చు వేయిస్తాన్నేను" అని మాట యిచ్చారు వారు.
నా - బిల్లు చెల్లింపుసంగతి ప్రస్తావించి "రేపురండి, సరిగా యీ వేళకే. రండి. పెద్ద ఆశమాత్రం పెట్టుకోకండి" అన్నారు, లేచారు.
అన్న సమయానికి మళ్ళీ వెళ్ళాన్నేను, మర్నాడు.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||553}}</noinclude>
9csttl7fy144me70aghvqlqn5e4feen
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/578
104
204210
555584
531933
2026-05-06T12:30:53Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555584
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>“అన్న సమయానికి వచ్చారు మీరు" అంటూ చాలా ప్రశంసించారు, ముందు, వారందుకు నన్ను.
అంటూనే డ్రాయరు లాగారు.
లాగుతూనే పర్సు తీశారు.
తీస్తూనే వొక బాంకినోటందుకున్నారు అందులోనుంచి కొంచెం చాటుగా.
నూరు రూపాయలనోటు తరవాత యాభైరూపాయలది కూడా వుండే దా రోజుల్లో.
అయితే, యాభై రూపాయలనోటుదీ, అయిదురూపాయల నోటుదీ కొంచెం వ్యత్యాసంతో వొక్కటే పరిమాణం.
అయిదురూపాయల నోటిప్పటి పదిరూపాయలనోటుకంటే బాగా పెద్దది.
కాగా, వారందుకున్న దేదో నాకు బాగా కనపడలేదుకనక, అది యాభై రూపాయలదయినా అయి వుండవచ్చు, అయిదురూపాయలదయినా అయి వుండవచ్చు.
అదిన్నీ వొక మడత మడిచారు ముందు వారు.
ఆ మడవడంలో కూడా కొంచెం చాటుగానే మడిచారు.
ఆ మడత మళ్ళీ మడిచారు.
మళ్ళీ మడిచారు, మళ్ళీ మడిచారు, చివరికి రూపాయ కాసంత అయేదాకా మడిచారు.
అప్పుడయినా నా కందించలేదు వారది.
ముందు నా చెయ్యి చాప మన్నారు.
ఆ మడత, వొకచేత్తో నా చేతిలో వుంచారు.
అదిమారు కూడా.
తరవాత, తను రెండో చేత్తో నా వేళ్ళు మడిచారు.
"నడివీధిలోకి వెళ్ళేదాకా గుప్పిడి విప్పవద్దు మీరు” అన్నారు.
"మరి, నాకు టయిమయిపోయింది, మీరు వెళ్ళండి" అంటూనే లేచారు కూడా.
కృతజ్ఞత చెప్పుకుంటూ బయలుదేరాన్నేను.
ఎంతో కొంత యిచ్చారువారు, పుస్తకం ఖరీదు కంటే యెక్కువే అది, సందేహంలేదు; కాని, ఇవ్వడంలో వారవలంబించిన విధానం వల్ల, యిచ్చి వారు చేసిన ఆజ్ఞవల్లా అది అయిదురూపాయలదో యాభైరూపాయలదో చూడాలన్న ఆత్రం కలిగింది నాకు.
గుబగుబలాడి చేసింది కూడా.
అయినా, అణుచుకున్నానా అత్రం నేను.
గబగబా నడిచాను.
ఉరుకుతూ మెట్లు దిగాను.
అంగలువేసుకుంటూ గుమ్మాలు దాటాను.
కొలిచినట్టు నడివీధిలోకి వెళ్ళాను.
అప్పుడు తెరిచాను గుప్పిడి.
చూడగా యాభై రూపాయల నోటది.<noinclude><references/>
{{rh|554||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude>
md09ztncvaoci7g1uc26f3xdfgfjvpq
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/579
104
204211
555585
531934
2026-05-06T12:35:26Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555585
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>పరవశుణ్ణయిపోయా న్నేను.
కాని "భేష్! చెప్పినట్లు చేశారు మీరు. తరుచు దర్శనం యిస్తూవుండండి" అన్నమాట వినపడింది నాకు.
చూడగా, ద్వారబంధాలు పట్టుకుని సింహద్వారాన నుంచుని నాకేసే పరీక్షగా చూస్తున్నా రాచార్యులుగారు.
నేను చూడ్డం చూశారు, రివ్వున తిరిగి, చర్రున మెట్లెక్కేశారు.
అది చూసిన్నీ చకితుణ్ణయిపోయా న్నేను.
కీ. శే. ప్రతివాది భయంకర కృష్ణమాచార్యులుగారు దేశ ప్రసిద్ధులు.
వారూ ఆయుర్వేదాశ్రమ పండితులే.
బహూ సమర్థులే వారున్ను.
మద్రాసులో, మొదట కలిగిన పరిచయం వారితోనే నాకు.
ఆయుర్వేదంతో వారికీ సంబంధం లేదప్పటికి, నాకూ సంబంధం లేదు.
సాహిత్యపరంగానే - విశేషించి సంస్కృత సాహిత్యం పరంగానే మాకు తరచు సల్లాపం.
తరుచు కలుసుకునేవాళ్ళం మేము.
ఆదివారాలు వచ్చాయా, వొక పూటకిపూటే గడిచి పోయేది మాకు.
ఎంతెంతో చెప్పేవారు గోపాలాచార్యులుగారి సంగతులు వారెన్నెన్నో.
"గోపాలాచార్యులుగారి చెయ్యి, ఇటు, బహూ చిక్కనా, అటు, చాలా ఉదారమున్ను. అర్థివచ్చాడా, ముందు సామర్థ్యం చూస్తారు వారు. చేసే పని పరిశీలిస్తారు తరవాత. దాని విలవా, అది వారి ఆ ఆర్థి నిర్వహించడమూ అతినిశితంగా పరిశీలిస్తారు. వచ్చిందీ, అనుకున్నదానికంటే యెక్కువ యిస్తారు. లేదూ, దమ్మిడీ కూడా యివ్వరు”– ఇదీ పిండితార్థం కృష్ణమా చార్యులుగారు చాలా మాట్లు చెప్పినదానికి.
దీని కెన్నో వుదాహరణలూ చెప్పేవారు వారు.
అంచేత, ఆచార్యులుగా రిచ్చిందెంతో చూడాలన్న ఆత్రం చాలా యెక్కువయి పోయింది నాకు.
అయినా, అణుచుకున్నానది, సప్రయత్నంగా.
ఆ అణుచుకో గలగడమైనా నడివీధిలోకి వెళ్ళే దాకానే.
1 ఇచ్చిన వారియెదటే అదెంతో చూసుకోడం మర్యాద కాకపోడం. 2. ఎంతోకొంత యిచ్చే వున్నారు వారు. 3. అది, కనీసం అయిదయినా అయివుంటుందన్న నమ్మకం కలగడం 4. వారి వృత్తి బహుముఖాల బహువారం విని వుండడం 5. ముందు చేతిలో పెట్టే అన్నారు వారామాట, కనక, వారి ఆజ్ఞ యెందుకు శిరసావహించక పోవాలి అన్న
ఆలోచన కలగడం- 6 మళ్ళీ మళ్ళీ దర్శనం చెయ్యడానికి వారే ఆహ్వానించడం - ఇన్ని కారణాలున్నాయి గదా యిక్కడ, యిల్లాంటప్పుడైనా ఆ ఆత్రం నిగ్రహించుకోలేకపోతే, యీ జీవితంలో నేనేమి సాధించుకోగలనూ?
అంతకిముందూ తరవాతా గూడా వారిని కలుసుకోడం చాలా మాట్లు జరిగింది; కాని ప్రకరణానురోధంగా ఆ సమావేశంమాటే చెబుతున్నాను.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||555}}</noinclude>
40yzpermsszhyi33b7z3s21hlux6ukd
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/580
104
204212
555586
531943
2026-05-06T12:39:54Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555586
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఈ ద్రోణంరాజు నరసింహారావుగారు, పానుగంటి నరసింహా రావుగారి అల్లుళ్లు.
వారూ, పానుగంటి నరసింహారావుగారి సోదరులు సుబ్బారావుగారూ కూడా అక్కడ వుండగా వచ్చిందీ ప్రస్తావన.
నేను వెళ్ళాటప్పటికి, వంగూరి సుబ్బారావుగారు, పానుగంటి వారి సారంగధర నాటకం విశిష్టత వివరిస్తున్నారు.
ఆ పుస్తకం వారిచేతిలోనే వుందప్పుడు.
అప్పటి క్కొద్ది మాసాలక్రితమే అచ్చుపడివుంది, నా రచనా.
"మీ కొత్తనవల చదివానండీ" అంటూ సుబ్బారావుగారే తెచ్చారు, దాని ప్రస్తావన.
వారు "మీ... కొత్త నవల-" అంటూ ప్రారంభించారు ఆ వాక్యం.
"మీ..." అంటూ అప్లుతం వుచ్చరించడంలో వారు, తమ మాట చాలా జాగ్రత్తపడుతున్నట్టు స్పష్టంగానే తెలిసింది.
సాధారణంగా "మీ శ్మశానవాటిక చదివానండీ" అనడం లేకపోలేదు చాలా మంది.
తప్పేం, నా రచనపేరే అదయి వున్నప్పుడు?
రచయిత తన రచనకు పేరు పెట్టడంలో యెంతో ఆలోచిస్తాడు.
మంచి చెడ్డలతోపాటు - అందచందాలతో పాటు - సార్థకత కూడా చాలా ఆలోచించుకుంటాడు.
ఇక, ఆ పేరుచ్చరించడంలో, విరుపులు విరవడమూ, శ్లేషలు తియ్యడమూ - ఇవి, అవతలివాళ్ళ బుద్ది జాతినిపట్టి వుంటుంది.
పూర్వకవుల కంతగాలేనిది, నవీనులకు, తమ రచనలకు పేర్లు పెట్టడంలో కొత్త అభిరుచు లేర్పడ్డాయి.
అవి యింగ్లీషు చదివినవారు, ఇంగ్లీషు రచనలను చూసి అలవర్చుకున్నవి.
క్రమంగా, ఇంగ్లీషు నేర్వని మనవాళ్ళు-నావంటి వాళ్ళున్నూ ఆ మార్గం తొక్కుతున్నారు ధారాళంగా.
అయితే, యీ కొత్త సంప్రదాయం అనుసరించి పెట్టిన పేర్లలో, కొన్ని గ్రంథకర్తపేరితో కలిపి పలికితే, కొన్ని విపరీతార్థాలు స్ఫురించడం వుంది.
అయినా, వారా పద్ధతి మానడంలేదు.
ఇది నాకు, వెనకటివా రెందరో తొక్కిన మార్గం.
ఇటీవలి వారీ మార్గమే తొక్కుతున్నారు, బహుళంగా.
ఇక్కడ, కొందరు గ్రంథకర్తల పేర్లతో కలిపి, కొన్ని నవీన గ్రంథాల పేర్లుదహరిస్తాను.
1. వీరేశలింగంగారి 'అభాగ్యోపాఖ్యానం'
2. గురజాడ అప్పారావుగారి 'కన్యాశుల్కం'
3. ఉన్నవ లక్ష్మీనారాయణగారి 'మాలపల్లి'
4. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి 'పాణిగృహీత'
5. మళ్ళీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి 'శనిగ్రహం’<noinclude><references/>
{{rh|556||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude>
gtl74msknb8n1zyjy3k1960f9t3bk6u
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/581
104
204213
555589
531994
2026-05-06T13:50:06Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555589
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>6. మంత్రిప్రగడ భుజంగరావుగారి 'వారకాంత'
7. పానుగంటి నరసింహారావుగారి 'వృద్దవివాహాం'
8. కట్టమంచి రామలింగారెడ్డిగారి 'ముసలమ్మ మరణం'
9. ఆచంట లక్ష్మీపతిగారి 'చలిజ్వరం'
10. భమిడిపాటి కామేశ్వరరావుగారి 'పెళ్ళి ట్రెయినింగు' 'గుసగుస పెళ్ళి' - 'మడతపేచీ', 'మేజువాణీ'.
11. విశ్వనాథ కవిరాజుగారి 'దొంగాటకం'
12. కొడవటిగంటి కుటుంబరావుగారి 'కులంలేనిపిల్ల'
13. మంగిపూడి వేంకటశర్మగారి 'బాలవితంతు విలాసం'
14. వజ్ఝల కాళిదాసుగారి 'చాకిరేవు'
15. పిలకా గణపతిశాస్త్రిగారి 'గృహదహనం'
16. మునిమాణిక్యం నరసింహారావుగారి 'ప్రణయకలహం' 'ఘోషా', 'మృత్యురథం', 'ప్రాయశ్చిత్తం'.
17. పురాణం కుమారరాఘవశాస్త్రి (?) గారి 'గళ్ళచీర'
18. శ్రీ శ్రీ గారి 'మహాప్రస్థానం'
ఈ కోవలోదే అవుతుంది శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, 'శ్మశానవాటిక' కూడా. మరి, ప్రపంచం మునిగిపోయినట్టు, కొందరు బుగ్గలు నొక్కుకోడంలో ఏమయినా సొగసుందా?
పోతే, యిక, ప్రకృతం.
పోతే, “వారిచేతిలోనే వుందా పుస్తకం (సారంగధర నాటకం)" అని చెప్పి వున్నాను.
మొదట, 'మీ కొత్తనవల చదివా' నంటూ ముభావం గానే మాట్టాడారుగాని, వంగూరి సుబ్బారావుగారు సూటిగా 'శ్మశానవాటిక' అన్న పేరుతోనే సాగించారు. సంభాషణ క్రమంగా.
"అదేం, పేరండీ? ఏవగింపుగా లేదూ?" అనడిగారు వారు.
చిరునవ్వు నవ్వుతూ, శిరఃకంపంమాత్రం చేసి వూరుకున్నాన్నేను.
"పానుగంటి నరసింహారావుగారు కూడా ఈ మాటే అన్నారు" అన్నారు, తరవాత వారు.
“విన్నా”నన్నాన్నేను.
నా కొత్తనవల ప్రస్తావన, నరసింహారావుగారు తమ దగ్గిర కూడా చేసివున్నట్టు అదివరకే చెప్పారు నాకు, పురాణపండా మల్లయ్య శాస్త్రిగారు.
నేనీ మాటకూడా అనగా, ద్రోణంరాజు నరసింహారావు గారూ, పానుగంటి సుబ్బారావుగారూ సాకూతంగా చూశారు వంగూరి సుబ్బారావుగారికేసి.
ఊరుకోలేదు “మరి మల్లయ్యశాస్త్రిగా రేమన్నారు?" అనడిగారు వంగూరి సుబ్బారావుగారు.
“వారూ ఆక్షేపించా”రన్నాన్నేను.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||557}}</noinclude>
5s6w86yibsu0bmkoxjdjpbeh17x82ua
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/582
104
204214
555590
531995
2026-05-06T13:54:32Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555590
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>ఇది విని ద్రోణంరాజు నరసింహారావుగారికేసి, పానుగంటి సుబ్బారావుగారికేసి తామూ సాకూతంగా చూశారు, బదులుగా.
వంగూరి సుబ్బారావుగారి చేతిలోనే వున్న పానుగంటివారి సారంగధర నాటకంలో, యిద్దరు పరిచారికలు మాట్టాడుకుంటారొకచోట.
ఆ ఘట్టం తీసిచూపించి "ఈ ఘట్టం స్పుటంగా చదవండి మీరు" అని కోరాన్నేను సుబ్బారావుగారిని.
"ఏం, చదవక?" అంటూనే అని చదివారు వారు.
“వాటి అర్థమూ భావమూ కూడా సెలవిప్పించండి" అని కోరాన్నేను.
కాని, పక్కకిచూస్తూ వూరుకున్నారు వారు మాట్టాడలేదు.
"సెలవిప్పించండి" అని మళ్ళీ కోరాన్నేను.
అయినా మాట్టాడలేదు వారు.
ఇలాగ, నేను, మళ్ళీ మళ్ళీ కోరడమూ, అయినా తటపటాయిస్తూ వా రూరుకోడమూ—ఇదేమిటో అవగాహన కాక, “ఏమిటామాట?”లనడుగుతూ పానుగంటి సుబ్బారావుగారూ, ద్రోణంరాజు నరసింహారావుగారూ కూడా, పర్యాయత్వేనా ఆ పుస్తకం అందుకుని ఆ ఘట్టం చదువుకున్నారు; కాని వారున్నూ వూరుకున్నారు, పలక్కుండా.
అప్పుడన్నాన్నేను, వంగూరి సుబ్బారావుగారితో “నా రచనపేరు ఆక్షేపించినవారు మీ గురువుగారని మీరే చెప్పారిప్పుడు. అది మీకు స్వయంభువుకాదు. అది అనువదిస్తున్నారంతే, మీరు. ఇక్కడా అదే మార్గం. ఈ మాటలకు అర్థమూ చెప్పవద్దు మీరు, భావమూ చెప్పవద్దు, స్వతంత్రించి. మీ గురువుగారినే చెప్పమనండి. వాటిమీద వారు చెప్పిందిన్నీ అనువదిస్తూనే వుండండి మీరు" అని.
"అయితే, పానుగంటివారి రచన కంతకీ యిదేనా విచారణ చెయ్యవలసిన ఘట్టం?" అనడిగారు వంగూరు సుబ్బారావుగారు, కొంచెం దురుసుగా.
“కాదనో అవుననో మీరే నిర్ధారణ చెయ్యండి. మీ నిర్ధారణ క్కారణాలేమిటో అదిన్నీ చెప్పండి. అయితే, ఈ మాటలు " మీ గురువుగారు ఉద్దేశపూర్వకంగా రాసివుంటారో, పొరపాటున రాసివుంటారో అది కూడా మీరే సెలవివ్వండి" అని
మాత్రమే కోరాన్నేను, దానిమీద.
అప్పుడు కలగజేసుకున్నారు ద్రోణంరాజు నరసింహారావుగారూ, పానుగంటి సుబ్బారావుగారూను.
మమ్మల్నిద్దరినీ వూరుకోమన్నారు వారు.
"మా ప్రూపులపని నిలిచిపోయిం”దని చెబుతూ “వెళ్ళిపోండి" అని కూడా ఆదేశించారు వారు, మమ్మల్నిద్దరినీ.
పానుగంటివారి రచనలు చాలా చదివాన్నేను.
కనబడితే, యిప్పటికీ చదువుతూనే వుంటాను కూడా.
ఒక విధంగా చూస్తే, చెప్పుకుని మనజాతి గర్వించుకోతగ్గ రచనలు వారివి.
మన హాస్యరచయితల్లోకూడా వా రొకరు.
ప్రముఖులున్ను.<noinclude><references/>
{{rh|558||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude>
ko5udpsi78k2z4pr2eqg254vuc5igex
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/583
104
204215
555591
531996
2026-05-06T13:58:13Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555591
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>అయితే, ఎంతబాగా నవ్విస్తుందో, వారిహాస్యం, అక్కడక్కడ, అంత జుగుప్సా కలిగిస్తుంది.
ఒకమాటు వర్ణచిత్రం రచిస్తూ, వారిని గురించి, నా ప్రబుద్ధాంధ్రలో యిలా రాశాను.
"సాక్షివ్యాసా లనేకాలు పదిమందీ కూచున్నచోట చదవడాని కర్హంగావుండవు రసికు లందులో అనేకాలు చదవనే లేరు పట్టుపట్టి అదేపనిగా చదివితేమాత్రం భావసౌకుమార్యం కోల్పోయి, మొరటు లయిపోతారు".
"అయినా, పంతులుగారికి మంచి గ్రహణశక్తి వుంది. కథనశక్తి వుంది. భావనాశక్తి వుంది. తన్మయీభవనయోగ్యతవుంది. నిర్వహణ సామర్థ్యమున్నూ వుంది”
"పంతులుగారు, శబ్దాలు తూచివేస్తారు. వాక్యాలు పొంకంగా బిగిస్తారు".
"కాని, అన్నీ గ్రామ్యంతో నిండివుంటాయి"
“పగటివేషాలు రసికులూ చూస్తారు. కాని ఆ హాస్యం సభ్యం అని అంగీకరించలేరు భామవేషాలూ గొల్లవేషాలూ కూడా చూడ్డానికే ముచ్చటపడతారు రసికులు. కాని, ఆ హాస్యమున్నూ ఉత్తమం అని చెప్పలేరు”
"పంతులుగారి హాస్యం ఆ తరగతిలోది”
"ఏమయినా, పంతులుగారికి, కవులజాపితాలోనూ, వాఙ్మయంలోనూ మంచిస్థానమే వుంది".
"ఏమీ సందేహం లేదు".
{{c|<big><big>36</big></big>}}
కళా సూర్యనారాయణ అని మా రెండో పింతల్లిగారి కొడుకు.
సంస్కృత కావ్యాలు చదివాడతను, కాకరపర్తిలో.
నా కంటే పెద్ద.
ఒకమాటు మావూరు వస్తున్నాడతను.
రాజమండ్రీలో స్టేషనులో రెయిలెక్కాడు.
చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారున్నూ రెయిలెక్కా రక్కడ.
ఇద్దరూ వొక కంపార్టుమెంటులోనే వున్నారు.
“మీ దేవూ"రంటే, “మీ దేవూ"రంటూ వొకరిసంగతి వొకరు చెప్పుకున్నారు.
“మీ రెక్కడికి వెడతా” రనడిగారు వేంకటశాస్త్రిగారు.
“అనపర్తి స్టేషనులో రెయిలుదిగి 'పొలమూరు' వెడతా"నన్నాడు మా సూర్యనారాయణ.
"అక్కడ యెవరయినా బంధువులున్నారా?" అనడిగారు వెంకటశాస్త్రిగారు.
“మా పెత్తల్లిగారున్నా రావూళ్ళో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, మా పెత్తల్లిగారి కొడుకే" అన్నాడు సూర్యనారాయణ.
చాలు, మరేమీ అక్కర్లేదు వెంకటశాస్త్రిగారికి.
వారి బుద్ధి చమత్కరించింది, వెంటనే.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||559}}</noinclude>
n77j9x9dne2b2zdplur8br1h5rk3wm6
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/584
104
204216
555593
531997
2026-05-06T14:19:03Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555593
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>"మీ శ్మశానవాటిక నేను చూశా"నని చెప్పం డాయనతో" అన్నారుట వారు ముందు.
"చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రియిలా చెప్పమన్నా"డని చెప్పండి" అని కూడా అన్నారుట, తరవాత.
ఆ మాటమీద చాలా బాధపడ్డాడుట, మావాడు.
"ఇంత తెలివితక్కువపని చేశాడేం?" అనుకున్నాను సుమా నేను అన్నాడు కూడా నాతో.
మళ్ళీ బయలుదేరాడు స్వగ్రామం "నడిపూడి” వెళ్ళడానికి. కడియం మీదుగానే వెళ్ళమన్నా న్నేను.
"కడియంలోదిగు, వెంకటశాస్త్రిగారిని కలుసుకో” అన్నాను.
"వారన్నమాట నాతో చెప్పావుకనక, ఆ సంగతి వారితో చెప్పు" అన్నాను మొదట.
"నేను శ్మశానవాటిక నిర్మించాను. దానియెడల యేమాత్రమైనా శ్రద్ధాసక్తులున్నవారు "స్వేచ్ఛగా వుపయోగించుకో వచ్చు నని చెప్పమన్నాడు మీతో" అని వారితో చెప్పు" అని చెప్పి మరీ పంపించా నతణ్ణి.
కడియం మీదుగానే వెళ్ళాడతను.
వెంకటశాస్త్రిగారిని కలుసుకుని నేను చెప్పమన్నదిన్నీ చెప్పాడు వారితో.
దానిమీద చాలా కోప్పడ్డారుట వెంకటశాస్త్రిగారు.
చాలా ఘర్షణపడ్డారుట యిద్దరూ.
అప్పుడొక వెలమదొరగారున్నారుట అక్కడ.
వారి నిద్దరినీ దూరం దూరంగా తొలగించేశారుట ఆ దొరగారు.
