వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.1
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/341
104
211789
555713
555703
2026-05-09T13:56:38Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555713
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
సరిగ్గా ఆ రోజుల్లోనే అతనికి కమ్యూనిస్టు గ్రూపులతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఔరంగాబాద్ గ్రూప్ పరిచయంతో నాటి కమ్యూనిస్టు పార్టీ రహస్యపత్రిక 'నేషనల్ ఫ్రంట్ ను సంపాదించి, చదివేవాడు. నాగపూర్ మిత్రుల సహాయంతో
1989లో ముఖ్యం హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ను స్థాపించాడు. అదే సంవత్సరంలో హైదరాబాద్లోని సిటీ
కాలేజీలో అతడు ఉర్దూ అధ్యాపకుడిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాడు.
1940లో మఖ్దాం, రాజబహద్దూర్ గౌర్, మరికొందరు మిత్రులతో కలిసి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించారు. హైదరాబాద్ నగరంలో ఒక పార్టీ యూనిట్ ఏర్పడింది. దానికి మొదటి కార్యదర్శి ముఖ్యం. 1940-41 మధ్య కాలంలో సంస్థానంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలపోరాటాలు పెల్లుబుకసాగాయి. మరోవైపు కార్మికుల సమ్మె పోరాటాలు మొదలయ్యాయి. ఆల్వీన్ మెటల్ వర్కర్స్, వజీర్ సుల్తాన్ టుబాకో కార్మికులు, రైల్వే కార్మికులు, ఔరంగాబాద్ మిల్లు కార్మికులు సమ్మెలు చేస్తున్నారు. నాందేడ్లోని ఉస్మాన్షాహీ మిల్లు కార్మికుల్లోనూ, వరంగల్లోని ఆజంజాహి మిల్లు కార్మికుల్లోనూ అశాంతి మొదలయ్యింది. తన ఉత్తేజకరమైన ప్రసంగాలతో, ఉద్వేగభరితమైన గీతాలతో కార్మికులను, విద్యార్థులను, రచయితలను ప్రభావితం చేస్తున్న మఖ్ధూం 1941లో ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తికాలం ఉద్యమ కారుడిగా పోరాట జీవితాన్ని ప్రారంభించాడు.
<poem>
'అడువులు కొండల అనుంగుబిడ్డలు -
పొలాల పొత్తిట పెరిగిన పాపలు
లేచిరి క్రోథోద్ధత భీకరులై-
సమరోధృత కౌక్షేయకకరులై
తళతళ తళతళ మెరిసెను కొడవలి
ఎగిసి ఎగిసి నర్తించెను నాగలి'</poem>
అంటూ ముఖ్యం 'తెలంగాణ పై ప్రసిద్ధ గేయాన్ని రాశాడు.
<poem>
'భారతావనిలో అగ్రగామిగా తెలంగాణ
సృష్టిస్తోంది నవోదయం
ఆహ్వానం పలుకుతోంది కొత్త దిశకు తెలంగాణ
విప్లవం పురిటిగడ్డ తెలంగాణ' </poem>
అంటూ భారత జాతీయోద్యమంలో విశిష్ట స్థానం సంపాదించిన తెలంగాణా సమరభూమిని మఖ్ధూం కీర్తించాడు. ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో విపరీతమైన పని ఒత్తిడిలోనూ మఖ్తూం కవితాప్పుజనను నిర్లక్ష్యం చేయలేదు. అతని కవితాహృదయం విక్రమించలేదు.
సుర్థ్ సవేరా (అరుణోదయం) - 1944, గులెతర్ (తాజాపువ్వు) 1961, వీసా తెరర్స్ (నాట్యవేదిక) - 1966 పేరిట మూడు కవితా సంపుటులను ప్రకటించాడు.
1947 సెప్టెంబర్ మాసంలో నిజామాంధ్ర ప్రాంతంలో చారిత్రాత్మక సాయుధ పోరాట ప్రకటనపై రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డిగార్లతో పాటు సంయుక్త సంతకం చేసిన మఖ్ధూం క్రియాశీల రాజకీయ జీవితాన్ని గడిపాడు.
:'జీవితం సుఖరూపం - జీవితం దుఃఖకూపం
:అదే వాద్యం సంగీతమదే - సంకెల ఝంకారమదే
అంటూ ముఖ్యం జీవితాన్ని నిర్వచించాడు.
మౌలికంగా అతడు నజమ్ రాసే కవి, గజళ్లు కూడా రాశాడు. ఫిరాక్ గోరకప్పురి, ఫైజ్ అహ్మద్ ఫైజ్, మజ్రూహ్
సుల్తాన్ పురీల గజళ్ల ప్రభావంతో ప్రణయంలో ప్రళయాన్నీ, ప్రళయంలో ప్రణయాన్నీ ప్రతిఫలింపజేశాడు.
మఖ్ధూం గీతాల్లో అధిక ప్రాచుర్యం పొందిన గీతం 'ఒక మల్లెపందిరి నీడ క్రింద..."
<poem>
'మల్లె పందిరి నీడ క్రింద ...
మధుశాల సమీపాన ఆ మూల
రెండు శరీరాలు ప్రళయాగ్నిలో కాలిపోతున్నాయి.
వలపు సహజీవనాక్షరము వారికి -
వలపు ఇలవేల్పు వారికి
వలపె తమ మృతిపాన్పు -
వైద్యుడా! తెలుపవయ్యా</poem>
నీ సంచి లోపల ప్రేమ రసాయనోపాయమ్ము ఉన్నదా?!' - అని ఉద్వేగ భరిత స్వరంతో కలి ప్రశ్నిస్తున్నాడు. ఈ గీతాన్ని అమితంగా ప్రేమించిన వఖ్యూం ఉద్యమం సహచరుడు రాజ్ బహద్దూర్ గౌర్ తన ఇంటి గేటుపై మల్లెపందిరి పెంచుతూ, తాను జీవించినంత కాలం తమ ఇంటిని 'చంబేలీ కా మండువా' (మల్లెపందిరి) గానే పరిగణించాడు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |320 | తేజోమూర్తులు}}</noinclude>
s0jfx5gbf39e1v8mt5afoo5aoxnogn9
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/342
104
211790
555714
552162
2026-05-09T14:06:12Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555714
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
వరంగల్ నగరానికి వెళ్లే సాహితీ ప్రేమికులు వేయిస్తంభాల గుడినీ, ప్రజాకవి కాళోజీని సందర్శించేవారు. అలాగే హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రముఖులు చార్మినార్ని, ముఖ్యులనీ దర్శించేవారు. అలాంటి అరుదైన సందర్శనీయ సాహితీ వైతాళికుల్లో ముఖ్ధూం ప్రముఖుడు.
ముఖ్ధూంలో కేవలం భావుకత మాత్రమే కాదు. భావ పరిణతి, పరిపక్వత లున్నాయి. జీవితాన్ని గురించి సమగ్ర
అవగాహన ఉంది' అంటూ రాజ్ విశ్లేషించాడు.
<poem>
"వస్తున్నది వస్తున్నది— వస్తున్నది వస్తున్నది.
నవజీవన పతాకాన్ని— ఎగరేస్తూ వస్తున్నది.
నమ సమాజ కథాకళిని — వినిపిస్తూ వస్తున్నది
విజయాలను సౌఖ్యాలను— వెంట తీసుకొస్తున్నది'</poem>
అంటూ మరో ప్రపంచ నిర్మాణాన్ని కలలు గన్న విప్లవ కాల్పనిక కవి మఖ్తూం 1969 ఆగస్టు 25న గుండెపోటుతో
అకాల మరణానికి గురయ్యాడు. వందలాది మిత్రుల ఆదరాభి మానాలను, వేలాది ప్రజల హృదయాలనూ చూరగొన్న అమృత హృదయుడు మృత్యువు ముందు ఓడిపోయాడు. కవిగా, నాటక రచయితగా, వక్తగా, ఉత్తమ ఉపాధ్యాయు డిగా, కార్మికోద్యమ నేతగా, కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా, బహుముఖీన మైన కృషిని కొనసాగించిన
మఖ్ధూంను స్మరిస్తూ ఫైజ్ అహ్మద్ ఫైజ్...
<poem>
'నువ్వు జ్ఞప్తికి వస్తూనే ఉన్నావు రాత్రంతా
వెన్నెల మనసుని బాధిస్తూనే ఉంది రాత్రంతా
ఒకసారి వెలుగుతూ వేరొకసారి ఆరుతూ</poem>
దుఃఖదీపం గాలికి రెపరెపలాడుతూనే ఉంది రాత్రంతా అంటూ స్మృతిగీతం రాశాడు. అలాగే మరో ప్రసిద్ధ ఉర్దూ
కవి ఖ్వాజా అహ్మద్ అబ్బాస్...
<poem>
'అతను జ్వాల, అతను మంచు కూడా
అతను విప్లవానికి పిలుపు, అందె రవళి కూడా
అతను జ్ఞానం, కర్మబుద్ధి కూడా
అతను మందుగుండు ఘాటైన వాసన
అతను మల్లెపూల సువాసన కూడా' అంటూ నివాళులర్పించాడు.</poem>
నేడు ముఖ్ధూం లేడు. అతని అదర్భాలున్నాయి. అతని ఆశయాలున్నాయి. స్వప్నాలున్నాయి. వాటి కోసం
పునరంకితం కావడమే ఆ మహామనీషికి మనం అర్పించగల నిజమైన నివాళి.<noinclude><references/>
{{rh|తెలంగాణ |321 | తేజోమూర్తులు}}</noinclude>
bmm58ybyjvoevqlzddnl8m0r8etce6w
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/343
104
211791
555715
552163
2026-05-09T14:09:45Z
A.Murali
3019
555715
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''91. మంత్రి శ్రీనివాసరావు'''</p>}}
{{right|-డా. జె. విజయకుమార్}}
నిజాం కళాశాలలో సాధారణ విద్యార్థిగా చేరిన ఓ
తెలంగాణ యువకుడు చదువుతోపాటు
నాటకాలపై దృష్టి సారించాడు. ఆ అభిరుచి అంతటితో
ఆగిపోకుండా లండన్ వెళ్ళి నాటక రంగంలో అధ్యయనం
చేసేలా బాటలు వేసింది. నటశిక్షణలో ఉన్నత
విద్యనభ్యసించిన ఆయన తెలుగు నాటకం రంగంలో
ఆధునిక నాటక ప్రయోగాలకు మార్గదర్శకుడయ్యాడు.
అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఏర్పడిన
రంగస్థలం విభాగానికి యూనివర్శిటీ స్థాయిలో అధిపతి
అయ్యారు. ఆయన ఎవరోకాదు మంత్రి శ్రీనివాసరావు.
మంత్రి శ్రీనివాసరావు రంగారెడ్డి జిల్లా కందుకూరు
సమీపంలోని బచ్చుపల్లిలో మంత్రి రామచంద్రరావు,
రాజ్యలక్ష్మి దంపతులకు 1928 జనవరి 1న జన్మించారు.
ఆయన పాత నగరంలోని ముఫీద్ ఉల్ ఆలం
హైస్కూలులో ప్రాథమిక విద్యనభ్యసించిన తరువాత నిజాం
కళాశాలలో ఇంటర్, డిగ్రీ, మాస్టర్ డిగ్రీలను పూర్తిచేశారు.
అప్పట్లో నిజాం కళాశాల గొప్ప సాంస్కృతిక కేంద్రంగా
వర్ధిల్లేది. అక్కడ అధ్యాపకుల ప్రోత్సాహంతో విద్యార్థులు
షేక్స్పియర్, బ్రెక్ట్, చెకోన్ల ఆంగ్ల నాటకాలను నిజాం
కళాశాల వార్షికోత్సవాల్లో విరివిగా ప్రదర్శించేవారు. ఈ
నేపథ్యమే కళాశాలలో చేరిన మంత్రి శ్రీనివాసరావుపై
ప్రభావం చూపింది. 1946లో నిజాం కళాశాల విద్యార్ధిగా
చేరిన మంత్రి నాటకాలపట్ల ప్రభావితుడై ఆంగ్ల
నాటకాలతోపాటు తెలుగు నాటకాలను ప్రదర్శించడం
మొదలుపెట్టారు.
మంత్రి శ్రీనివాసరావు నిజాం కళాశాలలో
చదువుతున్నపుడే ప్రముఖ సాహితీవేత్త, జర్నలిస్టు అబ్బూరి
వరద రాజేశ్వరరావుతో స్నేహం ఏర్పడింది. మంత్రి నాటక
ఆసక్తిని గమనించిన ఆయన ప్రపంచ నాటక రంగాన్ని
పరిచయం చేసాడు. అంతేకాదు సరోజినినాయుడి
కుమారుడు జయసూర్య ద్వారా కావలసిన నాటక పుస్తకాలను
సంపాదించి మంత్రికి ఇచ్చేవాడు. ఈ అధ్యయనమే మంత్రి
శ్రీనివాసరావు ఆధునిక తెలుగు నాటకంవైపు దృష్టి సారించేలా
చేసింది. అదే సమయంలో నాటక రంగ ప్రముఖులు ఏ.ఆర్.
కృష్ణతో పరిచయం ఏర్పడింది.
ఆధునిక నాటక ప్రయోగాలపట్ల ఇద్దరి భావాలు
ఏకసూత్రం కావడంతో నాటక వికాసం కోసం నడుం కట్టారు.
1952లో ఇండియన్ నేషనల్ థియేటర్ (INT)
హైదరాబాద్ ప్రారంభించారు. హైదరాబాద్లో ఆంగ్ల
నాటకాల వ్యాప్తికి కృషి చేసిన హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ
భార్య కమలాదేవి ఛటోపాధ్యాయ జాతీయ నాట్య సంఘానికి
అధ్యక్షులుగా ఉండేవారు. ఆమె ప్రోత్సాహంతో మంత్రి
శ్రీనివాసరావు, పి. ఆర్. కృష్ణలు INT నాటకోత్సవాలను సిటీ
కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఇందులో బెల్లంకొండ
తెలంగాణ 322 తేజోమూర్తులు ఉం<noinclude><references/>
{{rh|తెలంగాణ |322 | తేజోమూర్తులు}}</noinclude>
lepb6n72m2x2gvrv2q854ahn610ialz
555718
555715
2026-05-09T14:37:40Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555718
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''91. మంత్రి శ్రీనివాసరావు'''</p>}}
{{right|-డా. జె. విజయకుమార్}}
నిజాం కళాశాలలో సాధారణ విద్యార్థిగా చేరిన ఓ తెలంగాణ యువకుడు చదువుతోపాటు నాటకాలపై దృష్టి సారించాడు. ఆ అభిరుచి అంతటితో ఆగిపోకుండా లండన్ వెళ్ళి నాటక రంగంలో అధ్యయనం చేసేలా బాటలు వేసింది. నటశిక్షణలో ఉన్నత విద్యనభ్యసించిన ఆయన తెలుగు నాటకం రంగంలో ఆధునిక నాటక ప్రయోగాలకు మార్గదర్శకుడయ్యాడు. అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఏర్పడిన రంగస్థలం విభాగానికి యూనివర్శిటీ స్థాయిలో అధిపతి అయ్యారు. ఆయన ఎవరోకాదు మంత్రి శ్రీనివాసరావు.
మంత్రి శ్రీనివాసరావు రంగారెడ్డి జిల్లా కందుకూరు సమీపంలోని బచ్చుపల్లిలో మంత్రి రామచంద్రరావు, రాజ్యలక్ష్మి దంపతులకు 1928 జనవరి 1న జన్మించారు. ఆయన పాత నగరంలోని ముఫీద్ ఉల్ ఆలం హైస్కూలులో ప్రాథమిక విద్యనభ్యసించిన తరువాత నిజాం కళాశాలలో ఇంటర్, డిగ్రీ, మాస్టర్ డిగ్రీలను పూర్తిచేశారు. అప్పట్లో నిజాం కళాశాల గొప్ప సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లేది. అక్కడ అధ్యాపకుల ప్రోత్సాహంతో విద్యార్థులు షేక్స్పియర్, బ్రెక్ట్, చెకోన్ల ఆంగ్ల నాటకాలను నిజాం కళాశాల వార్షికోత్సవాల్లో విరివిగా ప్రదర్శించేవారు. ఈ నేపథ్యమే కళాశాలలో చేరిన మంత్రి శ్రీనివాసరావుపై ప్రభావం చూపింది. 1945లో నిజాం కళాశాల విద్యార్ధిగా చేరిన మంత్రి నాటకాలపట్ల ప్రభావితుడై ఆంగ్ల నాటకాలతోపాటు తెలుగు నాటకాలను ప్రదర్శించడం మొదలుపెట్టారు.
మంత్రి శ్రీనివాసరావు నిజాం కళాశాలలో చదువుతున్నపుడే ప్రముఖ సాహితీవేత్త, జర్నలిస్టు అబ్బూరి వరద రాజేశ్వరరావుతో స్నేహం ఏర్పడింది. మంత్రి నాటక ఆసక్తిని గమనించిన ఆయన ప్రపంచ నాటక రంగాన్ని
పరిచయం చేసాడు. అంతేకాదు సరోజినినాయుడి కుమారుడు జయసూర్య ద్వారా కావలసిన నాటక పుస్తకాలను
సంపాదించి మంత్రికి ఇచ్చేవాడు. ఈ అధ్యయనమే మంత్రి శ్రీనివాసరావు ఆధునిక తెలుగు నాటకంవైపు దృష్టి సారించేలా చేసింది. అదే సమయంలో నాటక రంగ ప్రముఖులు ఏ.ఆర్. కృష్ణతో పరిచయం ఏర్పడింది.
ఆధునిక నాటక ప్రయోగాలపట్ల ఇద్దరి భావాలు ఏకసూత్రం కావడంతో నాటక వికాసం కోసం నడుం కట్టారు. 1952లో ఇండియన్ నేషనల్ థియేటర్ (INT) హైదరాబాద్ ప్రారంభించారు. హైదరాబాద్లో ఆంగ్ల నాటకాల వ్యాప్తికి కృషి చేసిన హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ భార్య కమలాదేవి ఛటోపాధ్యాయ జాతీయ నాట్య సంఘానికి అధ్యక్షులుగా ఉండేవారు. ఆమె ప్రోత్సాహంతో మంత్రి శ్రీనివాసరావు, పి. ఆర్. కృష్ణలు INT నాటకోత్సవాలను సిటీ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఇందులో బెల్లంకొండ<noinclude><references/>
{{rh|తెలంగాణ |322 | తేజోమూర్తులు}}</noinclude>
jnktbvpm282w0ohpnl43c8p20pp2zc1
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/344
104
211792
555719
552164
2026-05-09T14:46:33Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555719
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
రామదాసు 'మాస్టార్జీ' నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకం హైదరాబాద్, ఇతర తెలంగాణా ప్రాంతాల్లో విశేషంగా
ఆదరించడంతో మరిన్ని కొత్త నాటకాలు అవిష్కృతమయ్యాయి.
అబ్బూరి రామకృష్ణారావు బహుభాషావేత్త, ప్రఖ్యాత కవి, తెలుగు నాటక ప్రయోగాల మార్గదర్శిగా ప్రసిద్ధులు. వరద రాజేశ్వరరావు ద్వారా అబ్బూరి వారి పరిచయం ఏర్పడ్డది. అబ్బూరి ఆధునిక నాటక ప్రయోగాలపట్ల మంత్రి
ప్రభావితుడయ్యాడు. నాటకాన్ని ఆధునిక దృక్కోణంలో దర్శించడం మొదలుపెట్టాడు. ఆ రోజుల్లోనే మంత్రి నటశిక్షణ, నాటక ప్రదర్శన, శాస్త్రీయ పద్ధతిలో సాగాలని పరితపించాడు. ఇందువల్లనే తరువాత కాలంలో మంత్రి శ్రీనివాసరావు అబ్బూరికి ప్రియశిష్యుడయ్యాడు.
హైదరాబాద్ నాట్య సంఘం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ వేదికగా నాటక పోటీలు నిర్వహించారు. మంత్రి సారథ్యంలో "ఇన్స్పెక్టర్ జనరల్' నాటకాన్ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. ఈ నాటకం మంత్రికి గుర్తింపు తెచ్చిపెట్టింది. 1957లో INT నాటకోత్సవాల సందర్భంగా కుందుర్తి ఆంజనేయులు వచన కవితాశైలిలో రాసిన 'ఆశ' నాటకాన్ని మంత్రి ఎక్స్పరిమెంట్ డ్రామాగా ప్రదర్శించారు. ఈ నాటకానికి ఆయనే ప్రయోక్త. ఈ నాటకంలో మంత్రి, ప్రొఫెసర్ రమామేల్కొటే కలిసి నటించారు. ఈ నాటకం మంత్రిని సృజనాత్మక నాటక ప్రయోక్తగా నిలబెట్టింది.
అట్లానే శ్రీశ్రీ రచించిన 'విదూషకుడి ఆత్మహత్య నాటకాన్ని మంత్రి ఉత్తమ ప్రయోగంగా మలిచాడు. శ్రీశ్రీ మొదటగా దీనిని రేడియో నాటకంగా అందిస్తే, ఆ తరువాత మంత్రి ఏ.ఆర్. కృష్ణలు ఈ నాటకాన్ని రంగస్థలానికి అనుపుగా నాటకీకరణ చేసి ప్రదర్శించారు. గ్రీకు నాటకాల కోరస్ సంప్రదాయాన్ని ఈ నాటకంలో ప్రవేశపెట్టారు. తెలుగు నాటక చరిత్రలో ఈ ప్రయోగం ప్రముఖంగా పేర్కొనదగింది. ప్రఖ్యాత నాటక ప్రయోక్త అబ్బూరి రామకృష్ణారావు ఈ నాటక
ప్రదర్శన చూసి "As a highly successfull example of an experimental production by Mantri"
కితాబిచ్చారు.
