వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.47.0-wmf.11 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk మహాప్రస్థానం/ప్రతిజ్ఞ 0 2313 564607 370653 2026-07-15T06:04:04Z ~2026-39825-94 7415 564607 wikitext text/x-wiki {{మహాప్రస్థానం}} పొలాలనన్నీ, హలాలదున్నీ, ఇలాతలంలో హేమం పిండగ- జగానికంతా సౌఖ్యం నిండగ- విరామమెరుగక పరిశ్రమించే, బలం ధరిత్రికి బలికావించే, కర్షక వీరుల కాయం నిండా కాలువకట్టే ఘర్మజలానికి, ఘర్మజలానికి ధర్మజలానికి, ఘర్మజలానికి ఖరీదు లేదోయ్‌! నరాల బిగువూ, కరాల సత్తువ వరాలవర్షం కురిపించాలని, ప్రపంచభాగ్యం వర్ధిల్లాలని- గనిలో, వనిలో, కార్ఖానాలో పరిక్లమిస్తూ, పరిప్లవిస్తూ, ధనిక స్వామికి దాస్యం చేసే, యంత్రభూతముల కోరలు తోమే, కార్మిక వీరుల కన్నుల నిండా కణకణమండే, గలగల తొణకే విలాపాగ్నులకు, విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబు లేడోయ్‌! నిరపరాధులై దురదృష్టంచే చెరసాలలో చిక్కేవాళ్లూ- లోహ రాక్షసుల పదఘట్టనచే కొనప్రాణంతో కనలేవాళ్లూ- కష్టం చాలక కడుపుమంటలే తెగించి సమ్మెలు కట్టేవాళ్లూ- శ్రమ నిష్ఫలమై, జని నిష్ఠురమై, నూతిని గోతిని వెదకేవాళ్లూ- అనేకులింకా అభాగ్యులంతా, అనాథులంతా, అశాంతులంతా దీర్ఘశ్రుతిలో, తీవ్రధ్వనితో విప్లవశంఖం వినిపిస్తారోయ్‌! కావున-లోకపుటన్యాయాలూ, కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్య్రాలూ, దౌర్జన్యాలూ పరిష్కరించే, బహిష్కరించే బాటలు తీస్తూ, పాటలు వ్రాస్తూ, నాలో కదలే నవ్యకవిత్వం కార్మికలోకపు కళ్యాణానికి, శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా- త్రిలోకాలలో త్రికాలాలలో, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదని కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ, స్వస్తివాక్యములు సంధానిస్తూ, స్వర్ణవాద్యములు సంరావిస్తూ వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావివేదముల జీవనాదములు జగత్తుకంతా చవులిస్తానోయ్‌! కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలె లల మగ్గం, శరీరకష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు- నా వినుతించే, నా విరుతించే, నా వినిపించే నవీన గీతికి, నా విరచించే నవీన రీతికి, భావం! భాగ్యం! ప్రాణం! ప్రణవం. qh4fasmgv3ny39yoxolay6i3f33l2m3 హరినామము కడు నానందకరము 0 2899 564507 260943 2026-07-14T12:44:47Z ~2026-39548-25 7414 /* */ 564507 wikitext text/x-wiki {{Annamayya-box1-top|హరినామమే కడు (రాగం: ) (తాళం : )}} <poem> హరినామము కడు ఆనందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా నళినాక్షుని శ్రీ నామము కలిదోషహరము కైవల్యము ఫలసారము బహుబంధ మోచనము తలచవో తలచవో తలచవో మనసా నగధరు నామము నరకహరణము జగదేకహితము సమ్మతము సగుణ నిర్గుణము సాక్షాత్కారము పొగడవో పొగడవో పొగడవో మనసా కడగి శ్రీవేంకటపతి నామము బడి బడినే సంపత్కరము అడియాలంబిడ అతి సుఖమూలము తడవవో తడవవో తడవవో మనసా </poem> {{Annamayya-box-bottom}} {{Annamayya-box2-top|harinAmamu kaDu (Raagam: ) (Taalam: )}} <poem> harinAmamu kaDu nAnaMdakaramu marugavO marugavO marugavO manasA naLinAkShu SrInAmamu kalidOShaharamu kaivalyamu PalasAramu bahubaMdha mOcanamu talacavO talacavO manasA nagadharu nAmamu narakaharaNamu jagadEkahitamu sammatamu saguNa nirguNamu sAkShAtkAramu pogaDavO pogaDavO pogaDavO manasA || kaDagi SrIvEMkaTapati nAmamu oDi oDinE saMpatkaramu aDiyAlaM bila nati suKamUlamu taDavavO taDavavO taDavavO manasA </poem> {{Annamayya-box-bottom}} ===బయటి లింకులు=== [http://www.esnips.com/doc/9ba01d79-17ad-4b30-a2d8-db1a0fa78f19/Harinaamame-Kadu---BKP Harinaamame-Kadu---BKP] ---- {{అన్నమయ్య పాటలు}} [[Category:అన్నమయ్య పాటలు ]] r4hcejbv2qidl71b4ctilsv1mazpmtd వాడుకరి:శ్రీరామమూర్తి 2 20449 564513 563535 2026-07-14T13:25:02Z శ్రీరామమూర్తి 1517 /* పాఠ్యంకూర్పు వివరాలు */ 564513 wikitext text/x-wiki నా పేరు శ్రీరామమూర్తి [[దస్త్రం:Srirama murthy.jpg|thumb|శ్రీరామమూర్తి]] ==ఆర్కీవులోని మొత్తం తెలుగు పుస్తకాలు== * [https://archive.org/details/digitallibraryindia?and%5B%5D=collection%3A%22digitallibraryindia%22&and%5B%5D=languageSorter%3A%22Telugu%22 22,945 తెలుగు పుస్తకాలు వీక్షణల ప్రకారంగా.] ==వికీసోర్స్ గణాంకాలు== * [https://tools.wmflabs.org/phetools/statistics.php అన్ని వికీసోర్సులలో తెలుగు వికీసోర్స్ స్థానం యొక్క విశ్లేషణ.] ¼ - ¾ ½ == పాఠ్యంకూర్పు వివరాలు== * మొత్తం పుటలు=40610 * మొత్తం పుస్తకాలు=167 {| class="wikitable sortable" !క్రమ సంఖ్య !పుస్తకం పేరు !పుటలు !ఈ బుక్ |- |1 |[[సూచిక:AndhraRachaitaluVol1.djvu|ఆంధ్రరచయితలు]] |407 |ఉంది |- |2 |[[సూచిక:Naajeevitayatrat021599mbp.pdf|నాజీవితయాత్ర]] |830 |ఉంది |- |3 |[[సూచిక:AndhraKavulaCharitamuVol2.pdf|ఆంధ్ర కవులచరిత్రము]] |268 |ఉంది |- |4 |[[సూచిక:DivyaDesaPrakasika.djvu|దివ్యదేశ ప్రకాశిక]] |398 |ఉంది |- |5 |[[సూచిక:Kankanamu020631mbp.pdf|కంకణం]] |26 |ఉంది |- |6 |[[సూచిక:SampurnaNeetiChandrikaPart1.pdf|సంపూర్ణ నీతిచంద్రిక]] |104 |ఉంది |- |7 |[[సూచిక:Pranayamamu.pdf|ప్రాణాయామము]] |134 |ఉంది |- |8 |[[సూచిక:GanapathiMuniCharitraSamgraham.djvu|గణపతిముని చరిత్ర]] |135 |ఉంది |- |9 |[[సూచిక:Womeninthesmrtis026349mbp.pdf|స్మృతికాలపు స్త్రీలు]] |220 |- |10 |[[సూచిక:Abalaa sachcharitra ratnamaala.pdf|అబలా సచ్చరిత్ర రత్నమాల]] |276 |- |11 |[[సూచిక:SamardaRamadasu.djvu|సమర్థ రామదాసు]] |68 |ఉంది |- |12 |[[సూచిక:Nanakucharitra021651mbp.pdf|నానకు చరిత్ర]] |131 |ఉంది |- |13 |[[సూచిక:Abraham Lincoln (Telugu).pdf|ఆబ్రహాము లింకను]] |238 |ఉంది |- |14 |[[సూచిక:Andhraveerulupar025903mbp.pdf|ఆంధ్ర వీరులు]] |137 |- |15 |[[సూచిక:Andhraveerulupar025958mbp.pdf|ఆంధ్ర వీరులు-రెండవభాగము]] |177 |- |16 |[[సూచిక:Andrulasangikach025988mbp.pdf|ఆంధ్రుల సాంఘిక చరిత్ర]] |423 |ఉంది |- |17 |[[సూచిక:Srivemanayogijiv00unknsher.pdf|శ్రీవేమనయోగి జీవితము]] |35 |ఉంది |- |18 |[[సూచిక:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf|వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము]] |224 |ఉంది |- |19 |[[సూచిక:Chandamama 1947 07.pdf|చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 1/జూలై 1947]] |52 |- |20 |[[సూచిక:Aandhra deishamu videisha yaatrikulu.pdf|ఆంధ్రదేశము విదేశయాత్రికులు]] |175 |- |21 |[[సూచిక:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf|దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు]] |235 |ఉంది |- |22 |[[సూచిక:Andhra bhasha charitramu part 1.pdf|ఆంధ్ర భాషా చరిత్రము 1. వ భాగము]] |450 |- |23 |[[సూచిక:Aliya Rama Rayalu.pdf|అళియరామరాయలు]] |245 |- |24 |[[సూచిక:Bhaarata arthashaastramu (1958).pdf| భారత అర్థశాస్త్రము]] | 453 |ఉంది |- |25 |[[సూచిక:Bharatiyanagarik018597mbp.pdf|భారతీయ నాగరికతా విస్తరణము]] |87 |- |26 |[[సూచిక:Adhunikarajyanga025633mbp.pdf|ఆధునిక రాజ్యాంగ సంస్థలు]] |332 |- |27 |[[సూచిక:ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు.pdf|ఆంధ్రులపుట్టుపూర్వోత్తరములు]] |83 |- |28 |[[ సూచిక:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf|బెంజమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము]] |145 |- |29 |[[సూచిక:Aandruu kaarnegii, Telugu (1955).pdf|ఆండ్రూ కార్నెగీ (జీవితచరిత్ర)]] |242 |- |30 |[[సూచిక:Jeevasastra Samgrahamu.pdf|జీవశాస్త్ర సంగ్రహము]] |370 |- |31 |[[సూచిక:The Verses Of Vemana (1911).pdf|వేమన పద్యములు (సి. పి. బ్రౌన్)]] |190 |- |32 | [[సూచిక:2015.372412.Taataa-Charitramu.pdf|తాతాచరిత్రము]] |180 |- |33 |[[సూచిక:Sumitra Charitram Kandukuri Veeresalingam.pdf|సుమిత్ర చరిత్రమ్]] |27 |ఉంది |- |34 |[[సూచిక:Bobbili yuddam natakam.pdf|బొబ్బిలియుద్ధనాటకము]] |113 |- |35 |[[సూచిక:PadabhamdhaParijathamu.djvu|పదబంధ పారిజాతము]] |875 |- |36 |[[సూచిక:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf|చిన్నయసూరి జీవితము]] |110 |- |37 |[[సూచిక:Anandam Manishainavadu.pdf|ఆనందం మనిషైనవాడు]] |71 |- |38 |[[సూచిక:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf|అపూర్వ బ్రహ్మచర్య ప్రహసనము]] |29 |- |39 |[[సూచిక:2015.373190.Athma-Charitramu.pdf|ఆత్మచరిత్రము]] |660 |- |40 |[[సూచిక:Kumbharaana020881mbp.pdf|కుంభరాణా(మీరాబాయి)]] |88 |- |41 |[[సూచిక:2015.392383.Kavi-Kokila.pdf|కవికోకిల గ్రంథావళి - 3 : నాటకములు]] |330 |- |42 |[[సూచిక:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf|బిల్వమంగళ]] |122 |- |43 |[[సూచిక:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf|సాహిత్య మీమాంస]] |225 |- |44 |[[సూచిక:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf|అబలాసచిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము]] |295 |- |45 |[[సూచిక:Mana-Jeevithalu.pdf|మన జీవితాలు]] |325 |- |46 |[[సూచిక:2015.328360.Andhra-Mahaniyulu.pdf|ఆంధ్ర మహనీయులు]] |80 |- |47 |[[సూచిక:2015.329863.Vallabaipatel.pdf|వల్లభాయి పటేల్]] |155 |- |48 |[[సూచిక:Little Masters Sulabha Vyakaranamu.pdf|లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము]] |145 |ఉంది |- |49 |[[సూచిక:Jagattu-Jiivamu.pdf|జగత్తు - జీవము]] |60 |- |50 |[[సూచిక:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf|ఇంద్రాణీ సప్తశతీ]] |260 |- |51 |[[సూచిక:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf|స్వీయ చరిత్రము-ప్రథమ భాగము]] |380 |ఉంది |- |52 |[[సూచిక:Mahaapurushhula-jiivitamulu.pdf|మహాపురుషుల జీవితములు]] |385 |- |53 |[[సూచిక:Bhagira Loya.djvu|భోగీరలోయ, ఇతరకథలు]] |115 |- |54 |[[సూచిక:Kavijeevithamulu.pdf|కవి జీవితములు]] |690 |- |55 |[[సూచిక:Sasi Kala, Adavi Bapiraju.pdf|శశికళ]] |110 |- |56 |[[సూచిక:2015.393685.Umar-Kayyam.pdf|ఉమర్ ఖయ్యామ్]] |220 |- |57 |[[సూచిక:Gona gannareddy, Adavi Bapiraju.pdf|గోన గన్నారెడ్డి]] |320 |- |58 |[[సూచిక:Kashi-Majili-Kathalu.pdf|కాశీ మజిలీ కథలు]] |175 |- |59 |[[సూచిక:సత్యశోధన.pdf|సత్యశోధన]] |425 |- |60 |[[సూచిక:Chandragupta-Chakravarti.pdf|చంద్రగుప్త చక్రవర్తి]] |165 |- |61 |[[సూచిక:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf|ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు - దంపూరి నరసయ్య]] |190 |- |62 |[[సూచిక:Maha-Purushula-Jeevitacaritramulu.pdf|మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)]] |180 |- |63 |[[సూచిక:MaharshulaCharitraluVol6.djvu|మహర్షుల చరిత్రలు, ఆరవ సంపుటము]] |100 |- |64 |[[సూచిక:నారాయణీయము.pdf|నారాయణీయము]] |64 |- |65 |[[సూచిక:Maharshula-Charitralu.firstpart.pdf|మహర్షుల చరిత్రలు (మొదటి భాగము)]] |166 |- |66 |[[సూచిక:మాటా మన్నన.pdf|మాటా మన్నన]] |65 |- |67 |[[సూచిక:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf|దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర]] |390 |- |68 |[[సూచిక:ప్రపంచ చరిత్ర - మొదటి భాగము.pdf|ప్రపంచచరిత్ర మొదటి భాగము, 1]] |108 |- |69 |[[సూచిక:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf|భారతదేశమున బ్రిటీష్ రాజతంత్ర యుగము అను బ్రిటీష్ ఇండియా చరిత్ర]] |762 |- |70 |[[సూచిక:Tikkana-Somayaji.pdf|తిక్కన సోమయాజి]] |130 |- |71 |[[సూచిక:Thimmarusumantri.pdf|తిమ్మరుసు మంత్రి]] |160 |- |72 |[[సూచిక:Parama yaugi vilaasamu (1928).pdf|పరమయోగి విలాసము]] |685 |- |73 |[[సూచిక:Venoba-Bhudanavudyamamu.pdf|వినోబా బూదాన వుద్యమము]] |49 |- |74 |[[సూచిక:Sri-Srinivasa-Ayengar.pdf|శ్రీమా౯ ఎస్. శ్రీనివాస అయ్యంగారి జీవితము]] |160 |- |75 |[[సూచిక:Jajimalli by Adivi Bapiraju.pdf|నరుడు మరియు జాజిమల్లి]] |73 |- |76 |[[సూచిక:హంసవింశతి.pdf|హంసవింశతి]] |70 |- |77 |[[సూచిక:హాస్యవల్లరి.pdf|హాస్యవల్లరి]] |170 |- |78 |[[సూచిక:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf|సింహాసన ద్వాత్రింశిక]] |53 |- |79 |[[సూచిక:Saundarya-Lahari.pdf|సౌందర్యలహరి (వావిళ్ల 1929)]] |75 |- |80 |[[సూచిక:Andhra-Bhashabhushanamu.pdf|ఆంధ్రభాషాభూషణము]] |63 |- |81 |[[సూచిక:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf|కొప్పరపు సోదర కవుల కవిత్వము]] |322 |- |82 |[[సూచిక:Tenaali-Raamakrishnakavi-Charitramu.pdf|తెనాలి రామకృష్ణకవి చరిత్రము]] |70 |- |83 |[[సూచిక:Kavikokila-Granthamala3-Khandakavya.pdf|కవికోకిల గ్రంథావళి, ఖండకావ్యములు]] |310 |- |84 |[[సూచిక:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf|కవికోకిల గ్రంథావళి, వ్యాసములు]] |270 |- |85 |[[సూచిక:శ్రీ రామాయణము - బాలకాండము.pdf|శ్రీరామాయణము, మొదటిసంపుటము]] |570 |- |86 |[[సూచిక:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf|బసవపురాణము]] |350 |- |87 |[[సూచిక:Dvipada-basavapuraanamu.pdf|ద్విపద బసవపురాణము]] |300 |- |88 |[[సూచిక:Oka-Yogi-Atmakatha.pdf|ఒక యోగి ఆత్మకథ]] |850 |- |89 |[[సూచిక:తెలుగు వాక్యం.pdf|తెలుగు వాక్యం]] |112 |- |90 |[[సూచిక:Navanadhacharitra.pdf|నవనాథచరిత్ర]] |308 |- |91 |[[సూచిక:Kavijanaashrayamu-Chandashastramu.pdf|కవిజనాశ్రయము]] |120 |- |92 |[[సూచిక:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf|శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి]] |400 |- |93 |[[సూచిక:Naayakuraalu.Play.pdf|నాయకురాలు (పల్నాటి వీరచరిత్ర)]] |130 |- |94 |[[సూచిక:Rangun Rowdy Drama.pdf|రంగూన్‌ రౌడీ]] |110 |- |95 |[[సూచిక:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf|శ్రీమహాభారత శ్రీమద్రామయణ విమర్శము]] |200 |- |96 |[[సూచిక:Tenugutota.pdf|తెనుగు తోట]] |40 |- |97 |[[సూచిక:Prabhutvamu.pdf|ప్రభుత్వము]] |110 |- |98 |[[సూచిక:Manooshakti.pdf|మనోశక్తి]] |55 |- |99 |[[సూచిక:Ambati Venkanna Patalu -2015.pdf|అంబటి వెంకన్న పాటలు]] |400 |- |100 |[[సూచిక:Kaashii-Majilee-Kathalu-V10.pdf|కాశీమజిలీకథలు, పదవభాగము]] |420 |- |101 |[[సూచిక:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf|కాశీమజిలీకథలు, ఎనిమిదవభాగము]] |395 |- |102 |[[సూచిక:కాశీమజిలీకథలు -01.pdf|కాశీమజిలీకథలు, మొదటిభాగము]] |305 |- |103 |[[సూచిక:కాశీమజిలీకథలు -02.pdf|కాశీమజిలీకథలు, రెండవభాగము]] |245 |- |104 |[[సూచిక:Kaseemajilee Kathalu 3 Part Madhira Subbanna Deekshitulu.pdf|కాశీమజిలీకథలు, మూఁడవ భాగము]] |300 |- |105 |[[సూచిక:కాశీమజిలీకథలు -09.pdf|కాశీమజిలీకథలు, తొమ్మిదవ భాగము]] |299 |- |106 |[[సూచిక:కాశీమజిలీకథలు -04.pdf|కాశీమజిలీకథలు, 4వ భాగము]] |321 |- |107 |[[సూచిక:కాశీమజిలీకథలు-05.pdf|కాశీమజిలీకథలు, అయిదవ భాగము]] |330 |- |108 |[[సూచిక:కాశీమజిలీకథలు-06.pdf|కాశీమజిలీకథలు, ఆఱవ భాగము]] |325 |- |109 |[[సూచిక:కాశీమజిలీకథలు -07.pdf|కాశీమజిలీకథలు, ఏడవ భాగము]] |290 |- |110 |[[సూచిక:కాశీమజిలీకథలు-12.pdf|కాశీమజిలీకథలు, పండ్రెండవ భాగము]] |290 |- |111 |[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - రెండవ సంపుటం]] |132 |- |112 |[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ సంపుటం]] |385 |- |113 |[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ సంపుటం]] |311 |- |114 |[[సూచిక:Srikrishnudu-Choopina-Maargamu.pdf|శ్రీకృష్ణుడు చూపిన మార్గము]] |150 |- |115 |[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ సంపుటం]] |380 |- |116 |[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ సంపుటం]] |180 |- |117 |[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - ఎనిమిదవ సంపుటం]] |300 |- |118 |[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - తొమ్మిదవ సంపుటం]] |300 |- |119 |[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - పదవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - పదవ సంపుటం]] |179 |- |120 |[[సూచిక:తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ భాగం.pdf|తాళ్ళపాక పదసాహిత్యం - పదకొండవ సంపుటం]] |600 |- |121 |[[సూచిక:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf|బ్రహ్మోత్తరఖండము]] |348 |- |122 |[[సూచిక:పద్మపురాణము (మడికి సింగన).pdf|పద్మపురాణము]] |300 |- |123 |[[సూచిక:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF|అనుభవసారము]] |53 |- |124 |[[సూచిక:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf|చతుర్వేదసారము]] |150 |- |125 |[[సూచిక:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf|ఇంద్రాణీ సప్తశతీ]] |260 |- |126 |[[సూచిక:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf|నారదీయపురాణము]] |192 |- |127 |[[సూచిక:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf|ఆంధ్రకామందకము]] |254 |- |128 |[[సూచిక:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf|వావిలాల సోమయాజులు సాహిత్యం - 2]] |550 |- |129 |[[సూచిక:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf|సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము మూడవ సంపుటము]] |700 |- |130 |[[సూచిక:రామాయణ విశేషములు.pdf|రామాయణ విశేషములు]] |241 |- |131 |[[సూచిక:Bala Neethi.pdf|బాలనీతి]] |150 |- |132 |[[సూచిక:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf|ఆంధ్రనాటక పద్యపఠనం]] |160 |- |133 |[[సూచిక:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu|సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] |390 |- |134 |[[సూచిక:Na-Jevitha-Katha-Navyandramu.pdf|నా జీవిత కథ - నవ్యాంధ్రము]] |500 |- |135 |[[సూచిక:Bharatiya Chitrakala (Telugu) By T.Rama Rao, 1930.pdf|భారతీయ చిత్రకళ]] |230 |- |136 |[[సూచిక:Garimellavyasalu019809mbp.pdf|గరిమెళ్ళ వ్యాసాలు]] |185 |- |137 |[[సూచిక:Golakonda patrika sampadakeeyalu.pdf|గోలకొండ పత్రిక సంపాదకీయాలు]] |235 |- |138 |[[సూచిక:దొంగాటకం.djvu|దొంగాటకం]] |80 |- |139 |[[సూచిక:Arya Katha Nidhi.pdf|ఆర్యకథానిధి]] |330 |- |140 |[[సూచిక:Kabir (TeluguBook).pdf|కబీరు]] |24 |- |141 |[[సూచిక:కృష్ణరాయ విజయము (1981).pdf|కృష్ణరాయ విజయము]] |150 |- |142 |[[సూచిక:ఓయూ సాహితి.pdf|ఓయూ సాహితి (వార్షిక సంచిక-2023)]] |76 |- |143 |[[సూచిక:వేటూరివారి పీఠికలు, మొదటిభాగము.pdf|వేటూరివారి పీఠికలు, మొదటిభాగము.]] |341 |- |144 |[[సూచిక:వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf|వేటూరివారి పీఠికలు, రెండవభాగము.]] |485 |- |145 |[[సూచిక:సూత పురాణము ద్వితీయాశ్వాసము.pdf|సూత పురాణము ద్వితీయాశ్వాసమ]] |89 |- |146 |[[సూచిక:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf|అనుభవాలూ - జ్ఞాపకాలూను]] |586 |- |147 |[[సూచిక:Pillalu Bhasha Yela Nerchukontaru VBS JVV.pdf|పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు?]] |113 |- |148 |[[సూచిక:Srungaramaruka Kavyam By Veturi Prabhakara Sastry In Telugu.pdf|శృంగారామరుకావ్యము]] |18 |- |149 |[[సూచిక:Science Ela Putti Perigindhi VBS JVV.pdf|సైన్సు ఎలా పుట్టి పెరిగింది?]] |60 |- |150 |[[సూచిక:కథాసరిత్సాగరము తృతీయ భాగము వేదంవారి వచన రచన.pdf|కథాసరిత్సాగరము (వేదంవారి వచన రచన)/తృతీయభాగము]] | 296 |- |151 |[[సూచిక:కథాసరిత్సాగరము నాలుగవ భాగము వేదంవారి వచన రచన.pdf|కథాసరిత్సాగరము (వేదంవారి వచన రచన)/నాలుగవభాగము]] |390 |- |152 |[[సూచిక:Upanyaasapayoonidhi (1911).pdf|ఉపన్యాస పయోనిధి]] |- |153 |[[సూచిక:ఆత్మవిచారము (పూర్వ భాగము).pdf|ఆత్మవిచారము (పూర్వ భాగము)]] |345 |- |154 |[[సూచిక:Atma Vicharamu by Addanki Sitarama Sastri (1924).djvu|ఆత్మవిచారము, ఆత్మవిచారము (ఉత్తరభాగము)]] |438 |- |155 |[[సూచిక:అగస్త్యలింగశతకము తాడికొండ పూర్ణమల్లికార్జునఅయ్యవార్లంగారు 1935 110 P Ask01q124 హ్హు.pdf|అగస్త్యలింగ శతకము]] |100 |- |156 |[[సూచిక:VedantaRatnakaramu1919.pdf|వేదాంత రత్నాకరము]] |28 |- |157 |[[సూచిక:Adavi Bapiraju Rachanalu-8 Kathalu, Visalandhra.pdf|అడివి బాపిరాజు రచనలు–8; కథలు]] |230 |- |158 |[[సూచిక:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Vol-1, Kinnera Art Theatrees.pdf|అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం]] |170 |- |159 |[[సూచిక:Adavi Bapiraju Samagra Kavita Sankalanam Volume-2.pdf|అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం, సంపుటి-2]] |100 |- |160 |[[సూచిక:Dharma Padamu (Telugu) By K. Rangacharya, Andhra Book Series 8, 1927.pdf|ధమ్మపదము]] |150 |- |161 |[[సూచిక:Sarada Lekhalu Vol 1.pdf|శారద లేఖలు, మొదటి సంపుటము]] |222 |- |162 |[[సూచిక:Cheppulu Kudutu Kudutu....pdf|చెప్పులు కుడుతూ కుడుతూ]] |40 |- |163 |[[సూచిక:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf|ఆర్యధర్మ ప్రత్యక్ష ఫలబోధిని]] |190 |- |164 |[[సూచిక:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf|ఆచార్య యస్వీ జోగారావు సాహితీ వరివస్య]] |204 |- |165 |[[సూచిక:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf|లక్ష్మణరాయ_వ్యాసావళి]] |330 |- |166 |[[సూచిక:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu|బ్రహ్మవిద్యాదర్పణము]] |400 |- |167 |[[సూచిక:ఆంధ్ర భగవద్గీత.djvu|ఆంధ్ర భగవద్గీత.]] |146 |} == చిత్రం == {{Css image crop |Image = DivyaDesaPrakasika.djvu |Page = 30 |bSize = 378 |cWidth = 311 |cHeight = 477 |oTop = 45 |oLeft = 66 |Location = center |Description = }} kabayvj6o7x0q2oamfx5cwqvorqme7x రచయిత:వేటూరి ప్రభాకరశాస్త్రి 102 35067 564664 532500 2026-07-15T11:00:06Z Rajasekhar1961 50 /* రచనలు */ 564664 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = వేటూరి |అసలుపేరు = ప్రభాకరశాస్త్రి |పేరు_మొదటి_అక్షరం = వ |పుట్టిన_యేడు = 1888 |గిట్టిన_యేడు = 1950 |వివరణ = |బొమ్మ= Statue of Veturi Prabhakara Sastry (cropped).JPG |వికీపీడియా_లంకె = వేటూరి ప్రభాకరశాస్త్రి |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[చాటుపద్యమణిమంజరి]] (1924) {{small scan link|Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf}} ** [[చాటుపద్యమణిమంజరి, ద్వితీయభాగము]] (1952) {{small scan link|Chaatu-Padya Manimanjari Vol 2.pdf}} * [[ధనుర్విద్యా విలాసము]] (1950) {{small scan link|Dhanurvidyaa vilaasamu (1950).pdf}} * [[శ్రీ వేంకటేశ్వర స్తుతి రత్నమాల]] * [[ప్రజ్ఞా ప్రభాకరము]] (1951) * [[మీఁగడ తఱకలు]] (1951) * [[క్రీడాభిరామము]] * [[కపోతకథ]] (1925) * [[భగవదజ్జుకము]] (1924) [[భారతి మాసపత్రిక]] {{small scan link|BHARATHI 1924 11 01 Volume no 1 issue no 11.pdf}} {{small scan link|Bhagavaddajjukamu.pdf}} * [[ప్రబంధరత్నావళి]] (1918, 1976) {{small scan link|Prabandha-Ratnaavali.pdf}} * [[తెలుఁగు మెఱుఁగులు (వ్యాససంపుటి)]] {{small scan link|Telugu merugulu.pdf}} * [[కరుణకము]] (భారతి 1924) {{small scan link|Karunakamu Story by Veturi Prabhakara Sastry.pdf}} * కావ్యమంజరి {{small scan link|Kavyamanjari By Veturi Prabhakara Sastry.pdf}} * [[శృంగారామరుకావ్యము]] {{small scan link|Srungaramaruka Kavyam By Veturi Prabhakara Sastry In Telugu.pdf}} ==వేటూరివారి పీఠికలు== * [[వేటూరివారి పీఠికలు, మొదటిభాగము]] (2012) {{small scan link|వేటూరివారి పీఠికలు, మొదటిభాగము.pdf}} మరియు [[వేటూరివారి పీఠికలు, రెండవభాగము]] (2012) {{small scan link|వేటూరివారి పీఠికలు, రెండవభాగము.pdf}} * [[అన్నమాచార్య చరిత్ర పీఠిక]] (2008) * [[బసవపురాణము]] నకు పీఠిక (2013) {{small scan link|బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf}} * [[శ్రీవేంకటేశ్వరవచనములు]] (1945) నకు పీఠిక {{small scan link|Sri-Venkateshwara-Vacanamulu.pdf}} * [[ఆంధ్రకామందకము]] నకు ఉపోద్ఘాతము {{small scan link|ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf}} ==రచయిత గురించిన రచనలు== * [[ఆంధ్ర రచయితలు/వేటూరి ప్రభాకరశాస్త్రి]] * [[పరిశోధన పత్రిక/సంపుటము 1/సంచిక 3, 1954]] - శ్రీ ప్రభాకర సంస్కరణ సంచిక. rci7lvb1apyl0g3wkurcqyfrgxj8yi1 పుట:Annamacharya Charitra Peetika.pdf/5 104 49322 564578 185496 2026-07-14T21:07:43Z శ్రీరామమూర్తి 1517 564578 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{Css image crop |Image = Annamacharya_Charitra_Peetika.pdf |Page = 5 |bSize = 354 |cWidth = 272 |cHeight = 383 |oTop = 107 |oLeft = 45 |Location = center |Description = }}  {{rh|<big>'''జననం||మరణం'''</big>}} {{rh|<big>'''07.02.1888||29.08.1950'''</big>}}<noinclude></noinclude> iigpt7yyz3mha1triiutwfad5kc0oum పుట:Annamacharya Charitra Peetika.pdf/81 104 49398 564579 155257 2026-07-14T23:14:31Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 564579 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{Center|79}}</noinclude>లక్షణగ్రంథములందు సుంకసాలనరసింగన్న అని కలదు. సంకుసాల అని లోకమువాడుక. <poem> {{left margin|5em}} “సుంకేసుల” అని గ్రామములు రాయలసీమలో నున్నవి. క॥ ఇంకా నవ్వే వచ్చే సుంకేసుల మ్రానిక్రింది సుద్దులు దలఁపన్ లంకించుకొన్న రాజవు వెంకటగిరివాస ! విబుధవినుతవిలాసా ! క॥ టెంకాయ చిప్పలోపల వంకాయ పెసరపప్పు పరివంటకమున్ ఇంకాఁ బెట్టేఁ దినరా వెంకటగిరివాస ! విబుధవినుతవిలాసా ! </poem> ఇత్యాదిగా నెవరు రచించినవో రుచిగల కందపద్యములు గొన్ని శ్రీవెంకటేశ్వరస్వామిపేర నున్నవి. 'సుంకసాల' సంకుసాల సుంకేసులలు ఒకయూరిపేరి వికారములేమో ! కృష్ణరాయఁడు తాళ్ళపాక గ్రామమును వ్యాసతీర్థులవారి కగ్రహారీకరించుటచే నరసింగన్న తాళ్ళపాక విడిచి పైగ్రామము చేరి సుంకసాల యింటిపేరివాఁ డయ్యెనేమో! కవి కర్ణకసాయనమున నాతఁడు తనకులగోత్రములను దలిదండ్రులను బేర్కొనఁ డయ్యెను. గ్రంథాదిని 'గురువరభట్టపరాశరచరణసరోరుహ సముల్లసన్నాననుఁడన్' అని గురుస్తుతి చేసినాఁడు. 'ఆదిమశఠకోపాది' తుదిని 'ఆదిమశఠకోపాది' అని యాశ్వాసాంత పద్యమునఁ జెప్పినాఁడు. వీనినిబట్టి యాతఁడు, భట్ట పరాశరాహ్వయుని శిష్యుఁడనీ, రెండవ శఠకోపయతియైన-యహెూబలమఠ ప్రతిష్ఠాపకవన్ శఠకోపయతి నెఱిఁగిన వాఁడనీ గుర్తింపనగును, వేదాంతదేశికుల శిష్యులు, బ్రహ్మసూత్ర గీతావ్యాఖ్యాతభట్టపరాశరు లొకరు గలరుగాని అయినను రామానుజులనాఁటి పరాశరభట్టారకుల వంశజులందఱకు పరాశరభట్ట నామము సాధారణ మనికూడ వాడుకగలదు. క్రీ. పదునైదవ శతాబ్దియుత్తరార్ధమున<noinclude></noinclude> 36o8duouk0b9uih9p445vl1ffwf1y2z పుట:Annamacharya Charitra Peetika.pdf/82 104 49399 564580 155258 2026-07-14T23:25:23Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 564580 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|80}}</noinclude>వన్‌శఠకోపయతులు గలరుగాన యీతఁడు వారినాఁటివాఁడో వారితర్వాతివాఁడో అగుటచే నన్నమయ పుత్రుఁ డగుట నిర్బాధమగును. కవికర్ణరసాయనమున వైష్ణవమతాభిమానము, అద్వైతమత ద్వేషము, అన్నమాచార్య సంకీర్తనచ్ఛాయలు నిలడార్లుగా నున్నవి. నన్నిచోడ కుమార సంభవమును, ఎఱ్ఱననృసింహపురాణమును, ఉత్తరహరివంశమును, శ్రీనాథరచనలను, ననుకరించునవిగా పలుకుబళ్ళు, కూర్పుతీర్పులు, పద్యచ్ఛాయలు, నిందుఁ జాలఁగలవు. కవిర్ణరసాయనము తాళ్ళపాక నరసింగన్న రచనమే యగుచో నందు రాజాశ్రయగర్హ సహేతుకమే యగును. కారణము సుస్పష్టముకాదు కాని బహువారములు తిరుపతికి విచ్చేయుచు వచ్చినవాఁడు కవి విద్వాసుఁడు కవిపోషకుఁడునగు శ్రీకృష్ణరాయఁడు సంస్కృతాంధ్రవిద్వాంసులు మహనీయులు కవులు గాయకులునగు నరసింహ పెదతిరుమల పినతిరుమలాచార్యాదుల నేలొకో యాదిరింపఁడయ్యెను. పైఁగా వారి నివాసగ్రామమగు తాళ్ళపాకను వ్యాసతీర్థుల కగ్రహారీకరించెను. అచ్యుతరాయలవారు మాత్రము తాళ్ళపాకవారి నాదరించి యాదృతుఁ డయ్యెను. {{c|పెదతిరుమలయ్య}} అన్నమాచార్యుని రెండవభార్యయగు అక్కలాంబయం దీతఁడు జన్మించెను. ఈతనికి నరసమ్మ, తిరుమలమ్మ యుని యిర్వురు చెలియండ్రును గలరు. ఈ తిరుమలాచార్యుఁడు క్రీ 1553 దాఁక జీవించినాఁడు. క్రీ 1503 దాఁక జీవించిన యన్నమార్యుఁడీ పెదతిరుమలయ్య పెదకుమారుఁడగు చినతిరుమలయ్యగారికి బ్రహ్మోపదేశముఁ జేసినాఁడు. 1500 ప్రాంతముల చినతిరుమలయ్య యపనయనము జరిగిన దనుకొన్నచో 1493 ప్రాంతముల జన్మించిన చినతిరుమలయ్య యుపనయనము జరగిన దనుకొన్నచో 1493 ప్రాంతము జన్మించిన చినతిరుమలయ్య తండ్రి యప్పటి కిర్వదేండ్లవాఁడే యనుకొన్నను 1473 ప్రాంతముల జన్మించినవాఁ డగును. ఈతని నిండుయావనము శ్రీకృష్ణరాయలవారి కాలమున గడచినది. కృష్ణరాయల<noinclude></noinclude> 8nmnzl5gs5zc62bcv7sajgp712diac4 పుట:Annamacharya Charitra Peetika.pdf/83 104 49400 564636 155259 2026-07-15T09:45:21Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 564636 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|81}}</noinclude>పరిపాలన కాలమున నీతఁడు శ్రీవెంకటేశ్వరస్వామికిఁ గొన్నికైంకర్యములు జరపినను నందు సాళ్వతిమ్మరుసును నాతని తమ్ముఁడగు గోవిందయ్యయు నిర్వాహకులుగా నుండిరి. ఆశాననములలో శ్రీకృష్ణరాయలపేరు లేదు. పెదతిరుమలయ్యకును నాతని యన్నయగు నరసింహకవికిని శ్రీకృష్ణరాయనితో వైరస్యము గల దనుకొనుట కింకొక సాధనము:- “మండెమురాయనామక నరసింహ దండనేత్రు (తృ?)న కిష్టధనబలస్పూర్తి" నని యన్నమాచార్య చరిత్రముననున్న వాక్యమునకు మండెము రాయఁడను నామాంతరముగల నరసింహ దండనాధుఁ డని యర్ధముగావచ్చు నని యనుకొంటిమి. (చూ.పుట. 286) పయిమండెము కడపమండలము చినమండెము అనీ, చిత్తూరు మండలమున గాజులమండెము చిఱుమండెము అనీ కలగ్రామములలో నొకటయి యుండఁబోలును. ఆయూర పెదతిరుమలయ్య నెవరో కత్తితో నఱకిరట. ఆకత్తివ్రేటాతనికిఁ గలువదండ యైనదట ! <poem> {{left margin|5em}} "మండెము కోటలో మండలం బెఱుఁగ మండలాగ్రాహతి మహనీయ పుష్ప దామమై ధర్మాంగదస్థితిఁ బొలిచె నేమహామహుని యహీనగాత్రమున” </poem> నని చిన్నన్న చెప్పినాఁడు. దేవకీపురవాస్తవ్యుఁడగు నరసింహదండనాథుఁ డిందు ప్రయోజకుఁడేమో! ఈ విషయము పెదతిరుమలాచార్యుఁడే యిట్లు సంకీర్తనమునఁ జెప్పుకొన్నాఁడు. {{c|శంకరాభరణ}} <poem> {{left margin|5em}} నాఁటికి నాఁడు గ్రొత్తనేఁటికి నేఁడు గ్రొత్త ! నాటకపుదైవమవు నమో నమో. {{float right|॥పల్లవి॥