ఇంటికివెళ్ళి యిదంతా నాకు రాశాడు మా సూర్యనారాయణ.
{{c|<big><big>37</big></big>}}
అదిగో, ఆ శ్మశానవాటిక అచ్చయింది.
వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రిగా రచ్చువేయించి యిచ్చారది.
నా గ్రంథమాలకు పోషకభారం వహించారు వారు.
నూటపదార్లందుకు; నాకు బహుమానం.
కాని, మరోమాట చెప్పారు వారు.
కాగితం, అచ్చుఛార్జీలు, బైండింగుఛార్జీలు - అన్నీ నేనే భరిస్తాను, రాతప్రతి తీసుకురండి, వెయ్యి ప్రతులు అచ్చువేయించి యిస్తా" నన్నారు వారు.
అలాగే చేశారు.
నేను కోరగా, యెర్రకాలికోతోనే మూడువందల ప్రతులు బైండు చేయించి యిచ్చారు వారు.
మొదటిమాటు మూడు ప్రతులు తెచ్చి నా కందించాడు బైండరు.
వెంటనే వొకటి వేంకటేశ్వరశాస్త్రిగారి కిచ్చాను.
టవునుకివచ్చి రెండో ప్రతి నాగేశ్వరరావుగారి కిచ్చాను.<noinclude><references/>
{{rh|560||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude>
lymmtek1br7glkuiqff8xahk4uouc7n
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/585
104
204217
555597
531998
2026-05-06T16:33:42Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555597
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>మూడోప్రతి గోపాలాచార్యులుగారి కిద్దామని వెళ్లాను.
కాని వారూరికి వెళ్లారు, వారి దర్శనం కాలేదు.
"పిఠాపురం వెళ్ళారు వారు. ఇప్పుడే వెళ్ళారు మెయిలుకి. తొందరపనయితే సెంట్రల్ స్టేషనులో కలుసుకోవచ్చు వారి" నని చెప్పారు గుమాస్తాలు.
ట్రామెక్కి వెళ్ళాను.
సెకండుక్లాసు కంపార్టుమెంటులో కూచుని వున్నా రాచార్యులుగారు.
అప్పటికి - నాగేశ్వరరావుగారూ, వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రిగారూ, గోపాలాచార్యులుగారూ - మద్రాసు కంతకూ యీ ముగ్గురే నేనంటే ప్రత్యేకశ్రద్ధ చూపేవారు.
అంచేత, వారి ముగ్గురికీ మొదటి మూడుప్రతులూ యివ్వాలని నా సంకల్పం.
నా ప్రయత్నం యిదే, కాని వొక అసందర్భం జరిగిందావేళ.
"ఇది నా కొత్తనవల బైండుపని పూర్తి అయి ఇప్పుడే నా చేతికి వచ్చింది. తమకోసం కాలేజీకి వెళ్ళాను. తా మూరికి వెడుతున్నట్టు చెప్పారు గుమాస్తాలు. ప్రయాణంలో సావకాశంగా చదువుతారన్న వూహతో తెచ్చాను" అని చెబుతూ
పుస్తకం వారి చేతిలో వుంచాను.
పేరు చూశారంతే, వారు.
వారి చూపుల్లో అసంతృప్తి కనపడింది.
“తంతివార్తరాగా వైద్యం పనిమీద లక్ష్మీనరసాపురం వెడుతున్నా న్నేను. ఇదా నాకు శకునం యిప్పుడు? ఈ మాత్రం అయినా ఆలోచించారుగారేం శాస్త్రులుగారూ?” అనడిగా రాచార్యులుగారు.
దురుసుగా అడగలేదు.
వారి మొగం ప్రసన్నంగానే వుంది.
కాని, సిగ్గుపడిపోయాన్నేను.
చాలా పరితపించాను.
ఏమిటేమిటో చెప్పుకోడం ప్రారంభించాను.
వెంటనే "వద్దువ”ద్దంటూ లేచివచ్చి, నన్ను కంపార్టుమెంటులోకి తీసుకువెళ్ళి, తమ పక్కని కూచోపెట్టుకున్నారు, ముందు, వారు.
వీపు తట్టారు.
"ఊరికే, చమత్కారాని కన్నాను. మరేమీ అనుకోకండి. కావలసిందెలా వుంటే అలా అవుతుంది. చికిత్స సందర్భంలో నేనిలాంటివి చూడను."
నాయెడల మీ భావా లెలాంటివో నాకు తెలుసు. అది మరిచిపొండి" అంటూ చాలా చెప్పారు, కూడా.
బండి కదిలేదాకా చెబుతూనే వున్నారు.
మర్నాడులేదు, ఆ మర్నాడు వర్తమానం వచ్చింది నన్ను రమ్మని.
"వెళ్ళినపని వాకిట్లోనే అయింది. పిఠాపురంలో దిగాను. రోగి చనిపోయినట్టు చెప్పారు. పిఠాపురంలోనే నాకు బసయేర్పాటు చేశారు. తిరుగుమెయిల్లో వచ్చేశాను" అన్నారు వారు, మొదట.<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||561}}</noinclude>
1pt9wl97szxsyazfrhi6htyv75n88hq
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/586
104
204218
555602
532003
2026-05-06T17:09:50Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555602
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>"శకునం మాట మరిచిపొండి. చమత్కారాని కన్నానంతే" అన్నారు మళ్ళీ.
"ఇలాంటి కేసులు నెగ్గడం కష్టం. చివరికి వచ్చేదాకా అక్కడివారు చికిత్స చేస్తూనే వుంటారు. అంతా అయింతర్వాత నాకు తంతికొట్టారు. సకాలంలోనే అందింది నాకది; కాని మెయిలు కదలాలి, రాత్రంతా నడవాలి, నేను పిఠాపురంలో
దిగాలి, లక్ష్మీనరసాపురం చేరుకోవాలి – ఇంతవరకూ కాలమూ నిలవదు, రోగమూ నిలవదు. ఆ వ్యక్తి బతికేవుంటే, నే నక్కడికి వెళ్ళేటప్పటికే అక్కడివారి చికిత్సవల్ల రోగం మళ్ళవచ్చు. ఇదంతా అవతలివారి అదుర్దామాత్రమే" అన్నారు, తరవాత.
"శకునంమాట మరిచిపొండి" అంటూ మళ్ళీ అందుకుని "కాని, రాత్రి నన్నేడిపించారు మీ" రన్నారు, గంభీరంగా చేస్తూ.
నాకు తెలుసు, హృదయం వున్నచోట అలా జరుగుతుందని. అయినా చేతులు జోడించుకున్నా న్నేను.
"వద్దు వ"ద్దంటూనే నా అంజలిబంధం పట్టుకొని "అలాంటి రాతరాసి యిప్పుడిలా చింతించడం యేమి సొగసూ మీరు" అనడిగారు.
“చమత్కారం జరిగిందన్నారు తరువాత.
"సెల విప్పించం"డన్నా న్నేను.
వారు ప్రారంభించారు.
"కంపార్టుమెంటు కంతకూ ఒక యూరోపియనూ, నేనూ మాత్రమే వున్నాం. బండి బయలు దేరింది. నేను మీ నవల విప్పాను. యురోపియ నొక పుస్తకం విప్పాడు. రెండు పేజీలు చదవడమూ ఆ కాగితం చింపి కింద పారెయ్యడమున్ను
అతను. గూడూరు దాటింది మొదలు కళ్ళ నీళ్ళు పెట్టుకోడమూ, తుడుచుకోడమూ, నా పెదవులు వణకడమూ, అయినా నవల చదువుతూనే వుండడమున్ను నేను. 'అదేమి' టనడిగాడతను. 'నువ్వాకాగితాలు చింపెయ్యడం ఏమిట'నడిగాన్నేను.”
ఇలా అని, ఒక క్షణం ఆగి, విన్నారా అన్నట్టు చూసి, మళ్ళీ ప్రారంభించారాచార్యులు గారు.
"రెయిలు ప్రయాణాలవంటి సందర్భాల్లో, కాలక్షేపం కావడానికి ఉద్దిష్టాలీపుస్తకాలు. ఒకమాటు చదివితే చాలివి. అంతే, యిది చదివితే కలిగే ఆనందం మళ్ళీ అనుభవించ నక్కరలేదని కాదు. కొత్తపుస్తకాలు వస్తున్నాయి. ఎందరో యువకులు తమ ప్రతిభ ప్రకాశం కోరుతున్నారు. వారి రచనలు కూడా చదవాలి మనం. వారికిన్నీ ప్రోత్సాహం కలిగించాలి మనం. మన రచన చదువుతోంది లోకం, కనక మనమున్నూ రాద్దాం" అన్న సంకల్పమున్నూ కలిగించాలి, మనం కొత్త యువకులకు.
"అంటే, యీ రచన వుద్దేశం యేమిటో అది నెరవేరి పోయింది. ఈ రచనకీ ఆకృతి ఎందుకోసం పుట్టిందో... అది నెరవేరిపోయింది. ఇక నిలిచివుండవలసింది కాదిది. ఉండ నివ్వ వలసిందీ కాదు. ఉండనివ్వడం వివేకంకాదు. అవివేకం అవుతుంది" అన్నాడు ధృఢంగా అతను.
"ఇది వింతగా వుంటుంది మీకు" అంటూ ప్రారంభించాడతను.
"మీకూ, మాకూ దృక్పథంలో చాలా భేదంవుంది. పరిస్థితులున్నూ మావి వేరు. మీవి వేరున్నూ, అలాగే అచ్చు లేని రోజుల పరిస్థితిన్నీ వేరు. పుస్తకం<noinclude><references/>
{{rh|562||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude>
8f71mfkb5yvhnhtwxeo26rsg3fsve4h
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/587
104
204219
555603
532004
2026-05-06T17:13:15Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555603
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>చదవడానికంటే సంపాదించు కోడానికెక్కువ బాధపడవలసి వచ్చే దారోజుల్లో. పుస్తకం తయారుచేసుకోడానికే దమ్మిడీ అయినా ఖర్చుఉండేది కాదప్పుడు. ప్రతి రాసుకోడానికే శ్రమపడవలసి వచ్చేది. ఇప్పుడలాకాదు. ఇచ్ఛామాత్రంగా పుస్తకం అందుబాటవుతుంది. అయితే గుర్తించవలసింది, మన ఆ యిచ్ఛ వెనక, యెందరిదో శ్రమ చాలా యెక్కువగా వుందని. ఎందరో శ్రద్ధపడితేనే గాని దీనికీ రూపం రాలేదు.”
"అయితే యెందుకోసం వారంత శ్రద్ధపట్టరు, ఎంచేత అంత శ్రమపడ్డారు? అదంతా పొట్టకోసం. మరి యీ ప్రతి ఇలాగే శాశ్వతంగా వుండిపోతే? వారి శ్రమకు వినియోగం యేదీ? పైగా వారి పొట్ట గడచేమార్గం రుద్ధం అయిపోదూ?"
"వారు శ్రమపడ్డమేకాదు, యీరచన కీరూపం సిద్ధించడానికి వొకడో, కొందరో డబ్బు ఖర్చుపెట్టవలసి వచ్చింది. ఆ ధనికుల వుద్దేశ మేమిటి అలా చేయడానికి? వారు పొట్టకోసమే చేశారది.”
"అయితే బయటికివచ్చిన రెయిల్వే లిట్రేచరు ప్రతీది నిలవ వుండిపోతే?"
"ఇది మరొకడు చదువుతాడు. ఇంకొకడు చదువుతాడు. వేరొకడు చదువుతాడు. మరెందరో చదువుతారు. చదువుతూనే వుంటా డెవడో ఒకడు. వారి సంఖ్య యెంతయినా అవుతుంది."
"ఏ పుస్తకాని కయినా అందరు చదవడం గొప్పే.”
"అయితే అందరూ చదవ్వలసిన - అందరూ కొనవలసిన అగత్యం యీ ఒక్కప్రతే తీరుస్తుంది. అప్పుడు పబ్లిషరేమవుతాడు?"
'మరి, లైబ్రరీ లక్కరలేదూ?' అన్న ప్రశ్నేవస్తుంది దీని మీద తెలుసు. దాని కొక్కటే సమాధానం. లైబ్రరీలు రెయిల్లో వుండేవి కావు. ఉండవలసినవిన్నీ కావు.
"రెయిల్వే ప్రయాణీకులు విసుగులేకుండా ప్రయాణం చెయ్యిగలగడమే ప్రయోజనం. రెయిళ్ళలోనూ రెయిల్వే స్టేషన్లలోనూ లైబ్రరీలుండవు. కనకనే యివి స్టేషన్లలో అమ్మడానికవకాశా లేర్పా టయినాయి.”
“ఇవి నిలవ వుండవలసినవి కావు. ఇవి యెవడికి వాడు తన అగత్యం తీరేక యిలా చింపేస్తే? అగత్యం అనుకున్న వాడెవ డికివాడే కొనుక్కో వలసివస్తే?”
"అప్పుడే గ్రంథం యెన్ని ప్రతులు ఖర్చుఅవుతాయో ఆలోచించారా? పబ్లిషరు వ్యాపారం ఎంత పెరుగుతుందో గ్రహించారా?"
“అప్పుడు పబ్లిషరు ఎన్నెన్ని ఎంతెంత లేసి పుస్తకాలు ప్రకటించడానికుత్సాహ పడతాడో గమనించారా?
"ఈ పుస్తకం నే నట్టేపెట్టేస్తే? నేను ఆ గ్రామికులకూ ఆ పబ్లిషరుకూ వృత్తి భంగం చేసిన వాణ్ణయిపోనూ? ఇది ప్రవృత్తికి భంగం కాదూ?" అనడిగాడు చివరికతను.
"విశిష్టమయిన మనస్తత్వం ఇది. మన కర్థం అవుతుంది. కాని నచ్చదు. ఎవడికి వాడే పుస్తకం కొనుక్కోడమే ధర్మం. అందరికీ ఆ శక్తి కలిగించాలనే జ్ఞానం లేదు మనకి."<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||563}}</noinclude>
q1kwphrh2aav9t4ldresb0ejzzpx96p
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/588
104
204220
555604
532005
2026-05-06T17:14:24Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555604
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>"ఆ యూరోపియను ప్రవృత్తి పరంగానే అర్థం చేసుకోవాలి మనం. అప్పుడే ప్రవృత్తి అంటే ఏమిటో అవగాహనవుతుంది, మనకి."
"ఇక మీ నవల సంగతి.”
“అది పూర్తిగా చదివాన్నేను. మీ రచనలో జీవం వుంది. మీ రచన ముందు నన్నేడిపించింది. కనకనే తరవాత నన్నానంద పెట్టింది. కనక మళ్ళీ, మళ్ళీ, రాయండి మీ రిలాంటి నవలలు. ఇంకా ఇంకా రాయండి" అంటూ ఆచార్యులుగారు నన్నెంతో ప్రోత్సహించారు.
{{c|☆ ☆ ☆ ☆ ☆}}<noinclude><references/>
{{rh|564||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude>
gtcv9oqbvlstkmy299e60w30rlpkjak
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/589
104
204222
555605
532006
2026-05-06T17:18:55Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555605
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>{{p|fs150|ac}}'''కథక చక్రవర్తి కీ. శే. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి'''</p>
వెలనాఁటి శాఖీయ బ్రాహ్మణుడు. కౌశికస గోత్రుడు. తల్లి: మహాలక్ష్మి సోదెమ్మ. తండ్రి: లక్ష్మీపతి సోమయాజులు, జన్మస్థానము: పొలమూరు (రామచంద్రపురము తాలూకా). నివాసము: రాజమహేంద్రవరము. జననము: 23 ఏప్రిలు 1891 ఖర సంవత్సర చైత్రశుద్ధ చతుర్దశీ గురువారము.
నేఁటి తెలుగు కథా రచయితలలో, మునుముందుగా జ్ఞప్తి కందు కొందఱిలో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారొకరు. ఒక రనుటకంటే, మొదటి వారనుటయు నతిశయోక్తము కారాదు. కారణము ఆయన వ్రాసిన ప్రత్యక్షరము సహజ ప్రతిభనుండి పొటమరించినది: ఆయన చేసిన ప్రతి కల్పనము ప్రత్యక్షమున కవిరుద్ధమైనది; ఆయన పాత్రలచేఁ బలికించిన ప్రతిపదము, ఇరుగుపొరుగుల మనము వినుచున్నది; ఆయన ప్రదర్శించిన ప్రతి సంవిధానము మన యనుభూతులకు దవ్వుగానిది: ఆయన కట్టిన కథలెల్ల తెలుఁగు దేశపుటెల్లలు గడచి పోయినవి. ఈ తీరున
సుబ్రహ్మణ్యశాస్త్రిగారు అచ్చమైన తెలుగుదనమును వలచి వచ్చిన రచయిత. అంగలముకాని, వంగముకాని, మఱియొక వాఙ్మయముకాని మర్యాదకైన జదివిచూచిన వారు కారు. విశేషించి, "హిందీ"ని చేరదీయ రాదని చిరకాలమునుండి వారి వాదము. ఇంక సుబ్రహ్మణ్య శాస్త్రిగారు కూడబెట్టుకొన్న సంపత్తి సంస్కృత సాహిత్య మొక్కటే. ఇటులు విజాతీయమైన సంస్కార ధోరణి దూరముగానిలచి, కృతకృత్యగర్హితముకాని యాంధ్రత్వము నారాధించిన రచయిత రచన లెటులుండును? అనుకరణములు కాని అనువాదములుకాని చేయవలసిన ప్రారబ్ధము సుబ్రహ్మణ్యశాస్త్రిగారికి లేదు. యథార్థముగా అయన చూపులకుఁ గనిపించిన వస్తువు, ఆయన చెవులకు వినిపించిన మాటలు, మూట గట్టుకొని కథలలో బెట్టి కళ కట్టించును. ఉత్తమ జాతి రచయితచేసెడి పనియు నింతే! దీని వివరణము ముందు మనవి చేసెదను.
శ్రీపాద వారిది యనూచానమైన పండిత వంశము. శ్రౌతస్మార్తములు. జ్యౌతిషము వీరి వంశ విద్యలు. సుబ్రహ్మణ్య శాస్త్రిగారి తండ్రిగారు యజ్వ. ఆయన కన్న మువ్వురు కుమారులలోను మన శాస్త్రిగారు మూఁడవవారు. వంశస్థులందఱి వలెనే వీరుకూడ శ్రౌత స్మార్తములు పరాయితము అధ్యయనము చేసినారు. జ్యౌతిషము
స్కంధత్రయము పఠించినారు. అదికాక, వల్లూరిలో గుంటూరి సీతారామశాస్త్రి గారు, వేట్లపాలెములో దర్భాబైరాగిశాస్త్రిగారు, తమయింట అన్నగారు శివరామపిద్దాంతి దీక్షితులుగారు గురువులుగాఁ గావ్యపాఠము చేసిరి. పసినాటనే తెలుగులపై నభిరుచి యంకురించినదగుటచే శాస్త్రిగారు గురువులచాటున నాంధ్రకృతులు జదువుటయు, ఏవోచిన్న చిన్న రచనలు చేయుటయు సాగించినారు. సరియైన యుపదేశమున్నగాని కవితారచన చేయరాదని 1910 సం॥లో సుబ్రహ్మణ్యశాస్త్రిగారికి నిశ్చయము కలిగినది. ఈ నిశ్చయమే, పీఠికాపుర సంస్థానకవులగు వేంకట రామకృష్ణులను<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||565}}</noinclude>
85pdzme56u6y1lieetzkr7t67ij4alb
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/590
104
204223
555607
532007
2026-05-06T17:22:57Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555607
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>శాస్త్రిగారికి కవితా గురువులుగా జేసినది. 1910-11 సం||లో రామకృష్ణ కవుల సాహచర్యమున నెన్నో సాహిత్యపు మెలకువలు కవిత్వపు బొలపము శాస్త్రిగారు గుర్తింపగలిగినారు. ఇరువది యేండ్ల యీడు వచ్చుసరికి శ్రీపాదసుబ్రహ్మణ్య శాస్త్రిగారు సానఁబెట్టిన రత్నము.
ప్రధానముగా వీరి జీవితములో మెచ్చఁదగిన విషయము, వీ రేయధికారిని దోసిలియొగ్గి "నెలకూలి చాకిరీ” కొడబడ కుండుట - వీరి వలె నాత్మగౌరవము నధికముగా నిలబెట్టుకొనువారు తక్కువ. అట్లని, పరనిరపేక్షముగా జీవింపగల విత్తవంతుడును కాఁడు. ఆయనలోని తలపులు పయి మాటలు నొకటై సూటిగానుండును. దాపఱికములేదు. చెప్పిన దానికిఁదిరుగుండ రాదు. ఎదుటివాడు సహృదయఁడయినచో హృదయముముద్దగట్టి ముందుబెట్టును. కానిచో పిలచినను, పెడమొగము పెట్టును. సుబ్రహ్మణ్యశాస్త్రిగారి యదార్థవాదిత బంధువిరోధమునకుఁ గారణము కారానిది.
ఇది యిటులుండగా వారితొలిరచన 'వారకాంత' యను నాటకము కవిత్వము నాటకాంతము కావలయునన్న పెద్దలమాట సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ముందునకు దెచ్చినారు. ఈ సందర్భమున వారొకప్పుడు చెప్పిన 'రేడియో' ప్రసంగము స్మరణకు వచ్చుచున్నది.
“పాఠకునకూ, ద్రష్టకూ రసానుభవం కలిగించి తనసందేశం స్ఫుటముగా వినిపించాలంటే, 'రచయితకు' తక్కిన కావ్యాల కంటే నాటకం చాలామంచి సాధనం. కాని నాటకరచన చాలా కష్టమైనది. సామాన్యంగా కావ్యం రచించే
టప్పటికంటే నాటకం రచించే టప్పుడు రచయిత గొప్పబాధ్యత వహించ వలసి వుంటుంది. తన జాతివారికి సభ్యత అలవడ జేయడమూ - అది తప్పిపోకుండా చూడటమూ—ఇదే ఆ బాధ్యత. కవికి ఇంత శక్తీ బాధ్యత ఉందని తెలుసుకున్నప్పుడు, శక్తి ఉందా లేదా అని చూసుకోకుండానే నేను నాటక రచనకి పూనుకున్నాను, నేను మొట్టమొదట రాసిననాటకం-అంటే నాకు నేనైరాసిన నాటకం - "వారకాంత”. కాని దాని కర్తృత్వం నేను మరచిపోతున్నాను. నా నాటకాలలో నేను చెప్పుకో గలవి "ప్రేమపాశం", "విగళబంధనం”, “రాజరాజు" - ఇవి. వీటిలో ఒకటీ రంగస్థలం ఎక్కలేదు. చదివినవారు మాత్రం అనుకూలంగానూ ప్రతికూలంగానూ కూడా మాట్టాడారు. కొన్ని ఏకాంకికలున్నూ రాశాను. వాటిలో నాకు మిక్కిలి ప్రీతి పాత్రం "కలంపోటు".
ఈ “వారకాంత” నాటకములోఁ పద్యములు కూడ జేర్చినారు. ఇది ప్రత్యేకించి చెప్పుటలో సుబ్రహ్మణ్యశాస్త్రిగారు 1934 నుండి బొత్తిగా పద్యబంధ ప్రాతికూల్యము వహించుటకారణము. ఈ ప్రతికూలభావము వారికి పద్యము హృద్యముగా వ్రాయలేక పోవుట వలనఁగలిగినది కాదని ఈ క్రింది పద్యము సాక్ష్యము చూపుచున్నాను.
<poem>
{{left margin|5em}}
బ్రతుకు ఘటించునోషధి కరాళ విషంబున నుక్కుతీవలం
దతి మృదునాదమున్, దహనునందు ప్రకాశము నుప్పునీటిలో
రతనము లాణిముత్తెములు, రాళను కప్పకు జీవనంబులున్
చతురతఁ గూర్తు వెయ్యది యసాధ్యము నీకిక దీనబాంధవా!