1957లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సంగీత నాటక అకాడమీని ఏర్పాటు చేసింది. ఇందులో మంత్రి శ్రీనివాసరావును అకాడమీ సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది. అకాడమీ ప్రారంభోత్సవాల సందర్భంగా 'నిచ్చెనలు' అనే నాటికను ప్రదర్శించారు. ఇందులో మంత్రి శ్రీనివాసరావు, పన్నురి రామారావు మొదలైనవారు నటించారు.
మంత్రి సంగీత నాటక అకాడమీ సభ్యుడిగా కార్యక్రమాల్లో ప్రధాన భూమిక పోషించారు. ఆయన అందించిన అనేక సలహాలు తెలుగు నాటక నిర్మాణానికి దోహదపడ్డాయి. 1959లో మంత్రి శ్రీనివాస రావు హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ సహకారంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 40 రోజులపాటు సంగీత, నృత్య, నాటకోత్సవాలను నిర్వహించడం ఆయనలోని కళాతృష్ణకు నిదర్శనం. ప్రఖ్యాత రంగస్థల నటులు పృథ్వీ రాణి కపూర్, దమయంతి జోషిలను అతిధులుగా హైదరాబాద్కు రప్పించి ఆనాటి కార్యక్రమాలను విజయవంతం చేశారు.
'''ఉద్యోగిగా మంత్రి శ్రీనివాసరావు'''
హైదరాబాదులో పోలీస్ యాక్షన్ కు పూర్వం నిజాం ప్రభుత్వంలో పోలీసు శాఖలో మంత్రి శ్రీనివాసరావు పనిచేసేవారు. ఆ తరువాత హైదరాబాద్ రాష్ట్రం సెక్రటేరియట్లో అనువాదకుడిగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక సమాచార శాఖలోని అనువాద విభాగంలో కొత్త ఉద్యోగంలోకి మారారు. ఆ విభాగానికి ప్రముఖ సాహితీవేత్త డా. బోయి భీమన్న అధిపతిగా ఉండేవారు. తరువాతికాలంలో అదే శాఖలో పౌరసంబంధాల అధిపతిగా నియమితులయ్యారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే నాటక రంగానికి అంకితమై పనిచేశారాయన. ఈ ఉద్యోగం ఎంతోమంది కవులు, కళాకారులను పరిచయం చేసింది. ఆయన చేసే నాటకరంగ కార్యక్రమాలకు దోహదపడేలా చేసింది.
'''తొలితరం నటశిక్షణ అధ్యాపకుడు '''
నాటకరంగానికి శాస్త్రీయపద్ధతిలో నటీనటులను తయారుచేయాలన్న సంకల్పంతో 1959తో నాట్యవిద్యాలయం హైదరాబాదులో ఏర్పడింది. అబ్బూరి రామకృష్ణారావు డైరెక్టరుగా ఏ.ఆర్. కృష్ణ, మంత్రి<noinclude><references/>
{{rh|తెలంగాణ |323 | తేజోమూర్తులు}}</noinclude>
qvwxuwoqj25h29b80vt8xq4njanuhu9
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/345
104
211793
555720
552165
2026-05-09T14:56:52Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555720
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
శ్రీనివాసరావులు అధ్యాపకులుగా విద్యార్థులకు నటనలో శిక్షణందించేవారు. ఆనాటి నాట్యవిద్యాలయం ఒక థియేటర్
లేబరేటరీగా పనిచేసేది. ఇక్కడ సరికొత్త ప్రయోగాలకు ఓ రూపాన్నిచ్చి ఆధునిక ప్రక్రియలో నాటకాలను ప్రదర్శించే వారు. 'కన్యాశుల్కం', 'మృచ్ఛకటికం' వంటి నాటకాలను ప్రయోగాత్మకంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళారు.
'కన్యాశుల్కం' నాటకాన్ని గొప్ప గొప్ప నటులు ఇదివరకే ప్రదర్శించినప్పటికీ మంత్రి శ్రీనివాసరావు నిర్వహణ, అబ్బూరి రామకృష్ణారావు దర్శకత్వం, అబ్బూరి గోపాలకృష్ణ డిజైన్ పబ్లిక్ గార్డెన్లో విభిన్న సాంకేతిక అంశాలతో ప్రదర్శితమైంది. ఆ రోజుల్లో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన చైనీస్ గార్డెన్ (సరోర్బాగ్) లో కొత్త తరహా రంగాలంకరణతో వేదికపై తెరలు లేకుండా 'లైట్సాఫ్ -లైట్సాస్ లోనే 'కన్యాశుల్కం' నాటకాన్ని ప్రదర్శించారు. ఆనాటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పూర్తి నాటకాన్ని చూసి నటీనటులను అభినందించారు. ఆ రోజుల్లో గొప్ప ప్రయోగంగా ఆ తరంవారు ఇప్పటికీ చెప్పుకుంటారు. అదేవిధంగా మంత్రి నిర్మాణ సారథ్యంలో ఏ.ఆర్. కృష్ణ దర్శకత్వంలో 1964 తొలిరోజుల్లోనే 'మృచ్ఛకటికం' గొప్ప ప్రయోగాత్మక నాటకంగా ప్రదర్శింపబడింది. ఈ నాటకాన్ని హైదరాబాద్లోనే కాకుండా వరంగల్, ఖమ్మం, సూర్యాపేట వంటి అనేక ప్రాంతాల్లో ప్రదర్శించారు.
ఆ తరువాత నాటి భారత రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణ ఆహ్వానం మేరకు 'మృచ్ఛకటికం' నాటకాన్ని రాష్ట్రపతి భవన్లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శన భారతీయ నాటక విమర్శకులను అబ్బురపరచింది. హైదరాబాద్ కేంద్రంగా ఇటువంటి గొప్ప ప్రయోగాత్మక నాటకాలు ప్రదర్శిస్తారని ఇప్పుడే తెలిసింది అన్నారట. ఈ ప్రదర్శన చూసిన రాష్ట్రపతి ప్రతి నటుడ్ని అక్కున చేర్చుకుని తెలుగులో మాట్లాడుతూ అభినందించారట. ఆ రోజు అందులో పాల్గొన్న
నటులకు ఓ తియ్యటి జ్ఞాపకంగా మిగిలింది.
నిరంతరం నాటకం గురించి ఆలోచించే మంత్రికి నాటక ప్రయోగాలపట్ల వ్యామోహం తగ్గలేదు. రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న సమయంలోనే ఆయన 1961లో సంవత్సరంపాటు సెలవు తీసుకుని ప్రముఖ బ్రిటిష్ రంగస్థల నిపుణులు 'హెర్బట్ మార్షల్' బొంబాయిలో నిర్వహిస్తున్న నటశిక్షణ పాఠశాలలో ప్రత్యేక కోర్సును పూర్తిచేశారు. అక్కడ "డైరీ ఆఫ్ అనేఫ్రాంక్" ఆంగ్లనాటకంలో ప్రాముఖ్యత కలిగిన పాత్రను పోషించి అభినయ ప్రదర్శనలో తన ప్రత్యేకతను చాటాడు. ఆ తరువాత 1963లో నటనలో ప్రత్యేక శిక్షణ నిమిత్తం లండన్లోని బ్రిటిష్ డ్రామా లీగ్కు
దరఖాస్తు చేసుకున్నారు. భారతదేశం నుండి కేవలం నలుగురిని మాత్రమే ఎంపిక చేసే ఈ కోర్సుకు అనేక
వడపోతల్లో మంత్రి శ్రీనివాసరావు ఎంపికయ్యారు.
విమానంలో వెళ్ళడానికి ఆయన దగ్గర సరిపడా డబ్బు లేకపోవడంతో 13 రోజులపాటు ఓడపై సముద్ర ప్రయాణం
చేసి మంత్రి శ్రీనివాసరావు లండన్ చేరుకున్నారు లండన్లో సంవత్సరంపాటు శిక్షణ కొనసాగింది. ఈ మధ్యలో
శ్రీనివాసరావు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అయినప్పటికీ వార్షిక పరీక్షల్ల ఉత్తీర్ణత పొంది విదేశాల్లో 'యాక్టింగ్ డిప్లొమా' సాధించిన కీర్తి మంత్రి శ్రీనివాసరావుకు దక్కింది. లండన్ నుండి హైదరాబాదుకు తిరిగి వచ్చిన తరువాత మంత్రి శ్రీనివాసరావు తన చివరి మజిలీ వరకు నాటకాన్ని వదలలేదు. విదేశాల్లో నేర్చుకున్న విద్యను మంత్రి
తెలుగునాట నాటక వ్యాప్తికి ఉపయోగించారు.
విద్యార్థులకు నటశిక్షణ, ఆధునిక నాటక ప్రయోగాలపై మార్గనిర్దేశకత్వం చేశారు. చెకోవ్, ఇబ్సన్, స్టానిస్లవిస్కీ,
స్ప్రిండ్ బార్స్ ఎవరి గురించి మాట్లాడినా మంత్రి సాధికారికంగా మాట్లాడేవారు. మంత్రి ఆలోచనలు ఎంతో ఉన్నతంగా ఉండేవి. ఆ రోజుల్లో నడుస్తున్న తెలుగు నాటకాల ధోరణికి ఆయనలోని ఆలోచనలకు విరుద్ధంగా కనిపించేవి.
అయినప్పటికీ ప్రయోగాత్మక నాటకాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్ళడానికి ఆయన నిరంతరం తపనపడేవారు.
అందులో భాగంలోనే సంస్కృత, ఆంగ్ల నాటకాలను తెలుగులోకి అనువదించి ప్రదర్శనలుగా తీసుకురావడానికి
మంత్రి విశేషంగా కృషి చేశారు. చెకోవ్ 'Jubilee' నాటకాన్ని తెలుగులో 'వార్షికోత్సవం'గా, 'A Dolls House' నాటకాన్ని 'బొమ్మరిల్లు'గా, 'Proposal' నాటకాన్ని 'ప్రధానంగా, ఇంకా 'మృచ్ఛకటికం', 'ప్రతాపరుద్రీయం' వంటి సంస్కృత నాటకాలను తెలుగులోకి అనువదింపజేసి ప్రదర్శించారు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |324 | తేజోమూర్తులు}}</noinclude>
baasyeovtcc727hf0ku24lrzzn8mic4
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/346
104
211794
555721
552166
2026-05-09T15:04:56Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555721
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
'''ఆంధ్ర విశ్వవిద్యాలయ తొలి రంగస్థల శాఖాధిపతిగా...'''
ఆంధ్ర విశ్వవిద్యాలయం 1966లో నాటక శాఖను (Theatre Arts Dept.) ప్రారంభించింది. అప్పటివరకూ
భారతదేశంలో కేవలం National School of Drama (NSD) మాత్రమే ఉండేది. ఉద్యోగ ప్రకటన ద్వారా హైదరాబాద్ నాట్య విద్యాలయంలో అధ్యాపకుడుగా పనిచేస్తున్న మంత్రి శ్రీనివాసరావును ఆనాటి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ శ్రీనివాస అయ్యంగార్ నాటకశాఖ ఆచార్యుడిగా ఎంపిక చేశారు. విశ్వవిద్యాలయ స్థాయిలో బోధనార్హతలు ఆ రోజుల్లో మంత్రి శ్రీనివాసరావుకు ఉండంతో దక్షిణ భారతదేశంలో ఏర్పడిన తొలి రంగస్థల శాఖకు ఆయన మొదటి శాఖాధిపతిగా నియమితులయ్యారు.
అప్పటివరకూ తెలుగుశాఖకు అనుబంధంగా నడుస్తున్న కోర్సుకు ప్రముఖ తెలుగు నాటక ప్రయోక్త, నటులు
కె. వెంకటేశ్వరరావు అక్కడ స్టేజ్ డైరెక్టర్గా పనిచేసేవారు. మంత్రి శాఖాధిపతిగా నియమితులయ్యాక ఆంధ్ర
విశ్వవిద్యాలయం నాటక శాఖను నాటక ప్రయోగశాలగామార్చాడు. స్టానీస్లవిస్కీ నటశిక్షణ పద్ధతిలో ఎందరినో
ఉత్తమ నటులుగా తీర్చిదిద్ది విశ్వవిద్యాలయ ప్రతిష్టను పెంచారు.
మంత్రి తెలంగాణ భాషను, యాసను ఎంతగా ప్రేమించేవాడో తాను పనిచేస్తున్న ప్రాంత మాండలికాన్ని కూడా అంతే గౌరవించేవాడు. మాండలికాల్లోనే ప్రజల జీవితం దాగుందని ఆయన భావన. ఇక్కడి మాండలికాల్లో ప్రదర్శిస్తే
ప్రజలు నాటకాన్ని ఆదరించి బ్రతికిస్తారని మంత్రి విశ్వసించాడు. ఆ ప్రయత్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం నాటక
ప్రయోగాల్లో కనిపిస్తుంది. ఆ ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించేలా గణేశ్ పాత్రలో శ్రీకాకుళం మాండలికంలో
'కొడుకు పుట్టాల' నాటకాన్ని, అత్తిలి కృష్ణారావుచే విశాఖ మాండలికంలో 'యుగసంధ్య నాటకాన్ని రచించేలా మంత్రి
దోహదపడ్డారు. విద్యార్థులచే ప్రదర్శితమైన ఈ నాటకాలకు ఆ రోజుల్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దానికి మంత్రి
మార్గదర్శకత్వమే మూల కారణం.
సాక్షి రంగారావు, వంకాయల సత్యనారాయణ, అత్తిలి కృష్ణారావు, కృష్ణచైతన్య, ఎస్.కె. మిశ్రా, రామవరపు శరత్ బాబు, డా. తంబూ చంద్రశేఖర్, కొత్తుర్తి భాస్కరరావు, ఆచార్య రామవరపు శరత్బాబు తరువాత కాలంలో ఇక్కడి
నాటకశాఖకు శాఖాధిపతులయ్యారు. మంత్రి ఆంధ్ర విశ్వవిద్యాలయం నాటకశాఖకు 1966 నుండి 1974 వరకు
శాఖాధిపతిగా సేవలందించారు. ఆయన నిర్వహణలో ప్రదర్శించిన అనేక నాటక ప్రయోగాలు తెలుగు నాటక
వికాసానికి బాటలు వేశాయి.
తెలుగు అకాడమీ ప్రచురించిన 'రంగస్థలశాస్త్రం' అనే పాఠ్యగ్రంథానికి మంత్రి రచయితగా ఉన్నారు. సుదీర్ఘకాలంగా
నాటకరంగంలో తలమునకలై పనిచేస్తున్న మంత్రి శ్రీనివాసరావుకు తన ఆరోగ్యంపట్ల శ్రద్ధ ఉండేది కాదు. ఆంధ్ర యూనివర్శిటీలో పనిచేస్తున్న కాలంలోనే అనారోగ్యంతో బాధపడ్డారు. రంగస్థల కళల శాఖ విద్యార్థులు ప్రదర్శించ బోయే నాటక ఏర్పాట్లలో మునిగిపోయిన సమయంలోనే మంత్రి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అత్యవసర వైద్య నిమిత్తం విశాఖలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ 9 అక్టోబరు 1974లో అకాల మరణం చెందారు. అప్పటికాయనకు 46 ఏండ్లే. తెలుగు ఆధునిక నాటక వికాసానికి, తెలంగాణ ఆధునిక నాటక చైతన్యానికి మంత్రి శ్రీనివాసరావు చేసిన కృషి చిరస్మరణీయం.<noinclude><references/>
{{rh|తెలంగాణ |325 | తేజోమూర్తులు}}</noinclude>
1d226r3moozvkifyhh28646ivclcfsq
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/347
104
211795
555722
552167
2026-05-09T15:05:28Z
A.Murali
3019
555722
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>92
బ
హుముఖ ప్రజ్ఞాశాలి, పరోపకారి, తెలంగాణావాది,
వెస్ట్రన్ జ్యోతిష ద్రవ, ఉన్నత పదవులను
అధిరోహించిన మేధావి మాటేటి రామప్ప గారు. ఒక
సామాన్య వ్యక్తి అసామాన్యంగా ఎదగడం వెనుక ఎంతటి
కార్యదీక్ష, పట్టుదల కఠోరశ్రమ దాగివుంటుందో అందుకు
ఉదాహరణ మాటేటి రామప్ప గారు.
మాటేటి రామప్ప గారు 1916లో ఏప్రిల్ 20వ తేదీన
ఆనాటి వరంగల్ జిల్లాలోని శనిగరం గ్రామంలో జన్మించారు.
తల్లిదండ్రులు లచ్చమ్మ, సాయన్నలు పద్మకాలి కులంలో,
దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. తండ్రి
చిన్న వయసులో చనిపోవడంతో తల్లి బతుకుదెరువు కోసం
హైదరాబాదుకు వలసవచ్చింది. అందువల్ల రామప్ప గారి
విద్యాభ్యాసం హైదరాబాదులోనే కొనసాగింది.
రామప్ప గారు చదువులో చాలా చురుకైన విద్యార్థి.
ఎన్ని కష్టాలెదురైనప్పటికి చదువును ఆపకుండా మ్యాథమెటిక్
ఆప్షనల్తో బి.ఏ. చదివి గోల్డెమెడల్ సాధించారు. ఆ రోజుల్లో
డిగ్రీ చదువడమంటే మామూలు విషయంకాదు. రామప్ప
గారికి డిగ్రీ పూర్తయిన వెంటనే 1940లోనే గెజిటెడ్
తాహసిల్దార్ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత రామప్ప గారు
వెనకకు తిరిగి చూడలేదు.
ఉద్యోగజీవితంలో అంచలంచెలుగా ఎదిగి 1948లో
-డిప్యూటి కలెక్టర్ గా, 1948లో రాయమార్ కలెక్టర్గా
మాటేటి రామప్ప
-
డా|| యం. దేవేంద్ర
ఉన్నత పదవి బాధ్యతలను నిర్వహించారు. అంతేకాకుండా
నిజాం మున్సిపల్ కమీషనర్ గా, సివిల్ సప్లైసైసికి డైరెక్టర్గా
ఇలా అనేక పదవులను అధిరోహించి తనదైన ప్రతిభను
కనబరిచారు. తెలంగాణలో ఆనాడు ఎంతోమందికి ఉద్యోగ
భిక్షను ప్రసాదించారు. బీదవారికి లేదనకుండా సహాయం
చేసేవారు. దయాగుణం, దానగుణం, క్షమాగుణం కలిగిన
ఉదారవ్యక్తిత్వం రామవ్వ గారిది. ఎంతోమంది
పేదకుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచారు.
రామప్ప గారికి 12 ఏండ్ల వయస్సులో మధ్యతరగతి
కుటుంబానికి చెందిన లక్ష్మీదేవి గారితో పెండ్లి జరిగింది.
వారికి నలుగురు పుత్రసంతానం. వారందరిని కూడా
ఉన్నతచదువులు చదివించి ఆచార్యులను, డాక్టర్లను
చేయగలిగారు. కుటుంబ విషయంలో భార్యపిల్లలకు ఏ లోటు
రాకుండా చూసుకున్నారు.
రామప్ప గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. పదవీబాధ్యతల్లో
నిరంతరం తలమునకలైనప్పటికి కూడా తనకు ఇష్టమైన
జ్యోతిష శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూనే వచ్చారు. పాశ్చాత్య
జ్యోతిష పద్ధతి ద్వారా అనగా సూర్యమాన జ్యోతిషాన్ని
క్షుణ్ణంగా అధ్యయనం చేసి పట్టు సాధించారు. ఎంతోమంది
ప్రముఖులు జ్యోతిషం చెప్పించుకోవడం కోసం రామప్పగారి
అంటి తలుపు తట్టేవారు. అనాడు రాజకీయ ప్రముఖులైన
బెజవాడ గోపాలరెడ్డి, మర్రిచెన్నారెడ్డి, ఎన్.టి. రామారావు
తెలంగాణ 326 తేజోమూర్తులు ఉం<noinclude><references/>
{{rh|తెలంగాణ |326 | తేజోమూర్తులు}}</noinclude>
bqzwnd5sd85qir2bq1bny3xcfakud33
555732
555722
2026-05-10T06:16:00Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555732
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''92. మాటేటి రామప్ప '''</p>}}
{{right|-డా౹౹ యం. దేవేంద్ర}}
బహుముఖ ప్రజ్ఞాశాలి, పరోపకారి, తెలంగాణావాది, వెస్ట్రన్ జ్యోతిష ద్రష్ట, ఉన్నత పదవులను అధిరోహించిన మేధావి మాటేటి రామప్ప గారు. ఒక సామాన్య వ్యక్తి అసామాన్యంగా ఎదగడం వెనుక ఎంతటి కార్యదీక్ష, పట్టుదల కఠోరశ్రమ దాగివుంటుందో అందుకు ఉదాహరణ మాటేటి రామప్ప గారు.
మాటేటి రామప్ప గారు 1916లో ఏప్రిల్ 20వ తేదీన ఆనాటి వరంగల్ జిల్లాలోని శనిగరం గ్రామంలో జన్మించారు.
తల్లిదండ్రులు లచ్చమ్మ, సాయన్నలు పద్మకాలి కులంలో, దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. తండ్రి
చిన్న వయసులో చనిపోవడంతో తల్లి బతుకుదెరువు కోసం హైదరాబాదుకు వలసవచ్చింది. అందువల్ల రామప్ప గారి
విద్యాభ్యాసం హైదరాబాదులోనే కొనసాగింది.