}} సిరుల రుక్మాంగదుచేతికత్తిధార దొల్లి । వరుసధర్మాంగదుపై వనమాలాయ । </poem><noinclude></noinclude> 3t17x7kbm94x6zlvaagesldbcqvfy2t పుట:Annamacharya Charitra Peetika.pdf/84 104 49401 564638 155260 2026-07-15T09:58:25Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 564638 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|82}}</noinclude><poem> {{left margin|5em}} హరి నీకృపకలిమి నట్లవే యరులచే । కరఖడ్గధార నాకుఁ గలువదండాయ {{float right|॥నాటి॥ 1}} మునుపు హరిశ్చంద్రుమొనకత్తిధార దొల్లి । పొనిఁగి చంద్రమతికిఁ బూవుదండాయ । వనజాక్ష నీకృపను వరశత్రులెత్తి నట్టి । ఘనఖడ్గధార నాకుఁ గస్తూరివాటాయ {{float right|॥నాటి॥ 2}} చలపట్టి కరిరాజు శరణంటె విచ్చేసి । కలుషముఁ బెడఁ బాపి కాచినట్టు । అలర శ్రీవెంకటేశ ఆపద లిన్నియు బాపి । ఇల నన్నుఁగాచినది యెన్నఁ గతలాయ. {{float right|॥నాటి॥ 3}} </poem> ఈ కీర్తనమునఁ జెప్పఁబడినదేకాక (పుట. 286వుట) సంకీర్తనమున వర్ణితమయిన విషయములుగూఁడఁ బెదతిరుమలాచార్యుని మాహాత్మ్యమును వెల్లడించుచున్నవి. ఆసంకీర్తనమును జినతిరుమలాచార్యుఁడు రచించియుండఁ బోలును. అచ్యుతరాయలవారు పూండి, సంగమకోటగ్రామములఁ దామ్రశాసన పూర్వకముగా దానము చేయఁగాఁ బెదతిరుమలాచార్యుడు వానిని స్వామికే సమర్పించెను. అతఁ డచ్యుతరాయల జన్మనక్షత్రమునాఁడు తనద్రవ్యముతో స్వామికిఁగైంకర్యములఁగల్పించెను. అచ్యుతరాయలనాఁ డాతఁడు విజయనగరములో విట్ఠలేశ్వరస్వామి కైంకర్యముల కై గొప్పభూ సమర్పణము చేసెను. పెదతిరుమలయ్య స్వామికి అర్పించిన గ్రామములు:- కావనూరు, మరువాకరై, కుప్పము, కీళంగున్రము, మన్నసముద్రము, పూండి, సంగమకోట, (ఈ రెండూళ్ళ సంవత్సరపు రాబడి 1000 రేఖ పాన్నులు) రాయలపాడు, సోమయాజులపల్లి, కత్తమువారిపల్లి, ఎఱ్ఱగుంటపల్లి, పల్లిపురము, (133 వరాహాల సంవత్సరాదాయముకలది.) గండతిమ్మాపురము (100 రేఖ పాన్నులు సంవత్సరాదాయముగలది.) ఈ గ్రామములుగాక-భిన్న భిన్న సమయములలో 4600 పణాలు 5203 పణాలు 2000 వరహాలు 450 పణాలు 1900 పణాలు 1020 నర్పణాలు 2300 సర్పణాలు సమర్పించినారు.<noinclude></noinclude> ppmbn3y9ajjm4fve4dg4o3enirr8jwu పుట:Annamacharya Charitra Peetika.pdf/85 104 49402 564645 155261 2026-07-15T10:07:43Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 564645 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|83}}</noinclude>శ్రీస్వామివారికిని ఎగువ దిగువ తిరుపతులను కడమ చోట్లను వెలసిన వేల్పులకు బహువిధభక్ష్యభోజ్యాది నివేదనలను నిత్యోత్సవ పక్షోత్సవమాసోత్సవ వర్షోత్సవాదులలో నింక ననేకవిధముల కైంకర్యములను వనభోజన వినోదములను తమ వంశపారంపర్యముగా తమ పేర జరపించుటకు బయిగ్రామములను ధనమును శ్రీభండారమున నర్పింపగాఁ గోవెలస్థానపతు లందుకు సమ్మతిగా శాననములు చెక్కించిరి. ఇవిగాక వీరు కట్టించిన కట్టడములు వగైరాలు:- స్వామిపుష్కరిణి జీర్ణోద్ధారము, మెట్లు, మండపములు, నీరాడుమండపము కొండమీఁద తాళ్ళపాకవారి యింటి ముందు మండపము, సంకీర్తన (సంకీర్తనములు చెక్కిన రాగిరేకులు దాచి ఉంచినది) భండారము, అక్కడ దీపారాధనలు, అక్కడ సంకీర్తనలు పాడే వైష్ణవులకు జీతాలు, గుడిగ్రామాలలో చెరువులు కాలువలు బాగు చేయించుటకు ధనదానము, ఆళ్వారుతీర్ధము దగ్గఱ శ్రీలక్ష్మీనారాయణస్వామి ప్రతిష్ఠ ఇత్యాదులు. కొన్ని ఉత్సవములలోని ముఖ్యాంశులు:- శ్రీనివాసమూర్తికి ప్రతిశుక్రవారము తిరుమంజనము పిదప పునుఁగుతైలము పూయునప్పుడు పన్నీరుచెంబు సత్కారముపడయుట (తాళ్ళపాకవారు సంకీర్తనములు అప్పుడు పాడేవారు), అచ్యుతరాయల జన్మనక్షత్రమగు మృగశిరనాఁడు ఉత్సవముజరపుట, స్వామిపుష్కరిణి గట్టున తాళ్ళపాకవారు నిర్మించినరాతి స్తంభముమీఁద సంవత్సరము పొడుగునా ప్రతిగురువారము దీపారాధన, ముక్కోటి ఏకాదశినాఁడు స్వామిపుష్కరిణి గట్టున ముప్పది దీపాలు, సంకీర్తన భాండారము దగ్గర నాల్గు తిరుబోనములు దీపాలనూనె ఆభాండారములో సేవచేసే శ్రీవైష్ణవుల జీతాలు వగైరాలు. తిరుమలయ్యగారికి శ్రీపతితొన్నడయ్య అనీ తిరుపతి చేరువనున్న కులశేఖర పురవాస్తవ్యుఁడు పల్లి పట్టురయ్య అనీ ఇద్దఱు సాతాని వైష్ణవులు శిష్యు లుండిరి. వారు కూడ స్వామికిఁగైంకర్యములు జరపిరి.<noinclude></noinclude> f166nsc1fplz69ppforfwpjy09yu8kr పుట:Annamacharya Charitra Peetika.pdf/86 104 49403 564655 155262 2026-07-15T10:19:11Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 564655 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|84}}</noinclude>పెదతిరుమలయ్య గారు చేయించిన యుత్సవ విశేషములు సమగ్రముగా వ్రాసిన నదియే పుస్తకమగును. '''ఈతఁడు రచించిన గ్రంథములు:-''' 1 శృంగారసంకీర్తనములు. 2 ఆధ్యాత్మ సంకీర్తనములు 3 వైరాగ్యవచనగీతాలు 4 శృంగారదండకము 5 చక్రవాళమంజరి 6 శృంగారవృత్త శతకము 7 వెంకటేశ్వరోదాహరణము 8 నీతిసీసశతకము 9 సుదర్శనగడ 10 రేఫఱకారములు. 11 భగవద్గీత తెల్గువచనము 12 ద్విపదహరివంశము 13 ప్రభాత స్తవము పై వానిలో కడపటి రెండు ముద్రితములుగాలేదు. తొలిరెండింటిలోఁ గొంతభాగమును, గడమవి సమగ్రముగాను ముద్రితములయినవి. హరివంశము దొరకనే లేదు. ఇవిగాక చిన్నన్న పేర్కొన్న యంధ్రవేదాంతము తొలుత కృష్ణమాచార్యుఁడును తర్వాత తనతాత యన్నమాచార్యుఁడును పిదప తనతండ్రి తిరుమలాచార్యుఁడును ననుక్రమముగా రచించినది. సంకీర్తనాత్మకము. ఇ ట్లనుటకు సాధకముగా అష్టమహిషీ కల్యాణములోన నిట్లున్నది. "క్ష్మానుతద్రావిడాగమసార్వభౌములై। న మావారలనాళువారలను వేదంబులెల్ల ద్రావిడముగాఁజేసి వేదాంతవిదులు గోవిదులునైనట్టి గురుతరులకు పరాంకుశ ముఖ్య యోగివరుల" నని ద్రవిడవేదాంతకర్తల సన్నుతిపై “వనజాతజాత సర్వసురేంద్రముఖులు| గనలేని వెంకటగ్రావాధినాథు। పదముల శోభనా స్పదములౌ తనదు। పదముల బహుదేశపదము జనులఁ గనఁ జేసిపంచమాగమస్వారభౌముఁ డనఁబ్రసిద్ధకినెక్కియఖిలవిద్యలను। నన్నయాచార్యుండెయనఁ దాళ్ళపాక యన్నయాచార్యుఁడాయతకీర్తిఁజెలఁగె” “వేదంబు తెనుఁగుగావించి సంసార<noinclude></noinclude> 4077nu7tnt61asnyueakfyogm8lrxn8 పుట:Andhra-Bhashabhushanamu.pdf/67 104 90368 564588 537484 2026-07-15T02:11:51Z దేవీప్రసాదశాస్త్రి 4290 564588 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh|42|ఆంధ్రభాషాభూషణము|}}</noinclude>{{left margin|5em}}<poem> మానెఁడు జేనెఁడు ననుక్రియ మాన కెఁడులనొందుమీఁద మ్రానయకేతా. క. తెలుఁగుక్రియాలక్షణము భువి దలప నభినయదండి చెప్పె నభిధానములో పలఁ జెప్పినక్రియలన్నియు దెలియుఁడు సత్కవులు మేలు దేటపడంగన్. క. తప్పులు దీర్పుడు కవులం దొప్పులు గైకొనుడు దీనికోపనివారల్ తప్పొప్పని వెడబుద్దులు విప్పకు డీయన్నలారవేడెద మిమ్మున్ ఆ. పాలునీరువేఱు పఱచునా కలహంస రీతిమ్రాన యార్యకేతనకవి ఆంధ్రలక్షణంబు నలరంగనాచంద్ర తారకంబుఁగాఁగఁ దా రచించె. </poem></div> గద్యము. ఇది శ్రీమదభినవదండివిరచితం బైన యాంధ్రభాషాభూషణంబునందు సర్వంబును నేకాశ్వాసము.<noinclude><references/> {{c|చెన్నపురి : వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్‌వారి}} {{c|వావిళ్ల ప్రెస్సున ముద్రితము. - 1949}}</noinclude> iqs7xh1eas6mdv1lx0gyx9mxqv380w3 పుట:Aananda-Mathamu.pdf/99 104 109106 564536 355907 2026-07-14T14:35:02Z Rajasekhar1961 50 564536 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|94|ఆనందమఠము|}}</noinclude><section begin="99A" />శ్వాసము క్రమక్రమముగా అధిక మగుచు వచ్చెను. భవానందుఁడునాడిని పట్టిచూచెను. నాడి గతి గానవచ్చెను, తుదకు క్రమక్రమముగా ప్రథమపూర్వ ప్రభాత రాగము వికాస మగు నట్లు ప్రభాతపద్మినీ ప్రథమో న్మేషమువలెను, ప్రథమ ప్రేమా నుభవమువలెను, కల్యాణి కన్నులు దెఱువ నారంభించెను.అంత భవానందుఁ డాయర్ధ జీవిత దేహంబును గుఱ్ఱముపై నిడికోని నగరంబునకుఁ బోయెను. {{rule|6em}} <section end="99A" /> <section begin="99B" />{{p|fs125|ac}}పదునెనిమిదవ ప్రకరణము</p> {{p|fs100|ac}}మహేంద్రాదులు కారాగృహవిముక్తు లగుట,</p> సాయంకాల మగునంతలో సంతానసంప్రదాయస్థు లందఱును, సత్యానంద బ్రహ్మచారియును, మహేంద్రుఁడును ఖైదీ లుగా నగరంబునకుఁ గొంపోవంబడి కారాగారంబున నుంచ బడినారని తెలిసికొనిరి. అపుడు ఒక్కొక్కఁడై ఇద్దఱిద్దఱై, పదేపిపదెసి మందియై, నూర్గురునూర్గురై, దేవాలయముచుట్టును దాఁగియుండిన సంతాన సంప్రదాయస్థు లందఱును వచ్చి యా యరణ్యమును జేరిరి. అందఱును శస్త్ర పాణులై యుండిరి. వారి నయనంబు లయందు రోషాగ్నియు, ముఖంబున దంభమును, అధరంబునఁ బ్రతిజ్ఞయు నిండి యుండెను. మొదట నూర్గురు, పిదప వేగురు, ఆమీఁద ఇరువేగురు, ఇల్లు జనసంఖ్య వృద్ధి యగుచుండెను. అప్పుడు భవానందుడు మణి ద్వారమున <section end="99B" /><noinclude><references/></noinclude> 784ot0tzrje7gpsihg92ai71yd3b4zl పుట:Aananda-Mathamu.pdf/103 104 109110 564541 355912 2026-07-14T14:45:45Z Rajasekhar1961 50 564541 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|98|ఆనందమఠము|}}</noinclude><section begin="103A" />దఱును పరాజితులై మ్లానముఖులై నగరంబును విడిచి, అచట నుండి మరలి కాననమునకుఁ బోయి చేరిరి. {{rule|6em}} <section end="103A" /> <section begin="103B" />{{p|fs125|ac}}పందొమ్మిదవ ప్రకరణము</p> {{p|fs100|ac}}శాంతి సన్న్యాసి యగుట</p> జీవానందుఁడు వెడలిపోయిన పిదప, శాంతి, నిమాయిమణి యింటి యరుగుపై కూర్చుండెను, నిమాయిమణి శిశువును తొడపై నిడుకొని గూర్చుండెను. శాంతి నేత్ర జలంబులం దుడిచికొని యుండిన దేగాక ముఖము ప్రఫుల్లముగ నుండెను. కొంచెము కొంచెము నవ్వుచు నుండెను. గంభీరముగను, చింతా యుక్తముగను, ఆన్యమనస్కురాలుగను నుండెను. నిమాయి 'చూచితివా ' యనెను. శాంతి ఉత్తర మియ్యక యూరకుండెను. నిమాయి, శాంతి తనమనో భావములు వెల్లడి చేయదని భావించికొని, ప్రయత్నపురస్సరముగా ఏవేవో ముచ్చటలాడి, 'చూడవేవదినే! ఇది యెంతటిబిడ్డనే!” అనెను. శాంతి——ఈబిడ్డ నీ కెక్కడ దొరకెను? నీ వెపుడు కంటివి? నిమాయి——నీవుపాడైతివి, ఇది మాయన్న బిడ్డకదా! నిమాయి, శాంతి యొక్క కడుపు మండించుట కీమాటఁ జెప్ప లేదు. అన్న బిడ్డయనఁగా అన్న యిచ్చిన బిడ్డ యని చెప్పుట కట్లు చెప్పెను, శాంతి యీయర్థమును గ్రహింపక, నిమాయి <section end="103B" /><noinclude><references/></noinclude> 8b2b20yge9ll1s85wpeyv8pkf6x7ebh పుట:Aananda-Mathamu.pdf/112 104 109448 564546 355195 2026-07-14T14:50:39Z Rajasekhar1961 50 564546 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{p|fs125|ac}}ఇరువదొకటవ ప్రకరణము</p> {{p|fs100|ac}}మహేంద్రునకు సత్యానందుఁడు హితోపదేశము చేయుట.</p> సత్యానందుఁడు సాయాహ్ని కకృత్యమును దీర్చుకొని, మహేంద్రునిఁ బిలిచి 'నీబిడ్డ జీవించి యున్న 'దని పలికెను. మహేంద్ర——ఎక్కడ మహాస్వామీ! సత్యానంద——నీవు నన్ను “మహాస్వామి”యనెద వేల? మహేంద్ర——మఠాధికారులను “మహాస్వామి” యని పిలువవలయు నని యందఱును చెప్పెదరు. 'నాబిడ్డ యెక్కడ, మహాస్వామీ! సత్యానంద—— ఆసంగతిని తెలిసికొనుటకు ముందు నేనడుగు ప్రశ్నలకు బదులు చెప్పుము. నీవు సంతానుల ధర్మంబును గ్రహించెదవా? మహేంద్ర—— అటులనేగ్రహింపవలయునని నిశ్చయించు కోని యున్నాను. సత్యానంద—— ఆటు లైనచో “బిడ్డ యెక్కడ” యని యడుగరాదు. మహేంద్ర——ఏల మహాస్వామీ! సత్యానంద——ఎవరు ఈ వ్రతమును గ్రహించెదరో వారు తమ యాలు బిడ్డలు స్వజనులు వీరెవ్వరిసంబంధము నుంచుకొనఁ గూడదు. ఆలుబిడ్డల ముఖమును జూచినచో ప్రాయశ్చిత్తము గలదు. ఎంతవఱకు సంతానుల కార్యము సిద్ధియగుట లేదో యంతవఱకు నీవు నీ బిడ్డను జూడరాదు, నీవుసంతానులధర్మ<noinclude><references/></noinclude> ttzr0df7soz91hoci3pfk3y3v0suxo7 పుట:Aananda-Mathamu.pdf/120 104 109456 564563 355929 2026-07-14T17:44:29Z Rajasekhar1961 50 564563 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh||ఇరువది మూఁడవ ప్రకరణము|115}}</noinclude><section begin="120A" />పుఁడై యున్నాఁడో; యట్టి మహానుభావుఁడు ప్రతిజ్ఞా భంగకారిని ధ్వంసము చేసి నరకంబునఁ బడ వేయునుగాక ! ఉభయులు—— తథాస్తు, సత్యానంద——మీరు "వందే మాతరం” అని గానము చేయుఁ డనఁగా నిరువురు నా నిభృతమందిరమున మాతృస్తోత్రమును పాడిరి. పిమ్మట బ్రహ్మచారి వారికి యథావిధిగా దీక్ష నొసంగెను. {{rule|6em}} <section end="120A" /> <section begin="120B" />{{p|fs125|ac}}ఇరువది మూఁడవ ప్రకరణము.</p> {{p|fs100|ac}}మహేంద్రుఁడు స్వగృహమున వసించుట కియ్యకొనుట</p> దీక్షాసమాపనాంతరమున సత్యానందుఁడు మహేంద్రుని యత్యంతము నేకాంతమగు నొక స్థలమునకుఁ బిలిచికోని పోయెను. ఇరువురును గూర్చున్న పిదప, సత్యానందుఁ డిట్లని చెప్పందొడంగెను. "కుమారా! ఇపుడు నీవు మహా వ్రతమును గ్రహించినందుచే భగవంతుఁడు మనపక్షముగా నున్నాఁడని తలంచెదను. నీ మూలముగా మాతృమహత్కార్యము నెఱ వేఱవలసినదిగా నున్నది. నీవు చక్కఁగా నామాటలను చెవి యొగ్గి వినుము. నీవు భవానంద జీవానందులతో వనవనంబు లను దిరిగి యుద్ధము చేయ నవసరము లేదు. నీవు పదచిహ్న గ్రామంబునకు మరలి పొమ్ము. స్వగృహంబున నుండియే సన్న్యాసధర్మంబు నాచరింపుము." మహేంద్రుఁడు విస్మితుఁడై , కొంచెము వ్యాకులమనస్కుం డాయెను. ఏమియు నుత్తర మియ్య లేదు. బ్రహ్మచారి <section end="120B" /><noinclude><references/></noinclude> 9wlo48ul10kqat3o2511kmdlmcavnla పుట:Aananda-Mathamu.pdf/129 104 109465 564591 355939 2026-07-15T02:14:22Z Rajasekhar1961 50 564591 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|124|ఆనందమఠము|}}</noinclude><section begin="129A" />సత్యానంద——తల్లీ! భవానివలె నీ లలాటమునందు ఆగ్ని ప్రజ్వలించుచున్నది. సంతానసంప్రదాయస్థుల నందఱను కాల్చి వేయుదువే మొ? అని చెప్పి, శాంతిని దీవించి యనుజ్ఞ నొసంగెను. శాంతి మనంబున, 'ఓరీ ముదుసలిగొడ్డా! నాముఖము నందా యగ్ని! నేను కాలినముఖము గలదాననా? నిన్నుఁ గన్న తల్లి కాలినముఖము గలది.' అని యనుకొనెను. వాస్తవముగా సత్యానందున కీ యభిప్రాయము లేదు. ఆమె నేత్రంబుల విద్యుత్కటాక్షమును గుఱించి యతఁ డట్లు చెప్పెను. అయినను, ఆముసలివాఁడు యువతికి వివరించి చెప్ప వచ్చునా? {{rule|6em}} <section end="129A" /> <section begin="129B" />{{p|fs125|ac}}ఇరువదియైదవ ప్రకరణము</p> {{p|fs100|ac}}జీవానంద నవీనానందుల కలహము.</p> శాంతి యారాత్రి మఠముననుండుట కనుజ్ఞఁ గొని యుండెనుగాన, మఠమున నొక గదిని చూచికొనుటకై పోయెను.పెక్కు గదులుండినవి. గోవర్ధనుఁ డను నొక పరిచారకుఁ డుండెను. వాఁడును సంతానుఁడే. అయినను, పై తరగతిలోఁ జేరినవాఁడు కాడు. వాఁ డొక దీపమును చేతఁ బట్టుకొని గదులను చూపుచు వచ్చెను. ఏగదియు శాంతికి సమ్మతముగ నుండ లేదు. హతాశుఁడై శాంతిని సత్యానందుని కడకుఁ బిలిచికొని పోవుటకు యత్నించెను. <section end="129B" /><noinclude><references/></noinclude> 7i3pdj8dbvk21ylwg8drf7ts4r3dagn పుట:Aananda-Mathamu.pdf/140 104 109476 564613 355950 2026-07-15T06:46:52Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 564613 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" />{{rh||ఇరువదియాఱవ ప్రకరణము|135}}</noinclude><section begin="140A" />జీవానంద—— అచ్చటికి స్త్రీలు పోరాదు. శాంతి——నేని స్త్రీని కాదు గదా? జీవానంద—— నేను స్వామియాజ్ఞ నుల్లంఘింపఁజాలను. శాంతి—— నాకు స్వామియాజ్ఞ యై యున్నది. కుంజమునకు బోయిన పిదప నంతయుఁ జెప్పెదను. నే నింటికిఁ బోవక గడ్డమును మీసమును తీయను. గడ్డమును తీయకుండినచో నీ పాడుమూతి దానిని నీవు గుర్తింపపు, ఛీ ! పురుషజాతి యెటువంటిది! {{rule|6em}} <section end="140A" /> <section begin="140B" />{{p|fs125|ac}}ఇరువదియాఱవ ప్రకరణము</p> {{p|fs100|ac}}సంతానులు తమపరాక్రమమును జూపుట,</p> కడచిన డెబ్బదియాఱవ సంవత్సరము సంపూర్ణ మాయెను. బంగాళా దేశమునందు నాల్గుపాళ్లో యెనిమిది పాళ్లో లేక యెన్ని కోట్లజనులో దాని నెవరు చెప్పఁగలరు? ఎందఱనో యమపురికిఁ బంపి వేసి యాదుర్వత్సరము తానును కాలగ్రాస మొందెను. డెబ్బది యేడవసంవత్సరమున దేవుఁడు సుప్రసన్నుఁ డాయెను, సువృష్టి కలిగెను. పృథ్వి సస్య శాలిని యాయెను. జీవ మాత్రావశిష్టులు కడుపు నిండుగ భుజించిరి. అనాహారులై యుండినవారును, అల్పాహారులై యుండిన వారును, పూర్ణాహారము నొక్క టేసారి తిని, యఱిగించుకొన లేక మృతులైరి. పృథ్వి సస్యశాలిని యాయెనుగాని, జనశూన్యము, గ్రామం <section end="140B" /><noinclude><references/></noinclude> ds3mo1gkjhn90hoff9h18gfx2o75qts పుట:Aananda-Mathamu.pdf/146 104 109482 564611 355956 2026-07-15T06:44:52Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 564611 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" />{{rh||ఇరువ దేడవ ప్రకరణము|141}}</noinclude><section begin="146A" />కులను బారు చేసికొని సంతానుల వధకై వెడలిరి. అయినను, సంతానులసంఖ్య యెక్కువగా నుండి నదేగాక, వారు అజయ్యులై యుండిరి. కేష్ట౯ థామసుయొక్క సైనికులు, కోతకాలములో కొడవలికి దొరికిన పైరువలె కత్తరింపఁబడిరి. హరిహరిధ్వనిచే కేష్ట౯ థామసుయొక్క చెవులు చెవుడు వడెను. ఈవిధముగ 1776-వసంత్సరమునందు వీరభూమిలో సంతానులు ప్రసిద్ధి కెక్కిరి. {{rule|6em}} <section end="146A" /> <section begin="146B" />{{p|fs125|ac}}ఇరువదేడవ ప్రకరణము</p> ఆకాలమున కంపెనీవారిచే పట్టుపనిచేయు కార్ఖానాలు స్థాపింపబడి యుండెను. శివగ్రామంబున నొకకొఠా రుండెను. డనివర్తుదొర అనువాఁ డాకోఠారునకు ఫ్యాక్టరు (Factor) అనఁగా అధ్యక్షుఁడై యుండెను. కొఠారుల సంరక్షణ విషయమునందు తగిన యేర్పాట్లు కలిగియుండెను. డనివర్తుదొర యెట్లో తన ప్రాణరక్షణము చేసికొని వసించుచుండెను. అయినను, వాఁడు తనభార్యను బిడ్డలను కలకత్తాకుఁ బంపి యుండెను. ఇట్లుండినను వానికి సంతానుల యుపద్రవము తప్ప లేదు. ఈసమయమున నాప్రదేశంబునకు నాలుగైదు పటాలములతోడ కేష్ట౯ ధామసువిజయముచేసి యుండెను, కొత్తగాఁజేరిన మాలలు మొదలగు నీచజాతి సంతానులు కొందఱు పరధనాపహరణంబునందుత్సాహులై యుండిరి. కేష్ట౯ థామసుదొరవారు సైన్య <section end="146B" /><noinclude><references/></noinclude> ezvljir7y6bxqq9t5f8chr0oohfftlv పుట:Aananda-Mathamu.pdf/151 104 109487 564616 355961 2026-07-15T06:54:47Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 564616 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" />{{rh|146|ఆనందమఠము|}}</noinclude><section begin="151A" />పంజరము ఖాలీగా నున్నది. ఆపంజరములో నిన్నుంచి మంచి కల్లు పోసెదను; నీవు వచ్చెదవా? మఱియు మాతోటలో మంచి రసదాళి యరఁటిపండ్లుకూడ యున్నవి. థామస్——నీవు మంచి వీరాంగన (spirited woman)గా నున్నావు. నీ ధైర్య శౌర్యములను (courage) గాంచి, నాకు చాల సంతోష మైనది; నీవు నాగుఱ్ఱముపై నెక్కుము. నీస్వామి యుద్ధమునఁ జచ్చిపోయినయెడల నీ వేమగుదువు? శాంతి——సరియే, అయినను మన మొకశపథము చేసికొందము. యుద్ధ మింకను రెండుమూడు దినములలో ప్రారంభ మగును; నీవు జయించితివేని నేను నీకు ఉపపత్ని నయ్యెదను మేము జయించితిమేని, నీవు జీవించి యుంటి వేని, మా పంజరమున వసించి పండ్లు తినుచుండెదవా? థామస్——అరఁటిపండ్లు తినుటకు ఉట్టమమైనడి (ఉత్తమమైనది). ఇప్పుడున్న దాయేమి? శాంతి——తీసికొనుము, నీతుపాకిను తీసికొనుము. ఇట్టి కొత్తజయశాలురతో నెవ్వరు మాటలాడఁగలరు? శాంతి తుపాకీనిఁ బాఱవైచి నవ్వుచు వెడలి పోయెను. {{rule|6em}} # 151B ## {{p|fs125|ac}}ఇరువదెనిమిదవ ప్రకరణము.</p> {{p|fs100|ac}}శాంతి భర్తకు హితము చెప్పుట</p> శాంతి హరిణ వేగముతో వనమధ్యమం దెచ్చటికో పోయెను. కొంచెము సేపటికి థామసు స్త్రీ కంఠమునుండి మధురమైన సంగీతమును వినెను. <section end="151A" /><noinclude><references/></noinclude> e1o37ehoztqtk9w7h1lday8qkrcvzvg 564617 564616 2026-07-15T06:55:13Z Rajasekhar1961 50 564617 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" />{{rh|146|ఆనందమఠము|}}</noinclude><section begin="151A" />పంజరము ఖాలీగా నున్నది. ఆపంజరములో నిన్నుంచి మంచి కల్లు పోసెదను; నీవు వచ్చెదవా? మఱియు మాతోటలో మంచి రసదాళి యరఁటిపండ్లుకూడ యున్నవి. థామస్——నీవు మంచి వీరాంగన (spirited woman)గా నున్నావు. నీ ధైర్య శౌర్యములను (courage) గాంచి, నాకు చాల సంతోష మైనది; నీవు నాగుఱ్ఱముపై నెక్కుము. నీస్వామి యుద్ధమునఁ జచ్చిపోయినయెడల నీ వేమగుదువు? శాంతి——సరియే, అయినను మన మొకశపథము చేసికొందము. యుద్ధ మింకను రెండుమూడు దినములలో ప్రారంభ మగును; నీవు జయించితివేని నేను నీకు ఉపపత్ని నయ్యెదను మేము జయించితిమేని, నీవు జీవించి యుంటి వేని, మా పంజరమున వసించి పండ్లు తినుచుండెదవా? థామస్——అరఁటిపండ్లు తినుటకు ఉట్టమమైనడి (ఉత్తమమైనది). ఇప్పుడున్న దాయేమి? శాంతి——తీసికొనుము, నీతుపాకిను తీసికొనుము. ఇట్టి కొత్తజయశాలురతో నెవ్వరు మాటలాడఁగలరు? శాంతి తుపాకీనిఁ బాఱవైచి నవ్వుచు వెడలి పోయెను. {{rule|6em}} <section end="151A" /> <section begin="151B" />{{p|fs125|ac}}ఇరువదెనిమిదవ ప్రకరణము.</p> {{p|fs100|ac}}శాంతి భర్తకు హితము చెప్పుట</p> శాంతి హరిణ వేగముతో వనమధ్యమం దెచ్చటికో పోయెను. కొంచెము సేపటికి థామసు స్త్రీ కంఠమునుండి మధురమైన సంగీతమును వినెను. <section end="151B" /><noinclude><references/></noinclude> qx4w34hkbo6gfduk4tiq38uxqwbiorw పుట:Aananda-Mathamu.pdf/154 104 109490 564622 355964 2026-07-15T07:03:51Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 564622 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" />{{rh||ఇరువదితోమ్మిదవ ప్రకరణము|149}}</noinclude><section begin="154A" />జీవానందుఁ డాహ్లాదముచే గద్గదకంఠుఁడై——నీవు నేర్పియే నేను నేర్చికొంటిని, అనెను. శాంతి ప్రఫుల్లచిత్తయై——ఇంకను వినుము; గోసాయీ! ఇహమందే మన వివాహము నిష్ఫలమా? నీవు నన్నుఁ బ్రేమించుచున్నావు. నేను నిన్నుఁ బ్రేమించుచున్నాను. ఇంతకంటే ఇహమున నింకేమి యధిక ఫలము కావలయును? చెప్పుము——“వందేమాతరం” అపు డాయిరువురును జేరి యేకకంఠముతో “వందేమాతరం” అనుగీతమును పాడిరి. వారు గానము చేయుచు కన్నీరు నించి యేడ్చిరి. {{rule|6em}} <section end="154A" /> <section begin="154B" />{{p|fs125|ac}}ఇరువదితొమ్మిదవ ప్రకరణము,</p> {{p|fs100|ac}}భవానందుఁడు రాజనగరంబున కల్యాణితో సంభాషించుట</p> భవానందగోస్వామి, యొక్కసారి రాజనగరంబునకు వచ్చి ప్రశస్తమైన రాజవీథిని విడిచి చీఁకటిగా నుండు నొక సందున బోయెను. ఆసందులోని ఇరుపార్శ్వములందును గొప్ప గొప్ప మేడయిండ్లు కలవు. సూర్యుఁడు మధ్యాహ్న సమయంబునమాత్ర మొక్కసారి తొంగి చూచును. మరల నెప్పటివలె నచ్చట నంధకారమే. ఆసందులో నొక రెండంతస్తుల సౌధమునందు భవానందుఁడు ప్రవేశించెను. మొదటియంతస్తులో నొక చిన్న యింటియందు ఏఁబది యేండ్ల యాఁడు దొకతె వంట <section end="154B" /><noinclude><references/></noinclude> nlu39cd7bfg0wm7g5hwoe35t06pri50 పుట:Aananda-Mathamu.pdf/165 104 109503 564626 355984 2026-07-15T07:13:06Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 564626 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" />{{rh|160|ఆనందమఠము|}}</noinclude><section begin="165A" />భవానంద——(సాశ్రులోచనుఁడై) పంపెదను. నేను చచ్చిన పిదప నన్ను జ్ఞాపకము చేసికొనియెదవా? కల్యాణి——వ్రతచ్యుతుఁ డైన అధర్మి వని జ్ఞాపకము జేసికొందును. భవానందుఁడు వెడలి పోయెను. కల్యాణి పుస్తకమును జదువుచుఁ గూర్చుండి యుండెను. {{rule|6em}} <section end="165A" /> <section begin="165B" />{{p|fs125|ac}}ముప్పదియవ ప్రకరణము</p> {{p|fs100|ac}}భవానంద ధీరానందుల సంవాదము</p> భవానందుఁ డాలోచనా క్రాంతుఁ డై మఠమునకు వెడలెను. పోవుచుండఁగాఁ బొద్దు క్రుంకెను, అడవియం దొక్కఁడే పోవుచుండెను. అచ్చట నెవఁడో యొకఁడు ముందు పోవు చుండెను. భవానందుఁ 'డెవరది' యని యడిగెను. అగ్రగామి——అడుగువా రేవరు? తెలిసినచో నుత్తర మిచ్చెదను. నేను పథికుఁడను. భవానంద—— వందే. అగ్రగామి——మాతరం. భవానంద——నేను భవానంద గోస్వామిని. అగ్రగామి——నేను ధీరానందుఁడను. భవానంద——ధీరానందా! ఎచటికిఁ బోయి యుంటివి? <section end="165B" /><noinclude><references/></noinclude> bgqopaa29pkckxzc7fp6hdw82cpzwhy పుట:Aananda-Mathamu.pdf/169 104 109507 564637 355988 2026-07-15T09:57:33Z Rajasekhar1961 50 564637 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|164|ఆనందమఠము|}}</noinclude><section begin="169A" />చరుఁడనై 'పెండ్లము బిడ్డలతోఁ గాలహరణము చేయుచు నిన్ను దీవించుచుండెదను. సంతానధర్మము నతలజలమునఁ గలిపి వేయుము. భవానందుఁడు కత్తిని ధీరానందుని మెడనుండి మెల్లగా దీసి, 'ధీరానందా!యుద్ధము చేయుము; నిన్నుఁ జంపెదను; నేను ఇంద్రియ పరవశుఁడనై యున్నాను; అయినను విశ్వాసఘాతుకుఁడను గాను నన్ను విశ్వాసఘాతుకుఁడ వగు మని నీవు హెచ్చరిక చేయుచున్నావు. నీవు స్వయం విశ్వాసఘాతుకుఁడవు; నిన్నుఁ జంపినచో బ్రహ్మహత్యా పాతకము సంభవింపదు. నిన్ను వధింతు' ననెను. మాట ముగియునంతలో ధీరానందుఁడు నిట్టూర్పు పుచ్చి పరుగిడిపోయేను. భవానందుఁడు వాని వెంట నంటి పోలేదు. వాఁడు కొంచెము సేపు అన్యమసస్కుఁడై యుండి, పిదప వెదకెను, వాఁడు కనఁబడ లేదు. {{rule|6em}} <section end="169A" /> <section begin="169B" />{{p|fs125|ac}}ముప్పదియొకటవ ప్రకరణము</p> {{p|fs100|ac}}భవానందుని మనోవ్యాకులము</p> భవానందుఁడు మఠమునకుఁ బోక గంభీరమైన వనమధ్యమునం బ్రవేశించెను. ఆకాననమం దొకవైపున పడిపోయిన గొప్ప మిద్దెయి ల్లుండెను. భగ్నా వశిష్ట మైనయిటికలు మొదలగువానిపై లతలును చెట్లును దట్టముగాఁ బెరిగి యుండెను. లెక్కలేని సర్పముల కాటపటై యుండెను. నేలఁగూలిన గదులలో నొక్క గదిమాత్రము కొంచెము బాగుగా నుండెను. భవానందుఁడు ఆగదిలోఁ గూర్చుండి యాలోచింప నారంభించెను <section end="169B" /><noinclude><references/></noinclude> 1969h5vvtdm49of6bxvd3r7yp5pfkjw పుట:Aananda-Mathamu.pdf/175 104 109513 564643 355993 2026-07-15T10:04:04Z Rajasekhar1961 50 564643 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|170|ఆనందమఠము|}}</noinclude><section begin="175A" />చెప్పినవిధముగా నాస్వామి చచ్చినను చావనిండు; నేను అభ్యంతరము చేయుదానను గాను, అనెను. బ్రహ్మచారి—— దీర్ఘ నిశ్వాసము విడిచి, తల్లీ ! ఈఘోర వ్రతంబునకు బలిదానము కలదు. మనమందఱమును బలి కా వలసి యున్నది, నేను చచ్చెదను. జీవానంద భవానందులును చత్తురు. తల్లీ, నీవును చచ్చెద వని తోచుచున్నది. అయినను పని చేసి చావవలయును. పని చేయక చచ్చుట బాగగునా? నేను ఎప్పుడును స్వదేశమును మాత్రము తల్లి యని పిలుతు గాని మఱెవ్వరి నట్లు పిలువను. ఏలన, సుజలమును, సుఫలమును గల భూమియే మనకు తల్లి; ఇపుడు నిన్నుఁ దల్లియని నుడివితిని. నీవు తల్లివై సంతానుల కార్యమును జేయుము. దేనిచే కార్యోధార మగునో దానినిఁ జేయుము. జీవానందుని ప్రాణరక్షణము సేయుము, నీ ప్రాణరక్షణమును జేసికొనుము. ఇట్లని చెప్పి, సత్యానందుఁడు “హరే మురారే మధుకైటభారే” అని పాడుచు పోయెను. {{rule|6em}} <section end="175A" /> <section begin="175B" />{{p|fs125|ac}}ముప్పది మూఁడవ ప్రకరణము</p> {{p|fs100|ac}}సత్యానందుఁడు యుద్ధమునకుఁ బురికొలుపుట</p> తీర్థయాత్ర చేయుటకై పోయిన సంతానులలో సత్యానందుఁడు మాత్రము మరలి వచ్చె ననియును, సంతానుల కండఱకు 'నేమో చెప్పవలయు నని యున్నాఁ డనియును, సంతానులందఱును రావలసిన దని సెల వైనదనియును ప్రకటింపఁబడెను. గుంపులు గుంపులుగా సంతాను లందఱును అజయనదీతీరమున <section end="175B" /><noinclude><references/></noinclude> 20bfrk3hyexzbogmmnodr39ma92wofd పుట:Aananda-Mathamu.pdf/179 104 109517 564648 355998 2026-07-15T10:11:44Z Rajasekhar1961 50 564648 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|174|ఆనందమఠము|}}</noinclude><section begin="179A" />'జిక్కిన చేఁపలవలె వధింపవలయు' నని యుద్యమించి యుండెను. {{rule|6em}} <section end="179A" /> <section begin="179B" />{{p|fs125|ac}}ముప్పదినాలుగవ ప్రకరణము</p> {{p|fs100|ac}}థామస్ యుద్ధము చేయుట.</p> ఆంగ్లేయుల ఫిరంగిగుండ్లు ఢం-ఢం- శబ్దము చేసెను. ఆ శబ్దము విశాలమైన కాననమును గంపింపఁ జేసి ప్రతిధ్వనితమాయెను, శబ్దము ఆజయనదీ సోపానమునుండి మఱోక సోపానమునకు విని, యిట్లు నదీముఖముగా దూరముననుండు కాననమును బ్రవేశించి యచ్చటను ఢం-ఢం- అని వినవచ్చెను. సత్యానందుఁ 'డెవరి పటాలమో చూడుఁ' డనియెను. ఆక్షణముననే కొందఱు సంతానులు గుఱ్ఱముల నెక్కి చూచుటకై వెడలిరి. అయినను, వారు కాననమును విడిచి కొంతదూరము పోవునంతలో శ్రావణమాస వర్ష ధారలవలె గుండ్లు వారిపై గురిసెను, వారు గుఱ్ఱములతోఁ గూడ ప్రాణములను విడిచిరి సత్యానందుఁడు దూరముగ నుండి చూచి సంతానులు కొందఱు హతు లైరని తెలిసికొని, మణికొందఱను బిలిచి 'గొప్పవృక్షము నెక్కి చూడుఁ, డని చెప్పుచుండఁగా, జీవానందు డొక గొప్పవృక్షమునెక్కి చెట్టు కొమ్మపై నిలిచి, 'ఇంగ్లీషువారి పటాల' మనెను. సత్యానందుఁడు, 'గుఱ్ఱపుసవారులా? కాల్భములా?' అని యడిగెను. జీవానంద——రెండును గలవు. సత్యానంద——ఎంత? <section end="179B" /><noinclude><references/></noinclude> i1vfl9li0e7a7mnp8irh0b3qes0f6sa పుట:Aananda-Mathamu.pdf/188 104 109526 564656 356053 2026-07-15T10:19:28Z Rajasekhar1961 50 564656 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh||ముప్పదియాఱవ ప్రకరణము|183}}</noinclude><section begin="188A" />టకు కాదయ్యెను, కొందఱు పరువిడిపోయి ఆమ్ర కాననము నాశ్రయించిరి. మిగిలిన వారిని జీవానందుఁడును ధీరానందుఁడును ఆనకట్ట మీదుగా బిలిచికొని పోయిరి. అచ్చట 'హేయును వాట్సనును రెండు ప్రక్కలనుండి వచ్చి చుట్టుకొనిరి. ఇఁక వీరి యత్నము తప్పినది. {{rule|6em}} <section end="188A" /> <section begin="188B" />{{p|fs125|ac}}ముప్పదియాఱవ ప్రకరణము</p> {{p|fs100|ac}}సంతానులు ఆంగ్లేయుల ఫిరంగిని గైకొనుట </p> ఇంతలో థామసుని ఫిరంగి సైన్యము కుడివైఫువచ్చి చుట్టుకొనెను. అప్పుడు సంతానుల సైన్యము ఛిన్న భిన్న మాయెను. ఎవ్వరికిని తప్పించుకొనెడియాశ లేకపోయెసు, సంతానులు దిక్కుదిక్కునకుఁ బాఱ నారంభించిరి. జీవానందుఁడును ధీరానందుఁడును వారిని నిలిపి యొకస్థలమునఁ జేర్చుటకుఁ బ్రయత్నపడిరి; అది నిష్ఫల మాయెను. ఆసమయంబున గట్టిగా, ఆనకట్టమీదుగాఁ బోయి 'ఆవలికి పొండు ! లేకున్న నదిలో మునిగిపోదురు, మెల్ల మెల్లగా ఆంగ్లేయుల వైపు చూచుచుపొండు,' అనుశబ్దము వినవచ్చెను. జీవానందుఁ డాశబ్దము వచ్చినవైపును చూడఁగా, ముందు ప్రక్కను భవానందుఁడుండెను. భవానందుఁడు, జీవానందా! ఆనకట్టపై దీసికొని పొమ్ము; ఇఁక యత్నము లేదు' అనెను. అప్పుడు మెల్ల మెల్లగా భయపడుచు సంతాన సైన్యము <section end="188B" /><noinclude><references/></noinclude> 5s9i4ssrb45g2mtf5gkd51pk2l7p256 పుట:Aananda-Mathamu.pdf/195 104 109533 564660 356060 2026-07-15T10:24:41Z Rajasekhar1961 50 564660 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|190|ఆనందమఠము|}}</noinclude><section begin="195A" />"భవానందుని తోడ నుండుము, వాఁ డీదినము చచ్చును. మరణకాలమున నే నాశీర్వదించితి నని చెప్పుము, పరలోకమున వానికి 'వైకుంఠ ప్రాప్తి గలుగును.” అని చెప్పిరి. భవానంద——సంతానులకు జయ మగుఁగాక; స్నేహితుఁడా! నా మరణకాలమున కొకసారి “వందేమాతరం” అను గీతము చెవిని బడునట్లుగా గానము చేయుము, అనెను. అపుడు ధీరానందుని యాజ్ఞ మేరకు యుద్దోన్మత్తులై యుండిన సంతాను లందఱు నతిగంభీరముగా "వందేమాతరం" పాడిరి. దానిచే వారికి బాహుబలము ద్విగుణ మాయెను. ఆ భయంకరమైన ముహూర్తమున మిగిలియుండిన యెఱ్ఱజనులు హతులై పోయిరి. రణరంగమునందు శత్రువులు మిగుల లేదు. ఆసమయమున భవానందుఁడు "వందేమాతరం "పాడుచు, మనస్సున హరిచరణ ధ్యానము చేయుచు ప్రాణ త్యాగము చేసెను. హా! రమణీయరూపలావణ్యమా! ఇహసంసారమునందు నీయధి కారము మిక్కిలి చెడ్డది! నిన్ను కాల్పవలసినదే! {{rule|6em}} <section end="195A" /> <section begin="195B" />{{p|fs125|ac}}ముప్పది యేడవ ప్రకరణము</p> {{p|fs100|ac}}భవానందుఁడు నిహతుఁ డగుట</p> రణమునందు జయ మైన పిమ్మట అజయనదీ తీరమునందు సత్యానందునిఁ బరివేష్టించికొని విజయులైన వీరులు నానావి <section end="195B" /><noinclude><references/></noinclude> 3xgdu8jq1od440n0l7rzh94si0kej53 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/391 104 154451 564504 564446 2026-07-14T12:07:46Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 564504 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఎముకలు కీళ్ళు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> మున కాని ఆ ఎముకలు రెండును కీలు యొద్ద కలియుటకు వీలు కలుగును. ఆటకాండ్రయొక్క మోకాలి కీలు నందలి ఉపాస్థి తరచు తునిగిపోవుచుండును. దానిని తొలగించుట ఆవశ్యకము కావచ్చును. '''ఎముకతో చీము చేరుట (ఆప్టోమైలిటిస్): '''ఎముకలకు తీవ్రమైన సంపర్కదోషము (ఇన్ ఫెక్షన్) సోకుటచే ఇది సంభవించును. జీవాణువులే ఇందులకు కారణము. ఇది పిల్లలకు ఎక్కువ తరచుగా సంభవించుచుండును. ఎముకలో తీవ్రమైన బాధ యుండును. ఎముకను ముట్టుకొనగానే ఏడుపు సాగింతురు. జ్వరమువచ్చును. వివిజన్య రక్త దోషము కలుగవచ్చును. జీవాణు వ్యతిరేక ఔషధములు (ఆంటీ-బయొటిక్సు) వెంటనే హెచ్చు మోతాదులో నిచ్చిన యెడల పరిస్థితిలో అభివృద్ధి కనబడును. వ్యాధి చిహ్నములు తగ్గుదల చూపనియెడల ఎముకను తెరచుట ఆవశ్యకము. ఈ వ్యాధి దీర్ఘ కాలముగా నున్న యెడల (క్రానిక్ ఆస్ట్రో మైలిటిస్) చికిత్సా ఫలితములు తొందరగా కనబడవు. చిల్లి పడిన ఎముక నుండి చీము బయటికి వచ్చుటయే గాక కార నారంభించును. ఇది చాల దీర్ఘకాల వ్యాధి. సీక్వెస్టా అను ప్రాణరహిత మగు ఎముకను తరచు తీసివేయవలసి యుండును. జీవాణు వ్యతిరేక ఔషధముల ద్వారమున ప్రారంభదశలో గాని, తీవ్రదశ యొక్క మొదట గాని చికిత్స చేసి రోగి దీర్ఘ కాలము అశక్తుడు కాకుండ అరికట్టవచ్చును. ఎముకకు దీర్ఘకాల సంపర్కదోషము (క్రానిక్ ఇన్ ఫెక్షన్) సోకుట :''' 1, కొరుకు సవాయి (సిఫిలీస్): ఇది యెముక యొక్క పెరియస్టీము అను మొదటి పొరకు సంబంధించిన వ్యాధి. రోగి ఎముకపై పోటు కలుగు చుండును. ఈ పోటు రాత్రులందు ఎక్కువగా నుండును. సాధారణముగ ఇది కాలి ఎముకలకు వచ్చును. తలలోని ఎముకలకు ఇది వచ్చిన తలనొప్పి కలుగును. సాధారణమయిన కొరుకు వవాయి వ్యాధియందు నొప్పులు హఠాత్తుగాను ఎముకకు సమకోణములోను కలుగును. ఈ వ్యాధికి చికిత్స చేసిన రోగి దానినుండి విముక్తు డగును. '''2. క్షయ (ఎముకలు, కీళ్ళ యొక్క క్షయ):''' ఇది సాధారణముగ కీలుకు సంబంధించిన ఎముకల యొక్క కొశలకు కలుగును. 