</poem>
“అత్త - అల్లుడు”, “అలంకృతి", "అభిసారిక”, “బాలిక, తాత" మొదలగు ఖండకావ్యములు సుబ్రహ్మణ్య శాస్త్రిగారు మనోహరముగా రచించినవి యున్నవి.<noinclude><references/>
{{rh|566||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude>
1dusaw84u3v5ou7o2fznyclp0efu7p8
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/591
104
204224
555608
532009
2026-05-06T17:27:20Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555608
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>శ్రీ శాస్త్రిగారి మొదటి నవల 'మిధునానురాగము'. అట్లే మొదటి కథ 1914 ఫిబ్రవరిలో వెలువడినది. "ఇరువుర మొక్కచోటికే పోదము" అని దాని పేరు. "ఇదియాది 1923 సం॥ దాక గ్రాంథికములోనే శాస్త్రిగారు రచనలు సాగించుచు వచ్చిరి. క్రమముగా రెండుమూడేండ్లకు సంపూర్ణముగా వ్యవహారిక భాషావతరణము. విశేష మేమనగా వీరు గ్రాంధికము వ్యవహారికము కూడ సహజమధురమైన శైలిలో వ్రాయగలవారు. శాస్త్రిగారు ముమ్మొదట వెలువరించిన
చరిత్రగ్రంథము వీరపూజ. ఆ గ్రంథమందలి గ్రాంధిక శైలీ సౌభాగ్యము చాలా విలువగలది. శ్మశాన వాటిక, రక్షాబంధనము ఇత్యాదులగు వీరినవలలు ప్రజానీకములో సువ్యాప్తములై యున్నవి. సుబ్రహ్మణ్యశాస్త్రిగారి వచన రచనలోఁ జలువచందనము వంటి దేదోయుండి హృదయమునకు రాసికొనుచుండును. సమాసముల గడబిడలు,
అన్వయముల తిరుగుడులు మచ్చునకును రానిచ్చు స్వభావమాయన కలమునకు లేదు. ఎంతసేపును శాస్త్రిగారి చూపు సహజత్వముమీద. ఇది యటుండె.”
1921 సం॥ నుండి శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగారి సర్వసిద్ధాంతములకు భీఠమై "ప్రబుద్ధాంధ్ర” వెలసినది. శాస్త్రిగారి సంపాదకత్వమున నీ పత్రిక తొలియేఁడు ప్రతి పక్షమునకు వెలువడుచు రెండవయేటినుండి మాసపత్రికగా మాఱినది. ఆదిలో ప్రబుద్ధాంధ్ర సగము సంస్కృతభాషా రచనలతోను, సగము తెలుఁగు రచనలతోను వెలువడుట శాస్త్రిగారి యుభయ భాషా వైదుష్యాభిమానములకు నిదర్శనము. అల్ప కాలముననే 'ప్రబుద్ధాంధ్ర' తెలుఁగునేల మూలమూలలకు బ్రాకి పాఠకులను వలవైచి లాగినది. ఈ ఆకర్షణమునకు మహోత్తమ రచయితల వ్యాసములేకాక శాస్త్రిగారి వ్యాఖ్యలు విమర్శనములు హేతువులైనవి. వీరి కలమునకు జంకుగొంకులు లేవని తొలుత ననుకొంటిమి. గతానుగతిక ధర్మావలంబన మాయన బొత్తిగా సహింపలేరు. దానిని బట్టి హృదయములో నుండియో ఉండకో నూటికిఁదొంబదిమందిచే ద్రొక్కబడుచున్న సిద్ధాంతమును అమాంతముగా శాస్త్రిగారు గర్హింతురు. వట్టిగర్హణముతో
సరి పెట్టక వాడిగల వ్రాఁతలో బెట్టి సుప్రచారము చేయుదురు. ఆయనలోనున్న యీ గుణమునకు వారి 'ప్రబుద్ధాంధ్ర' నిలువుటద్దమైనది. "హిందీ - గాంధీ - ఖద్దరు” ఈ మూఁడును శాస్త్రిగారి సిద్ధాంతమునకు విరుద్ధమైన పదార్థములు. బౌద్ధుల త్రిరత్నము వలె భారతీయుల పారాయణములో నున్న యీమూడు శబ్దములను విమర్శించుచున్న శాస్త్రిగారి గుండెనిబ్బరమునకు, అబ్బురమైన పట్టుదలకు మనము మెచ్చవలయును. "ప్రబుద్ధాంధ్ర” తొమ్మిది యేండ్లు నడచి మంచి ప్రసిద్ధిలో నాగి పోయినది. సుబ్రహ్మణ్య శాస్త్రిగారి జీవన వైభవమునకు "ప్రబుద్ధాంధ్ర” సాగిన దశాబ్దము మెఱుగుకాలము. 1934సం॥ నుండి ఆపత్రికలో పద్యప్రకటనము నిషేధించి వచన రచనలే ప్రచురించెడివారు. కావున వచన వాఙ్మయమున కా పత్రిక చేసినమేలు మరువరానిది. శాస్త్రిగారి సర్వగ్రంథ రచనము నొకయెత్తు, ఈ పత్రికా ప్రచురణ మొకయెత్తుగా సాగినది. సుబ్రహ్మణ్యశాస్త్రి గారు 1915 మొదలు నాలుగేండ్లు కళాభివర్ధినీ నాటక సమాజము నడిపిరని యిచటఁ బేరుకొనుట వారి కళాభిరతికి గుఱుతు. నాటకములలో స్త్రీ - పురుష వేషధారణము చేసెడి వారనియు వినుకలి. సంగీత కళపై వీరికెక్కువ మక్కువ. సుమారు నూరుకృతులు గురుముఖమున జెప్పుకొనిరట. కాని గొంతెత్తి పాడగా నేను వినలేదు. 1947 నుండి సంగీత సాహిత్య సభలు జరిపించుచు వీరు రాజమహేంద్రవరమున<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||567}}</noinclude>
o3qdhwqglezlsgxrvxqoxky79lskaw7
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/592
104
204225
555609
532012
2026-05-06T17:29:34Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555609
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>నూత్నకళాగౌరవము చాటుచుండుట ప్రశంసింపదగిన సంగతి. నన్నయ - శ్రీనాథ జయంతులు జేగీయమానముగా నడిపించుచున్న శాస్త్రిగారి ప్రాచీన సారస్వతాదరణము నమస్కరణీయమైనది.
ఇంక, ప్రకృతము, వారు చిన్న కథలు వ్రాయుదురు. కాని అవి గుణమున పరిమాణమున గూడా పెద్దకథలు. సంభాషణముల సంతనలో నింత పరిపక్వత గల కథా రచయితలు తక్కువ. పాత్రల మాటలలో వ్యక్తులతీరులు భంగిమములు సుస్పష్టముగా మనకు గోచరింప జేయుదురు. సాంసారికమైన ముచ్చటలు, సాంఘికమైన యాచారములు ప్రదర్శించుటలో శాస్త్రిగారిది యందెవేసినచేయి. వైదికకుటుంబములోని నడతలు వీరి కథాప్రపంచమున నచ్చుగ్రుద్దినట్లు కానుపించును. వడ్లగింజలు, మార్గదర్శి, కన్యా కాలే యత్నాద్విరతా - ఇత్యాదులైన వీరి కథలు రసవాహినులు, ప్రేమపాశం, నిగళబంధనం, రాజ రాజు, కలంపోటు మొదలయిన సుబ్రహ్మణ్యశాస్త్రిగారి నాటికలకుఁ "దెలుగునాట" ప్రసిద్ధివచ్చినది. నాయుద్దేశములో “రాజరాజు" వీరినాటకముల కన్నిటికిని కన్నాకువంటిదని. అందులో నన్నయ పాత్రపోషణము అనన్యసాధారణమైన తీరులో శాస్త్రిగారు తీర్చినారు.
రాజరాజుకడ, ఆత్మగౌరవము వీసమంతయినను చెడిపోకుండ నన్నయచేఁ బరికించిన పాటవము సుబ్రహ్మణ్యశాస్త్రిగారికే చెల్లినది. ఇది యన్నమాటకాదు, ప్రతిపాత్రయును రాజరాజులో జీవన్మూర్తులై కనిపించును. ఇట్టి “రాజరాజు"ను సాహిత్యసామ్రాట్టు విక్రమదేవవర్మ మహారాజు కృతిపొందుట యభినందనీయము. “కలంపోటు" మొదలగు నాటికలు వీరిని యెన్నిసారులు చదివినను జదువవలయు ననిపించును.
నాటికారచనలో పత్రికా సంపాదకతలో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రిగారిది తెలుగు భూమిలో నొకప్రత్యేకపీఠము.
{{c|☆ ☆ ☆ ☆ ☆}}<noinclude><references/>
{{rh|568||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude>
r0yz2xm7v6c85vpdjig4qoc6bvi9zjt
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/593
104
204226
555611
532014
2026-05-06T17:34:49Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555611
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>{{p|fs150|ac}}'''శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగారి (వీలునామా) ఉత్తరం'''</p>
పురిపండా అప్పలస్వామి గారికి!
“ఇవాళ తెల్లవారాటప్పటికి నాకివాళ పక్షవాతం సందేహం కలిగింది. మీరు హైదరాబాదునుంచి ఎప్పుడువస్తారు?"
నాగేశ్వరరావుగారికి కథలు పుస్తకాలు ఇచ్చెయ్యదలచుకున్నాను. వెనక ఒకమాటు వారు పేజీకి 3-00 మూడు రూపాయలు చొప్పున బేరంచేసి స్థిరపరచుకున్నారు. నేను కధలు పట్టుకు వెళ్ళి యివ్వబోతే, డబ్బులేదు ఇప్పుడు వద్దన్నారు. ఆబేరం మొన్న జ్ఞాపకం చేశాను. నిజమే అప్పుడు డబ్బులేక పోయిందన్నారు. ఇప్పుడు ఆ రేటున పైసలు చెయ్యండి. కుదరకపోతే మీ ఇష్టం వచ్చినట్లు పైసలు చెయ్యండి. తక్కినపుస్తకాలున్నూ యిప్పించెయ్యండి. వారికి నాలుగువేల చిల్లర నేనుబాకీ. నవలలూ, నాటకాలూ వగైరా కాపీరైట్లూ, స్టాకుఅంతా యిప్పించండి. మీకు సాధ్యమైన ధరకు యిప్పించి రుణం లేదనిపించి అదనంగా యిస్తే అది నా భార్య చేతికి యివ్వండి. నా కుటుంబానికి మీరే సాయం చెయ్యగలరు. కథలు సావు రాసినవున్నాయి. పేపరు కటింగులున్నాయి. మందు చికిత్సకూ తిండికి డబ్బు కావాలి. ఇప్పించండి. ఈ నెల ఇంకా అద్దె యివ్వలేదు.
పుస్తకాల వ్యవహారం పూర్తిగా పరిష్కరించి మరీ వెళ్ళాలి మీరు. అనుభవాలు 2 విశాఖపట్టణం పంపాలి. పోషకులకూ తక్కినవారికీ, రాజమండ్రిలో మైలవరపూ, వింజమూరీ, రామచంద్రపురంలో దువ్వూరీ, చావలీ, వేపామాత్రమే యిచ్చాను. వేపావారు 116 - ఇస్తానన్నారు. ఇప్పుడే కొంత ఇవ్వవచ్చు. కాకినాడ సాహిత్యవేత్తగారంటే శ్రీ పార్థసారథిగారు. వారికి నాయెడ చాలా దయ. మీరు చెప్పితే నాకు గాని నా కుటుంబానికిగాని వారేమైనా సాయం చేసి చేయించవచ్చు.
నాకుటుంబం చెట్టు క్రింద వుంది. మీరు సాయం చెయ్యండి. విశాఖలోకూడా ఏమైనా వీలవుతుందేమో చూడండి.
గుంటూరిలో చావలిసూర్యనారాయణగారు (I.L.T.D. లేబరుఆఫీసరు) 66-00 ఇవ్వాలి. ప్రయత్నం చెయ్యండి. వారు రామచంద్రపుర గాంధీ డాక్టరుగారి అన్నగారు. డాక్టరు ద్వారా ప్రయత్నించండి. డాక్టరుగారున్నూ రామచంద్రపురం మిత్రుల చేతయేమైనా చేయించవచ్చు. నెల్లూరు శివరామయ్య గారేమైనా పంపవచ్చు. డాక్టరు కనక రాజుగారున్నూ చెయ్యవచ్చు.
శ్రీ నాగేశ్వరరావుగారి విషయం - వారికి అభ్యుదయం నా చేతనై నంతా కలిగించాలనుకున్నాను. భగవంతుడిలా చేశాడు. నేను వ్యర్థుణ్ణయిపోయాను. స్నేహితులైనందుకు మీకీ శ్రమమాత్రం కలిగిస్తున్నాను.
నాగేశ్వరరావుగారి వ్యవహారం మీరే పరిష్కరించడం నా ఆశ. మీరు మిక్కిలీ ఘనంగా సన్మానించారు. మీకు శ్రమమాత్రమే కలిగించాన్నేను. శ్రీసింహాచలంగారి<noinclude><references/>
{{rh|అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3||569}}</noinclude>
s7y351qcei57jeiawp2cyg8da65g8xn
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/594
104
204227
555612
532016
2026-05-06T17:37:06Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555612
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>స్నేహం నాకు మహామేరువు. వారికి నా కృతజ్ఞత సరిగా చూపించలేక పోయాను.
మీకు నేను బరువైనట్టే నిశ్చయం. మీలాగ మనసిచ్చిన వారు నాకు మరొకరులేరు. మీ రుణం తీర్చుకోలేను. అది తీర్చుకోడానికయినా మరో జన్మం యెత్తుతాను. ఒకటికాదు, పదివంద ఎత్తుతాను. ఒక సామాన్యుడికి మీరూ సింహాచలం గారూ కనకాభిషేకం చేయించారు. ఇది నాకు పరమేశ్వరుడు చేయించలేనిది.
ఇలాటిస్థితిలో నేను భారం అయిపోతున్నాను. విచారించను. అది తీర్చుకోడాని కయినా మరోజన్మ యెత్తుతాను కనక.
నాకేమీ విచారం లేదు. నా భార్య నన్న నేకవిధాల కాపాడింది. చిన్నప్పణ్ణుంచీ దాన్ని కష్టపెట్టాను. గాని సుఖపెట్ట లేకపోయాను. ఇప్పుడు ఇక ఆ వూసేలేదు కదా?
నిరర్థక జన్మ అయిపోయింది నాది.
రచనలయినా సాపురాసి అన్నీ జాతికి సమర్పించుకో లేక పోయాను.
పరమేశ్వరుడు మీకు సకల సుఖాలూ కలిగించాలి. సారస్వత సేవలో మీకు సాఫల్యం పూర్తిగా కలిగించాలి. మీ కలం జాతిని ఉద్ధరిస్తుంది.
{{rh|||(సం)}}
{{rh|||'''శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.'''}}
{{c|☆ ☆ ☆ ☆ ☆}}
{{c|<big>'''ఈ “అనుభవాలూ -జ్ఞాపకాలూను”'''</big>}}
{{c|శ్రీ శాస్త్రిగారి అకాలమరణమువల్ల మూడవ సంపుటముతో ఆఖరు.}}<noinclude><references/>
{{rh|570||శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.}}</noinclude>
l63nuy0egl8vfcw73nj9uzvck81i5wo
పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/596
104
204228
555613
531130
2026-05-06T17:38:42Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
555613
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" /></noinclude>{{p|fs200|ac}}శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి</p>
{{p|fs200|ac}}అనుభవాలూ - జ్ఞాపకాలూను</p>
మిక్కిలి అపూర్వమైన గ్రంథం యిది. అంటే, మన తెనుగు వాఙ్మయంలో యీరకం గ్రంథాల కిదే మొదటిది.
మొదట వైదిక విద్యలు నేర్చుకొని, 13వ ఏటనే కథలు రాయడం ప్రారంభించి, అగత్యం అయి తెనుగు పాండిత్యం
గడించుకోడంలోనూ రచన చెయ్యడంలోనూ, శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ఎదురుకొన్న ప్రతిబంధకాలూ, అనుభవించిన నిర్బంధాలూ, పొందిన ఆవేదనా, పట్టిన దీక్ష చేసిన సాధనా, ఆ సాధనలో వారు కనపరిచిన పరాకాష్ఠా, తత్ఫలితంగా
వారు పొందిన విజయాలూ, గ్రంథ ప్రకటనకు కలిగిన - కలుగుతూనూ వున్న యిబ్బందులూ - ఈవివరాలు పాఠకుల హృదయాలు కరిగించడమే కాదు, రసమహిమలున్నూ చేస్తాయి చదివితే.
అనేక చోట్ల - అనేక సందర్భాల్లో - అనేక మాట్లు రాతప్రతిని చదివించుకుని విని అనేకులు మిక్కిలి ముగ్ధులయివున్నారు.
{{c|<big><big>వెల: రూ.180/-</big></big>}}<noinclude><references/></noinclude>
55hmco7zgfvn8qu0fmtdav81ldan04g
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/319
104
211767
555594
552139
2026-05-06T16:07:31Z
A.Murali
3019
555594
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''84. మచ్చ వీరయ్య'''</p>}}
{{right|- డా॥ బి.వి.ఎస్. స్వామి}}
మచ్చ బీరయ్య తండ్రి, తాతల ఊరు బావుపేట (ఆసిఫ్ నగర్). జిల్లా కరీంనగర్. బావుపేటలో బండి పోశెట్టి అనే గురువు వద్ద శిష్యరికం చేసి తాత్విక చింతన అలవరచుకొన్నాడు. ప్రతి దినం కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే జ్ఞానబోధ, భజన కీర్తనలు పాడుతూ భగవన్నామ స్మరణలో కాలం గడిపేవాడు. పేద కుటుంబం. పని చేస్తేనే పొట్ట గడిచే పరిస్థితి. ఇలాంటి స్థితిలో బక్కయ్య అకాల మరణం చెందాడు. ఆయనను నమ్ముకున్న భార్యాపిల్లలు వీధినపడ్డారు. దాయాదులు చేరదీయలేదు. భార్య లక్ష్మమ్మ పుట్టినిల్లు బెజ్జంకి మండలంలోని గునుకుల కొండాపురం. దిక్కులేని కూతురితోపాటు ఐదేండ్ల మనమడు, రెండేండ్ల మనమరాలిని అమ్మమ్మలన బూట్ల అమ్మవ్వ తమ ఇంటికి తీసుకొని వచ్చి పెంచి పెద్ద చేసింది. మేనమామ బూట్ల వీరయ్య కూడా పిల్లలకు అండగా నిలిచాడు.
ఈ విధంగా కొండాపురంలో ఆశ్రయం పొందిన మచ్చ వీరయ్య ఆ ఊరికి రెండు కి.మీ. దూరంలో ఉన్న గుండ్లపల్లెకు
వెళ్ళి 3వ తరగతి వరకు చదువుకున్నాడు. విద్యాగురువు శ్రీ రామానుజం అయ్యవారు. ఆయన దగ్గర బాల
రామాయణం పూర్తిగా చదువుకున్నాడు. రాముని గుణగణాలను విని తదుపరి రామాయణమంతా చదివాడు. సీతారాముల కష్టసుఖాలు హృదయంలో నిలుపుకున్నాడు. ఎన్ని కష్టాలెదురైనా భగవంతునిపై భారం వేసి ఆయన
స్మరణలోనే కాలం గడిపాడు. 14వ యేట మేనమామ కూతురు బుచ్చి రామక్కతో వివాహం జరిగింది. మేనమామ
మరణంతో కుటుంబ భారం పైనపడింది. చనిపోవడానికి ముందు మేనమామ తనకున్న కొద్దిపాటి పొలాన్ని, పెరడును, కొడుక్కు అల్లునికి సమానంగా పంచి ఇచ్చాడు. బావమరిది పనికి వంగలేని సోమరిపోతు అవడంవల్ల పొలం పనులతోపాటు, చేనేత వృత్తికూడా మచ్చ వీరయ్య చేసాడు. ముందుగా చెల్లెలి పెండ్లి, తర్వాత బావమరిది మరియు ఇద్దరు మరదండ్ల పెండ్లిళ్లు చేసి స్వంతంగా ఇల్లు కట్టుకొని వేరే కాపురం పెట్టాడు. వీరయ్యకు నలుగురు సంతానం. ఒక కొడుకు, ముగ్గురు బిడ్డలు, కొడుకుకు 14 సం. వయస్సు రాగానే 1964లో కరీంనగర్ లోని పద్మనగర్కు మకాం మార్చి అతని చదువుపై దృష్టి పెట్టాడు. నేత వృత్తితోపాటు పాల వ్యాపారం కూడా చేస్తూ కొడుకును ఎం.ఏ. చదివించాడు. అతని పేరు హరిదాసు. ఆయనకు లెక్చరర్ ఉద్యోగం రాగానే వీరయ్య అన్ని పనులు మానుకొని జీవత పర్యంతం భగవచ్చింతనలోనే కాలం గడిపాడు.
ఇంతటి జీవిత నేపథ్యం, అనుభవం ఆయనను కవితామార్గం పట్టించాయి. అందుకే ఆయన సహజకవి, ఆశుకవి. ఒక్కమాట చెప్పాలంటే వరకవి. బాల్యం నుండి సీస పద్యాలు, కందపద్యాలు, కందార్థ దరువులు, తత్త్వాలు,
భజన కీర్తనలు ఆలపించేవాడు. ఐతే అప్పటికి యతిప్రాసలు,<noinclude><references/></noinclude>
q129hxd0spczc5wggs34uhulkpw6p6t
555595
555594
2026-05-06T16:09:04Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555595
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''84. మచ్చ వీరయ్య'''</p>}}
{{right|- డా॥ బి.వి.ఎస్. స్వామి}}
మచ్చ బీరయ్య తండ్రి, తాతల ఊరు బావుపేట (ఆసిఫ్ నగర్). జిల్లా కరీంనగర్. బావుపేటలో బండి పోశెట్టి అనే గురువు వద్ద శిష్యరికం చేసి తాత్విక చింతన అలవరచుకొన్నాడు. ప్రతి దినం కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే జ్ఞానబోధ, భజన కీర్తనలు పాడుతూ భగవన్నామ స్మరణలో కాలం గడిపేవాడు. పేద కుటుంబం. పని చేస్తేనే పొట్ట గడిచే పరిస్థితి. ఇలాంటి స్థితిలో బక్కయ్య అకాల మరణం చెందాడు. ఆయనను నమ్ముకున్న భార్యాపిల్లలు వీధినపడ్డారు. దాయాదులు చేరదీయలేదు. భార్య లక్ష్మమ్మ పుట్టినిల్లు బెజ్జంకి మండలంలోని గునుకుల కొండాపురం. దిక్కులేని కూతురితోపాటు ఐదేండ్ల మనమడు, రెండేండ్ల మనమరాలిని అమ్మమ్మలన బూట్ల అమ్మవ్వ తమ ఇంటికి తీసుకొని వచ్చి పెంచి పెద్ద చేసింది. మేనమామ బూట్ల వీరయ్య కూడా పిల్లలకు అండగా నిలిచాడు.