రామప్ప గారు చదువులో చాలా చురుకైన విద్యార్థి. ఎన్ని కష్టాలెదురైనప్పటికి చదువును ఆపకుండా మ్యాథమెటిక్
ఆప్షనల్తో బి.ఏ. చదివి గోల్డెమెడల్ సాధించారు. ఆ రోజుల్లో డిగ్రీ చదువడమంటే మామూలు విషయంకాదు. రామప్ప
గారికి డిగ్రీ పూర్తయిన వెంటనే 1940లోనే గెజిటెడ్ తాహసిల్దార్ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత రామప్ప గారు వెనకకు తిరిగి చూడలేదు.
ఉద్యోగజీవితంలో అంచలంచెలుగా ఎదిగి 1948లో డిప్యూటి కలెక్టర్ గా, 1948లో రాయమార్ కలెక్టర్గా ఉన్నత పదవి బాధ్యతలను నిర్వహించారు. అంతేకాకుండా నిజాం మున్సిపల్ కమీషనర్ గా, సివిల్ సప్లైసైసికి డైరెక్టర్గా ఇలా అనేక పదవులను అధిరోహించి తనదైన ప్రతిభను కనబరిచారు. తెలంగాణలో ఆనాడు ఎంతోమందికి ఉద్యోగ భిక్షను ప్రసాదించారు. బీదవారికి లేదనకుండా సహాయం చేసేవారు. దయాగుణం, దానగుణం, క్షమాగుణం కలిగిన
ఉదారవ్యక్తిత్వం రామవ్వ గారిది. ఎంతోమంది పేదకుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచారు.
రామప్ప గారికి 12 ఏండ్ల వయస్సులో మధ్యతరగతి కుటుంబానికి చెందిన లక్ష్మీదేవి గారితో పెండ్లి జరిగింది. వారికి నలుగురు పుత్రసంతానం. వారందరిని కూడా ఉన్నతచదువులు చదివించి ఆచార్యులను, డాక్టర్లను చేయగలిగారు. కుటుంబ విషయంలో భార్యపిల్లలకు ఏ లోటు రాకుండా చూసుకున్నారు.
రామప్ప గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. పదవీబాధ్యతల్లో నిరంతరం తలమునకలైనప్పటికి కూడా తనకు ఇష్టమైన
జ్యోతిష శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూనే వచ్చారు. పాశ్చాత్య జ్యోతిష పద్ధతి ద్వారా అనగా సూర్యమాన జ్యోతిషాన్ని
క్షుణ్ణంగా అధ్యయనం చేసి పట్టు సాధించారు. ఎంతోమంది ప్రముఖులు జ్యోతిషం చెప్పించుకోవడం కోసం రామప్పగారి అంటి తలుపు తట్టేవారు. అనాడు రాజకీయ ప్రముఖులైన బెజవాడ గోపాలరెడ్డి, మర్రిచెన్నారెడ్డి, ఎన్.టి. రామారావు<noinclude><references/>
{{rh|తెలంగాణ |326 | తేజోమూర్తులు}}</noinclude>
qmolt49izu9t68han5w0tl6gi350ht0
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/348
104
211796
555733
552168
2026-05-10T06:28:26Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555733
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
మొదలైన వారికి జ్యోతిష గురువుగా కీర్తిని గడించారు.
రామప్ప గారు జాతకం విషయంలో కుండబద్దలుకొట్టినట్లు చెప్పేవారు. అట్లా చెప్పాలంటే సబ్జెక్టు విషయంలో సంపూర్ణ అవగాహన ఉండాలి. కాలాన్ని లెక్కకట్టగల సమర్థత ఉండాలి. ఈ రెండూ రామప్పగారిలో ఉన్నాయి కాబట్టే... జ్యోతిష్యుడిగా కూడా ఒక వెలుగు వెలిగారని చెప్పవచ్చు. ఆ తర్వాత కాలంలో తన ఆత్మీయ స్నేహితుడు దేవులపల్లి రామానుజారావు గారి సలహామేరకు రామప్ప గారు సంస్కృత భాషను నేర్చుకున్నారు. ఆ రోజుల్లో రవ్వా శ్రీహరి గారు, రామప్పగారి ఇంటికి వెళ్ళి సంస్కృతం నేర్పించారు. రామప్ప గారు సంస్కృత భాషను నేర్చుకొని
తద్వారా భారతీయ జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేశారు. ఈ విధంగా రామప్ప గారు నిరంతరం జ్యోతిష శాస్త్రాన్ని పరిశోధన దృక్పథంతో పరిశీలించి మెలకువలను సాధించేవారు.
రామప్ప గారు తెలుగు, సంస్కృత భాషలే కాకుండా ఆంగ్లం, ఉర్దూ, హిందీ, పర్షియన్, అరబిక్ భాషల్లో మాట్లాడ గలరు. రామప్ప గారి సాహిత్య కృషి గురించి కూడా చెప్పుకోవాలి. దయానంద స్వామి వేదభాష్యాలను ప్రసంగించే వారు. ఖురాన్, భగవద్గీతను పోల్చి చెప్పేవారు. వేమన సాహిత్యాన్ని హిందీలోకి, ఉర్దూలోకి అనువాదం చేశారు. ఈ గ్రంథాన్ని ఆనాడు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అచ్చు వేసింది. ఉర్దూ అకాడమీ వారి కోరికమేరకు తెలుగు, ఉర్దూ భాష నిఘంటువును తయారుచేశారు. ఉన్నత పదవుల్లో కొనసాగుతూ ఇన్ని పనులు చేయడమంటే ఆషామాషికాదు. అయినప్పటికి రామప్ప గారు ఇష్టంగా చేసేవారు.
రామప్ప గారు అక్షరాల తెలంగాణవాది. ఆనాడు హైదరాబాదు ఆంధ్రరాష్ట్రం కలిపి భాషాప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు చేయాలని రాజకీయనాయకులు సంప్రదింపులు జరుపుతుంటే రామప్ప గారు ప్రభుత్వ ఉద్యోగి అయివుండి కూడా పెద్దమనుషుల ఒప్పందాన్ని వ్యతిరేకించారు. ఫజల్ అలీ కమీషన్కు స్వయంగా లేఖ రాసి హైదరాబాద్ రాష్ట్రం
ఎందుకు ఆంధ్రరాష్ట్రంలో కలవకూడదో కారణాలతోసహా లేఖలో విశ్లేషించారు. అయినప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక
తప్పలేదు. ఆనాడు నీలం సంజీవరెడ్డి బాహాటంగా తెలంగాణ వాళ్ళకి తెలివిలేదు” అన్నప్పుడు రామప్ప గారు
ప్రభుత్వ ఉద్యోగినని తెలిసి కూడా చూడకుండా నీలం సంజీవరెడ్డిని నిలదీశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే 'పూలకుండీలు కనబడుటలేదు అన్న చిన్న అపవాదుతో రామప్ప గారు పదవి నుండి అర్ధాంతరంగా తొలిగింప
బడ్డారు. అయినా రామప్ప గారు అధైర్యపడలేదు. ఆ సమయంలో తన ఆస్తులను అమ్ముకొని కుటుంబ ఖర్చులు
వెళ్ళదీసుకున్నారు. తిరిగి మర్రిచెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రామప్ప గారికి
మంచిరోజులు వచ్చాయి.
1980 - 81 ప్రాంతంలో మాటేటి రామప్ప గారు అప్పటి అంతర్జాతీయ తెలుగు సంక్షేమ డైరెక్టర్గా నియమించబడ్డారు. 1975లో హైదరాబాద్లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభల తీర్మానం మేరకు 1976 సెప్టెంబర్లో అంతర్జాతీయ తెలుగు సంస్థను ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో నివసించే తెలుగువారికి భాషా సాంస్కృతిక సేవలు అందించడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం, మొదటి మహాసభల తీర్మానం మేరకు రెండవ ప్రపంచ తెలుగు మహాసభలను ప్రభుత్వం ఈ సంస్థ ద్వారా మలేషియాలో జరుపవలసి ఉంది. రామప్పగారు ఈ సంస్థకు డైరెక్టర్గా పదవీబాధ్యతలు స్వీకరించిన సమయంలో శ్రీ వందేమాతరం రామచంద్రారావు ఛైర్మన్ గా ఉన్నారు.
రామప్పగారి ఆధ్వర్యంలో ఆనాటి ముఖ్యమంత్రి కీ.శే. టి. అంజయ్య గారి నేతృత్వంలో 1981 ఏప్రిల్లో మలేషియా లోని కౌలాలంపూర్లో రెండవ తెలుగు మహాసభలు విజయవంతగా నిర్వహించిన ఘనత రామప్ప గారికి దక్కింది. అనంతర కాలంలో ఈ సంస్థ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనమై అంతర్జాతీయ తెలుగు కేంద్రం అన్న పేరుతో పనిచేస్తోంది. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత మాటేటి రామప్ప గారు తమ సేవలను విశ్వవిద్యాలయానికి అందిస్తూనే వచ్చారు. విశ్వవిద్యాలయ జ్యోతిషశాఖలో ఆయన చాలాకాలం అతిధి అధ్యాపకులుగా విద్యార్థులకు జ్యోతిష శాస్త్రాన్ని బోధించారు. జ్యోతిష శాస్త్రంపై వీరు రచించిన ఆంగ్లపుస్తకాన్ని విశ్వవిద్యాలయం ప్రచురించింది.<noinclude><references/>
{{rh|తెలంగాణ |327 | తేజోమూర్తులు}}</noinclude>
i86fpz5u3tfs098ueul0hkkumpgbp8j
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/349
104
211797
555741
552169
2026-05-10T08:55:47Z
A.Murali
3019
555741
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>రామప్ప గారు చనిపోయే ముందురోజు కూడా క్లాసు తీసుకున్నాడు. అంతకంటే ముందురోజు విశ్వవిద్యాలయం వారిని తన నెలజీతం ఇవ్వమని అడిగి తీసుకున్నారట. చనిపోయే ముందురోజు కరెంట్ బిల్, నల్లబిల్తో సహా చెల్లించి విదేశాల్లో ఉన్న మనవడికి డబ్బు పంపించారట. రామప్ప గారు జ్యోతిషం తెలిసినవారు కాబట్టి చనిపోయేది ముందుగానే తెలిసిందని వారి కుటుంబసభ్యులు విశ్వసించడంలో ఆశ్చర్యంలేదు. మాటేటి రామప్ప గారు 1991 ఆగస్టు 30వ తేదీన పరమపదించారు. వీరు దివంగతులైన తర్వాత వీరి కుటుంబ సభ్యులు విశ్వవిద్యాలయంలో కొంత నిధిని ఏర్పాటు చేసి ప్రతిమేట మాటేటి రామప్ప స్మారకోపన్యాసాలను ఇప్పిస్తున్నారు.<noinclude><references/></noinclude>
elet24k2t1xewnmnoxdofyg54erswpe
555742
555741
2026-05-10T08:57:11Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555742
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>రామప్ప గారు చనిపోయే ముందురోజు కూడా క్లాసు తీసుకున్నాడు. అంతకంటే ముందురోజు విశ్వవిద్యాలయం వారిని తన నెలజీతం ఇవ్వమని అడిగి తీసుకున్నారట. చనిపోయే ముందురోజు కరెంట్ బిల్, నల్లబిల్తో సహా చెల్లించి విదేశాల్లో ఉన్న మనవడికి డబ్బు పంపించారట. రామప్ప గారు జ్యోతిషం తెలిసినవారు కాబట్టి చనిపోయేది ముందుగానే తెలిసిందని వారి కుటుంబసభ్యులు విశ్వసించడంలో ఆశ్చర్యంలేదు. మాటేటి రామప్ప గారు 1991 ఆగస్టు 30వ తేదీన పరమపదించారు. వీరు దివంగతులైన తర్వాత వీరి కుటుంబ సభ్యులు విశ్వవిద్యాలయంలో కొంత నిధిని ఏర్పాటు చేసి ప్రతిమేట మాటేటి రామప్ప స్మారకోపన్యాసాలను ఇప్పిస్తున్నారు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |328 | తేజోమూర్తులు}}</noinclude>
7o7vps5fr2m5y9cf5gi1dp21f42ggha
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/350
104
211798
555745
552170
2026-05-10T09:09:31Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555745
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''93. మిద్దె రాములు '''</p>}}
{{right|- ప్రొ౹౹ ననుమాస స్వామి}}
ఒగ్గు కథ సాంప్రదాయకమైన యూదవ కుల సంస్కృతిని తెలిపే ఒక కళారూపం. హిందూ దేవతలైన రేణుక ఎల్లమ్మ, మల్లన్న, వీరన్నల పురాగాథలను కీర్తించడానికి రూపొందిన కళారూపంగా దీన్ని పేర్కొనాలి. యాదవులైన కుర్మల సామాజిక సమూహం తమ కుల మూల పురుషుని వీరగాథలను ఆలపించేందుకు ఏర్పర్చుకొన్న అపురూప కళారూపం ఈ ఒగ్గు. నాట్యం, నాటకం, సంగీత గానాల సమ్మిశ్రితమైన ఒక కళగా దీన్ని చెప్పుకోవాలి. తెలంగాణ జానపద కళకు పూర్వ వైభవానికి పట్టుకొమ్మలాంటిది, ఈ ఒగ్గు కథ, జానపద కళల్లో ఒగ్గు కథను మించిన కళారూపం మరొకటుండదని చెప్తే అతిశయోక్తి కాదేమో!
సంప్రదాయం ప్రకారంగా కుర్యల గురువులైన ఒగ్గు కళాకారులు ఈ ఒగ్గు కథాగానం చేయడం సామాన్యంగా కనిపిస్తోంది. ఆ సామాజిక వర్గానికి చెందని ఒక కళాకారుడు. ఒగ్గుదీక్ష ఎరుగని గౌడ కులస్తుడు ఒక గొప్ప కళారూపాన్ని నేర్చుకొని, దానికే ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టాడు. అహర్నిశలు ఆ కళామతల్లి సేవలో జీవితాన్ని తెరిచి ఆ కథకు విశేష ప్రాచుర్యాన్ని కల్పించాడు. ఆయనెవరోగాదు ఆయనే ఒగ్గు విద్ద నేర్చిన మిద్దెరాములు, నిరక్షరాస్యుడైన ఆయన మౌలికంగా ఒగ్గు కథను అభ్యసించి యాదవుల చేతనేగాదు, కళాభిమానులచేత ప్రశంసలు పొందాడు. తన ప్రజ్ఞా పాటనాలతో ఎందరో ఒగ్గు కళాకారులను ప్రభావితం చేశాడు. అందుకే ఒగ్గు కథంటే మిద్దె రాములు, మిద్దె రాములు అంటే ఒగ్గు కళారూపమన్నంత నుడి ఏర్పడింది. ఒగ్గు కథా పితామహుడు వల్లమ్ పెద్ద వీరయ్య. ఆ కథకు జన జీవాలు కలిగించింది. ఆయన కొడుకు సత్తయ్య, ఆ కళా రూపాన్ని విశ్వ వ్యాప్తం చేసింది చుక్క సత్తయ్య. నిజంగా పండిత పామరులను పరవశింపజేసి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చినవారు. మాత్రం మిద్దె రాములు. ఒగ్గు కథా గానంలో సానికీబాలప్ప, టైరిమల్లోకం ఆవుల ముత్యాల, ఎర్ర మల్లేష్, శ్రీశైలం, రాంబాబు, నాగేష్, సిద్ధప్ప, పళ్ళం వీరేశం, మహేష్, క్రిష్ణయాదవ్ లాంటివారు ఒగ్గు కథకు విశేషా స్థానం కల్పించడానికి కృషి చేస్తున్నారు.
'''మిద్దె రాములు ఎవరంటే...'''
నాటకం, నృత్యగాన సంగీత సమ్మిళితమైన ఒగ్గు కథాగానాన్ని ఆకాశ మంతెత్తు నిలబెట్టినవాడు, ఒగ్గు కథాగానం ద్వారా 'తెలంగాణ జానపద కళకు పేరు తెచ్చినవాడు, ఒగ్గు కథకు ఒడువు నేర్పినవాడు, ఎల్లయ్య కొడుకు ఈ
మిద్దె రాములు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం, హనుమాజీపేట గ్రామంలో 1941లో ఆయన జన్మించారు.
పేదరికం వల్ల ఆయన చదువుకోలేకపోయాడు. కథవిన్నా పాటవిన్నా వెంటనే చెప్పే తెలివి తేటలు ఆయనకున్నాయి. మౌఖికంగానే ధారణ చేయగల ఏక సంధాగ్రాహి,<noinclude><references/>
{{rh|తెలంగాణ |329 | తేజోమూర్తులు}}</noinclude>
8beoevwcifbzo2tcf7rb7lj33szu9x7
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/351
104
211799
555748
552171
2026-05-10T09:34:11Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555748
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
చిన్నప్పటినుండి ఒగ్గు కథ మీద పెంచుకున్న అభిమానంతో ఒగ్గు వాళ్ళు చెప్పే ఎల్లమ్మ కథ, మల్లన్న కథలు తరచూ వినేవాడు. ఆ కళను అభ్యసించాలనే తాపత్రయంతో ఒగ్గు కథకుల చుట్టూ తిరిగేవాడు. ఎండు తుమ్మకాయలు గుజికుచ్చుకొని గజ్జెల్లా కాళ్ళకు కట్టుకొని ఒగ్గు నాట్యం ఆడేవాడు. అసంఖ్యాకమైన కథలు మౌఖికంగా నేర్చుకొని, జానపద రాగాలను ఆపోసన పట్టేవాడు. జన్మతః వచ్చిన శృతి జ్ఞాపకం ఆయనకు వరమైంది. లయాత్మకంగా అడుగులు వేయడం అబ్బింది. అసామాన్యమైన ప్రతిభ ఆయనకు ఉంది. పుట్టింది గౌడ కులంలోనైనా నేర్చుకొన్నది. యాదవ ఒగ్గుకథ. భాషంతా తెలంగాణ యాసే. తన కథాగానాపటిమతో పురాణ పాత్రలను ప్రేక్షకుల ముందు నిలిపేవాడు. పద గుంఫన శైలిలో పురాణగాధలను రక్తి కట్టించేవాడు. ఆయన హావ భావ విన్యాసాలలో ఒగ్గు కళకు జీవం ఉట్టిపడేది. ప్రాచీన సంప్రదాయానికి చెందిన ఒగ్గు కథాగానానికి పూర్వవైభవం తెచ్చిపెట్టాడు.
'''జాతీయ అంతర్జాతీయ గుర్తింపు '''
తెలంగాణ జానపద కళారూపానికి జాతీయ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది మిద్దె రాములే, వీరాభిమానంతో ఒగ్గు కథా గానాన్ని నేర్చుకొని దానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిని కలిగించింది ఆయనే. ఒకసారి కరీంనగర్ పర్కస్ గ్రౌండ్లో కాంగ్రెస్ జాతీయ మహాసభ జరుగుతున్నప్పుడు మిద్దె రాములు ఒగ్గు కథాగానం ఏర్పాటు చేశారట. ఆనాడు దేశ ప్రధాని ఇందిరాగాంధి రావడం ఆలస్యం కావడంతో ప్రేక్షకులకు వినోదం కల్పించడానికి రాత్రంతా మిద్దె రాములు ఒగ్గు కథాగానం వినిపించి సమయం తెలియకుండా చేశాడట. దానితో ఆయన జాతీయంగా జానపద కళాకారుడిగా గుర్తింపు పొందారు. అలాగే దేశం నలుమూలలా ఒగ్గు కథ ప్రదర్శనలిచ్చి పరభాషీయులచేత మన్ననలు పొందారు.
మారిషష్ ప్రభుత్వం మూడవ మారిషస్ తెలుగు మహాసభలు జరిపింది. దానికి ప్రత్యేక జానపం కళాకారుడిగా మిద్దె రాములుకు ఆహ్వానం అందింది. అప్పుడు తమ ఒగ్గుకథ కళాకారుల బృందంతో రాములు మారిషస్ చేసుకొన్నాడు. మారిషస్ దేశ ప్రధాని జగన్నాథీ, గవర్నర్ రంగస్వామి ముందు రాములు ఒగ్గుకథా గానాప్రదర్శన ఏర్పాటు చేశారు. కథా ప్రారంభంలోనే రాములు తన పదగుంపున శైలిలో వారిని మైమరిపింపజేశారు. ఒగ్గులో ప్రత్యేకశైలి ఎల్లమ్మ బోనం నృత్యమే. బోనం ఎత్తప్పుడు వేప మండలు పట్టుకొని, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని ప్రత్యేకమైన శైలిలో నాట్యం చేయడంలో రాములు దిట్ట. నెత్తిమీద బోనం ఎత్తుకొని నేలమీద పాము మెలికల్లా తిరగడమేగాదు, నేలమీద పడవేసిన పైసలను నోటితో పట్టుకుంటుంటే చూసిన దేశ ప్రధాని గవర్నరు తన్మయత్వం పొందారట.మారిషన్ తెలుగు ప్రేక్షకులంతా కన్నులార్పకుండా చూకారట. ఆ తర్వాత అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలను ఒగ్గు కళాప్రదర్శన ద్వారా ప్రచారం చేసి మన్ననలను పొందాడు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముందు ఒగ్గు కథను ప్రదర్శించి ఆయన తెలంగాణా ఒగ్గును కీర్తించేట్టుగా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి తెలంగాణ సాంస్కృతిక సంబరాల్లో ఒగ్గు కథకు పట్టం కట్టి ప్రారంభ కళా ప్రదర్శనగా జరిపారు. అప్పుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒగ్గు కథాగానం మీద గౌరవంతో హైదరాబాద్ మాదాపూర్లోని తెలంగాణ సాంస్కృతిక సారథి భవనానికి మిద్దె రాములు పేరు పెట్టారు. దానితో ఒగ్గు కథకుడు మిద్దె రాములు పేరు
స్థిరస్థాయిగా నిలిచిపోతుంది.