3. ఇతర సంపర్క దోషములు :“మధురకాలు" ఇందులకు ఉదాహరణము. 4. కుష్ఠు మొదలగు వ్యాధులలో గూడ ఎముకలు నాశనమగుట సంభవించును. '''కంతులు (న్యూగ్రోత్స్):''' 1. సాధారణరకము: ఇది ఆస్టియోమా ఎముకనుండియు, ఖాండ్రోనూ ఉపాస్థి నుండియు ఉద్భవించును. వీటిని తొలగించుట మిక్కిలి కష్టసాధ్యముకాదు. 2. దీని యొక్క తీవ్రమైన పెరుగుదలనే ఎముక దవ్వ యొక్క నెత్తురుకంతి (సార్ కోమా) యందురు. ఈ పెరుగుదలవలన ఎముక విరుగుటకూడ సంభవింప వచ్చును. త్వరలో రోగనిరూపణము చేయుట, వీలయిన యెడల కాలినిగాని చేతినిగాని కోసివేయుట ఇందుకు జరుగవలసిన చికిత్స. లేనియెడల రోగి త్వరలో చనిపోవును. 3. ఆస్టియో క్లోసోమా : ఇది ఒకరకపు కంతి. ఎముకలకు సంభవించును. ఇది వ్యాపించదు. యథాస్థానమందే క్రమక్రమముగా పెద్దది అగును. ఎముకలు గుల్లల వలే సాగతీయబడును. నొక్కినచో గలగల చప్పుడు విననగును. అందుకు జరుగవలసిన చికిత్సలోని విషయములు (1) డిప్ ఎక్సు రేలు పెట్టుట (2) వ్రణమును శస్త్రచికిత్స ద్వారమున ఛేదించుట. ఆ కాళీ ప్రదేశమునందు వీలయిన యెడల ఎముకలను నాటుట. 4. మల్టిపుల్ మైలోమా: ఇది వచ్చినయెడల సాధారణముగ రెండు సంవత్సరములలోపున మరణము సంభ వించును, 5. వేరుచోట కంతి (కాన్సర్) యున్న యెడల ఎముకలోగూడ చిన్న చిన్న కంతులు పుట్టును. '''లోటువలన సంభవించెడి రోగములు : '''(1) వైటమిన్ 'సి' లోపించుటవలన పిల్లలకు పిరియాస్టియం క్రింద నెత్తురు చేసి నొప్పిపుట్టును. వైటమిన్ 'డి' లోపించుటవలన ఎముకలు మెత్తబడును. ఈ వ్యాధినే 'రికెట్సు 'అందురు. (2) నిర్వాహక గ్రంథుల రోగములు: పేరాదై రాయిడ్ మాంస గ్రంథులు ఎక్కువగా పనిచేసినపుడు ఎముకలలో చిన్న చిన్న బుగ్గలు పుట్టును. పిట్విటీ మాంస గ్రంథి యొక్క పెరుగుడు ద్రవము చిన్నతనములో ఎక్కువైన యెడల మనుష్యుడు ఎక్కువగా పెరుగును.<noinclude><references/></noinclude> 04i3h3ig3z124ccze99qe2s93uja75t పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/392 104 154452 564506 448257 2026-07-14T12:27:11Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 564506 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము --౨||ఎముకలు - కీళ్ళు}}</noinclude> పెద్దతనములో ఎక్కువయిన యెడల ఆక్రొమేగలీ అమ జబ్బువచ్చును. (3) ఫ్లూరోసిస్ (Fleurosis): ఎక్కువ ప్లవము (ఫోరిన్) గల నీటిని త్రాగిన మనుష్యులకు పండ్లలోను, ఎముకలలోను మార్పులు వాటిల్లుచుండును. ఎముకలు బైటికి పెరుగును. రోగి అశక్తుడగును, ఒత్తిడివలన కాళ్లు పడిపోవును. నల్గొండ, నెల్లూరు, గుంటూరు మొదలగు జిల్లాలలో ఇది తరచుగా సంభవించుచుండును. ప్రజలకు ప్లవము లేని నీటిని అందజేయుటయే ఇందులకు తీసికొనవలసిన నిరోధక చర్య, వంశపారంపర్యముగ లేక అస్పష్టకారణములవలన సంభవించు ఎముకల వ్యాధులు : (1) ఎఖాండ్రో ప్లేసియా : ఇది పనితనములో సంభవించు వ్యాధి. ఎముకలు పొట్టివి గను, వాటి కొనలు దళసరిగానుండును. శరీరము ఎదుగకుండును. కాలివ్రేళ్ళు చేతివేళ్ళు కూచియైన ఆకృతి కల్గియుండును. ముఖము చిన్నదియై ముక్కు దూలము పాలిపోవును. (2) లియాంటియాసిస్ ఆళియా: ఈవ్యాధి తరచుగా సంభవించునదికాదు. ఇందు ముఖపు ఎముకలు, కపాలము దళసరిగా నుండును. అవి కపాల పేటికలోనికి వ్యాపించి మరణము సంభవించును. (3) పేజట్సు వ్యాధి : ఇది జీవితములో మధ్యకాలము తర్వాత సంభవించును. ఇందు ఎముకలు దీర్ఘకాలికముగ పెద్దవి యగును. వాటి యొక్క మందము, పొడుగు కూడ పెరుగును. అవి ముందునకు చొచ్చుకొనివచ్చును. గూని కూడ ఉండును. కాళ్ళు ముందునకు వెనుకకు వంగిపోవును. (4) ఫ్రెజులిటాస్ ఆసియం : ఈ వ్యాధి సాధారణముగ వంశ పారంపర్యముగ వచ్చును. ఇది రెండురకములు: 1. ప్రసవమునకు పూర్వము వచ్చునది. జననకాలమున ఎముకలు బహుళముగ విరుగుట కానవచ్చును. కండ్లు సుమారు నీలివర్ణముతో నుండును. 2. చిన్నతనములో ఎముకలు ఏ చిన్న దెబ్బకై నను విరుగును. కాని మానుటకు ఏవిధమైన చిక్కు ఉండదు. (5) క్లీ డోక్రేనియోడిస్ అస్టోసిస్: ఇది పుట్టుకతో వచ్చు లోపము. ఇది కూడ వంశపారంపర్యముగ వచ్చు నదే. మెడ ఎముకలలో బయట మూడవవంతు ఎముకలు లేకుండును. (6) 'మార్చుల్' ఎముకలు : చిన్న పిల్లలకు, యౌవనములో నున్న వారికి సంభవించును. ఎముక మందము గాను పెళుసుగాను ఉండును. రక్తలోపము, కాలేయము, ప్లీహము ఉబ్బుట, దృష్టిలోపము సంభవించును. (7) పక్తీస్ డిసీజ్ : ఇది సాధారణముగ సంభవించు వ్యాధి కాదు. తుంటి ఎముక యొక్క శిఖరమునగల ఉపాస్థి ఇందు మూలమున తునకలు అగును. ఇది పిల్లలలో కుంటితనమును కల్గించును. విశ్రాంతి అవసరము. కొన్ని సంవత్సరములలో ఇది నయమగును. (8) కీళ్ళవ్యాధులు : పైన కీళ్ళకు కలుగు గాయములు వర్ణింపబడినవి. చిన్న దెబ్బ తగిలినను పిమ్మట కీళ్ళలో ద్రవముచేరును. విశ్రాంతితో, స్కాట్సుమలామతో, కట్టు కట్టుటతో, ఆ ద్రవము తిరిగి ఇంకిపోవును. అట్లు ఇంకని యెడల లోపలినుండి ద్రవమును తీసివేయవలెను. తీవ్రమైన కీళ్ళవాతము (ఎక్యూట్ రుమేటిజమ్) : దీనికిగల సరియైన కారణము స్పష్టముగా తెలియదు.కాని ఈ వ్యాధితో బాధపడు రోగులలో పెక్కు మంది తాము 3-4 వారములకు పూర్వము గొంతు నొప్పితో బాధపడు చుంటిమని చెప్పుచుందురు. ఇది జ్వరము, చెమటలు, తక్కువ మూత్రము ముదురురంగులో పడుట ఈ లక్షణములతో ప్రారంభమగును. రక్తములో శ్వేత రసకణములు ఎక్కువగానుండును. కీళ్ళనొప్పులు బాధించును. కీళ్ళవద్దగల వాపును ముట్టుకొన్నచోనది వెచ్చగా తగులుచుండును. ఒక కీలు వద్ద నయమగుసరికి మరియొక కీలు రోగగ్రస్తమగుట ఈ వ్యాధి యొక్క ప్రత్యేక లక్షణము. పెద్దవారికి సోలియం సెలిసిలస్ దినమునకు 120 గ్రెయినుల చొప్పున ఇచ్చిన బాధ 48 గంటలలో తగ్గును. రోగి ఈ ఔషధమును సహింప జాలనిచో ఏస్ పరిన్ లేదా సోడియం జెంటిసేట్ ఇవ్వవచ్చును. ఇందు తటస్థించు క్లిష్ట పరిస్థితులు : (1) గుండె కూడ రోగమునకు, గురియగుట (2) శ్లేష్మాధిక్య సన్నీ పాత సన్నిపాత జ్వరము (న్యూమోనియా) (3) పిల్లలకు కడుపునొప్పి (నెర్వాటోసైటిస్) (4)లోన కీళ్ళవాత సంబంధమగు ఉండలవంటివి పెరుగుట (5) ఒక విధమైనవణకు (కురియా).<noinclude><references/></noinclude> ileiw7ir387wzhq4eu2l6pjds0il402 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/393 104 154453 564508 448258 2026-07-14T12:50:48Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 564508 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఎముకలు - కీళ్ళు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> వీటిలో క్లిష్టమైనది, గుండె కూడ వ్యాధికి గురియగుట. కావున రోగికి సాధ్యమైనంతవరకు ఎక్కువ విశ్రాంతి నీయవలెను. నిద్రపోవుచున్నప్పు ఉతని నాడీ వేగము లెక్కింపవలెను. అది ఎక్కువగా నున్నంతకాలము విశ్రాంతి నియవలెను. మూడు మొదలు ఆరు నెలల కాలము విశ్రాంతి తీసికొనుట అవసరమగును. ఇందులకు తీసికొనవలసిన నిరోధక చర్య ఏమనగా, దీనికి గురికానున్న వ్యక్తికి గొంతునొప్పి చిహ్నములు కానరాగానే 3 లక్షలు పెన్సిలిన్ ఇవ్వవలెను. మరి మూడు దినముల తర్వాత దానినే ఆరు లక్షలు ఇవ్వవలెను. లేదా పిల్లలకు పెన్సిలిన్ మాత్రలు పరగడుపున ప్రతిరోజు ఇవ్వవచ్చును. రుమటాయిడ్ కీళ్ళ వాపులు: యువకులలో ఇవి సాధారణముగ సంభవించును. చేతులయందలి కాళ్ళ యందలి చిన్ని కీళ్ళు దీనికి గురి యగును. స్త్రీలలో ఇది యెక్కువ తరచుగా వచ్చును. కొద్ది జ్వరము చిన్ని యెముకలలో నొప్పి యుండును. ఇది దీర్ఘకాల వ్యాధి. దీనిమూలమున అంగవైకల్యము సంభవించును. ఇటీవల కార్టిసోను లేక ఎ. సి. టి. హెచ్. వాడినచో ఈ వ్యాధికి మిగుల గుణ మిచ్చుచున్నది.. చలనము తప్పియున్న రోగికి గుణము కల్గి అతడు లేచి తిరుగగల పరిస్థితిలోనికి వచ్చును. కాని ఔషధమును ఆపివేయగానే అనేకమంది రోగులకు వ్యాధి తిరిగి వచ్చును. ఈ ఔషధమును దీర్ఘకాలము ఉపయోగించవలసి యుండును. మర్దనము, రోగిచేత పనిచేయించుట మొదలగు చికిత్సలు ఇందులకు అవసరము, రోగ విషసంబంధమైన కీళ్ళ వాపులు: (సెప్టిక్ ఆర్థో లైటిస్) దంతముల చిగుళ్ళలో గాని, మరి యే ఇతరచోట గాని చీము ఉండుటవలన కీళ్ళ నొప్పులు రావచ్చును. అందులకు గల కారణమును గ్రహించి దానిని నిర్మూ లించిన యెడల అవి అదృశ్య మగును. న్యూమోనియా టైఫాయిడు, మాల్టా జ్వరమువంటి విషరక్త వ్యాధులు కలిగినప్పుడు కీళ్ళ వాపులు సంభవించును. కాని ఆ వ్యాధితోపాటు అవికూడ పోవును. సీరపు కీళ్ళవాపులు; టిటానస్, డిఫ్లేరియావంటి వ్యాధులకు సీరం సూదిమందుగా ఉపయోగించిన పిమ్మట కీళ్ళ వ్యాధులు సంభవింపవచ్చును. ఎల్లర్జిక్ కీళ్ళ వాపులు : ఉబ్బసము మాదిరి ఎల్లర్జిక్ వ్యాధులు అంకురించినప్పుడు కీళ్ళవాపులు తరచుగా సంభ వించుట కలదు. కీళ్ళవ్యాధులను కల్గించు కొన్ని రోగములు: హీమోఫిలియా, స్కర్వి, లుహీమియా, మొదలగు వ్యాధులలో కీళ్ళయందు రక్తము చేరి కీలు చెడిపోవచ్చును. హెల్ యూరోనిడేస్ ఘ. సెం. మీ. ను కీలులోనికి సూది ద్వార ముస ఎక్కించిన యెడల నెత్తురు ఇంకిపోవును. నాడుల జబ్బువలన కలుగు కొన్ని కీళ్ళ వాపులు : నాడీ తంతు సంబంధమైన టేబిస్, సై రింగోమ, ఈలియా మొదలగు వ్యాధులు సంభవించినప్పుడు ఇది వచ్చును. బాధ స్ఫురించదు. కీళ్ళలోని పరిస్థితి చెల్లాచెదరుగా నుండి అందలి చలనము మామూలుగా నుండవలసిన దానికన్న ఎక్కువగా నుండును. నిర్దిష్టమగు కీళ్ళవాపులు : 1. కొరుకుసవాయి (సిప్లిస్): ఈ సంబంధ మైన కీళ్ళవాపులు సాధారణముగా చిన్న వారికే సంభవించుచుండును. ఇందు పెక్కు కీళ్ళకు దుస్థితి కలుగును. నెత్తురు పరీక్ష ద్వారమున వ్యాధినిరూపణము చేయనగును, చికిత్సవలన పూర్తిగా తగ్గిపోవును. 2. సెగవ్యాధి (గనేరియా): మూత్రద్వారములో నుండివచ్చు చీము తగ్గిపోయినతర్వాత కీళ్ళవాపు వచ్చును. పెన్సిలిన్ సూది మందుగా యిచ్చిన తరువాత తగ్గును. 3. క్షయసంబంధమైన కీళ్ళవాపులు : క్షయవ్యాధి సాధారణముగా మోకాలు లేక తుంటికీలు మొదలగు ఒకే ఒక కీలునందు అంకురించును. ఇది దీర్ఘకాలవ్యాధి. జ్వరముకూడ ఉండును. ఆశ్రద్ధ జరిగినయెడల చీము ఏర్పడి ఆ చీము రంధ్రము చేసికొని వెలుపలికి వచ్చును. తుంటిఎముకలోని కీలు స్థానము తప్పి శాశ్వతమైన కుంటి తనము సంక్రమించును. వెన్నెముకకు క్షయవచ్చిన ఎడల దానిని పాట్సు వ్యాధి అందురు.దీనికి చికిత్స ఏమనగా (1) సంవత్సరము లేక రెండు సంవత్సరముల కాలము విశ్రాంతి తీసికొనుట. (2) స్ట్రెప్టోమైసిన్ మొదలగు ఔషధములను సూది ద్వారమున ఇచ్చుట (3) బలమునకు మందులు ఇచ్చుట. ఒక్కొక్కప్పుడు శస్త్ర చికిత్స అవసర మగును.<noinclude><references/></noinclude> s0os62qsqg98ofv9ousjcff4m9czli7 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/394 104 154454 564510 562545 2026-07-14T13:04:04Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 564510 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము -||ఎరువులు}}</noinclude><section begin="394A" />ఆస్టియో కీళ్ళవాపులు : ఇది నలుబది సంవత్సరములకు పై బడినవయస్సు వారికి సంభవించు వ్యాధి. కీళ్ళ యొక్క ధమనికి సంబంధించిన ఉపరిభాగములు క్షీణించుటవలన ఇది సంభవించును, కీలు చలనము చేసిన కిరకిరలాడు చుండును. రోగి తాను మొదట కొలది అడుగులు వేయగానే నొప్పికలిగి తర్వాత తగ్గి తాను ముందునకు నడువ కలుగుచుంటినని చెప్పును. ఈ రకపు కీళ్ళనొప్పులు వెన్నెముకకుండిన స్పాండిలైటీస్ అందురు. ఇందుమూలమున దీర్ఘకాలముగ వీపులో నొప్పియుండును. చెడిన పండ్లవంటి రక్తగత విషదోషము నకు గురియైన శరీర భాగములను సరిచేయుటవలన షార్టువేపు చికిత్స (షార్టువేవు థెరపీ) వలన కొన్ని సందర్భములలో వలన కొంతవరకు నొప్పితగ్గును. గౌటువ్యాధివలన కలుగు కీళ్ళవాపు : ఇది అన్న జీవ పరివర్తన రోగముల క్రింద వర్ణింపబడినది. రజోనివృత్తివలన కలుగు కీళ్ళవాపు: ఇది స్త్రీలకు 40-50 సంవత్సరముల మధ్యవయస్సులోనే సంభవించును. రెయిటర్సు వ్యాధి : పెక్కుకీళ్ళు దీనికి గురి యగును. కీళ్ళ వాపు ఉండును. కన్నుల కలక, మూత్రద్వారము నందు మంట, వాపు ఉండును. ఇది తరచుగా సంభవించెడు వ్యాధి కాదు. ఘనీభవించిన భుజము (ఫ్రోజెన్ షోల్డర్ ) : ఇది 40-50 సంవత్సరముల వయస్సు మధ్య సంభవించేడు 'వ్యాధి. పై వైపునకు చలనము పరిమితమై నొప్పి కలుగును, 3 లేక 4 మాసములలో నొప్పి అధికమగును. చలనము మరింత పరిమితమగును. పిమ్మట పరిస్థితిలో కొంత అభివృద్ధి గోచరించి రోగి కోలుకొనును. ఇందుకుగల కారణమేమియో స్పష్టముగా తెలియదు. షార్టువేవు చికిత్సను క్రమబద్ధముగా నుపయోగించుటయే ఇందుకు అవలంబింప వలసిన మార్గము. అపస్మార వ్యాధి (హిస్టీరియా) కు సంబంధించిన కీళ్ళ రోగములు : వీనివలన వెనుబాము కానీ, కీళ్ళు కాని రోగమునకు గురి కావచ్చును. ఆ భాగము లన్నిటికి మొత్తముమీద ఏ వ్యాధియు ఉండదు. పురుషులలో సరిహారలోపములవలనను, స్త్రీలలో కుటుంబ సంబంధమైన చిక్కు లవలనను ఇవి సంభవించును. ఇందులకు గల కారణములను తెలిసికొని, వాటిని నిర్మూలించుట, మానసిక చికిత్స చేయించుట జరుగవలయును. చీపులో నొప్పి (బాక్ పెయిన్): ఇందులకు కారణములు పెక్కులు. కీళ్ళ వాతముచేగాని, రక్తగత విషదోషము వలనగాని, కండరములు, ముఖము వాచుటచేత మూత్రకోశము, 'పెద్ద ప్రేగులు మొదలగు వానినుండి నాడులపై ఒత్తిడి కలుగుటచేగాని ఇది సంభవించును. స్త్రీలలో గర్భాశయపు వాపులవలన వచ్చిన వ్యాధులు కూడ వీపులో నొప్పిని కల్గించును. సాయంకాలమున కండరములు అలయుట, సరియగు రీతిని నిలువబడ కుండుటకూడ కారణములు కావచ్చును. ఆ కారణములన్నింటినీ పరిశీలించి చికిత్స చేయవలసియున్నది. {{right|ఎన్. వేం. రా.}} <section end="394A" /> <section begin="394B" />'''ఎరువులు :''' చెట్టు చేమలు స్వీయజీవితమునకు వలసిన ఆహార ద్రవ్యములలో బొగ్గుపులుసు వాయువుగాక, తక్కిన వాటి నన్నింటినీ వేళ్ళవలన నేలనుండియే గ్రహించును. చెట్లకాహారముగ ఉపయోగపడు ప్రధాన ద్రవ్యములు అనేకము లున్నను, నత్రజని, స్ఫురము లేక భాస్వరము, పొటానియము అను ద్రవ్యములు మాత్రము సన్యములచే నేలనుండి అధికముగా గ్రహింపబడుటవలన, ఈ మూడు మాత్రమే ఎరువులయందు సమకూర్పబడుచుండును. సన్యములను ఏటేటా పెరుచేయుచు, వాటిచే నేలనుండి తీసికొనబడిన ద్రవ్యములను మరల జేర్చనియెడల ఆ నేల యొక్క సత్తువ క్రమముగ క్షీణించును. ఇట్లు భూసారము క్షీణింపకుండ కాపాడుటకు గాని. హెచ్చించుటకు గాని, అందుండి అధిక ఫలసాయము పొందుటకై, నేలయందు చేర్చబడు వస్తువులు, 'ఎరువులు' అనబడును. పూర్వము నుండియు, పశువుల ఎరువు, వచ్చిరొట్టువంటి సేంద్రియపు చెరువు ఇప్పటివరకును వాడుకయందున్నను, రాసాయనికపు చెరువులవలన గూడ, భూసారము హెచ్చునని క్రిందటి శతాబ్ది మధ్యమున మాత్రమే కనుగొనబడెను. అప్పటి నుండియు అమ్మోనియా గంధకిదము (ammonium sulphate), అధిస్ఫురితము (superphosphate) వంటి రాసాయనికపు బరువులు కూడ ఎక్కువగా పాశ్చాత్య <section end="394B" /><noinclude><references/></noinclude> btlmld00eoncq3lajb6zwavp67c2y5v పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/395 104 154455 564514 448260 2026-07-14T13:35:16Z A.Murali 3019 564514 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" />{{rh|ఎరువులు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> దేశములలోను, ఇటీవల మనదేశములోను ఉపయోగింప బడుచున్నవి. ఎరువులను స్థూలమగు సామాన్యపు ఎరువులు (Bulky general manures) గను, ఉత్సారపు చెరువులు (concentrated manures) గను, విభజింపవచ్చును. పశువుల ఎరువు, పచ్చిరొట్ట మొదలగు స్థూలనుగు సేంద్రియపు చెరువులయందు సస్యములకు వలసిన నత్రజని, భాస్వరము, పొటాసియము మొదలగు ముఖ్యద్రవ్యములు స్వల్పపరిమితులలో నుండును. అందుచే వీటిని, కొద్ది భూమికై నను విస్తారముగా వాడవలసి యుండును. ఆదియునుగాక, వీటిని దూరపు పొలములకు గొనిపోయి వేయుట కొంత శ్రమతోకూడిన పని. ఇవి భూమియందు నెమ్మదిగా పనిచేయుటచే, విత్తుటకు ముందుగనే వీటిని నేలపై చల్లి, మట్టితో కలిపి దున్న వలసియుండును. వీటి యందు సేంద్రియ పదార్థముకూడ ఎక్కువగా నుండుట వలనను, ఇవి నేలలోని ఉపయోగకరమగు సూక్ష్మజీవుల అభివృద్ధికి తోడ్పడుటవలనను, ఈ ఎరువులు నేలయందలి బలము నభివృద్ధిచేయుటయేగాక, అందలి భౌతిక లక్షణములనుగూడ బాగుపరచును. వీటిని వాడుటవలన, నేలల యొక్క నీటిని గ్రహించి, పట్టియుంచుశక్తి అధికమగుటయేగాక, నేల గుల్లబారి, పైరుల యొక్క వ్రేళ్ళు బాగుగా లోనికిపోవుటకు వీలగును. నేల గుల్లబారుట వలన వ్యవసాయపు పనిముట్లతో సాగుపనులు చేయుట కూడ చాల సులభము. మరియు వీటియొక్క సారము, వివరములు సంగ్రహ ఆంధ్ర మొదట వేసిన పైరున కేగాక తరువాత నొకటి రెండు పైరులకుకూడ లభించును. అమ్మోనియా గంధకిదము ammonium sulphate), అధిస్ఫురితము (superphosphate) మొదలగు ఉత్చారములగు ఎరువులయందు ఒకటి రెండు ప్రధాన ద్రవ్యములు మాత్రమే ఎక్కువ పరిమాణము నందుండుటవలన, వీటిని దూర ప్రదేశములకు గూడ గొనిపోవుటయు, సస్యములకు చేర్చుటయుకూడ సులభము. వీటియందలి ఆహార ద్రవ్యములు చురుకుగా పనిచేయుటచే సాధారణముగా సస్యములు పెరుగు. నారంభించిన తరువాతనే వీటిని వాడవలయును. స్థూలమగు సామాన్యపు జెరువులు: 1. పశువుల ఎరువు ; ఇది సర్వత్ర విరివిగా ఉపయోగింపబడుచున్న జంతు సంబంధమగు సామాన్యపు చెరువు. పశువుల యొక్క మలమూత్రములును అవి నివసించు శాలలలోని చెత్త చెదారములును కలిసి చీకుటవలన ఈ ఎరువు ఏర్పడును. పశువుల ఎరువునందు, సస్యములకు వలయు నాహార ద్రవ్యము లన్నియు కొంచె మించుమించుగా నుండును. వీటి యొక్క పరిమితులు ఎరువునందు చేరిన మలమూత్రములను బట్టియు, చెత్త చెదారముల యొక్క సంఘట్టనమును బట్టియు, సారము పోకుండ చీక బెట్టి వాటిని ఎరువుగా మార్చు పద్ధతిని బట్టియు మారుచుండును. మనదేశము నందలి సాధారణ జంతువుల మలమూత్రముల సగటు సంఘట్టనము ఈ క్రింది పట్టిక యందు వివరింపబడినది. {| class="wikitable" |+ Caption text |- ! శీర్షిక పాఠ్యం !! వివరములు !! వివరములు !! నత్రజని !! స్ఫురత్సంచామ్లజని !! శీర్షిక పాఠ్యం |- | 1. || పశువులు || పేడ || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | 1. || పశువులు || మూత్రము || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | 2. || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | 2. || గడి పాఠ్యం || మూత్రము || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | 3. || గడి పాఠ్యం || పెంటికలు || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | 3. || గడి పాఠ్యం || మూత్రము || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | 4. || గుఱ్ఱము || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | 4. || గుఱ్ఱము || మూత్రము || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | 5. || పంది || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | 5. || పంది || మూత్రము || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | 6. || మనుష్యులు || మలము || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | 6. || మనుష్యులు || మూత్రము || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |} నత్రజని స్ఫురత్సంచామ్లజని తము P 26% K 20% 0.2 N% 1. పశువులు : వేడ 0.8 0.2 మూత్రము 0.9 స్వల్పము 1.0 ல் 2. పెంటికలు 0.9 0.6 స్వల్పము మూత్రము 1.7 స్వల్పము 2.2 8. మేక : వెంటికలు 0.7 0.5 స్వల్పము మూత్రము 1.8 స్వల్పము 2.5 4. గుఱ్ఱము అద్ది 0.6 0.4 0.8 మూత్రము 0.2 0.1 1.0 5. పంది వెంట 0.7 0.5 స్వల్పము మూత్రము 0.4 0.1 0.45 6. మనుష్యులు మలము 1.0 0.8 0.4 మూత్రము 0.8 0.1 0.2 354<noinclude><references/></noinclude> lki51l41folska66ucsvfqgremnp646 564548 564514 2026-07-14T14:55:04Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 564548 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఎరువులు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> దేశములలోను, ఇటీవల మనదేశములోను ఉపయోగింప బడుచున్నవి. ఎరువులను స్థూలమగు సామాన్యపు ఎరువులు (Bulky general manures) గను, ఉత్సారపు చెరువులు (concentrated manures) గను, విభజింపవచ్చును. పశువుల ఎరువు, పచ్చిరొట్ట మొదలగు స్థూలనుగు సేంద్రియపు చెరువులయందు సస్యములకు వలసిన నత్రజని, భాస్వరము, పొటాసియము మొదలగు ముఖ్యద్రవ్యములు స్వల్పపరిమితులలో నుండును. అందుచే వీటిని, కొద్ది భూమికై నను విస్తారముగా వాడవలసి యుండును. ఆదియునుగాక, వీటిని దూరపు పొలములకు గొనిపోయి వేయుట కొంత శ్రమతోకూడిన పని. ఇవి భూమియందు నెమ్మదిగా పనిచేయుటచే, విత్తుటకు ముందుగనే వీటిని నేలపై చల్లి, మట్టితో కలిపి దున్న వలసియుండును. వీటి యందు సేంద్రియ పదార్థముకూడ ఎక్కువగా నుండుట వలనను, ఇవి నేలలోని ఉపయోగకరమగు సూక్ష్మజీవుల అభివృద్ధికి తోడ్పడుటవలనను, ఈ ఎరువులు నేలయందలి బలము నభివృద్ధిచేయుటయేగాక, అందలి భౌతిక లక్షణములనుగూడ బాగుపరచును. వీటిని వాడుటవలన, నేలల యొక్క నీటిని గ్రహించి, పట్టియుంచుశక్తి అధికమగుటయేగాక, నేల గుల్లబారి, పైరుల యొక్క వ్రేళ్ళు బాగుగా లోనికిపోవుటకు వీలగును. నేల గుల్లబారుట వలన వ్యవసాయపు పనిముట్లతో సాగుపనులు చేయుట కూడ చాల సులభము. మరియు వీటియొక్క సారము, వివరములు సంగ్రహ ఆంధ్ర మొదట వేసిన పైరున కేగాక తరువాత నొకటి రెండు పైరులకుకూడ లభించును. అమ్మోనియా గంధకిదము ammonium sulphate), అధిస్ఫురితము (superphosphate) మొదలగు ఉత్చారములగు ఎరువులయందు ఒకటి రెండు ప్రధాన ద్రవ్యములు మాత్రమే ఎక్కువ పరిమాణము నందుండుటవలన, వీటిని దూర ప్రదేశములకు గూడ గొనిపోవుటయు, సస్యములకు చేర్చుటయుకూడ సులభము. వీటియందలి ఆహార ద్రవ్యములు చురుకుగా పనిచేయుటచే సాధారణముగా సస్యములు పెరుగు. నారంభించిన తరువాతనే వీటిని వాడవలయును. స్థూలమగు సామాన్యపు జెరువులు: 1. పశువుల ఎరువు ; ఇది సర్వత్ర విరివిగా ఉపయోగింపబడుచున్న జంతు సంబంధమగు సామాన్యపు చెరువు. పశువుల యొక్క మలమూత్రములును అవి నివసించు శాలలలోని చెత్త చెదారములును కలిసి చీకుటవలన ఈ ఎరువు ఏర్పడును. పశువుల ఎరువునందు, సస్యములకు వలయు నాహార ద్రవ్యము లన్నియు కొంచె మించుమించుగా నుండును. వీటి యొక్క పరిమితులు ఎరువునందు చేరిన మలమూత్రములను బట్టియు, చెత్త చెదారముల యొక్క సంఘట్టనమును బట్టియు, సారము పోకుండ చీక బెట్టి వాటిని ఎరువుగా మార్చు పద్ధతిని బట్టియు మారుచుండును. మనదేశము నందలి సాధారణ జంతువుల మలమూత్రముల సగటు సంఘట్టనము ఈ క్రింది పట్టిక యందు వివరింపబడినది. {| class="wikitable" |+ Caption text |- ! క్రమ. సంఖ్య. !! వివరములు !! వివరములు !! నత్రజని !! స్ఫురత్సంచామ్లజని !! పొటాష్ |- | 1. || పశువులు || పేడ || 0.3 || 0.2 || 0.2 |- | 1. || పశువులు || మూత్రము || 0.9 || స్వల్పము || 1.0 |- | 2. || గొఱ్ఱె || పెంటికలు || 0.9 || 0.6 || స్వల్పము |- | 2. || గొఱ్ఱె || మూత్రము || 1.7 || స్వల్పము || 2.2 |- | 3. || మేక || పెంటికలు || 0.7 || 0.5 || స్వల్పము |- | 3. || మేక || మూత్రము || 1.3 || స్వల్పము || 2.5 |- | 4. || గుఱ్ఱము || లద్ది || 0.6 || 0.4 || 0.3 |- | 4. || గుఱ్ఱము || మూత్రము || 0.2 || 0.1 || 1.0 |- | 5. || పంది || పెంట || 0.7 || 0.5 || స్వల్పము |- | 5. || పంది || మూత్రము || 0.4 || 0.1 || 0.45 |- | 6. || మనుష్యులు || మలము || 1.0 || 0.8 || 0.4 |- | 6. || మనుష్యులు || మూత్రము || 0.8 || 0.1 || 0.3 |}<noinclude><references/></noinclude> 57ozncv1nbt1y5r54vzr5anjysrroqh పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/396 104 154456 564551 448261 2026-07-14T15:13:52Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 564551 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము -౨||ఎరువులు}}</noinclude> సామాన్య పశువుల ఎరువునందు సగటున నూటికి 0.5 పాళ్ళు నత్రజని, 0.25 పాళ్ళు స్ఫురత్వం చామ్ల జనితము, 0.5 పాళ్ళు పొటాషు ఉండును. మలమూత్రము యొక్క సంఘట్టనము అన్ని జంతువులయందును ఒకే విధముగ నుండక, వాటి యొక్క రకమును, వయస్సును బట్టియు, అవి తిను ఆహారమును, చేయు పనిని బట్టియు కూడ మారుచుండును. ముసలి పశువుల యొక్కయు, దుక్కి పశువుల యొక్కయు, మల మూత్రములు, ఎదుగుచున్న దూడల యొక్కయు, పాడియావుల యొక్కయు మలమూత్రముల కంటే ఎక్కువ సారము కలవి. ఆవుల యొక్కయు, ఎడ్ల యొక్కయు మలమూత్రములు, గేదెలయొక్కయు, దున్నల యొక్కయు మలమూత్రముల కంటే ఎక్కువ సారముకలవి. ప్రత్తివిత్తులు, వేరుసెనగపిండి, ఉలవలు మొదలగు దాణాలు పెట్టబడు పశువుల మలమూత్రములు కేవలము జొన్న చొప్ప, పచ్చిగడ్డి, వరిగడ్డి మొదలగు స్థూలాహారములు మాత్రమే తిను పశువుల మలమూత్రము కంటే ఎక్కువసారము కలవిగా నుండును. “ ప్రశస్తమైన పశువుల ఎరువును తయారు చేయుటకు పశువుల శాలలందలి మలమూత్రములును, చెత్త చెదారములును వృథాకాకుండ పొదుపుచేసి, అవి కలిసి గోతి యందు చీకునప్పుడు, వాటి యందలి సారము పోకుండ చూడవలెను. పశువుల యొక్క మూత్రము చాల విలువ గలది. అందుచే జిగురులేని పొడిమట్టిగాని, ఎండిన కలుపు మొక్కలు లేక రాలుటాకులుగాని పశువుల శాలలందు పరచి, వాటివలన ఆ మూత్రమును ఇంకింపజేసి, ఎరువు గోతియందు జేర్చుచుండవలెను. పశువులశాల యొక్క నేలను గచ్చుచేసి, దాని పైబడు మూత్రమును, ఒక చివర నుండు గచ్చుకుండిలో పడునట్లు చేసి, దానిని ప్రతిదినము ఎరువు గోతియందు పోయుచుండుట చాల శ్రేష్ఠమైన వని. ఇట్లు ప్రతి దినము పశు శాలనుండి తీయబడు మల మూత్రములు, చెత్తచెదారములు గోతిలో వేయబడి కాని, కుప్పగా పెట్టబడి కాని, 3.4 నెలలు చీకినతరువాత, అందలి సేంద్రియ పదార్థములు, సూక్ష్మజీవుల సహాయమున కొన్ని మార్పులు చెంది, మొక్కల వేళ్ళచే తీసికొనబడు ద్రావణీయ లవణములుగ మారును. ఎరువు, గోతియందు చీకునపుడు, దాని పై భాగమును దట్టముగ మట్టితో కప్పినచో, అండలి సారద్రవ్యములు సూర్యరశ్మివలన క్షీణింపకుండుటయేగాక, వర్షపు నీటితో కొట్టుకొని పోకుండ నుండును. మరియు ఎరువునందలి సారము క్రిందికి దిగిపోకుండునట్లు, గోతి యడుగు నేలను, కంకర వేసి గట్టిపరచి, నీరు ఇంకకుండ చేయవలెను. అన్ని నేలలయందును, అన్ని సస్యములకును, ఉపయోగించి నిస్సంశయముగ ఫలితమునిచ్చు విషయమున పశువుల ఎరువునకు సాటి మరియొకటిలేదని చెప్పవచ్చును. మరియు, పశువుల ఎరువు వేసి పెంచిన కూరగాయలు ఇతర సస్యములు, కేవలము అమ్మోనియా గంధకిదములు మొదలగు నిరింద్రియపు టెరువులను (Inorganic fertilisers) మాత్రమే వేసి పండించిన పంటలకంటె, రుచికరములుగను, ఆరోగ్యదాయకములు గను ఉండునని తేటపడినది. 2. గొట్టే పెంట, మేక పెంట: గొజ్జెల యొక్కయు, మేకల యొక్కయు, మలమూత్రములు పశువుల మల మూత్రములకంటే హెచ్చుసారముకలిగి త్వరలో చీకును. ఆవులు మున్నగువాటివలె వీటిని పళ్లు శాలలలో కట్టి ఎరువును తయారుచేయుటకు ఎక్కువగా వీలుగ నుండక పోవుటచే, సత్తువచేయవలసిన నేలపై, రాత్రులందు ఎకరమునకు 1000–2000 చొప్పున గుంపులుగా మందలు తోలబడును. కలుపుమొక్కలు విస్తారముగానుండు నేలపై మంద కట్టినయెడల ఎరువు బలమువలన అందలి గడ్డి గాదములు విస్తరించును. అందుచే మందను పరుండబెట్టుటకు ముందుగ నేలను బాగుగ దున్ని మంద తొక్కిన తరువాత గుంటకను తోలిగాని మరల దున్నిగాని మలమూత్రములు నేలయందు బాగుగ కలియునట్లు చేయవలెను. వర్షకాలమున శేషగనుండు బంక నేలలపై మందులను పరుండ పెట్టినచో అనేలలు గట్టిపడిపోవును. గొజ్జెల యొక్కయు, మేకల యొక్కయు మల మూత్రములతో ఊరినమట్టి, పొగాకు, మిర్చి, నారింజజాతి ఫలవృక్షములు గులాబి, మల్లే మొదలగు పూల మొక్కలకు చాల పుష్టికరము. నిస్సారములగు నేలలందు ఎదుగనట్టియు, తెగుళ్ళచే నీరసించినట్టియు సస్యములకు, ఈ ఎరువులు అతి త్వరితముగ బలము నొసగును.<noinclude><references/></noinclude> onk91fpftw2l863fd6glbje6m3qt8c4 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/397 104 154457 564552 448262 2026-07-14T15:36:19Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 564552 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఎరువులు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> '''3. మానవుల మలమూత్రములు:''' మానవుల మల మూత్రములందు కూడ ఇతర జంతువుల మలమూత్రము లందు వలెనే కొంతసారముకలదు. కాని వీటి చెడువాసన వలన మనదేశపు కర్షకులు అసహ్యపడి వాటి సంతగా వాడుటలేదు. చైనా, జపాన్ మొదలగు కొన్ని దేశము లందు మలము, నెండబెట్టి, దానిని దుర్గంధము లేని ‘పూడెట్టు' (Poudrette) అనబడు ఎరువు; చేసి ఉపయోగించుచున్నారు. ఇటీవల మన దేశమునగూడ, మానవుల మలమును పట్టణపు వీథులచేత్తతో కలిపి, పొరలు పొరలుగ కుప్పలు పెట్టి, మధ్యనొకటి రెండుసార్లు వాటిని తిరుగ వేసి 45 మాసములలో దుర్గంధములేని ఎరువుగ తయారుచేయు చున్నారు. దీనికే పురీషపుచీకుడు ఎరువు (Night Soil Compost) అని పేరు. గ్రామపరిసరము లందుకూడ, మలవిసర్జనమునకు కాలువలనుతీసి, మలమును మట్టితో కప్పు తాత్కాలికపు దొడ్ల నేర్పరుచుకొన్నచో, కొంతకాలమునకు ప్రశస్తమైన ఎరువు లభ్యమగును. '''4. పందిపెంట :''' పంది వెంటయందు, పశువుల పేడ యందుకంటె నత్రజనియు, భాస్వరమును అధికముగ నుండును. దీనిని పశువుల ఎరువుతో కలిపి, కొంత చీకిన తరువాత వాడుట శ్రేష్ఠము. నీరు పెట్టి సాగుచేయబడు పలువిధములైన కూరగాయలు, ఉల్లి, చెరకు, తమలపాకులు మొదలగు సస్యములకుకూడ ఇది ప్రశస్తమైన ఎరువు. ఎండిన పంది పేంటను పొడిగా నలుగగొట్టి, వరి మొదలగు పైరులకు, పెరుగు చున్నపుడు గూడ పైన చల్ల వచ్చును. '''5. గుఱ్ఱపు ఎరువు:''' గుఱ్ఱపు లద్దిలోకూడ పశువుల పేడయందుకంటె నత్రజనియు భాస్వరమును చాల అధికముగ నుండుము. గుఱ్ఱపుఎరువు బాగుగ చీకనియెడల, లబ్ధియందు జీర్ణము కాని వారపదార్థము ఎక్కువగా నుండుటచే, ఇది నేలయందు తగినంత నీరు పెట్టని యెడల వేడిని పుట్టించి, సస్యములను చెరచును. బాగుగ చీకిన గుఱ్ఱపు ఎరువు శీతకాలపు పూలజాతులకు కూరగాయలకు శ్రేష్ఠము. '''6. చీకుడు ఎరువు : (Compost)''' చేత్తచేదారములు ముందుగ కొంత కాలము క్రుళ్ఫుటవలన ఏర్పడు ఎరువు 'చీకుడు ఎరువు' అనబడును. దీనిని తయారుచేయుటకు, పొలములయందు లభించు కలుపు మొక్కలు, పైరులు కోసిన తరువాత నిరుపయోగముగ మిగిలియుండు దుబ్బులు, ఇతర భాగములు . 