ఈ విధంగా కొండాపురంలో ఆశ్రయం పొందిన మచ్చ వీరయ్య ఆ ఊరికి రెండు కి.మీ. దూరంలో ఉన్న గుండ్లపల్లెకు
వెళ్ళి 3వ తరగతి వరకు చదువుకున్నాడు. విద్యాగురువు శ్రీ రామానుజం అయ్యవారు. ఆయన దగ్గర బాల
రామాయణం పూర్తిగా చదువుకున్నాడు. రాముని గుణగణాలను విని తదుపరి రామాయణమంతా చదివాడు. సీతారాముల కష్టసుఖాలు హృదయంలో నిలుపుకున్నాడు. ఎన్ని కష్టాలెదురైనా భగవంతునిపై భారం వేసి ఆయన
స్మరణలోనే కాలం గడిపాడు. 14వ యేట మేనమామ కూతురు బుచ్చి రామక్కతో వివాహం జరిగింది. మేనమామ
మరణంతో కుటుంబ భారం పైనపడింది. చనిపోవడానికి ముందు మేనమామ తనకున్న కొద్దిపాటి పొలాన్ని, పెరడును, కొడుక్కు అల్లునికి సమానంగా పంచి ఇచ్చాడు. బావమరిది పనికి వంగలేని సోమరిపోతు అవడంవల్ల పొలం పనులతోపాటు, చేనేత వృత్తికూడా మచ్చ వీరయ్య చేసాడు. ముందుగా చెల్లెలి పెండ్లి, తర్వాత బావమరిది మరియు ఇద్దరు మరదండ్ల పెండ్లిళ్లు చేసి స్వంతంగా ఇల్లు కట్టుకొని వేరే కాపురం పెట్టాడు. వీరయ్యకు నలుగురు సంతానం. ఒక కొడుకు, ముగ్గురు బిడ్డలు, కొడుకుకు 14 సం. వయస్సు రాగానే 1964లో కరీంనగర్ లోని పద్మనగర్కు మకాం మార్చి అతని చదువుపై దృష్టి పెట్టాడు. నేత వృత్తితోపాటు పాల వ్యాపారం కూడా చేస్తూ కొడుకును ఎం.ఏ. చదివించాడు. అతని పేరు హరిదాసు. ఆయనకు లెక్చరర్ ఉద్యోగం రాగానే వీరయ్య అన్ని పనులు మానుకొని జీవత పర్యంతం భగవచ్చింతనలోనే కాలం గడిపాడు.
ఇంతటి జీవిత నేపథ్యం, అనుభవం ఆయనను కవితామార్గం పట్టించాయి. అందుకే ఆయన సహజకవి, ఆశుకవి. ఒక్కమాట చెప్పాలంటే వరకవి. బాల్యం నుండి సీస పద్యాలు, కందపద్యాలు, కందార్థ దరువులు, తత్త్వాలు,
భజన కీర్తనలు ఆలపించేవాడు. ఐతే అప్పటికి యతిప్రాసలు,<noinclude><references/>
{{rh|తెలంగాణ |298 | తేజోమూర్తులు}}</noinclude>
gh8e1klzl8u6xut8zjt2im834pt77uv
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/320
104
211768
555596
552140
2026-05-06T16:30:52Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555596
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
ఛందస్సు తెలిసిన వయసుకాదు. శేషప్ప, సిద్దప్ప, సుమతి, వేమనలను బాగా చదివాడు. కవితా మర్మాలు అంతగా
తెలియకున్నా కొన్నివందల పద్యాలను, గేయాలను, కీర్తనలను, తత్త్యాలను ఆశువుగా పలికి "భక్తితత్త ప్రకాశిక
(1987), "శ్రీ వాణీ స్తోత్రము” మరియు హితబోధ (1999) అనే పుస్తకాలను అచ్చువేయించాడు. 1977లో రాసిన
రామశతకం "భక్తితత్త్వ ప్రకాశిక”లో కనపడుతుంది. శ్రీ వాణీకృవ, తాడ్వాయి శబరిమాత ఆశీర్వాదబలంతో తాను
రచనలు చేసినట్లు చాలాచోట్ల చెప్పుకున్నాడు. వీరయ్య సీన పద్యాల మూస శేషన్న పద్యాలను పోలి ఉంటుంది.
అప్పుడప్పుడు ప్రపంచ నడవడిని గమనించి కవిధోరణిలో అశువుగా పాటలు, గేయాలు రాసి పాడుకునే అలవాటు
వీరయ్యకు సహజంగానే అలవడింది.
'''కవితా ప్రస్థానం'''
1. భక్తి తత్త్వ ప్రకాశిక: ఇది వాణీస్తుతితో ప్రారంభమవుతుంది. ఈ సీస పద్యంలో ఆరు పెద్ద పాడాలు తదుపరి గీతపద్యంలో ఎనిమిది పాదాలు కనిపిస్తాయి. భావ పరిపూర్తి కొరకు రాసినట్లు తోస్తుంది.
<poem>మకుటం: "బాసరాదేవి! కృపనీదె వాసిగాను
దాస హృదయేశ్వరీ! నిన్ను దలతు జనని!"</poem>
అప్పకావ్యంగాని, ఛందస్సుగాని చదవకుండానే కేవలం వాణీమాత పాదపద్మాలను మాత్రమే నమ్మి రాస్తున్నానంటాడు ఈ పద్యంలో శ్రీవాణి తాను రాయబోయే పద్యాలలో వెలిగి సకల జనులకు ఆ భావమెరిగించి, వారికి సద్బుద్ధి కలిగించి, తత్త్వం తెలిసిన జ్ఞానులకు ముక్తిని ప్రసాదించాలని భక్తుల పక్షాన మొదలిడుతున్నాడు. ఇదే పుస్తకంలో "రామ శతకము" 108 పద్యాలలో కందాలలో రచించాడు శ్రీకారంలో మొదలు పెట్టాడు. మనిషి జన్మ అన్ని జన్మలలోకి ఉత్తమమైనది. దాన్ని సద్వినియోగం చేయాలంటే ఎల్లప్పుడూ భగవంతుని ధ్యాసలోనే జీవితం గడపాలి. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే పంచేంద్రియాలను భగవంతుని స్మరణలో లీనం చేయాలని ఈ క్రింద పద్యంలో చెప్పాడు.
<poem>
"వినరా చెవితో శబ్దము -
అవరా నోటెపుడు నీవు హరిశ్రీ యనుచున్
పనిరా యిది పోయెదనుక-
కనరా నీ ముందు వెలుగు కన్నుల రామా</poem>
వయసు మీరిన తర్వాత కూడా వీరు జ్యోతిష్యం, వాస్తు, పంచాంగం ఆసక్తితో నేర్చుకున్నాడు. ఇంటికి వచ్చిన పేదలు ఏమైనా ఇస్తే తీసుకునేవాడు. లేదంటే లేదు. సజ్జన సాంగత్యం, కలుపుగోలుతనం, నిరంతర ఈశ్వరధ్యానం -వీరయ్యకు అబ్బిన సుగుణాలు. అవే ఈ క్రింది పద్యంలో కొలువుదీరాయి.
<poem>
“వినవలె మంచిదె, కనవలె
- తనవలె లోకము, అనవలె మనవారనియున్
కనవలె శ్రీ గురుమూర్తినె -
తినవలె తన చేతి చెమట తియ్యన రామా”
అసంతృప్తి, స్వార్ధములతో ఏర్చే మనిషి, దేవుని కోసం దేవులాడడని వాపోతున్నాడు కవి.
"పొట్టున్న బట్టకోడ్చును
బట్టుపొట్టున్న తోడు బాధకు యేడ్చున్
మెట్టుకు తోడున్న వెనుక -
యెట్లా అని డబ్బుకేడ్చు యెప్పుడు రామా”</poem>
పేదవాడు కట్నాలిచ్చి వరులను కొనుక్కోవడమెంత కష్టమో అనుభవించినవాడు కనుక వీరయ్య స్త్రీ జన పక్షపాతంతో వరకట్నాలపై తన నిరసన గళాన్ని వినిపిస్తున్నాడు.
<poem>
ఆడా మగావాడు పెరిగె
ఈడా పిల్లేమొపెరిగి ఇంపుగ చూడన్
ఈడూ జోడూ అక్కర -
ఆడదాన్నెందుకంట అడుగుట రామా
పిల్లను గన్నా తండ్రికి -
ఉల్లాసంబిట్లు వుండు పుర్విలో చూడన్
తెల్లముగ తెలుసుకొనక -
కొల్లలుగా డబ్బు గుంజకోరిరి రామా!</poem>
ఈ శతకంలో దాదాపు 15 పద్యాల్లో వరకట్న దురాచారం గురించి ఏ కరువు పెట్టడాన్ని చూస్తే వీరయ్య మనసును ఈ కట్న పిశాచి ఎంతగా కలచివేసిందో అర్థమవుతుంది. ఇచ్చినవాడు ఈగ అంటారు కాని నా<noinclude><references/>
{{rh|తెలంగాణ |299 | తేజోమూర్తులు}}</noinclude>
a8j5czk8d3h22oiopws2iixm3nd5myn
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/321
104
211769
555598
552141
2026-05-06T16:42:01Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555598
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
దృష్టిలో పులి అంటాడొక సందర్భంలో "యోగా - ధ్యానం”ల యుగం ఇది. ఇయమిత పద్ధతిలో వీటి ప్రచారం, ఆచరణలు సాగుతున్నకాలం ఇది. వీటి సారాంశాన్ని ఆనాడే ఈ విధంగా చెప్పాడు.
<poem>
తినవలె మితాహారము -
అనవలె శ్రీరామ యనుచు అనుదినమందున్
కనుగొని పని చేయగవలె -
వియముతో మెదలి మంచి వినవలె రామా!</poem>
ఈ పుస్తకంలో మచ్చ వీరయ్య 14 కందార్థ దరువులు రచించాడు. కందపద్యపు మొదటి పాదాల తర్వాత నాలుగవ
పాదం దరువుత కొనసాగుతుంది. ఈ విధమైన కంద పద్యాల మూలాలు కేవలం తెలంగాణలోనే కనిపించడం విశేషం.
మచ్చుకు ఒకటి.
<poem>
“మచ్చా” వంశమునందున -
యిచ్చతోనే బుట్టి యిచట" వీరయ్య పేరన్
మెచ్చియు లోకులు పిలువగ -
యిచ్చియు మేల్ వరమూ నాకూ
లయికనూ కాపాడూ వర్థిల్లజేసీ వాసిగా నేడూ
పుల్లా బాక్షిరో! నిన్నూ యెల్లా కాలము దలుతూ
మెల్లగా వచ్చీ నా కల్లారీ బోగొట్టి -
యికను కాపాడూ...</poem>
శ్రీ లక్ష్మీదేవి స్తోత్రం 2 పద్యాలు, వేంకటేశ్వర స్తోత్రం 6 పద్యాలు శివస్తోత్రం 17 పద్యాలు, శ్రీ వాణీస్తోత్రం 5 పద్యాలు - ఇవన్నీ సీస పద్యాల్లోనే రాయడం విశేషం. ఇంకా ఈ పుస్తకంలో భజనలు, మహిళహారతులు, కీర్తనలు, తత్వాలు, రాగతాళ యుక్తంగా రచింపబడ్డాయి.
క్రింది పద్యం మచ్చ వీరయ్య జీవితాన్ని స్వభావోక్తి రమ్యంగా అద్దంపట్టి చూపిస్తున్నది.
<poem>
సీ. అన్నంబు పెట్టంగ అడ్డగించను లేదు
దానమీయంగ వద్దనగలేదు
పరుల సొమ్ముకు నేను భ్రాంతి చెందను లేదు.
పరస్త్రీల పొందునే బడయలేదు...
గీ. దీన జన పోష! మాహేశ! దివ్యమూర్తి!
నాగభూషణ! ముక్కంటి! నన్ను బ్రోవు!
మూడు దినంబుల పోకడరా! అనే తత్త్వంలో
-తప్పదు మృత్యువు తనుపుకురా
యెప్పుడొ తెలువదు యెరుగవురా
పాముకు బుసము విడిచిన విధము -
పారిపోయెదవు కనుమికరా</poem>
అని హెచ్చరిస్తూ, భార్యాపిల్లలు, మిద్దెలు మేడలు, బంగారు - ఇవేవీ వెంటరావు, శాశ్వతమైనది. భగవత్సాన్నిధ్యమే. ఐతే దాని కొరకు తపస్సు చేయాల్సిందేమిలేదు. సాటి మనుషులకు సాయంచేస్తే చాలునంటూ... అందరొక్కటని ఆలోచించిన ఇందుధరుడు నీ యిష్టమైనమిక అని లోకానికి చాటి చెప్తాడు.
“ప్రపంచ నడవడి" పేరుతో వీరయ్య 14 కవితలల్లాడు. లోకం పోకడలను గమనించి అప్పటికప్పుడే కైగట్టి ఆలపించినవి ఇవి. జనాభా పెరుగుదల గూర్చి ఇట్లంటాడు.
<poem>
"విలువా మేముందీ, లోకం -
బలూ పెరుగుతుందీ
మోటారెక్కిన సీటు దొరుకదు.
హోటలు బోయిన చోటు దొరుకదు
బాట నడచినా బిందుకొరగవలె
చోటు కుత్తమై చొరబడకష్టము" ॥విలువ|
సీ. పదియేండ్ల వయసులో పరికల్బు కలియుచు
బాలునప్పుడే చాల బాధపడితి
వితృసుఖమును లేక పీడింపబడుచుండి
అమ్మమ్మ యింటిలో నణగియుంటి
మేనమామకు తోడుగా నేను మెలగుచు
కాలంబు గడిపితి కరువులోనె
జనకుని యెడబాసి శనిగరం రోడ్డుకు
తట్ట మోసితి నేను గుట్టుదనుక
గీ. కొనకు నిను జేరవలెనను కోర్కెతోడ
వేడుకొనుచుంటి నా పైన ప్రేమ జూపు
ఆ యనంతసాగర గిరులలందు వెలయు
రాగి దానచోట నిలిచిన రాణి! వాణి!
'''హితబోధ'''
"పుత్రా” మకుటుంలో 58 కింద వాక్యాల్లో రాసిన శతకమిది.<noinclude><references/>
{{rh|తెలంగాణ |300 | తేజోమూర్తులు}}</noinclude>
asm58kq6oni6tqhxlnskaaelufz7uf8
555599
555598
2026-05-06T16:44:24Z
A.Murali
3019
555599
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
దృష్టిలో పులి అంటాడొక సందర్భంలో "యోగా - ధ్యానం”ల యుగం ఇది. ఇయమిత పద్ధతిలో వీటి ప్రచారం, ఆచరణలు సాగుతున్నకాలం ఇది. వీటి సారాంశాన్ని ఆనాడే ఈ విధంగా చెప్పాడు.
<poem>
తినవలె మితాహారము -
అనవలె శ్రీరామ యనుచు అనుదినమందున్
కనుగొని పని చేయగవలె -
వియముతో మెదలి మంచి వినవలె రామా!</poem>
ఈ పుస్తకంలో మచ్చ వీరయ్య 14 కందార్థ దరువులు రచించాడు. కందపద్యపు మొదటి పాదాల తర్వాత నాలుగవ
పాదం దరువుత కొనసాగుతుంది. ఈ విధమైన కంద పద్యాల మూలాలు కేవలం తెలంగాణలోనే కనిపించడం విశేషం.
మచ్చుకు ఒకటి.
<poem>
“మచ్చా” వంశమునందున -
యిచ్చతోనే బుట్టి యిచట" వీరయ్య పేరన్
మెచ్చియు లోకులు పిలువగ -
యిచ్చియు మేల్ వరమూ నాకూ
లయికనూ కాపాడూ వర్థిల్లజేసీ వాసిగా నేడూ
పుల్లా బాక్షిరో! నిన్నూ యెల్లా కాలము దలుతూ
మెల్లగా వచ్చీ నా కల్లారీ బోగొట్టి -
యికను కాపాడూ...</poem>
శ్రీ లక్ష్మీదేవి స్తోత్రం 2 పద్యాలు, వేంకటేశ్వర స్తోత్రం 6 పద్యాలు శివస్తోత్రం 17 పద్యాలు, శ్రీ వాణీస్తోత్రం 5 పద్యాలు - ఇవన్నీ సీస పద్యాల్లోనే రాయడం విశేషం. ఇంకా ఈ పుస్తకంలో భజనలు, మహిళహారతులు, కీర్తనలు, తత్వాలు, రాగతాళ యుక్తంగా రచింపబడ్డాయి.
క్రింది పద్యం మచ్చ వీరయ్య జీవితాన్ని స్వభావోక్తి రమ్యంగా అద్దంపట్టి చూపిస్తున్నది.
<poem>
సీ. అన్నంబు పెట్టంగ అడ్డగించను లేదు
దానమీయంగ వద్దనగలేదు
పరుల సొమ్ముకు నేను భ్రాంతి చెందను లేదు.
పరస్త్రీల పొందునే బడయలేదు...
గీ. దీన జన పోష! మాహేశ! దివ్యమూర్తి!
నాగభూషణ! ముక్కంటి! నన్ను బ్రోవు!
మూడు దినంబుల పోకడరా! అనే తత్త్వంలో
-తప్పదు మృత్యువు తనుపుకురా
యెప్పుడొ తెలువదు యెరుగవురా
పాముకు బుసము విడిచిన విధము -
పారిపోయెదవు కనుమికరా</poem>
అని హెచ్చరిస్తూ, భార్యాపిల్లలు, మిద్దెలు మేడలు, బంగారు - ఇవేవీ వెంటరావు, శాశ్వతమైనది. భగవత్సాన్నిధ్యమే. ఐతే దాని కొరకు తపస్సు చేయాల్సిందేమిలేదు. సాటి మనుషులకు సాయంచేస్తే చాలునంటూ... అందరొక్కటని ఆలోచించిన ఇందుధరుడు నీ యిష్టమైనమిక అని లోకానికి చాటి చెప్తాడు.
“ప్రపంచ నడవడి" పేరుతో వీరయ్య 14 కవితలల్లాడు. లోకం పోకడలను గమనించి అప్పటికప్పుడే కైగట్టి ఆలపించినవి ఇవి. జనాభా పెరుగుదల గూర్చి ఇట్లంటాడు.
<poem>
"విలువా మేముందీ, లోకం -
బలూ పెరుగుతుందీ
మోటారెక్కిన సీటు దొరుకదు.
హోటలు బోయిన చోటు దొరుకదు
బాట నడచినా బిందుకొరగవలె
చోటు కుత్తమై చొరబడకష్టము" ॥విలువ|
సీ. పదియేండ్ల వయసులో పరికల్బు కలియుచు
బాలునప్పుడే చాల బాధపడితి
వితృసుఖమును లేక పీడింపబడుచుండి
అమ్మమ్మ యింటిలో నణగియుంటి
మేనమామకు తోడుగా నేను మెలగుచు
కాలంబు గడిపితి కరువులోనె
జనకుని యెడబాసి శనిగరం రోడ్డుకు
తట్ట మోసితి నేను గుట్టుదనుక
గీ. కొనకు నిను జేరవలెనను కోర్కెతోడ
వేడుకొనుచుంటి నా పైన ప్రేమ జూపు
ఆ యనంతసాగర గిరులలందు వెలయు
రాగి దానచోట నిలిచిన రాణి! వాణి!</poem>
'''హితబోధ'''
"పుత్రా” మకుటుంలో 58 కింద వాక్యాల్లో రాసిన శతకమిది.<noinclude><references/>
{{rh|తెలంగాణ |300 | తేజోమూర్తులు}}</noinclude>
19g5mddn08qpqp1cef9nwb2h6q6seuk
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/322
104
211770
555600
552142
2026-05-06T16:51:10Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555600
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude><poem>
"జననీ జనకుల సాకెడి -తినయుండొకడైన
చాలు తనివిని గూర్చున్
జననీ జనకుల సాకిని - తనములు పెక్కున్ననేమి?
దండుగ పుత్రా?</poem>
ఈ పద్యం చదువుతుంటే "తల్లిదండ్రిమీద దయలేని పుత్రుడు" అనే వేమన పద్యం గుర్తుకురాకమానదు.
<poem>
"మంచి చెడు రెండు కులములు -
ఎంచిననివి కలువ వెప్పుడు చూడన్
మంచిని విడనాడకుమీ - వంచన, మరి చెడును
విడువవలమును పుత్రా</poem>
పై పద్యం చదువుతుంటే "మంచి చెడ్డలు మనుజులందున ఎంచి చూడగ రెండె కులములు" అని తెలిపిన గురజాడ జ్ఞప్తికి వస్తాడు.
లోకానికి కనుబిప్పు కలిగించాలన్న ఉద్దేశ్యంతో "పితృయజ్ఞములు" పేరుతో ఒక కరపత్రం తీశాడు. "తల్లిదండ్రులు బతికి ఉన్నంతకాలం వారిని ప్రేమతో ఆదరించడం కొడుకులు, కోడండ్ర కనీస ధర్మమనీ, అదే పితృయజ్ఞము, లేదా శ్రీద్ధ కర్మ అనీ" దాని సారాంశము.
<poem>
మాతాపితరులె మన దేవతలని మది గమనించండీ
జన్మనచ్చిన తల్లిదండ్రుల సేవలు చేయండి
వారే దేవతలను కోరాడీ
కనిపెంచిన ఈ జననీ జనకుల కరుణతో చూడండీ
వారినే దేవతలనుకోండి
ఇంటి దేవతల మరచిపోయి జగమంత
దిరుగకండీ....</poem>
అని ఒక పాటలో తెలిపిన మచ్చ వీరయ్య కాలాను గుణంగా కవిత్వం రాసాడు. 1919లో జన్మించిన వీరు తన 86వ యేట తేది 01.05.2005న పరమపదించారు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |301 | తేజోమూర్తులు}}</noinclude>
s56k1rlhtfs3oms3nqdlvjaaslfytnu
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/323
104
211771
555601
552143
2026-05-06T17:02:40Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555601
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''85. మాడపాటి హనుమంతరావు'''</p>}}
{{right|-డా॥ టి. గౌరీశంకర్}}
నిజాం నిరంకుశ పాలనలో అణగారిపోయి, నిద్రాణావస్థలో ఉన్న తెలంగాణా ప్రాంతానికి కొత్త ఊపిరులూది, మేల్కొలిపిన వైతాళికులలో మాడపాటి హనుమంత రావు అగ్రగణ్యులు. ఆ కాలంలో ఇక్కడి తెలుగు భాషను 'తెలంగీ - భేడంగీ' (ఒక ఆకారంలేని భాష) అని ఆనాటి అధికారులు ఎగతాళి చేసే సమయంలో తెలంగాణాలో తెలుగు భాషా సాంస్కృతిక పునరుజ్జీవనానికి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి హనుమంతరావు, గ్రంథాలయోద్యమం, సంఘ సంస్కరణ, వయోజన విద్య, స్త్రీ విద్య, మహిళాభ్యుదయం, సాహిత్య వికాసం, సాంస్కృతికాభివృద్ధి వంటి అనేక ఉద్యమాలలో పాల్గొని, తెలుగు జాతి ప్రగతికి పాటుపడినవారు మాడపాటి హనుమంతరావు. ఆయన ప్రత్యక్షంగా రాజకీయాలలోపాల్గొనక పోయినా, ఎందరో రాజకీయ నాయకులను తయారు చేసిన నిస్వార్థ సేవా పరాయణులు. అందుకే 'ఆంధ్రా పితామహుడు' అని ప్రజలందరి చేత కీర్తింపబడ్డాడు. ఆనాటి రాష్ట్రంలోని తెలుగువారి చేతనే గాక కన్నడిగులు, మరాఠీలు, ముస్లింలు - సమస్త ప్రజల చేత గౌరవాదరాభిమానాలు అందుకొన్నారు.
సామరస్యం, మృదుస్వభావం, నిరాడంబరత, నీతి నిజాయితీ, క్రమశిక్షణ, సత్ప్రవర్తన వంటివి ఆయనలోని విశిష్ట గుణాలు. అవి పుట్టుకతోనే అమరిన పెట్టని ఆభరణాలు! వీరిని మనవారు అటు జాతీయ స్థాయిలో, భారత రాజకీయాలలో కీలకపాత్ర పోషించిన 'గోపాలకృష్ణ గోఖలే'తో పోల్చటం వీరి వ్యక్తిత్వాన్ని తెలియ జేస్తుంది. మాడపాటి హనుమంతరావు 1885 జనవరి 22వ తేదీన కృష్ణాజిల్లా నందిగామ తాలూకా కొప్పునూరు గ్రామంలో జన్మించారు. తండ్రి వెంకటప్పయ్య, తల్లి వెంకట సుబ్బమ్మ. తండ్రి ఆ గ్రామ కరణంగా పనిచేశారు. హనుమంతరావు అయిదేళ్ళ వయసులో ఉండగానే తండ్రి మరణించాడు. దానితో సూర్యాపేటలో మేనమామ దగ్గర పెరిగారు. 1899లో ఉర్దూ మిడిల్ పరీక్ష పాసై, ఆ తరువాత హనుమకొండ ఉన్నత పాఠశాలలో చేరి మద్రాసు విశ్వవిద్యాలయ మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. 1904లో వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నెలకు రూ.40/- జీతంతో 'మీర మున్నీ' (హెడ్ గుమాస్తా) ఉద్యోగం ఎనిమిదేళ్ళపాటు చేశారు. ఆ తరువాత హైదరాబాదు వెళ్ళి, ప్రభుత్వ శాసన సభా విభాగంలో అనువాదకునిగా అయిదేళ్ళు పని చేశారు.