ఆ విధంగా దేశప్రధాని ఇందిరాగాంధి ప్రశంసలు, మారిషస్ దేశ ప్రధాని జగన్నాథ్, గవర్నర్ రంగస్వామి గారబ
ప్రశంసలు అందుకొన్న గొప్ప ఒగ్గు కథా కళాకారుడు మిద్దె రాములు. ఆయన ఒగ్గు కళకు చేసిన కృషికే రాజీవ్ గాంధి
పురస్కారం, రాష్ట్ర ప్రతిభా పురస్కారం, హంన పురస్కారాల్లాంటి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, రివార్డులు ఎన్నో ఆయన అందుకొన్నాడు.
'''పదగుంపనం, కథాగానం, నాట్య విన్యాసం '''
ప్రేక్షకులని కన్నులార్పకుండా చేయాలన్నా, చెవులు రెక్కించి వినేటట్టు చేయాలన్నా, పదగుంఫనం శైలిలో
వచనాన్ని చెప్పడం మిద్దె రాములుకు బాగా తెల్సు, ఒగ్గు కథా గాన ప్రారంభంలో తెలంగాణ యాసలో పదంమీద
పదం, కలిపి చెప్పడంలో నోరు తిరిగినవాడు మిద్దె రాములు. లయాత్మకంగా వచనం సాగడం చూసి ప్రేక్షకులు నోరెళ్ళబెడతారు. ఆ ప్రారంభమెట్ల ఉంటుందో వినండి.<noinclude><references/>
{{rh|తెలంగాణ |330 | తేజోమూర్తులు}}</noinclude>
kr8arf0g28sv3qh48p5xchu0cbtgk5z
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/352
104
211800
555749
552172
2026-05-10T09:45:27Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555749
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
'''వచనం '''
<poem>
'హరి హరియ రఘునందనా!
హరిహర బ్రహ్మాండామా !
హరిలోక సంచారమా!
మద్దూరి మారిండ్లు !
మారేడుగడ్డ, మర్మమ్మతల్లి!
బుద్ధి చెప్పిన దానా బూరాంచారీ!
విద్య చెప్పినవాడు వీరాదామల్లు!
చదువు చెప్పిన వాడా!
సంద మహాంకాళీ!
అన్ని విద్దెలు చెప్పి ఆట నేర్చినవాడా! హరి హరియ హం...
'''దరువు '''
అది దేవి దండాలే భూదేవి దండాలే
లోక జంకారా నీకైనా దండాలే
దండము నారాయణో దాపరా మందేమో
అమ్మలారా! అక్కలారా మీకు దండాలే
రామ రామా రామ రామా!
అలకించి బోవరయ్యా.....!
చల్తీ దరువు
'బంగారి ఒద్ధాయం గుప్పొడీ బొమ్మల్లా
కుంకుమ బెట్టాడా కురులు దిద్దాడా
ఎంచక్కా గవ్వాలు ఎడమకాలు కట్టేనా
పగడాల గజ్జెలు కుడి కాలు కట్టేనా
అబ్బి మల్లె పువ్వులో నిత్యా మల్లె పువ్వులో</poem>
ఈ విధంగా కథాగానం అశువుగా సాగిపోతుంటుంది. మౌఖిక సంప్రదాయ సంగీత, రాగాల్లో అద్భుతంగా ఒగ్గు కథాగానం చేయడం మిద్దె రాములుకే సాధ్యం. ఈ కథా గానం మంజరి ద్విపదలో సాగిపోతున్నట్టుగా ఉంటుంది. పదాడంబరాల కోసం తప్ప అర్ధపుష్టి కోసం నిర్మితమైనవిగాదు.
'''ఎల్లమ్మ బోనం '''
పురాణగాథల కథాగానాల్లో శక్తి దేవత ఆరాధనలుఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకొంటున్నాయి. ఒగ్గు కథలాంటి కథాగానాల్లో ప్రదర్శించే ఎల్లమ్మ బోనానికి తెలంగాణలో తరగని ఆదరణ కనిపిస్తోంది. రేణుక ఎల్లమలాంటి శక్తి దేవతలకు ప్రతీకగా భండారి (పసుపు)ని ఉపయోగించడం కనిపిస్తోంది. కొమురెల్లి మల్లన్నతోడ బుట్టింది ఎల్లమ్మ' అని కురుమ జాతి వారు ప్రగాఢంగా విశ్వసిస్తారు. పసుపుల బుట్టింది కాబట్టి ఒగ్గులు మొహానికేగాదు, దేహమంతా పసువుని పూసుకొంటారు. మల్లన్న పట్నాల్లో రతి రాసేప్పుడు పసువును విరివిగా వాడడం కూడా కనిపిస్తోంది.
ఆరుగురు కళాకారులు ప్రదర్శించే ఎల్లమ్మ ఒగ్గు కథలో రాములు బోనం నెత్తిన ఎత్తుకొని నాట్యం చేస్తుంటే ఎవరైనా
కన్నులు మరల్పకుండా ఉత్కంఠంతో తిలకించవలసిందే. రవ్వలహారం మెడలో ధరించి, నెత్తిన బోనం ఎత్తుకొని,
చేతుల్లో వేపమండలు పట్టుకొని, కాళ్ళకు గజ్జెలు కట్టుకొని డప్పులు, దోళ్ళు మోగుతుంటే, సఫీరా ధ్వనిస్తుంటే బోనం
కింద పడకుండా చిందులు వేస్తూ గానం చేసేవాడు. చిందులు వేయడం ఆపి నెమ్మదిగా నేలమీద కూర్చొని,
కుడిప్రక్కకు, ఎడమపక్కకు వొరుక్కుంటూ కాళ్ళు చేతులు లేపి ఆహా అనిపించేవాడు. ఇక నేలమీద దొర్లుతూ పాము
మెలికల్లా తిరుగుతూ కూడా నెత్తిన బోనం కింద పడకుండా నేలమీద పడేసిన పైసలు నోటితో పట్టుకొంటే ప్రేక్షకులు
తన్మయత్వంలో మునిగిపోయేవారు.
జానపద కళా బ్రహ్మ, ఒగ్గు కథక చక్రవర్తి బిరుదాంకితుడైన మిద్దె రాములు 2010 నవంబర్ 11 నాడు కన్ను మూశారు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |331 | తేజోమూర్తులు}}</noinclude>
4kfor0my5bhuix1kiy6uyyiokv4mmrx
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/353
104
211801
555750
552173
2026-05-10T10:03:09Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555750
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''94. మోత్కూరు మధుసూదనరావు '''</p>}}
{{right|- డా॥ మడికొండ శ్వాంసుందర్}}
కాకతీయుల రాజధాని ఓరుగల్లు పట్టణానికి సమీపంలోని కవిపండితులకి ఆలవాలమైన 'మడికొండ' గ్రామమునందు, శ్రీ మోత్కూరు మధుసూదనరావు గారు 19-3-1914 సంవత్సరంలో శ్రీ మోత్కూరు శ్యామరావు - పుల్లమ్మ పుణ్య దంపతులకు గర్భశుక్తి ముక్తాఫలంగా జన్మించినారు. మోత్కూరు మాణిక్యరావు, వెంకటమ్మ దంపతులకు సంతానం కలుగనందున దత్తపుత్రునిగా వెళ్ళినారు. మడికొండ గ్రామము నేటి వరంగల్ జిల్లాలోని హన్మకొండ మండలమున ఖాజీపేట రైల్వే స్టేషన్కు సుమారు 5 కిలోమీటర్లు దూరంలో శ్రీ మెట్టురామలింగేశ్వర స్వామి కరుణా కటాక్షములతో
వర్ధిల్లుచున్నది. "అచట బుట్టిన చిగురుకొమ్మైన చేవ" అని అల్లసాని వారన్నట్లు ఈ గ్రామములో జన్మించిన, స్థిరపడిన వారిలో పండిత కవులలో డా. వానమామలై వరదా చార్యులు, జగన్నాధాచార్యులు, డా. పల్లా దుర్గయ్య, మడికొండ సత్యనారాయణ శాస్త్రి, అనుముల కృష్ణమూర్తి, కాళోజీ నారాయణరావు సోదరులు మొదలగు వారు ప్రముఖులు. వీరి సమకాలీనులైన శ్రీ మోత్కూరు మధుసూదనరావు గారు బాల్యము నందు విద్యాభ్యాసము శ్రీ కాళోజీ రంగారావుగారి వద్దను, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలను హన్మకొండ వరంగల్ పట్టణములందును అభ్యసించి, ఉపాధ్యాయవృత్తిలో ప్రవేశించినారు. తను పదవీ విరమణ పర్యంతము ప్రధానోపాధ్యాయులుగా పని చేసి
విశేషానుభవము గడించినారు.
హుబూరాబాద్, పరకాల, హసన్ పర్తి, ధర్మాసాగర్, కాజీపేట మొదలైన గ్రామములందు వీరిని ప్రధానోపాధ్యాయులుగా తెలియని వారలు అరుదు. వీరు బాల్యము నుండియే లలిత కళలపట్ల ఆదరభావమును, ఆసక్తిని పెంచుకొని నాటకకళాకారునిగా గయోపాఖ్యాన నాటకమున గయుని గాను, శ్రీ కృష్ణ రాయబార నాటక మునందు ధర్మరాజు, అక్రూరాదిపాత్రలను, "విషాద తిమ్మరుసు” నాటకమున శ్రీ కృష్ణ దేవరాయలు మొదలైన పాత్రలను ధరించి గాయకునిగా, నటునిగా మెప్పులందినారు. వీరు ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహించిన ప్రతి గ్రామము లోనూ, గయోపాఖ్యాననాటకముతోబాటు, స్వీయ విరచితమైన “సార్థకజీవి” పద్య గద్యాత్మక సాంఘిక నాటకము
లను స్థానిక ఔత్యాహిక కళాకారులను కూడగట్టుకొని ప్రదర్శనలిచ్చెడివారు. తమ సార్థజీవి నాటకంలో అంధభిక్షుక
పాత్ర వివేక సాగర్ పోషణలో విశేషప్రతిభను కనబరిచినారు.
పద్య పఠనమునందు "అభినవ అద్దంకి”గా నాటి శ్రీకృష్ణ పాత్ర ధారులు శ్రీ ముచ్చెర్ల సత్యనారాయణ గారిచే మెప్పు పొందినవారు. ఉపాధ్యాయ వృత్తి నిర్వహించిన ప్రతిగ్రామములోనూ వీరి ఇంటిలో అనేక మంది శిష్యులు ఆశ్రయమును పొంది విద్యాభ్యాసము చేసారు. వీరి ధర్మపత్ని శ్రీమతి సరస్వతీ బాయిగారు తమ సంతానముతో బాటు శిష్య సంతతిని గూడా ప్రేమాదరభావంతో చూసేవారు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |332 | తేజోమూర్తులు}}</noinclude>
gp82rlddj8kx48q55lavnhgmq85wa4v
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/354
104
211802
555752
552174
2026-05-10T10:14:15Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555752
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
"వండనలయదు వేవురువచ్చిరేని, అన్నపూర్ణకునుద్ది యౌనతని గృహిణి అని పెద్దనగారు సోమిదమ్మను
వర్ణించినట్లు, రాత్రింబవళ్ళు తమ బంధుమిత్ర గణాన్నీ, సంతానాన్నీ, శిష్య సంతతినీ సమాదర భావంతో చూసి
వండివడ్డించేవారు.
శ్రీ మోత్కూరు మధుసూదనరావు గారు సరస్వతీ బాయి గార్లకు 4 గురు మగ సంతానం, 6గురు ఆడ సంతానం.
ఇంత మందితో వీరి యిల్లు కళకళలాడుచుండెడిది. వీరు ఎక్కడ ఉన్ననూ, ఆ యింటిలో, పాఠశాలలో కవితా గోషులు, నాటకములు రిహార్సల్సు, సంగీత సాధనలు వెల్లివిరిసేవి. సాయంకాలము నుండి రాత్రి ప్రొద్దు పోయే వరకూ అను నిత్యకార్యక్రమంగా కొనసాగుచుండెడివి. సర్వశ్రీ పాటిమెట్ల భద్రయ్యగారు, మోత్కూరు హన్మంతరావు, గోపాలకిషన్ రావు, భట్టు వెంకటయ్య, బి.ఎల్.ఎన్. రాజు మొదలైన వారు పాల్గొని ఆనందించెడివారు.
“హరికథల” పట్ల గూడా వీరికి అమిత ప్రీతి. హైద్రాబాదు, విజయవాడ మొదలైన ఆకాశవాణి కేంద్రముల నుండి
ప్రసారమయ్యే హరికథా గానములు, శనివారం రాత్రి ప్రసారమయ్యే జాతీయ సంగీత కార్యక్రములు, రాత్రి ప్రొద్దు
పోయే వరకు శ్రద్ధా భక్తులతో ఆలకించి పరవశించేవారు. ఈ ప్రసంగ వ్యాసకర్త కూడా వీరి శిష్యుడే!
ఆచార్య డా. పల్లా దుర్గయ్య గారు, మధుసూదన రావు గారు బాల్య మిత్రులు. ఒకే ఊరివారు. వీరికి తాము ఒకే
కుటుంబ సభ్యులము అను భావనతో ఆ మరణ పర్యంతము మెలగినారు.
"స్పర్ధయావర్ధతే విద్యా" అన్నట్లు పోటీగా కవిత్వరచన. చేపట్టేవారు. ఇందుకు శ్రీ దుర్గయ్యగారి "పాలవెల్లి" ఖండ
కావ్యంలోని “సీతవలపోత' అను శీర్షిక, మధుసూదనరావు గారి ఖండకావ్యం "మధుమంజరి” లోని “సీతవలపోతం”
శీర్షికలు చక్కని ఉదాహరణ.
వీరి రచనలు(1) శ్రీ వెంకటేశ్వర శతకము (2) సార్థక జీవి సాంఘిక నాటకము (3) చిత్ర పద్యకావ్యము (4)
మధుమంజరి పద్య, గేయ ఖండ కావ్యములు ముద్రితములైనవి. “ముందంజ" అనే ఏకాంకిక “మావూరు” అను లము పద్యకావ్యములు అముద్రితములైననూ, లుప్తములైనవి. “విశ్వసాహితి" అధ్యక్షులు వీరిని 'మధురకవి'
బిరుదులతో సన్మానించినారు. కనుల శ్రీ ఆనాల దామోదర్ రెడ్డి గారు సాహిత్య ప్రస్థానమున వీరికి తోడుగా నిల్చినారు.
వీరు తమ గ్రామము మడికొండ పౌరాణిక నామధేయమైన “మణిగిరి” పేర “మణిగి ప్రచురణలు” అనే సంస్థను నెలకొల్పి తమ కావ్యములను ప్రచురింపజేసినారు. ఇవి యన్నియు అభిమానులకోరిక మేరకు వితరణ జేయబడి యుండుటచే, ఇటీవల వీరి కుమారులు డా. మోత్కూరు మాణిక్యరావు, లయన్.మోత్కూరు మనోహర్ రావు మహేందర్, మధూకర్ రావు గారల సమిష్టి కృషివల్ల "మణిగిరి ప్రచురణాల పేరునే మధుర కవి మోత్కూరు మధుసూదనరావు సాహితీ సంకలనమును పేర పునర్ముద్రింపబడి అవిష్కృతమైనది.
1). వీరి రచనలందు "శ్రీ వెంకటేశ్వర శతకము” 1972 సంవత్సరం నందు ప్రచురించబడినవి. తన ఆరాధ్య
దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ముక్తి ప్రధానాంశములుగా కవి తన ఆవేదనను స్వామి సన్నుతి, లోక వర్తనము, ప్రధానముగా సులభ గ్రాహ్యశైలిలో అత్యంత సుందరముగా రచించి ధన్యులైనారు. ప్రచురణలో వీరి జ్ఞాతులగు శ్రీ మోత్కూరు గోపాల కిషన్ రావు గారు హార్ధికంగా, ఆర్ధికంగా తోడ్పడినారు.
2). "సార్థకజీవి" అను సాంఘిక నాటకము పద్యగద్యాత్మకమై 1988 సంవత్సరంలో ప్రచురింపబడినది. నాయకుడగు "సుధీర్ పాత్రతో విద్యా విషయక ప్రాముఖ్యతను, వితంతు వివాహావశ్యకతను, కుటీర పరిశ్రమల స్థాపనతో ఇతరులకు ఉపాధి కల్పనను చక్కగా సమర్ధవంతంగా వివరించినారు. నాయకుని తండ్రి అంధభిక్షుక పాత్ర "వివేక సాగర్" గా ఆ పాత్రలో జీవించి ప్రేక్షకులను మెప్పిం చెడి వారు. జిల్లా కలెక్టర్ గారితో తన కృషికి ఫలితంగా "సార్థకజీవి" అనే బిరుదాన్ని స్వీకరించినారు. సామాజిక స్పృహ, దీనియందు ప్రధానాంశముగా రచించి కవి కూడా "సార్థక జీవి" అయ్యాడు. డా. విశ్వనాథ రావుగారు దీని ప్రచురణకు కావలసిన సహాయం, సహకారము అందించినారు.
(3)”చిత్ర” అనే పద్యకావ్యం సుమారు 500 పై చిలుకు పద్యాలతో రచింపబడి 1988 సంవత్సరంలోనే ప్రచురింపబడినది. చిత్ర ను ఉపనాయిక ప్రధాన పాత్ర<noinclude><references/>
{{rh|తెలంగాణ |333 | తేజోమూర్తులు}}</noinclude>
o0x1vr3dwcspti07tqfrrbay8vva4fk
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/324
104
212769
555716
555006
2026-05-09T14:16:00Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555716
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>[ఉన్నతస్థితియందు ఉన్నవారిని అడుగవలసిన సంపదల నడుగక హేయమైన దానిని ఆడుగుట నీచము. సున్నమడుగుట నీచతను సూచించును;] హరిభక్తిగమ్య, ధామకాంక్షన్ = విష్ణుభక్తిచేతనే పొందఁదగిన మోక్షమునందలి కోరికతో.
[అంకురములను గిల్లుట, కసటు కడుగుట, చింతలకు మ్రోడుచేయుట వానివానికి తగినవి - ఇవి నాటినుడులు.] '''అలం'''. లోకోక్తి.
{{Telugu poem|type=సీ.|lines=<poem>పరదారపరధనాహరణవైముఖ్యంబు, <ref>చ. వసు</ref>వశవర్తిఁ గావించువారు దక్క
బరగుణపరమాణుపర్వతీకరణంబు, వ్రతముగాఁ బాటించువారు దక్కఁ
బరుఁడైనఁ గొడుకైన మరియాద చెడ సమ, త్వమున శిక్ష యొనర్చువారు దక్కఁ
బరమసంపదల నాపద్వేళ సత్యంబు, వదలక భాషించువారు దక్క</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>దూర మగు కోర్కిఁ గోరనివారు దక్కఁ, గ్రూరకర్మంబు లుడివోవువారు దక్కఁ
బూరుషార్ధపరతఁ గ్రాలువారు దక్కఁ, దక్కువారెల్ల భవవహ్ని <ref>చ. దనుకు, ట. ద్రగ్గు</ref>దక్కువారు.</poem>|ref=279}}
'''టీక'''. పర...వైముఖ్యంము = పరులస్త్రీలకు, పరులధనములను హరించుట కిష్టము లేకుండుటను; వశవర్తిఁ గావించువారు, తక్కక = లొంగించుకొన్నవారు, కాక; [అట్టివారిని విడిచి - అనుట; ఇట్లు మున్ముందును.)] పర...కరణంబు = ఇతరుల కొద్దిపాటిగుణములను కొండలంతలుగా చేయుట - ఇతరుల గుణములను కొనియాడుట; వ్రతము = తమనియమము; పాటించువారు = లెక్కించువారు. పరుఁడైనన్ = ఇతరుఁడైనను; సమత్వమునన్ = సమానముగా - భేదము లేక; పరమసంపదలన్ = ఎక్కువ ఐశ్వర్య మున్నప్పుడును; ఆపద్వేళన్ = కష్టకాలమునందునుగూడ; దూరమగు = హద్దుమీరిన - అసాధ్యమైన; ఉడివోవువారు = విడుచువారు; పూరుషార్థపరతన్ = మోక్షమునందలి ఆసక్తిచే; క్రాలువారు = ప్రకాశించువారు; తక్కువారు, ఎల్లన్ = మిగిలినవారందఱును; భవవహ్నిన్, దక్కువారు = సంసారాగ్నిలోఁ బడువారు (అగుదురు.)