2-3 అడుగులు లోతుగల గోతులలో నింపిగాని, నేలపై పోగులుగా గాని, పొరలు పొరలుగా గాని ఏర్పరచి, నీటితో తడుపుచుండవలెను. గోతులన్నియు చెప్తే చేదారములతో నింపునపుడు, ప్రతి రెండు చెత్తపొరలమధ్యను పేడనీటిని, పశువులశాలలలోని మూత్రముతో ఊరినమట్టిని, కట్టెల బూడిదను చల్లి, గోతి పైభాగమును పట్టితో కప్పిన యెడల, 3 4 నెలలలో ఈ చెత్త చీకి, సస్యముల కెరువుగా వేయదగినట్లుండును. ఇట్లు తయారుచేసిన చీకుడు ఎరువు యొక్క సంఘట్టనము కొంచెము ఇంచుమించు పశువుల ఎరువును పోలియుండును. '''7. పచ్చి రొట్ట :''' అడవులయందును, బంజరుభూముల యందును, బాటల ప్రక్కలందును, పొలముల గట్లయందును, పెరుగు మొక్కల యొక్క పచ్చిరొట్టను ఎరువుగా ఉపయోగింప వచ్చును. వెంపలి, జిల్లేడు, తంగేడు, సీమ తంగేడు, (Glyricidia maculata) నేపాళము, అవిసె, కానుగ, నిద్రగన్నేరు, వేప, గంగరావి, మొదలగువాటి యొక్క పచ్చిరొట్టను ఇట్లు ఉపయోగించవచ్చును. సాధారణముగా పచ్చిరొట్ట వరిచేలయందే ఎరుపుగ ఉపయోగింపబడుచున్నది. కాని, తోటభూములలో కూడ తగినంత నీరు పెట్టుబడి పైరుచేయబడు కూరగాయలు, ఉరలగడ్డ, మిర్చి, అరటి, చెరకు, మొదలగు సస్యములకును, బాగుగా వర్షము కురియుచోట్ల జొన్న, గోధుమ, పొగాకు మొదలగు వర్షాధారమున పెరుగు మెట్ట సస్యములకును కూడ పచ్చి రొట్టను ఎరువుగా ఉపయోగింపవచ్చును. ఇది లభింపని కాలములయందును, ప్రదేశములందును, సీమచింత, తంగేడు, నిద్రగన్నేరు, దిరిసెన మొదలగు చెట్ల యొక్క రాలుటాకులు గూడ నీటి వసతి గల సస్యములకు ఉపయోగింపవచ్చును. ఇవిగాక కర్షకులు తమ పొలములందే జనుము, జీలుగ, సీమజీలుగ (Sesbania-speciosa), పిల్లి పెసర, నీలి, వెంపలి, బొబ్బర, ఉలవ, గోరుచిక్కుడు, మొదలగు కాయధాన్య కుటుంబ మునకు చెందిన జాతులను పచ్చి ఎరువునకుగాను ప్రత్యేకముగ పైరుచేయుటయు గలదు. ఇట్లు పెంచి, సత్తువచేయదలచిన పొలమునందే దున్ని వేయుటకు, జనుము తక్కిన<noinclude><references/></noinclude> 4k1s1pye8v3sgmfazb8xx2iq5419f99 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/398 104 154458 564554 448263 2026-07-14T16:14:50Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 564554 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము- ౨||ఎరువులు}}</noinclude> పచ్చి ఎరువు పైరులకంటే చాల అనుకూలము. ఇది త్వరగా ఎదిగి, దున్నిన వెనుక చాలత్వరగా చీకును, జనుము కొంచెమించుమించు అన్ని నేలలకును అనుకూలించును. కాని ఇది గరపనేలలలో బాగుగా నెదుగును. ఇది పశువులకు చాల రుచి కరమైన గ్రాసము. జీలుగ చవిటి భూములకును, పిల్లి పెసర నల్లబంక నేలలకును, వెంపలి ఇసుక నేలలకును అనుకూలములై ఉండును. వరిపొలములయందు ఇవి యన్నియు 7 - 10 దినములలోను, తోట లేక మెట్టభూములయందు 4 - 6 వారములలోను చీకును పచ్చి రొట్టయందు నత్రజని నూటికి 0.5–1.0 పాళ్ళును, ఎండు రొట్టయందింతకు మూడు, నాలుగు రెట్లు అధికముగను ఉండును. '''8. సామాన్యమైన ఇతర ఎరువులు:''' నదీ తీరము లందును, చెరువు గర్భములందును, లభించు వండలిమన్ను, తేలిక నేలలందు పెంచబడు వేరుసెనగ, జొన్న వంటి సస్యములకును, కొబ్బరి మొదలగు ఫల వృక్షములకును, ఎరువుగ ఉపయోగించును. పురాతన గ్రామములందలి పాటిమన్ను వరిచేలకును, నారింజజాతి తోటలకును, అరటి తోటలకును మంచి సత్తువ నొసగును. బియ్యపు మరలయందు లభించు వడ్లదూగర (Rice mill dust), చక్కెర కర్మాగారములయందు లభించు చెరుకురసపు తెట్టు (Scum), వడపోత పిట్టు (Filter presscake), చక్కెర పాకు (molasses), కర్మాగారములనుండి వదలివేయబడు మురుగునీరు, పట్టణముల మురుగునీరు (town sewage), మురుగు నీటిపిట్టు (sewage sludge), తోళ్ళ కర్మాగారములనుండి లభించు చెత్త (tannery refuse) మొదలగు వస్తువుల నన్నింటిని ఎరువులుగ ఉపయోగింపవచ్చును. '''1. ఉత్పారపు టెరువులు:''' నత్రజనిని హెచ్చుగ కలిగియున్న జంతు, వృక్ష సంబంధమైన ఉత్సారపు టెరువుల యొక్క సంఘట్టనము ఈ క్రింది పట్టికయందు తెలుపబడినది. {| class="wikitable" |+ Caption text |- ! సంఖ్య !! ఎరుపు !! నత్రజని !! స్సు. సం. !! పొటాష్. |- | 1. || వేరుసెనగపిండి || 8.0 || 1.4 || 1.2 |- | 2. || ఆముదపుపిండి (పొట్టుతీసినది) || 6.4 || 2.6 || 1.2 |- | 3. || ఆముదపుపిండి (పొట్టుతీయనిది) || 4.5 || 1.9 || 0.7 |- | 4. || నువ్వుపిండి || 6.1 || 2.4 || -- |- | 5. || ప్రత్తిపిండి || 3.0 || 1.2 || -- |- | 6. || కొబ్బరిపిండి || 3.5 || 1.4 || -- |- | 7. || కుసుమపిండి || 3.2 || 1.2 || -- |- | 8. || కానుగపిండి || 4.2 || 0.9 || -- |- | 9. || వేపపిండి || 4.7 || 1.9 || -- |- | 10. || ఎండుచేపలు || 4.0 || 4.0 || -- |- | 11. || చమురు తీసిన చేపల ఎరువు(fish guano) || 7.8 || 7.8 || -- |- | 12. || రక్త వుపొడి || 11.0 || 2.0 || -- |} నత్రజనిని హెచ్చుగ కలిగియున్న పిండి ఎరువులలో వేరు సెనగపిండి, ఆముదపుపిండి ముఖ్యమైనవి. పిణ్యాకము లన్నిటిలోను వేరుసెనగ పిండియందు నత్రజని 'హెచ్చుగ గలదు. ఆముదపుపిండియందు స్ఫురత్సం చామ్లజనిదము కొంచెమధికముగా నుండుటయేగాక, దీని నుపయోగించు నేలలందు చెదలవాధ అంతగా నుండదు. వేపపిండి చవిటి భూములందలి చౌడు నణగగొట్టుటయేగాక, దానియందలి ఘాటువలన చెదల బాధ కూడ వారింపబడును. నూనెగింజల పిట్టులయం దెంత తక్కువ చమురున్న అవి అంత త్వరలో చీకి, పైరులకు ఉపయోగపడును. వీటిని వరి, చెరకు, పసుపు, మిర్చి, ఉల్లి, కూరగాయలు మొదలగు అనేక అవ్యసస్యములకును వాడవచ్చును. చేప ఎరువునందు<noinclude><references/></noinclude> e2u7fdcm642s1329wrr900fp56fnqxy పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/399 104 154459 564605 448264 2026-07-15T05:53:24Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 564605 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఎరువులు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> నత్రజనియు, స్ఫురత్పంచామ్లజనిదముకూడ హెచ్చుగ నుండును. ఇది నారింజ, దానిమ్మ, ద్రాక్ష మొదలగు ఫల వృక్షములకు చాల ప్రశస్తమైనది. దీనిని పసుపు, మిర్చి అరటి, చెరకు వరి మొదలగు నీటివసతిగల పైర్లకుకూడ వేయదగును. పట్టణములయందు ప్రతిదినము, పశువులు, గొట్టెలు, మేకలు వధచేయబడు స్థానములయందు లభించు రక్తము నెండబెట్టి తయారుచేయబడు పొడి చాల చురుకుగా పనిచేయు విలువైన నత్రజని ఎరువుగా మారును. '''2. ఉత్సారపు రాసాయనికపు టెరువులు : (Concedtrated Chemical fertilisers)''' (అ) నత్రజని అధికముగా కలిగిన ప్రధానమైన ఉత్సారపు రాసాయనికపు టెరువులు, వాటి యొక్క సంఘట్టనము ఈ క్రింద తెలుపబడినది. {| class="wikitable" |+ |- ! సంఖ్య. !! ఎరువు పేరు. !! నత్రజని (N) % |- | 1. || అమ్మోనియా గంధకితము.(Ammonium sulphate) || 20.6 |- | 2. || సోడియ నత్రితము.(Sodium nitrate) || 15.5 |- | 3. || యూరియా (Urea) || 46.0 |- | 4. || అమ్మొనియా నత్రితము{Ammonium Nitrate) || 35.0 |- | 5. || అమ్మోనియా గంధకిద నత్రితము.(Ammonium Sulphate-nitrate) || 26.0 |- | 6. || నైట్రోలియమ్(calcium cyanamide) || 19.0 |} రాసాయనికపు చెరువులను మాత్రమే ఏటేట సస్యములకు వేయుచుండినచో, కొంతకాలమునకు 'నేలయందలి సేంద్రియ పదార్థమునకు, మరికొన్ని ముఖ్యద్రవ్యములకు కొరత యేర్పడి, నేల సారహీనమగును. కావున వీటిని పశువులయెరువు, పచ్చి ఎరువు, చీకుడు ఎరువు మొదలగు స్థూలమగు సేంద్రియపు టెరువులకు దోడుగ, అవసర మగునంతవరకే వాడుచుండవలెను. నత్రజని హెచ్చుగగల రాసాయనికపు టెరువులలో, మనదేశమున అమ్మోనియా గంధకిదము వరిచేలకు, నారు. మళ్ళకు, చెరకు, అరటి, ఉల్లి, ఉరలగడ్డ, కూరగాయలు, ఇంకను అనేక తోట సస్యములకును, తగినంత వర్షము కురియుచోట్ల, జొన్న, ప్రత్తి, వేరుసెనగ మొదలగు మెట్ట పైర్లకుకూడ విరివిగ నుపయోగింపబడు చున్నది. సోడియ నత్రితము మిగుల చురుకుగ పనిచేయును. కాని ఇది చాల ద్రావణీయమగుటచే, నీరు పెట్టినపుడు గానీ, అధిక వర్షములు పడినపుడు కాని మొక్కల వేళ్ళకందకుండ కొట్టుకొనిపోవును. నల్లరేగడి నేలలందు ఈ ఎరువు, పైరులకు హానికరములగు మార్పులను కలిగించును. అందుచే మనదేశమున దీనిని ఉపయోగించుట చాల తక్కువ. అమ్మోనియా గంధకిదముకంటెను అధికముగ నత్రజని కలిగి, నేలయందు హానికరములగు మార్పులు కలిగింపని యూరియా, అమ్మోనియా సత్రితము, అమ్మోనియా గంధకిద - నత్రితము అను ఎరువులు ఇటీవల మస దేశమునకూడ కొంతవరకు వాడబడు చున్నవి. '''స్ఫురపు టెరువులు (Phosphatic fertilisers) :''' జంతుసంబంధమైన స్ఫురపు టెరువులలో ఎముకల పొడియు రాసాయనికపు టెరువులలో అధిస్ఫురితము (Super-phosphate) ను ప్రధానమైనవి. కొన్ని స్ఫురపు టెరువుల యొక్క సంఘట్టనము ఈ క్రింద వివరింపబడినది. {| class="wikitable" |+ Caption text |- ! సంఖ్య. !! ఎరువు !! నత్రజని !! స్సు.సం. |- | 1. || ఎముకల పొడి. || 4 || 23 |- |2. || సామాన్య అధిస్ఫురితము.(Ordinary Super-phosphate) || -- || 16 |- | 3. || ద్విగుణాధిస్ఫురీతము(Double Super-phosphate) || -- || 32 |- | 4. || త్రిగుణాధిస్ఫురితము(Triple Super) || -- || 45 |- | 5. || భస్మిక స్ఫురిత చిట్టేము.(Basic Slag) || -- || 16-20 |} ఎముకలను కాల్చిగాని, సన్న పొడిగచేసిగాని, ఎరువుగ ఉపయోగింపవచ్చును. ఇది ఆలస్యముగ చీకి పైరునకు లభ్యమగుటచే దీనిని పశువుల ఎరుపు లేక ఇతర స్థూల సేంద్రియపు చెరువులతో గూడ కలిపి, విత్తుటకు ముందుగనే వేయవలెను. తగినంత ఎముకలపొడిని ఒకేసారి వేసిన యెడల, ఇది ఆ భూమియందు 2-3 సంవత్సరముల వరకు కూడ పనిచేయును. అధిస్ఫురితము అందలి స్ఫురము నేలకు చేర్చబడిన తోడనే కొంత భాగము త్వరలో సస్యము<noinclude><references/></noinclude> rqbi8hpdu6q7ldfkiemwjhodp3kak0v పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/400 104 154460 564627 448265 2026-07-15T07:14:51Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 564627 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము-౨||ఎరువులు}}</noinclude> లకు ఉపకరించి, మిగిలినది క్రమముగా లభించును. వీటిని గూడ పశువుల ఎరువు, పచ్చిఎరుపు వంటి సేంద్రియపు టెరువులకు తోడుగ వాడుట శ్రేష్ఠము.' విత్తనములను చల్లుటకు ముందే, అధిస్ఫురితములను గొఱ్ఱు లేక మరియే ఇతర పరికరముతోనైనను, విత్తనముల వరుసలకు దగ్గర గను, భూమిలోనికి 23 అంగుళములు లోతుగను చల్లినచో, ఇవి అధిక ఫలితము నిచ్చునని కనుగొనబడెను. అధి స్ఫురితములు వరి, చెరకు, అరటి, కూరగాయలు, పండ్ల తోటలు మొదలగు వాటికి ఉపయోగకరములు. నత్రజని అధికముగ కలిగియుండుటచే సస్యముల కెక్కువగ రొట్ట పెరుగు నేలలందు వీటిని వాడుటవలన పైరులు త్వరలోనే పంటకు వచ్చుటయేగాక అధికముగ ఫలించును. భస్మిక స్ఫురిత చిట్టెము ఉక్కును తయారుచేయు కర్మాగారము లలో లభించు రద్దు ద్రవ్యము. దీనియందు సున్నముగూడ హెచ్చుగనుండుటచే, ఆమ్లస్వభావము గల నేలలకు (acid soils) ఇది ప్రశస్తమైన ఎరువు. '''పొటాష్ ఎరువులు:''' పొటాష్ విస్తారముగ కలిగియుండు ఎరువులలో పొటాసియమ్ గంధకిదము (Potassium sulphate) పొటాసియమ్ హరిదము (Potassium chloride), కట్టెలబూడిద ముఖ్యమైనవి. వీటి యందు పొటాష్ (K), వరుసగా నూటికి 48, 50, 4.5 పొళ్ళుండును. ఈ ఎరువులను, పొటాషును ఎక్కువగా కోరు ఉరలగడ్డ, పొగాకువంటి పైరులకును, అరటి, కొబ్బరివంటి ఫలవృక్షములకును, నత్రజని స్ఫురమును ఒసగు ఇతర ఎరువులతో కూడ ఉపయోగింపవలెను. పొటాసియము గంధకిదము, పొటాసియము హరిదము కన్న శ్రేష్ఠమైన ఎరువు. కాని ఈ రెండు ఎరువులు కూడ 'నేలయందు ఆస్తుత్వమును కలిగించును. కట్టెల బూడిదయందు పొటాసియము కర్బనిత (carbonate) రూపమున నుండి, నేలకు ఆమ్లక్వమును కలిగించు స్వభావము లేకపోవుటచే ఇది ఆ రెండింటి కంటె కూడ ప్రశస్తమైన ఎరువని చెప్పవచ్చును. ఈ దిగువ పేర్కొన బడిన కొన్ని ఉత్సారపు చెరువులు, సస్యములకు వలయు మూడు మూల పదార్థములలో ఏవేని రెండింటిని కలిగియుండును. {| class="wikitable" |+ Caption text |- ! సంఖ్య. !! ఎరువు !! నత్రజని !! ప్పు. పం !! పొటాష్ |- | 1. || పొటాసియము నత్రితము లేక సూరేకారము(Potassium nitrate) || 13-14 || -- || 44 |- | 2. || అమ్మోఫాస్ (1) || 16.0 || 20.0 || -- |- | 2. || అమ్మోఫాస్ (2) || 11.0 || 48.0 || -- |- | 3. || నిసీఫాస్ (1) || 13.5 || 41.0 || -- |- | 3. || నిసీఫాస్ (2) || 17.5 || 17.5 || -- |- | 4. || లూనొ ఫాస్ || 21.0 || 20.0 || -- |} సస్యములకు వేయదగిన ఎరువులను నేల యొక్క బలమునుబట్టియు, సస్యములకు వలసిన మూల ద్రవ్యములను బట్టియు నిర్ణయింపవలెను. కొన్ని ముఖ్య సస్యములు ఒనగు పంటలనుబట్టి, అవి నేలనుండి ఎంతెంత నత్రజనిని, స్ఫురత్పంచామ్లజనిదమును, పోటాష్ను గ్రహించునో ఈ ప్రక్క పుటలోని పట్టికయందు వివరింపబడినది. ఎక్కువ సత్తువ కలిగియున్న నేలలందు ఎరువులు వాడకుండగనే కొంతకాలము లాభదాయకముగా సస్య ములను పైరుచేయుటకు వీలు ఉన్నప్పటికిని, చాల కాలమునుండి సాగునందున్న సామాన్యపుభూము లన్నిటి యందును, ఆయా సస్యములచే తీసికొనబడు ద్రవ్యముల నన్నిటిని మరల నేలయందు చేర్చనియెడల, పంటలు క్రమముగా క్షీణించును. వివిధ సస్యములకు మరియు నత్రజనిని తెలిసికొని, దానిని కలిగియుండు నంత పశువుల ఎరువును నేలకు చేర్చినయెడల, స్ఫురత్వంచామ్ల జనిధము, పోటాషుగూడ సామాన్యముగ దానిమూలముననే లభించును. స్వీయస్వభావమునుబట్టి కొన్ని ద్రవ్యములను హెచ్చుగ కోరు సస్యములకు, పశువుల ఎరువుతో పాటు, నత్రజనిని గాని, స్ఫురతామ్లజనిదమును గాని, పొటాష్ నుగాని అధికముగ నొసగు ప్రత్యేకపు టెరువు<noinclude><references/></noinclude> g8ug6i3k3f569s1dwju9n9pa226icfb పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/401 104 154461 564652 562641 2026-07-15T10:17:08Z A.Murali 3019 564652 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" />{{rh|ఎర్నెస్టు, హెన్రీ, షాకల్ టన్, సర్||సంగ్రహ ఆంధ్ర}}</noinclude><section begin="401A" /> {| class="wikitable" |+ Caption text |- !సంఖ్య !! సస్యము !! ఒక ఎకరమునుండి లభించు పంట(పౌనులు) !! వంటమూలమున ఒక ఎకరమునుండి పోవు |- | గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |} సంఖ్య సస్యము ఒక ఎకరమునుండి లభించు పంట(పౌనులు) వంటమూలమున ఒక ఎకరమునుండి పోవు సంగ్రహ ఆంధ్ర నత్రజని సు. పం. (*) (*) (*) 1. వరి 8000 ధాన్యము, 4500 గడ్డి 50 25 50 2. జొన్న 800 గింజలు, 2400 దంటు 25 10 85 8. మొక్కజొన్న 1200 గింజలు, 3000 దంటు 35 20 60 4. రాగులు 1000 Rosex, 2000 dow 22 ? ? 5. సజ్జలు 800 గింజలు, 2000 దంటు 22 ? ? 8. ప్రత్తి 250 దూది, 750 విత్తులు 26 10 10 7. ఉలి 3 25000 పౌ. గడ్డలు 70 85 70 8. చెరకు 10,0000 పౌ. లేక 45 టన్నుల 125 75 850 చెరకులు 9. అరటి 10. మేకజొన్న 22400 పౌ. లేక 10 టన్నుల తూనిక గల 700 గెలలు 38600 పౌ. (15 ట.) పచ్చిమేక లను ఉపయోగింపవలెను. ఇటీవల వివిధ సస్యములకు వలయు ముఖ్యద్రవ్యము అన్నియుకూడ ప్రత్యేక ముగ మిశ్రితములైన ఎరువుల (fertiliser-mixtures) యందు సమకూర్పబడి విక్రయింపబడుచున్నవి. వ్యవసాయదారులు ఎరువులను కొనవలసి వచ్చినపుడు, వాటియందలి ముఖ్య ద్రవ్యములు పరిమితులను బట్టియు, అవి లభించు ధరలను బట్టియు ఏది కొనుట లాభకరమో నిర్ణయించుకొనవలెను. ఉదా : నూటికి 8 సాళ్ళు నత్రజని గల 100 పౌనుల వేరుసెనగపిండి ఖరీదు 8 రూపాయలయిన యెడల, దాని యందుగల 1 పౌను నత్రజని ఖరీదు 1 రూపాయి అగును. ఇట్లే నూటికి 20 పాళ్ళు నత్రజని గల 100 పౌనుల అమ్మోనియం సల్ఫేటు ధర 15 రూపాయలయిన యెడల, దీనియందు గల 1 పౌను నత్రజని విలువ 12 అణాలు మాత్రమే అగును. ఈ రెండు ఎరువులును పైని పేర్కొన బడిన ధరలకు అభించునపుడు వేరుసెనగ పిండికంటె అమ్మో నియమ్ సల్ఫేటును కొనుటయే లాభకర మగును. {{right|కే. భా.}} <section end="401A" /> <section begin="401B" />ఎర్నెస్టు, హెన్రీ, షాకల్టిన్, సర్ (1874-1922): ఇతడు బ్రిటీషు వైజ్ఞానిక పరిశోధకుడు. క్రీ. శ. 1874 ఫిబ్రవరి 15 వ తేదీన ఐర్లాండులో కిల్కీ అను గ్రామములో జన్మించెను. డల్విచ్ కాలేజీలో విద్యాభ్యాసము ముగించుకొని, వర్తక నౌకాయానవృత్తిలో ప్రవేశించెను. 1901 లో దక్షిణధృవప్రాంతమును పరిశోధించవలెనని, బ్రిటీషు రాయలుసొసైటీ, రాయలు జాగ్రాఫికల్ సొసైటీ, రెండును కలిసి, సర్ క్లైమోటు మార్కాం అధ్యక్షతన ఒక పరిశోధక దళమును ఆయత్తము చేసెను. 700 టన్నుల బరువుగల "డిస్కవరీ" అను ఓడను, అయస్కాంత ప్రభా వము లేకుండునట్లుగా ప్రత్యేకముగ నిర్మించిరి. ఆర్. ఎన్. స్కాటు దళాధికారిగాను, లెఫ్ట్ నెంటు షా కల్టున్, డాక్టరు ఇ. ఏ. విల్సన్ సహాయకులుగాను నియమింప వీరు ఇంతకు పూర్వము రాసే చే అనుగమింపబడిన మార్గమును ఆశ్రయించి ఇంక కొంతదూరము తూర్పు దిశగా వెళ్ళి, ఒకానొక అఖండ భూభాగమును కనుగొనిరి. 'కింగ్ ఎడ్వర్డ్ భూభాగమ' ని దీనికి పేరిడిరి. ఇచ్చట ఓడను నిలుపుకొని బలమైన కుక్కలచే లాగబడు " స్లెడ్జ్ " అను బండ్ల పై దక్షిణాభిముఖముగా దూరప్రయాణము చేసిరి. అవేక శ్రమలకోర్చి. డిసెంబరు 30, 1901 తేదీన 82° - 17* దక్షిణ అక్షాంశమును చేరుకొనిరి. తిరుగుప్రయాణ ములో షాకల్ టన్ కు జబ్బుచేసెను. కెప్టెన్ స్కాట్, డాక్టర్ విల్సన్ లు అచ్చటనే ఇంకొక సంవత్సర కాలము<section end="401B" /><noinclude><references/></noinclude> kff01k9f3un6n14qadxc5t7yf3adpjl 564658 564652 2026-07-15T10:21:55Z A.Murali 3019 564658 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" />{{rh|ఎర్నెస్టు, హెన్రీ, షాకల్ టన్, సర్||సంగ్రహ ఆంధ్ర}}</noinclude><section begin="401A" /> {| class="wikitable" |+ Caption text |- !సంఖ్య !! సస్యము !! ఒక ఎకరమునుండి లభించు పంట(పౌనులు) !! వంటమూలమున ఒక ఎకరమునుండి పోవు |- | గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |- | గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం |} సంఖ్య సస్యము ఒక ఎకరమునుండి లభించు పంట(పౌనులు) వంటమూలమున ఒక ఎకరమునుండి పోవు సంగ్రహ ఆంధ్ర నత్రజని సు. పం. (*) (*) (*) 1. వరి 8000 ధాన్యము, 4500 గడ్డి 50 25 50 2. జొన్న 800 గింజలు, 2400 దంటు 25 10 85 8. మొక్కజొన్న 1200 గింజలు, 3000 దంటు 35 20 60 4. రాగులు 1000 Rosex, 2000 dow 22 ? ? 5. సజ్జలు 800 గింజలు, 2000 దంటు 22 ? ? 8. ప్రత్తి 250 దూది, 750 విత్తులు 26 10 10 7. ఉలి 3 25000 పౌ. గడ్డలు 70 85 70 8. చెరకు 10,0000 పౌ. లేక 45 టన్నుల 125 75 850 చెరకులు 9. అరటి 10. మేకజొన్న 22400 పౌ. లేక 10 టన్నుల తూనిక గల 700 గెలలు 38600 పౌ. (15 ట.) పచ్చిమేక లను ఉపయోగింపవలెను. ఇటీవల వివిధ సస్యములకు వలయు ముఖ్యద్రవ్యము అన్నియుకూడ ప్రత్యేక ముగ మిశ్రితములైన ఎరువుల (fertiliser-mixtures) యందు సమకూర్పబడి విక్రయింపబడుచున్నవి. వ్యవసాయదారులు ఎరువులను కొనవలసి వచ్చినపుడు, వాటియందలి ముఖ్య ద్రవ్యములు పరిమితులను బట్టియు, అవి లభించు ధరలను బట్టియు ఏది కొనుట లాభకరమో నిర్ణయించుకొనవలెను. ఉదా : నూటికి 8 సాళ్ళు నత్రజని గల 100 పౌనుల వేరుసెనగపిండి ఖరీదు 8 రూపాయలయిన యెడల, దాని యందుగల 1 పౌను నత్రజని ఖరీదు 1 రూపాయి అగును. ఇట్లే నూటికి 20 పాళ్ళు నత్రజని గల 100 పౌనుల అమ్మోనియం సల్ఫేటు ధర 15 రూపాయలయిన యెడల, దీనియందు గల 1 పౌను నత్రజని విలువ 12 అణాలు మాత్రమే అగును. ఈ రెండు ఎరువులును పైని పేర్కొన బడిన ధరలకు అభించునపుడు వేరుసెనగ పిండికంటె అమ్మో నియమ్ సల్ఫేటును కొనుటయే లాభకర మగును. {{right|కే. భా.}} <section end="401A" /> <section begin="401B" />ఎర్నెస్టు, హెన్రీ, షాకల్టిన్, సర్ (1874-1922): ఇతడు బ్రిటీషు వైజ్ఞానిక పరిశోధకుడు. క్రీ. శ. 1874 ఫిబ్రవరి 15 వ తేదీన ఐర్లాండులో కిల్కీ అను గ్రామములో జన్మించెను. డల్విచ్ కాలేజీలో విద్యాభ్యాసము ముగించుకొని, వర్తక నౌకాయానవృత్తిలో ప్రవేశించెను. 1901 లో దక్షిణధృవప్రాంతమును పరిశోధించవలెనని, బ్రిటీషు రాయలుసొసైటీ, రాయలు జాగ్రాఫికల్ సొసైటీ, రెండును కలిసి, సర్ క్లైమోటు మార్కాం అధ్యక్షతన ఒక పరిశోధక దళమును ఆయత్తము చేసెను. 700 టన్నుల బరువుగల "డిస్కవరీ" అను ఓడను, అయస్కాంత ప్రభా వము లేకుండునట్లుగా ప్రత్యేకముగ నిర్మించిరి. ఆర్. ఎన్. స్కాటు దళాధికారిగాను, లెఫ్ట్ నెంటు షా కల్టున్, డాక్టరు ఇ. ఏ. విల్సన్ సహాయకులుగాను నియమింప వీరు ఇంతకు పూర్వము రాసే చే అనుగమింపబడిన మార్గమును ఆశ్రయించి ఇంక కొంతదూరము తూర్పు దిశగా వెళ్ళి, ఒకానొక అఖండ భూభాగమును కనుగొనిరి. 'కింగ్ ఎడ్వర్డ్ భూభాగమ' ని దీనికి పేరిడిరి. ఇచ్చట ఓడను నిలుపుకొని బలమైన కుక్కలచే లాగబడు " స్లెడ్జ్ " అను బండ్ల పై దక్షిణాభిముఖముగా దూరప్రయాణము చేసిరి. అవేక శ్రమలకోర్చి. డిసెంబరు 30, 1901 తేదీన 82° - 17* దక్షిణ అక్షాంశమును చేరుకొనిరి. తిరుగుప్రయాణ ములో షాకల్ టన్ కు జబ్బుచేసెను. కెప్టెన్ స్కాట్, డాక్టర్ విల్సన్ లు అచ్చటనే ఇంకొక సంవత్సర కాలము<section end="401B" /><noinclude><references/></noinclude> ahnq64et8qpc1cp1brsz5xlqt0211nb 564661 564658 2026-07-15T10:44:37Z A.Murali 3019 564661 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" />{{rh|ఎర్నెస్టు, హెన్రీ, షాకల్ టన్, సర్||సంగ్రహ ఆంధ్ర}}</noinclude><section begin="401A" /> {| class="wikitable" |+ Caption text |- !సంఖ్య !! సస్యము !! ఒక ఎకరమునుండి లభించు పంట(పౌనులు) !! వంటమూలమున ఒక ఎకరమునుండి పోవు |- | గడి పాఠ్యం || గడి పాఠ్యం || గడి పాఠ్యం || నత్రజని{పౌ} || స్సు.సం.{పౌ} || పొటాష్(పౌ}} |- | 1. || వరి || 3000 ధాన్యము, 4500 గడ్డి || గ50 || 25 || 50 |- | 2. || జొన్న || 800 గింజలు, 2400 దంటు || 25 || 10 || 35 |- | 3. || మొక్కజొన్న || 1200 గింజలు, 3000 దంటు ||35 || 20 || 60 |- | 4. || రాగులు || 1000 గింజలు, 2000 దంటు || 22 || ? || ? |- | 5. || సజ్జలు || 800 గింజలు, 2000 దంటు || 22 || ? || ? |- | 6. || ప్రత్తి || 250 దూది, 750 విత్తులు || 26 || 10 || 10 |- | 7. || ఉల్లి || 25000 పౌ. గడ్డలు || 70 || 35 || 70 |- | 8. || చెరకు || 10,0000 పౌ. లేక 45 టన్నులచెరకులు || 125 || 75 || 350 |- | 9. || అరటి || 22400 పౌ. లేక 10 టన్నులతూనిక గల 700 గెలలు || 180 || 60 || 700 |- | 10. || మేతజొన్న || 33600 పౌ. (15 ట.) పచ్చిమేత || 120 || 25 || 150 |} సంఖ్య సస్యము ఒక ఎకరమునుండి లభించు పంట(పౌనులు) వంటమూలమున ఒక ఎకరమునుండి పోవు సంగ్రహ ఆంధ్ర నత్రజని సు. పం. (*) (*) (*) 1. వరి 3000 ధాన్యము, 4500 గడ్డి 50 25 50 2. జొన్న 800 గింజలు, 2400 దంటు 25 10 85 8. మొక్కజొన్న 1200 గింజలు, 3000 దంటు 35 20 60 4. రాగులు 1000 గింజలు, 2000 దంటు 22 ? ? 5. సజ్జలు 800 గింజలు, 2000 దంటు 22 ? ? 8. ప్రత్తి 250 దూది, 750 విత్తులు 26 10 10 7. ఉలి 3 25000 పౌ. గడ్డలు 70 85 70 8. చెరకు 10,0000 పౌ. లేక 45 టన్నులచెరకులు 125 75 850 చెరకులు 9. అరటి 10. మేతజొన్న 22400 పౌ. లేక 10 టన్నులతూనిక గల 700 గెలలు 33600 పౌ. (15 ట.) పచ్చిమేత లను ఉపయోగింపవలెను. ఇటీవల వివిధ సస్యములకు వలయు ముఖ్యద్రవ్యము అన్నియుకూడ ప్రత్యేక ముగ మిశ్రితములైన ఎరువుల (fertiliser-mixtures) యందు సమకూర్పబడి విక్రయింపబడుచున్నవి. వ్యవసాయదారులు ఎరువులను కొనవలసి వచ్చినపుడు, వాటియందలి ముఖ్య ద్రవ్యములు పరిమితులను బట్టియు, అవి లభించు ధరలను బట్టియు ఏది కొనుట లాభకరమో నిర్ణయించుకొనవలెను. ఉదా : నూటికి 8 సాళ్ళు నత్రజని గల 100 పౌనుల వేరుసెనగపిండి ఖరీదు 8 రూపాయలయిన యెడల, దాని యందుగల 1 పౌను నత్రజని ఖరీదు 1 రూపాయి అగును. ఇట్లే నూటికి 20 పాళ్ళు నత్రజని గల 100 పౌనుల అమ్మోనియం సల్ఫేటు ధర 15 రూపాయలయిన యెడల, దీనియందు గల 1 పౌను నత్రజని విలువ 12 అణాలు మాత్రమే అగును. ఈ రెండు ఎరువులును పైని పేర్కొన బడిన ధరలకు అభించునపుడు వేరుసెనగ పిండికంటె అమ్మో నియమ్ సల్ఫేటును కొనుటయే లాభకర మగును. {{right|కే. భా.}} <section end="401A" /> <section begin="401B" />ఎర్నెస్టు, హెన్రీ, షాకల్టిన్, సర్ (1874-1922): ఇతడు బ్రిటీషు వైజ్ఞానిక పరిశోధకుడు. క్రీ. శ. 1874 ఫిబ్రవరి 15 వ తేదీన ఐర్లాండులో కిల్కీ అను గ్రామములో జన్మించెను. డల్విచ్ కాలేజీలో విద్యాభ్యాసము ముగించుకొని, వర్తక నౌకాయానవృత్తిలో ప్రవేశించెను. 1901 లో దక్షిణధృవప్రాంతమును పరిశోధించవలెనని, బ్రిటీషు రాయలుసొసైటీ, రాయలు జాగ్రాఫికల్ సొసైటీ, రెండును కలిసి, సర్ క్లైమోటు మార్కాం అధ్యక్షతన ఒక పరిశోధక దళమును ఆయత్తము చేసెను. 700 టన్నుల బరువుగల "డిస్కవరీ" అను ఓడను, అయస్కాంత ప్రభా వము లేకుండునట్లుగా ప్రత్యేకముగ నిర్మించిరి. ఆర్. ఎన్. స్కాటు దళాధికారిగాను, లెఫ్ట్ నెంటు షా కల్టున్, డాక్టరు ఇ. ఏ. విల్సన్ సహాయకులుగాను నియమింప వీరు ఇంతకు పూర్వము రాసే చే అనుగమింపబడిన మార్గమును ఆశ్రయించి ఇంక కొంతదూరము తూర్పు దిశగా వెళ్ళి, ఒకానొక అఖండ భూభాగమును కనుగొనిరి. 'కింగ్ ఎడ్వర్డ్ భూభాగమ' ని దీనికి పేరిడిరి. ఇచ్చట ఓడను నిలుపుకొని బలమైన కుక్కలచే లాగబడు " స్లెడ్జ్ " అను బండ్ల పై దక్షిణాభిముఖముగా దూరప్రయాణము చేసిరి. అవేక శ్రమలకోర్చి. డిసెంబరు 30, 1901 తేదీన 82° - 17* దక్షిణ అక్షాంశమును చేరుకొనిరి. తిరుగుప్రయాణ ములో షాకల్ టన్ కు జబ్బుచేసెను. కెప్టెన్ స్కాట్, డాక్టర్ విల్సన్ లు అచ్చటనే ఇంకొక సంవత్సర కాలము<section end="401B" /><noinclude><references/></noinclude> k4rfz77kb5k41ohv13j42vqvg6w1uau 564662 564661 2026-07-15T10:47:28Z A.Murali 3019 564662 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" />{{rh|ఎర్నెస్టు, హెన్రీ, షాకల్ టన్, సర్||సంగ్రహ ఆంధ్ర}}</noinclude><section begin="401A" /> {| class="wikitable" |+ Caption text |- !సంఖ్య !! సస్యము !! ఒక ఎకరమునుండి లభించు పంట(పౌనులు) !! వంటమూలమున ఒక ఎకరమునుండి పోవు || || |- | సంఖ్య || సస్యము || ఒక ఎకరమునుండి లభించు పంట(పౌనులు) || నత్రజని{పౌ} || స్సు.సం.{పౌ} || పొటాష్(పౌ}} |- | 1. || వరి || 3000 ధాన్యము, 4500 గడ్డి || గ50 || 25 || 50 |- | 2. || జొన్న || 800 గింజలు, 2400 దంటు || 25 || 10 || 35 |- | 3. || మొక్కజొన్న || 1200 గింజలు, 3000 దంటు ||35 || 20 || 60 |- | 4. || రాగులు || 1000 గింజలు, 2000 దంటు || 22 || ? || ? |- | 5. || సజ్జలు || 800 గింజలు, 2000 దంటు || 22 || ? || ? |- | 6. || ప్రత్తి || 250 దూది, 750 విత్తులు || 26 || 10 || 10 |- | 7. || ఉల్లి || 25000 పౌ. గడ్డలు || 70 || 35 || 70 |- | 8. || చెరకు || 10,0000 పౌ. లేక 45 టన్నులచెరకులు || 125 || 75 || 350 |- | 9. || అరటి || 22400 పౌ. లేక 10 టన్నులతూనిక గల 700 గెలలు || 180 || 60 || 700 |- | 10. || మేతజొన్న || 33600 పౌ. (15 ట.) పచ్చిమేత || 120 || 25 || 150 |} సంఖ్య సస్యము ఒక ఎకరమునుండి లభించు పంట(పౌనులు) వంటమూలమున ఒక ఎకరమునుండి పోవు సంగ్రహ ఆంధ్ర నత్రజని సు. పం. (*) (*) (*) 1. వరి 3000 ధాన్యము, 4500 గడ్డి 50 25 50 2. జొన్న 800 గింజలు, 2400 దంటు 25 10 85 8. మొక్కజొన్న 1200 గింజలు, 3000 దంటు 35 20 60 4. రాగులు 1000 గింజలు, 2000 దంటు 22 ? ? 5. సజ్జలు 800 గింజలు, 2000 దంటు 22 ? ? 8. ప్రత్తి 250 దూది, 750 విత్తులు 26 10 10 7. ఉలి 3 25000 పౌ. గడ్డలు 70 85 70 8. చెరకు 10,0000 పౌ. లేక 45 టన్నులచెరకులు 125 75 850 చెరకులు 9. అరటి 10. మేతజొన్న 22400 పౌ. లేక 10 టన్నులతూనిక గల 700 గెలలు 33600 పౌ. (15 ట.) పచ్చిమేత లను ఉపయోగింపవలెను. ఇటీవల వివిధ సస్యములకు వలయు ముఖ్యద్రవ్యము అన్నియుకూడ ప్రత్యేక ముగ మిశ్రితములైన ఎరువుల (fertiliser-mixtures) యందు సమకూర్పబడి విక్రయింపబడుచున్నవి. వ్యవసాయదారులు ఎరువులను కొనవలసి వచ్చినపుడు, వాటియందలి ముఖ్య ద్రవ్యములు పరిమితులను బట్టియు, అవి లభించు ధరలను బట్టియు ఏది కొనుట లాభకరమో నిర్ణయించుకొనవలెను. ఉదా : నూటికి 8 సాళ్ళు నత్రజని గల 100 పౌనుల వేరుసెనగపిండి ఖరీదు 8 రూపాయలయిన యెడల, దాని యందుగల 1 పౌను నత్రజని ఖరీదు 1 రూపాయి అగును. ఇట్లే నూటికి 20 పాళ్ళు నత్రజని గల 100 పౌనుల అమ్మోనియం సల్ఫేటు ధర 15 రూపాయలయిన యెడల, దీనియందు గల 1 పౌను నత్రజని విలువ 12 అణాలు మాత్రమే అగును. ఈ రెండు ఎరువులును పైని పేర్కొన బడిన ధరలకు అభించునపుడు వేరుసెనగ పిండికంటె అమ్మో నియమ్ సల్ఫేటును కొనుటయే లాభకర మగును. {{right|కే. భా.}} <section end="401A" /> <section begin="401B" />ఎర్నెస్టు, హెన్రీ, షాకల్టిన్, సర్ (1874-1922): ఇతడు బ్రిటీషు వైజ్ఞానిక పరిశోధకుడు. క్రీ. శ. 1874 ఫిబ్రవరి 15 వ తేదీన ఐర్లాండులో కిల్కీ అను గ్రామములో జన్మించెను. డల్విచ్ కాలేజీలో విద్యాభ్యాసము ముగించుకొని, వర్తక నౌకాయానవృత్తిలో ప్రవేశించెను. 1901 లో దక్షిణధృవప్రాంతమును పరిశోధించవలెనని, బ్రిటీషు రాయలుసొసైటీ, రాయలు జాగ్రాఫికల్ సొసైటీ, రెండును కలిసి, సర్ క్లైమోటు మార్కాం అధ్యక్షతన ఒక పరిశోధక దళమును ఆయత్తము చేసెను. 700 టన్నుల బరువుగల "డిస్కవరీ" అను ఓడను, అయస్కాంత ప్రభా వము లేకుండునట్లుగా ప్రత్యేకముగ నిర్మించిరి. ఆర్. ఎన్. స్కాటు దళాధికారిగాను, లెఫ్ట్ నెంటు షా కల్టున్, డాక్టరు ఇ. ఏ. విల్సన్ సహాయకులుగాను నియమింప వీరు ఇంతకు పూర్వము రాసే చే అనుగమింపబడిన మార్గమును ఆశ్రయించి ఇంక కొంతదూరము తూర్పు దిశగా వెళ్ళి, ఒకానొక అఖండ భూభాగమును కనుగొనిరి. 'కింగ్ ఎడ్వర్డ్ భూభాగమ' ని దీనికి పేరిడిరి. ఇచ్చట ఓడను నిలుపుకొని బలమైన కుక్కలచే లాగబడు " స్లెడ్జ్ " అను బండ్ల పై దక్షిణాభిముఖముగా దూరప్రయాణము చేసిరి. అవేక శ్రమలకోర్చి. డిసెంబరు 30, 1901 తేదీన 82° - 17* దక్షిణ అక్షాంశమును చేరుకొనిరి. తిరుగుప్రయాణ ములో షాకల్ టన్ కు జబ్బుచేసెను. కెప్టెన్ స్కాట్, డాక్టర్ విల్సన్ లు అచ్చటనే ఇంకొక సంవత్సర కాలము<section end="401B" /><noinclude><references/></noinclude> rhhi1zfh3f5osc1e4roa4cx70em33qp 564663 564662 2026-07-15T10:56:50Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 564663 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" />{{rh|ఎర్నెస్టు, హెన్రీ, షాకల్ టన్, సర్||సంగ్రహ ఆంధ్ర}}</noinclude><section begin="401A" /> {| class="wikitable" |+ Caption text |- !సంఖ్య !! సస్యము !! ఒక ఎకరమునుండి లభించు పంట(పౌనులు) !! వంటమూలమున ఒక ఎకరమునుండి పోవు || || |- | సంఖ్య || సస్యము || ఒక ఎకరమునుండి లభించు పంట(పౌనులు) || నత్రజని{పౌ} || స్సు.సం.