ఆ సమయంలోనే పట్టుదలతో ప్రైవేటుగా చదివి, న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. 1917 నుంచి న్యాయవాద వృత్తిని చేపట్టి ఇరవై ఏళ్ళపాటు ఆ వృత్తిలో కొనసాగారు. ఇది ఆయన జీవితంలో గొప్ప మలుపును తీసుకొని వచ్చింది. చిన్నతనంలోనే హనుమంతరావు కందుకూరి వీరేశలింగం పంతులు సంఘ సంస్కరణోద్యమానికి, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు సాహిత్యోద్యమానికి, నాటి జాతీయోద్యమంలో భాగమైన వందేమాత<noinclude><references/>
{{rh|తెలంగాణ |302 | తేజోమూర్తులు}}</noinclude>
pw8xzknlagph3u20ixdrxlq19upvq7a
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/324
104
211772
555606
552144
2026-05-06T17:20:05Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555606
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
రోద్యమానికి అత్యంత ప్రభావితులైనారు. వీటి ఫలితంగానే వీరు నాటి హైదరాబాదు సంస్థానంలోని ఉద్యమాలకు
ఊతంగా నిలిచారు.
తెలుగు భాష పట్ల ఆయనకు అపారమైన అభిమానం. ఒకసారి ‘హిందూ సంఘ సంస్కరణ సభ 1921 నవంబరు
12వ తేదీ రాత్రి హైదరాబాదులోని వివేకవర్ధనీ ఉన్నత పాఠశాల సభా మందిరంలో జరుగుతుంది. పూణె మహిళా
విశ్వవిద్యాలయ సంస్థాపకుడు దొందే వంత్ కార్యే దీనికి అధ్యక్షత వహించాడు. వక్తలు ఉర్దూ, మరాఠీ, కన్నడ,
భాషలలో మాట్లాడారు. మాడపాటి వారు తమ మాతృభాష అయిన తెలుగులో మాట్లాడారు. ఆయన మీద ఉన్న
గౌరవంతో అక్కడ ఉన్నవారు ఆయన ప్రసంగాన్ని విన్నట్లు నటించారు. మరొక నాయకుడు తెలుగులో మాట్లాడు తుంటే అభ్యంతర పెట్టారు. తెలుగులో మాట్లాడరాదని అవమానించారు. ఇందుకు మాడపాటి వారు బాధపడ్డారు, మనసు నొచ్చుకున్నారు. చివాల్న లేచి సమావేశం నుంచి వెళ్ళిపోయారు. వారి ఆత్మాభిమానం దెబ్బతిన్నది. తెలుగువారి వ్యక్తిత్వాన్ని నిరూపించడానికి ఆ రాత్రికి రాత్రే తెలుగు వారంతా కలిసి 'నిజాం రాష్ట్ర ఆంధ్ర జన సంఘం' అన్న దానిని స్థాపించారు. దానికి మాడపాటి వారిని కార్యదర్శిగా నియమించారు. 1923లో హనుమకొండలో ఏర్పడిన ఈ కేంద్ర సంఘం కొద్ది కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా యాభై స్థానిక సంఘాలుగా విస్తరించింది. 1930లో జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన ప్రథమాంధ్ర మహాసభ జరిగింది. నాటి నుండి 1945 దాకా ప్రతి ఏటా ఈ మహాసభలు జరిగాయి. 1935లో సిరిసిల్లలో జరిగిన మహాసభకు హనుమంతరావు అధ్యక్షతన వహించారు. ఇది రాజకీయ సభకాదనీ, తెలుగు జాతి అభ్యుదయానికి పాటువడే సాంస్కృతిక సంఘమని నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించడానికి మాడపాటి ఎంతగానో ప్రయత్నించారు.
ఆ రోజులలో ప్రజలలో రాజకీయ చైతన్యం కలిగించడానికీ, భాషా సాంస్కృతికాభిమానం వారిలో పెంపొందించదానికీ గ్రంథాలయాలు ప్రధాన కేంద్రాలుగా పనిచేశాయి. ఆ రోజులలో గ్రామ ప్రజల మీద పటేల్-పట్వారీలు, పోలీసులు జులుం బాగానే ఉండేది. రైతుల్ని అన్యాయంగా పన్నుల వసూళ్ళ పేరుతో పీడించేవారు. వెట్టిచాకిరీలు చేయించు కొనేవారు. అటువంటి దుర్భర పరిస్థితులలో ఉన్న గ్రామీణులను విజ్ఞానవంతులను చేయడానికి గ్రంథాలయాలు, రైతుల సమస్యల పరిష్కారానికి రైతు సంఘాలు, వ్యాపార వాణిజ్య పరిస్థితులు చక్కబెట్టడానికి వర్తక సంఘాలు వెలిశాయి.
ఒకవైపు స్వాతంత్య్ర సముపార్ధనాకాంక్ష, వేరొక వైపు ప్రజాహిత సేవా కార్యక్రమ తత్పరత, మరొకవైపు గ్రంథాలయ
పురోగతి నిరతి - ఈ మూడు మాడపాటి వారిలో ముప్పిరిగొని వారిని ముందుకు నడిపించాయి. ఆ రోజులలో గ్రంథాలయ సభలు, సాంస్కృతిక సభలు జరపడం నిజాం ప్రభుత్వం దృష్టిలో ఘోరమైన నేరం. వీటిని చట్టపరంగా
ఎదుర్కొని నిలదొక్కుకోవడంలో హనుమంతరావు కృషి మరువరానిది. గ్రంథాలయ వ్యాప్తిలో వీరు బాగా కృషి
చేశారు. 1904 జనవరి 26న హనుమకొండలో శ్రీ రాజరాజనరేంద్ర గ్రంథాలయ భవనం శంకుస్థాపన చేయించారు.
1912 నాటికి దానిని పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచారు. 1914–15లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయానికి
కార్యదర్శిగా పనిచేశారు. అంతకుముందే 1912లో డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి గారిని ఆహ్వానించి గ్రంథాలయ
స్వంత భవనానికి ప్రారంభోత్సవం జరిపించారు. హైదరాబాదులోని గౌలిగూడ ప్రాంతంలో 'బాలసరస్వతీ గ్రంథాలయం' నాంపల్లిలోని ఎత్తయిన గుట్టమీద 'వేమన' గ్రంథాలయం స్థాపనలో, వాటి అభివృద్ధిలో మాడపాటి వారు ముఖ్యభూమికను పోషించారు.
ఆనాటి ప్రభుత్వం వాక్ స్వాతంత్య్రాన్ని, పత్రికా స్వేచ్ఛను అణచివేస్తుంటే అందుకు నిరసనగా ఆంధ్రమహాసభ
ఆందోళన చేపట్టింది. క్రమంగా పౌరహక్కుల పరిరక్షణకు పూనుకొని, ప్రజలను సంఘటితపరచింది. ప్రజలు తమ
హక్కులను గుర్తించేటట్లు చేసింది. ప్రజా సమస్యలపై కరపత్రాలు అచ్చువేసి, పుస్తకాలు ప్రచురించింది. 'ఆంధ్ర
మహాసభ సంస్థాన ప్రజలలో గొప్ప సంచలనాన్ని సృష్టించింది. మహిళా సభలను జరుపుతూ స్త్రీలలో చైతన్యాన్ని
రగిలించింది.
ఆనాడు మాడపాటివారు స్త్రీ విద్యా విషయికంగా చేసిన కృషి ప్రత్యేకించి పేర్కొనదగినది. 1926లో హైదరాబాదు
లోని నారాయణగూడ ప్రాంతంలో ఆంధ్రబాలికోన్నత పాఠశాలను స్థాపించి, మాతృభాష అయిన తెలుగు మాధ్యమంలో బోధనను నడిపించారు. అది ఈనాటికీ<noinclude><references/>
{{rh|తెలంగాణ |303 | తేజోమూర్తులు}}</noinclude>
4ng6b665njame4pgt0le7yvcp88cii7
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/325
104
211773
555610
552145
2026-05-06T17:29:40Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555610
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
వెలుగొందుతుంది. అదే విధంగా రావు బహద్దూరు వెంకట్రామారెడ్డి మహిళా కళాశాల ఏర్పాటులో కూడా మాడపాటి వారి ప్రమేయం ప్రముఖమైంది.
మాడపాటివారు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో మంచి ప్రావీణ్యాన్ని గడించారు. ఫారసీ, మరాఠీ భాషలలో
కూడా పరిచయం ఉంది. ఆయా భాషలలో పలు రచనలు చేశారు. తెలుగులో నవలలు, కథలు రాశారు. తెలంగాణలో 'నీలగిరి పత్రిక', 'గోలకొండ పత్రిక', 'దేశబంధు', 'సుజాత' వంటి వార్తా పత్రికలు, ఇతర పత్రికలు మాడపాటి వారి తోడ్పాటుతోనే పెంపొందాయి. 'ముషీరె దక్కన్' అనే ఉర్దూ పత్రికకు వీరు చాలాకాలం సంపాదకీయాలు రాశారు. 'తెలంగాణ ఆంధ్రోద్యమం', 'రోమన్ సామ్రాజ్య చరిత్ర, 'క్షేత్రకాలపు హింద్వార్యులు', 'గారీ ఖాళీ జీవితం', 'రాజ్యాంగ సంస్కరణలు' మొదలైన గ్రంథాలు రచించారు. 'పర్షియన్ కవుల'పై పలు వ్యాసాలు రచించారు. బంకించంద్ర ఛటర్జీ 'ఆనంద మఠం' నవలను తెనిగించారు. వివిధ తెలుగు, ఉర్దూ పత్రికలలో కథలు, కథానికలు రాశారు. వీటిలో కొన్నింటిని 'మల్లికాగుచ్ఛము' అనే పేరుతో ప్రచురించారు.
1946లో మాడపాటి హనుమంతరావు షష్టి పూర్తి ఉత్సవం జరిగింది. హైదరాబాదులో కడప కోటిరెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి వంటి ప్రముఖుల ఆధ్వర్యంలో ఈ సభలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారిని రూపాయి నాణెలతో తులాభారం తూగించారు. 'హనుమంత రాయ సంచిక' పేరుతో ప్రత్యేక సంచికను వెలువరించారు.
వివిధ ప్రదేశాలలో సత్కార సభలు జరిపి, సన్మాన పత్రాలు సమర్పించారు. ప్రజలు భూరి విరాళాలు అందించారు. ఆ సొమ్ములో అధికభాగం ఆయన మహిళా విద్యాలయాలకే వినియోగించారు. మిగిలిన మొత్తంతో 'ఆంధ్ర చంద్రికా
గ్రంథమాల'ను స్థాపించి, దాని పక్షాన 'ప్రాచీనాంధ్ర నగరములు', 'రాజకీయ పరిజ్ఞానం', 'నిజాం ఆంధ్రోద్యమం' వంటి పుస్తకాలను అచ్చొత్తించారు. ఆయన తన జ్ఞాపకాలతో 'ఆంధ్రోద్యమ చరిత్ర' రాశారు.
1951 నుంచి 1954 వరకు మాడపాటి హనుమంతరావు హైదరాబాదు నగర కార్పొరేషన్కు మూడుసార్లు మేయర్గా పనిచేశారు. 1968లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి తొలి అధ్యక్షుడై, ఆరేళ్ళు సభా కార్యక్రమాలను నిరాటంకంగా నిర్వహించారు. 1955లో భారత ప్రభుత్వం వీరికి 'పద్మభూషణ్' బిరుదు నిచ్చి గౌరవించింది. ఈ బిరుదు ఆనాడు పొందిన తొలి తెలుగు వ్యక్తి ఇతనే కావడం గమనార్హం. 1956 నవంబర్ 4వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయం వీరికి గౌరవ డాక్టరేట్ డి.లిట్ ను ప్రదానం చేసింది. ఆ విశ్వవిద్యాలయం సెనేట్లో శాశ్వత సభ్యులుగా ఉన్నారు. ఆయన గౌరవార్ధం ఆయన పేరిట అక్కడ బంగారు పతకాన్ని ఏర్పాటు చేశారు. 1966లో 'హైదరాబాదు కో- ఆపరేటివ్ యూనియన్ కు కార్యదర్శిగా ఉన్నారు. 'సహకారోద్యమ' వ్యాప్తికి పాటుపడినందుకుగాను, మాడపాటి వారికి 'సహకార రత్న' అనే బిరుదు నిచ్చారు. 'జీవరక్ష ప్రచారిణీ సంఘం', 'హిందూ మత సంస్కార సంఘం', 'ఆది హిందూ సేవాసమితి' మొదలైన వాటితో వారికి సంబంధం ఉండేది. 'ఆర్య సమాజం', 'బ్రహ్మ సమాజం', 'దివ్యజ్ఞాన సమాజాల' తో కలసి పనిచేశారు. ఆ రోజుల్లో ఆయన చేపట్టని ఉద్యమమే లేదు, ఆయన చేయూత నివ్వని సంస్ధయే లేదు. మాడపాటి వారు అగ్రవర్ణానికి చెందిన వారైనప్పటికీ వెనుకబడిన వర్గాల వారికి, నిమ్న కులాల వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, వారిని ముందుంచే వారు. 'ఆంధ్ర మహిళా సభకు మాడపాటి వారి సతీమణి శ్రీమతి మాణిక్యమ్మ నాల్గవ అధ్యక్షులుగా ఎన్నికై సమర్ధంగా దానిని నడిపించారు.
ఇంతటి ఉదాత్త చరిత్ర కలిగిన మాడపాటి హనుమంతరావు 1970 నవంబర్ 11వ తేదీన, తన 86వ యేట కన్ను మూశారు. 1972లో వారి ఏకైక కుమారుడు సుకుమార్, 1980లో వారి సతీమణి పరమపదించారు. 1985 ఏప్రిల్ 4వ తేదీన మాడపాటి హనుమంతరావు శత జయంత్యుత్సవం జరిగింది. దానిలో ప్రజాసేవకు అంకితమైన ఆయన జీవిత విశేషాలను సంస్కరిస్తూ, పరిపూర్ణ జీవితాన్ని అనుభవించిన ధన్యజీవిగా ఆయనకు నివాళు అర్చించారు.
ఆనాటి కౌన్సిల్లో ప్రతిపక్షనాయకుడైన మగ్దూం మొహియుద్దీన్ 'తన ఉన్నతాదర్శాలతో, త్యాగాలతో ఏ ఒక్క పార్టీ అభిమానాన్నేగాక ఆయన యావదాంధ్రుల అభిమానాన్ని చూరగొన్నారు' అని మాడపాటి హనుమంతరావును ప్రస్తుతించారు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |304 | తేజోమూర్తులు}}</noinclude>
jk4m9fv45eg6zb6plyas7vfmvhim7f4
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/302
104
212747
555588
554984
2026-05-06T13:30:35Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555588
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=మ.|lines=<poem>యమరాడ్దూతశిఖావతంసము <ref>చ. నిరప్రాణంబు</ref>చిరప్రాణంబు దూరప్రియా
గమశంసిస్ఫుటకాకలీకలను మేకప్రక్రియాపాత<ref>క. దీక్షము, చ.ట. వీక్షము</ref>వీ
క్షము శీతర్తు బలీయ మొక్కబలిభుగ్రాజంబు రాజిల్లు శ్రీ
రమణాగార పురోధరోర్థచలపత్రస్థూలశాఖాశిఖన్.</poem>|ref=213}}
'''టీక'''. యమురాడ్దూతశిఖావతంసము = యమునిదూతలలో శ్రేష్ఠమయినదియు - యమదూతలకు తలమానికమైనదియు [కాకి యరిష్టమగుటచే దానిని చూచువారికి చావు తప్పదని కవిభావము.] చిరప్రాణంబు = చాలకాలము జీవించునది; దూర...కలనము = దూరప్రదేశమునందున్న యిష్టజనులరాకను తెలియఁజేయు స్పష్టమైన ధ్వని కలది; [వెనుకటిటీకలో ఈ సమస్తపదము రెండు పదములుగా విభజింపబడి 'దూర...శంసి — దూర = దూరమునందలి; ప్రియ = ఇష్టవస్తువుయొక్క; ఆగమ = రాకను; శంసి = కోరునది; స్ఫుటకాకలీకలనము — స్ఫుట = స్పష్టముగా వినఁబడెడి; కాకలీ = సన్ననికంఠస్వరముతోడ; కలనము = కూడినది' అని వ్రాయఁబడినది. ఈ వ్రాఁత సరికాదని చదువరు లెఱుఁగకపోరు.] కాకి యింటిపై వ్రాలి యరచినచో చుట్టములు వచ్చుచున్నారని ఆయఱపు సూచించుచున్న దనుట ఎల్లరకుఁ దెలిసినవిషయమే గదా! ఏకప్రక్రియాపాకవీక్షము = ఒంటికంటిచూపు కలది; [పూర్వటీకలో ఇదట 'ఏకక్రియాపాతదీక్షము' అను పాఠము గ్రహించబడి 'ఒకవిధమైన పాటునందలి దీక్ష (నియమము) కలది' అని యర్థము వ్రాయఁబడుట సరికాదని గ్రహింపనగును.] బలిభుగ్రాజంబు = బలిమెతుకులు తిని బ్రదుకునది - గొప్పకాకి; శ్రీరమణా...శిఖన్ — శ్రీరమణాగార = విష్ణుదేవునిగుడియొక్క; పురోధరోత్థ = ఎదుటనున్న స్థలముపై పుట్టిన; చలపత్ర = రావిచెట్టుయొక్క; స్థూలశాఖాశిఖన్ = లావుపాటికొమ్మచివఱను, రాజిల్లున్ = ప్రకాశించెను. '''అలం'''. పరికరము.
{{Telugu poem|type=శా.|lines=<poem>తాతల్తండ్రులు మామ<ref>చ.ట. లల్లుడులు</ref>లల్లురును ముత్తాతల్ సహాయుల్ సహ
శ్రోతల్ భ్రాతలు సేవకుల్ హితులు మిత్రుల్ పుత్త్రు లోలిం దివా
భీతాభీతములై తనుం గొలువఁగాఁ బె<ref>చ.ట. న్మూకయై</ref>న్మూకలై వాయస
వ్రాఁత<ref>చ. శ్రేష్ఠులు</ref>శ్రేష్ఠము గ్రాలు రేలు పగలున్ బ్రాంతాగమాంతంబులన్.</poem>|ref=214}}
'''టీక'''. సహకశ్రోతల్ = సహాధ్యాయులు; ఓలిన్ = క్రమముగా; దివాభీత+అభీతములై = గ్రుడ్లగూబలకు భయపడనివయి; పెన్మూకలై = పెద్దగుంపుగా కూడినవయి; తనున్, కొలువఁగా; వాయసవ్రాఁతశ్రేష్ఠము = కాకులలో ఉత్తమమైనది; ప్రాంతాగమాంతంబులన్ = సమీపవృక్షముల చివఱిభాగము (కొన)లందు; రేలుపవలుల్ = రాత్రింబగళ్లు; క్రాలున్ = ప్రకాశించును - ఒప్పును.
{{Telugu poem|type=చ.|lines=<poem>అది యొకనాఁడు విట్టలగృహాంగణభూబలిపీఠవర్తులౌ
మెదుకులు మేయఁ గన్నిడి యమేయగతిన్ బరవన్ దదాయత
చ్ఛదభవభూరిమారుతవశంబున నయ్యెడ ధూళివోవ న
భ్యుదితములయ్యె దాన గుడి యూడ్చినఁ గల్గు నగణ్యపుణ్యముల్.</poem>|ref=215}}
'''టీక'''. విట్ఠల...వర్తులౌ = పాండురంగని దేవాలయపు వాకిట నున్న బలిపీఠముపయి నున్నవైన; అమేయగతిన్ = శీఘ్రగమనమున; పరవన్ = ఎగురఁగా; తదాయతచ్ఛదభవభూరిమారుతవశంబునన్ = దాని వెడల్పైనఱెక్కలవలన పుట్టిన పెద్దగాలివలన; అయ్యెడ = ఆచోట; ధూళివోవన్ = దుమ్ము (లేకుండ)పోఁగా; దానన్ = ఆకారణమువలన; అగణ్యపుణ్యముల్ = లెక్కింపరాని పుణ్యములు; అభ్యుదితములు = కలిగినవి; అయ్యెన్.<noinclude><references/></noinclude>
4an3r2ar4b4co2ildodyz31yabd89gc
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/303
104
212748
555614
554985
2026-05-06T20:33:39Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555614
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>ఇ ట్లతర్కితోపపన్నంబగు పన్నగశయనసవనసమార్జనసముదితసుకృతపరిపాకం
బునఁ గాకంబు నతిలోకం బయ్యె వినుము.</poem>|ref=216}}
'''టీక'''. అతర్కితోపపన్నంబు = అనుకొనకుండ తటస్థించినది; పన్నగ...పరిపాకంబునన్ = శ్రీవిష్ణుని దేవాలయమును ఊడ్చుటవలన కలిగిన పుణ్యమునకు ఫలముగ; అతిలోకంబు = లోకోత్తరమైనది - గొప్పది.
{{Telugu poem|type=క.|lines=<poem>కలహంస మొకటి యదుకుల, కులహంసముగుడిఁ జరించుఁ గుసుమాయుధకీ
ర్తిలతాగుచ్ఛముకైవడి, జలరుహసంభవమరాళసంకాశగతిన్.</poem>|ref=217}}
'''టీక'''. యదుకులకులహంసముగుడిన్ = యాదవకులమున ఉత్తముఁడగు శ్రీకృష్ణుని దేవాలయమున; కుసుమా...కైవడిన్ = మన్మథునికీర్తి యను లతకు పూవుగుత్తివలెను; అల...గతిన్ = బ్రహ్మవాహనమైన హంసపోలికను; చరించున్ = తిరుగును. '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు వర్తించి వర్తించి.</poem>|ref=218}}
'''టీక'''. వర్తించి = సంచరించి.
{{Telugu poem|type=మ.|lines=<poem>కుతుకం బింకక కుంకుమద్రవమిళద్గోరోచనాపంకని
ర్మితపత్రాంకకలంకితాంబుధికుమారీహారివక్షోరుహ
ద్వితయాస్ఫాలనలాలనోచితపయోవిస్ఫారికాసారసం
తతి నా నీడభవంబు క్రీడ సలుపున్ దద్దివ్యధామంబునన్.</poem>|ref=219}}
'''టీక'''. కుతుకంబు = ఉత్సాహము; ఇంకక = తగ్గక; ఆ నీడభవంబు = గూటిలోపుట్టు ఆ హంస;
కుంకుకు . . . ...సంఠలిజా" - కుంకుమద్రవ = ద్రవరూపమైన కుంఠుముతో; మిళత్ - కూడుచున్న; గోరోచనాపంక = ముద్దగా నున్న గోరోచనముచే; నిర్మిత = కూర్చబడిన; పంక = మకరికాపత్రచిహ్నములచే; కలుషిత = కలంకముకలవిగా - మలినములుగా చేయబడిన; అంబుధికుమారీ, హారివక్షోరుహద్వితయ = లక్ష్మీదేవియొక్క మనోహరమైన రెండుకుచములయొక్కయు; ఆస్ఫాలనలాలనా = చఱచుటయొక్క విలాసమునకు; ఉచిత = తగిన; పయోవిస్ఫార =ఎక్కువైన నీటితోఁ గూడిన; కాసారసంతతిన్ = సరస్సులసమూహమునందు; తద్దివ్యధామంబునన్ = ఆపుణ్యస్థలమునందు ['ఆ దేవాలయ
మున' అని పూర్వటీక.]; క్రీడ సలుపున్ = విహరించును.