{{Telugu poem|type=క.|lines=<poem>పలువేల్పులబడి నడవక, యిలువేలుపుగా భజింపుఁడీ మీరలు <ref>చ.ట. పిచ్ఛిల</ref>వి
ట్ఠలు <ref>చ.ట. శిక్యక</ref>శిక్యగదధిరసగం, ధిలకేశుం బౌండరీకతీర్థాధీశున్.</poem>|ref=280}}
'''టీక'''. పలువేల్పులబడిన్ = పెక్కురువేల్పుల మార్గమును - పెక్కుమంది దేవతలను కొలుచుపద్ధతిని; నడవక; మీరలు; శిక్యగ, దధి, రస, గంధిల కేశున్ = ఉట్టెయందున్న పెరుగుచే సువాసనఁ గల జుట్టు కలవానిని; ఇలువేలుపుగాన్ = ఇష్టదైవముగా; భజింపుఁడీ = సేవించవలెను.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>మస్తకిరీటహాటకసమంచితకుంభయుతంబు పీవరో
ర<ref>క. తటి, చ. తట</ref>స్తటరత్నదీప్తిరుచిరంబు రమా<ref>చ. సదు</ref>సమసాలభంజికా
సక్తమునైన శార్ఙ్గితనుసౌధము నెక్కి సుఖించు బుద్ధికిన్
నిస్తులభక్తిగౌరవము నిచ్చెనయై చననిచ్చు మీఁదికిన్.</poem>|ref=281}}
'''టీక'''. మస్త...యుతంబు = తలపైఁ గల కిరీటము అను బంగారుకలశముతో కూడినది; పీవరో...రుచిరంబు = బలిసియున్న ఱొమ్ముప్రదేశమునందలి కౌస్తుభమాణిక్యముచే అందమైనది; రమా...శస్తము = లక్ష్మీదేవి యను సాటిలేని జంత్రపుబొమ్మచే శ్లాఘ్యమైనది; ఐన = అయియున్నట్టి; శార్ఙ్గతనుసౌధమున్ = విష్ణునిశరీరము ఆను మేడను - ఎక్కి సుఖింపఁదలఁచు మంచిబుద్ధి కల<noinclude><references/></noinclude>
hi4yw5jh91rlpcxultag5qjn7fztku3
555717
555716
2026-05-09T14:16:51Z
దేవీప్రసాదశాస్త్రి
4290
555717
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>[ఉన్నతస్థితియందు ఉన్నవారిని అడుగవలసిన సంపదల నడుగక హేయమైన దానిని ఆడుగుట నీచము. సున్నమడుగుట నీచతను సూచించును;] హరిభక్తిగమ్య, ధామకాంక్షన్ = విష్ణుభక్తిచేతనే పొందఁదగిన మోక్షమునందలి కోరికతో.
[అంకురములను గిల్లుట, కసటు కడుగుట, చింతలకు మ్రోడుచేయుట వానివానికి తగినవి - ఇవి నాటినుడులు.] '''అలం'''. లోకోక్తి.
{{Telugu poem|type=సీ.|lines=<poem>పరదారపరధనాహరణవైముఖ్యంబు, <ref>చ. వసు</ref>వశవర్తిఁ గావించువారు దక్క
బరగుణపరమాణుపర్వతీకరణంబు, వ్రతముగాఁ బాటించువారు దక్కఁ
బరుఁడైనఁ గొడుకైన మరియాద చెడ సమ, త్వమున శిక్ష యొనర్చువారు దక్కఁ
బరమసంపదల నాపద్వేళ సత్యంబు, వదలక భాషించువారు దక్క</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>దూర మగు కోర్కిఁ గోరనివారు దక్కఁ, గ్రూరకర్మంబు లుడివోవువారు దక్కఁ
బూరుషార్ధపరతఁ గ్రాలువారు దక్కఁ, దక్కువారెల్ల భవవహ్ని <ref>చ. దనుకు, ట. ద్రగ్గు</ref>దక్కువారు.</poem>|ref=279}}
'''టీక'''. పర...వైముఖ్యంము = పరులస్త్రీలకు, పరులధనములను హరించుట కిష్టము లేకుండుటను; వశవర్తిఁ గావించువారు, తక్కక = లొంగించుకొన్నవారు, కాక; [అట్టివారిని విడిచి - అనుట; ఇట్లు మున్ముందును.] పర...కరణంబు = ఇతరుల కొద్దిపాటిగుణములను కొండలంతలుగా చేయుట - ఇతరుల గుణములను కొనియాడుట; వ్రతము = తమనియమము; పాటించువారు = లెక్కించువారు. పరుఁడైనన్ = ఇతరుఁడైనను; సమత్వమునన్ = సమానముగా - భేదము లేక; పరమసంపదలన్ = ఎక్కువ ఐశ్వర్య మున్నప్పుడును; ఆపద్వేళన్ = కష్టకాలమునందునుగూడ; దూరమగు = హద్దుమీరిన - అసాధ్యమైన; ఉడివోవువారు = విడుచువారు; పూరుషార్థపరతన్ = మోక్షమునందలి ఆసక్తిచే; క్రాలువారు = ప్రకాశించువారు; తక్కువారు, ఎల్లన్ = మిగిలినవారందఱును; భవవహ్నిన్, దక్కువారు = సంసారాగ్నిలోఁ బడువారు (అగుదురు.)
{{Telugu poem|type=క.|lines=<poem>పలువేల్పులబడి నడవక, యిలువేలుపుగా భజింపుఁడీ మీరలు <ref>చ.ట. పిచ్ఛిల</ref>వి
ట్ఠలు <ref>చ.ట. శిక్యక</ref>శిక్యగదధిరసగం, ధిలకేశుం బౌండరీకతీర్థాధీశున్.</poem>|ref=280}}
'''టీక'''. పలువేల్పులబడిన్ = పెక్కురువేల్పుల మార్గమును - పెక్కుమంది దేవతలను కొలుచుపద్ధతిని; నడవక; మీరలు; శిక్యగ, దధి, రస, గంధిల కేశున్ = ఉట్టెయందున్న పెరుగుచే సువాసనఁ గల జుట్టు కలవానిని; ఇలువేలుపుగాన్ = ఇష్టదైవముగా; భజింపుఁడీ = సేవించవలెను.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>మస్తకిరీటహాటకసమంచితకుంభయుతంబు పీవరో
ర<ref>క. తటి, చ. తట</ref>స్తటరత్నదీప్తిరుచిరంబు రమా<ref>చ. సదు</ref>సమసాలభంజికా
సక్తమునైన శార్ఙ్గితనుసౌధము నెక్కి సుఖించు బుద్ధికిన్
నిస్తులభక్తిగౌరవము నిచ్చెనయై చననిచ్చు మీఁదికిన్.</poem>|ref=281}}
'''టీక'''. మస్త...యుతంబు = తలపైఁ గల కిరీటము అను బంగారుకలశముతో కూడినది; పీవరో...రుచిరంబు = బలిసియున్న ఱొమ్ముప్రదేశమునందలి కౌస్తుభమాణిక్యముచే అందమైనది; రమా...శస్తము = లక్ష్మీదేవి యను సాటిలేని జంత్రపుబొమ్మచే శ్లాఘ్యమైనది; ఐన = అయియున్నట్టి; శార్ఙ్గతనుసౌధమున్ = విష్ణునిశరీరము ఆను మేడను - ఎక్కి సుఖింపఁదలఁచు మంచిబుద్ధి కల<noinclude><references/></noinclude>
5fv6m8yt5jzrbnh8uyj7r50uspimbrl
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/325
104
212770
555723
555007
2026-05-09T19:07:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555723
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వానికి; నిస్తులభక్తిగౌరవము = సాటిలేని గొప్పభక్తి; మీఁదికిన్ = సౌధముపైకి; చననిచ్చున్ = వెళ్లనిచ్చును - పంపును. [విష్ణుని పరమపదము పొందుటకు భక్తియే ముఖ్యమని భావము.] '''అలం'''. రూపకము.
{{Telugu poem|type=క.|lines=<poem>మీరును గృహస్థధర్మము, మేరకుఁ దలమీఱి చనక మిత్రామాత్యో
దారహితదారదారక, వారకములతోడఁ దీర్థవాసపరులరై.</poem>|ref=282}}
'''టీక'''. గృహస్థధర్మముమేరకున్ = గృహస్థధర్మముయొక్క హద్దునకు; తలమీఱి = అతిక్రమించి; మిత్రా...తోడన్ = మిత్రులు, మంత్రులు, గొప్పబంధువులు, భార్యలు, సంతానము సమూహములతో; తీర్థవాసపరులరై = పుణ్యక్షేత్రమున నివసింపఁగోరినవారయి; [ముందునకు అన్వయము.]
{{Telugu poem|type=క.|lines=<poem>కోమలతులసీపల్లవ, దామాంచిత<ref>చ. వక్షలక్ష్మి, ట. వత్సలక్ష్మి</ref>వత్సలక్ష్మీధాముఁ బయోద
శ్యాముఁ బదద్వయనతసు, త్రామున్ మనపౌండరీకధాముఁ గొలువుఁడీ!</poem>|ref=283}}
'''టీక'''. కోమల...ధామున్ = మృదువులకు తులసీదళములమాలలతో ఒప్పుచున్న శ్రీవత్సచిహ్నముతో ప్రకాశించువానిని; పయోదశ్యామున్ = మేఘమువలె నల్లనికాంతి కలవానిని; పదద్వయనతసుత్రామున్ = రెండుపాదములపైని వంగిన (పాదములపై సాష్టాంగపడిన) ఇంద్రుడు కలవానిని; పౌండరీకధామున్ = పౌండరీకక్షేత్రము నివాసముగాఁ గలవానిని - విష్ణుని; కొలువుఁడీ. '''అలం'''. పరికరము, అనుప్రాసము.
{{Telugu poem|type=క.|lines=<poem>అనుచుండ నర్కనిభమగు, ననిమిషయానంబుఁ దెచ్చి హరిపార్శ్వచరుల్
కొని చనిరి సభర్తృకముగ, ఘనశీల సుశీల విష్ణుగాథాలోలన్.</poem>|ref=284}}
'''టీక'''. హంపార్శ్వచరుల్ = విష్ణుదూతలు; అర్కనిభము = సూర్యునితో సమానమైనది - ప్రకాశించునది; అనిమిషయానంబున్ = విమానమును; ఘనశీలన్ = ఉత్తమస్వభావము కలదానిని; విష్ణుగాథాలోలన్ = విష్ణునికథలయం దాసక్త యగుదానిని; సుశీలన్; సభర్తృకముగన్ = భర్తతో కూడుకొనునట్లుగా - భర్తతోఁగూడ; కొని, చనిరి. '''అలం'''. పరికరము.
{{Telugu poem|type=తే.|lines=<poem>ఆవు నవనీసురుండు వాయసము నంచ, రాజకీరంబు పాము సరఘయు నిట్లు
ముక్తి కేఁగిన కథ విను భక్తతతికిఁ, బర్వతాగ్రశిలాబ్దసంభవము భవము.</poem>|ref=285}}
'''టీక'''. అవనీసురుఁడు = బ్రాహ్మణుఁడు - సుశీలభర్త; భవము = పునర్జన్మము; పర్వతాగ్రశిలాబ్జసంభవము = కొండమీఁది బండఱాతిపై తామర మొలుచుట - అసంభవమనుట.
{{Telugu poem|type=వ.|lines=<poem>అని వెండియు నిందుధరుడు శతానందనందనునితో నిట్లనియె.</poem>|ref=286}}
'''టీక'''. ఇందుధరుండు = నెలతాల్పు - శివుఁడు; శతానందనందనునితోన్ = బ్రహ్మపుత్రుఁడగు నారదమునితో,
{{Telugu poem|type=సీ.|lines=<poem>నీలమో కాలాభ్రజాలమో బాలశైవాలమో యీ సిద్ధవరునికాంతి
కెంపులో పవడంపుగుంపులో యీరెండసొంపులో యీమేటిజోగిజడలు
హారమో హారినీహారమో భూరికర్పూరమో యీ యాదిపురుషునగవు
మెఱపులో వజ్రంపుటొఱపులో శశిరేఖ తఱపులో యీవటూత్తమునికోఱ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>లనఁగ శార్ఙ్గికి నాదిక్కునందు నిలిచి, ప్రేతభూతనిశాచరపీడ లడఁచి
క్షేత్రరక్షణదక్షుఁడై క్షేత్రపాలుఁ, డుండువిభునాజ్ఞ తలమోచి యోమునీంద్ర!</poem>|ref=287}}<noinclude><references/></noinclude>
qnp1jt1u3z2uhl2lucst7e7svlacdd4
555724
555723
2026-05-09T19:12:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
555724
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వానికి; నిస్తులభక్తిగౌరవము = సాటిలేని గొప్పభక్తి; మీఁదికిన్ = సౌధముపైకి; చననిచ్చున్ = వెళ్లనిచ్చును - పంపును. [విష్ణుని పరమపదము పొందుటకు భక్తియే ముఖ్యమని భావము.] '''అలం'''. రూపకము.
{{Telugu poem|type=క.|lines=<poem>మీరును గృహస్థధర్మము, మేరకుఁ దలమీఱి చనక మిత్రామాత్యో
దారహితదారదారక, వారకములతోడఁ దీర్థవాసపరులరై.</poem>|ref=282}}
'''టీక'''. గృహస్థధర్మముమేరకున్ = గృహస్థధర్మముయొక్క హద్దునకు; తలమీఱి = అతిక్రమించి; మిత్రా...తోడన్ = మిత్రులు, మంత్రులు, గొప్పబంధువులు, భార్యలు, సంతానము సమూహములతో; తీర్థవాసపరులరై = పుణ్యక్షేత్రమున నివసింపఁగోరినవారయి; [ముందునకు అన్వయము.]
{{Telugu poem|type=క.|lines=<poem>కోమలతులసీపల్లవ, దామాంచిత<ref>చ. వక్షలక్ష్మి, ట. వత్సలక్ష్మి</ref>వత్సలక్ష్మీధాముఁ బయోద
శ్యాముఁ బదద్వయనతసు, త్రామున్ మనపౌండరీకధాముఁ గొలువుఁడీ!</poem>|ref=283}}
'''టీక'''. కోమల...ధామున్ = మృదువులకు తులసీదళములమాలలతో ఒప్పుచున్న శ్రీవత్సచిహ్నముతో ప్రకాశించువానిని; పయోదశ్యామున్ = మేఘమువలె నల్లనికాంతి కలవానిని; పదద్వయనతసుత్రామున్ = రెండుపాదములపైని వంగిన (పాదములపై సాష్టాంగపడిన) ఇంద్రుడు కలవానిని; పౌండరీకధామున్ = పౌండరీకక్షేత్రము నివాసముగాఁ గలవానిని - విష్ణుని; కొలువుఁడీ. '''అలం'''. పరికరము, అనుప్రాసము.
{{Telugu poem|type=క.|lines=<poem>అనుచుండ నర్కనిభమగు, ననిమిషయానంబుఁ దెచ్చి హరిపార్శ్వచరుల్
కొని చనిరి సభర్తృకముగ, ఘనశీల సుశీల విష్ణుగాథాలోలన్.</poem>|ref=284}}
'''టీక'''. హంపార్శ్వచరుల్ = విష్ణుదూతలు; అర్కనిభము = సూర్యునితో సమానమైనది - ప్రకాశించునది; అనిమిషయానంబున్ = విమానమును; ఘనశీలన్ = ఉత్తమస్వభావము కలదానిని; విష్ణుగాథాలోలన్ = విష్ణునికథలయం దాసక్త యగుదానిని; సుశీలన్; సభర్తృకముగన్ = భర్తతో కూడుకొనునట్లుగా - భర్తతోఁగూడ; కొని, చనిరి. '''అలం'''. పరికరము.
{{Telugu poem|type=తే.|lines=<poem>ఆవు నవనీసురుండు వాయసము నంచ, రాజకీరంబు పాము సరఘయు నిట్లు
ముక్తి కేఁగిన కథ విను భక్తతతికిఁ, బర్వతాగ్రశిలాబ్జసంభవము భవము.</poem>|ref=285}}
'''టీక'''. అవనీసురుఁడు = బ్రాహ్మణుఁడు - సుశీలభర్త; భవము = పునర్జన్మము; పర్వతాగ్రశిలాబ్జసంభవము = కొండమీఁది బండఱాతిపై తామర మొలుచుట - అసంభవమనుట.
{{Telugu poem|type=వ.|lines=<poem>అని వెండియు నిందుధరుండు శతానందనందనునితో నిట్లనియె.</poem>|ref=286}}
'''టీక'''. ఇందుధరుండు = నెలతాల్పు - శివుఁడు; శతానందనందనునితోన్ = బ్రహ్మపుత్రుఁడగు నారదమునితో.
{{Telugu poem|type=సీ.|lines=<poem>నీలమో కాలాభ్రజాలమో బాలశైవాలమో యీ సిద్ధవరునికాంతి
కెంపులో పవడంపుగుంపులో యీరెండసొంపులో యీమేటిజోగిజడలు
హారమో హారినీహారమో భూరికర్పూరమో యీ యాదిపురుషునగవు
మెఱపులో వజ్రంపుటొఱపులో శశిరేఖ తఱపులో యీవటూత్తమునికోఱ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>లనఁగ శార్ఙ్గికి నాదిక్కునందు నిలిచి, ప్రేతభూతనిశాచరపీడ లడఁచి
క్షేత్రరక్షణదక్షుఁడై క్షేత్రపాలుఁ, డుండువిభునాజ్ఞ తలమోచి యోమునీంద్ర!</poem>|ref=287}}<noinclude><references/></noinclude>
phsm4tg8e2nv05m4jxd1zrsq6tust9w
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/326
104
212771
555725
555008
2026-05-09T20:58:54Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555725
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. ఈ సిద్ధవరుని, కాంతి = ఈ గొప్పసిద్ధుని తేజస్సు; నీలమో = ఇంద్రనీలమో; కాలాభ్రజాలమో = కాఱుమబ్బులగుంపో; బాలకైవాలమో = లేఁతపాఁచియో; ఈ మేటిజోగిజడలు = ఈగొప్పయోగియొక్క జటలు; ఈరెండసొంపులో = అరుణకాంతిసొగసులో; ఈ యాదిపురుషునగవు = ఈపురుషముఖ్యుని నవ్వు; హారినీహారమో = మనోహరమగు మంచో; భూరికర్పూరమో = కర్పూరపుకుప్పయో; ఈవటూత్తమునికోఱలు = గొప్పబ్రహ్మచారి యగు నీతని దంతములు; వజ్రంపుటొఱపులో = రవలవెలుఁగులో; శశిరేఖకఱపులో = ముదురు చంద్రవంకలో; శార్ఙ్గికిన్ = విష్ణువునకు; నాదిక్కునందున్ = ఈశాన్యదిశను; క్షేత్రరక్షణదక్షుఁడై = క్షేత్రమును రక్షించుటకు సమర్థుఁడయి; విభునాజ్ఞ = ప్రభుఁడైన విష్ణునియానతిని; తలమోచి = తలపై ధరించి; క్షేత్రపాలుఁడు = క్షేత్రపాలకుఁ డగు కాలభైరవుఁడు; ఉండున్. '''అలం'''. ఉత్ప్రేక్ష.
{{Telugu poem|type=క.|lines=<poem>శిక్యావచూడునాజ్ఞా, వాక్యార్థము సేయు భోగివలయు ప్రభావా
ధిక్యంబు మీఱి యేరికి, శక్యమె తత్{{ZWNJ}}క్షేత్రమునఁ బ్రచార మొనర్పన్.</poem>|ref=288}}
'''టీక'''. శిక్యావచూడునాజ్ఞావాక్యార్థము = చిక్కము - ఉట్టి తలపైన గల విష్ణుని యాజ్ఞాపరిపాలనమును; భోగివలయుప్రభావాధిక్యంబుల్ = పాములు కడియములుగాఁ గల కాలభైరవుని గొప్పప్రభావమును; మీఱి = దాటి - అతిక్రమించి; తత్{{ZWNJ}}క్షేత్రమునన్; ప్రచార మొనర్పన్ = సంచరించుటకు! శక్యమె? = సాధ్యమా?