{పౌ} || పొటాష్(పౌ}} |- | 1. || వరి || 3000 ధాన్యము, 4500 గడ్డి || గ50 || 25 || 50 |- | 2. || జొన్న || 800 గింజలు, 2400 దంటు || 25 || 10 || 35 |- | 3. || మొక్కజొన్న || 1200 గింజలు, 3000 దంటు ||35 || 20 || 60 |- | 4. || రాగులు || 1000 గింజలు, 2000 దంటు || 22 || ? || ? |- | 5. || సజ్జలు || 800 గింజలు, 2000 దంటు || 22 || ? || ? |- | 6. || ప్రత్తి || 250 దూది, 750 విత్తులు || 26 || 10 || 10 |- | 7. || ఉల్లి || 25000 పౌ. గడ్డలు || 70 || 35 || 70 |- | 8. || చెరకు || 10,0000 పౌ. లేక 45 టన్నులచెరకులు || 125 || 75 || 350 |- | 9. || అరటి || 22400 పౌ. లేక 10 టన్నులతూనిక గల 700 గెలలు || 180 || 60 || 700 |- | 10. || మేతజొన్న || 33600 పౌ. (15 ట.) పచ్చిమేత || 120 || 25 || 150 |} లను ఉపయోగింపవలెను. ఇటీవల వివిధ సస్యములకు వలయు ముఖ్యద్రవ్యము అన్నియుకూడ ప్రత్యేకముగ మిశ్రితములైన ఎరువుల (fertiliser-mixtures) యందు సమకూర్పబడి విక్రయింపబడుచున్నవి. వ్యవసాయ దారులు ఎరువులను కొనవలసి వచ్చినపుడు, వాటియందలి ముఖ్య ద్రవ్యములు పరిమితులను బట్టియు, అవి లభించు ధరలను బట్టియు ఏది కొనుట లాభకరమో నిర్ణయించుకొనవలెను. ఉదా : నూటికి 8 సాళ్ళు నత్రజని గల 100 పౌనుల వేరుసెనగపిండి ఖరీదు 8 రూపాయలయిన యెడల, దాని యందుగల 1 పౌను నత్రజని ఖరీదు 1 రూపాయి అగును. ఇట్లే నూటికి 20 పాళ్ళు నత్రజని గల 100 పౌనుల అమ్మోనియం సల్ఫేటు ధర 15 రూపాయలయిన యెడల, దీనియందు గల 1 పౌను నత్రజని విలువ 12 అణాలు మాత్రమే అగును. ఈ రెండు ఎరువులును పైని పేర్కొనబడిన ధరలకు అభించునపుడు వేరుసెనగ పిండికంటె అమ్మోనియమ్ సల్ఫేటును కొనుటయే లాభకర మగును. {{right|కే. భా.}} <section end="401A" /> <section begin="401B" />'''ఎర్నెస్టు, హెన్రీ, షాకల్టిన్, సర్ (1874-1922):''' ఇతడు బ్రిటీషు వైజ్ఞానిక పరిశోధకుడు. క్రీ. శ. 1874 ఫిబ్రవరి 15 వ తేదీన ఐర్లాండులో కిల్కీ అను గ్రామములో జన్మించెను. డల్విచ్ కాలేజీలో విద్యాభ్యాసము ముగించుకొని, వర్తక నౌకాయానవృత్తిలో ప్రవేశించెను. 1901 లో దక్షిణధృవప్రాంతమును పరిశోధించవలెనని, బ్రిటీషు రాయలుసొసైటీ, రాయలు జాగ్రాఫికల్ సొసైటీ, రెండును కలిసి, సర్ క్లైమోటు మార్కాం అధ్యక్షతన ఒక పరిశోధక దళమును ఆయత్తము చేసెను. 700 టన్నుల బరువుగల "డిస్కవరీ" అను ఓడను, అయస్కాంత ప్రభా వము లేకుండునట్లుగా ప్రత్యేకముగ నిర్మించిరి. ఆర్. ఎన్. స్కాటు దళాధికారిగాను, లెఫ్ట్ నెంటు షా కల్ టున్,, డాక్టరు ఇ. ఏ. విల్సన్ సహాయకులుగాను నియమింప వీరు ఇంతకు పూర్వము రాస్ చే అనుగమింపబడిన మార్గమును ఆశ్రయించి ఇంక కొంతదూరము తూర్పు దిశగా వెళ్ళి, ఒకానొక అఖండ భూభాగమును కనుగొనిరి. 'కింగ్ ఎడ్వర్డ్ భూభాగమ' ని దీనికి పేరిడిరి. ఇచ్చట ఓడను నిలుపుకొని బలమైన కుక్కలచే లాగబడు " స్లెడ్జ్ " అను బండ్ల పై దక్షిణాభిముఖముగా దూరప్రయాణము చేసిరి. అవేక శ్రమలకోర్చి. డిసెంబరు 30, 1901 తేదీన 82° -17* దక్షిణ అక్షాంశమును చేరుకొనిరి. తిరుగుప్రయాణములో షాకల్ టన్ కు జబ్బుచేసెను. కెప్టెన్ స్కాట్, డాక్టర్ విల్సన్ లు అచ్చటనే ఇంకొక సంవత్సర కాలము<section end="401B" /><noinclude><references/></noinclude> bfhdlqib95wuptjm9w30ylqpu26tnf3 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/402 104 154462 564672 562643 2026-07-15T11:35:00Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 564672 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ||.ఎర్రమల}}</noinclude><section begin="402A" />నివసింపదలచినందున, షాకల్ టన్ ను వేరొక పడవలో ఇంగ్లాండుకు పంపించిరి. లెఫ్ట్ నెంట్ షాకల్ టన్ న్యూజీలాండులో లిటిల్టన్ నుంచి "నింరొడు" అను తిమింగిలముల బట్టు పడవలో క్రీ. శ. 1908 జనవరి 1 వ తేదీని దక్షిణధ్రువ ప్రాంతమునకు బయలుదేరెను. 1901 నుంచి 1904 వరకు డిస్కవరీ పడవ లంగరువేసిన ప్రాంతమునకు 20 మైళ్లు ఉత్తరముగా రాస్ దీవి మీద, రాయిడ్ అగ్రమువద్ద దృఢమైన గుడిసెను నిర్మించి విడిసెను. ఈమారు కుక్కలకు బదులుగా మంచూరియానుంచి తెచ్చిన పొట్టి గుఱ్ఱములను “స్లెక్ట్ " లను బండ్లకుకట్టి లాగించిరి. ఎరిబెస్ అగ్ని పర్వతమును ప్రొఫెసరు డేవిడు కనుగొనెను. 72° -25 దక్షిణ అక్షాంశములో 7000 అడుగుల ఎత్తు ప్రదేశమును వీరు కనుగొనిరి. ముగ్గురు సహాయకులతో షాకల్టెన్ స్వయముగా బియర్డ్ మూరు గ్లేసియరు మీదుగా 88° 23 దక్షిణ అక్షాంశము వరకు పయనించి, ప్రాణనష్టము లేకుండా తిరిగి వచ్చెను. ప్రభుత్వమువారు ఇతనికి 1909 లో సర్ బిరుదము నిచ్చి గౌరవించిరి. దక్షిణధ్రువము మీదుగా, వెడ్డెల్ సముద్రమునుంచి రాన్ సముద్రము చేరుటకు, దక్షిణధ్రువ భూఖండమును సమగ్రముగ పరిశీలించుటకు, 1916 లో ప్రభుత్వ సహాయముతో ప్రారంభించెను. "ఎండ్యూరెన్సు" అను పడవలో క్రీ. శ. 1914 డిసెంబరులో వెడ్డెల్ సముద్రతీర పరిశీలనము మొదలిడెను. క్రీ. శ. 1915 జనవరి 11వ తేదీన 'కేర్డ్ కోస్ట్ ' అను ప్రాంతమును కనుగొనెను. కాని జనవరి18 తేదీన పడవ మంచుకొండలో ఇరుకుకొనిపోయి, మంచుగడ్డల ఒత్తిడికి తునాతునకలయ్యెను. అక్టోబరు 27 తేదీన 69.5′ దక్షిణ అక్షాంశములో 28 మంది మనుష్యులతో పడవను వదలి మంచుకొండమీద కాపురము ఏర్పరచుకొనిరి. 457 రోజులు ఈ కొండమీద గడచిన తరువాత 1916 ఏప్రిలు 9 వ రోజున కొండభగ్నముకాగా తమ వెంటనున్న మూడు చిన్న పడవలను సముద్రములోనికి వదలి, వాటిలో ఆరురోజులు భయంకరమైన పరిస్థితులలో కాలముగడపి, 'ఎలిఫెంటు' దీవి చేరుకొనిరి, అయిదుగురు జనులను తోడుతీసికొని, మిగిలినవారిని "ఎలిఫెంటు" దీవిపై వదలి 750 మైళ్ళు ప్రయాణముచేసి దక్షిణ జార్జియా ప్రాంతమును చేరుకొనెను. చిలీ దేశపు పడవ "ఎల్కో" సహాయముతో "ఎలిఫెంటు" దీవిపై నున్న తన మిత్రులను సురక్షితముగా 1916 ఆగస్టు 30 వ తేదీ నాడు దక్షిణ జార్జియా చేర్చెను. చివరి పర్యాయము "క్వెస్టు"అను పడవలో సెప్టెంబరు 1921 లో తిరిగి దక్షిణధ్రువప్రాంత పరిశోధనలకై బయలు దేరి దక్షిణ జార్జియాలో "గ్రిట్వికెన్" అను ప్రదేశమును చేరెను. అచ్చట శరీరారోగ్యము చెడి 1922 జనవరి 5 వ తేదీన, సర్ ఎర్నస్ట్లు పాకల్టన్ పరమపదించెను. ఇతని సమాధి నేటివరకు కాపాడబడుచున్నది. దక్షిణ ధ్రువప్రాంత సముద్రములో తిమింగలములు విరివిగా లభించుటచే, వానిని వేటాడుటకై పాశ్చాత్యులు వ్యయ ప్రయాసలకోర్చి, ఈ ప్రాంత నైసర్గిక స్థితిని కూలంకషముగ తెలిసికొనగోరిరి. దక్షిణధ్రువ భూఖండములో విలువగల ఖనిజము లుండవచ్చునని కూడ వీరి యూహ. నిరంతర ప్రయాణములు, పరిశోధనలలో నిమగ్నుడై సర్ ఎర్నస్టు షాకల్టెన్ చివరకు ఈ ప్రాంతములోనే సమాధి స్థితుడైనాడు. తాను దేశాభివృద్ధికై ప్రాణముల సహితము అర్పించి, చిరకీర్తిని ఆర్జించుకొనినాడు. {{right|ప. వేం}} <section end="402A" /> <section begin="402B" />'''ఎర్రమల :''' ఎర్రమల అనగా ఎర్రకొండలని అర్థము. ఇవి తూర్పు కనుమలలోని యొక భాగమైన కడపవరుసలోనివి. ఈ శ్రేణిలో పశ్చిమమున ఎర్రమల, శేషాచలము, పాలకొండ ఉన్నవి. ఇవి కొడవలి యాకారమున నున్నవి. ఎర్రమలగుట్టలు తుంగభద్రానదికి దక్షిణమున నున్నవి. వీనికి దక్షిణమున శేషాచలమును, తూర్పున నల్లమల గుట్టలును గలవు. ఎర్రముల నల్లమలల నడుమ "కుందేరు" పారుచున్నది. ఈ ప్రవాహ ప్రదేశమునే నంద్యాలలోయ యందురు. ఈ లోయ కృష్ణా తుంగభద్రా సంగమము నుండి కడపవరకు వ్యాపించియున్నది. ఎర్రమలగుట్టలయందు శ్వార్జ్ (పాలశిల), నాపరాయి లభించుచున్నవి. అచటి వత్సర వర్ష పాతము 40 " అగుటచే కొండలపై పల్చని అడవులు మాత్రము కాననగును. అచ్చటిరాళ్ళు సచ్ఛిద్రములై, పగిలియుండును. <section end="402B" /><noinclude><references/></noinclude> dlre77k3s1vxefaecfde3uzq4hmig3k సూచిక:కాళిందీకన్యాపరిణయము (అహోబలపతి).pdf 106 177677 564604 494917 2026-07-15T05:49:19Z దేవీప్రసాదశాస్త్రి 4290 564604 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[కాళిందీకన్యాపరిణయము]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:అహోబలపతి|అహోబలపతి]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=ఆంధ్రసాహిత్యపరిషత్తు |చిరునామా=కాకినాడ |సంవత్సరం=1929 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=MS |పుటలు=<pagelist 1=ముఖచిత్రం 2to16=roman 2=1 17to25 =roman 17=1 26=1 /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} 52jsrn3kkt2e48q8evoy0ie8l41jnqx పుట:కాళిందీకన్యాపరిణయము (అహోబలపతి).pdf/5 104 177690 564599 494933 2026-07-15T05:05:52Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 564599 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>హరించుటం జేసి మనకవి యప్పకవికిఁ దరువాతివాఁ డగును. 1578 శకసంవత్సరమున అప్పకవీయము ప్రారంభింపఁబడిన ట్లుండుటచేత నతఁడు క్రీ. శ. 1657 సం॥కుఁదర్వాతివాఁ డనకతీఱదు. '''కవిత్వము''': — ఈ విద్వత్కవి కవిత్వము మంచిధారతోను సర్వతోముఖపాండిత్యముతోను జదువరుల కానందముం గల్గించుచున్నది. '''కృతిపతి''': — ఈకవి తన గ్రంథములను మనుష్యులకుఁ గృతి యీయక శ్రీరామచంద్రునకుఁ గృతి యిచ్చెను. దీనివలన నీకవి శ్రీరామునందు మిగులభక్తి గలవాఁ డని స్పష్ట మగుచున్నది. '''కవిత్వములోనివిశేషములు''':- ఈతనిక విశ్వములోని విశేషము లీతని కత్యధిక మగుసంసృతాంధ్రభాషాపాండిత్యము కలదని చాటుచున్నవి. ఇంతే కాదు. సంసృతాంధ్రవ్యాకరణములందుఁ గూడ, గొప్పప్రజ్ఞ కల దనియు, వేదమునందుఁ దర్కమీమాంసాదిశాస్త్రములందు విశేషపాండిత్య మున్న దనియుఁ గూడఁ జెప్పుచున్నవి. మఱియు నిందలి ప్రథమాశ్వాసములోని 146 వ గద్యములో శ్రీకృష్ణరూపవర్ణన మీతని కలంకారశాస్త్రంబున నసమానపాండిత్యము కల దని నుడువుచున్నది. '''ఇతరానుకరణములు''':— కవి సంసృతాంధ్రభాషలయందుఁ బాండిత్యము కలవాఁ డగుటచే నక్కడక్కడ సంస్కృతశ్లోకభావములను నితరాంధ్రమహాకవులభావములను గొంచెము మార్పులతోఁ దనగ్రంథమందుఁ జొన్పినాఁడు, చూడుఁడు. {{Telugu poem|type=శ్లో.|lines=<poem>కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా శ్రుతమ్ బాంధవాః కుల మిచ్ఛన్తి పక్వాన్న మితరేజనాః.</poem>|ref=}} అనుదానికి {{Telugu poem|type=ఉ.|lines=<poem>తల్లి ధనాఢ్యు సశ్రుతిని దండ్రియు బంధులు సత్కులీనుఁగా నెల్లరు నోదనప్రదుని నెన్నఁగఁ గన్నియ రూపవంతుఁగా నెల్లెడఁ గోరు నిన్నియును నెత్తెఱఁ గల్గినకృష్ణుఁ గూర్పలేరు.</poem>|ref=280}} {{Telugu poem|type=శ్లో.|lines=<poem>పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే పుత్రో రక్షతి వార్ధక్యే న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి</poem>|ref=}} అనుదానికి {{Telugu poem|type=గీ.|lines=<poem>బాల్యమున మాత్ర పితరులుఁ బ్రాయమునను మగఁడు ముదిమిని దనయుండు మగువ కరయ నధిపు లగుదురు తదధీన లగుటఁ గాన మానవతులకుఁ దమయిచ్చ మలయఁ జనదు.</poem>|ref=196}}<noinclude><references/></noinclude> njj8m8zaqfdy18nwmr67uoeouecbhej 564600 564599 2026-07-15T05:06:10Z దేవీప్రసాదశాస్త్రి 4290 564600 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>హరించుటం జేసి మనకవి యప్పకవికిఁ దరువాతివాఁ డగును. 1578 శకసంవత్సరమున అప్పకవీయము ప్రారంభింపఁబడిన ట్లుండుటచేత నతఁడు క్రీ. శ. 1657 సం॥కుఁదర్వాతివాఁ డనకతీఱదు. '''కవిత్వము''': — ఈ విద్వత్కవి కవిత్వము మంచిధారతోను సర్వతోముఖపాండిత్యముతోను జదువరుల కానందముం గల్గించుచున్నది. '''కృతిపతి''': — ఈకవి తన గ్రంథములను మనుష్యులకుఁ గృతి యీయక శ్రీరామచంద్రునకుఁ గృతి యిచ్చెను. దీనివలన నీకవి శ్రీరామునందు మిగులభక్తి గలవాఁ డని స్పష్ట మగుచున్నది. '''కవిత్వములోనివిశేషములు''':- ఈతనిక విశ్వములోని విశేషము లీతని కత్యధిక మగుసంసృతాంధ్రభాషాపాండిత్యము కలదని చాటుచున్నవి. ఇంతే కాదు. సంసృతాంధ్రవ్యాకరణములందుఁ గూడ, గొప్పప్రజ్ఞ కల దనియు, వేదమునందుఁ దర్కమీమాంసాదిశాస్త్రములందు విశేషపాండిత్య మున్న దనియుఁ గూడఁ జెప్పుచున్నవి. మఱియు నిందలి ప్రథమాశ్వాసములోని 146 వ గద్యములో శ్రీకృష్ణరూపవర్ణన మీతని కలంకారశాస్త్రంబున నసమానపాండిత్యము కల దని నుడువుచున్నది. '''ఇతరానుకరణములు''':— కవి సంసృతాంధ్రభాషలయందుఁ బాండిత్యము కలవాఁ డగుటచే నక్కడక్కడ సంస్కృతశ్లోకభావములను నితరాంధ్రమహాకవులభావములను గొంచెము మార్పులతోఁ దనగ్రంథమందుఁ జొన్పినాఁడు, చూడుఁడు. {{Telugu poem|type=శ్లో.|lines=<poem>కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా శ్రుతమ్ బాంధవాః కుల మిచ్ఛన్తి పక్వాన్న మితరేజనాః.</poem>|ref=}} అనుదానికి {{Telugu poem|type=ఉ.|lines=<poem>తల్లి ధనాఢ్యు సశ్రుతిని దండ్రియు బంధులు సత్కులీనుఁగా నెల్లరు నోదనప్రదుని నెన్నఁగఁ గన్నియ రూపవంతుఁగా నెల్లెడఁ గోరు నిన్నియును నెత్తెఱఁ గల్గినకృష్ణుఁ గూర్పలేరు.</poem>|ref=280}} {{Telugu poem|type=శ్లో.|lines=<poem>పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే పుత్రో రక్షతి వార్ధక్యే న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి</poem>|ref=}} అనుదానికి {{Telugu poem|type=గీ.|lines=<poem>బాల్యమున మాత్ర పితరులుఁ బ్రాయమునను మగఁడు ముదిమిని దనయుండు మగువ కరయ నధిపు లగుదురు తదధీన లగుటఁ గాన మానవతులకుఁ దమయిచ్చ మలయఁ జనదు.</poem>|ref=296}}<noinclude><references/></noinclude> fp25zklcabl25gefkufp39t3c71c9fj పుట:కాళిందీకన్యాపరిణయము (అహోబలపతి).pdf/6 104 177691 564601 494934 2026-07-15T05:20:31Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 564601 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>"కస్తూరీతిలకం లలాటఫలకే" అను సుప్రసిద్ధశ్లోకమునకుఁ జక్కని తెనుఁగు {{Telugu poem|type=సీ.|lines=<poem>మృదులఫాలమునందు మృగమదంబు ధరించి ఱొమ్మునఁ జారురత్నమ్ముఁ బూని నాసికాగ్రమునందు నవ్యమౌక్తిక మూని కరముల రత్నకంకణము లూని కరతలంబున వేణుకాండంబు ధరియించి నెమ్మేన హరిచందనమ్ముఁ దాల్చి కంఠదేశమున ముక్తాస్రజంబులు గూర్చి రాణించ పీతాంబరంబు గట్టి కొంతతడవు సుఖింపదు కోమలాంగి, యాత్మనాయకకమలాసహాయవేష సముచితాలంక్రియావస్తు సమితిఁ గొనుచు... </poem>|ref=296}} లంక్రి {{p|al|fwb}}మహాకవులపోకడలు, పోలికలు:—</p> {{Telugu poem|type=సీ.|lines=<poem>నవనవసృష్టివైభవహేమగర్భ మై సత్యలోకంబుతో సరసమాడు నార్యాంగనామనోహరనీలకఁఠమై కైలాసనగరివైఖరి వహించు సంతతశ్రీనివాసస్ఫూర్త్యుదారమై వైకుంఠపురముతో వన్నె కెక్కు సురుచిరాలంకారసుమనోనివాసమై సురరాజునిలయంబుసొంపుఁ గాంచు సరససౌభాగ్యవిభవభాస్వద్విభూతు, లన్నియును గూడి వర్ధిల్ల నమరి యుండు సతతసేవాగతాష్టదిక్స్వామిపాలి, కాపురంబైన యలద్వారకాపురంబు.</poem>|ref=}} {{right|కుమార ధూర్జటి, ఇందుమతీపరిణయములోని 1-141}} {{Telugu poem|type=సీ.గీ.|lines=<poem>జగతి వైకుంఠకైలాససత్యలోక, దిగ్వరపురాధిరాజమందిరనిభప్ర భావభాసిత మగుచు సంపదలఁ బొదలు, నఖిలవిద్యాకరం బయోధ్యాపురంబు.</poem>|ref=}} {{Telugu poem|type=సీ.|lines=<poem>కేళీరతకుమారి కాళీకృతవిలాసపాళీరుచిరకుంజభాసురములు నంగీకృతస్వానసంగీతమత్తసారంగీయుతసరోవిరాజితములు నానామణిప్రభానూనాభ్రమణిపదాధీనామితాద్రిసమ్మానితములు గంగానదీకీర్తిభంగానుగతమహాభంగాపగావళీసంగతములు సురుచిరామరభూరుహసుమవిరచిత, గర్భితవిరాగసురసతీకరపయోజ లగ్నశాఖమహీరుహాగ్రగసుమములు, ఠీవిఁ జెలువొందు నచటిలీలావనములు.</poem>|ref=}} {{right|కాళిం. 1.100}} {{Telugu poem|type=సీ.|lines=<poem>లలనాజనాపాంగవలనావసదనంగతులనాభికాభంగదోఃప్రసంగ మలసానిలవిలోలదళసాసవరసాలఫలసాదరశుకాలపనవిశాల మలినీగరుదనీకమలినీకృతధునీకమలినీసుఖితకోకకులవధూక మతికాంతసలతాంతలతికాంతరనితాంతరతికాంతరణతాంతసుతనుకొాంత మకృతకామోదకురవకావికలవకుల, ముకులసకలవనాంతప్రమోదచలిత</poem>|ref=}}<noinclude><references/></noinclude> 37dyyzuuvzwiduv3gn6r36yfbncj8l8 564602 564601 2026-07-15T05:21:57Z దేవీప్రసాదశాస్త్రి 4290 564602 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>"కస్తూరీతిలకం లలాటఫలకే" అను సుప్రసిద్ధశ్లోకమునకుఁ జక్కని తెనుఁగు {{Telugu poem|type=సీ.|lines=<poem>మృదులఫాలమునందు మృగమదంబు ధరించి ఱొమ్మునఁ జారురత్నమ్ముఁ బూని నాసికాగ్రమునందు నవ్యమౌక్తిక మూని కరముల రత్నకంకణము లూని కరతలంబున వేణుకాండంబు ధరియించి నెమ్మేన హరిచందనమ్ముఁ దాల్చి కంఠదేశమున ముక్తాస్రజంబులు గూర్చి రాణించ పీతాంబరంబు గట్టి కొంతతడవు సుఖింపదు కోమలాంగి, యాత్మనాయకకమలాసహాయవేష సముచితాలంక్రియావస్తుసమితిఁ గొనుచు... </poem>|ref=296}} {{p|al|fwb}}మహాకవులపోకడలు, పోలికలు:—</p> {{Telugu poem|type=సీ.|lines=<poem>నవనవసృష్టివైభవహేమగర్భ మై సత్యలోకంబుతో సరసమాడు నార్యాంగనామనోహరనీలకఁఠమై కైలాసనగరివైఖరి వహించు సంతతశ్రీనివాసస్ఫూర్త్యుదారమై వైకుంఠపురముతో వన్నె కెక్కు సురుచిరాలంకారసుమనోనివాసమై సురరాజునిలయంబుసొంపుఁ గాంచు సరససౌభాగ్యవిభవభాస్వద్విభూతు, లన్నియును గూడి వర్ధిల్ల నమరి యుండు సతతసేవాగతాష్టదిక్స్వామిపాలి, కాపురంబైన యలద్వారకాపురంబు.</poem>|ref=}} {{right|కుమార ధూర్జటి, ఇందుమతీపరిణయములోని 1-141}} {{Telugu poem|type=సీ.గీ.|lines=<poem>జగతి వైకుంఠకైలాససత్యలోక, దిగ్వరపురాధిరాజమందిరనిభప్ర భావభాసిత మగుచు సంపదలఁ బొదలు, నఖిలవిద్యాకరం బయోధ్యాపురంబు.</poem>|ref=}} {{Telugu poem|type=సీ.|lines=<poem>కేళీరతకుమారి కాళీకృతవిలాసపాళీరుచిరకుంజభాసురములు నంగీకృతస్వానసంగీతమత్తసారంగీయుతసరోవిరాజితములు నానామణిప్రభానూనాభ్రమణిపదాధీనామితాద్రిసమ్మానితములు గంగానదీకీర్తిభంగానుగతమహాభంగాపగావళీసంగతములు సురుచిరామరభూరుహసుమవిరచిత, గర్భితవిరాగసురసతీకరపయోజ లగ్నశాఖమహీరుహాగ్రగసుమములు, ఠీవిఁ జెలువొందు నచటిలీలావనములు.</poem>|ref=}} {{right|కాళిం. 1.100}} {{Telugu poem|type=సీ.|lines=<poem>లలనాజనాపాంగవలనావసదనంగతులనాభికాభంగదోఃప్రసంగ మలసానిలవిలోలదళసాసవరసాలఫలసాదరశుకాలపనవిశాల మలినీగరుదనీకమలినీకృతధునీకమలినీసుఖితకోకకులవధూక మతికాంతసలతాంతలతికాంతరనితాంతరతికాంతరణతాంతసుతనుకొాంత మకృతకామోదకురవకావికలవకుల, ముకులసకలవనాంతప్రమోదచలిత</poem>|ref=}}<noinclude><references/></noinclude> cym6th2xydn2ngqx56h7vtbfgvylszd 564603 564602 2026-07-15T05:22:48Z దేవీప్రసాదశాస్త్రి 4290 564603 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>"కస్తూరీతిలకం లలాటఫలకే" అను సుప్రసిద్ధశ్లోకమునకుఁ జక్కని తెనుఁగు {{Telugu poem|type=సీ.|lines=<poem>మృదులఫాలమునందు మృగమదంబు ధరించి ఱొమ్మునఁ జారురత్నమ్ముఁ బూని నాసికాగ్రమునందు నవ్యమౌక్తిక మూని కరముల రత్నకంకణము లూని కరతలంబున వేణుకాండంబు ధరియించి నెమ్మేన హరిచందనమ్ముఁ దాల్చి కంఠదేశమున ముక్తాస్రజంబులు గూర్చి రాణించ పీతాంబరంబు గట్టి కొంతతడవు సుఖింపదు కోమలాంగి, యాత్మనాయకకమలాసహాయవేష సముచితాలంక్రియావస్తుసమితిఁ గొనుచు... </poem>|ref=296}} {{p|al|fwb}}మహాకవులపోకడలు, పోలికలు:—</p> {{Telugu poem|type=సీ.|lines=<poem>నవనవసృష్టివైభవహేమగర్భ మై సత్యలోకంబుతో సరసమాడు నార్యాంగనామనోహరనీలకఁఠమై కైలాసనగరివైఖరి వహించు సంతతశ్రీనివాసస్ఫూర్త్యుదారమై వైకుంఠపురముతో వన్నె కెక్కు సురుచిరాలంకారసుమనోనివాసమై సురరాజునిలయంబుసొంపుఁ గాంచు సరససౌభాగ్యవిభవభాస్వద్విభూతు, లన్నియును గూడి వర్ధిల్ల నమరి యుండు సతతసేవాగతాష్టదిక్స్వామిపాలి, కాపురంబైన యలద్వారకాపురంబు.</poem>|ref=}} {{right|కుమార ధూర్జటి, ఇందుమతీపరిణయములోని 1-141}} {{Telugu poem|type=సీ.గీ.|lines=<poem>జగతి వైకుంఠకైలాససత్యలోక, దిగ్వరపురాధిరాజమందిరనిభప్ర భావభాసిత మగుచు సంపదలఁ బొదలు, నఖిలవిద్యాకరం బయోధ్యాపురంబు.</poem>|ref=}} {{Telugu poem|type=సీ.|lines=<poem>కేళీరతకుమారి కాళీకృతవిలాసపాళీరుచిరకుంజభాసురములు నంగీకృతస్వానసంగీతమత్తసారంగీయుతసరోవిరాజితములు నానామణిప్రభానూనాభ్రమణిపదాధీనామితాద్రిసమ్మానితములు గంగానదీకీర్తిభంగానుగతమహాభంగాపగావళీసంగతములు సురుచిరామరభూరుహసుమవిరచిత, గర్భితవిరాగసురసతీకరపయోజ లగ్నశాఖమహీరుహాగ్రగసుమములు, ఠీవిఁ జెలువొందు నచటిలీలావనములు.</poem>|ref=}} {{right|కాళిం. 1.100}} {{Telugu poem|type=సీ.|lines=<poem>లలనాజనాపాంగవలనావసదనంగతులనాభికాభంగదోఃప్రసంగ మలసానిలవిలోలదళసాసవరసాలఫలసాదరశుకాలపనవిశాల మలినీగరుదనీకమలినీకృతధునీకమలినీసుఖితకోకకులవధూక మతికాంతసలతాంతలతికాంతరనితాంతరతికాంతరణతాంతసుతనుకాంత మకృతకామోదకురవకావికలవకుల, ముకులసకలవనాంతప్రమోదచలిత</poem>|ref=}}<noinclude><references/></noinclude> bcr8345v606mxfpruzum6hcw39jyvy8 సూచిక:కవిశిరోభూషణము (అహోబలపతి).pdf 106 178563 564606 496993 2026-07-15T05:57:50Z దేవీప్రసాదశాస్త్రి 4290 564606 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[కవిశిరోభూషణము]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:అహోబల పండితుడు|అహోబల పండితుడు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=ఆకెళ్ళ అరుణాచలశాస్త్రి |చిరునామా=గుంటూరు |సంవత్సరం=1972 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=MS |పుటలు=<pagelist 1=ముఖచిత్రం 15to44=roman 15=1 45=1 /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} 3viryspxgtwv7n474yxuckcf1ap0go4 పుట:కవిశిరోభూషణము (అహోబలపతి).pdf/2 104 178565 564583 564442 2026-07-15T01:40:06Z దేవీప్రసాదశాస్త్రి 4290 564583 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fs125}}అహోబలపతి</p> {{p|ac|fwb}}జయంతి రామయ్య పంతులుగారు, బి.ఏ., బి.ఎల్.</p> ఈతఁడు "అహోబలపండితీయ" మనునామాంతరము గల కవిశిరోభూషణ మనునాంధ్రవ్యాకరణగ్రంథమును సంస్కృతభాషలో రచియించిన మహావిద్వాంసుఁడు. ఈతనిపేరు “అహోబలపండితుఁ"డని వాడుకలో నున్నది గాని యీతనిచే రచియింపఁబడిన గ్రంథములలో "అహోబలపతి" యనియే యున్నది. కవిశిరోభూషణముగాక, యీతఁడు "కాళిందీకన్యాపరిణయ" మనునాఱాశ్వాసముల యాంధ్రప్రబంధమునుగూడ రచియించి రామచంద్రున కంకితము చేసెను. ఈ ప్రబంధ మచ్చుపడలేదు. వ్రాఁతప్రతి యొకటి నాయొద్ద నున్నది. కవిశిరోభూషణ మాంధ్రశబ్దచింతామణికి వ్యాఖ్య. ఇందు, కాకునూరి అప్పకవిమత మచ్చటచ్చట ఖండిఁపఁబడినది. ఈ గ్రంథము రచియించుటచేతనే "అభినవనన్నయభట్టారక" బిరుదమును అహోబలపతి తనకుం బెట్టుకొనియెను. ఈబిరుదము కాళిందీకన్యాపరిణయాంతగద్యమునందుఁ గూడ నుండుటచేతఁ దొలుతఁ గవిశిరోభూషణమును బిదపఁ గాళిందీకన్యాపరిణయమును రచియింపఁబడినట్లు స్పష్టపడుచున్నది. కవిశిరోభూషణమం దచ్చటచ్చట సందర్భోచితముగా నథర్వణకారిక లను వ్యాకరణసూత్రము లుదాహరింపఁబడుటయే కాక యా కారికలను వేఱుగాఁ జదువ నక్కఱలే దనునర్థ మిచ్చునట్లు — {{Telugu poem|type=|lines=<poem>యస్సారోథర్వణగ్రంథే సో ప్యత్రైన విధీయతే తేన తత్ఫక్కికాలోకలోలతా త్యజ్యతాం బుధైః.</poem>|ref=}} అని చెప్పఁబడి యున్నది. ఇటీవలివా రొకరిద్ద ఱీకారికలకుఁ డీక రచియించినారు. ఎవరికైనను అహోబలపతిపాఠమే శరణ్య మైనది. అంతకంటెఁ బ్రాచీనపాఠ మెవ్వరికిని దొరకకుండుటచేతను అహోబలపతియే యాకారికల రచియించి యథర్వణునిపేరఁ బ్రకటించెనని కొంద ఱందురు. అ ట్లనుట సరికా దని కొందఱయభిప్రాయము. సత్య మేది యైనను ఆంధ్రశబ్దచింతామణికి బాలసరస్వతియు హరికారికలకు శిష్టు కృష్ణమూర్తిగారునువలె నథర్వణకారికల కహోబలుఁడే ప్రథమప్రకాశకుఁ డనుట స్పష్టము. అహోబలపతి యాఱువేలనియోగిబ్రాహ్మణుఁడు. ఇంటిపేరు గాలివారు. ఈయన మొదటిపేరు నరసరాజు. గ్రంథములం దింటిపేరు ప్రభంజ<noinclude><references/></noinclude> e9dfylggayf7fdfpfhgup5rxq6hw2r0 పుట:కవిశిరోభూషణము (అహోబలపతి).pdf/8 104 178571 564505 495899 2026-07-14T12:11:10Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 564505 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>త్యక్తుం వా చతురాననాబ్జసహితాం యాం వా విధాతు స్ఫుర త్కామ స్పానకులీ ముదా వసతు మే చిత్తంబుజాతేనిశమ్.</poem>|ref=27}} {{Telugu poem|type=|lines=<poem>పంచాక్షరీమనుశిరోమణితారవర్ణైః సంబోధ్యతే సగుణనిర్గుణరూపయుగ్యః నందేతమిందుకలికాభరణాభిరామం రామాభిషిక్తవరదేశికసార్వభౌమమ్.</poem>|ref=28}} {{Telugu poem|type=|lines=<poem>విద్యాగుకుముద్వతీచంద్రరేఖాం విద్యాంగనామణిమ్ నీలకంఠమనస్తోష వర్షాకాదంబినీం భజే.</poem>|ref=29}} {{Telugu poem|type=|lines=<poem>యద్దేహామృతబిందుసంగమవశా త్తత్యాజనాగాధిపః కంఠేభూతపతేర్వసన్ విషధరప్రఖ్యాభవం దుర్యశః కించ బ్రహ్మకపాలపాళిరనిశం వేదాన్ సమాభాషతే వందే తా మరవిందసుందరముఖీం కాంతాంగసౌధాలయామ్.</poem>|ref=30}} {{Telugu poem|type=|lines=<poem>అత్యంతశీతలసుధారసదీపితాంగీ మామ్నాయదివ్యసరసీరుహచారుభృంగీమ్ హ్రీంకారసౌధతలమ౦గళదీపరేఖాం విద్యాం భజామి పరమాద్భుతరూపరేఖామ్.</poem>|ref=31}} {{Telugu poem|type=|lines=<poem>యా వేదాంతసరోజినీమధుకరీ యాభక్తచిత్త వ్యథా గాఢధ్వాంతనివారణద్యుమణిరు గ్యాలోకసమ్మోహినీ యామృత్యుంజయహృత్కరీంద్రబలవద్వారీ దయాసారిణీ వందే తాం పురవాసినీంసుజఘనా మైంకారసింహాసనామ్.</poem>|ref=32}} {{Telugu poem|type=|lines=<poem>యాగంగాధరదేహపంజరశుకీ యాసాధకవ్రాతదృ ఙ్నీలాంభోరుహకౌముదీ సురసతీ సంకల్పితస్వర్గవీ యా వారణ్యకముండకాద్యుపనిషజ్జాలాంబుజాతాకర క్రీడచ్ఛ్వేతపతత్రిణీ గిరిసుతా సాపాతు మామన్వహమ్.</poem>|ref=33}} {{Telugu poem|type=|lines=<poem>ఓం హ్రీం దుం బీజసంపన్నమనురాజాధిదేవతామ్ పోషితాశేషసద్వర్గాం వనదుర్గాముపాస్మహే.</poem>|ref=34}} {{Telugu poem|type=|lines=<poem>నానాదర్శనమర్మభేదనమహామేధాలసద్వల్లికా బీజం మంత్రిసహస్రలోచనమనోభీష్టార్థచింతామణిః నానాస్త్రీపురుషాంతరంగవశతానిర్వాహసిద్ధిక్రియా విద్యాదామపదారవిందయుగళీసేవైవ మే జీవనమ్.</poem>|ref=35}} {{Telugu poem|type=|lines=<poem>యద్వ్యాకరణవైద్యేన హృతా లోకాపవాగ్రుజా విద్వత్సహస్రనేత్రం తం దాక్షిసూను ముపాస్మహే.</poem>|ref=36}}<noinclude><references/></noinclude> dqfv9ac03q465v2cbx9mqbl6fxmw5bx పుట:కవిశిరోభూషణము (అహోబలపతి).pdf/9 104 178572 564553 495900 2026-07-14T15:37:06Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 564553 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>ఉత్పాదితప్రాకృతలక్షణోపియో నిర్దారితప్రాకృతలక్షణోభవత్ తం కావ్యకల్పద్రుమకుంభవారిధిం ప్రస్తౌమి వల్మీకసుతం సతాంవరమ్.</poem>|ref=37}} {{Telugu poem|type=|lines=<poem>నిర్వికారమనస్కౌయౌ వికృతేః కారణే అపి తౌ వందే కవితామూలకందవాగనుశాసనే.</poem>|ref=38}} {{Telugu poem|type=|lines=<poem>సిద్ధా దదృష్టచర మశ్రుతపూర్వ మేతం గ్రంథం సమాప విశదం చ చకార వాచ్యమ్ యాగాఢగూఢ మపి బాలసరస్వతీసా నుత్యాకథం ను నభవే దెలకూచివంశ్యా.</poem>|ref=39}} {{Telugu poem|type=|lines=<poem>షడ్దర్శినీలాభరతా మునీంద్రా, షడ్దర్శనీజన్మభువో వితంద్రాః యన్మూర్తిమీయుస్తముదారవిద్యాధుర్యం ప్రపద్యేహృదిమాధవార్యమ్.</poem>|ref=40}} {{Telugu poem|type=|lines=<poem>యత్కీర్తి స్ఫారదీప్త్యా గతపతి నిఖిలేచిత్రవర్ణే ప్రపంచే శ్వైత్యం కంజాతజాతో వికృతినిజకృతిప్రేక్షణే లజ్జితస్సౝ నాభౌ విష్ణో ర్విలీన స్తమిహబుధమణిః స్తోతుముర్వ్యాం క్షమః స్యా త్కోవా శ్రీమాధవార్యం మధురగుణమణీసింధుమార్యౌఘబంధుమ్.</poem>|ref=41}} {{Telugu poem|type=|lines=<poem>యత్కీర్తిరోచిచ్చురితా (ఖవద్యాః) పస్పర్థినీసూర్యభవాబభూవ తం పోలురీవంశపయోధిచంద్రం వందామహే మాధవవిద్వదింద్రమ్.</poem>|ref=42}} {{Telugu poem|type=|lines=<poem>వాణీ కాననదేశసంతతగతేః ప్రాప్తాంగభేదాభువం యాతా తత్రపరాఙ్ముఖీ పతికృతస్వాన్వేషణాశంకినీ యన్మూర్త్యా పరివర్థితాంతికజనాజాగర్తి సర్వంకషః సోయం మాధవిపండితో విజయతే సత్యస్య నిత్యాలయః.</poem>|ref=43}} {{Telugu poem|type=|lines=<poem>యత్పాండిత్యాధిపత్యశ్రవణపరిణతాశ్చర్యతాధూతమస్తే శస్తే చక్షుశ్శ్రవస్సు శ్రవణవిఘటనాజ్ఞాతత చ్ఛింజితాంకే భద్రం నిద్రాత్యనిద్రః కలశజలనిధే శ్రీనిధి స్తీవ్రఘోషా త్తం శక్తః కః ప్రణోతుం యది భవతి మతిః సాహసేసైవమూలమ్.</poem>|ref=44}} {{Telugu poem|type=|lines=<poem>లోకాలోకధరాధరచ్ఛదివృతే విశ్వంభరావాలకే యత్కీర్తిస్ఫుటకల్పభూజలతికా నిర్బాధ ముజ్జృంభతే రారాజత్సుమనోమనఃప్రమదకృత్సౌరభ్యవిభ్రాజితా వందేహం త మనింద్యసద్గుణగణాధారం గురుం మాధవమ్.</poem>|ref=45}}<noinclude><references/></noinclude> 2v1539a5rxw5l4e4lpl9hhda2ku2fhs పుట:కవిశిరోభూషణము (అహోబలపతి).pdf/10 104 178573 564555 495901 2026-07-14T17:33:08Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 564555 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>మూకాః సదభ్రసుమమాల్యమనోజ్ఞచూడా వంధ్యాసుతాః పదవియోజితవాక్ప్రసారాః నీలచ్ఛవిచ్ఛురిత దేవధునీ .....త్వంతే నిందంతి మాధవగురో రయశఃకదంబమ్.</poem>|ref=46}} {{Telugu poem|type=|lines=<poem>యద్వాచామధురిమ్ణి ధూతసదృశే ప్రద్యోతమానేధికం జీవాతు ర్దివిషద్గణస్య సతతం సంఖ్యాపదభ్యర్హితమ్ ప్రాయా త్ఖల్వమృతం క్షియా మితి ముదం ప్రాప్నో త్యవేలాంతమ స్తత్ప్రాత్ప్యా విధురం కథంను నభవే ద్వర్ణ్యోగురు ర్మాధవః.</poem>|ref=47}} {{Telugu poem|type=|lines=<poem>దాక్షీపుత్రకణాదగౌతమఫణిప్రాగ్యాదిసంఖ్యావతో ద్రష్టుం యేభిలషంతి పండితజనాస్తేపూర్ణకామాస్పుటమ్ యత్స౦దర్శనతో నిదర్శితకలావైశద్యదాతానత స్వాంతాత్యంతతమోబలం తమతులం ధ్యాయామి మన్మాతులమ్.</poem>|ref=48}} {{Telugu poem|type=|lines=<poem>నిష్పంకా వీతభంగా సతత మతిశితా సర్వతో నిర్వికారా నిర్వేలాకౢప్తదేశా నిఖిలవిబుధరాట్కర్ణభాగైకవేద్యా సర్వజ్ఞౌఘానుగమ్యా సకలసుజననిర్హారిగంధానుబంధా పాయా న్మాం మాధవాఖ్యా మధుర బుధమణేః కీర్తిగంగా స్రవంతీ.</poem>|ref=49}} {{Telugu poem|type=|lines=<poem>ఛన్నే స్వప్రాణభర్తు ర్భవతి శశభృతో బింబసర్వస్వభావే గాధం గాఢావగాఢాఖిలవచనతతే ర్శద్గురోస్ఫీతకీర్త్యా సందేహాందోళితాంతఃకరణకలుషితానంతరం హస్తయోగ ప్రాప్తాంకప్రత్యభిజ్ఞా భజతి హృది ముదం రోహిణీమోహనాంగీ.</poem>|ref=50}} {{Telugu poem|type=|lines=<poem>శ్రీమన్మాధవయజ్వమాళివిలసత్కీర్తీందునాకః సమ స్తుల్యశ్శారదపూర్ణిమా హిమకరస్తుల్యః కళంకీకథమ్ తాదృక్సోపి కథం న సర్వమమునా వ్యాప్తం జగత్తత్కథమ్ జాగర్తి ప్రతికూలభావవిదుషాం నీలః కళంకో మహాన్.</poem>|ref=51}} {{Telugu poem|type=|lines=<poem>విద్వత్ప్రకాండగణనాకృతిభిః ప్రయుక్తో యద్వాచి పండితపదాదవధారణేసుః? సం తం సుధీహృది సతీర్థ్యవనీవసంతం ప్రణామి సతతం మను మాతులం తమ్?</poem>|ref=52}} {{Telugu poem|type=|lines=<poem>భీతాయతః సకలవేదశిఖావతంసా యాభూత్తథా స్యమలరామవచైకవాచ్యా</poem>|ref=}}<noinclude><references/></noinclude> 15hdmuie9me1pua6htldxkf6n662jg7 పుట:కవిశిరోభూషణము (అహోబలపతి).pdf/11 104 178574 564567 495902 2026-07-14T18:03:57Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 564567 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>సాచి? ర్యదీయహృదయాంబురుహాలయో భూ ద్రామాభిషి(ష)క్త మణిరస్తు గురు ర్ముదేసః.</poem>|ref=53}} {{Telugu poem|type=|lines=<poem>అన్యేన నాన్వయం యాతి వినా నన్వయభూషణమ్ యన్ను తిప్రవణావాచో యష్టారం తం గురుం నుమః.</poem>|ref=54}} {{Telugu poem|type=|lines=<poem>యః ప్రేమాపండితాగ్రేసరపరిగణితాఖండషడ్దర్శినీవా క్పాండిత్యోదారలీలాచతురిమకలనాదక్షిణామూర్తి దేవే పుత్రే తన్నామ్ని తస్మా దపి గురు రుదభూ ద్యస్యమయ్యాత్తభాగ్యే మన్మాతు ర్భ్రాతరం తం సకలగుణనిధిం మాధవం భావయామః.</poem>|ref=55}} {{Telugu poem|type=|lines=<poem>యేషాం సుధీకృతఘటాంతరసత్పదార్థా జీవాతవోలసతి నేతరి మూకతైవ తత్ స్నేహసౌఖ్యమతినైవ ముదావహం స్యా త్తేషాం హి దుష్కవిశునా మిహనప్రసంగః.</poem>|ref=56}} {{Telugu poem|type=|lines=<poem>నిర్నిమిత్తకృపాధారమానసానాం సుధీమతామ్ ధర్మపుత్రే మయి కథం కరుణా సార్లళౌ భవేత్.</poem>|ref=57}} {{Telugu poem|type=|lines=<poem>దోషోపిగుణతాం యాతి పండితానా మనుగ్రహాత్ అయస్సువర్ణతా మేతి సంస్పర్శాత్స్పర్శవేధినః.</poem>|ref=58}} {{Telugu poem|type=|lines=<poem>దోషోమహీయా నణుతాం గుణోత్యల్పోస్యనల్పతామ్ యన్మహిమ్నా భవేత్తస్య బుధస్యాంఘ్రావహం లవః.</poem>|ref=59}} {{Telugu poem|type=|lines=<poem>యేషాం మతి స్సకలశాస్త్రరహస్యభేత్రీ యేషాంక్రియా నిగమవాఙ్మహిమానుయాత్రీ యేషాం భవే త్ప్రకృతి రేవ గుణప్రమాత్రీ తేభ్యోసమో నమ ఇదంబుధతల్లజేభ్యః.</poem>|ref=60}} {{Telugu poem|type=|lines=<poem>గ్రంథేస్మి న్వర్తతేనైవ దుష్టశంకాపిశాచికా పండితానుగ్రహోదగ్రదివ్యరక్షాభిరక్షితే.