ఆ క్షేత్రమునఁ గల సరస్సులలో పాండురంగని దేవేరియగు లక్ష్మీదేవి జలక్రీడలాడుచుండును;
ఆమె నీటిలో మునిఁగి తేలుచున్నపుడు అలలవలన ఆ నీరు ఆమెవక్షోజములను చఱచుచున్నట్లుండును. ఆమె తన స్తనములపయి కుంకుమతో కలిపిన గోరోచనముచే మకరికాదులచిత్రములను చిత్రించుటచే స్నానసమయమున అవి కరఁగి నీటిలో కలియుటచే ఆ నీరు పంకిలమై మనోహరముగ నున్నది; అట్టి గొప్ప సరస్సులందు ఆ హంస విహరించుచు ఆనందించుచుండెనని భావము. '''అలం'''. ఉదాత్తము.
{{Telugu poem|type=సీ.|lines=<poem>మొన రెండు గాఁగఁ ద్రెవ్విన విద్రుమద్రుకందము నేలు ముక్కునఁ దడని తడవి
<ref>క. మొగ. చ.శ.ర. మొగి</ref>మొగి విచ్చు పసిఁడిగేదఁగిగమి మించు విశదచ్చ<ref>క. ములను, శ.ర. మ్ముల</ref>మ్ముల విద్రిచివిద్రిచి
నగుమొగంబుల దాసనపుఁ గ్రొవ్విరులనవ్వు చిగురాకు నడుగులఁ జిమ్మి చిమ్మి
నిద్దంపుఁబడువెన్నెలగుత్తి కడకొత్తి మరియు మైముంపులఁ గలఁచి కలఁచి</poem>|ref=}}<noinclude><references/></noinclude>
ksyl13iuprjosv4l4xe362kkawln1ny
555615
555614
2026-05-06T20:37:32Z
దేవీప్రసాదశాస్త్రి
4290
555615
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>ఇ ట్లతర్కితోపపన్నంబగు పన్నగశయనసవనసమార్జనసముదితసుకృతపరిపాకం
బునఁ గాకంబు నతిలోకం బయ్యె వినుము.</poem>|ref=216}}
'''టీక'''. అతర్కితోపపన్నంబు = అనుకొనకుండ తటస్థించినది; పన్నగ...పరిపాకంబునన్ = శ్రీవిష్ణుని దేవాలయమును ఊడ్చుటవలన కలిగిన పుణ్యమునకు ఫలముగ; అతిలోకంబు = లోకోత్తరమైనది - గొప్పది.
{{Telugu poem|type=క.|lines=<poem>కలహంస మొకటి యదుకుల, కులహంసముగుడిఁ జరించుఁ గుసుమాయుధకీ
ర్తిలతాగుచ్ఛముకైవడి, జలరుహసంభవమరాళసంకాశగతిన్.</poem>|ref=217}}
'''టీక'''. యదుకులకులహంసముగుడిన్ = యాదవకులమున ఉత్తముఁడగు శ్రీకృష్ణుని దేవాలయమున; కుసుమా...కైవడిన్ = మన్మథునికీర్తి యను లతకు పూవుగుత్తివలెను; అల...గతిన్ = బ్రహ్మవాహనమైన హంసపోలికను; చరించున్ = తిరుగును. '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు వర్తించి వర్తించి.</poem>|ref=218}}
'''టీక'''. వర్తించి = సంచరించి.
{{Telugu poem|type=మ.|lines=<poem>కుతుకం బింకక కుంకుమద్రవమిళద్గోరోచనాపంకని
ర్మితపత్రాంకకలంకితాంబుధికుమారీహారివక్షోరుహ
ద్వితయాస్ఫాలనలాలనోచితపయోవిస్ఫారికాసారసం
తతి నా నీడభవంబు క్రీడ సలుపున్ దద్దివ్యధామంబునన్.</poem>|ref=219}}
'''టీక'''. కుతుకంబు = ఉత్సాహము; ఇంకక = తగ్గక; ఆ నీడభవంబు = గూటిలోపుట్టు ఆ హంస; కుంకుమ...సంతతిన్ — కుంకుమద్రవ = ద్రవరూపమైన కుంకుమతో; మిళత్ = కూడుచున్న; గోరోచనాపంక = ముద్దగా నున్న గోరోచనముచే; నిర్మిత = కూర్పఁబడిన; పంక = మకరికాపత్రచిహ్నములచే; కలుషిత = కలంకము కలవిగా - మలినములుగా చేయబడిన; అంబుధికుమారీ, హారివక్షోరుహద్వితయ = లక్ష్మీదేవియొక్క మనోహరమైన రెండుకుచములయొక్కయు; ఆస్ఫాలనలాలనా = చఱచుటయొక్క విలాసమునకు; ఉచిత = తగిన; పయోవిస్ఫార =ఎక్కువైన నీటితోఁ గూడిన; కాసారసంతతిన్ = సరస్సులసమూహమునందు; తద్దివ్యధామంబునన్ = ఆపుణ్యస్థలమునందు ['ఆ దేవాలయ
మున' అని పూర్వటీక]; క్రీడ సలుపున్ = విహరించును.
ఆ క్షేత్రమునఁ గల సరస్సులలో పాండురంగని దేవేరియగు లక్ష్మీదేవి జలక్రీడలాడుచుండును;
ఆమె నీటిలో మునిఁగి తేలుచున్నపుడు అలలవలన ఆ నీరు ఆమెవక్షోజములను చఱచుచున్నట్లుండును. ఆమె తన స్తనములపయి కుంకుమతో కలిపిన గోరోచనముచే మకరికాదులచిత్రములను చిత్రించుటచే స్నానసమయమున అవి కరఁగి నీటిలో కలియుటచే ఆ నీరు పంకిలమై మనోహరముగ నున్నది; అట్టి గొప్ప సరస్సులందు ఆ హంస విహరించుచు ఆనందించుచుండెనని భావము. '''అలం'''. ఉదాత్తము.
{{Telugu poem|type=సీ.|lines=<poem>మొన రెండు గాఁగఁ ద్రెవ్విన విద్రుమద్రుకందము నేలు ముక్కునఁ దడని తడవి
<ref>క. మొగ. చ.శ.ర. మొగి</ref>మొగి విచ్చు పసిఁడిగేదఁగిగమి మించు విశదచ్చ<ref>క. ములను, శ.ర. మ్ముల</ref>మ్ముల విద్రిచివిద్రిచి
నగుమొగంబుల దాసనపుఁ గ్రొవ్విరులనవ్వు చిగురాకు నడుగులఁ జిమ్మి చిమ్మి
నిద్దంపుఁబడువెన్నెలగుత్తి కడకొత్తి మరియు మైముంపులఁ గలఁచి కలఁచి</poem>|ref=}}<noinclude><references/></noinclude>
j6igbujqbhagoo36btztuysj9zhfv10
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/304
104
212749
555616
554986
2026-05-06T21:36:43Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555616
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>శార్ఙ్గిసౌధప్రమాణకాసారసార
సారసామోదమేదురవారిఁ దేలి
వచ్చి యా యంద గుడిలోనఁ జొచ్చె నొక్క
నాఁడు పవలింటి <ref>చ.ట. పేరెండ</ref>బీఱెండవేఁడి దలఁకి.</poem>|ref=220}}
'''టీక'''. ఆ యంచ, ఒక్కనాఁడు, మొన = చివఱిభాగము; రెండుగాఁగన్, త్రైవ్విన = రెండుగా చీలిన; విద్రుమద్రుమకందమును ఏలు = పగడపువృక్షముయొక్క దుంపను, పాలించు = అనఁగా చివఱ రెండుగా చీలిన పగడపుదుంపవలెనున్న; ముక్కునన్ = ముక్కుతో; మొగివచ్చు = మొత్తముగా విరిసిన ['మొగవిచ్చు = ముఖభాగము విరియునట్టి' అని పూర్వటీక]; పసిఁడిగేదఁగిఱేకుగమిన్ = బంగారువన్నెకల మొగలిఱేకులగుంపును; మించు = అతిశయించు; విశదచ్ఛదమ్ములన్ = అందమైన ఱెక్కలకు; విద్రిచి, విద్రిచి = విదలించి, విదలించి, నగుమొగంబులు = బాగుగా వికసించిన; నిద్దంపు = నునుపైన - తేటయైన; వెన్నెలగుత్తి = వెన్నెలగుంపును; కడకొత్తి = త్రోసివేసి; మలయు = విజృంభించు; మైన్ = దేహమును; ముంపులన్ = మునుఁగుటలచే; కలచి = చలింపజేసి; శార్ఙ్గి...వారిన్ = విష్ణుదేవుని దేవాలయపుమొగసాలయందలి కొలనిలోని చక్కని కమలముల పరిమళములతోఁ గూడిన నీటియందు; పవలింటిబీఱెండవేడిన్ = మధ్యాహ్నపు మిక్కుటపుటెండయొక్క వేడిమిచే; తలఁకి = భయపడి. '''అలం''' ఉపమ, స్వభావోక్తి.
{{Telugu poem|type=క.|lines=<poem>అది తనదేహం బచ్చట, విదలింపం బక్షసలిలవిప్రుషములచేఁ
జొదు కొదవించుచు గాడ్పులు, పొదవెట్టు <ref>చ. కపో</ref>రజోవికారములు దూరముగన్.</poem>|ref=221}}
'''టీక'''. పక్షసలిలవిప్రుషములచేన్ = ఱెక్కలవలని నీటితుంపరలచే; చొదుకు, ఒదవించుచున్ = చలిని, పుట్టి౦చుచు; గాడ్పులు = గాలులు; రజోవికారములు, దూరముగన్ = దుమ్ముయొక్క వ్యాపించుటలు దూరము; అగునట్లుగా; పొదపెట్టున్ = కలిగించును - చేయును. ['పొదవెట్టు = కలుగఁజేయునట్టి' అని పూర్వటీక. ఈ టీకను గ్రహించుచో క్రియాపదము లుప్తమైపోవుచున్నది.]
{{Telugu poem|type=తే.|lines=<poem>సలిలఖగమున కేతదాచరణమునన, గలిగె నాకస్మికంబుగఁ గంబుపాణి
గర్భగేహోపలేపసంస్కారసార, సుకృతపరిపాకనిరపాయశోభనంబు.</poem>|ref=222}}
'''టీక'''. సలిలఖగమునకున్ = నీటిపక్షికి - హంసకు; ఏతదాచరణమునన = ఇట్లు చేయఁటచేతనే - రెక్కలనీటితుంపరను విదలించినమాత్రమున; కంబుపాణి...శోభనంబు —కంబుపాణి = శ్రీకృష్ణునియొక్క; గర్భగేహ = గర్భాలయముయొక్క; ఉపవేపసంస్కార = అలుకుటవలని; సార = మేలైన; సుకృతపరిపాక = పుణ్యఫలమువలన; నిరపాయశోభనంబు = అపాయము లేని - నశింపని - శుభము; కలిగెన్ = లభించెను.
{{Telugu poem|type=క.|lines=<poem>శుక మొకటి చంచుజితకిం, శుకమై హరిహయశరాససురుచిరవపురం
శుకమై కుసుమాకరకిం, శుక <ref>చ.ట. మును పేరెసఁగనంద</ref>మానందమున నందసుతు గుడిఁ బెరుగున్.</poem>|ref=223}}
'''టీక'''. శుకము, ఒకటి = ఒక్కచిలుక; చుంచుజితకింశుకమై = ముక్కుచే జయింపఁబడిన
మోదుగుమొగ్గ కలదయి - మోదుగుమొగ్గవంటి యెఱ్ఱనిముక్కు కలదయి; హరిహయశరాస, సురుచిర, వపురంశుక మై = ఇంద్రధనుస్సువలె, చక్కని; శరీరముయొక్క, కాంతులు కలదయి; కుసుమాకరకింశుకము = వసంతఋతువునకు మోదుగు అయినది - ప్రధానమయినదనుట; నందసుతుగుడిన్ = పాండురంగని దేవాలయమున; పెరుగున్. '''అలం'''. ఉపమ, రూపకము.<noinclude><references/></noinclude>
oo8xhaophjzc8scbhqgo7dzhk0ct17x
555617
555616
2026-05-06T21:37:40Z
దేవీప్రసాదశాస్త్రి
4290
555617
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>శార్ఙ్గిసౌధప్రమాణకాసారసార
సారసామోదమేదురవారిఁ దేలి
వచ్చి యా యంద గుడిలోనఁ జొచ్చె నొక్క
నాఁడు పవలింటి <ref>చ.ట. పేరెండ</ref>బీఱెండవేఁడి దలఁకి.</poem>|ref=220}}
'''టీక'''. ఆ యంచ, ఒక్కనాఁడు, మొన = చివఱిభాగము; రెండుగాఁగన్, త్రైవ్విన = రెండుగా చీలిన; విద్రుమద్రుమకందమును ఏలు = పగడపువృక్షముయొక్క దుంపను, పాలించు = అనఁగా చివఱ రెండుగా చీలిన పగడపుదుంపవలెనున్న; ముక్కునన్ = ముక్కుతో; మొగివచ్చు = మొత్తముగా విరిసిన ['మొగవిచ్చు = ముఖభాగము విరియునట్టి' అని పూర్వటీక]; పసిఁడిగేదఁగిఱేకుగమిన్ = బంగారువన్నెకల మొగలిఱేకులగుంపును; మించు = అతిశయించు; విశదచ్ఛదమ్ములన్ = అందమైన ఱెక్కలకు; విద్రిచి, విద్రిచి = విదలించి, విదలించి, నగుమొగంబులు = బాగుగా వికసించిన; నిద్దంపు = నునుపైన - తేటయైన; వెన్నెలగుత్తి = వెన్నెలగుంపును; కడకొత్తి = త్రోసివేసి; మలయు = విజృంభించు; మైన్ = దేహమును; ముంపులన్ = మునుఁగుటలచే; కలచి = చలింపజేసి; శార్ఙ్గి...వారిన్ = విష్ణుదేవుని దేవాలయపుమొగసాలయందలి కొలనిలోని చక్కని కమలముల పరిమళములతోఁ గూడిన నీటియందు; పవలింటిబీఱెండవేడిన్ = మధ్యాహ్నపు మిక్కుటపుటెండయొక్క వేడిమిచే; తలఁకి = భయపడి. '''అలం''' ఉపమ, స్వభావోక్తి.
{{Telugu poem|type=క.|lines=<poem>అది తనదేహం బచ్చట, విదలింపం బక్షసలిలవిప్రుషములచేఁ
జొదు కొదవించుచు గాడ్పులు, పొదవెట్టు <ref>చ. కపో</ref>రజోవికారములు దూరముగన్.</poem>|ref=221}}
'''టీక'''. పక్షసలిలవిప్రుషములచేన్ = ఱెక్కలవలని నీటితుంపరలచే; చొదుకు, ఒదవించుచున్ = చలిని, పుట్టి౦చుచు; గాడ్పులు = గాలులు; రజోవికారములు, దూరముగన్ = దుమ్ముయొక్క వ్యాపించుటలు దూరము; అగునట్లుగా; పొదపెట్టున్ = కలిగించును - చేయును. ['పొదవెట్టు = కలుగఁజేయునట్టి' అని పూర్వటీక. ఈ టీకను గ్రహించుచో క్రియాపదము లుప్తమైపోవుచున్నది.]
{{Telugu poem|type=తే.|lines=<poem>సలిలఖగమున కేతదాచరణమునన, గలిగె నాకస్మికంబుగఁ గంబుపాణి
గర్భగేహోపలేపసంస్కారసార, సుకృతపరిపాకనిరపాయశోభనంబు.</poem>|ref=222}}
'''టీక'''. సలిలఖగమునకున్ = నీటిపక్షికి - హంసకు; ఏతదాచరణమునన = ఇట్లు చేయఁటచేతనే - రెక్కలనీటితుంపరను విదలించినమాత్రమున; కంబుపాణి...శోభనంబు — కంబుపాణి = శ్రీకృష్ణునియొక్క; గర్భగేహ = గర్భాలయముయొక్క; ఉపవేపసంస్కార = అలుకుటవలని; సార = మేలైన; సుకృతపరిపాక = పుణ్యఫలమువలన; నిరపాయశోభనంబు = అపాయము లేని - నశింపని - శుభము; కలిగెన్ = లభించెను.
{{Telugu poem|type=క.|lines=<poem>శుక మొకటి చంచుజితకిం, శుకమై హరిహయశరాససురుచిరవపురం
శుకమై కుసుమాకరకిం, శుక <ref>చ.ట. మును పేరెసఁగనంద</ref>మానందమున నందసుతు గుడిఁ బెరుగున్.</poem>|ref=223}}
'''టీక'''. శుకము, ఒకటి = ఒక్కచిలుక; చుంచుజితకింశుకమై = ముక్కుచే జయింపఁబడిన
మోదుగుమొగ్గ కలదయి - మోదుగుమొగ్గవంటి యెఱ్ఱనిముక్కు కలదయి; హరిహయశరాస, సురుచిర, వపురంశుక మై = ఇంద్రధనుస్సువలె, చక్కని; శరీరముయొక్క, కాంతులు కలదయి; కుసుమాకరకింశుకము = వసంతఋతువునకు మోదుగు అయినది - ప్రధానమయినదనుట; నందసుతుగుడిన్ = పాండురంగని దేవాలయమున; పెరుగున్. '''అలం'''. ఉపమ, రూపకము.<noinclude><references/></noinclude>
d60yc4a8pr13jb9xe3vaxktazk6ouo4
555618
555617
2026-05-06T21:38:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
555618
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>శార్ఙ్గిసౌధప్రమాణకాసారసార
సారసామోదమేదురవారిఁ దేలి
వచ్చి యా యంద గుడిలోనఁ జొచ్చె నొక్క
నాఁడు పవలింటి <ref>చ.ట. పేరెండ</ref>బీఱెండవేఁడి దలఁకి.</poem>|ref=220}}
'''టీక'''. ఆ యంచ, ఒక్కనాఁడు, మొన = చివఱిభాగము; రెండుగాఁగన్, త్రైవ్విన = రెండుగా చీలిన; విద్రుమద్రుమకందమును ఏలు = పగడపువృక్షముయొక్క దుంపను, పాలించు = అనఁగా చివఱ రెండుగా చీలిన పగడపుదుంపవలెనున్న; ముక్కునన్ = ముక్కుతో; మొగివచ్చు = మొత్తముగా విరిసిన ['మొగవిచ్చు = ముఖభాగము విరియునట్టి' అని పూర్వటీక]; పసిఁడిగేదఁగిఱేకుగమిన్ = బంగారువన్నెకల మొగలిఱేకులగుంపును; మించు = అతిశయించు; విశదచ్ఛదమ్ములన్ = అందమైన ఱెక్కలకు; విద్రిచి, విద్రిచి = విదలించి, విదలించి, నగుమొగంబులు = బాగుగా వికసించిన; నిద్దంపు = నునుపైన - తేటయైన; వెన్నెలగుత్తి = వెన్నెలగుంపును; కడకొత్తి = త్రోసివేసి; మలయు = విజృంభించు; మైన్ = దేహమును; ముంపులన్ = మునుఁగుటలచే; కలచి = చలింపజేసి; శార్ఙ్గి...వారిన్ = విష్ణుదేవుని దేవాలయపుమొగసాలయందలి కొలనిలోని చక్కని కమలముల పరిమళములతోఁ గూడిన నీటియందు; పవలింటిబీఱెండవేఁడిన్ = మధ్యాహ్నపు మిక్కుటపుటెండయొక్క వేఁడిమిచే; తలఁకి = భయపడి. '''అలం''' ఉపమ, స్వభావోక్తి.
{{Telugu poem|type=క.|lines=<poem>అది తనదేహం బచ్చట, విదలింపం బక్షసలిలవిప్రుషములచేఁ
జొదు కొదవించుచు గాడ్పులు, పొదవెట్టు <ref>చ. కపో</ref>రజోవికారములు దూరముగన్.</poem>|ref=221}}
'''టీక'''. పక్షసలిలవిప్రుషములచేన్ = ఱెక్కలవలని నీటితుంపరలచే; చొదుకు, ఒదవించుచున్ = చలిని, పుట్టి౦చుచు; గాడ్పులు = గాలులు; రజోవికారములు, దూరముగన్ = దుమ్ముయొక్క వ్యాపించుటలు దూరము; అగునట్లుగా; పొదపెట్టున్ = కలిగించును - చేయును. ['పొదవెట్టు = కలుగఁజేయునట్టి' అని పూర్వటీక. ఈ టీకను గ్రహించుచో క్రియాపదము లుప్తమైపోవుచున్నది.]
{{Telugu poem|type=తే.|lines=<poem>సలిలఖగమున కేతదాచరణమునన, గలిగె నాకస్మికంబుగఁ గంబుపాణి
గర్భగేహోపలేపసంస్కారసార, సుకృతపరిపాకనిరపాయశోభనంబు.</poem>|ref=222}}
'''టీక'''. సలిలఖగమునకున్ = నీటిపక్షికి - హంసకు; ఏతదాచరణమునన = ఇట్లు చేయఁటచేతనే - రెక్కలనీటితుంపరను విదలించినమాత్రమున; కంబుపాణి...శోభనంబు — కంబుపాణి = శ్రీకృష్ణునియొక్క; గర్భగేహ = గర్భాలయముయొక్క; ఉపవేపసంస్కార = అలుకుటవలని; సార = మేలైన; సుకృతపరిపాక = పుణ్యఫలమువలన; నిరపాయశోభనంబు = అపాయము లేని - నశింపని - శుభము; కలిగెన్ = లభించెను.
{{Telugu poem|type=క.|lines=<poem>శుక మొకటి చంచుజితకిం, శుకమై హరిహయశరాససురుచిరవపురం
శుకమై కుసుమాకరకిం, శుక <ref>చ.ట. మును పేరెసఁగనంద</ref>మానందమున నందసుతు గుడిఁ బెరుగున్.</poem>|ref=223}}
'''టీక'''. శుకము, ఒకటి = ఒక్కచిలుక; చుంచుజితకింశుకమై = ముక్కుచే జయింపఁబడిన
మోదుగుమొగ్గ కలదయి - మోదుగుమొగ్గవంటి యెఱ్ఱనిముక్కు కలదయి; హరిహయశరాస, సురుచిర, వపురంశుక మై = ఇంద్రధనుస్సువలె, చక్కని; శరీరముయొక్క, కాంతులు కలదయి; కుసుమాకరకింశుకము = వసంతఋతువునకు మోదుగు అయినది - ప్రధానమయినదనుట; నందసుతుగుడిన్ = పాండురంగని దేవాలయమున; పెరుగున్. '''అలం'''. ఉపమ, రూపకము.<noinclude><references/></noinclude>
51a8qbhqct33ig3t0lfuothyg74edve
555619
555618
2026-05-06T21:39:12Z
దేవీప్రసాదశాస్త్రి
4290
555619
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>శార్ఙ్గిసౌధప్రమాణకాసారసార
సారసామోదమేదురవారిఁ దేలి
వచ్చి యా యంద గుడిలోనఁ జొచ్చె నొక్క
నాఁడు పవలింటి <ref>చ.ట. పేరెండ</ref>బీఱెండవేఁడి దలఁకి.</poem>|ref=220}}
'''టీక'''. ఆ యంచ, ఒక్కనాఁడు, మొన = చివఱిభాగము; రెండుగాఁగన్, త్రైవ్విన = రెండుగా చీలిన; విద్రుమద్రుమకందమును ఏలు = పగడపువృక్షముయొక్క దుంపను, పాలించు = అనఁగా చివఱ రెండుగా చీలిన పగడపుదుంపవలెనున్న; ముక్కునన్ = ముక్కుతో; మొగివచ్చు = మొత్తముగా విరిసిన ['మొగవిచ్చు = ముఖభాగము విరియునట్టి' అని పూర్వటీక]; పసిఁడిగేదఁగిఱేకుగమిన్ = బంగారువన్నెకల మొగలిఱేకులగుంపును; మించు = అతిశయించు; విశదచ్ఛదమ్ములన్ = అందమైన ఱెక్కలకు; విద్రిచి, విద్రిచి = విదలించి, విదలించి, నగుమొగంబులు = బాగుగా వికసించిన; నిద్దంపు = నునుపైన - తేటయైన; వెన్నెలగుత్తి = వెన్నెలగుంపును; కడకొత్తి = త్రోసివేసి; మలయు = విజృంభించు; మైన్ = దేహమును; ముంపులన్ = మునుఁగుటలచే; కలచి = చలింపజేసి; శార్ఙ్గి...వారిన్ = విష్ణుదేవుని దేవాలయపుమొగసాలయందలి కొలనిలోని చక్కని కమలముల పరిమళములతోఁ గూడిన నీటియందు; పవలింటిబీఱెండవేఁడిన్ = మధ్యాహ్నపు మిక్కుటపుటెండయొక్క వేఁడిమిచే; తలఁకి = భయపడి. '''అలం''' ఉపమ, స్వభావోక్తి.