{{Telugu poem|type=చ.|lines=<poem>చెడుగుల విష్ణుభక్తి నిరసించు దురాత్తుల మోక్షలక్ష్మి చే
పడుటకుఁ గాని హీనులఁ బ్రభావతిరస్కృతలోకపాలుఁ డా
బుడిబుడితాల్పుఁ డందు నొకపూఁటయు నుండఁగనీక త్రోచి పో
<ref>క. నడుచు, చ.ట. నడచు</ref>నడచుఁ గలంచు దెందముల నారటపెట్టు మహోగ్రమూర్తియై.</poem>|ref=289}}
'''టీక'''. చెడుగులన్ = చెడ్డవారిని; నిరసించు = నిందించునట్టి; మోక్షలక్ష్మి = ముక్తిసంపద; చేపడుటకుఁ గాని హీనులన్ = పొంద వలనుపడని నీచులను; ప్రభావతిరస్కృతలోకపాలుఁడు = గొప్పతనముచే తిరస్కరింపఁబడిన దిక్పాలురు కలవారు; బుడిబుడితాల్పుఁడు = బాలచంద్రుని ధరించిన కాలభైరవుఁడు; అందున్ = ఆ పాండురంగక్షేత్రమునందు; పోనడచున్ = తఱుమును; కలంచున్ = కలఁతపెట్టును; మహోగ్రమూర్తియై = మిక్కిలి భయంకరమైన స్వరూపము కలవాఁడై ; డెందములన్ = మనస్సులను; ఆరటపెట్టున్ = పరితాపపెట్టును.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>పువ్వును బూఁత పుట్టమును భూషయు దివ్యములై చెలంగ లే
జవ్వను లర్థిఁ గొల్వ నొకచక్కనిఖేచరుఁ డొక్కనాఁడు ము
న్నవ్వనమాలిహాటకమయావసధోపరివీథిఁ ద్రిమ్మఱున్
గ్రొవ్వెసఁగన్ విమానరుచి కోకనదప్రియరోచి <ref>క. యెచ్చఁగన్, చ. నెంచగన్, ట. సించగన్</ref>నెచ్చఁగన్.</poem>|ref=290}}
'''టీక'''. పూఁత = మంచిగంధము మొదలగువానిఁ బూసికొనుట; పుట్టమును = వస్త్రమును; భూషయున్ = ఆభరణమును; లేజవ్వనులు = లేఁతయౌవనము కల స్త్రీలు; అర్థిన్ = ప్రీతితో; కొల్వన్ = సేవింపఁగా; ఖేచరుఁడు = విద్యాధరుఁడు; అవ్వన...వీథిన్ = ఆ పాండురంగవిభుని బంగారుదేవాలయమీఁదిమార్గమున; క్రొవ్వు, ఎసఁగన్ = గర్వము, అతిశయింపఁగా; విమానరుచి = అతఁడున్న విమానపుఁగాంతి; కోకనదప్రియరోచిన్ = చంద్రునికాంతిని; ఎచ్చఁగన్ = అతిశయింపఁగా; త్రిమ్మరున్ = తిరిగెను. '''అలం'''. ఉపమ.<noinclude><references/></noinclude>
mt6l9z2z3bt2cko4q1i4azbmbf4zj9d
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/327
104
212772
555729
555009
2026-05-10T01:10:06Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555729
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఏధితయౌవనోత్థమతి నెద్దియు మీఁ దెఱుఁగంగలేక వి
ద్యాధరుఁ డాతఁ డాత్మరుచి <ref>చ. కాకసమున్</ref>నాకసమున్ గగనప్రసూనరా
జీధరణాభిరామముగఁ జేయుచుఁ ద్రిమ్మరి క్షేత్రపాలుఁ డు
త్క్రోధరసోగ్రమూర్తియయి కోయని యార్చె నభంబుఁ జూచుచున్.</poem>|ref=291}}
'''టీక'''. అతఁడు, విద్యాధరుఁడు = ఆ విద్యాధరుఁడు; విధితయౌవనోత్థమతిన్ = వృద్ధిపొందిన యౌవనపదముచే; మీఁద ఎఱుఁగంగలేక = ముందు సంభవించుదానిని గుర్తెఱుఁగఁజాలక; ఆత్మరుచిన్ = తన(దేహ)కాంతిచే; ఆకసమున్ = దేవాలయముమీఁది గగనస్థలమును; కనక...రామముగన్ = బంగారుపూవుల సమూహమును (మాలను) ధరించుటను మనోహరమగునట్లుగ; త్రిమ్మరన్ = తిరుగఁగా; క్షేత్రపాలుఁడు = కాలభైరవుఁడు; ఉత్క్రోధరసోగ్రమూర్తి యయి = ఎక్కువైన కోపముచే భయంకరమగు రూపు కలవాఁడై; నభంబున్ = ఆకాశమును; చూచుచున్; కోయని; ఆర్చెన్.
{{Telugu poem|type=సీ.|lines=<poem>కనువిచ్చి చూచుటగాక <ref>చ.ట. దిగ్గన</ref>దిగ్గున లేచె నమితసమాధి<ref>క. స్థిర చ.ట. స్థిత</ref>స్థితమునికులము
గ్రుడ్డులఁ <ref>చ. బొడముమంకు</ref>బొదువు మక్కువలు దక్కుట గాక <ref>చ.ట. పొడవాడె</ref>పొదలాడెఁ జెట్లపైఁ బులుఁగుమూఁక
పులుమేయు<ref>చ.ట. గమకంబు</ref>తమకంబు దొలఁగుట గాక విహ్వలబుద్ధియై దాఁటె హరిణకులము
ప్రజ కేలఁ గర్ణరంధ్రములు మూయుట గాక పవిశంక నరనుతిప్రవణమయ్యెఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>బద్మనాభగృహోపరిభాగసంచ, రిష్ణుఖేచరదర్శనోద్రిక్తహృదయ
కాలభైరవభైరవోద్వేలకంఠ, కుహరనిష్ఠ్యూతరోషనిర్ఘోష<ref>చ.ట. వికృతి</ref>విహృతి.</poem>|ref=292}}
'''టీక'''. పద్మనాభ...విహృతిన్ — పద్మనాభ = విష్ణునియొక్క; గృహ = ఆలయముయొక్క; ఉపరిభాగ = మీఁదిభాగమున; సంచరిష్ణు = తిరుగుచున్న; ఖేచర = విద్యాధరుని; దర్శన = చూచుటచే; ఉద్రిక్తహృదయ = ఉద్రేకము పొందిన మనస్సుగల; కాలభైరవ = కాలభైరవునియొక్క; భైరవ = భయంకరమై; ఉద్వేల, కంఠకుహర = అతిశయించిన గుహవంటికంఠమునుండి; నిష్ఠ్యూత = వెడలింపఁబడిన - బయలుదేరిన; రోషనిర్ఘోషవిహృతిన్ = కోపముతోఁగూడిన ధ్వనియొక్క విహారముచే; అమిత...కులము = సాటిలేని యోగసమాధియందున్న మునుల సమూహము; కనువిచ్చి = కన్ను విప్పి; పులుఁగుమూఁక = పక్షుల సముదాయము; గ్రుడ్డులఁ బొదువు మక్కువలు = గ్రుడ్లను పొదుగుట
యందలి యిష్టమును; దక్కుగాక = విడుచుటయేగాక; చెట్లపైన్; పొదలాడెన్ = ఎగురసాగెను; హరిణకులము = లేళ్లగుంపు; పులుమేయుతమకంబు = గడ్డి మేయుటయందలి ఆసక్తిని; తొలఁగుటగాక = విడుచుటయేగాక; విహ్వలబుద్ధియై = కలఁతపడిన మనస్సుగలదయి; దాఁటెన్ = గంతులిడెను. ప్రజ = జనసమూహము; కేలన్ = చేతితో; పవిశంకన్ = పిడుగు అను భ్రాంతితో; నరనుతిప్రవణము = అర్జునుని కొనియాడుటయం దాసక్తమయినది; అయ్యెన్. [పిడుగు పడినపుడు అర్జునుని పదిపేళ్ళను భజించినచో ఆ పిడుగు తమపైఁ బడదను నమ్మకము జనులకుఁ గలదనుట. ఆ శ్లోక మిది — శ్లో. 'అర్జునః ఫల్గుణః పార్థః కిరిటీ శ్వేతవాహనః, బీభత్సు ర్విజయః కృష్ణః సవ్యసాచీ ధనంజయః.'] '''అలం'''. ఉదాత్తము.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>మానని కోప మిట్లు మది మల్లఁడి గొల్పఁగ మింటికిన్ మహా
శ్యేనముపోలె బిట్టెగసి యెక్కుడు నుక్కున నుగ్రవిగ్రహుం
డై నెఱితగ్గ నగ్గగనయాయివిమానముఁ ద్రొక్కి భగ్నముం
గా నొనరిం<ref>క. చుచున్, చ.ట. పుడున్</ref>పుడున్ ద్రిదశగాయకనాయకుఁ డుర్విఁ <ref>చ. కూలుడున్</ref>గూలినన్.</poem>|ref=293}}<noinclude><references/></noinclude>
61lrov032rwpgh79p5felggrqjvcihh
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/328
104
212773
555730
555010
2026-05-10T03:41:12Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555730
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. మానని, కోపము = విడువని కోపము; మదిన్, మల్లడి గొల్పఁగన్ = కలఁతపఱుపఁగా; మింటికిన్ = ఆకాశముపైకి; మహాశ్యేనము పోలెన్ = పెద్దడేగవలె; బిట్టు, ఎగసి = వేగముగా ఎగిరి; [కర్త క్షేత్రపాలుఁడగు కాలభైరవుఁడు] ఎక్కుడునుక్కునన్ = ఎక్కువ బలముతో; ఉగ్రవిగ్రహుండై = భయంకరమైన స్వరూపము కలవాఁడై; నెఱి, తగ్గన్ = అందము తగ్గునట్లుగా - ఆర్భాటము నశించునట్లుగా; అగ్గగనయాయివిమానమున్ = ఆ విద్యాధరుని విమానమును; భగ్నముంగాన్, ఒనరింపుడున్ = నశింపఁజేయఁగా; త్రిదశగాయకనాయకుఁడు = దేవతల పాటఁగాఁడైన గంధర్వుఁడు; ఉర్విన్, కూలినన్ = భూమిపైని పడఁగా.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>కోలు మసంగి మ్రోఁగి బలుగోఱలు దీటుచు గ్రుడ్లు ద్రిప్పుచున్
క్ష్వేళ లొనర్చుచున్ మొగము జేవురుముద్దవిధంబునన్ మహా
భీలము గాఁగ వ్యాళవిభుఁ బెన్బులుఁ గీడ్పినమాడ్కి నీడ్చె న
బ్బాతిశుఁ గాలభైరవుఁడు పైకుబుసం బొకపోరు వెత్తఁగన్.</poem>|ref=294}}
'''టీక'''. కోలుమసంగి = మిక్కిలి విజృంభించి; మ్రోఁగి = గట్టిగా అఱచి; బలుగోఱలు = పెద్దకోఱలు; క్ష్వేళలు, ఒనర్చుచున్ = సింహనాదము లొనరించుచు; మహాభీలముగాఁగన్ = భయంకరమైనది కాఁగా; వ్యాళవిభున్ = పెద్దపామును; పెన్పులుఁగు = గరుడపక్షి; అబ్బాలిశున్ = ఆ మూర్ఖుని - గంధర్వుని; పైకుబుసంబు = పైతోలు; ఒకపోరువు, ఎత్తఁగన్ = ఒకపొర లేచునట్లుగా; ఈడ్చెన్. '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=క.|lines=<poem>ఈ<ref>చ.ట. విధమున</ref>వడువున బులిదొడికిన, యావుపసిగ నుసురు<ref>క. వోప కాస, చ.ట. వోక కాస</ref>వోక కాసన్నుండౌ
నా విద్యాధరు భైరవదేవావృతుఁ గాంచి వాసుదేవుఁడు పల్కున్.</poem>|ref=295}}
'''టీక'''. ఈవడువునన్ = ఈరీతిని; పులిదొడికిన యావుపసిగన్ = పులి ఆక్రమించిన ఆవురీతిని; ['ఆవుపసిగన్ = గోవు కాఁగా' అని పూర్వటీక.] ఉసురువోకకున్ = ప్రాణము పోవుటకు; ఆసన్నుండౌ = సమీపముగా - సిద్ధముగా - ఉన్న; విద్యాధరు; భైరవదేవావృతున్ = భైరవునిచే ఆక్రమించఁబడినవానిని; వాసుదేవుఁడు = శ్రీకృష్ణుఁడు - పాండురంగఁడు. '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=శా.|lines=<poem>నాగాకల్ప! <ref>క. యహో, చ.ట. యొహో</ref>యొహో పురే! నిలు విమానభ్రష్టుఁడై నేలపై
నీగంధర్వుఁడు కూలి దర్పముడివోయెన్ జంపఁగా రాదు; గా
ఢాగః కర్మఠుఁ డేనియున్ జడుపువాఁడై యుండ నర్థిన్ మహా
భాగుల్ చంపమి నీ వెఱుంగుదువు; కోపం బాఁపు మీపట్టునన్.</poem>|ref=296}}
'''టీక'''. నాగాకల్ప! = పాములు ఆభరణములుగా కల భైరవుఁడా! ఒహో సంబోధనార్ధకము;
పురే విచారార్థమున ఉపయుక్తము; నిలు = నిలుపుము - ఆగుము; విమానభ్రష్టుఁడై = విమానమునుండి జారినవాఁడై; దర్పము, ఉడిపోయెన్ = గర్వ మణంచుకొనెను; గాఢాగఃకర్మకుఁడేనియున్ = గొప్ప అపరాధమును చేసినవాఁడైనను; జడుపువాఁడై = భయపడినవాఁడై; ఉండన్ = ఉండఁగా; ఆర్థిన్ = ప్రీతితో - దయతో; మహాభాగుల్ = ఉత్తములు; చంపమి = చంపక విడుచుట; ఈపట్టునన్ = ఈయెడ; కోపంబు, ఆఁపుము = కోపమును నిలుపుము - విడువుమనుట.
{{Telugu poem|type=క.|lines=<poem>అని శ్రీపతి యానతి యి, చ్చిన <ref>క. మందల, చ.ట. ముందల</ref>ముందల విడిచె నతని సిద్ధవిభుఁడు; వాఁ
డును గులగులలై లా వగ, లిన మై విదలించుకొనుచు లేచెఁ గిదుకుచున్.</poem>|ref=297}}<noinclude><references/></noinclude>
68hi5i5ucl8wmk7w84i2n0jqc3sqbnn
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/329
104
212774
555731
555011
2026-05-10T05:51:47Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555731
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. శ్రీపతి = విష్ణువు; ఆనతి, యిచ్చినన్ = ఆజ్ఞాపింపఁగా; ముందలన్ = ముందు+తలను; వాఁడును = ఆవిద్యాధరుఁడును; గులగులలై = నలిగిపోయి; లావు, అగలిన, మైన్ = బలము, నశించిన, దేహమును ['లావు = బలము; అగలినన్ = పెల్లగిలగా - నశించఁగా' అని పూర్వటీక.] కిదుకుచున్ = మూలుగుచు; లేచెన్.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>లేచి యతండు గాంచెఁ గదళీమృదులోరుయుగున్ హసన్ముఖున్
మేచకమేఘమూర్తి దినమిత్రసమాసమరత్నభూషితున్
లోచనధిక్కృతాంబుజదళున్ శతకోటిసుధాకరాగ్నిరు
గ్వీచిపరంపరోపమనవీనతనుప్రభు యాదవప్రభున్.</poem>|ref=298}}
'''టీక'''. లేచి; అతడు = ఆవిద్యాధరుఁడు; కదళీమృదులోరుయుగున్ = అరఁటిబోదెలవలె
మృదువులైన తొడలు గలవానిని; మేచకమేఘమూర్తిన్ = నీలమేఘమువంటి దేహము కలవానిని; దిన...భూషితున్ = పగలింటి సూర్యునితో సమానమగు (మిట్టమధ్యాహ్నపు సూర్యునివలె ప్రకాశించు) సాటిలేని రత్నాభరణములతో అలంకరింపఁబడినవానిని; లోచనధిక్కృతాంబుజదళున్ = కన్నులచే తిరస్కరింపఁబడిన తామరపూవురేకులు కలవానిని; శత...ప్రభున్ = శతకోటిచంద్రులయొక్కయు, అగ్నులయొక్కయు కాంతులసమూహముతో సరియగు వింతదేహకాంతులు కలవానిని; యాదవప్రభున్ = శ్రీకృష్ణుని; కాంచెన్. '''అలం'''. పరికరము, ఉపమ.
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు సచ్చిదానందకందంబగు నచ్చిందంబుదాల్పు ననల్పాద్భుతరస<ref>క. నిర్మగ్నుండై, చ.ట. నిమగ్నుండై</ref>నిమగ్నుండై
కనుంగొనుచు నవతీర్ణగర్వవిద్యాధరుండై యవ్విద్యాధరుం డిట్లని వితర్కించు.</poem>|ref=299}}
'''టీక'''. సచ్చిదానందకందంబు, అగు = సదానందమునకు, చిదానందమునకును మూలమైన; అచ్చిందంబుఁదాల్పున్ = శంఖమును ధరించిన శ్రీకృష్ణుని; అనల్పాద్భుతరసనిమగ్నుండై = ఎక్కువైన ఆశ్చర్యమున మునిఁగినవాఁడై - ఎక్కువ ఆశ్చర్యపడినవాఁడై; కనుఁగొనుచున్ = చూచుచు; అవతీర్ణగర్వవిద్యాధరుండై = దిగిన (నశించిన) గర్వవిద్య కలవాఁడై - నశించిన గర్వము కలవాఁడై; వితర్కించున్ = ఆలోచించెను.
{{Telugu poem|type=శా.|lines=<poem>ఈపుంగ్రామణి యెవ్వఁడొక్కొ! హరి యి<ref>చ.ట. ట్టంబొందె</ref>ట్లొప్పొందె; సందేహ మే
లా? పద్మాక్షుఁడై యంచు లోఁదెలిసి 'యో లక్ష్మీశ! యేఁ ద్వన్నివా
సోపర్యభ్రచరద్విమానగుఁడనై యుండుండి యిప్డొక్కయు
త్కోపోదగ్రుఁడు గూల్పఁ గ్రొవ్వ<ref>చ. ఱియు</ref>ఱిగి కన్గొంటిన్ సురేశు న్నినున్.</poem>|ref=300}}
'''టీక'''. పుంగ్రామణి = పురుషశ్రేష్ఠుఁడు; ఒప్పొందెన్ = కన్పడెను; పద్మాక్షుఁడు = తామరలవంటి కన్నులు కల విష్ణువు; తన్నివా...గుఁడనై = నీ దేవాలయపుమీఁదిభాగమున ఆకాశమున తిరుగు విమానమున ఉన్నవాఁడనై; ఉత్కోపోదగ్రుఁడు = గొప్పకోపముచే భయంకరుఁడైనవాఁడు; క్రొవ్వు, అఱిగి = గర్వము నశించి; సురేశున్ = దేవతలప్రభువును; కన్గొంటిన్ = చూచితిని.
{{Telugu poem|type=క.|lines=<poem><ref>చ. నిర్మలు</ref>నిర్మదులకుఁ దోఁచినక్రియ, దుర్మదులకుఁ దోఁప వీ వెదుట' <ref>చ. నగుచు</ref>ననుచు మనో
ముర్ముర<ref>ట. వ్యాప్తి</ref>వాపిఁ బడి మనుజ, ధర్మభటుఁడు తత్పదద్వితయ<ref>చ. మానసుఁడై</ref>కృతమతియై.</poem>|ref=301}}
'''టీక'''. నిర్మదులకున్ = అహంకారము లేనివారికి; తోఁచినక్రియన్ = కన్పడినట్లు; ఈవు = నీవు; దుర్మదులకున్ = దురహంకారులకు; ఎదుటన్; తోఁపవు = కన్పింపవు; మనోముర్మురవాపిన్ = మనస్సనెడి (క్రుమ్ముబావిలో) ఊకనిప్పుగోతిలో; పడి = పశ్చాత్తప్తుఁడై; మనుజధర్మభటుఁడు = కుబేర<noinclude><references/></noinclude>
r10m68cgx8h74aowgdwkk22bj7enn6e
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/330
104
212775
555734
555012
2026-05-10T06:34:13Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555734
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కింకరుఁడు - యక్షుఁడు; తత్పదద్వితయకృశమతియై = ఆ విష్ణుని పాదద్వయమున స్థిరమైన మనస్సు గలవాఁడై (ముందుపద్యముతో సమన్వయము.)
{{Telugu poem|type=స్రగ్ధర.|lines=<poem>'పాపో౽హం పాపకోపప్రవణమతిరహం బాలిశో౽హం సుధీదు
ష్ప్రాపో౽హం దుష్టకష్టప్రకృతిరహ మహం పామరాత్మాస్మి; నానా
రూపద్రోహాపచారార్బుదనిహితధియం క్రోధినం మా మన త్వ
చ్ఛ్రీపాదాసక్తియుక్తం శివకర!' యనుచు జిష్ణుఁ గృష్ణు న్నుతించెన్.</poem>|ref=302}}
'''టీక'''. పాపో౽హం = నేను పాపాత్ముఁడను; అహం పాపకోపప్రవణమతిః = నేను చెడ్డదైన
కోపముగల బుద్ధికలవాఁడను; అహం బాలిశః = నేను మూర్ఖుఁడను; అహం సుధీదుష్ప్రాపః = నేను విద్వాంసులను పొందరానివాఁడను; దుష్టకష్టప్రకృతిః అహం = నేను దుష్టమును కష్టమునైన స్వభావము కలవాఁడను; అహం = నేను; పామరాత్మా, అస్మి = అజ్ఞాని నైతిని; నానా...ధియం = పెక్కువిధములగు ద్రోహములయు, అపచారములయు అర్బుదములయందు (అసంఖ్యాకములందు) ఉంచఁబడిన బుద్ధి కలవానిని; క్రోధినం = కోపము కలవానిని; శ్వచ్ఛ్రీపాదాసక్తియుక్తం = నీ శ్రీపాదములయెడ ఎక్కువ ఇష్టముతో కూడినవానిని; మాం = నన్ను; అవ = రక్షింపుము; శివకర! = మేలు కలిగించు ప్రభూ! జిష్ణున్ = జయశీలుని; కృష్ణున్; నుతించెన్.
{{Telugu poem|type=వ.|lines=<poem>అని మఱియును.</poem>|ref=303}}
{{Telugu poem|type=చ.|lines=<poem>యదుకులనాథ! యిప్పు డితఁ డాగ్రహవృత్తి నొనర్చు నిగ్రహం
బిదియు ననుగ్రహంబ యగు, నింద్రియరాజికి <ref>చ. బట్టు</ref>బంటుసేయు శ్రీ
మదము నణంచి నీయడుగుమానిసిగా ననుఁ జేసెఁ గాన; సం
పదగల గర్వి నిర్మమునిమాడ్కి నినుం గని కొల్వఁజాలునే?</poem>|ref=304}}
సమా
'''టీక'''. ఆగ్రహవృత్తిన్ = కోపముతో; నిగ్రహంబు = శిక్ష; ఇంద్రియరాజికిన్ = ఇంద్రియములగుంపునకు; బంటుచేయు = లొంగునట్లు చేయనట్టి; శ్రీమదమును = సంపదచేతనైన గర్వమును; అడంచి = నశింపఁజేసి; ననున్; నీయడుగుమానిసిగాన్ = నీపాదసేవకునిగా; నిర్మమునిమాడ్కిన్ = మమత లేనివానివలె.