</poem>|ref=61}} {{Telugu poem|type=|lines=<poem>యద్జ్ఞానధుర్య ధియఏవ సుధీవతంసా నిర్దూషణాంధ్రకవితాభరణా భవంతి సోయం సుధీజనశిరోమణి రంధ్రశబ్ద చింతామణి ర్విజయతే ఖిలగూఢభావః.</poem>|ref=62}} {{Telugu poem|type=|lines=<poem>సేయంకృతి ర్వేములవాడ భీమ ప్రబంధకర్త్రాహితమత్సరేణ</poem>|ref=}}<noinclude><references/></noinclude> lg7pezsiw54cy9kthmhbjo3d62gfr6x పుట:కవిశిరోభూషణము (అహోబలపతి).pdf/12 104 178575 564575 495903 2026-07-14T20:03:50Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 564575 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>గోదాజలే నాశమవాపితాభూ దిత్యుద్గతాసీ ద్భువి కించవదంతీ.</poem>|ref=63}} {{Telugu poem|type=|lines=<poem>శబ్దానుశాసనకృతాదిమపర్వముఖ్య పర్వత్రయేణ కథితం పదమేవ యోగ్యమ్ నాన్యత్ప్రయోగసరణా వమశాస్త్రదృష్టే. రేవంకృతోహి నియమః కవిరాక్షసేన.</poem>|ref=64}} {{Telugu poem|type=|lines=<poem>శ్రీతిక్కయజ్వప్రముఖవిచక్షణ సుధాంశను తదభ్యుపగమాయత్తచేతనాకపనేరతాః.</poem>|ref=65}} {{Telugu poem|type=|lines=<poem>వాచానుశాసనాద్భూమిలోకవాచానుశాసనాత్ నిర్మాణకాలఏనేమం గ్రంథరాజగ్రాహబుద్ధిమాన్.</poem>|ref=66}} {{Telugu poem|type=|lines=<poem>రాజరాజతనూజాతః సారంగధరబాలకః: సకృతః పాణిపాదేన రహితోజనిహేతురా.</poem>|ref=67}} {{Telugu poem|type=|lines=<poem>మత్స్యేంద్రనామసిద్ధేంద్రమహిమ్నా సిద్ధతాం గతః జగ్రాహవ్యాకృతిం తస్మా త్కవి ర్భాలసరస్వతిః.</poem>|ref=68}} {{Telugu poem|type=|lines=<poem>ఎలకూచి సుధాంబోధి శరద్రాకానిశాకరః సమస్తకవితాదక్షో వత్సరే కీల కాహ్వయే.</poem>|ref=69}} {{Telugu poem|type=|lines=<poem>తత్రపంచపరిచ్ఛేదాః శబ్దశాస్త్రే నియంత్రితాః ఆర్యాఖ్యపద్యై స్తత్సంఖ్యా సంమితాస్యాద్గజైర్గజైః.</poem>|ref=70}} {{Telugu poem|type=|lines=<poem>మతంగశైలవిప్రేందా దన్యద్వ్యాకృతిపుస్తకమ్ కాకునూర్యప్పకవినా గృహీతం తత్రషడ్గతాః.</poem>|ref=71}} {{Telugu poem|type=|lines=<poem>పాఠభేదాస్తు బహవో దృశ్యంతే పుస్తకద్వయే మయా ప్రాయః సరస్వత్యాః పుస్తకం పరిగృహ్యతే.</poem>|ref=72}} {{Telugu poem|type=|lines=<poem>అప్పార్యపుస్తకారూఢ పాఠభేదా ద్యదుత్థితమ్ మయాసంగృహ్యతే రూపం తదప్యాధర్వణోక్తితః.</poem>|ref=73}} {{Telugu poem|type=|lines=<poem>నియామకత్వమారూఢా నూత్నదండిముఖాః కథమ్ పూజ్యాభవేయు రాచార్యసరణే రతిదూరగాః.</poem>|ref=74}} {{Telugu poem|type=|lines=<poem>ప్రసిద్ధసారంగధరేణటీకా మపి స్ఫుటీకర్తు మతీవహర్షాత్ వాతూలవంశేవతతారభూయః శ్రీసన్నవిద్యా సహమేవ సోస్మి.</poem>|ref=75}} {{Telugu poem|type=|lines=<poem>టీకా బాలసరస్వతీ కవికృతా శుద్ధాంధ్రవాగ్గుంభితా సూత్రప్రోతపదార్థమాత్రకథనప్రక్షీణశక్తి స్తతః</poem>|ref=}}<noinclude><references/></noinclude> epmh5fx13aj8jb2udbclkavkq92235g పుట:కవిశిరోభూషణము (అహోబలపతి).pdf/13 104 178576 564576 495904 2026-07-14T20:22:11Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 564576 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>కస్తుష్యేద్భువిపండితః కవివరః కిం చాంధ్రపద్యైర్మితో గ్రంథోప్యప్పకవే ర్ముదం దిశతు నో విద్వత్కవీనాం ఘనామ్.</poem>|ref=76}} {{Telugu poem|type=|lines=<poem>కామంసంతు పరశ్శతా స్సుకవయో గంభీరవాగ్గుంభనా రంభోజ్జృంభితవైభవా మదుదితం నాక్యం శ్రుణుధ్వంపరమ్ విద్వాంసః కవయో స్త్వహోబలపతేః కోవాంధ్రభాషామణి ర్విజ్ఞానేసదృశో విచక్షణమణిః సర్వావనీమండలే..</poem>|ref=77}} {{Telugu poem|type=|lines=<poem>యన్మూర్త్యా కవితామూలకందవాగనుశాసనౌ జాగృతోహోబలపతీ రాజతే సవిచక్షణః.</poem>|ref=78}} {{Telugu poem|type=|lines=<poem>శ్రీమత్పోలురిమాధవార్యకరుణాప్రాప్తాష్టభాషాస్ఫుర త్సారశ్శాస్త్రవిదర్చితాఖిలబుధో వాతూలవంశాగ్రణీః సర్వానందదవా గహోబలపతి ర్వ్యాఖ్యాం కరోతిస్ఫుటం శ్రీమన్నన్నయభట్టసూత్రవితతేః శ్రీరామకారుణ్యతః.</poem>|ref=79}} {{Telugu poem|type=|lines=<poem>వ్యాఖ్యా మదీయాద్యవచోనిబద్ధా శబ్దార్థతాత్పర్యవివేచకీయమ్ మోదాయభూయాద్విదుషాంహిసీతారామాంఘ్రిపంకేరుహయోరధీనా.</poem>|ref=80}} {{Telugu poem|type=|lines=<poem>యస్సారోధర్వణగ్రంథే సోప్యత్రైవ విధీయతే తేనతత్ఫక్కికాలోకలాలసా త్యజ్యతాం బుధైః·</poem>|ref=81}} {{Telugu poem|type=|lines=<poem>ఏతా మాంధ్రపదాంకితం సుకవితాం నిందంతి కేచిజ్జనా గాఢాజ్ఞానవిజృంభితా సహితతో న్యూనత్వ మస్యాభవేత్ శైలూషేవ సభాసదో విరచయ త్యానందపూర్ణాన్ సతః సర్వా నంధ్రమయీ సువాగ్బహువిధా తత్తద్రసామోదినీ.</poem>|ref=82}} {{Telugu poem|type=|lines=<poem>సీతాం పద్మకరాం స్వవామతలగాం విద్యుత్సకాశాం ముదా పశ్చన్నీలపయోదసన్నిభతనుర్విజ్ఞానముద్రాన్వితః జానున్యస్తకరం సభూషణగణో మచ్చిత్తసింహాసనే నిత్యం ప్రస్ఫురతాత్కృపాజలనిధి ర్మత్పుణ్యరాశేః ఫలమ్.</poem>|ref=83}} {{Telugu poem|type=|lines=<poem>భాషాకావ్యమనర్హ మన్యవిషయం నోచేత్స్వభాషాం వినా గీర్వాణోక్తిపురాణమాత్రపఠనా న్నార్థావబోధోనృణామ్ వ్యాసాద్యాశ్చ కథం కథావిరచనే వ్యర్థప్రయాసా నతే కో భేదోస్తి పురాణవిత్కవివరవ్యాఖ్యానతత్కావ్యయోః.</poem>|ref=84}} {{Telugu poem|type=|lines=<poem>కావ్యే బమ్మెరపోతరాజసుకవే రాంధ్రే కృతీశః స్వయం</poem>|ref=}}<noinclude><references/></noinclude> 59szk2v0kf55ou5kog36xtm9j8l7lle పుట:కవిశిరోభూషణము (అహోబలపతి).pdf/14 104 178577 564550 495905 2026-07-14T15:00:25Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 564550 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>కించిత్తస్య సుదుష్కరం రచితవాన్ సర్వజ్ఞచూడామణిః లక్ష్మీశః స్వరహస్య మాదరభరా త్పద్యేతిహృద్యే పదై ర్యస్యాజ్ఞాబలతో వివేకచతురా లోకే భవేయుర్జనాః.</poem>|ref=85}} {{Telugu poem|type=|lines=<poem>శాపానుగ్రహదక్షతా వసతయో భీమాదయోవిశ్రుతాః కృత్యర్ధం భృశమర్థితా నృపవరైస్తేతిక్కయజ్వాదయః చక్రుర్దిగ్విజయం వశీకృతనృపాః శ్రీనాథభట్టాదయో నాంధ్రాణా మిహ శక్యతే హి మహిమా స్తోతుం కవీనాంబుధై.</poem>|ref=86}} {{Telugu poem|type=|lines=<poem>వ్యుత్పత్తి ర్జలవర్ణపంక్తిసదృశ్రీ శ్రోతుస్వరాద్యై ర్ధ్రువం దోషాస్యుః సుధియోపి వక్తురుచితా నోవర్ణనా భూయసీ ఛందోలక్షణశోభితా నరచనా పౌరాణికోక్తి క్షితౌ భాషకావ్య ఇమాని సత్కవికృతే నైనక్షతా న్యంచితే.</poem>|ref=87}} {{Telugu poem|type=|lines=<poem>జ్ఞాత్వార్థం హ్యుభయత్రవాక్యరచనా వ్యుత్పత్తి రాకర్ణనే నేతౄణాంచ పురాదివర్ణనమపి శ్రేయఃప్రదత్వం తథా శ్లాఘ్యత్వం భగవద్గుణాదికథనే తద్వర్జనే శ్లాఘ్యతా తద్భేదో నపురాణవక్తృకవిరాడ్జల్పాంధ్రసత్కావ్యయోః.</poem>|ref=88}} {{Css image crop |Image = కవిశిరోభూషణము (అహోబలపతి).pdf |Page = 14 |bSize = 600 |cWidth = 119 |cHeight = 64 |oTop = 785 |oLeft = 226 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> pe8riy5ug9koi2nxa1wv33bgwyb6e7j పుట:కవిశిరోభూషణము (అహోబలపతి).pdf/15 104 178578 564577 495906 2026-07-14T20:56:14Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 564577 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|శ్రీ గురమూర్తయే నమః}} {{p|ac|fs150}}సమీక్ష</p> {{Css image crop |Image = కవిశిరోభూషణము (అహోబలపతి).pdf |Page = 15 |bSize = 600 |cWidth = 30 |cHeight = 28 |oTop = 225 |oLeft = 282 |Location = center |Description = }} ఆంధ్రవ్యాకరణశాస్త్రమునకుఁ బ్రథమాచార్యుఁడు నన్నపార్యుఁడు. ద్వితీయచార్యుఁ డధర్వణాచార్యుఁడు. వీ రిరువురును సంస్కృతభాషయందు 'ఆంధ్రశబ్దచింతామణి, వికృతివివేకకారకావళి' యను రెండుగ్రంథముల రచించిరి. ఆరెండుగ్రంథములను జోడించి, యహోబలుఁడు వానిపైని "కవిశిరోభూషణము" అనుపేర వివుల మగువ్యాఖ్య రచించెను. 'అహోబలపండితీయము* అని ప్రసిద్ధ మైనయావ్యాఖ్యను దెనుఁగునఁ బూర్వులలో నొకరిద్ద ఱనువదించిరి. కాని యవి ముద్రితములై వెలుఁగులోనికి వచ్చిన ట్లగపడదు. ముద్రితమై చిరకాలముక్రిందటనే వెలువడిన మొదటిగ్రంథము బ్రహ్మశ్రీ శొంఠి భద్రాద్రి రామశాస్త్రులవారియనువాదము. రెండవది హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయపండితులగు శ్రీ చలమచెర్ల రంగాచార్యులవారును, శ్రీ అమరేశం రాజేశ్వరశర్మగారును చేసినయనువాదము. మూఁడవది బ్రహ్మశ్రీ ఆకెళ్ళ అరుణాచలశాస్త్రులవా రొనర్చిన యీ యనువాదము. భద్రాద్రిరామశాస్త్రులవారి యనువాదము కేవలము మూలానుసారియై దర్పణప్రతిబింబమువలె నుండును. అమరేశమువారియనువాదము కొన్నియెడల మూలమునఁ గలుగుసంశయముల కందందు వివరణముతో నుండును. శాస్త్రులవారి యీ "కవిశిరోభూషణవివృతి" యందు యథామూలము ప్రతిపదార్థము, వివరణముమాత్రమేకాక నన్నయగారిమార్గమునకుఁ జిన్నయసూరిమార్గమునకుఁ గలయైక్యమును, వ్యత్యాసమును, ఆ రెండిటఁ గనఁబడు గౌరవలాఘవములును నందందు సూచింపఁబడుచుండును.<noinclude><references/></noinclude> 2trnu32qif80jxtfo9oljojb7bebywx 564581 564577 2026-07-15T01:17:48Z దేవీప్రసాదశాస్త్రి 4290 564581 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|శ్రీ గురమూర్తయే నమః}} {{p|ac|fs150}}సమీక్ష</p> {{Css image crop |Image = కవిశిరోభూషణము (అహోబలపతి).pdf |Page = 15 |bSize = 600 |cWidth = 30 |cHeight = 28 |oTop = 225 |oLeft = 282 |Location = center |Description = }} ఆంధ్రవ్యాకరణశాస్త్రమునకుఁ బ్రథమాచార్యుఁడు నన్నపార్యుఁడు. ద్వితీయచార్యుఁ డథర్వణాచార్యుఁడు. వీ రిరువురును సంస్కృతభాషయందు 'ఆంధ్రశబ్దచింతామణి, వికృతివివేకకారకావళి' యను రెండుగ్రంథముల రచించిరి. ఆరెండుగ్రంథములను జోడించి, యహోబలుఁడు వానిపైని "కవిశిరోభూషణము" అనుపేర విపుల మగువ్యాఖ్య రచించెను. 'అహోబలపండితీయము* అని ప్రసిద్ధ మైనయావ్యాఖ్యను దెనుఁగునఁ బూర్వులలో నొకరిద్ద ఱనువదించిరి. కాని యవి ముద్రితములై వెలుఁగులోనికి వచ్చిన ట్లగపడదు. ముద్రితమై చిరకాలముక్రిందటనే వెలువడిన మొదటిగ్రంథము బ్రహ్మశ్రీ శొంఠి భద్రాద్రి రామశాస్త్రులవారియనువాదము. రెండవది హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయపండితులగు శ్రీ చలమచెర్ల రంగాచార్యులవారును, శ్రీ అమరేశం రాజేశ్వరశర్మగారును చేసినయనువాదము. మూఁడవది బ్రహ్మశ్రీ ఆకెళ్ళ అరుణాచలశాస్త్రులవా రొనర్చిన యీ యనువాదము. భద్రాద్రిరామశాస్త్రులవారి యనువాదము కేవలము మూలానుసారియై దర్పణప్రతిబింబమువలె నుండును. అమరేశమువారియనువాదము కొన్నియెడల మూలమునఁ గలుగుసంశయముల కందందు వివరణముతో నుండును. శాస్త్రులవారి యీ "కవిశిరోభూషణవివృతి" యందు యథామూలము ప్రతిపదార్థము, వివరణముమాత్రమేకాక నన్నయగారిమార్గమునకుఁ జిన్నయసూరిమార్గమునకుఁ గలయైక్యమును, వ్యత్యాసమును, ఆ రెండిటఁ గనఁబడు గౌరవలాఘవములును నందందు సూచింపఁబడుచుండును.<noinclude><references/></noinclude> 1bh0sdtzsyx8xs5xe0acg63m9jknnoo పుట:కవిశిరోభూషణము (అహోబలపతి).pdf/16 104 178579 564582 495907 2026-07-15T01:38:08Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 564582 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left|}} అరుణాచలశాస్త్రులవారు విజయనగరమహారాజ సంస్కృతకళాశాలయందుఁ జదువుకొని విద్వత్పట్టము నొందినవారు. అందు "కళాప్రపూర్ణ" బ్రహ్మశ్రీ వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రులవారి యాచార్యకమున నాంధ్రలక్షణగ్రంథముల నల్లఁ బఠించి గురువులయాశీఃపాత్రులై, యాశళాశాలయందే చిరకాల మధ్యాపకులుగా నుండి, యాంధ్రవ్యాకరణ, ఛందో౽లంకార శాస్త్రగ్రంథములను విద్యార్థిపరంపరకుఁ బాఠప్రవచన మొనర్చి ఖ్యాతి నందినవారు. తరువాత రాజమహేంద్రము గుంటూరు మున్నగుపురములందలి సంస్కృతకళాశాలలయందుఁ గొంతకొంతకాలము దేశికపది మలంకరించి ప్రకృతము విశ్రాంతిఁ దీసికొనుచున్న విద్యావియోవృద్ధులు. శ్రీశాస్త్రిగారు లక్షణగ్రంథములచిరకాలపఠనపాఠనములందుఁ దమకుఁ గలిగిన యనుభవవిశేషములను గాలికి విడిచిపెట్టక, కళాశాలావిద్యార్థులకే కాదు, పండితులకును నుపకరించునట్లు సరళ మగుబోధనపద్ధతిలో వార్ధకమును లెక్కింపక కవిశిరోభూషణమునకు నాంధ్రవివరణముగా నీగ్రంథమును రచించి ముద్రించి యాంధ్రభాషాజిజ్ఞాసువుల కందఁజేసి, యాంధ్రులసార్వకాలికకృతజ్ఞతకు భాజనులైనారు. క్రీ.శ. 11 శతాబ్దిలోఁ బ్రథమాచార్యుఁ డగునన్నయభట్టారతుఁడు తత్సమపదసంస్కారము హెచ్చుగను, దద్భవదేశ్యపదసంస్కారము తక్కువగను నుండునట్లు సంస్కృతభాషయం దార్యావృత్తములలో 'ఆంధ్రశబ్దచింతామణి' యను చిన్నవ్యాకరణమును రచించెను. పిదప 13 శతాబ్దిలో నథర్వణాచార్యుఁడు పాణినీయమునకు వార్తికగ్రంథమువలెఁ జింతామణికిఁ బూరకగ్రంథముగా, నాంధ్రపదసంస్కారము విపుల మొనర్చి సంస్కృతమునందే యనుష్టుప్ఛందమున 'వికృతివివేకమును' (కారికావళిని) రచించెను. అనంతరము 16 శతాబ్దతుదిని ఎలకూచి బాలసరస్వతి చింతామణికిఁ దెనుఁగునఁ జక్కనిటీక వ్రాసెను. 17 శతాబ్దిలో అప్పకవి యాచింతామణికే తెనుఁగునఁ బద్యమయముగా<noinclude><references/></noinclude> 5k0zfpckw6lwqqu7dlkar5lox78n4qy పుట:కవిశిరోభూషణము (అహోబలపతి).pdf/17 104 178580 564584 495908 2026-07-15T02:04:59Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 564584 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వివరణము వ్రాయఁబూని, సంజ్ఞాసంధిపరిచ్ఛేదములు పూర్ణముగను, అజంతపరిచ్ఛేదమునఁ గొంతభాగమున మాత్రమే రచించెను. 16 శతాబ్దితుదిని అహోబలుఁడు, తెనుఁగున వెలువడిన బాలసరస్వత్యప్పకవులమార్గమును విడిచి, నన్నయాథర్వణుల రెండుగ్రంథములను జతపఱిచి వారివలెనే సంస్కృతమందుఁ దా నీకవిశిరోభూషణమును రచించెను. ఈరీతిగా నన్నయాథర్వణాహోబలండితుల వ్యాకరణమార్గము సంస్కృతభాషామయముగా వెలసినది. నన్నయాదులమార్గముతోఁ గాని, సంస్కృతప్రాకృతవ్యాకరములతోఁగాని యంతగా సంబంధము లేక యాంధ్రపద్యమయముగా వెలసిన కేతనాదులమార్గము వేఱొకటి గనుపడుచున్నది. కేతన క్రీ.శ. 13 శతాబ్దివాఁడు (తిక్కనసోమయాజికి శిష్యుడు.) దశకుమారచరిత్రము రచించి తనగురు వగునాకవిబ్రహ్మకే కృతిగా నిచ్చినవాఁడు. "విజ్ఞానేశ్వరము" అను ధర్మశాస్త్రమును నాంధ్రీకరించినవాఁడు. ఆత “డాంధ్రభాషాభూషణ” మను తెనుఁగు వ్యాకరణమును నూటయెనుబదియెనిమిది పద్యములలో రచించెను. అం దాతఁడు చింతామణిపే రెత్తక — {{Telugu poem|type=క.|lines=<poem>“మున్ను తెనుఁగునకు లక్షణ । మెన్నడు నెవ్వరును జెప్ప రేఁ జెప్పెద వి ద్వన్నికరము మరి మెచ్చఁగ । నన్నాయిభట్టాదికవిజనంబుల కరుణన్."</poem>|ref=}} అనియు {{Telugu poem|type=గీ.|lines=<poem>"సంస్కృతప్రాకృతాదిలక్షణముఁ జెప్పి । తెలుఁగునకు లక్షణము మున్ను తెలుపకునికి కవిజనంబులనేరమి గాదు, నన్ను । ధన్యుఁ గావింపఁదలఁచినతలఁపు గాని"</poem>|ref=}} అనియు, దానే ప్రథమాంధ్రశాబ్దికుఁడ నని చెప్పికొనెను. దాని నూఁతగాఁ గొని ప్రథమాంధ్రవ్యాకరణము భాషాభూషణమే కాని చింతామణి కాదనియు, నన్నయపేర నిటీవలివా రెవరో చింతామణి రచించిరనియు నొకవాదము బయలుదేఱినది. బ్రహ్మశ్రీ వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రులవా రావాదమును బ్రతిఘటించి వావిళ్ళవారు ప్రకటించిన 'అథర్వణకారికావళి' యుపోద్ఘాతమునను,<noinclude><references/></noinclude> qchq82m2tdlfjni9e8zfs2tf4dbakru 564585 564584 2026-07-15T02:05:26Z దేవీప్రసాదశాస్త్రి 4290 564585 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వివరణము వ్రాయఁబూని, సంజ్ఞాసంధిపరిచ్ఛేదములు పూర్ణముగను, అజంతపరిచ్ఛేదమునఁ గొంతభాగమున మాత్రమే రచించెను. 16 శతాబ్దితుదిని అహోబలుఁడు, తెనుఁగున వెలువడిన బాలసరస్వత్యప్పకవులమార్గమును విడిచి, నన్నయాథర్వణుల రెండుగ్రంథములను జతపఱిచి వారివలెనే సంస్కృతమందుఁ దా నీకవిశిరోభూషణమును రచించెను. ఈరీతిగా నన్నయాథర్వణాహోబలండితుల వ్యాకరణమార్గము సంస్కృతభాషామయముగా వెలసినది. నన్నయాదులమార్గముతోఁ గాని, సంస్కృతప్రాకృతవ్యాకరములతోఁగాని యంతగా సంబంధము లేక యాంధ్రపద్యమయముగా వెలసిన కేతనాదులమార్గము వేఱొకటి గనుపడుచున్నది. కేతన క్రీ.శ. 13 శతాబ్దివాఁడు (తిక్కనసోమయాజికి శిష్యుడు.) దశకుమారచరిత్రము రచించి తనగురు వగునాకవిబ్రహ్మకే కృతిగా నిచ్చినవాఁడు. "విజ్ఞానేశ్వరము" అను ధర్మశాస్త్రమును నాంధ్రీకరించినవాఁడు. ఆత “డాంధ్రభాషాభూషణ” మను తెనుఁగు వ్యాకరణమును నూటయెనుబదియెనిమిది పద్యములలో రచించెను. అం దాతఁడు చింతామణిపే రెత్తక — {{Telugu poem|type=క.|lines=<poem>“మున్ను తెనుఁగునకు లక్షణ । మెన్నడు నెవ్వరును జెప్ప రేఁ జెప్పెద వి ద్వన్నికరము మరి మెచ్చఁగ । నన్నాయిభట్టాదికవిజనంబుల కరుణన్."</poem>|ref=}} అనియు {{Telugu poem|type=గీ.|lines=<poem>"సంస్కృతప్రాకృతాదిలక్షణముఁ జెప్పి । తెలుఁగునకు లక్షణము మున్ను తెలుపకునికి కవిజనంబులనేరమి గాదు, నన్ను । ధన్యుఁ గావింపఁదలఁచినతలఁపు గాని"</poem>|ref=}} అనియు, దానే ప్రథమాంధ్రశాబ్దికుఁడ నని చెప్పికొనెను. దాని నూఁతగాఁ గొని ప్రథమాంధ్రవ్యాకరణము భాషాభూషణమే కాని చింతామణి కాదనియు, నన్నయపేర నిటీవలివా రెవరో చింతామణి రచించిరనియు నొకవాదము బయలుదేఱినది. బ్రహ్మశ్రీ వజ్ఝల చినసీతారామస్వామి శాస్త్రులవా రావాదమును బ్రతిఘటించి వావిళ్ళవారు ప్రకటించిన 'అథర్వణకారికావళి' యుపోద్ఘాతమునను,<noinclude><references/></noinclude> pgzv9hmk6kaye44c5zdnbpl4edqwf1k పుట:కవిశిరోభూషణము (అహోబలపతి).pdf/18 104 178581 564594 495909 2026-07-15T02:32:40Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 564594 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>‘జింతామణివిషయపరిశోధనము'నను, నన్నయకృతభారతభాగమునకును, జింతామణికిని గల లక్ష్యలక్షణసంబంధమును జూపి, యక్షరశః ఖండించి చింతామణికర్త భట్టారకుఁడే యనియుఁ జింతామణి మొదటిదనియుఁ దక్కినవి దరువాతివే యనియు ధ్రువపఱిచిరి. భాషాసంస్కారమునెడఁ గేతనగ్రంథము పరిమితమే కాని చింతామణిపాటి విపులమును గాదు. అందలి పరిభాషలును, సంజ్ఞలును గొన్ని పాణినీయమునకుఁగాని ప్రాకృతవ్యాకరణమునకుఁగాని సంబంధింపవు. అఱ్ఱు, ఇఱ్ఱు, ఉఱ్ఱు, డుఱ్ఱు, వుఱ్ఱు మొదలగు ఱిత్తుల కక్షరసంజ్ఞామాత్రమేకాని వేఱుఫలము గనరాదు. {{Telugu poem|type=|lines=<poem>“లక్షణములు దెలిపడిచో। నక్షరములు దెలియుకొఱకు ననువైనక్రియన్ శిక్షార్థముగాఁ బలికితి। లాక్షణికులు తప్పుగాఁ దలంపకుఁడు మదిన్.”</poem>|ref=}} అని చెప్పినాఁడు. ఇట్లు చెప్పుటవలన “వర్ణాత్కారః” అనువిధిచే 'కార'ప్రత్యయము వర్ణమాత్రమునకు వచ్చునట్లే ఱకారము ననుబంధముగా సర్వత్ర కూర్చెనేమో యనుకొంద మనిన “శబ్దానీకాంతనకారము” అనియు, "ఇల ముకారమునకు ద్విత్వమేని బిందుపూర్వకబుకార మేనియుఁ బొసఁగియుండు” అనియు, 'కార’ప్రత్యయమును గొన్నియెడలఁ జెప్పకపోలేదు. ఱకారానుబంధము ప్రాకృతసంబంధి యేమో యన - శకటరేఫషము కాదు. కాని సాధురేఫ మనుబంధముగా నున్నయెడ “రితో ద్విత్వత్ — రేఫానుబంధ స్యాదేశవ్యంజనస్య నిత్యం ద్విత్వం భవతి" అని (షడ్భాషాచంద్రిక). ఱిత్తనుహలాదేశము ద్విత్వయుక్తమని కలదు. కాన దానితోడను సంబంధము కానరాదు. కేతనమార్గము ననుసరించినది 'కావ్యాలంకారచూడామణి'. అందు నవమోల్లాసమునఁ గలశబ్దసంస్కారము భాషాభూషణమునకుఁ జేరువగా నున్నది. అదియును బరిమితమే. ఆవ్యాకరణములు రెండిటిపద్దతి యంతటితో నాఁగిపోయినది.<noinclude><references/></noinclude> sfpywxb27jli1ll1r33q9n187j3a1g3 564595 564594 2026-07-15T02:33:10Z దేవీప్రసాదశాస్త్రి 4290 564595 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>‘జింతామణివిషయపరిశోధనము'నను, నన్నయకృతభారతభాగమునకును, జింతామణికిని గల లక్ష్యలక్షణసంబంధమును జూపి, యక్షరశః ఖండించి చింతామణికర్త భట్టారకుఁడే యనియుఁ జింతామణి మొదటిదనియుఁ దక్కినవి దరువాతివే యనియు ధ్రువపఱిచిరి. భాషాసంస్కారమునెడఁ గేతనగ్రంథము పరిమితమే కాని చింతామణిపాటి విపులమును గాదు. అందలి పరిభాషలును, సంజ్ఞలును గొన్ని పాణినీయమునకుఁగాని ప్రాకృతవ్యాకరణమునకుఁగాని సంబంధింపవు. అఱ్ఱు, ఇఱ్ఱు, ఉఱ్ఱు, డుఱ్ఱు, వుఱ్ఱు మొదలగు ఱిత్తుల కక్షరసంజ్ఞామాత్రమేకాని వేఱుఫలము గనరాదు. {{Telugu poem|type=|lines=<poem>“లక్షణములు దెలిపెడిచో। నక్షరములు దెలియుకొఱకు ననువైనక్రియన్ శిక్షార్థముగాఁ బలికితి। లాక్షణికులు తప్పుగాఁ దలంపకుఁడు మదిన్.”</poem>|ref=}} అని చెప్పినాఁడు. ఇట్లు చెప్పుటవలన “వర్ణాత్కారః” అనువిధిచే 'కార'ప్రత్యయము వర్ణమాత్రమునకు వచ్చునట్లే ఱకారము ననుబంధముగా సర్వత్ర కూర్చెనేమో యనుకొంద మనిన “శబ్దానీకాంతనకారము” అనియు, "ఇల ముకారమునకు ద్విత్వమేని బిందుపూర్వకబుకార మేనియుఁ బొసఁగియుండు” అనియు, 'కార’ప్రత్యయమును గొన్నియెడలఁ జెప్పకపోలేదు. ఱకారానుబంధము ప్రాకృతసంబంధి యేమో యన - శకటరేఫషము కాదు. కాని సాధురేఫ మనుబంధముగా నున్నయెడ “రితో ద్విత్వత్ — రేఫానుబంధ స్యాదేశవ్యంజనస్య నిత్యం ద్విత్వం భవతి" అని (షడ్భాషాచంద్రిక). ఱిత్తనుహలాదేశము ద్విత్వయుక్తమని కలదు. కాన దానితోడను సంబంధము కానరాదు. కేతనమార్గము ననుసరించినది 'కావ్యాలంకారచూడామణి'. అందు నవమోల్లాసమునఁ గలశబ్దసంస్కారము భాషాభూషణమునకుఁ జేరువగా నున్నది. అదియును బరిమితమే. ఆవ్యాకరణములు రెండిటిపద్దతి యంతటితో నాఁగిపోయినది.<noinclude><references/></noinclude> tmg55ut1oaotcsxu4uw4mndr4jjvoqv పుట:కవిశిరోభూషణము (అహోబలపతి).pdf/19 104 178582 564596 495910 2026-07-15T03:19:39Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 564596 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ముద్దరాజు రామన్నరచితమగు "కవిలోకసంజీవని,గణపవరపు వేంకటకవికృతమగు 'ఆంధ్రకౌముది' అడిదము సూరనకృతమగు 'కవిసంశయవిచ్ఛేదము,' కూచిమంచి తిమ్మకవికృతమగు 'సర్వలక్షణసారసంగ్రహము' మున్నగుపద్యమయ మైన పెక్కులక్షణగ్రంథము లప్పుడప్పుడు వెలువడుచు వచ్చినవి. అవి సామాన్యముగా నప్పకవీయమువలెనే ఛందశ్శాస్త్రప్రధానములుగా నున్నవేకాని చింతామణి మున్నగువానివలె వ్యాకరణప్రధానములుగాఁ గన్పట్టవు. మధ్యకాలమం దట్టిలక్షణగ్రంథములు బహుముఖములుగా వెలసినవి. నేఁటివలె ముద్రణాదిసౌకర్యములు లేనికారణమునలో, మఱి యేకారణముననో కాని యాగ్రంథములు పుట్టినకాలమునసైతము వాని కధికవ్యాప్తి యున్నట్లు కనఁబడదు. ఉన్నను నేకొంచెమో పండితలోకమున నుండెడి దనవచ్చును. నన్నయాథర్వణుల గ్రంథములు సంస్కృతభాషామయములు; అందును లక్షణగ్రంథములు. కావున భారతాదిగ్రంథములవలె బహుముఖవ్యాప్తి లేక యందందు మూలఁబడియుండుటచేఁ గేతన కాగ్రంథములయునికి తెలియకపోవచ్చును. కేతన తానే ప్రథమలాక్షణికుఁడనని చెప్పినవాక్యమే ప్రమాణ మైనపుడు “నిత్యసత్యవచనుఁడును” “జపహోమతత్పరుఁడు" నగు నన్నపార్యుఁడు "విపులశబ్దశాసనుఁడ" నని చెప్పినపలు కప్రమాణము నసత్యము నగునా? అదియునుగాక — కేతన కించుమించు సమకాలికుఁడును, బాలసరస్వతి మున్నగువారికిఁ బూర్వుఁడు నైన జక్కనకవి తన విక్రమార్కచరిత్రమున— {{Telugu poem|type="ఉ.|lines=<poem>వేయివిధంబులందుఁ బదివేవురు పెద్దలు సత్ప్రబంధముల్ పాయక చెప్పి, రిట్లు రసబంధురవాగ్విభవాభిగారామదౌ రేయులు శబ్దశాసనవరేణ్యులు నాఁగఁ బ్రశస్తి కెక్కిరె యేయెడ నన్నపార్యుగతి నిద్ధర? నట్టిమహాత్ముఁ గొల్చెదన్.”</poem>|ref=}} అని నన్నయభట్టును శబ్దశాసనవరేణ్యునిగాఁ జెప్పినమాట యనృతమా? అట్లగుచో నాశబ్దశాసన మేది యందురా! నన్నయకృత మని<noinclude><references/></noinclude> gewpljf08rtz4wjm2qbue165ghx8q88 564597 564596 2026-07-15T03:20:59Z దేవీప్రసాదశాస్త్రి 4290 564597 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ముద్దరాజు రామన్నరచితమగు 'కవిలోకసంజీవని', గణపవరపు వేంకటకవికృతమగు 'ఆంధ్రకౌముది' అడిదము సూరనకృతమగు 'కవిసంశయవిచ్ఛేదము,' కూచిమంచి తిమ్మకవికృతమగు 'సర్వలక్షణసారసంగ్రహము' మున్నగుపద్యమయ మైన పెక్కులక్షణగ్రంథము లప్పుడప్పుడు వెలువడుచు వచ్చినవి. అవి సామాన్యముగా నప్పకవీయమువలెనే ఛందశ్శాస్త్రప్రధానములుగా నున్నవేకాని చింతామణి మున్నగువానివలె వ్యాకరణప్రధానములుగాఁ గన్పట్టవు. మధ్యకాలమం దట్టిలక్షణగ్రంథములు బహుముఖములుగా వెలసినవి. నేఁటివలె ముద్రణాదిసౌకర్యములు లేనికారణమునలో, మఱి యేకారణముననో కాని యాగ్రంథములు పుట్టినకాలమునసైతము వాని కధికవ్యాప్తి యున్నట్లు కనఁబడదు. ఉన్నను నేకొంచెమో పండితలోకమున నుండెడి దనవచ్చును. నన్నయాథర్వణుల గ్రంథములు సంస్కృతభాషామయములు; అందును లక్షణగ్రంథములు. కావున భారతాదిగ్రంథములవలె బహుముఖవ్యాప్తి లేక యందందు మూలఁబడియుండుటచేఁ గేతన కాగ్రంథములయునికి తెలియకపోవచ్చును. కేతన తానే ప్రథమలాక్షణికుఁడనని చెప్పినవాక్యమే ప్రమాణ మైనపుడు “నిత్యసత్యవచనుఁడును” “జపహోమతత్పరుఁడు" నగు నన్నపార్యుఁడు "విపులశబ్దశాసనుఁడ" నని చెప్పినపలు కప్రమాణము నసత్యము నగునా? అదియునుగాక — కేతన కించుమించు సమకాలికుఁడును, బాలసరస్వతి మున్నగువారికిఁ బూర్వుఁడు నైన జక్కనకవి తన విక్రమార్కచరిత్రమున— {{Telugu poem|type="ఉ.|lines=<poem>వేయివిధంబులందుఁ బదివేవురు పెద్దలు సత్ప్రబంధముల్ పాయక చెప్పి, రిట్లు రసబంధురవాగ్విభవాభిగారామదౌ రేయులు శబ్దశాసనవరేణ్యులు నాఁగఁ బ్రశస్తి కెక్కిరె యేయెడ నన్నపార్యుగతి నిద్ధర? నట్టిమహాత్ముఁ గొల్చెదన్.”</poem>|ref=}} అని నన్నయభట్టును శబ్దశాసనవరేణ్యునిగాఁ జెప్పినమాట యనృతమా? అట్లగుచో నాశబ్దశాసన మేది యందురా! నన్నయకృత మని<noinclude><references/></noinclude> hnvf3zejickbx1czn58q0ajnc83mtpo పుట:కవిశిరోభూషణము (అహోబలపతి).pdf/20 104 178583 564598 495917 2026-07-15T03:41:07Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 564598 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వేఱొకశబ్దానుశాసనము లభించుపర్యంతము చింతామణి యాతనిదే యనుకొనుటలో విప్రతిపత్తి లేదు. ఈపరిశీలనమువలన - ఆంధ్రవ్యాకరణము సంస్కృతమున నవతరించుట మొదటిఘట్టము. తరువాత దానిచాయనే పద్యమయముగా నాంధ్రమున నవతరించుట రెండవఘట్టము - అని విశద మగుచున్నది. పిదప 17 శతాబ్దిలోఁ జిన్నయసూరి రచించినయాంధ్రవ్యాకరణములయవతరణము మూఁడవఘట్టము. ఆతడు నన్నయాథర్వణులమార్గమున పంచపరిచ్ఛేదవిభాగముతో 'శబ్దలక్షణసంగ్రహమును', సిద్ధాంతకౌముదీమార్గమున సంస్కృతభాషయందు 'సూత్రాంధ్రవ్యాకరణమును' 'పద్యాంధ్రవ్యాకరణమును' (కొంతమాత్రమే కనఁబడుచున్నది) రచించి, సూత్రమయముగాఁ దెలుఁగున 'బాలవ్యాకరణమును' రచించెను. అనంతరము శ్రీమాన్ బహుజనపల్లి సీతారామాచార్యులవారు 'త్రిలింగలక్షణశేష'మనెడి ప్రౌఢవ్యాకరణమును బూర్వకవుల ప్రయోగవిశేషోదాహరణములతో వ్రాసిరి. ఈరీతిగా నాంధ్రవ్యాకరణశాస్త్రము మూఁడుమార్గములఁ బ్రవర్తిల్లినదని స్థూలముగా ననుకొనవచ్చును. సంస్కృతమున ముందుగా వెలువడిన నన్నయాథర్వణాహోబలపతులహృదయము తెలిసినఁగాని, యాంధ్రశబ్దశాస్త్రము కూలంకషముగా నవగతము కాదనెడితలంపునఁ జిన్నయసూరి బాలవ్యాకరణముతో మేళవించి బ్రహ్మశ్రీ వజ్ఝల చినసీతారామస్వామిశాస్త్రులవారు బహుకాలము పరిశోధనము గావించి సమన్వయ మొనర్చుచు "వ్యాకరణసంహితాసర్వస్వము" అను బృహద్విమర్శనగ్రంథమును రచించిరి. ఏఁబదిసంవత్సరములక్రింద 'మహోపాధ్యాయ' కల్లూరి వేంకటరామశాస్త్రులవారు బాలవ్యాకరణమునకు 'గుప్తార్థప్రకాశిక' యను విపులవ్యాఖ్య రచించియున్నారు. బ్రహ్మశ్రీ వజ్ఝల పండితుల శిష్యు లైన దూసి రామమూర్తిశాస్త్రిగారు "బాలవ్యాకరణసారస్యసర్వస్వపేటిక” యనువ్యాఖ్య రచించిరి. ఈనడుమనే<noinclude><references/></noinclude> b3o85noeqcqvuuf9bortt59olq7omer పుట:కవిశిరోభూషణము (అహోబలపతి).pdf/21 104 178589 564630 495919 2026-07-15T08:20:05Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 564630 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'కళాప్రపూర్ణ' దువ్వూరి వేంకటరమణశాస్త్రులవారు బాలవ్యాకరణమునందలి ప్రత్యక్షతలాలిత్యము బయలువడ 'రమణీయము' అను మఱియొకవ్యాఖ్య రచించినారు. శ్రీమాన్ శ్రీభాష్యకారాచార్యులవారు ప్రౌఢవ్యాకరణమునకు 'తత్త్వబోధిని' యను వరకూలంకషము మనోహరము నగు వ్యాఖ్య రచించినారు. ఇంకను బెక్కుపండితులు నూతనము లగువ్యాకరణములు, వ్యాఖ్యలు, విమర్శనములు వ్రాయుచున్నారు; వ్రాయఁగలరు; వ్రాయవలసినదే. "ముఖేముఖే సరస్వతీ” అనికదా పెద్దలసూక్తి. ప్రకృత మనుసరింతము. అహోబలపండితీయ మనెడి కవిశిరోభూషణమునకుఁ దెలుఁగున రెం డనువాదములు కలవనియు, బ్రహ్మశ్రీ ఆకెళ్ళ అరుణాచలశాస్త్రులవారి యీయనువాదము మూఁడవదనియు నింతకు మున్న తెలిపియున్నాను. శాస్త్రులవారి “వివృతి" యనెడి యీయనువాదమందలి విశేషములు తెలుపుటకు ముందు కవిశిరోభూషణకర్త యగు నహోబలపతిని గూర్చి ప్రశంశించుట యప్రస్తుతము కాదనుకొందును. {{p|ac|fwb}}అహోబలపతిపండితుఁడు</p> “ప్రభంజన” వంశాబ్ధిరాకాశశాంకేన.... అభినవనన్నయభట్టాచార్యేణ... అని కవిశిరోభూషణగద్యమందును, బ్రభంజనవంశాబ్ధిరాకాశశాంక... అహోబలపత్యాహ్వయ కవి మహోపాధ్యాయభట్టారక.. అని కాళిందీకన్యాపరిణయాశ్వాసాంతగద్యమందును - గనవచ్చుటచే నహోబలునియింటిపేరు 'ప్రభంజనము' అని తెలియుచున్నది. కవిశిరోభూషణావతారికాశ్లోకములం దొకచో "వాతూలవంశాగ్రణీః, సర్వానందదవాదగహోబలపతిః అని యుండుటచే వాతూలమువారా, ప్రభంజనము వారా? యని విచారణ మొనర్చి 'గాలి'వా రనియు, నాతనిపేరు 'నరసయ్య' యనియుఁ<noinclude><references/></noinclude> hf50f6trj7sw0ba3gh00q86m61wueqp పుట:కవిశిరోభూషణము (అహోబలపతి).pdf/22 104 178688 564633 496025 2026-07-15T08:30:18Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 564633 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>బెద్దలు నిశ్చయించి 'గాలి నరసయ్య' యనుదానికే 'ప్రభంజనము లేక వాతూలము - అహోబలపతి యని సంస్కృతీకరణ మనినారు. ఆచార్య ఖండవిల్లి లక్ష్మీరంజనముగారి యాదేశానుసారము హైదరాబాదుప్రతికి నే నుపోద్ఘాతము వ్రాయునప్పు డాంధ్రసాహిత్యపరిషత్పత్రిక లందలి వ్యాసములను మాత్రమే చూచుటచే నాతనిపే రేదియో నిర్ధారింపఁజాలక "నరసయ్య" యని వ్యవహారనామ మూహించుటకంటె నరసభూపాలీయప్రయోగముల ననుసరించి 'ఔబళయ్య' యని కాని, 'ఓబయ్య' యని కాని యూహించుట సముచితము; అహోబల శబ్దమునకు వికృతులే 'ఔబళ - ఓబ శబ్దములు' అనిమాత్రము సూచించితిని. తరువాత ముద్రితమై వచ్చిన హైదరాబాదు (అమరేశమువారి) ప్రతితుట్టతుదిని గల {{Telugu poem|type=చ.|lines=<poem>అకుటిలకీర్తినిర్మలత నంచితుఁ డౌబళపండితుండు వే ఱొకఁ డనుశబ్దశాసనుఁ డహో! యని మన్నన సేయ....</poem>|ref=}} అనుపద్యము చూడఁగనే 'గాలి ఔబళపండితుఁడు' అనునిశ్చయము నాకుఁ గలిగినది. సంస్కృతశబ్దమంజరిచివర నున్న సమాసకుసుమావళి రచించిన మహాపండితులు నడిమింటి సర్వమంగళశాస్త్రిగారు 'శ్రీమధ్యమందిరకులాంబుధిపూర్ణచంద్ర శ్రీసర్వమంగళమనీషికృతా సలీలం' అనుశ్లోకమున 'నడిమింటి' అనుపదమును “మధ్యమందిరము” అని సంస్కృతీకరించుకొనినట్లే 'గాలి' అనుపదమును 'ప్రభంజనము, వాతూలము' అనియు, 'ఔబళపండిత'పదమును, 'అహోబలపండిత' యనియుఁ దానే సంస్కృతీకరించుకొనె ననుటలో విప్రతిపత్తి కనరాదు. ఇంక నీతనివాసస్థలము వినుకొండసీమలోని 'ఉమ్మిడివరమో' లేక యాప్రాంతమున నున్న మఱొకగ్రామమో యైయుండును. ఈతనిగోత్ర మీగ్రంథమునఁగాని, కాళిందీకన్యాపరిణయమునఁగాని పేర్కొనఁబడలేదు. కాని అమరేశం రాజేశ్వరశర్మగారు తమయహోబలపండి<noinclude><references/></noinclude> lx3u21bszbmghvdnn542ed5wz07a944 పుట:కవిశిరోభూషణము (అహోబలపతి).pdf/23 104 178689 564668 496026 2026-07-15T11:16:52Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 564668 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>తీయోపోద్ఘాతమునందు గాలివారిది భారద్వాజసగోత్రమని తెలిసికొనినట్లు వ్రాయుటచే నీతనిది భారద్వాజసగోత్రమని స్పష్ట మైనది. ఇతనితలిదండ్రులఁ గూర్చి యా రెండుగ్రంథములందును బేర్కొనఁబడలేదు. కాని యీతని మేనమామ యైన పోలూరి మాధవయజ్వను గూర్చి యారెండిటియందును బెద్దగఁ బ్రశంసించియుండుటచే బాల్యమునుండి మేనమామయింటనే పెరిగి పెద్దవాడై, యాత్రని గురుత్వముననే సకలశాస్త్రములను, సంస్కృతప్రాకృతాదిభాషలను నేర్చినట్లు విశదమగుచున్నది. {{Telugu poem|type=|lines=<poem>"తం పోలురీవంశపయోధిచంద్రం, పంచామహే మాధవవిద్వచంద్రమ్" అనియు "దాక్షీపుత్రః ణాదగౌ”తమఫణిప్రాగ్యాదిసంఖ్యావతో ద్రష్టుం యే౽భిలషంతి పండితజనా స్తే పూర్ణకామాః స్ఫుటమ్ యత్స౦దర్శనతో నిదర్శితకలా వైశద్యదాతా నత స్వాంతాత్యంతతమోబలం త మతులం ధ్యాయామి మన్మాతులమ్."