{{Telugu poem|type=క.|lines=<poem>అది తనదేహం బచ్చట, విదలింపం బక్షసలిలవిప్రుషములచేఁ
జొదు కొదవించుచు గాడ్పులు, పొదవెట్టు <ref>చ. కపో</ref>రజోవికారములు దూరముగన్.</poem>|ref=221}}
'''టీక'''. పక్షసలిలవిప్రుషములచేన్ = ఱెక్కలవలని నీటితుంపరలచే; చొదుకు, ఒదవించుచున్ = చలిని, పుట్టి౦చుచు; గాడ్పులు = గాలులు; రజోవికారములు, దూరముగన్ = దుమ్ముయొక్క వ్యాపించుటలు దూరము; అగునట్లుగా; పొదపెట్టున్ = కలిగించును - చేయును. ['పొదవెట్టు = కలుగఁజేయునట్టి' అని పూర్వటీక. ఈ టీకను గ్రహించుచో క్రియాపదము లుప్తమైపోవుచున్నది.]
{{Telugu poem|type=తే.|lines=<poem>సలిలఖగమున కేతదాచరణమునన, గలిగె నాకస్మికంబుగఁ గంబుపాణి
గర్భగేహోపలేపసంస్కారసార, సుకృతపరిపాకనిరపాయశోభనంబు.</poem>|ref=222}}
'''టీక'''. సలిలఖగమునకున్ = నీటిపక్షికి - హంసకు; ఏతదాచరణమునన = ఇట్లు చేయఁటచేతనే - రెక్కలనీటితుంపరను విదలించినమాత్రమున; కంబుపాణి...శోభనంబు — కంబుపాణి = శ్రీకృష్ణునియొక్క; గర్భగేహ = గర్భాలయముయొక్క; ఉపవేపసంస్కార = అలుకుటవలని; సార = మేలైన; సుకృతపరిపాక = పుణ్యఫలమువలన; నిరపాయశోభనంబు = అపాయము లేని - నశింపని - శుభము; కలిగెన్ = లభించెను.
{{Telugu poem|type=క.|lines=<poem>శుక మొకటి చంచుజితకిం, శుకమై హరిహయశరాససురుచిరవపురం
శుకమై కుసుమాకరకిం, శుక <ref>చ.ట. మును పేరెసఁగనంద</ref>మానందమున నందసుతు గుడిఁ బెరుగున్.</poem>|ref=223}}
'''టీక'''. శుకము, ఒకటి = ఒక్కచిలుక; చుంచుజితకింశుకమై = ముక్కుచే జయింపఁబడిన మోదుగుమొగ్గ కలదయి - మోదుగుమొగ్గవంటి యెఱ్ఱనిముక్కు కలదయి; హరిహయశరాస, సురుచిర, వపురంశుక మై = ఇంద్రధనుస్సువలె, చక్కని; శరీరముయొక్క, కాంతులు కలదయి; కుసుమాకరకింశుకము = వసంతఋతువునకు మోదుగు అయినది - ప్రధానమయినదనుట; నందసుతుగుడిన్ = పాండురంగని దేవాలయమున; పెరుగున్. '''అలం'''. ఉపమ, రూపకము.<noinclude><references/></noinclude>
05b94r7tojbbavqej92m0zgggla19gv
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/305
104
212750
555620
554987
2026-05-07T04:17:55Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555620
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=చ.|lines=<poem>అలమి త్రిలోకముల్ గెలుచు న<ref>చ. త్తతి</ref>త్తఱి తేరువహించు <ref>క. దోడి</ref>తోడిచి
ల్కలు దగదొట్టి ముందఱికి <ref>చ. లోగక</ref>లాగక యుండినఁ దాన తద్భరం
బెలమి వహింప మెచ్చి గురుఁ డిచ్చు మణీమయమాలికాత్రయిన్
గళమునఁ <ref>క. దాల్చు చిత్ర</ref>దాల్చుఁ జిత్రశుకనాథుఁడు రేఖలపేర నిచ్చలున్.</poem>|ref=224}}
'''టీక'''. అలమి = ఆక్రమించి; త్రిలోకముల్ = ముజ్జగములను; గెలుచునత్తఱి = గెలుచునట్టి యా సమయమున; తేరు, వహించు = రథమును లాగుచున్న; దగ్గ, దొట్టి = దప్పిపొందినపయి; తాన = తానే - ఈచిలుకయే; తద్భరంబు = ఆరథముబరువును; ఎలమిన్ = ప్రీతితో; వహింపన్ = మోయఁగా; మెచ్చి = కొనియాడి; మరుఁడు = మన్మథుఁడు; ఇచ్చు = బహూకరించునట్టి; మణీమయమాలికాత్రయిన్ = మూఁడుమణిహారములను; చిత్రశుకనాథుఁడు = రంగురంగుల - వన్నెలచిలుక; గళమునన్ = మెడయందు; రేఖలపేరన్ = రేఖలనెపమున; నిచ్చలున్ = శాశ్వతముగ; తాల్చున్ = ధరించును. '''అలం'''. అపహ్నుతి.
{{Telugu poem|type=క.|lines=<poem>కీర మది యొక్కహరిపరి, చారికచేరిక వసించుఁ జదివింపఁగ మే
పారసి యొసఁగ భవనమా, ర్జారాదులవలనఁ దన్ను సంరక్షింపన్.</poem>|ref=225}}
'''టీక'''. కీరము = చిలుక; హరిపరిచారికచేరికన్ = విష్ణుభక్తురాలిచనపున; మేపు = ఆహారము - తిండి; భవనమార్జారాదులవలనన్ = పెంపుడుపిల్లి మొదలగువానివలన.
{{Telugu poem|type=క.|lines=<poem>దేవాలయమునఁ గొన్ని, నిజావాసమునందుఁ గొన్ని యహము<ref>చ.ట. లరుగఁలై</ref>లు దగఁ బై
చే వదలక పాటించుచుఁ, బూవుంబలెఁ బువ్వుఁబోఁడి పులుఁగుం బ్రోచున్.</poem>|ref=226}}
'''టీక'''. నిజావాసమునందు = తనగృహమున; అహములు = దినములు; చేవదలక = విడువక; పాటించుచున్ = గమనించుచు; పులుగున్ = పక్షిని - చిలుకను.
{{Telugu poem|type=మ.|lines=<poem>పసుపార్చుం దడియొత్తు నెండసెకఁ గంపం బాఁగి మై దువ్వుచున్
వసయున్ వెన్నయు మేపు మేపు నొసఁగున్ వల్లించు శ్రీరామనా
మసుధామాధురిసాధురీతిఁ <ref>క. లికుచ</ref>గుచకుంభస్థాయిగాఁ జేయుచున్
బిసపుష్పప్రియవాసరాగమములన్ బింబోష్ఠి రాచిల్కకున్.</poem>|ref=227}}
'''టీక'''. పసుపార్చున్ = పసుపు పూసి, స్నానము చేయించును; ఎండసెకన్ = ఎండవలని వేఁడిమిచేతన్; కంపంబు = చలివలనఁ గలిగిన వణకును! ఆగి = ఆపి - పొఁగొట్టి; మేపున్ = ఆహారమును; మేపున్ = తినిపించును. శ్రీరామనామసుధామాధురికిన్ = శ్రీరామనామాకృతమాధుర్యమును; వల్లించున్ = తెలుపును - బోధించును; బిసపుష్పప్రియవాసరాగమములన్ = వసంతర్తుదినములు ప్రవేశింపఁగా; బింబోష్ఠి = దొండపండువంటి పెదవి కల వనిత - ఆ హరిదాసి.
{{Telugu poem|type=తే.|lines=<poem>కనకమణిపంజరంబుల నునిచి యునిచి
చక్కెఱయు నుక్కెఱయు <ref>చ. జాల</ref>సారె గ్రుక్కి క్రుక్కి
యొఱపుఁ బలుకులు పలుమాఱు గఱపి కఱపి
కలికిచిలుకలకొలికి రాచిలుకఁ బెనుచు.</poem>|ref=228}}
'''టీక'''. కనకమణిపంజరంబులన్ =మణులు తాపిన బంగారుపంజరములందు; ఉక్కెరయున్ = బెల్లపుభక్ష్యమును; సారె = మాటిమాటికిని; ఒఱపుఁబలుకులు = చక్కనిమాటలను; కఱపి = బోధించి; కలికిచిలుకలకొలికి = ముద్దుగుమ్మ యయిన ఆ హరిదాసి.<noinclude><references/></noinclude>
bq5lh5g215o3sjj60c09n7aet0l22q0
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/306
104
212751
555621
554988
2026-05-07T07:35:12Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555621
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=మ.|lines=<poem>కలహంసోపమయానఁ <ref>క. చక్ర</ref>జక్రకుచఁ <ref>క. ప్రేంఖ</ref>బ్రేంఖత్ఖంజరీటాక్షిఁ గో
కిలసారస్వర బర్హిబర్హ చికురం గీరప్రియాలాపఁ దొ
య్యలిఁ జాలన్ మరిగెన్ శుకం బది <ref>క. మహీయః, చ. గరీయః</ref>గరీయఃప్రేమ గావించుచున్
బులుఁగుం బొందున నంది పొందినగతిన్ బొత్తొత్తులన్ హత్తుచున్.</poem>|ref=229}}
'''టీక'''. శుకంబు, అది = ఆ చిలుక; గరీయఃప్రేమ = ఎక్కువ అనురాగమును; కావించుచున్ = కూర్చుచు; కలహంసోపమయానన్ = హంసనడకలవంటి నడకలు కలదానిని; చక్రకుడన్ = చక్రవాకములవలె గుండ్రనైన కుచములు కలదానిని; ప్రేంఖత్ ఖంజరీటాక్షిన్ = తిరుగుచున్న- కాటుకపిట్టవంటి (నల్లనైన) కన్నులు కలదానిని; కోకిలసారస్వరన్ = కోకిలమువంటి మధురమైన కంఠస్వరము కలదానిని; బర్హిబర్హచికురన్ = నెమలిపించెమువంటి చక్కనిజుట్టు కలదానిని; కీరప్రియాలాపన్ = చిలుకవలె చక్కగా మాటాడుదానిని; తొయ్యలిన్ = స్త్రీని - హరిదాసిని; పులుఁగుంబొందునన్ = పక్షియొక్క చేరికను; అంది, పొందినగతిన్ = అరమర లేక యున్నట్లుగా; పొత్తొత్తులన్, హత్తుచున్ = ఎక్కువ చేరిక, చనవులు కలిగినదయి అనుట; చాలన్, మరిగెన్ = ఎక్కువగా ప్రేమించి వెంట నంటెను. [పయివర్ణనమునుబట్టి హరిదాసియందు పక్షిసామాన్యగుణములే యుండుటవలన, ఆమె యొకవింతపక్షియే యని భావించి, బెదరు లేక చిలుక ఆమెతో కలిసి మెలిసి, ఆమెను విడువకుండెనని
భావము.] సయి వర్ణనమునను, పద్యమునఁ గల 'శుక' పదమువలనను ఇట్టి చక్కని యువతిని జూచిన, ఇంద్రియనిగ్రహమున గొప్పపేరు పడసిన శుకుఁడు (మహర్షి) కూడ ఆమెను మోహింపవలసియుండునని వ్యంగ్యము. '''అలం'''. పరికరము.
{{Telugu poem|type=తే.|lines=<poem>ఆ శుకద్విజరాజున కంతఁ గొంత, కాల మరుగంగ నొకనాఁడు కలిగె బంధ
మోక్ష; మాకస్మికం బనిర్ముక్తకలిమి, యా శుకద్విజరాజున కద్భుతంబె!</poem>|ref=230}}
'''టీక'''. ఆ శుకద్విజరాజునన్ = ఉత్తమమైన ఆ చిలుకకు; బంధమోక్షము = పంజరమునుండి విడుదల; ఆకస్మికంబు = అనుకొనకుండఁగ - తటాలున; శుకద్విజరాజునకున్ = శుకుఁ డనెడి బ్రాహ్మణశ్రేష్ఠునకు - మహర్షికి; నిర్ముక్తికలిమి = మోక్షసంపద; అద్భుతంబె? = ఆశ్చర్యము కాదు.
{{Telugu poem|type=సీ.|lines=<poem>జనియించెనొక్కొ పచ్చనిమొల్క యను బుద్ధి గ్రుచ్చిన పచ్చలకొమరువలన
సమకూరెనొక్కొ దాడిమఫలోద్భవబీజమతి పద్మరాగసామగ్రివలనఁ
బొడకట్టెనొక్కొ <ref>క. జంబూఫలంబను, శ.ర. జంబుఫలంబులను</ref>జంబుఫలంబు లను మనోభ్రమ మింద్రనీలవిభ్రమమువలనఁ
దోతెంచెనొక్కొ మధూకపుష్పము లను నాస హుర్ముంజిముత్యములవలన</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem><ref>క. దాది, శ.ర. దాసి</ref>దాసి యటు పెట్టి <ref>చ. వంటి</ref>పసుపాడఁ దలఁగి చనుడు
<ref>చ. భరణి</ref>బరణిమూఁకుట నెలకొన్న బన్నసరముఁ
గఱచికొనిపోయెఁ జిక్క ప్రగల్భవిటుఁడు
బాలికామానసముఁ గొను <ref>చ. పగుది</ref>పగిది నపుడు.</poem>|ref=231}}
'''టీక'''. గ్రుచ్చిన = కూర్చిన; పచ్చలకొమరువలనన్ = పచ్చలకాంతివలన; పచ్చనిమొక్క
యను బుద్ధి = పచ్చనిమొలక యను భ్రాంతి; జనియించెనొక్కొ! = కలిగినదో, యేమో! దాడిమఫలోద్భవబీజమతి = దానిమగింజ లనెడి భ్రాంతి; సమకూరెనొక్కొ! = కలిగినదో, యేమో! పొడకట్టెనొక్కొ! = కలిగెనేమో! మధూకపుష్పము లను, నాస = ఇప్పపువ్వు లనెడి ఆశ - భ్రాంతి; తోతెంచె<noinclude><references/></noinclude>
qcufs4l019de99jhvmuey0spjj2hr5c
555622
555621
2026-05-07T07:35:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
555622
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=మ.|lines=<poem>కలహంసోపమయానఁ <ref>క. చక్ర</ref>జక్రకుచఁ <ref>క. ప్రేంఖ</ref>బ్రేంఖత్ఖంజరీటాక్షిఁ గో
కిలసారస్వర బర్హిబర్హ చికురం గీరప్రియాలాపఁ దొ
య్యలిఁ జాలన్ మరిగెన్ శుకం బది <ref>క. మహీయః, చ. గరీయః</ref>గరీయఃప్రేమ గావించుచున్
బులుఁగుం బొందున నంది పొందినగతిన్ బొత్తొత్తులన్ హత్తుచున్.</poem>|ref=229}}
'''టీక'''. శుకంబు, అది = ఆ చిలుక; గరీయఃప్రేమ = ఎక్కువ అనురాగమును; కావించుచున్ = కూర్చుచు; కలహంసోపమయానన్ = హంసనడకలవంటి నడకలు కలదానిని; చక్రకుడన్ = చక్రవాకములవలె గుండ్రనైన కుచములు కలదానిని; ప్రేంఖత్ ఖంజరీటాక్షిన్ = తిరుగుచున్న- కాటుకపిట్టవంటి (నల్లనైన) కన్నులు కలదానిని; కోకిలసారస్వరన్ = కోకిలమువంటి మధురమైన కంఠస్వరము కలదానిని; బర్హిబర్హచికురన్ = నెమలిపించెమువంటి చక్కనిజుట్టు కలదానిని; కీరప్రియాలాపన్ = చిలుకవలె చక్కగా మాటాడుదానిని; తొయ్యలిన్ = స్త్రీని - హరిదాసిని; పులుఁగుంబొందునన్ = పక్షియొక్క చేరికను; అంది, పొందినగతిన్ = అరమర లేక యున్నట్లుగా; పొత్తొత్తులన్, హత్తుచున్ = ఎక్కువ చేరిక, చనవులు కలిగినదయి అనుట; చాలన్, మరిగెన్ = ఎక్కువగా ప్రేమించి వెంట నంటెను. [పయివర్ణనమునుబట్టి హరిదాసియందు పక్షిసామాన్యగుణములే యుండుటవలన, ఆమె యొకవింతపక్షియే యని భావించి, బెదరు లేక చిలుక ఆమెతో కలిసి మెలిసి, ఆమెను విడువకుండెనని
భావము.] సయి వర్ణనమునను, పద్యమునఁ గల 'శుక' పదమువలనను ఇట్టి చక్కని యువతిని జూచిన, ఇంద్రియనిగ్రహమున గొప్పపేరు పడసిన శుకుఁడు (మహర్షి) కూడ ఆమెను మోహింపవలసియుండునని వ్యంగ్యము. '''అలం'''. పరికరము.
{{Telugu poem|type=తే.|lines=<poem>ఆ శుకద్విజరాజున కంతఁ గొంత, కాల మరుగంగ నొకనాఁడు కలిగె బంధ
మోక్ష; మాకస్మికం బనిర్ముక్తకలిమి, యా శుకద్విజరాజున కద్భుతంబె!</poem>|ref=230}}
'''టీక'''. ఆ శుకద్విజరాజునన్ = ఉత్తమమైన ఆ చిలుకకు; బంధమోక్షము = పంజరమునుండి విడుదల; ఆకస్మికంబు = అనుకొనకుండఁగ - తటాలున; శుకద్విజరాజునకున్ = శుకుఁ డనెడి బ్రాహ్మణశ్రేష్ఠునకు - మహర్షికి; నిర్ముక్తికలిమి = మోక్షసంపద; అద్భుతంబె? = ఆశ్చర్యము కాదు.
{{Telugu poem|type=సీ.|lines=<poem>జనియించెనొక్కొ పచ్చనిమొల్క యను బుద్ధి గ్రుచ్చిన పచ్చలకొమరువలన
సమకూరెనొక్కొ దాడిమఫలోద్భవబీజమతి పద్మరాగసామగ్రివలనఁ
బొడకట్టెనొక్కొ <ref>క. జంబూఫలంబను, శ.ర. జంబుఫలంబులను</ref>జంబుఫలంబు లను మనోభ్రమ మింద్రనీలవిభ్రమమువలనఁ
దోతెంచెనొక్కొ మధూకపుష్పము లను నాస హుర్ముంజిముత్యములవలన</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem><ref>క. దాది, శ.ర. దాసి</ref>దాసి యటు పెట్టి <ref>చ. వంటి</ref>పసుపాడఁ దలఁగి చనుడు
<ref>చ. భరణి</ref>బరణిమూఁకుట నెలకొన్న బన్నసరముఁ
గఱచికొనిపోయెఁ జిక్క ప్రగల్భవిటుఁడు
బాలికామానసముఁ గొను <ref>చ. పగుది</ref>పగిది నపుడు.</poem>|ref=231}}
'''టీక'''. గ్రుచ్చిన = కూర్చిన; పచ్చలకొమరువలనన్ = పచ్చలకాంతివలన; పచ్చనిమొక్క యను బుద్ధి = పచ్చనిమొలక యను భ్రాంతి; జనియించెనొక్కొ! = కలిగినదో, యేమో! దాడిమఫలోద్భవబీజమతి = దానిమగింజ లనెడి భ్రాంతి; సమకూరెనొక్కొ! = కలిగినదో, యేమో! పొడకట్టెనొక్కొ! = కలిగెనేమో! మధూకపుష్పము లను, నాస = ఇప్పపువ్వు లనెడి ఆశ - భ్రాంతి; తోతెంచె<noinclude><references/></noinclude>
dlbmfga7w3emtamxqejnel2m9827a8a
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/307
104
212752
555625
554989
2026-05-07T09:08:35Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555625
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నొక్కొ! = కలిగెనేమో! అటు పెట్టి = అక్కడ, దూరముగా ఉంచి; తలఁగి చనుడున్ = తొలఁగి, వెళ్లగా; బన్నసరము = రత్నాలహారమును (నానావిధరత్నములను గూర్చిన హారమును); ప్రగల్భవిటుఁడు = నేర్పరియైన సరసుఁడు; బాలికామానసమున్ = యువతియొక్క మనస్సును; కొనుపరిదిన్ - హరించి, వెడలిపోవునట్లు; చిల్క; కఱచికొనిపోయెన్. '''అలం'''. ఉపమ, ఉత్ప్రేక్ష.
{{Telugu poem|type=క.|lines=<poem>బారాదిసొమ్ము లుండఁగ, హారమునే కొనుచుఁ జనియె నండజము ప్రియం
<ref>క. బారయ, చ. బెరసి, శ.ర. బారఁగ</ref>బారఁగ ఫలకాముకు లగు, వారలు గుణవత్ప్రసక్తి వదల విడుతురే!</poem>|ref=232}}
'''టీక'''. బారాదిసొమ్ములు = లెక్కలేనన్ని నగలు; అండజము = పక్షి - చిలుక; ప్రియంబారఁగన్ = ప్రియముతో; ఫలకాముకు లగువారలు = ఫలమును గోరువారు; గుణవత్ప్రక్తిన్ = మంచిగుణములు కలవారి సంబంధమును; (చిలుకవిషయమున - త్రాఁటితో గల సంబంధము ననుట - హారమున రత్నములు దారముతో కూర్చఁబడినవనుట.) '''అలం'''. అర్థాంతరన్యాసము.
{{Telugu poem|type=క.|lines=<poem>ఆ ధవళకిరణముఖకి న, సాధుశుకాచరణ మపు డసహ్యం బయ్యెన్
గోధుక్కృతిసతికి మనో, బాధకమగు కృష్ణధూర్తబాల్యముఁబోలెన్.</poem>|ref=233}}
'''టీక'''. ఆ ధవళకిరణముఖకిన్ = చంద్రునివంటి ముఖము కల ఆ హరిదాసికి; అసాధుశుకాచరణము = ఆ చెడ్డచిలుక చేసిన పని; గోధుక్కృతిసతికిన్ = గోపికాస్త్రీకి; మనోబాధకమగు = మనస్సును బాధించునదైన; కృష్ణధూర్తబాల్యమువోలెన్ = ధూర్తుఁడగు కృష్ణుని చిన్నతనమువలెను; అసహ్యంబు = ఓర్వరానిది - బాధ కలిగించునది; అయ్యెన్. '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=మ.|lines=<poem>కటిఁ జేలార్ధము చుట్టి, చిక్కినది <ref>క. మేనం, చ.ట. వేగం</ref>వేగం జుట్టి పాలిండ్లమీఁ
దట సంధించుచు నార్ద్రదేహలత మాద్యద్వర్షధారావల
త్తటిదాకారముఁ జూపఁ <ref>క. ద్రోసి, ట. దోసి</ref>దోపికొనుచున్ ధమ్మిల్లబంధంబు ముం
గిటికిన్ సుస్తని వచ్చె గోస్తనహరత్కీరగ్రహ<ref>చ.ట. వ్యగ్రమై</ref>వ్యగ్రయై.</poem>|ref=234}}
'''టీక'''. కటిన్ = నడుమను; చేలార్ధము = సగముచీర; పాలిండ్లమీఁదటన్ = స్తనములపైగా - అవి కనబడకుండునట్లు; సంధించుచున్ = కూర్చుచు - సరిచేయుచు; ఆర్ద్రదేహలత = (స్నానము చేయుటచే) తడిసిన, తీగవంటి (సన్నని) దేహము; మాద్య...కారమున్ = దట్టమైన వర్షధారలచే చుట్టుకొనఁబడిన మెఱుపుయొక్క ఆకారమును; [ఆమె మెఱుపువలెను, ధరించినచీర వర్షధారలవలెను ఉన్న వనుట.] ధమ్మిల్లబంధంబు, దోసికొనుచున్ = జుట్టు ముడివేసికొనుచు; ముంగిటికిన్ = ఇంటిముందుభాగమునకు - ఇంటి మొగసాలకు; గోస్తన...వ్యగ్రయై = రత్నహారమును ఎత్తుకొనిపోవుచున్న చిలుకను పట్టుకొనుటయందు తొందరపాటు కలదై; సుస్తని = చక్కనిచన్నులు కల యా పడఁతి; వచ్చెన్. '''అలం'''. ఉపమ, స్వభావోక్తి.