{{Telugu poem|type=క.|lines=<poem>మూఢుఁడ ననుఁ బ్రోవు <ref>ట. మహావ్రీడకు</ref>మహ, ద్రీఢకు నిఁక జొరక నామతి వెలయుత దయా
గాఢత్వాజ్ఞ విమానా, రూఢుఁడనై జగములం దిరుగువాఁడ హరీ!</poem>|ref=305}}
'''టీక'''. ఇంకన్; నామతి = నామనస్సు; మహద్రీఢకున్ = పెద్దల నవమానించుటకు; చొఱక = ప్రవేశించక - సిద్ధపడక; దయాగాఢత్వాజ్ఞన్ = ఎక్కువ దయతోడి నీయాజ్ఞచే.
{{Telugu poem|type=చ.|lines=<poem>సురసదనంబునందయిన క్షోణితలంబునయందునైన భీ
కరనిరయంబునందయినఁ గర్మవశంబున నుండు నామదిం
బొరయును గాతఁ గాతరసముద్ధరణోచితకార్యధుర్య! త్వ
చ్చరణసరోరుహద్వితయసంతతసంస్మరణానుషంగముల్.</poem>|ref=306}}
'''టీక'''. సురసదనంబునందున్ = అమరావతియందు; (స్వర్గమందు); భీకరనిరయంబునందున్ = భయమునుగొల్పు నరకమునందు; కాతర...ధుర్య! = భయపడినవారిని రక్షించుపనిని పూనుకొను దేవుఁడా! త్వచ్చరణ...షంగముల్ = నీ రెండు పాదపద్మములను ఎల్లపుడును స్మరించుటలతోడి కూడికలు; నామదిన్; పొరయును గాక! = పొందునుగాక!<noinclude><references/></noinclude>
mrryy428flq33sto5ixjzpmkmgvrwp0
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/331
104
212776
555735
555013
2026-05-10T07:33:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555735
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>అని వలగొని యాయదునం, దనునిరుపమదివ్యరూపదర్శనమున లోఁ
దనియుచుఁ జొక్కుచు మ్రొక్కుచు, జనియె విద్యాధరుండు శతధృతితనయా!</poem>|ref=307}}
'''టీక'''. వలగొని = ప్రదక్షిణము చేసి; నిరుపమదివ్యరూపదర్శనమున = సాటిలేని దివ్యరూపమును చూచుటచే; తనియుచున్ = తృప్తిపడుచు; చొక్కుచున్ = పరవశత పొందుచు; చనియెన్; శతధృతితనయా! = నారదుఁడా!
{{Telugu poem|type=క.|lines=<poem>మధుమథనునాజ్ఞ నేవం, విధమహిమ దలిర్చు క్షేత్రవిభు భైరవదే
పు ధరాధోభువనస్వ, ర్గధామనుతుఁ గాంచి పిదపఁ గనఁదగుఁ గృష్ణున్.</poem>|ref=308}}
'''టీక'''. మధుమథనునాజ్ఞ = మధువను రాక్షసుని చంపిన విష్ణుని యానతిచే; ఏవంవిధమహిమన్ = ఇట్టి గొప్పతనముతో; తనర్చు = ప్రకాశించునట్టి; ధరా...నుతున్ = భూపాతాళస్వర్గలోకములచే కొనియాడఁబడువానిని.
{{Telugu poem|type=శా.|lines=<poem>సాహిత్యాపరకాళిదాస! హరిపూజాగౌరవవ్యాస! గం
గాహల్లోహలవాగ్విలాస! రిపువర్ణత్రాసకృత్ప్రాస! శాం
తాహర్షావహదృగ్విలాస! శ్రుతి<ref>క. వద్యా</ref>పద్యాయోజితాభ్యాస! హే
మాహర్యోపమధైర్యధుర్యపదవిన్యాసా! విధేయౌరసా!</poem>|ref=309}}
'''టీక'''. సాహిత్యాపరకాళిదాస! = సాహిత్యవిద్యయందు రెండవ కాళిదాను అయినవాఁడా!
హరి...వ్యాస! = విష్ణుని పూజించు గొప్పతనమున వ్యాసుఁడైనవాఁడా! గంగా...లాస! = గంగాప్రవాహమునంటి మాటలనేర్పు కలవాఁడా! రిపు...ప్రాస! = శత్రుసమూహమునకు భయము గొల్పు ప్రాసము (అను ఆయుధము) కలవాఁడా! కాంతా...విలాస!= స్త్రీలకు సంతోషము కలిగించు చూపులవిలాసము కలవాఁడా! శ్రుతి...భ్యాస! = వేదమార్గమున చేయఁబడిన అభ్యాసము కలవాఁడా! హేమా...విన్యాసా! = మేరుపర్వతముతో సమానమైన ధైర్యమున అడుగు ఉంచువాఁడా! - మేరువువంటి ధైర్యము కలవాఁడా! విధేయౌరసా! = విధేయులైన కుమారులు కలవాఁడా! (ఇనియన్నియు వేదాద్రిమంత్రికి విశేషణములు)
{{Telugu poem|type=క.|lines=<poem>షడ్దర్శనపారగ! కవి, రాడ్దత్తానుగ్రహాభిరమ్య! <ref>క. సదాంధ, చ. నదాంధ</ref>మదాంధ
ద్విడ్దంతిసింహ! మహిత, త్విడ్దశశతకిరణ! హృదయధృతహరిచరణా!</poem>|ref=310}}
'''టీక'''. షడ్దర్శనపారగ! = ఆరు దర్శనముల అంతము చూచినవాఁడా = షడ్దర్శనములను బాగుగ ఎఱిఁగినవాఁడా! [షడ్దర్శనములు - సాంఖ్యము - యోగము - న్యాయము - వైశేషికము - పూర్వమీమాంస - ఉత్తరమీమాంస.) కవి...రమ్య! = కవిరాజుల కీయఁబడిన అనుగ్రహముచే మనోహరుఁడైనవాఁడా! - కవులను అనుగ్రహించినవాఁడా! మదాంధ...సింహ! = మదించిన శత్రువులను ఏనుఁగులకు సింహమైనవాఁడా! మహిత...కిరణ! = అధికతేజస్సున సూర్యుఁ డైనవాఁడా! హృదయ...చరణా! = మనస్సులో ఉంచఁబడిన విష్ణుపాదములు కలవాఁడా! - సదా విష్ణుని ధ్యానించువాఁడా! '''అలం'''. రూపకము, అనుప్రాసము.
{{Telugu poem|type=మాలిని.|lines=<poem>వినయనయసముద్రా! వి<ref>క. విశ్రు, చ. విస్తృ</ref>స్తృతోల్లాసముద్రా!
జనసుతగుణజాలా! శత్రు<ref>చ.ట. రాణ్మా</ref>రాణ్మీనజాలా!
ధనదనదసమానా! ధన్యధీభాసమానా!
ఘనవపురినరాగా! కావ్యదత్తానురాగా!</poem>|ref=311}}<noinclude><references/></noinclude>
hdoy0y4391477r6xw2cqeegzjs9umpr
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/332
104
212777
555736
555014
2026-05-10T07:55:29Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555736
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. వినయనయసముద్రా! = వినయమునకు, నీతికి సముద్రమైనవాఁడా! విస్తృతోల్లాసముద్రా! = ఎక్కువైన సంతోషముతోఁ గూడినవాఁడా! జన...జాలా! = జనులచే కొనియాడఁబడిన గుణములగుంపు కలవాఁడా! శత్రు...జాలా! = శత్రురాజు లను చేఁపలకు వలయైనవాఁడా! ధనధనదసమానా! = ధనమున కుబేరునితో సమానుఁడైనవాఁడా! ధన్యధీభాసమానా! = గొప్పబుద్ధిచే ప్రకాశించుచున్నవాఁడా! ఘనవపురినరాగా! = గొప్పశరీరమను సూర్యునివెలుగు కలవాఁడా! - సూర్యునితేజస్సువంటి తేజస్సు కలవాఁడా! కావ్యదత్తానురాగా! = కావ్యములయెడ ప్రేమ (ఇష్టము) కలవాడా! '''అలం'''. అనుప్రాసము, రూపకము.
{{Telugu poem|type=గద్యము.|lines=<poem>ఇది శ్రీమత్పరమపదనాథ నిరవధికకృపాపరిపాకపరిచిత సరసకవితాసనాథ
రామకృష్ణకవినాథప్రణీతంబైన పాండురంగమాహాత్మ్యంబను పరమభాగవత
చరిత్రంబునందుఁ జతుర్థాశ్వాసము.</poem>|ref=}}
'''టీక'''. ప్రథమాశ్వాసాంతగద్యమునకు వలెనే.
ఇది శ్రీ గౌతమనగోత్రపవిత్ర బులుసూపనామక సీతారామస్వామ్యవధానిసుపుత్ర, విద్వజ్జనవిధేయ వేంకటరమణనామధేయగ్రథితంబైన పాండురంగమాహాత్మ్యటీకయందుఁ జతుర్థాశ్వాసము.
{{Center|——౦——}}<noinclude><references/></noinclude>
rtceh850nvumemcb31yuikfmyfz69v8
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/333
104
212778
555746
555015
2026-05-10T09:11:58Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555746
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|శ్రీరస్తు}}
{{p|ac|fs150}}పాండురంగమాహాత్మ్యము</p>
{{p|ac|fs125}}పంచమాశ్వాసము</p>
{{Telugu poem|type={{Css image crop
|Image = పాండురంగమాహాత్మ్యము.pdf
|Page = 333
|bSize = 450
|cWidth = 68
|cHeight = 196
|oTop = 54
|oLeft = 33
|Location = left
|Description =
}}|lines=<poem>
షణ్ముఖజననీమహి
భాషానిభనిజవధూశుభప్రదలీలా!
భూషితకల్యాణోజ్జ్వల
వేషా! రామా<ref>చ. నుజయ్య</ref>నుజేంద్ర వేదాద్రీశా!</poem>|ref=1}}
'''టీక'''. శ్రీ...లీలా! — శ్రీషణ్ముఖజననీ = పార్వతీదేవితోను; మహి = భూదేవితోను; భాషా = సరస్వతీదేవితోను; నిభ = సమానమైన; నిజవధూ = ధర్మపత్నికి; శుభప్రదలీలా! = మేలొనర్చు విలాసము కలవాఁడా! భూషిత...వేషా! అలంకరింపఁబడిన చొక్కపుకాంతిగల అలంకారములు (ఆభరణాంబరాదులు) కలవాఁడా! ['కల్యాణోజ్జ్వల = చొక్కపుబంగారుచే వెలుఁగునట్టి' అని పూర్వటీక.]
{{Telugu poem|type=వ.|lines=<poem>ఆకర్ణింపుము.</poem>|ref=2}}
{{Telugu poem|type=క.|lines=<poem>అని యీక్రియ నానతి యి, చ్చిన హెచ్చిన సంతసంబు చిత్తముతోడం
బెనఁగొన ననిమిషముని యి, ట్లను నజ్జగదేకనిధికిఁ బ్రాంజలి యగుచున్.</poem>|ref=3}}
'''టీక'''. ఆనతి యిచ్చినన్ = తెలుపఁగా; సంతసంబు = సంతోషము; చిత్తముతోడన్ = మనస్సుతో; పెనఁగొనఁగాన్ = కలిసి పెనవేసికొనఁగా - మనస్సున ఎక్కువ సంతోషము కలుగఁగా; ప్రాంజలి = చేతులు జోడించినవాఁడు; అనిమిష ముని = దేవముని - నారదుఁడు; అజ్జగదేకనిధిన్ = ప్రపంచములకు ఒక్కటేయొక్క నిధియైనవానికి - శివునికి; (పరమేశ్వరునిగూర్చి యనుట.) ఇట్లనున్.
{{Telugu poem|type=తే.|lines=<poem>క్షేత్రమాహాత్మ్యమును మహాక్షేత్రపాల, దివ్యచరితంబు నందుండు దేవదేవు
గుణకలాపంబుఁ బుండరీకునిమహిమయు, వింటి భవబంధములు వీడుకొంటి దేవ!</poem>|ref=4}}
'''టీక'''. అందుండు = ఆక్షేత్రమున నున్న; దేవదేవుగుణకలాపంబు = పాండురంగని గొప్పగుణములను; భవబంధములన్ = సంసారబంధములనుండి; వీడుకొంటిన్ = విడుపడితిని. [వానిని వినుటచే నాకు పునర్జన్మరాహిత్య మగునని నారదుఁడు తలఁచె ననుట.]
{{Telugu poem|type=తే.|lines=<poem>ఎన్నిద్వారంబు <ref>చ. లయ్యయి</ref>లయ్యాయియెడ వసించు, ద్వారదేవత లెంద ఱాస్థలములందుఁ
బ్రబలు<ref>చ. క్షేత్రాని</ref>క్షేత్రాదిపుణ్యవైభవము వేర, నొండు గలదేని యానతి యిండు మఱియు.</poem>|ref=5}}
'''టీక'''. అయ్యాయియెచన్ = ఆయాద్వారములదగ్గఱ; ఆస్థలమునందున్ = ఆక్షేత్రమున; ప్రబలు = పేరుపొందు; క్షేత్రాది = క్షేత్రాదికము; ఒండు = వేఱైనది.<noinclude><references/></noinclude>
6ky54tavx4yb89zbj0kagln9qqvtvyn
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/334
104
212779
555753
555016
2026-05-10T11:03:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555753
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>అని నారదుండు ప్రార్థిం, చినఁ బద్మదళాయశాక్షుఁ జిత్తాంభోజం
బున నిల్పి యతనిఁ <ref>చ. బలుకన్</ref>బలుకున్, మనసిజమర్దనుఁడు మధురమధురారభటిన్.</poem>|ref=6}}
'''టీక'''. మనసిజమర్దనుఁడు = మన్మథుని మర్దించిన శివుఁడు; చిత్తాంభోజంబునన్ = హృదయపద్మమున; పద్మదళాయతాక్షున్ = తామరఱేకులవలె విశాలములైన కన్నులు కలవానిని - విష్ణువును; నిల్పి = ఉంచి; అతనిన్ = ఆనారదునిగూర్చి; మధురమధురారభటిన్ = మిక్కిలి మధురమైన గంభీరస్వరముతో; పలుకున్.
{{Telugu poem|type=క.|lines=<poem>సుఖమాలికాతరంగిణి, సఖియై భీమరథిఁ గూడి చను నెచ్చట స
త్సుఖకర మచ్చోటు చతు, ర్ముఖముఖ<ref>క. నత, చ. నుత</ref>నుత మాదితీర్థమునునై వెలయున్.</poem>|ref=7}}
'''టీక'''. సఖియై = చెలికత్తెయై - తోడఁగూడినదై; చతుర్ముఖముఖనుతము = బ్రహ్మాదులచేఁ కొనియాడఁబడినది; ఆదితీర్థము = ప్రధానతీర్థము; వెలయున్ = ప్రకాశించును.
{{Telugu poem|type=క.|lines=<poem>పూర్వద్వారం బగునది, దర్వీకరసార్వభౌమ<ref>చ. తల్పమగతి</ref>తల్పునగరికిన్
సర్వసుపర్వార్చితపద, గీర్వనిత వసించు నచటఁ గృష్ణుని యాజ్ఞన్.</poem>|ref=8}}
'''టీక'''. అది = సుఖమాలికాభీమరథుల సంగమస్థలము; దర్వీ...నగరికిన్ = శేషశాయి యగు విష్ణుని నగరికి; పూర్వద్వారంబు = తూర్పువాకిలి; అచటన్ = ఆచోట; సర్వసుపర్వార్చితపద = సమస్తదేవతలచేతను సేవించఁబడిన పాదములు కలదైన; గీర్వనిత = సరస్వతీదేవి; వసించున్.
{{Telugu poem|type=క.|lines=<poem>శ్రీమహితము సిద్ధేశ్వర, నామాంక <ref>చ. ముపంకమయ</ref>మపంకజలసనాథము లక్ష్మీ
కాముకనిహితము ఖచరా, లీమాన్యమునైన శంభులింగముతోడన్.</poem>|ref=9}}
'''టీక'''. శ్రీమహితము = సంపదచే గొప్పది; సిద్ధేశ్వరనామాంకము = సిద్ధేశ్వర మనుపేరు కలది; అపంకజలసనాథము = బురద లేని (తేట)నీటితో కూడినది; లక్ష్మీకాముకనిహితము = విష్ణువుచే ఏర్పఱుపఁబడినది; ఖచరాలీమాన్యమును = దేవతలగుంపునకు గౌరవింపదగినదియును; శంభులింగముతోడన్ = శివలింగముతో; [మీఁదిపద్యముతో సమన్వయము.] '''అలం'''. పరికరము.
{{Telugu poem|type=క.|lines=<poem>తగు దక్షి<ref>చ. ణంబు</ref>ణంపువాకిలి, నగధరునగరునకు భీమనంద<ref>చ. నుబొందుం</ref>నపొందుం
దగిలినయది యచ్చోటన, యగమ్యపుష్పావతీమహానది యనఘా!</poem>|ref=10}}
'''టీక'''. నగధరునగరునకున్ = గోవర్ధనగిరి నెత్తిన విష్ణువుక్షేత్రమునకు; దక్షిణంపువాకిలి; తగున్; అనఘా! = పాపములు లేని నారదమునీ! అచ్చోటన = ఆదక్షిణద్వారప్రదేశముననే; అగమ్య...నది = సాటిలేని పుష్పావతి యనుపేరి యేఱు; భీమనందనపొందున్ = భీమరథీనదిసంగమమును; తగిలినయది = పొందినది.
{{Telugu poem|type=క.|lines=<poem>దానస్నానాదిహృతా, జ్ఞానానలదాహమైన సంగమతీర్థం
బానెలవున విఖ్యాతం, బైనది; సుర లుండుదురు శిలాకృతి నందున్.</poem>|ref=11}}
'''టీక'''. దాన...దాహము = దానము, స్నానము మొదలగువానిచేత నశింపఁజేయఁబడిన
అజ్ఞాన మను అగ్గిమంట; ఆ, నెలవునన్ = అచ్చోటనే; విఖ్యాతంబు, ఐనది = ప్రసిద్ధమై యున్నది; అందున్; సురలు = దేవతలు; శిలాకృతిన్ = శిలా(విగ్రహ)స్వరూపములతో; ఉండుదురు.
{{Telugu poem|type=వ.|lines=<poem>అది భవదీయాశ్రమం బగుట నీ వెఱుంగుదు వదియునుంగాక.</poem>|ref=12}}
'''టీక'''. భవదీయాశ్రమము = నీనివాసము - నారదాశ్రమమనుట.<noinclude><references/></noinclude>
9szzfjqlzwvkoysr258qukrewshwcno
పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/38
104
212942
555737
555712
2026-05-10T07:57:23Z
Brjswiki
6801
555737
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs125}}ఆవ్యాఖ్యానమునకు రత్నప్రభయను వ్యాఖ్యానము</p>}}
{{Center|సూ॥ ఉపపూర్వసు పిత్వేకేభావ మశనపత్తదుక్తం}}
శం॥ భాష్య - అపిత్వేకే ఆచార్యా ఉపపాతక మేవైతది తిమన్యంతే - యనైృష్టికస్య - గురుదారాది భ్యోన్యత్ర బ్రహ్మచర్యం
వికీర్యతే - నతన్మహాపాతకంభవతి - గురుతల్పాదిషు మహాపాతకేష్వ పరిగణనాత్ తస్మాదుపకుర్వాణవన్నైష్ఠికస్యాసి
ప్రాయశ్చిత్తభావమిచ్ఛంతి - బ్రహ్మచారిత్వావిశేషాత్ - ఆకకీర్ణిత్వావిశేషాచ్ఛ - ఆశనవత్ - యధాబ్రహ్మచారి ణోను
ధుమాంసాశనే వ్రతలోపః - పునస్సంస్కార శ్చైవమితి.
యేహిప్రాయశ్చిత్తా భావమిచ్ఛతి - నతేషాంమూలముపల భ్యతే యేతుభావమిచ్ఛంతి - తేషాంబ్రహ్మచార్యవకీర్ణిత్యేతదవి
శేషశ్రవణంమూలం తస్మాద్భావేయుక్తతరః. తదుక్తంప్రమాణ లక్షణే. సమావిప్రతిపత్తిస్స్యాత్ శాస్త్రస్థావాతన్నిమిత్తత్వాదితి
ప్రాయశ్చిత్తా భావస్తరణంత్యేవంసతి - యత్నగౌరవోత్పాదనార్హ మితివ్యాఖ్యాతన్యమ్,
దీనికి రత్నప్రభవయను వ్యాఖ్యానము: ప్రాయశ్చిత్తస్యభావాభావప్రసిథ్యోస్సమత్యేపిభవాప్రసిద్ధిశ్రుతిమూలత్వాదారర్తవేత్య
సమ్మతిమాహ - తదుక్తమితి. యాపమయరుత్యత్ర యవత్వంకిబిత్ దీర్ఘకూకేప్రయుంజతేకేచి ద్దేశవిశేటే ప్రియంగును.
అత్యకస్యచరుః కార్యఇతిసందే<noinclude><references/></noinclude>
ksx6tluuc0bpyfjesorg508ocycq7dv
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/9
104
212943
555726
2026-05-09T23:02:34Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
555726
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండముఉషఃప్రకరణము|3}}</noinclude>దనుకఁ జల్లారుచుండును. సూర్యుం డుదయింపఁదిరుగఁ దాపంబు గలుగు. అందువలన నుషఃకాలంబునఁ జల్లదనంబు పరిపూర్తి నొందెడిని. అప్పటిచల్లదనము పవలుగాని రాత్రిగాని యెప్పుడును సంభవింపదు. అందును నాయైదుగడియలలో నడుమ శైత్యమునకుఁబరమావధియైన యేసూక్ష్మకాలము కలదో అదియే
స్నానకాలమని చెప్పఁబడుచున్నది.