</poem>|ref=}} (పాణిని, కణాదుఁడు, గౌతముఁడు, శేషుఁడు మున్నగు శాస్త్రకారులను దర్శింపఁగోరుపండితు లెవనిదర్శనము చేసి పూర్ణకాము లగుదురో, యట్టిశాస్త్రకారులరూపమే యనఁదగినవాఁడును, దనకళావైశద్యముచే విధేయు లగువారి మానసికాంధకారమును బోఁగొట్టువాఁడును, నాకు మేనమామయు నగుమాధవగురుని ధ్యానింతును) - అని యీగ్రంథమందును, {{Telugu poem|type=గీ.|lines=<poem>ఏమహాత్ముని దర్శింప నెసఁగు దక్ష । పాదకణచరితమిని వ్యాసమౌని కపిలఫణిరాజదర్శితఘటితమోద । మతని మద్గురు మాధవు నభినతింతు.”</poem>|ref=}} అని కాళిందీకన్యాపరిణయమందును మాధవబుధుని సకలశాస్త్రపాండిత్యమును, దనభక్తిభావమును బెక్కుపద్యములందుఁ బ్రకటించి కృతార్థుఁడయ్యెను. ఇఁకఁ దనపాండిత్యమును గూర్చియో - యీకవిశిరోభూషణమందాదిని<noinclude><references/></noinclude> bon38vo0jzgc935prn8aets1cbpsyb9 పుట:వేటూరివారి పీఠికలు, మొదటిభాగము.pdf/30 104 190110 564666 518585 2026-07-15T11:09:57Z Rajasekhar1961 50 564666 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude> {{p|fs125|ac}}'''విషయసూచిక'''</p> {{rh|విషయము||పుటలు}} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/1. తొడిమ - తంజావూరి చరిత్ర పీఠిక ( 1914)|1. తొడిమ - తంజావూరి చరిత్ర పీఠిక ( 1914)]]}} |{{DJVU page link|1|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/2. ప్రబంధ రత్నావళి పీఠిక ( 1918)|2. ప్రబంధ రత్నావళి పీఠిక ( 1918)]]}} |{{DJVU page link|33|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/3. చారుచర్య - ఉపోద్ఘాతము (1922)|3. చారుచర్య - ఉపోద్ఘాతము (1922)]]}} |{{DJVU page link|58|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/4. శ్రీకాకుళ శ్రీహరిశతక పీఠిక (1923)|4. శ్రీకాకుళ శ్రీహరిశతక పీఠిక (1923)]]}} |{{DJVU page link|62|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/5. భగవదఙ్ఞుకము - తొడిమ (1924)|5. భగవదఙ్ఞుకము - తొడిమ (1924)]]}} |{{DJVU page link|70|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/6. ఉద్భటారాధ్య చరిత్ర పీఠిక (1925)|6. ఉద్భటారాధ్య చరిత్ర పీఠిక (1925)]]}} |{{DJVU page link|79|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/7. మనుచరిత్ర పీఠిక (1926)|7. మనుచరిత్ర పీఠిక (1926)]]}} |{{DJVU page link|98|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/8. ప్రతిమా నాటకము - తొలిపలుకు (1910- 1927)|8. ప్రతిమా నాటకము - తొలిపలుకు (1910- 1927)]]}} |{{DJVU page link|130|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/9. బసవ పురాణము - పీఠిక (1926)|9. బసవ పురాణము - పీఠిక (1926)]]}} |{{DJVU page link|134|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/10. బసవోదాహరణము - తొలిపలుకు (1928)|10. బసవోదాహరణము - తొలిపలుకు (1928)]]}} |{{DJVU page link|300|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/11. నీతిద్విషష్టిక - ఉపోద్ఘాతము (1981)|12. నీతిద్విషష్టిక - ఉపోద్ఘాతము సంస్కృత (1928) రచనకు తెలుగు అనువాదము (1981)]]}} |{{DJVU page link|301|31}} }} పరిశిష్టము 12. కర్ణభారము - తొలిపలుకు (1913) 311 13. మధ్యమ వ్యాయోగము - తొలిపలుకు (1913) 312 313 - 14. చాటుపద్య మణిమంజరి తొలిపలుకు 15. భగవదజ్జుకము ( ఉపోద్ఘాతము - సంస్కృతము) (1925) 16. నీతిద్విషష్టిక (ఉపోద్ఘాతము - సంస్కృతము) (1928)<noinclude><references/></noinclude> nybtvtzoms0u22w2zaekud1rjxbn6hy 564667 564666 2026-07-15T11:14:16Z Rajasekhar1961 50 564667 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude> {{p|fs125|ac}}'''విషయసూచిక'''</p> {{rh|విషయము||పుటలు}} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/1. తొడిమ - తంజావూరి చరిత్ర పీఠిక ( 1914)|1. తొడిమ - తంజావూరి చరిత్ర పీఠిక ( 1914)]]}} |{{DJVU page link|1|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/2. ప్రబంధ రత్నావళి పీఠిక ( 1918)|2. ప్రబంధ రత్నావళి పీఠిక ( 1918)]]}} |{{DJVU page link|33|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/3. చారుచర్య - ఉపోద్ఘాతము (1922)|3. చారుచర్య - ఉపోద్ఘాతము (1922)]]}} |{{DJVU page link|58|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/4. శ్రీకాకుళ శ్రీహరిశతక పీఠిక (1923)|4. శ్రీకాకుళ శ్రీహరిశతక పీఠిక (1923)]]}} |{{DJVU page link|62|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/5. భగవదఙ్ఞుకము - తొడిమ (1924)|5. భగవదఙ్ఞుకము - తొడిమ (1924)]]}} |{{DJVU page link|70|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/6. ఉద్భటారాధ్య చరిత్ర పీఠిక (1925)|6. ఉద్భటారాధ్య చరిత్ర పీఠిక (1925)]]}} |{{DJVU page link|79|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/7. మనుచరిత్ర పీఠిక (1926)|7. మనుచరిత్ర పీఠిక (1926)]]}} |{{DJVU page link|98|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/8. ప్రతిమా నాటకము - తొలిపలుకు (1910- 1927)|8. ప్రతిమా నాటకము - తొలిపలుకు (1910- 1927)]]}} |{{DJVU page link|130|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/9. బసవ పురాణము - పీఠిక (1926)|9. బసవ పురాణము - పీఠిక (1926)]]}} |{{DJVU page link|134|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/10. బసవోదాహరణము - తొలిపలుకు (1928)|10. బసవోదాహరణము - తొలిపలుకు (1928)]]}} |{{DJVU page link|300|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/11. నీతిద్విషష్టిక - ఉపోద్ఘాతము (1981)|11. నీతిద్విషష్టిక - ఉపోద్ఘాతము సంస్కృత (1928) రచనకు తెలుగు అనువాదము (1981)]]}} |{{DJVU page link|301|31}} }} పరిశిష్టము {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/12. కర్ణభారము - తొలిపలుకు (1913)|12. కర్ణభారము - తొలిపలుకు (1913)]]}} |{{DJVU page link|311|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/13. మధ్యమ వ్యాయోగము - తొలిపలుకు (1913)|13. మధ్యమ వ్యాయోగము - తొలిపలుకు (1913)]]}} |{{DJVU page link|312|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/14. చాటుపద్య మణిమంజరి - తొలిపలుకు|14. చాటుపద్య మణిమంజరి - తొలిపలుకు]]}} |{{DJVU page link|313|31}} }} 15. భగవదజ్జుకము ( ఉపోద్ఘాతము - సంస్కృతము) (1925) 16. నీతిద్విషష్టిక (ఉపోద్ఘాతము - సంస్కృతము) (1928)<noinclude><references/></noinclude> nkuplq9pvftxqpa6tk6gsnauhdusx6v 564669 564667 2026-07-15T11:17:09Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 564669 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude> {{p|fs125|ac}}'''విషయసూచిక'''</p> {{rh|విషయము||పుటలు}} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/1. తొడిమ - తంజావూరి చరిత్ర పీఠిక ( 1914)|1. తొడిమ - తంజావూరి చరిత్ర పీఠిక ( 1914)]]}} |{{DJVU page link|1|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/2. ప్రబంధ రత్నావళి పీఠిక ( 1918)|2. ప్రబంధ రత్నావళి పీఠిక ( 1918)]]}} |{{DJVU page link|33|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/3. చారుచర్య - ఉపోద్ఘాతము (1922)|3. చారుచర్య - ఉపోద్ఘాతము (1922)]]}} |{{DJVU page link|58|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/4. శ్రీకాకుళ శ్రీహరిశతక పీఠిక (1923)|4. శ్రీకాకుళ శ్రీహరిశతక పీఠిక (1923)]]}} |{{DJVU page link|62|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/5. భగవదఙ్ఞుకము - తొడిమ (1924)|5. భగవదఙ్ఞుకము - తొడిమ (1924)]]}} |{{DJVU page link|70|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/6. ఉద్భటారాధ్య చరిత్ర పీఠిక (1925)|6. ఉద్భటారాధ్య చరిత్ర పీఠిక (1925)]]}} |{{DJVU page link|79|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/7. మనుచరిత్ర పీఠిక (1926)|7. మనుచరిత్ర పీఠిక (1926)]]}} |{{DJVU page link|98|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/8. ప్రతిమా నాటకము - తొలిపలుకు (1910- 1927)|8. ప్రతిమా నాటకము - తొలిపలుకు (1910- 1927)]]}} |{{DJVU page link|130|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/9. బసవ పురాణము - పీఠిక (1926)|9. బసవ పురాణము - పీఠిక (1926)]]}} |{{DJVU page link|134|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/10. బసవోదాహరణము - తొలిపలుకు (1928)|10. బసవోదాహరణము - తొలిపలుకు (1928)]]}} |{{DJVU page link|300|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/11. నీతిద్విషష్టిక - ఉపోద్ఘాతము (1981)|11. నీతిద్విషష్టిక - ఉపోద్ఘాతము సంస్కృత (1928) రచనకు తెలుగు అనువాదము (1981)]]}} |{{DJVU page link|301|31}} }} పరిశిష్టము {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/12. కర్ణభారము - తొలిపలుకు (1913)|12. కర్ణభారము - తొలిపలుకు (1913)]]}} |{{DJVU page link|311|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/13. మధ్యమ వ్యాయోగము - తొలిపలుకు (1913)|13. మధ్యమ వ్యాయోగము - తొలిపలుకు (1913)]]}} |{{DJVU page link|312|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/14. చాటుపద్య మణిమంజరి - తొలిపలుకు|14. చాటుపద్య మణిమంజరి - తొలిపలుకు]]}} |{{DJVU page link|313|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/15. భగవదజ్జుకము (ఉపోద్ఘాతము - సంస్కృతము) (1925)|15. భగవదజ్జుకము (ఉపోద్ఘాతము - సంస్కృతము) (1925)]]}} |{{DJVU page link|313|31}} }} {{dotted TOC page listing| |{{sc|[[వేటూరివారి పీఠికలు/మొదటిభాగము/16. నీతిద్విషష్టిక (ఉపోద్ఘాతము - సంస్కృతము) (1928)|16. నీతిద్విషష్టిక (ఉపోద్ఘాతము - సంస్కృతము) (1928)]]}} |{{DJVU page link|313|31}} }}<noinclude><references/></noinclude> 8wjqpss0h6v0ltw7nr3pcji9pwpu5pb పుట:శతకంఠరామాయణము (మర్దనకవి).pdf/1 104 196967 564671 516496 2026-07-15T11:28:26Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 564671 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|శ్రీరస్తు}} {{p|ac|fwb|fs150}}శతకంఠరామాయణము</p> {{Center|అను నామాంతరముగల}} {{p|ac|fs125}}సీతావిజయము</p> {{p|ac|fwb}}మర్దనకవిప్రణీతము</p> {{Css image crop |Image = శతకంఠరామాయణము (మర్దనకవి).pdf |Page = 1 |bSize = 600 |cWidth = 170 |cHeight = 184 |oTop = 390 |oLeft = 292 |Location = center |Description = }} {{Center|చెన్నపురి}} {{p|ac|fwb}}వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ సన్స్{{ZWNJ}}వారిచేఁ</p> {{Center|బ్రకటితము}} {{Center|1926}} {{Center|All Rights Reserved.}}<noinclude><references/></noinclude> af4u6oopj6wlat3b3e726239y7un2q1 పుట:శతకంఠరామాయణము (మర్దనకవి).pdf/2 104 196968 564608 516497 2026-07-15T06:22:27Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 564608 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{p|fs125|ac}}పీఠిక.</p> సీతావిజయము, శతముఖ రామాయణము, శతకంధర రామాయణమునను మాఱుపేరులుగల యీ రామాయణము మూడుప్రతులనుబట్టి సిద్ధము చేయఁబడినది. అందు మొదటిది ఆంధ్ర పరిషత్పుస్తక భాండాగారములోని కాగితపుప్రతి. రెండవది తాళపత్రప్రతి. మూడవది విశాఖపట్టణపు ముద్రితప్రతి. పరిషత్ప్రతి, గోదావరి మండలములోని, అమలాపురముతాలూకాలోని అల్లవరములో గుబ్బల సుబ్బారాయఁడుగారు 1908 సంవత్సరమున వ్రాసినది. రెండవ తాళపత్రప్రతి హేమలంబి సం॥ ఫాల్గున బ 14 లగాయతు విలంబి సం॥ చైత్ర శు 12 వఱకు పళ్య పిచ్చెయ్యగారు వ్రాసినది. మూఁడవది 1904 సం॥ నచ్చుపడినది. ఈ గ్రంథము యొక్క కర్తలనామములను గుఱించి కొంత వివాదమున్నది. తాళపత్ర ప్రతిలో, ముద్రితప్రతిలో, దొరతనమువారి పుస్తకభాండాగారములోని 8:3-2-18 లోను మర్దయకవియనియు, పరిషత్ప్రతిలోను, దొరతనమువారి పుస్తక ఖాండాగారములోని K. 1.44లో లింగకవియనియు నున్నది. మఱియు సంచికల 12.1-37 లింగయ్య రంగయ్య కవులచే రచియింపబడినదని ముద్రితపట్టిక లోనున్నది. కీ. శే. కందుకూరి వీరేశలింగము పంతులుగారి కవుల చరిత్రములో లింగకవి గంగకవి యను నిరువురుకవులు రచించినట్లుగలదు. కవుల చరిత్రములోని వాక్యము లీక్రింద నిచ్చుచున్నారము. "ఈయిరువురు కవులునుంజేరి సీతావిజయమును నామాంతరము గల శతముఖ రామాయణమును రచించిరి. ఈయిరువురుకవులు వేదాద్రిపురనివాసులు. వీరిలో నీలకంఠోపాసకుడైన లింగకవి తాను రచించిన మొదటి మూఁడాశ్వాసములను చిన్నారెడ్డి పుత్రుడగు పోచనృపాలున కంకితము చేసిను. సృసింహోపాసకుండగు గంగకవి తానురచించిన నాల్గవయాశ్వాసమఁను భోగనృపాలుని కంకితము చేసెను. ఈయిరువుర కవిత్వమును మొత్తముమీఁద ధనవంతమై నిర్దు<noinclude><references/></noinclude> f5crc5w784a0j5x8gshil062stdhimy 564670 564608 2026-07-15T11:22:56Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 564670 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|fs125|ac}}పీఠిక</p> సీతావిజయము, శతముఖ రామాయణము, శతకంధర రామాయణమునను మాఱుపేరులుగల యీ రామాయణము మూఁడుప్రతులనుబట్టి సిద్ధము చేయఁబడినది. అందు మొదటిది ఆంధ్ర పరిషత్పుస్తకభాండాగారములోని కాగితపుప్రతి. రెండవది తాళపత్రప్రతి. మూఁడవది విశాఖపట్టణపు ముద్రితప్రతి. పరిషత్ప్రతి, గోదావరి మండలములోని, అమలాపురముతాలూకాలోని అల్లవరములో గుబ్బల సుబ్బారాయఁడుగారు 1908 సంవత్సరమున వ్రాసినది. రెండవ తాళపత్రప్రతి హేమలంబి సం॥ ఫాల్గున బ 14 లగాయతు విలంబి సం॥ చైత్ర శు 12 వఱకు పళ్య పిచ్చెయ్యగారు వ్రాసినది. మూఁడవది 1904 సం॥ నచ్చుపడినది. ఈ గ్రంథము యొక్క కర్తలనామములను గుఱించి కొంతవివాదమున్నది. తాళపత్ర ప్రతిలో, ముద్రితప్రతిలో, దొరతనమువారి పుస్తకభాండాగారములోని 8:3-2-18 లోను మర్దయకవియనియు, పరిషత్ప్రతిలోను, దొరతనమువారి పుస్తకభాండాగారములోని K. 1.44లో లింగకవియనియు నున్నది. మఱియు నందే కల 12.1-37 లింగయ్య రంగయ్య కవులచే రచియింపబడినదని ముద్రితపట్టికలో నున్నది. కీ. శే. కందుకూరి వీరేశలింగము పంతులుగారి కవులచరిత్రములో లింగకవి గంగకవి యను నిరువురుకవులు రచించినట్లుగలదు. కవులచరిత్రములోని వాక్యము లీక్రింద నిచ్చుచున్నారము. "ఈయిరువురు కవులునుంజేరి సీతావిజయమను నామాంతరము గల శతముఖరామాయణమును రచించిరి. ఈయిరువురుకవులు వేదాద్రిపురనివాసులు. వీరిలో నీలకంఠోపాసకుడైన లింగకవి తాను రచించిన మొదటి మూఁడాశ్వాసములను చిన్నారెడ్డి పుత్రుడగు పోచనృపాలున కంకితము చేసెను. సృసింహోపాసకుండగు గంగకవి తానురచించిన నాల్గవయాశ్వాసమును భోగనృపాలుని కంకితము చేసెను. ఈయిరువుర కవిత్వమును మొత్తముమీఁద రసవంతమై నిర్దు<noinclude><references/></noinclude> p2yxopcp9rsqzb99uznyv5es64j42a7 పుట:శతకంఠరామాయణము (మర్దనకవి).pdf/3 104 196969 564609 516498 2026-07-15T06:28:43Z Rajasekhar1961 50 564609 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ష్టమై హృదయంగమముగానున్నది. ఈకవు లిన్నూఱుసంవత్సరములకు ముందున్నట్లు తెలియవచ్చుచున్నది." అని. మూఁడు వ్రాతప్రతులలో మర్దనకవి యనియుండుటచే నెక్కుడు ప్రతులలోనున్నదని యాపేరేయుంచినారము. ఈచిక్కున కంతకును గారణము పీఠిక కృత్యాదిపద్యము లొక్క ప్రతిలోను లేకుండుటయే కావున, వాస్తవముు తేలదు. ఎంతవఱకు లింగనకవిత్వమో యెంతవఱకు గంగనదో, రంగనదో విడదీయులుకు వలనుగా లేదు. ఆట్లే పోచనృపాలునికిఁ గృతియెంతవతిలో భోగనృపాలున కెంతవుకో బొత్తిగాఁ తెలియవచ్చుటలేదు, ద్వికవకావ్య మొక్కటి జీంగకనిది పరిషత్పుస్తక ఖాండాగారములోనున్నది. విషయనిర్ధారణము వీఠిక పద్యములు చది వినవేత్తలు చేయవలయును. మనయాంధ్రకవులు గృజ్యాది నిష్టదేవతా వందనములు కృతిపతికృతికర్తల సంశావళులు వర్ణించుటలో నెంతపట్టు రంగలనారో; యష్లే మన వ్రాయసకాండ్రుసు నీకిక పద్యములను దొలఁగించి ప్రతులు వ్రాయుటలో సంతపట్టుదలగలవారు. చారిత్రక విషయమునందు బొత్తిగా విముఖులగుటకుఁ జిరిబిల్లు చున్నాడము. ఈ గ్రంథమునందలి శవవధోరణినిబట్టి మాత్రము పలువురు రచించినట్లూ హీఁడఁదగును. కవుల చరిత్రము పొడుశ ప్ర కారము “మొత్తథ్యునిటి కసవంతమైనదని" చెప్పినను గద్యములోని గ తానుస్వయముగ, బ్రతికాశాలినని వ్రాసికొన్నను. అంతమంచిధోరణి గలరిగా నగపడదు. ఔచిత్యము, సందర్భము తక్కువగానున్న భాగ ములు కొన్ని గలవు. అపప్రయోగములు "అల్కతో, కొన్ని బ్దములకు, పిక్కపై సొక్కు, ముఖతీక్షణాస్త్ర వివిధాళుగము, క్షీరాబ్ధి దాంట వ్వల౯, నీకు గొబ్బుననిత్తుమ్, చిత్ర గంఢిట్లనియెన్, భూమంతటగా, బల స్ఫూర్తింజనుంచేర, రక్షోరము రథంబు, నిల్చికురించే మహాస్త్రవర్ష ను., దనుజుఁడోనర్చు బాణములు" మొదలైనవిగలవు. పురపురం శ్రీ జనులు గీతను స్తుతించుట పారిజాతాపహరణములోని స్వర్ణస్త్రీల వర్ణ సమువ లెం. గఈఁబడుచున్నది. కొన్ని పద్యములు సంస్కృత జటిలము బై యున్ననీ, నినరసభూయిష్టములుగాఁ గొన్ని గలవు, పాఠకులు గ్రహింహా గలకు.<noinclude><references/></noinclude> nuq95qu504usdh5yr1kky54l8clrdgi పుట:శతకంఠరామాయణము (మర్దనకవి).pdf/5 104 196971 564673 516500 2026-07-15T11:50:25Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 564673 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" />5</noinclude>శ్రమపడి ఈప్రస్తుతప్రతిని సిద్ధము చేసినారము. కాని పాఠకులనిమిత్తమై యతిశీఘ్రముగా ముద్రించుటచే నక్కడక్కడఁ గొన్ని లోపము లుండవచ్చును. పాఠకులు మాశ్రమకుఁ దగినఫలము గలుగునట్లు బ్రోత్సహింతురు గాకయని కోరుచున్నారము. :తండయార్పేట :చెన్నపట్నము {{right|ఇట్లు,}} {{right|వావిళ్ల. రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్,}}<noinclude><references/></noinclude> my6u3r7jemrb8vqxvsgf5ng900ntai1 పుట:తెలంగాణ రుచులు.pdf/3 104 207740 564517 546162 2026-07-14T13:59:27Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 564517 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{Css image crop |Image = తెలంగాణ_రుచులు.pdf |Page = 3 |bSize = 464 |cWidth = 438 |cHeight = 287 |oTop = -4 |oLeft = 5 |Location = center |Description = }} {{p|fs125|ac}}TELANGANA RUCHULU</p> {{c|(Authentic Cuisine and Recipes of Telangana)}} {{c|Collected and Written by}} {{c|'''Jyothi Valaboju'''}} {{c|Ph 80963 10140}} {{c|Edited by}} {{c|'''Dr. Mamidi Harikrishna'''}} {{c|Director, Dept. of Language and Culture}} {{c|Dept. of Language and Culture}} {{c|First Edition: May 2019}} {{c|Revised in September, 2023}} {{c|Copies: 1000}} {{c|ISBN No. 978-81-936452-7-7}} {{c|Book Price Rs. 300/-}} {{c|Layout & Design}} {{c|'''K. Ravi Prabha, Ph: 93999 32729, 9666608835'''}} {{c|Mahy Bezawada, Ph: 97059 72222}} {{c|Publishers & For copies}} {{c|'''The Director.'''}} {{c|Dept. of Language and Culture,}} {{c|Kalabhavan, Ravindra Bharathi, Hyderabad.}} {{c|Printed at}} {{c|'''Sai Likhita Printers'''}} {{c|Khairatabad, Hyderabad.}} {{c|Ph: 7207045979}}<noinclude><references/></noinclude> qitovjugizfobgb610ryrqzx1sdstgo పుట:తెలంగాణ రుచులు.pdf/4 104 207741 564518 546163 2026-07-14T14:04:25Z శ్రీరామమూర్తి 1517 /* మూల్యాంకన చేసారు */ 564518 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude> {{c|<big>'''ధన్యవాదములు '''</big>}} {{Css image crop |Image = తెలంగాణ_రుచులు.pdf |Page = 4 |bSize = 464 |cWidth = 273 |cHeight = 266 |oTop = 111 |oLeft = 93 |Location = center |Description = }} {{c|తెలంగాణా అస్తిత్వ పతాక}} {{c|తెలంగాణా ఆత్మగౌరవ ప్రతీక }} {{c|<big><big>'''మాన్యులు గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు '''</big></big>}} {{c|ముఖ్యమంత్రివర్యులు గారికి}} {{right|ధన్యవాదములతో...}} {{right|<big>'''డా॥ మామిడి హరికృష్ణ '''</big>}}<noinclude><references/></noinclude> kndedjhnpws8huo852q1kejy87u4frx పుట:తెలంగాణ రుచులు.pdf/5 104 207742 564519 546164 2026-07-14T14:07:50Z శ్రీరామమూర్తి 1517 /* మూల్యాంకన చేసారు */ 564519 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{Css image crop |Image = తెలంగాణ_రుచులు.pdf |Page = 5 |bSize = 464 |cWidth = 414 |cHeight = 534 |oTop = 23 |oLeft = 24 |Location = center |Description = }} {{rh|||<big>'''-డా॥ మామిడి హరికృష్ణ'''</big>}}<noinclude><references/></noinclude> kqr66a4rxm9m5qlfiu4pi4s3f3eikmg 564520 564519 2026-07-14T14:09:32Z శ్రీరామమూర్తి 1517 564520 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude> {{Css image crop |Image = తెలంగాణ రుచులు.pdf |Page = 5 |bSize = 600 |cWidth = 595 |cHeight = 773 |oTop = 1 |oLeft = 3 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> 6pc3nnbtvu9wsq1xy2qk0s1cdd3wkcm పుట:తెలంగాణ రుచులు.pdf/7 104 207744 564523 546165 2026-07-14T14:11:01Z శ్రీరామమూర్తి 1517 /* మూల్యాంకన చేసారు */ 564523 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{Css image crop |Image = తెలంగాణ_రుచులు.pdf |Page = 7 |bSize = 464 |cWidth = 449 |cHeight = 605 |oTop = -7 |oLeft = 2 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> abudzml1glcrizbfsps66wfpa455v6m పుట:తెలంగాణ రుచులు.pdf/8 104 207745 564524 546179 2026-07-14T14:18:18Z శ్రీరామమూర్తి 1517 564524 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = తెలంగాణ_రుచులు.pdf |Page = 8 |bSize = 464 |cWidth = 141 |cHeight = 123 |oTop = 0 |oLeft = 161 |Location = center |Description = }} {{c|సంపాదకీయం}} {{center|{{p|fs150}}'''ఆహారమే సంస్కృతి!'''</p>}} {{c|అవును, "Food is Culture" !}} ఇదే పేరుతో 2006లో పుస్తకాన్ని రాసిన Massimo Montanari ఆహారానికి సంస్కృతికి, ఆహార సంస్కృతికి మధ్య నున్న అవినాభావ సంబంధాన్ని విస్తృతంగా పరిశీలించి సంస్కృతి అంటేనే ఆహారం అని అన్నాడు. ఆయన ఇటలీలోని Bologna University లో ప్రొఫెసర్‌గా Food Studies మీద విస్తృత పరిశోధనలు చేసి Italian Identity in the Kitchen or Food and the Nation పుస్తకాన్ని 2010లో, Medieval Tastes : Food, woking and the table అనే గ్రంథాన్ని 2015లో, Italian Cuisine: A Cultural History అనే గ్రంథాన్ని 2003లో రాసి "Culture is nothing but the food" అనే తన వాదాన్ని బలంగా వినిపించాడు. ఇక ప్రపంచంలోని అన్ని భాషలలో “సంస్కృతి" అనే పదానికి ఉన్నంత విస్తృతమైన అర్థం, విశాల దృక్పథం బహుశా మరే పదానికి లేదేమో. ఎందుకంటే మనిషి జీవన ప్రస్థానంలో ఎన్ని పరిణామాలు సంభవించాయో, వాటన్నింటి కలగలుపుగా, వాటన్నింటి అంతిమ రూపంగా నిలిచేదే సంస్కృతిగా చెప్పవచ్చు. ఒక నిర్దిష్ట సామాజిక జీవనంలో ప్రజలందరి సామూహిక అనుభవాలు, ఆచరణలు, వారు పాటించిన నియమాలు, నమ్మకాలు, విశ్వాసాలు అన్నీ కలిసి అంతిమంగా రూపొందే జీవన విధానమే సంస్కృతి (Lifestyle is Culture). అందుకే మాటలో చిన్నగా కనిపించి నప్పటికీ అర్ధం, భావం పరంగా అనంతమైన విశ్వాన్ని తన అంతరంగంలో మిళితం చేసుకున్న భావన సంస్కృతిలో కనిపిస్తుంది. ఆ లెక్కన సంస్కృతి అన్న దృగ్విషయంలో (Culture as a phenomam) సాహిత్యం, భాష, ఆటలు, క్రీడలు, వ్యక్తుల జిల్లా గ్రామాల పేర్లకు సంబంధించిన విశేషాలు, వేష భూషణాలు, వస్త్ర ధారణ, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు, పండుగలు, జీవిత చక్ర వేడుకలు (Life Cycle Celebrations), సంబరాలు, జాతరలు, కుటుంబ జీవన శైలులు, కులాలు, సామాజిక నిర్మాణాలు, చేతివృత్తులు, వస్తు సంస్కృతులు, వ్యవసాయం, కళలు, సంగీతం, సాహిత్యం, నృత్యం, పెళ్లిళ్లు, పేరంటాలు, శిల్పం, వాస్తు నిర్మాణం, గృహాలు, కట్టడాలు,భవనాలు, సౌధాలు, దేవాలయాలు, పర్యావరణ పరమైన విషయాలు, మతం, ఆరాధన, వైద్యం, ఆరోగ్యం, నమ్మకాలు,విశ్వాసాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లాంటివి కూడా అంతర్భాగమే! వీటితోపాటు ఆహారపుటలవాట్లు కూడా సంస్కృతి అన్న పదంలో నిబిడీకృతమై ఉంటాయి. ఇలా ఒక దేశ, జాతి, సమాజ సంస్కృతిని నిర్ధారించే అంశాలలో కొట్టొచ్చే విధంగా కనిపించే అంశాలు వస్త్రధారణ, వేషధారణ, భాషతోపాటు ఆహారపుటలవాట్లు, ఆహార తయారీ ప్రక్రియ వంటివి మూలాంశాలుగా పనిచేస్తాయి. ఆదిమ మానవుని కాలం నుంచి ఆహారపుటలవాట్లు అతని శారీరక, మానసిక అవసరానికి అనుకూలంగా ఉంటున్న విషయాల్ని పరిణామ శాస్త్రవేత్తలు (Evolutionists) నిర్ధారించారు. దీనికితోడు భూగోళం పైన ఉండే ఆయా భౌగోళిక, నైసర్గిక, శీతోష్ణస్థితి పరమైన పరిణామాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల మానవులకు ఆహారపుటలవాట్లు ఒనగూడుతాయని చెప్పారు. మానవ శరీర నిర్మాణంలోని దంత నిర్మాణం, జీర్ణ వ్యవస్థ, కండర వ్యవస్థ, ఆస్థి పంజర వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, చేతులు పాదాల నిర్మాణం. వీటన్నిటి పరిణామం వెనుక ఉన్న ప్రధాన ప్రేరకం ఆహార సేకరణ, ఆహార పరి గ్రహణ, ఆహార సంశ్లేషణగానే కనిపిస్తుంది. ఆదిమ మానవుడు ద్విపాద జీవిగా మారడానికి ముందు చతుష్పాద జీవిగా జంతువులాగా ఉన్నాడనేది మనకు తెలిసిందే. అలా చతుష్పాద జీవిగా (Quadripodal being) ఉన్న మానవుడు, ద్విపాద జీవిగా (Bi-podal being) మారుతున్న క్రమంలో దానికి తగిన ఆహార పరిగ్రహణ విధానం, దానికి అనుకూలంగానే అతనిలోని అంతర్గత జీవక్రియ వ్యవస్థలన్నీ (Metabolic systems) కూడా రూపొందాయి అనేది మానవ శరీర ధర్మ శాస్త్రవేత్తలు (Physiologists) చెబుతున్నారు. భూగోళం మీద భూమధ్య రేఖ ప్రాంతంలో, కర్కాటక మకర రేఖలకు ఆవల ఉన్న ప్రాంతంలో ధృవ మండలాలలోని శీతల ప్రాంతాలలో ఉన్న మానవులు ఆయా శీతోష్ణస్థితి పరిస్థితులకు అనువైన, అనుకూలమైన ఆహారపు అలవాట్లను చేసుకోవడం జరిగింది.<noinclude><references/> {{c|iii}}</noinclude> hfjxibv68365ukpcoi8lpbffprvv3r2 564525 564524 2026-07-14T14:21:56Z శ్రీరామమూర్తి 1517 /* మూల్యాంకన చేసారు */ 564525 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{Css image crop |Image = తెలంగాణ_రుచులు.pdf |Page = 8 |bSize = 464 |cWidth = 141 |cHeight = 123 |oTop = 0 |oLeft = 161 |Location = center |Description = }} {{c|సంపాదకీయం}} {{center|{{p|fs150}}'''ఆహారమే సంస్కృతి!'''</p>}} {{c|అవును, "Food is Culture" !}} ఇదే పేరుతో 2006లో పుస్తకాన్ని రాసిన Massimo Montanari ఆహారానికి సంస్కృతికి, ఆహార సంస్కృతికి మధ్య నున్న అవినాభావ సంబంధాన్ని విస్తృతంగా పరిశీలించి సంస్కృతి అంటేనే ఆహారం అని అన్నాడు. ఆయన ఇటలీలోని Bologna University లో ప్రొఫెసర్‌గా Food Studies మీద విస్తృత పరిశోధనలు చేసి Italian Identity in the Kitchen or Food and the Nation పుస్తకాన్ని 2010లో, Medieval Tastes : Food, woking and the table అనే గ్రంథాన్ని 2015లో, Italian Cuisine: A Cultural History అనే గ్రంథాన్ని 2003లో రాసి "Culture is nothing but the food" అనే తన వాదాన్ని బలంగా వినిపించాడు. ఇక ప్రపంచంలోని అన్ని భాషలలో “సంస్కృతి" అనే పదానికి ఉన్నంత విస్తృతమైన అర్థం, విశాల దృక్పథం బహుశా మరే పదానికి లేదేమో. ఎందుకంటే మనిషి జీవన ప్రస్థానంలో ఎన్ని పరిణామాలు సంభవించాయో, వాటన్నింటి కలగలుపుగా, వాటన్నింటి అంతిమ రూపంగా నిలిచేదే సంస్కృతిగా చెప్పవచ్చు. ఒక నిర్దిష్ట సామాజిక జీవనంలో ప్రజలందరి సామూహిక అనుభవాలు, ఆచరణలు, వారు పాటించిన నియమాలు, నమ్మకాలు, విశ్వాసాలు అన్నీ కలిసి అంతిమంగా రూపొందే జీవన విధానమే సంస్కృతి (Lifestyle is Culture). అందుకే మాటలో చిన్నగా కనిపించి నప్పటికీ అర్ధం, భావం పరంగా అనంతమైన విశ్వాన్ని తన అంతరంగంలో మిళితం చేసుకున్న భావన సంస్కృతిలో కనిపిస్తుంది. ఆ లెక్కన సంస్కృతి అన్న దృగ్విషయంలో (Culture as a phenomam) సాహిత్యం, భాష, ఆటలు, క్రీడలు, వ్యక్తుల జిల్లా గ్రామాల పేర్లకు సంబంధించిన విశేషాలు, వేష భూషణాలు, వస్త్ర ధారణ, సంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు, కట్టుబాట్లు, పండుగలు, జీవిత చక్ర వేడుకలు (Life Cycle Celebrations), సంబరాలు, జాతరలు, కుటుంబ జీవన శైలులు, కులాలు, సామాజిక నిర్మాణాలు, చేతివృత్తులు, వస్తు సంస్కృతులు, వ్యవసాయం, కళలు, సంగీతం, సాహిత్యం, నృత్యం, పెళ్లిళ్లు, పేరంటాలు, శిల్పం, వాస్తు నిర్మాణం, గృహాలు, కట్టడాలు,భవనాలు, సౌధాలు, దేవాలయాలు, పర్యావరణ పరమైన విషయాలు, మతం, ఆరాధన, వైద్యం, ఆరోగ్యం, నమ్మకాలు,విశ్వాసాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లాంటివి కూడా అంతర్భాగమే! వీటితోపాటు ఆహారపుటలవాట్లు కూడా సంస్కృతి అన్న పదంలో నిబిడీకృతమై ఉంటాయి. ఇలా ఒక దేశ, జాతి, సమాజ సంస్కృతిని నిర్ధారించే అంశాలలో కొట్టొచ్చే విధంగా కనిపించే అంశాలు వస్త్రధారణ, వేషధారణ, భాషతోపాటు ఆహారపుటలవాట్లు, ఆహార తయారీ ప్రక్రియ వంటివి మూలాంశాలుగా పనిచేస్తాయి. ఆదిమ మానవుని కాలం నుంచి ఆహారపుటలవాట్లు అతని శారీరక, మానసిక అవసరానికి అనుకూలంగా ఉంటున్న విషయాల్ని పరిణామ శాస్త్రవేత్తలు (Evolutionists) నిర్ధారించారు. దీనికితోడు భూగోళం పైన ఉండే ఆయా భౌగోళిక, నైసర్గిక, శీతోష్ణస్థితి పరమైన పరిణామాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల మానవులకు ఆహారపుటలవాట్లు ఒనగూడుతాయని చెప్పారు. మానవ శరీర నిర్మాణంలోని దంత నిర్మాణం, జీర్ణ వ్యవస్థ, కండర వ్యవస్థ, ఆస్థి పంజర వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, చేతులు పాదాల నిర్మాణం. వీటన్నిటి పరిణామం వెనుక ఉన్న ప్రధాన ప్రేరకం ఆహార సేకరణ, ఆహార పరి గ్రహణ, ఆహార సంశ్లేషణగానే కనిపిస్తుంది. ఆదిమ మానవుడు ద్విపాద జీవిగా మారడానికి ముందు చతుష్పాద జీవిగా జంతువులాగా ఉన్నాడనేది మనకు తెలిసిందే. అలా చతుష్పాద జీవిగా (Quadripodal being) ఉన్న మానవుడు, ద్విపాద జీవిగా (Bi-podal being) మారుతున్న క్రమంలో దానికి తగిన ఆహార పరిగ్రహణ విధానం, దానికి అనుకూలంగానే అతనిలోని అంతర్గత జీవక్రియ వ్యవస్థలన్నీ (Metabolic systems) కూడా రూపొందాయి అనేది మానవ శరీర ధర్మ శాస్త్రవేత్తలు (Physiologists) చెబుతున్నారు. భూగోళం మీద భూమధ్య రేఖ ప్రాంతంలో, కర్కాటక మకర రేఖలకు ఆవల ఉన్న ప్రాంతంలో ధృవ మండలాలలోని శీతల ప్రాంతాలలో ఉన్న మానవులు ఆయా శీతోష్ణస్థితి పరిస్థితులకు అనువైన, అనుకూలమైన ఆహారపు అలవాట్లను చేసుకోవడం జరిగింది.