{{Telugu poem|type=తే.|lines=<poem>వర్షధారావశేషాన్వవాయయుక్తి, వాయువశమునఁ దెరలు మువ్వన్నె<ref>చ. విల్గు</ref>విల్లు
వేడ్క వెన్నాడుశశివోలె వెలఁది చాప, లమున సర మాహరించు <ref>క. శుక, చ.ట. కీర</ref>కీరముఁ దవులుచు.</poem>|ref=235}}
'''టీక'''. వర్ష...యుక్తిన్ = వర్షము ధారలుగా కురవఁగా మిగిలియున్న (నీటి తుంపరల) గుంపుకూడికచే; తెరలు = బయలు వెడలిన; మువ్వన్నెవిల్లు = ఇంద్రధనుస్సును; శశివోలె = చంద్రునివలెను - చంద్రుఁడు వెంటనంటినట్లుగా; వెలఁది = చాన; చాపలమునన్ = భ్రమచేత; సరము, ఆహరించు = హారమును ఎత్తుకొనిపోవునట్టి; తవులుచున్ = వెంబడించుచు; వేడ్కన్; వెన్నాడున్ = వెంటదఱుమును. '''అలం'''. ఉపమ.<noinclude><references/></noinclude>
sttei19926124l0l9tyujcqvesdssqo
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/308
104
212753
555626
554990
2026-05-07T10:26:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555626
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=మ.|lines=<poem>గుహమాతృస్ఫటికాక్షసూత్రము సితక్షుచ్చేదగుచ్ఛచ్ఛటా
స్పృహఁ గైకొన్నశుకంబొ <ref>చ. యేవరు</ref>యేమఱుతఱిన్ జీరాడుపూవాఁగెతో
బహరుడ్డీనత నొడ్డి నిల్చు రతిరాట్పట్టాశ్వమో నాఁగ న
మ్మహిళావిభ్రమకీర మొప్పు ముఖసీమాగామిముక్తాళియై.</poem>|ref=236}}
'''టీక'''. ఆమహిళావిభ్రమకీరము = ఆహరిదాసియొక్క పెంపుడుచిలుక; ఏమఱుతఱిన్; గుహమాతృస్ఫటికాక్షసూత్రమున్ = పార్వతీదేవియొక్క స్ఫటికముల జపమాలను; సితేషు...స్పృహన్ = తెల్లచెఱకుతునుకులయొక్క సమూహ మను భ్రాంతిచే ['సమూహమునందలి యపేక్షచేత' నని పూర్వటీక]; కైకొన్న, శుకంబొ = గ్రహించిన చిలుకా యేమి, యిది? జీరాడుపూవాఁగెతోన్ = వ్రేలాడుచున్న పూవులగుత్తితో; బహిరుడ్డీనతన్ = బయట ఎగురుటయందు; ఒడ్డి = పందెము వేసి; రతిరాట్పట్టాశ్వమో = మన్మథుని వాహనరాజమగు చిలుకయో; నాఁగన్ = అనునట్లుగా; ముఖ...ళియై = ముక్కునఁ గఱచుకొనిన ముత్యాలహారము కలదయి; ఒప్పున్ = ప్రకాశించును. ['అమ్మహిళావిభ్రమకీరము = ఆ యాఁడువారి వినోదపుఁజిలుక' అని పూర్వటీక.] '''అలం'''. ఉత్ప్రేక్ష.
{{Telugu poem|type=వ.|lines=<poem>ఈ చందంబునఁ గందర్పస్యందనంబు వినిందితుం <ref>చ. డనంగా</ref>డన మందమందప్రచారంబును,
మలిమ్లుచుండన దుర్గమప్రవేశనిపుణంబు, నవివేకి యన శిథిలీకృతస్వపక్షంబును,
దనుజగృహీతజనకజ యన రామానుసరణసముచితంబునునై యున్మత్తుపోలికం
జంచు<ref>చ. చుంబిక</ref>చుంబి లలంతికావ్యాజంబున లాలఁ గ్రక్కుచుఁ, బుష్పవద్బింబంబు విధం
బున శరీరప్రభాదంభంబున నంబోధరంబులచేతం గప్పఁబడుచు, యోగిబాగున
విచ్ఛిన్నచరణశృంఖలాచ్ఛలనంబునఁ బాశచ్చేదంబు సేయుచుఁ, బరవధూపయోధ
రంబుపగిదిఁ బట్టరాక, నీతివిదుహృదయంబుగతి దూరదర్శనయోగ్యంబై, కరువలి
మురువునం బొడమి యడంగుచు, బరబ్రహ్మంబు చాడ్పున నగోచరం బయ్యును
దదీయమాయావిలసితం<ref>క. బునునై సకలంబును</ref>బు<ref>చ.ట. నెసకంబున</ref>నె సకలంబను నిజప్రతిభాసంబున యాథార్థ్యభూమిక
నభినయిం<ref>చ. పుచు</ref>చుచు, శశాంకశిలాసౌధవిటంకంబులను సుంకువగొన్నతఱి శరన్నీరద
వశంవదంబగు <ref>క. శునా, సూర్యా, సునా</ref>సునాశీర<ref>క. శిలా, చ.ట. శరాసన</ref>శరాసనశకలంబన మెలంగుచు, నంతరిక్షమహాప్లక్షంబు
నకు <ref>క. నక్షామ, చ. నక్షామ</ref>నక్షామ<ref>క. చంచు, చ. చంచూ</ref>చంచూపుటప్రవాళఖండప్రభాహిండనంబునం దొరలి సఫలవిటప
లక్ష్మి నావహిం<ref>చ. పుచు</ref>చుచుఁ, బ్రమాదవిగళితంబగు నగవిరోధికొలువు వీవన <ref>చ. యచ్చల</ref>యచ్చ
రల పచ్చలకడియంబువడువున నిరాలంబనస్థలంబునం బలుమఱు <ref>చ. జక్ర</ref>చక్రచంక్రమణ
చమత్కారంబు సూపుచు, సమీపారామశ్యామలపలాశపటలగర్భంబునందు
ముకుందవిగ్రహంబునందు భక్తిసముగ్రుండగు పురుషశ్రేష్ఠుండునుంబోలె నేర్పఱు
పరాక డిందుచు, నందంద జాతిపులుఁగులు మనుజగంధధురంధరం బగుటకు
జగడంబు దిగిచినం గినికి విసృమరతనూరుహదంతుర<ref>చ.ట. కపోలాంతంబును</ref>కపోలాంతరంబును,
విఘూర్ణనవికృతవీక్షణంబునై క్షణంబు మణివలయవలయితంబగు రతియువతి</poem>|ref=}}<noinclude><references/></noinclude>
blz56oo8j6ljb620y114w1clog75op6
పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/13
104
212915
555581
2026-05-06T12:20:19Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
555581
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>{{left margin|5em}}<poem>ధాశుద్ధిరిష్యతే!
తద్భర్తతాం పరిత్యజ్య |
పర్యాచ్ఛాంద్రా యణత్రయం |
సారన్యా పూర్వజంచాన్యం
త్యక్త్వాచాంద్రాయణంచరేత్ |</poem> </div>
౫. ఇదియునుగాక మీరు చదివిన దేవల స్మృతివచనముచే వలస్మృతివచనమే యయినయెడల ప్రాయశ్చిత్త విషయమయి
యితర సృతుల కనుకూలించి యుండవలెను. ఇతరస్మృతి విరుద్ధమయినందునకు మీహేమాద్రిలో వ్రాయబడిన జాచాలి
వచనములకు విరోధముగానుండుటయే సాక్షి. దేవల స్మృతి యితర స్మృతుల కనుకూలించి యుండవలసినదని యెక్కడ
నున్నదందురేమో.
{{Center|{{p|fs125}}దేవలస్మృతి, శ్లో౹౹ ౫౯</p>}}
{{left margin|5em}}<poem>ప్రాయశ్చిత్తం సమాఖ్యాతం |
యజ్ఞోశక్తం దేవలేనతు |
ఇతరేషామృషీణాంతు |
నాన్యథాతత్సుభాషితః ౹</poem> </div>
౬. ఎట్లయినను ప్రాయశ్చిత్త హేమాద్రిలో దేవలస్మృతి వచనమని వ్రాసియున్నదిగదా, అదిదేవల స్మృతివచనమే
యయియుండునని నమ్మడము. అట్లుగా దేవల స్మృతిలోనున్నను, దాసియధ౯ము మీరుచెప్పినదికాదు. మరియేలాగు
నర్ధముచేప్పగలరనిన, నరకపాత నివృత్తినిజేయు బ్రాయశ్చిత్తములేదని యధ౯ము చెప్పవచ్చును కాని వ్యవహారసిద్ధికయి ప్రాయశ్చిత్తములేదని చెప్పరాదు.
{{Center|ఇందునకు బ్రమాణములు}}<noinclude><references/></noinclude>
65ed7i4wk1c6hutgzzqqcuwxi1khtei
పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/14
104
212916
555587
2026-05-06T12:54:32Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
555587
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>
తా | ఆంశం సఫలంతస్యాః | యా వెరిచినభ ఉత్పతిం
ఇందు ఎవ్వతెపెనిమిటి పోయినపిమ్మట బ్రతికియుండి మరల బెండ్లి చేసికొనకనుండునో దానిబ్రతుకు పుణ్యయుక్తమయిన బ్రతుకని
చెప్పబడియున్నది. గాన ఇందువలన స్త్రీ పునర్వివాహము చేసికొనకుండేనా పుణ్యముగలుగుననుటనిశ్చయము.
ఆరవదిస్త్రీ పునర్వివాహముచేసికొనకపోయెనా స్వర్గముగలుగుననీనందునకు
{{left margin|5em}}<poem>పరాశరస్మృతి ౼ మృతేభర్త రియా నారీ!
బహచర్యేవ్యవస్థతా!
సామృతాలఛతేస్వర్గం
యుధాతేబ్రహ్మచారిణః</poem> </div>
ఇందు పెనిమిటుపోయిన పిమ్మట స్త్రీబ్రహ్మచర్యము జేసినాబ్రహ్హచారులకు గలుగుస్వర్గముగలుగుసని చెప్పబడియున్నది. కాన
స్త్రీలకుంబునర్వివాహములేకుండినందున స్వర్గముకలుగునని యిందువలన స్పష్టముగా తెలియుచున్నది.
{{left margin|5em}}<poem>వ్యాఘ్రపాదస్మృతి —— నమ్రియోతనమంభర్త !
బ్రాహ్మణీశోక మోహితా!
ప్రజ్యాగతిమాప్నోతి ౹
మరణా దాత్మఘాతినీ ౹</poem> </div>
ఇందు సహగమనముకంటేనుగూడ బ్రహ్మచర్యము మంచిదనియు అందువలన సన్యాసులకువచ్చు న్వర్గమువచ్చునని
యుంజెప్పబడియున్నది. కానస్త్రీలకు పునర్వివాహములులేకుండెనా స్వర్గమువచ్చుననుట స్పష్టము.
ఏడవధి స్త్రీపునర్వివాహములు జరుగుచువచ్చినపూర్వయుగములయందయినను ఆదిసదాచారముకాదని నందునకు.
{{left margin|5em}}<poem>బృహస్పతి — ఉక్తానియోగా మునినా ౹
నిషిద్ధాస్స్వయమేవకు ౹
యుగక్రమాదశ్యయం!
కర్తుమస్వైర్విదానతః తపోజ్ఞాన సమాయుక్త ౹
కృతేత్రేతాయుగేనరాః ౹
ద్వాపరేచకలౌసౄణాం ౹
శక్తిహాసిర్హనిర్మితా ౹</poem> </div>
ఇందు కృతత్రేతాయుగములయందు తపోజ్ఞావసంపన్ను లయినవరులువిధవలంబెడ్లియాడసమర్థులైరనియు అది స్వతః
నిషిద్ధమనియు ఈ యుగములయందు అట్లు జరిగింపజాలరనియు జెప్పబడియున్నది కానదీ<noinclude><references/></noinclude>
5yylfsu7soh7h4ko9wc362avy0q21e6
పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/15
104
212917
555592
2026-05-06T14:01:32Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
555592
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>నివలన పూర్వయుగములయందైనను ఇది సదాచారము కాదని తెలియుచున్నది.
{{left margin|5em}}<poem>మనుస్మృతి — నో ద్వాహికేషమంత్రేఘ ౹
నియోగఃకీర్త్యతేక్వచిత్ |
సవివాహవిధావుక్త౦విధవా వేదనంవునః
ఆయంద్విజైర్హవిద్యరచ్భిః |
పశుధ్ధగోవిగర్హితః!
మనుష్యాణామపి ప్రోక్తో |
నేనే రాజ్యంప్రశానని</poem> </div>
ఇందువిధవావేదనము వైవాహిక మత్రములయందు గానరాదనియు వివాహవిధులయందును జెప్పబడియుండలేదనియు అది
పశుధర్మమనియు దుష్టుడగువేసుని ప్రభుత్వముందు జరిగినదనియు జెప్పబడియున్నది. కాపకృతయుగమునందైవను విధవా
వేదనము సదాచారము కాదని తెలియుచున్నది.
మనుస్మృతి యందు సాధారణముగా చాలామట్టుకకు కృతయుగ ధర్మములనే వివరింపబడుదుండును. ఇందుకు శృతేతుమాన
వాధరాః అనుటయే ప్రమాణము కాబట్టి అట్టిమస్మృతి యిందే విధవావేదనమును మిక్కిలీనిందించియు జరుగుచున్న దానిని వదిలి
వేయలేక యధావిధిగాని యుక్తురాలయిన విధవఙ్ఞాతివలన నొక పుత్రుని మాత్రముబడయవచ్చుననియు యథెష్టముగా కామము
చేతనియమము విడిచి ప్రవతి౯ంపరాదనియు స్పష్టముగా జెప్పబడి యున్నది కావున కృతాయుగములయందును విధవావేదనము
సదాచారముకాదనుట నిశ్చయము.
ఎనిమిదవది స్త్రీ పునర్వివాహముకలియుగమునందు బొత్తిగానిషిద్ధమనినందుకు
{{left margin|5em}}<poem>క్రతుస్మృతి — దేవరాచ్ఛసుతోత్పత్తి ౹
రక్తారన్యానదీయితే ౹
నయజ్ఞేగోవధః కార్యిఃకలెనచకమండలు:౹</poem> </div>
ఇందుకలిగమునందు ఈబడినకన్య తిరుగాయీబడదని చెప్పబడియున్నది కాన కలియుగమునందు స్త్రీ పునర్వివాహము బొత్తిగా
నిషిద్ధమని తేటపడుచున్నది.
{{left margin|5em}}<poem>ధర్మజ్ఞ సమయము —— విధవాయాంప్రజోత్పత్తా దేవరస్య నియోజనం</poem> </div><noinclude><references/></noinclude>
qwm6m6je5y8knp08y0nab2fg1v6o3oo
పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/16
104
212918
555623
2026-05-07T08:43:55Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
555623
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>విచార్యతీ; ఆత్రకేచిన్నిర్ణయామాహు:౼ ద్వివిభర్తస్యశక్తి; నరకోత్పాధికా వ్యవహారనిరోకాచేత ఆత్మశన్నినవర్తకస్య ప్రాయశ్చిత్తస్యాపి
శక్తిర్వేధాభివారికా వ్యవహారజననీ చేతి తతప్రాణశ్చితామునీనాం నరకనివారణాభాపూభిప్రేతః సద్భావనాదినాంతు వ్యవహార
జనకశక్తిరభిప్రేత ఆయంచనిర్ణయః యాజవుల్క్యేన స్పష్టం ఆభిహితని:౼ ప్రాయశ్చిత్తెరపైత్యేనియోగి యుద్ధజ్ఞానకృతంభవేత్ !
కామతో వ్యవహార్యస్తు వచనాదియితే ఇత్యాది ప్రాయశ్చిత్తంనపశ్యామి తినిందానృతష్టాచారాచ్చేతిమైనం అయంబహిష్కారా ఉర్ద్యయః నతుగృహస్థవిషయః
కావున, నేనుచెప్పిన యర్థము చెప్పనియెడల సర్వపాపములకును వ్రాయశ్చిత్తము కలదనిచెప్పిన సర్వసృతులకును మీ
దేవలస్మృతి వచనము నిరోధముకలిగి శ్రుతి స్మృతి సమన్యయము కాకపోవును. ఈవిషయమయిన యుక్తులను ముందు
వివరించెదను.
౭. ఇవి యిట్లుండనిండు. మీరు చెప్పిన దేవలస్మృతి వచనము పాపాధిక్యములం దర్దవాదయని యేలచెప్పరాదు? ఆట్లు
చెప్పనేవచ్చునే. ఎందుచేతనసిన పాపాధిక్యఫలాధిక్యములం దర్దవాదలు చెప్పట ధర్మశాస్త్ర సంప్రదాయమైయున్నది.
{{Center|ఇందుకు బ్రమాణములు}}<noinclude><references/></noinclude>
n70s88sn4go4le7k0fd743yq9ntkusw
పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/17
104
212919
555627
2026-05-07T10:59:55Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
555627
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>పారాశరస్మ్యతి - ప్రాయశ్చిత్తకాండము - అధ్యాయము
౪.శ్లోకములు - ౧౭ - ౧౮.
{{left margin|5em}}<poem>యతా వం: బ్రహ్మహత్యాయాం !
ద్విగుణం : గర్భపాతనే ప్రాయశ్చిత్తంనతస్యాస్తి
తస్యాస్యాగో విధీయతే!</poem> </div>
దీనిలో గర్భపాతనదోషమునకు బ్రయాశ్చిత్తము లేదని పరాకారులవారు చెప్పినారు. దీనికి మాధవామాత్యులవారు
వ్యాఖ్యానములో వ్రాసినది.
{{left margin|5em}}<poem>యద్వాపాప ద్వైగుణ్యేన, ప్రాయశ్చిత్తాభావోక్తి:
తస్యాస్యాగవిధి విశేషః అర్ధవాద ఇతినకశ్చిద్విరోధ:</poem> </div>
ఇదిపాపాధిక్య యదర్దవాదయని వ్రాసినారు.
ఇది అధ౯వాద కాదనునెడల ఫలాధిక్యబోధక వాక్యములనుగూడ నాలాగుననే చేకొనవచ్చునే.
అవియేవియనిన.
సామాన్యముగా దేవతార్చన కాలముందు సాలగ్రామ పూజచేసి సాలగ్రామతీర్ధమును బుచ్చుకొనినయెడల
సర్వపాపముల చేత ముక్తుడగునని యున్నది. ఇడియందరికిని తెలిసినదే.
ప్రమాణము:౼
{{left margin|5em}}<poem>సాలగ్రామశిలావారి పాపహారి విశేషతః |
ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తంది నేదినే।
అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం |
సమస్త పాపక్షయకరం శ్రీవిష్ణుపాదోశం</poem> </div><noinclude><references/></noinclude>
ga4x50kls7veeqr1fqqdq68dmtvk5m0
పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/18
104
212920
555628
2026-05-07T11:21:49Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
555628
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>సాలగ్రామ తీర్ధమే సమస్త పాపములను బోగోట్టు చున్నది. ఇతరప్రాయశ్చిత్తములతో బనియేమి; కావున,
దేవలస్మృతివచనము ప్రమాణముగా బుచ్చుకొనినయెడల ఆర్థనాదయని చెప్పుటయే సుతరము.
{{Center|{{p|fs125}}శాతాతపస్మృతి చివరి శ్లోకము</p>}}
{{left margin|5em}}<poem>పరితానాంచ దుష్టానాం పాపానాంచ మహత్తధా !
ధర్మ మే తదధీయేర౯ ముచ్యంతే నాత్ర సంశయః.</poem> </div>
ఎటువఁటి పాపములయినను శాతాతపస్మృతి పఠించినంతమాత్రముచేతనే విడిచిపోవునని
చెప్పియున్నది.
{{Center|{{p|fs125}}శంఖస్మృతీ చివరిశ్లోకము</p>}}
{{left margin|5em}}<poem>శంఖప్రోక్తమివంశాస్త్రం!
యోధీతేబుద్ధిమాన్నరః!
సర్వపాపవినిర్ముక్తః|
స్వర్గేతో కేమహీయ తే:</poem> </div>
ఇత్యాదులయందుగూడ పయిన వ్రాయబడిన యర్థమే కాన వచ్చుచున్నది. ఈశ్లోకములకు ఫలాధిక్యమందర్ధవాద
చెప్పక సమస్తపాపములు స్తృతులు పఠించినంతమాత్రముచేతనే పోవుననిచెప్పినయెడల మీరు చదివిన దేవల
స్తృతులు వచనమునకు విరోధము రానే వచ్చినదిగదా. కావున యివియును అర్థవాదలనియా పాపాధిక్యఫలాధిక్యములు
యందర వాదలు చెప్పట స్తృ<noinclude><references/></noinclude>
2vm17dp1cqyr3l73d5h40ayvjgt8buq
పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/19
104
212921
555629
2026-05-07T11:40:40Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
555629
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>తి సంప్రదాయమనియు జెప్పుట న్యాయమయి యుండలేదా!
౮. ఇదియునుంగాక ఈకలియుగము నందు పరస్పరస్తృతి కంటే దేవలస్తృతుతి కెక్కువ బలము లేదు. ఈవిషయము
మీకందరికి తెలిసినదే అయినను ఇందునకు బ్రమాణము.
{{Center|{{p|fs125}}పరాశరస్మృతి ఆచార కాండము - శ్లోకము - ౨౫</p>}}
{{left margin|5em}}<poem>కృతేతుమానవాధర్తా।
స్త్రేతాయాం గౌతమాసృతా!
ద్వాపరేశంఖలిఖితా
కలౌపారాశరా స్మృతాః॥</poem> </div>
అందులో ప్రాయశ్చిత్త విషయమయి కలియుగమునందు పరాశరస్మృతికి అన్ని
స్తృతులకంటే యెక్కువబలమున్నది.
{{Center|ఇందునకు బ్రమాణము}}
{{Center|{{p|fs125}}పరాశరస్మృతి ప్రధమాధ్యాయము - 3౬ శ్లోకము</p>}}
{{left margin|5em}}<poem>యుగేయుగేచ సామర్థ్యం శేషంముని విభాషితం ౹
ఐరాశరేణచాప్యుక్తం ప్రాయశ్చిత్తం విధీయతే॥</poem> </div>
ఈపరాశరులవారు యేపాపమునకయినను వ్రాయశ్చిత్తము లేదని చెప్పినారా?
యను నంశమును విచారించవలెను.
పరాశరులవారు చాలా పాపములకు వ్రాయశ్చిత్తములు చె<noinclude><references/></noinclude>
r198fpzlud9rcif98jgrhees1r8y4vi