ఏలన, రాత్రియందు నింద్రియములకుఁబ్రచార మడగి యుండ మనుజుఁడునిద్రించును. అపుడు లోనినుండి వెడలు నిట్టూర్పులవలన ముక్కు - కనులు రోమకూపములు మున్నగువానినుండి మలములు వెడలుచుండును. అవి రాత్రులయందుద్రవరూపముననేయుండును. ఇట్లు కనులు మున్నగువాని యందు మలములు స్పష్టముగాఁగానవచ్చుచునేయున్నవి. ద్రవముగానున్నయామలములు సూర్యకిరణసంబంధమువలన గట్టిపడగలదు. అట్లు గట్టిపడునెడ నాయాయింద్రియగోళముల యం దనేక రోగములు జనించును. అవి గట్టిపడుటకుముందు వానిని గడిగివైచునెడ నింద్రియగోళముల కేవిధమగు జబ్బును కలుగ నేరదు. ఈకారణముననేఁ ఉషసి దివాఛనిద్రా, ఉషసి మధ్యాహ్నేచనిద్రా, అని యుషఃకాలమునను పవలును నిద్రించుట నేత్రరోగోత్పత్తికి హేతువుగా నిరూపింపఁబడియున్నది. మఱియునొక్కనిశయ్యపై వేఱొంక్కడుపండుకొనఁగూడదనియు ఒక్కని వస్త్రమును వేఱొక్కఁడు ధరింపఁగూడదనియు నీకార<noinclude><references/></noinclude>
n7j9pm3u9ngm3bce8nhasa9qzi70yb9
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/10
104
212944
555727
2026-05-09T23:11:20Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
555727
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|4|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>ణముననేయేర్పడినది, ఒక్కడు పండుకొనిన ప్రక్కయందుగాని కట్టుకొనిన వస్త్రమందుగాని వాని మలములు చేరియుండుట నన్యునిమల సంబంధముచే గొప్పయనారోగ్యము కలుగుననియెంచి యిది నిషేధింపఁబడియె. కంటిజబ్బు గలవానికి నుష్ణాతిశయమున కంటిపుసి గట్టిపడుటచే రెప్పలంటుకొనుటయు నపుడు చల్లనినీరుచెఁగడిగివేయునెడ కనులు తెరపిడినొందుటయు ననుభవసిద్ధము. ఇట్లు పగటినిద్ర మహానర్థకరమనియెంచి నిషేధింపఁబడియె. ఇట్లుషఃకాలమున మేల్కనుట కేవలము పరలోకసుఖమునకేకాదు. ఇఁకఁ గొప్పది యగునైహికసుఖమునకు గూడనని తేటపడుచున్నది. అప్పుడు వెలుతురులేనందున కన్ను తెరువఁబడినను విషయమును గ్రహింపనేరదు గాన మూయఁబడినదానితో తుల్యముగనుండును. ఇంద్రియవ్యాపారమునఁ బ్రవేశింపని సమయముననే ఇంద్రియగోళమును
సంస్కరించుట యుక్తము. ఆసంస్కార మిదియని ముందు స్పష్టమగును. ప్రకృతము ననుసరింతము. ఆసమయమునకు బ్రాహ్మముహూర్తమనిపేరు. అనగా బ్రహ్మ జగమునుగలిగించునటు లీముహూర్తము జగత్సంబంధ మగువ్యాపారమును గలుగఁజేయుననియర్థము. అప్పుడు నిద్రలేచి మొదట పరమేశ్వరుని
నామముస్మరించుట, అద్దేవుని ధ్యానించుట, పిదపఁ బగటికృత్యముల నాలోచించుట మున్నగునాచారములుగలవు. ఇది యుక్తమే, రాత్రియందుఁజాలకాలమునుండి యింద్రియములు<noinclude><references/></noinclude>
3vmh6yfbi5qky9byj334x1nkqghbggk
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/11
104
212945
555728
2026-05-09T23:22:28Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
555728
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండముఉషఃప్రకరణము|5}}</noinclude>నిర్వ్యాపారముగా విశ్రమించియున్నవి. వానిని తిరుగ వ్యాపారమునఁ బ్రవేశపెట్టునపుడు ప్రాణులకృత్యములు తఱుచుగా భంగపాటుగలవి కావున సర్వప్రాణులయందు దయఁగలవాఁడును, సర్వప్రేరకుఁడును నగుపరమేశ్వరుని మొదటఁ బ్రార్థించుట అత్యావశ్యకమగు. ఇదియకదా ఆస్తికచిహ్నము. పిదపవేదము జదువవలయు. అపుడేయేలఁజదువవలయు ననఁగా, అప్పుడు వెలుతురులేమిచే నింద్రియములకు విషయసంపర్కము గలుగమికతన మనసు ఇంద్రియవ్యాపారమునఁ బ్రవర్తింపదు. దాన బుద్ధిశక్తియంతయు స్వస్థమైయుండు. అందుచేత నాసమయమున మనసు దేనిదేని నభ్యసించునో దానిదానిగ్రహించి తిరుగ మరువకుండును. ఇందుచే నీకాలము జ్ఞప్తిశక్తికి మిగుల నుపయోగించునది యనియెంచి నేర్పఁదగిన సకలవిద్యలును నపుడు నేర్పఁబడుచున్నవి. అందువలననే కాళిదాసుఁడు శ్లో॥ సతత మపరరాత్ర ప్రాప్తనిద్రావసానాః కవయ ఇ వ మ హీ పాశ్చింతయంత్యర్థజాతం॥ రాజులు వేకువజామున నిదురమేల్కాంచినవారలై కవులుపదార్థముల నాలోచించునట్లు కార్యముల నాలోచించుచున్నారు. అనిచెప్పినవాఁడాయె. పగటికృత్యముల నపుడే యాలోచింపవలయు ననుటకు నిదియే నిదర్శనము. బుద్ధి
శక్తి స్వస్థముగా నుండుటయే దానికి కారణంబగు.
{{c|బైలునకేగుట}}
ఇఁకమీద సూర్యోదయముకంటెముందు ద్రవీభూతములు (తడివి) అగుమలములనుఁ బోగొట్టుకొనుమార్గము ప్రస్తా<noinclude><references/></noinclude>
ov6hgkssmccyxva7frf09papmmkrtur
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/12
104
212946
555738
2026-05-10T08:37:48Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
555738
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|6|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>వింపఁబడుచున్నది. పగటికృత్యముల నాలోచించిన వెనుక మలోత్సర్జనమునకై యీశాన దిక్కున కభిముఖముగాఁ బోవలయు. ఏలన, భూమండలమున ధ్రువశక్తి ఉత్తరపుదిశనుండి దక్షిణపుదిశను పొందుచున్నది. ఈయంశము సన్ననికొనఁగలదియై మఱియేవైపునకుద్రిప్పినను నుత్తరపుదిశకే దిరుగు దళసూచి (కంపాసు) చే తెలియుచున్నది. ఆధ్రువశక్తి శరీరమునకుప్రక్కన సోకునెడ దానిచే శోధింపఁబడినదై శరీరము మిగుల నైర్మల్యము నొందుచున్నది. ఎటులన, రాత్రియందు నిర్వ్యాపారముగా నుండినకాలుసేతులు మొదలగువానికి బ్రచారము గలుగుటచే సంధులయందు స్థిరముగానుండినమలము లప్పటివాయువుచే బైలువెడలుటయు, విద్యుచ్ఛక్తిప్రక్కనాడులగుండ లోనఁబ్రవేశించి నాడులను కదల్చుటయు, అట్లు కదల్చఁబడిననాడులనుండియు, నడుచుటచే గదలినమలాశయమునుండియు మలములు వెడలుటచే శరీరము మిగుల నైర్మల్యము నొందును.
ఇందువలన ఈశానదిక్కునకుగాని, నిర్ఋతిదిక్కునకుగాని అభిముఖముగాఁబోవునెడ విద్యుచ్ఛక్తి ప్రక్కనుండి శరీరమునఁ బ్రవేశించుటచేశరీరము నైర్మల్యము నొందుననియెంచియట్లువిధింపఁబడియె. ఇఁకతూర్పుదిశకుగాని, పశ్చిమదిశకుగాని అభిముఖముగాఁబోవునెడ అపుడునువిద్యుచ్ఛక్తి శరీరమునఁబ్రవేశించివస్తిని శోధించుగాని ప్రతిబంధింపదు. అందువలననుశరీరమునకు నైర్మల్యమె కలుగును.
అయినను ద్రవీభూతము లగుమలములు<noinclude><references/></noinclude>
n9p860yt8zxah3iq4qbtmb2nyz3t9qr
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/13
104
212947
555739
2026-05-10T08:45:35Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
555739
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండముఉషఃప్రకరణము|7}}</noinclude>సూర్యకిరణసంపర్కమువల్ల నపుడేగట్టిపడఁగలవు. మలములుగట్టిపడునెడచర్మరోగములు గలుగుగావున "ననూర్యాభిముఖంమలం"సూర్యున కెదురుగా మలమునువిడువఁగూడదని మునులునిషేధించిరి.
మలవిమోకకాలమున మాటాడునెడ నోరుదెరుచుటవలన మలవాసన లోనఁబ్రవేశించును. మలవాసనయన మలముయొక్కపరమాణువులె. అభయమువలన నపుడు మౌనము విధింపఁబడియెను.
మలోత్సర్జన మపాన వాయువుచేఁ జేయుఁబడు. అపుడు ప్రాణవాయువును కొంతనిరోధించినగాని అపానవాయువు నిజశక్తియుతమై తనకృత్యమును నెరవేర్పఁజాలదు. అందుకైప్రాణమునునిరోధింప నాప్రాణవాయువు లోననేకదలుచుండి స్వభావమువలన పైకిలేచునది కావున శ్వాసప్రణాళికల యందుండు
మలముల నూర్ధ్వకపాలమును పొందించును. అపుడు రోమకూపములవల్లనుండి వెడలుచు తనయందుండుమలములను రోమకూపములయందునిలుపును. దానంజేసి బట్టతలమున్నగురోగములు
గలిగెడిని. కావున నపుడు శిరమునకు వస్త్రము చుట్టుకొనవలయు. అటులైన వస్త్రము స్వభావమున మలముల నాకర్షించునదికావున శ్వాసప్రణాళికలయందుండు మలములనాకర్షించును. ఇందుకనియే వస్త్రము శిరమునకుఁ జుట్టుకొనవలయునని మునులువచించిరి.
మఱియు, మలదుర్గంధము లోపలప్రవేశించునను భ<noinclude><references/></noinclude>
0ucuqzxlrl9qzrdl9gnjmhp2lokbeuo
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/14
104
212948
555740
2026-05-10T08:55:28Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
555740
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|8|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>యముననే విశేషించి వస్త్రముచే ముక్కును, మూతిని చుట్టుకొనవలయునని చెప్పిరి. అట్లువస్త్రమును జుట్టికొననియెడ దుర్గంధము లోపల ప్రవేశించును. దానివలన ననేకరోగము లుత్పన్నము లగు. అందునకై యట్లు విధింపఁబడియె.
అపుడు ద్విజుఁడు, యజ్ఞోపవీతమును కుడిచెవున ధరింపవలయు. దానికికారణమేమనఁగా, మనుజునకు రక్తాశయము మలాశయముమున్నగునవి శరీరమునకునడుమనేయుండవు. ఇఁక మధ్యభాగము నతిక్రమించి యెడమవైపుననే ఉండుచున్నవి. అందువలన భుజించిన వస్తువులుమున్నగునవి పరిణమించుచు
నెడమప్రక్కనే కదలుచుండును. అచట పరినిష్ఠితమగుతేటరక్తముచే కుడివైపు పుష్టినొందుచుండును. ఆకారణముననే ఎడమవైపునకంటె కుడివైపు శుద్ధరక్తసంబంధమువలన పరిశుద్ధమని గ్రహింపఁబడుచున్నది. ఇందువలననే శ్రుతియు, 'దక్షిణార్థో బ్రహ్మవర్చసితరః' దక్షిణభాగము శ్రేష్ఠమగు బ్రహ్మవర్చస్సుకలదని ప్రశంసించుచున్నది. ఈవిధమున కుడివైపు అపుడును పరిశుద్ధమైనదే గావున మలవిసర్గ కాలమందు శ్వాసవాయువును నిరోధించుటచే శ్వాసములు లోమార్గమున పైకిలేచునప్పుడు చెవులనుండియు శ్వాసవాయువువెడలునుగాన అందు కుడిచెవినుండి వెడలు శుద్ధమగు రక్తముతో సంబంధముగలశ్వాసములు నైర్మల్యముగలిగించునవిగావున నుపవీతము నాకుడిచెవియందు ధరింప నధికగుణంబును నిర్దోషతయుకలిగె.<noinclude><references/></noinclude>
9fkozx9emtobedaxaqm41a6cpo59wo0
555743
555740
2026-05-10T08:57:21Z
శ్రీరామమూర్తి
1517
555743
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|8|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>యముననే విశేషించి వస్త్రముచే ముక్కును, మూతిని చుట్టుకొనవలయునని చెప్పిరి. అట్లువస్త్రమును జుట్టికొననియెడ దుర్గంధము లోపల ప్రవేశించును. దానివలన ననేకరోగము లుత్పన్నము లగు. అందునకై యట్లు విధింపఁబడియె.
అపుడు ద్విజుఁడు, యజ్ఞోపవీతమును కుడిచెవున ధరింపవలయు. దానికికారణమేమనఁగా, మనుజునకు రక్తాశయము మలాశయముమున్నగునవి శరీరమునకునడుమనేయుండవు. ఇఁక మధ్యభాగము నతిక్రమించి యెడమవైపుననే ఉండుచున్నవి. అందువలన భుజించిన వస్తువులుమున్నగునవి పరిణమించుచు
నెడమప్రక్కనే కదలుచుండును. అచట పరినిష్ఠితమగుతేటరక్తముచే కుడివైపు పుష్టినొందుచుండును. ఆకారణముననే ఎడమవైపునకంటె కుడివైపు శుద్ధరక్తసంబంధమువలన పరిశుద్ధమని గ్రహింపఁబడుచున్నది. ఇందువలననే శ్రుతియు, 'దక్షిణార్థో బ్రహ్మవర్చసితరః' దక్షిణభాగము శ్రేష్ఠమగు బ్రహ్మవర్చస్సుకలదని ప్రశంసించుచున్నది. ఈవిధమున కుడివైపు అపుడును పరిశుద్ధమైనదే గావున మలవిసర్గ కాలమందు శ్వాసవాయువును నిరోధించుటచే శ్వాసములు లోమార్గమున పైకిలేచునప్పుడు చెవులనుండియు శ్వాసవాయువువెడలునుగాన అందు కుడిచెవినుండి వెడలు శుద్ధమగు రక్తముతో సంబంధముగలశ్వాసములు నైర్మల్యముగలిగించునవిగావున నుపవీతము నాకుడిచెవియందు ధరింప నధికగుణంబును నిర్దోషతయుకలిగె<noinclude><references/></noinclude>
qri9qhmhbaf7w0zc9v6izav3wp7przm
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/15
104
212949
555744
2026-05-10T09:03:46Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
555744
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండముఉషఃప్రకరణము|9}}</noinclude>డిని. అట్లు ఉపవీతముద్వారా వ్యాపించు నౌష్ణ్యము కంఠముచుట్టును వ్యాపించి యందు ద్రవీభూతములగు కఫములను శ్వాససౌఖ్య యుతములుగాఁ జేయగలదని యందున్నకై యట్లు విధింపబడియె.
మలనిశ్శేషనివృత్తికై మృత్తికాదులచే శుధ్ధి విధింపబడియె. మల భూయిష్ఠమగుచోట నోరు దెరుచుట సంభవము గాన ముఖమునకు గండూషాదులచే శుద్ధి నిర్దేశింపఁబడియె. అతినైర్మల్యముగోరు యతులు మొలవఱకు స్నానమునే చేయుచున్నారు. ఇఁకపాశ్చాత్యులైననో ఆకులు, కాగితములు, చూర్ణములు, మొదలగు వానిచే శుద్ధి నొనరింతురు. అయినను ఉష్ణాధిక్యముగల దేశమున జలముచే శుద్ధి
నొనరించుటయే శ్రేయమని గ్రహింప నగు.
{{c|ఆచమనము}}
శ్వాసనాడుల శుద్ధికై యాచమనము విధింపఁబడియె.
మలభూయిష్ఠ మగుశరీరమం దంతటను శ్వాసములు సంచరించుచుండుటవలన నట్టిశ్వాససంచారముచే శ్వాసనాడులు మలినములైయుండుటంబట్టి యిది యావశ్యక మయ్యెను.
ఆచమన మనఁగా, వ్రేళ్లు ముడిచినందున నావుచెవిని బోలియుండు నఱచేతితో మినుపగింజ మునుగునంత జలము<noinclude><references/></noinclude>
spyrvoxx7v8euh1bog4zp9ivqdcf8gx
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/16
104
212950
555747
2026-05-10T09:14:40Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
555747
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|10|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>ముమ్మారు పుచ్చుకొనుట, పిదపఁ గొన్నియవయవములను వ్రేళ్లతో తాకుటయు నగును. వాని ప్రయోజనము క్రమముగా నిరూపింపఁబడును.
ఆచమనము ఊపిరిగొట్టములగుండ మలములను దొలగించుటకు సాధన మైనప్రాణాయామమునకు ముందు విశేషసుఖమునకై చేయఁబడుచున్నది, విమర్శింప నియ్యది యాయువును పెంపుచేయునదియు, కర్మమునకు బ్రాణమువంటిదియు నగు. భుజింపఁబడుపదార్థము నోటినుండి కుత్తుకరంధ్రమునఁబడి కుక్షిలోఁ బ్రవేశించుచున్న దని స్థూలదృష్టుల కందఱకు దెలిసినదే. ఇఁక సూక్ష్మదృష్టులైననో యాహారగ్రహణరంధ్రమే గాక సూక్ష్మమగుశ్వాసకోశరంధ్రంబును గలిగియున్న దని కనిపెట్టియున్నారు. ఇందే శ్వాసము సంచరించుచుండుగాన దీనికి శ్వాసనాడి యనిపేరు. ఈనాడికి రెండుప్రక్కల రెండు రంధ్రములు గలవు. ఈరెండురంధ్రముల నడుమ నుండుసూక్ష్మనాడికి సుషుమ్న అని పేరు. ఇది శ్వాసవాయువు నొకమారు కుడివైపునుండియు, ఇంకొకమారు ఎడమవైపునుండియు విడుచుచుండును. ఇందుచే నీనాడికి నిరుప్రక్కల రెండురంధ్రములు కలవని తెలియుచున్నది. ఇందు కుడివైపునుండి శ్వాస మధికముగా వచ్చుచుండునెడ వానిశరీర మధికోష్ణ మనియు, ఎడమవైపునుండి శ్వాస మధికముగా వచ్చుచుండునెడ నధికశీత మనియు యోగశాస్త్రజ్ఞుల నిర్ణయము. ఈకారణముననే<noinclude><references/></noinclude>
48jnhn79ixk0gpsiwuwzfcs4zxilwz1
పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/39
104
212951
555751
2026-05-10T10:09:12Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
555751
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>హే. వృద్ధప్రయోగసామ్యాత్ సమాతుల్యావికల్పేన ప్రతిపత్తిస్స్యాత్ ఇతి ప్రాప్తిసిద్ధాంతః శాస్త్రమూలా ప్రతిపత్తిర్గాహ్యా
శాస్త్రనిమిత్తత్వార్థర్మాది జ్ఞానస్యతధాచ యత్రాన్యావాఓషధయః మ్లాయంత్యధైతే యవామోదమానాస్తిష్టంతి శాస్త్ర
మూలత్వార్థీర్ఘ శూక ప్రయోగన్యైవాదర ఇత్యర్ధః సృతేర్గతిమాహ - ప్రాయిశ్చిత్తేతి - బ్రహ్మచర్యరక్షార్థం యత్నాధిక్యం
కార్యమితిజ్ఞాపనార్థం ప్రాయశ్చిత్తం స్పష్టమపినజళ్యామీక్యుక్త్రం భగవదత్రిణేత్యర్ధః - నైష్ఠికవద్యతి వనస్టయోరపి
ప్రమాచాద్రహ్మచర్యభంగే ప్రాయశ్చిత్తమ స్తీత్యాహ. ఏవమితి.
{{Center|{{p|fs125}}II. విధవాకన్యాదాతకు పాతిత్యముకలదా?</p>}}
ఇదివరకు నేను ఇరుఐది యుక్తులను జెప్పితిని. ఈయన్ని యుక్తులవలనను విధవాకన్యను బునర్దానము చేసిన
వానికి బ్రాయశ్చిత్తమ్ముకలదని తెలియబడుచున్నది. కాని యింకొక యంశమిప్పుడే జ్ఞాపకమునకు వచ్చినది.
మనసునకు దోచినది మీయందరికిని బ్రకటించవలసినదే. ఇదివరకు మన మొక యభిప్రాయమును
మనంబుననుంచుకొని యీవాదమున కారంభించినారము. ఆదియేదియన విధవయగు కన్యకకు దిరుగన వివాహము
చేయుట ప్రాయశ్చిత్తమునకు నిమిత్తమని, ఆనుకొని యీవాదము. అనగా విధవకన్యాదానము పాతిత్యహేతువని,
పాతిత్యమునకు హేతువని - మీయందరి యఖిప్రాయమయిన యెడల యిదివరకు నేను చెప్పిన యుక్తులనుబట్టి
-<noinclude><references/></noinclude>
axc1lk14ff07w5zr6nia5g2no5rwk4v