<noinclude><references/> {{c|iii}}</noinclude> d9wl2wrmatlcwa2tz999kfonsrd8xah పుట:తెలంగాణ రుచులు.pdf/9 104 207746 564526 546180 2026-07-14T14:22:14Z శ్రీరామమూర్తి 1517 /* మూల్యాంకన చేసారు */ 564526 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude> ముఖ్యంగా భూమధ్య రేఖ (Equalor) ప్రాంతంలో ఉన్న మానవులు ఎండ తీక్షణతని, సూర్య ప్రతాపాన్ని తట్టుకోగలిగేలా శరీరాన్ని, శరీరంలోని అంతర్గత జీవక్రియ వ్యవస్థలను చల్లబరచే విధంగా ఉండే ఆహారాలను స్వీకరించడం ప్రారంభించారు. అలాగే శీతల మండలాలలో, మంచు ప్రాంతాలలో ఉండే మానవులు తమ శరీరంలో ఉష్ణోగ్రతని పెంచగలిగే ఆహారాన్ని స్వీకరించడం, సమశీతోష్ణ మండల ప్రాంతంలో ఉండే మానవులు నైసర్గిక పరిస్థితులకి, భౌగోళిక పరిణామాలకి తమ శారీరక స్థితికి సమన్వయం చేయగలిగే ఆహారాలను స్వీకరించడం జరిగింది. అందుకే ప్రపంచ “మానవ నాగరికత ప్రస్థానం అంతా ఆహార ప్రస్థానమే” (All in all, the journey of human civilitation is happened in consoumance with the journey of the food) అని కొందరు వ్యాఖ్యానిస్తారు. మానవ పరిణామ క్రమాన్ని పర్యావరణ పరంగా, భౌగోళిక, నైసర్గిక పరంగా విశ్లేషిస్తున్న క్రమంలో, ఆయా కాలాలలో, ఆయా ప్రాంతాలలో, ఆయా దేశాలలో రూపుదిద్దుకున్న ఆహారపు అలవాట్లు కూడా క్రియాశీల పాత్ర పోషిస్తాయి. అందుకే దాదాపు పదివేల ఏళ్ళ పూర్వం నదీలోయ ప్రాంతాలలో స్థిరనివాసం ఏర్పరచుకొని సామూహిక జీవనానికి శ్రీకారం చుట్టిన మానవుడు వ్యవసాయాన్ని కనుక్కొని తనకు అవసరమైన ఆహారాన్ని తాను ఉన్నచోటనే పండించుకోవడం ప్రారంభించాడు. ఇదే సందర్భంలో భూమి భ్రమణ, పరిభ్రమణల కారణంగా ఏర్పడే ఋతు చక్రాలు, కాల గమనాలను అనుసరించి పంటలను పండించడం, వ్యవసాయాన్ని నిర్వహించడమే కాక ఆహారపుటలవాట్లను ఆయా కాలాలకు, ఋతువులకు అనుగుణంగా రూపొందించుకున్నాడు. వేసవి, వర్షం, శీతాకాలం, శిశిరం ఇలా నాలుగు ప్రధాన కాలాలలో సంభవించే శీతోష్ణస్థితి నైసర్గిక పరిణామాలకు తట్టుకునేలాగా తన శారీరక స్థితిని, జీవక్రియలను కొనసాగించడానికి ఆహారాన్ని ప్రధాన వనరుగా మలచుకున్నాడు. శీతల కాలంలో హృదయాన్ని శరీరాన్ని వెచ్చ పరిచే ఆహారాన్ని తీసుకోవడం, వేసవికాలంలో తన దేహాన్ని చల్లబరిచడానికి వీలుగా ఉండే ఆహారాన్ని పండించడం. దాన్ని తీసుకోవడం ద్వారా ఋతువులలో సంభవించే పరిణామాలని తట్టుకునేలా తనని తాను మలుచుకున్నాడు. ఇలా మనిషి మనుగడలో, మనిషి కొనసాగింపుకు తను తీసుకున్న ఆహారం, తను ఎంపిక చేసుకున్న ఆహారం కారణభూతం కావడమే కాక, భూమిపై మానవ జీవన ప్రస్థానానికి కారకంగా, ప్రేరకంగా నిలిచింది. అయితే మానవ జీవన ప్రవాహంలో 13వ శతాబ్దం వరకు ఉన్న జీవన విధానం అంతా ఒకలా ఉంటే 14, 15 శతాబ్దాల కాలంలో సంభవించిన భౌగోళిక పరిశోధనలు, (Geographical Researches) నూతన ఖండాల ఆవిష్కరణలు (Discovery of new continents) ద్వారా కొత్త ప్రదేశాల అన్వేషణలు వంటివి గొప్ప మలుపు తిప్పాయని చెప్పవచ్చు. అలాగే 15వ శతాబ్దంలో సంభవించిన సాంస్కృతిక పునరుజ్జీవనం (Cultural Renaissance) కళాత్మక, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో అలాగే ఆహారపుటలవాట్లకు సంబంధించిన ఆదాన ప్రదానాలలో ఒక గొప్ప మలుపు ను తీసుకొచ్చింది. 16వ శతాబ్దంలో యూరప్ లో సంభవించిన శాస్త్రీయ విప్లవం (Scientific Revolution), 17వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం (Industrial Revolution) గా దారితీసి సాంకేతిక పరిజ్ఞానానికి బలమైన పునాదులను ఏర్పరిచింది. 19వ శతాబ్దంలో ప్రారంభమైన ఆధునిక సాంకేతికత అనూహ్యమైన ప్రగతి ఫలాలను మానవాళికి అందించి, 21వ శతాబ్దపు ప్రథమార్థం నాటికి ప్రపంచాన్నంతా ఒక కుగ్రామంగా మార్చేసింది. సమాచార విప్లవం (Communication Revolution), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా సంభవించిన పరిణామాలు, ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు విస్తరిల్లిన నేటి కాలంలో విశ్వజనీన సంస్కృతులు సరికొత్తగా పొడసూపుతూ ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ దేశాలు, ప్రాంతాలు, జాతులు తమ ప్రత్యేకతని వారి అస్తిత్వాన్ని కొనసాగించడానికి దోహదపడ్తున్న అంశాలలో ఆహారపుటలవాట్లు ప్రధాన సూచికగా నిలుస్తున్నాయి (Food Habits have become an indicator to the identity of a nation, race and country now). ఇక చరిత్రలోకి తొంగిచూస్తే మానవజాతి పరిణామాన్ని ప్రభావితం చేసి, మలుపు తిప్పిన అంశాలన్నింటికీ ఆహారము, ఆహార సంబంధిత అంశాలు ప్రధాన కారణంగా నిలవడం ఒకింత ఆశ్చర్యమే అయినప్పటికీ సత్యదూరం కాదు. ఉదాహరణకి 14వ శతాబ్దం నాటి ప్రాపంచిక పరిస్థితిని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఆనాటి ప్రపంచానికి భూమి పరంగా తెలిసిన ఖండాలు యూరప్, ఆసియాలు మాత్రమే! యూరప్కి ఆసియా దేశాల మధ్య భూమార్గం ద్వారా వర్తక, వ్యాపారాలు, వాణిజ్య వ్యవహారాలు, ఆదాన ప్రదానాలు జరుగుతూ ఉండేవి. ఒక దేశానికి సంబంధించిన చక్రవర్తులు తమ భూభాగాలను కాపాడుకోవడం, దానికి అనువుగా రథ, గజ, తుర, పదాతి దళాలను, అశ్విక దళాలను సమకూర్చుకోవడం ఆయా దేశాల బలానికి చిహ్నంగా ఉండేది. దానికి తోడు ఆసియా ఖండంలో ముఖ్యంగా భారతదేశంలో పండే సుగంధ ద్రవ్యాలు (Spices) యూరప్లో ఎంతో వ్యాపారాన్ని చేస్తూ ఉండేవి. యూరపు ప్రాంతంలోని భౌగోళిక నైసర్గిక పరిస్థితులు లవంగాలు, సాజీర, దాల్చిన చెక్క, యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలను పండించడానికి అనువుగా ఉండేవి కావు. ఇలాంటి మసాలా ద్రవ్యాలకు అనువైన నేలగా, సానుకూల క్షేత్రంగా ఉన్నది భారతదేశం. అందుకే స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, పోర్చుగల్, లాంటి దేశాలకు చెందిన వ్యాపారులంతా ప్రజలలో సుగంధద్రవ్యాల పట్ల ఉన్న ఆకర్షణను, మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని భారతదేశం నుంచి సుగంధ ద్రవ్యాలను భూమార్గం ద్వారా తీసుకెళుతూ తమ దేశాలలో వ్యాపారం చేస్తూ ఇబ్బడిముబ్బడిగా లాభాలను ఆర్జించే వారు. ఇలా యూరప్ కు - భారతదేశానికి మధ్య వ్యాపార వాణిజ్య వ్యవహారాలు 1453 వరకు నిరాటంకంగా జరిగాయి. కానీ 1453లో యూరప్కు ఆసియాకు మధ్య వారధిగా ఉండే కాన్ స్టాంటినోపుల్ నగరాన్ని ఆటోమాన్<noinclude><references/> {{c|iv}}</noinclude> 9zpts2izwxvhcijp788g7buwmenvlvv పుట:తెలంగాణ రుచులు.pdf/10 104 207747 564527 546182 2026-07-14T14:22:34Z శ్రీరామమూర్తి 1517 /* మూల్యాంకన చేసారు */ 564527 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude> తురుష్కులు గెలుచుకున్న తర్వాత, వారు నగరాన్ని దిగ్బంధనం చేసి యూరప్ ఆసియాల మధ్య రాకపోకలను నియంత్రించారు. దాంతో భారతదేశంలో మాత్రమే పండే సుగంధద్రవ్యాల ఎగుమతులు యూరప్ కు నిలిచిపోయాయి. దానివల్ల యూరప్ లోని వ్యాపారస్థులు దివాళా తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవైపు యూరప్ ప్రజల డిమాండ్, మరొకవైపు సుగంధ ద్రవ్యాలను తీసుకెళ్ల లేని పరిస్థితి! దీనివల్ల స్పెయిన్, పోర్చుగల్, హాలండ్, ఇటలీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన వ్యాపారులు అక్కడి చక్రవర్తులను అభ్యర్థించి, ఒత్తిడి చేసి భారతదేశానికి వెళ్ళడానికి కావలసిన ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుక్కోవడం కోసం సముద్ర మార్గాన్ని అన్వేషించాల్సిందిగా అభ్యర్థించారు. ఫలితంగానే కొలంబస్ (1492లో), వాస్కోడిగామా (1498), అమెరిగో వెస్పూసి, జాన్ కాబట్, బార్తలో మ్యూ డియాస్, మాజిలాన్ వంటి నావికులు ఎంతో సాహసోపేతంగా సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి యూరప్ నుంచి మార్గాన్ని కనుక్కునే ప్రయత్నం మొదలెట్టారు. వీటి ఫలితంగానే అప్పటివరకూ ప్రపంచానికి తెలియని ఎన్నో విశేషాలు తెలిసి వచ్చాయి: 1. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలు, ఆఫ్రికా ఖండం, ఆస్ట్రేలియా ఖండం కొత్తగా వెలుగులోకి వచ్చాయి. 2. భూమి గుండ్రంగా ఉంటుందనే విషయం మొట్టమొదటిసారిగా సహేతుకంగా, అనుభవపూర్వకంగా నిరూపించబడింది. ప్రపంచంలో సముద్ర మార్గం ద్వారా భూమిని చుట్టి వచ్చిన మొదటి మానవుడిగా మాజిలాన్ రికార్డు సృష్టించాడు. 3. యూరప్ దేశాల వలస వాదానికి (Colonialism) కొత్త ఖండాలలో యూరప్ దేశాల ఆధిపత్యానికి దారితీశాయి. ఇలా ప్రపంచ గమనాన్నే మార్చి వేసిన ప్రధానమైన పై పరిణామాలకు ఆది, పునాది భారతదేశంలోని సుగంధద్రవ్యాల ఆవశ్యకత యూరప్ ప్రజలకు ఉండటమే అని చెప్పవచ్చు. అంటే ఆహారానికి సంబంధించిన పంటల అలభ్యత వల్ల ఆహారపుటలవాట్లులోని కొనసాగింపు కోసం చేసిన ప్రయత్నాల వల్ల భూగోళంపైన అప్పటివరకూ తెలియని ఒక నూతన ప్రపంచం వెలుగులోకి వచ్చింది. అలా "Food and Culture : A Reader" Carole Counihan (1997) గ్రంథాన్ని వ్రాసిన Penny Van Esterik చెప్పిన Food and Culture takes a global look at the social, symbolic and political-economic role of food అన్న మాటలను నిజం చేస్తున్నాయి. దీనిని బట్టి ఆహారం, ఆహార వస్తువులు మానవ ప్రస్థానంలో ఎంత చోదకశక్తిగా (driving force) పని చేశాయో మనకు తెలిసిపోతుంది. అంతేగాక ప్రతి దేశానికి సంబంధించిన ఆహారం, దాని తయారీ విధానం (preparation......), వాటిలోని పోషక విలువలు (Nutritional Values) అన్నీ ఆయా దేశాల ప్రత్యేక గుర్తింపుగా (Special Identity), ఒక సాంస్కృతిక అస్తిత్వ పతాకగా (Cultural Indicator) నిలవడం గమనార్హం. అందుకే సంస్కృతిలో ఆహారం అంతర్భాగంగా ఉంటూ, ఒక దేశానికి గుర్తింపునిచ్చే కీలక కారకాలలో ఒకటిగా రూపుదిద్దుకుంది. దీనినే సామాజిక మానవ శాస్త్రవేత్తలు (Social Anthropologists) "మీ ఆహారాన్ని చెప్పండి మీ గురించి చెబుతాను" అని అంటారు. అలా ఒక దేశ జాతీయత, ఆహారం రెండూ కలిసిపోయి ఆదేశ వ్యక్తిత్వ వికాస సూచికలుగా నేడు గుర్తించబడ్డాయి. ప్రపంచం మొత్తం మీద ఉండే వైవిధ్యత, విభిన్నత అంతా ఆయా ప్రాంతాల ఆహారపుటలవాట్ల ఆధారంగా నిర్ధారించబడే స్థితికి ప్రస్తుతం చేరుకుంది. ఒక దేశ సంస్కృతి, ఆహారపుటలవాట్లు, ఆ దేశ అతిథ్యం ఈ మూడు అంశాలలో సామాజిక, మానసికపరమైన అంశాలు (Socio-psychological Elements) కూడా దాగి ఉన్నాయి. మరో మాటల్లో దీనినే You are what you eat అని కూడా చెప్పారు. అంటే మన ఆహారపుటలవాట్లు భోజనం చేసే తీరు, ఆహార ఎంపిక (Selection of Food) ను అనుసరించి మన వ్యక్తిత్వాన్ని, అభిరుచులు, మూర్తిమత్వాన్ని చెప్పొచ్చన్నమాట! ఒక నిర్దిష్ట ప్రాంతంలో లేదా దేశంలో నివసిస్తున్న ప్రజలు ఒక నిర్దిష్టమైన ఆహారపుటలవాట్లకు లోనై ఉంటారు. ప్రజలు తమ సంస్కృతులు ఆమోదించిన ఆహారాన్ని స్వీకరిస్తూ ఎదుగుతారు. దీనినే ఇవాన్ పావ్లోవ్ అనే శరీర ధర్మ శాస్త్రజ్ఞుడు, మనోవైజ్ఞానిక వేత్త (నోబెల్ పురస్కార గ్రహీత కూడా) "నిబంధన సిద్ధాంతం" (Theory of Conditioning) అని వివరించారు. ఆ సందర్భంలోనే ఆయన “Appetite, craving for food, is a constant and powerful stimulator" అని అన్నారు. ఒక జాతి ప్రజలు కొన్ని రకాల ఆహారాలను స్వీకరించడం, మరి కొన్ని ఆహారాల పట్ల వ్యతిరేక, ఉదాసీన, తిరస్కార అభ్యంతరకర భావాన్ని (Feelings of nagative, indifference, rejection, objection) కలిగి ఉండడం వెనుక ఉన్న ప్రధాన సూత్రం ఈ నిబంధన సిద్ధాంత విన్యాసమే అని చెప్పవచ్చు. ఆదిమ మానవుడు తన మనుగడ కోసం చేసే పోరాటంలో (Struggle for Existence) అన్ని రకాల ఆహారాలను శాకాహార, మాంసాహారం ఆఖరికి మానవ ఆహారాన్ని కూడా ఆరగించేవాడని తెలుస్తోంది. కానీ కాలక్రమంలో మాత్రమే కొన్ని ఆహారాలకే పరిమితం కావడం వెనక ఆయా దేశాలు, జాతుల సంస్కృతి, విశ్వాసాలు, నమ్మకాలు, అలవాట్లు ప్రధాన ప్రభావాన్ని చూపాయని చెప్పవచ్చు.<noinclude><references/> {{c|v}}</noinclude> lp0vhfez363hjcmyiu4sn5ocdejhu1i పుట:తెలంగాణ రుచులు.pdf/11 104 207748 564528 546183 2026-07-14T14:22:50Z శ్రీరామమూర్తి 1517 /* మూల్యాంకన చేసారు */ 564528 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude> తూర్పు ఆసియా దేశాలకు చెందిన ప్రజల ఆహారపుటలవాట్లు ఆసియా ఖండంలోనే ఇతర ప్రాంత ప్రజల ఆహారపు టలవాట్లకన్నా భిన్నంగా ఉండటం గమనించవచ్చు. ఇదే పరిస్థితి ప్రపంచమంతా ఇటాలియన్ ఫుడ్, స్పానిష్ ఫుడ్, మెక్సికన్ ఫుడ్, అమెరికన్ ఫుడ్, ఆఫ్రికన్ ఫుడ్లుగా ప్రత్యేకీకరణ సాధించడంలో మనకు కనిపిస్తుంది. "Food is not rational. Food is culture, habit, craving and identity” అని Everything is Illuminated (2002), We are the Weather Saving the planet Begins at Breakfast (2019) వంటి పుస్తకాల రచయిత Jonathan Safran Foer చెప్పినట్లుగా ఆహారం సాంస్కృతిక అస్తిత్వంగా మారిన తీరు మనకు అర్థం అవుతుంది. ఇక వందలాది సంవత్సరాలుగా ఒక జాతి ప్రజలు తరతరాలుగా ఆచరిస్తున్న ఆహారపుటలవాట్లలోంచి పుట్టిన రీతినే సంప్రదాయ ఆహారం (Traditional Food) అని చెప్పవచ్చు. ఒక జాతిలో వారసత్వంగా ఒనగూడే భాష, సంస్కృతి, సంప్రదాయాలు, వేషధారణ, వస్త్రాలంకరణ తో పాటు ఆహారం కూడా తనదైన ప్రత్యేకతతో, ప్రత్యేక వంట విధానంతో ఆ జాతికి సూచికగా నిలుస్తుంది. మరో మాటల్లో చెప్పాలంటే ఒక దేశానికి సంబంధించిన ఆహారం ఆ జాతి ప్రజల జాతీయతకి గర్వకారణంగా కూడా ఉంటుంది. అంతేగాక ఆ ప్రత్యేక ఆహారపు అలవాట్లు ఆ దేశ చరిత్రను, జీవనశైలిని, విలువలను, నమ్మకాలను కూడా తెలియపరుస్తాయి. అయితే గత శతాబ్దాల కాలంగా జరుగుతున్న పరిణామాలలో మానవుల వలసలు (Human Migration) ప్రధానంగా ప్రస్తావించదగినవి. ప్రజలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి విద్యా ఉద్యోగ, వ్యాపార వాణిజ్య, పర్యాటక అవసరాల కోసం వలస వెళుతున్న క్రమంలో వారు తమతో పాటు తమ భాషని, సంస్కృతిని మాత్రమే తీసుకు వెళ్లరు. వారితోపాటు వారి వంటలు, వారి భోజన విధానం, వారి ఆహారపుటలవాట్లు, ఆహార తయారీ ప్రక్రియలు అన్నిటినీ తమతోపాటు తీసుకువెళ్తారు. దీనివల్ల, ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధానంతరం వలసలు మరింత పెరిగి వివిధ దేశాలకు సంబంధించిన ఆహారాలు మరొక దేశానికి పరిచయం కావడం సంభవించింది. 17, 18వ శతాబ్దంలో బ్రిటిష్, ఫ్రెంచ్ ఇతర యూరప్ దేశాల వలసల వల్ల పాశ్చాత్య దేశాలకు సంబంధించిన ఆహారాలు, ఆహార తయారీ విధానాలు భారతీయ జనజీవనంలోకి చొచ్చుకు వచ్చాయి. అంతకు పూర్వం ఢిల్లీ సుల్తాన్ లు (1296-1526) మొఘలాయీ పాలనల (1526-1857) వల్ల పర్షియా, అరేబియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, మధ్యప్రాచ్యం లాంటి దేశాలకు సంబంధించిన ఆహార విధానాలు, వంట విధానాలు, ప్రక్రియలు భారతదేశంలో అంతర్భాగంగా మారిపోయాయి. మధ్య ప్రాచ్య దేశాలకు సంబంధించిన ఇరానీ చాయ్, బిర్యానీ, బిస్కెట్లు, మాంసాహార వంటకాలు వంటివి ఎలాగైతే భారతదేశంలోకి ముస్లిం పరిపాలకులతో పాటు ప్రవేశించాయో, అలాగే బ్రిటన్, ఫ్రాన్స్, పోర్చుగల్ పాలకులతోపాటు శాండ్విచ్, బ్రెడ్, బిస్కెట్, కేక్, ఇతర వంటకాలు, ఆహారాలు భారతదేశంలోకి వచ్చేసాయి. ఇన్ని సాంస్కృతిక పరిణామాలు సంభవించినప్పటికీ భారతదేశంలో మూలవాసుల సంస్కృతి (Indigenous Culture), స్థానిక సంస్కృతుల (Local, native cultures) లోంచి రూపొందిన ఆహారాలు, వంటలు అలాగే కొనసాగాయి. ఇవే భారతీయ సంప్రదాయ వంటలుగా (Indian Traditional Cuisine) ఆయా రాష్ట్రాలలోని సాంస్కృతిక నేపథ్యాలను అనుసరించి కొనసాగి ఇప్పటికీ భారతదేశంలోని వైవిధ్యతకు, విశిష్టతకు కొలమానాలుగా నిలుస్తున్నాయి. భారతీయ ఆహారంలో ముఖ్యంగా సంప్రదాయ ఆహార విధానంలో, మనకు ప్రధానంగా వన మూలికలు, సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసుల వాడకం ఎక్కువగా కనిపిస్తాయి. అయినప్పటికీ భారత ఉపఖండంలోని విభిన్నమైన వాతావరణ పరిస్థితులను అనుసరించి ఆయా రాష్ట్రాలలో, ప్రాంతాలలో ఆహార అలవాట్లు ప్రత్యేకంగా రూపొందాయి. భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ ప్రాంతాలలో అతి శీతల వాతావరణాలు మంచుకొండలు ఉండగా, రాజస్థాన్ ప్రాంతంలో అత్యంత ఉష్ణ మండలాలు థార్ ఎడారి లాంటివి కనిపిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలలోకొండలు, గుట్టలు, నదీ ప్రవాహాల లోయలతో మాసిన్ రాం, చిర్రపుంజి వంటి ప్రదేశాలలో నిత్య వర్షాలు కనిపిస్తే, దక్షిణాదిలో దక్కన్ పీఠభూమి ప్రాంతంలో పర్వతాలు, సతత హరితారణ్యాలు, సమ శీతోష్ణ మండలాలు కనిపిస్తాయి. ఇలాంటి భౌగోళిక వైవిధ్యతను అనుసరించే దేశంలోని ఆయా రాష్ట్రాలలో ప్రత్యేకమైన ఆహారపుటలవాట్లు, వంటకాలు రూపొందాయి. అయితే వీటన్నిటి అంతిమ లక్ష్యం వాతావరణానికి తగిన శారీరక, మానసిక అనుగుణ్యతను (Physical Mental Compatibility) ప్రజలకు అందించడం, తద్వారా ప్రజలను నిత్యం ఉత్సాహ వంతులుగా, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం అని చెప్పాలి. అందుకే మంచి ఆరోగ్యానికి మంచి ఆహారం కావాలి. ఆ లెక్కన “మంచి ఆహారం" (Good Food) అంటే వేలాది సంవత్సరాల కాలపరీక్షకు నిలిచి గెలిచి కొనసాగుతున్న సంప్రదాయ ఆహార విధానము, సంప్రదాయ వంటలని మరోసారి రుజువైంది. వైద్యశాస్త్ర పితామహుడుగా భావించే హిప్పోక్రేటస్ చెప్పిన "Let food be thy medicine and medicine be thy food”. అన్న మాటలు మనుషులలో “ఆరోగ్యానికి హేతువుగా ఆహారం" అనే అంశాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి. ఇదే సందర్భంలో 2020లో ప్రపంచమంతటా విధ్వంసం సృష్టించిన కరోనా వైరస్ లక్షలాది మంది మృతికి కారణమయింది. ఆసుపత్రులు, ఆరోగ్య సదుపాయాలు ఎంతగానో అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం మనుషులు క్షణాల్లో మరణించారు. జనసాంద్రత అంతగా లేని యూరప్, అమెరికా వంటి దేశాలు కూడా కరోనా ధాటిని తట్టుకోలేక చేతులెత్తేసాయి. ఇక భారతదేశంలాంటి అత్యంత జనసమ్మర్థం కల దేశంలో, 140 కోట్ల<noinclude><references/> {{c|vi}}</noinclude> 6c7n0pxyi4dz7etwq3p1k4dv3yget2d పుట:తెలంగాణ రుచులు.pdf/12 104 207749 564529 546184 2026-07-14T14:23:06Z శ్రీరామమూర్తి 1517 /* మూల్యాంకన చేసారు */ 564529 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude> జనాభాలో కోట్లాది మంది మరణిస్తారు అని అంచనా వేసారు. కానీ చిత్రంగా, అభివృద్ధి చెందిన దేశాలలో కన్నా భారతదేశంలో కరోనా మరణాల నిష్పత్తి తక్కువగా ఉన్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ తర్వాత ధృవీకరించింది. శుభ్రత (Cleanliness and sanitation), సామాజికదూరం (Social Distance) పాటించే విషయంలో అంతగా పరిణతి చెందని మనదేశం అనతి కాలంలోనే నిర్జనమైపోతుందని అందరూ అంచనా వేసారు. ఆందోళన వెలిబుచ్చారు. ఈ అంచనాలను తలక్రిందులు చేస్తూ భారతదేశంలో కరోనా వైరస్ ఆందోళన పడినంతగా ప్రభావం చూపించలేకపోయింది. దీనికి కారణాలు ఏమిటి? అని అధ్యయనాలు చేస్తే, ఆ రహస్యం మన ఒంట్లోని రోగనిరోధక శక్తి (Immunity) లో ఉందని, దానికి కారణం మన వంటింట్లో, పోపుల పెట్టెలో ఉందని వెల్లడయ్యింది. అంటే మన ఆహారపుటలవాట్లలో, ఆహార తయారీ విధానంలో మనం వాడే మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు మనకు తెలియకుండానే మనలో రోగనిరోధక శక్తిని పెంచాయని, దానివల్ల, కరోనా బారి నుంచి భారతీయులు తప్పించుకున్నారని వెల్లడయ్యింది. అలా మనం తీసుకునే ఆహారం మనకు ఔషధంగా కూడా పనిచేస్తుందని చెప్పవచ్చు. - దీనినే ఇటీవలి కాలంలో "ఆహార చికిత్స" (Food Therapy) అంటున్నారు. అమెరికాలో అత్యంత ఆదరణ పొందిన టి.వి. రియాలిటీ షో "The Biggest Loser: Couples 4" హోస్ట్ ప్రఖ్యాత Celebrity Fitness Trainer గా అయిన Brett Hoebel" "ఆహార చికిత్స”ను సమర్థిస్తున్నాడు. ఆయన “Food is lot of people's therapy - when we say comfort food, we really mean that. Itis releasing dopamine and serotonin in your brain that makes you feel good" అని స్పష్టం చేశారు. ఇక Nutrition Psychologists అయితే మనిషిలోని మానసిక (Mental fluctuations) చిత్త చాంచల్యాలకు, Stress, Depression, Crises, Anxiety, Loss of Memory వంటి మనోరుగ్మతల నిదానానికి, చికిత్సకు ఆహారమే ప్రాథమిక ఔషధంగా (Food as a primary medicine) పనిచేస్తుందని చెప్పవచ్చు. అంటే ఆహారం కేవలం శారీరకపరమైన ఉత్తేజానికి, ఉత్సాహానికి మాత్రమే కాక, మానసికపరమైన ఉల్లాసానికి, ఉద్వేగ సంతులనకు (Balance in emotions) కూడా దోహదపడ్తుందని తేటతెల్లమవుతుంది. మరొకవైపున ప్రస్తుతం భోజనం, వంటలు అనేది పరిశ్రమ (Food Industry) స్థాయికి ఎదిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరిలో పర్యాటక స్పృహ (Awareness of Tourism) పెరగడం, దేశాటనం, సంచారం అనే ప్రాచీన భారతీయ జీవన విలువలకు కొనసాగింపుగా 'పర్యాటకం' నేడు ఆధునిక రూపంలో విస్తరించడంవల్ల 'ఆహారం - రుచులు' కూడా ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అలాగే ఇటీవలి కాలంలో వచ్చిన 'సామాజిక మాధ్యమాల విప్లవం' (Social Media Revolution) కూడా దీనిని మరింత ముందుకు తీస్కెళ్ళింది. వంటలు, భోజనాలు, వంటల తయారీ విధానం వంటి అంశాలను నేర్పించడానికి గతంలో అమ్మలు, కుటుంబం ఆధారంగా ఉండేది. 1995లో టి.వి. ఛానెల్ల విస్తరణ అనంతరం న్యూస్ ఛానెల్స్ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్లో వంటల తయారీ కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. మరోవైపున వంటలను నేర్పించడానికి నగరాలలో ప్రత్యేక విధాన సంస్థలు, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు, దేశ విదేశీ వంటల తయారీలో శిక్షణ కోసం ప్రత్యేకంగా “ఛెఫ్” కోర్సులు అకాడెమిక్"గా రూపొందాయి. వీటికి సమాంతరంగా కాలనీలు, అపార్ట్మెంట్లలో బామ్మలు, మామ్మలు, స్వగృహ ఫుడ్స్ వంటి చిన్న స్థాయి కుటీర వ్యవస్థలు వంటల చిట్కాలను నేర్పించడం మొదలెట్టాయి. ఇలా సువ్యవస్థీకృతం గానూ, అవ్యవస్థీకృతంగానూ నిర్వహించే "సంప్రదాయ శిక్షణా తరగతులు” మాత్రమే కాక, ఆన్లైన్ లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వేదికలుగా వర్చువల్ తరగతులు నడుస్తున్నాయి. అంతేగాక, భారతీయ వంటలు, తెలుగు వారి వంటలు, తెలంగాణా వంటకాల గురించిన యూట్యూబ్ ఛానెల్లు ఇప్పుడు అత్యంత ప్రేక్షకాదరణతో సాగుతున్నాయి. ఈతరం యువతకు వంటలు రాకపోవడం, ఉద్యోగవృత్తిరీత్యా విదేశాలకు వెళ్ళాల్సి రావడం వంటి కారణాలవల్ల 'గూగుల్నే గురువుగా భావించి 'ఏకలవ్య శిష్యులు'గా వంటలపై ప్రయోగాలు చేస్తున్న 'Generation-Z' ప్రస్తుతం ఈ సామాజిక మాధ్యమాలకు రాజపోషకులుగా ఉన్నారు. ఈ డిజిటల్ పరిణామాలన్నీ సమకాలీనంగా నవ యువతరంలో సంప్రదాయ వంటలు, రుచులు, ఆహారంపట్ల పెరుగుతున్న ఆసక్తికి ఉదాహరణగా చెప్పదగినవే! వీటన్నిటి దృష్ట్యా తెలంగాణాకే ప్రత్యేకమైన ఆహారపుటలవాట్లు, వంటకాలు అన్నిటినీ ఒక్కచోట కూర్చి ఆహార రుచుల రంగంలో కూడా తెలంగాణాకున్న ప్రత్యేకతను తెలియ చెప్పాలనుకున్నాము. అలాగే, అనివార్యంగా సంభవించిన ఇతర రాష్ట్రాల ప్రభావం వల్ల మనదైన వంటలు, వంటకాలు కూడా మన స్మృతి పేటికలోంచి కనుమరుగైన సందర్భం ఏర్పడింది. ఇప్పుడు అంతటా బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, వడ, దోశె, చపాతీ లాంటివే కనిపిస్తాయి. నిశితంగా గమనిస్తే ఇవన్నీ మద్రాసీ లేదా కన్నడ ప్రాంత ఉడిపి హోటల్ల తాలూకు ప్రభావం అని అర్థమవుతుంది. ఈ సందర్భంలో అసలు తెలంగాణా బ్రేక్ఫాస్ట్లు ఏంటి? అసలు మనకంటూ ఈ వంటకాలు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిస్తున్న సందర్భంలోనే 2017లో ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణా ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. దానికి భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణా సాహిత్య అకాడెమీ బాధ్యత తీసుకున్నాయి. ఆ క్రమంలో దేశ విదేశాలనుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న ప్రతినిధులకు తెలంగాణా రుచులను, వంటకాలను అందించాలని భావించి ఆ<noinclude><references/> {{c|vii}}</noinclude> qx32grfa14zkr837k3y418yxggfdlib పుట:తెలంగాణ రుచులు.pdf/13 104 207750 564530 546185 2026-07-14T14:25:55Z శ్రీరామమూర్తి 1517 /* మూల్యాంకన చేసారు */ 564530 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude> దిశగా అధ్యయనం చేసి దాదాపు 89 రకాల వంటకాలతో భోజనం 'మెనూ'ను రూపొందించి, ఆ మేరకు వేలాదిమందికి భోజనాలను ఏర్పాటు చేసాం. 2017 డిసెంబర్ 15 నుండి 19 వరకు జరిగిన ఈ ప్రపంచ తెలుగు మహాసభలలో ఆహూతులందరినీ అలరించి, ఆశ్చర్యపరిచి, ఆనంద డోలికలలో ఓలలాడించిన అంశాలలో తెలంగాణా వంటలు, రుచులు కూడా ప్రధాన పాత్ర పోషించాయి. ఈ ఉత్సవాల వల్ల తెలంగాణా రుచులు, వంటకాలు ప్రపంచంలోని మరే జాతి, రాష్ట్ర, ప్రాంత వంటలకు తీసిపోవని, పైగా వీటిలో ఎన్నెన్నో ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయని అర్థమైంది. ఇలా తెలంగాణా వంటకాల విశిష్టతను, వైవిధ్యతను, వంటలు తయారు చేసే విధానాన్ని అందరికీ తెలియజేయాలనే లక్ష్యంతో తెలంగాణా వంటకాల మీద విస్తృత పరిశీలన చేసిన జ్యోతి వలబోజు గారిని సంప్రదించి పుస్తకంగా తెలంగాణా వంటకాలను కూర్చాల్సిందిగా అభ్యర్ధించాం. ఆమె గతంలో వంటల మీద పుస్తకాలు ప్రచురించారు. మా అభ్యర్ధనను అనుసరించి తెలంగాణాకు సంబంధించిన వంటకాలతో ఆమె ఈ పుస్తకాన్ని కూర్చినందుకు ఆమెకు అభినందనలు. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ రుచులను, ఆహారాలను, వంటల తయారీ విధానాన్ని వాటి ప్రక్రియలను ఈ పుస్తకం ద్వారా అందించడం తెలంగాణ అస్తిత్వంలో సాంస్కృతిక అంశాలు, ఆహారపరమైన అంశాల పాత్రను మరొక్కసారి గుర్తించినట్లుగా అయింది. అలా రూపుదిద్దుకున్న ఈ "తెలంగాణ రుచులు” పుస్తకంలో ఉపాహారాలు, అల్పాహారాలు, శాకాహార వంటలు, మాంసాహార వంటలు, మిఠాయిలు, హైదరాబాదీ వంటకాలు, వరంగల్ స్పెషల్స్, మంథని స్పెషల్స్ వంటి అన్ని రకాల రుచులనూ ఒక్కచోట అందించే ప్రయత్నం చేసాం. ఈ పుస్తకం ద్వారా తెలంగాణాలో దాదాపు 500 రకాల సంప్రదాయ వంటకా లున్నాయని, ఆహార తయారీ ప్రక్రియాపరంగా తెలంగాణా మరే రాష్ట్రానికి తీసిపోదనీ సాధికారికంగా నిరూపించే అవకాశం ఏర్పడింది. దీనికితోడు ఈ పుస్తక ప్రారంభ అధ్యాయాలలో తెలంగాణా చరిత్ర, సంస్కృతిలో ఆహారం పాత్ర గురించి, బోనాలు, బతుకమ్మ వంటి పండుగల సందర్భంలో మనం చేసుకునే ప్రత్యేక పిండివంటల గురించి, మన ఆచార సంప్రదాయాల్లో మన వంటకాల ప్రత్యేకత గురించి, తెలంగాణ వంటలను అనుసరించి ప్రత్యేకంగా రూపొందించిన భాషా పదాల గురించి సహేతుకంగా వివరించడం జరిగింది. అలాగే చారిత్రకంగా, శాసనాలపరంగా, సాహిత్యపరంగా ఆహారాల వర్గీకరణ,తెలుగు కావ్యాలలో భోజన వర్ణన వంటి అంశాలను విషయ సమగ్రత కోసం చేర్చడం జరిగింది. ఇలా ఈ "తెలంగాణా రుచులు” పుస్తకం తెలంగాణా సంస్కృతిలో ఆహారాభిరుచుల గురించి, వంటకాలు, వాటి తయారీ విధానం గురించిన 'వివరణాత్మక మార్గదర్శి'గా ఉంటుందని భావిస్తాను. తెలంగాణా వంటకాలను పరిచయం చేయాలనుకునే హోటలు, రెస్టారెంట్లకు, తెలంగాణా రుచులను ఆస్వాదించాలనుకునే వ్యక్తులకు, భోజన ప్రియులకు ఇది ఒక కరదీపిక (Hand Book) లాగా ఉంటుందని తలుస్తాను. మరోవైపున తెలంగాణా సంస్కృతిలోని విశ్వరూపాన్ని రుచులపరంగా ఆవిష్కరించడంలో ఈ పుస్తకం మీ చేతులకు, నాలుకకు, నాసికకు, నయనాలకు కావలసినంత అనుభూతిని, ఆస్వాదనను అందిస్తుందని ఆశిస్తున్నాను. చివరగా, ప్రతిష్టాత్మక UNESCO హైదరాబాద్ నగరాన్ని "Creative City of Gastronomy" గా "ఆహార రుచులలో సృజనాత్మక నగరం"గా 2019 సంవత్సరంలో ప్రకటించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేయాలి. భారతదేశం మొత్తం మీద ఈ అరుదైన అంతర్జాతీయ గుర్తింపును పొందిన ఒకే ఒక్క తొలి నగరంగా హైదరాబాద్ తెలంగాణా వంటకాలు - రుచులు-ఆహారపుటలవాట్లకు ప్రపంచఖ్యాతిని తేవడం విశేషం. దీనికి కాకతీయ కాలం నుండి వచ్చిన సంప్రదాయ వంటకాలు, తెలంగాణా పల్లెలలోని గ్రామీణ వంటకాలు, ఇండో-ఇస్లామిక్, పర్షియన్, మొఘలాయి వంటల పరస్పర ప్రభావాలు కారణమని చెప్పవచ్చు. ఇలా తెలంగాణా రాష్ట్రం నైసర్గికంగా, భాషా సాంస్కృతికంగా మాత్రమే కాక వంటకాలు, ఆహారపు టలవాట్లపరంగా కూడా అచ్చమైన విశ్వనగరంగా రూపొందడం తెలంగాణా బిడ్డలుగా మనకందరికీ గర్వకారణం! ఈ విజయానికి భాషా సాంస్కృతిక శాఖ అందిస్తున్న అక్షర నీరాజనం ఈ పుస్తకం! {{c|There is no love sincerer than the love of food}} {{c|- George Bernard Shaw}} {{c|(From "Man and Superman")}} {{rh|రవీంద్రభారతి,||'''- డా॥ మామిడి హరికృష్ణ'''}} {{rh|హైదరాబాద్|||}}<noinclude><references/> {{c|vii}}</noinclude> lno98zf3bt5gg02o26x56v292c44sur పుట:తెలంగాణ రుచులు.pdf/22 104 207759 564531 546186 2026-07-14T14:27:17Z శ్రీరామమూర్తి 1517 /* మూల్యాంకన చేసారు */ 564531 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{Css image crop |Image = తెలంగాణ_రుచులు.pdf |Page = 22 |bSize = 464 |cWidth = 396 |cHeight = 456 |oTop = 75 |oLeft = 36 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> sws4mrfrgufwqbfvgbhos5nv9hqy7ao పుట:తెలంగాణ రుచులు.pdf/23 104 207760 564532 546188 2026-07-14T14:28:08Z శ్రీరామమూర్తి 1517 /* మూల్యాంకన చేసారు */ 564532 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{Css image crop |Image = తెలంగాణ_రుచులు.pdf |Page = 23 |bSize = 464 |cWidth = 240 |cHeight = 186 |oTop = 0 |oLeft = 113 |Location = center |Description = }} {{c|'''1. తెలంగాణ రుచులు '''}} {{center|{{p|fs150}}'''చరిత్ర - సంప్రదాయం '''</p>}} ఆరోగ్యమే మహాభాగ్యం అని మనకు అందరికీ తెలిసిందే. ఆహారం మనకు శక్తినిస్తుంది. ఆరోగ్యాన్నిస్తుంది కాని అది పోషక విలువలతో కూడినదై మొదలైనవి వుండాలి. అందరూ తమ ఆహారంలో అన్నిరకాల ఆహారపదార్థాలు బియ్యం, గోధుమలు, జొన్నలు, కొర్రలు, మొక్కజొన్నలు, రాగులు తీసుకోవడం చాలా మంచిది. వీటితోపాటు పప్పులు, కాయగూరలు, ఆకుకూరలు, మాంసాహారం తీసుకోవాలి. ఆహారంలోని పోషకపదార్థాలు ఎన్నో రోగాల నుండి మనల్ని రక్షిస్తాయి. ఆహారాన్ని సంపాదించడానికి మనిషి పడరాని పాట్లు పడ్డాడు. రాతియుగంలో కొండలు, కోనలు, అడవులలో తిరుగుతూ సముపార్జించడం కోసం ఆకులు, దుంపలు, కాయలు తింటూ కాలం గడిపాడు. ఆ సమయంలో వాళ్లకి అవసరాలు చాలా తక్కువ.కాలం మారుతున్న కొద్ది అవసరాలు పెరిగాయి. కుటుంబం కోసం కూడబెట్టిన ఆహారం సరిపోక స్వంతంగా ఆహారాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం అనువైన భూముల దగ్గరే నివాసం ఏర్పాటు చేసుకొని వ్యవసాయం మొదలుపెట్టి పంటలను పండించసాగాడు. ప్రాచీన మానవుడు ఆకలైనప్పుడు పళ్లు, దుంపలు పచ్చివే తిన్నాడు. తర్వాత వాటిని ఉడికించుకున్నాడు. క్రమక్రమంగా ఆహారాన్ని పండించి, వండి తినడం ప్రారంభించాడు. ప్రజల ఆహారపు అలవాట్లు వారు నివసించే భౌగోళిక వాతావరణం మీద ఆధారపడి ఉంటాయి. వీటికనుగుణంగానే వివిధ పంటలను పండించి, తమ ఆహారంగా సమకూర్చుకుంటారు. సముద్రతీరాలు, నదీతీరాలలో, చెరువులు, వాగులు ఉన్న ప్రాంతాలలో ప్రజలు ఎక్కువగా చేపలు, రొయ్యలు మొదలైనవి తమ ఆహారంలో ఉపయోగిస్తారు. అడవీ ప్రాంతంలో నివసించేవారు జంతువుల మాంసం, పండ్లు, దుంపలు, తేనె, ఆకులను తింటారు. సముద్రతీరానికి, అడవులకు దూరంగా ఉండేవారు పెంపుడు జంతువుల మాంసం, పంటల వల్ల వచ్చే ధాన్యం, కూరగాయలను తమ ఆహారంలో భాగంగా చేసుకొని తింటారు. వేర్వేరు ప్రాంతాల ప్రజల ఆహారపుటలవాట్లు వాళ్లు ఉండే ప్రాంతంపై కూడా ఆధారపడి ఉంటాయి. నల్లనేలలో కొన్ని రకాలు, ఎర్రనేలలో కొన్ని రకాల పంటలు విరివిగా పండుతాయి. అలాగే వానలు ఎక్కువగా కురిసే ప్రాంతాలలో వరి, గోధుమలు లాంటివి, వానలు తక్కువగా కురిసే ప్రాంతాలలో కొర్రలు, జొన్నలు, సజ్జలు, సామలతో పాటు పెసర్లు, ఉలవలు, మినుములు మొదలైన పప్పుధాన్యాలను కూడా పండిస్తారు. '''సాహిత్యంలో ఆహారం:''' ప్రాచీన సాహిత్యంలో ఆయా ప్రాంతాల ఆహారపు అలవాట్లు, పంటల గురించి వివరించడం జరిగింది. కాకతీయుల కాలంనాటి శాసనాల ద్వారా ఓరుగల్లు కోట బయట సంతలో ఆకులు, కూరగాయలు, టెంకాయలు, మామిడిపళ్ళు, చింతపండు, నువ్వులు, గోధుమలు నూనె, నెయ్యి, జొన్నలు, మిరియాలు, పసుపు, ఉల్లి, అల్లం మొదలైన దినుసులు అమ్మేవారని తెలుస్తోంది. 'ఓరుగల్లు<noinclude><references/> {{c|2}}</noinclude> lmpmaz239yutckipjg65ntp4ib6lkwc పుట:తెలంగాణ రుచులు.pdf/24 104 207761 564533 546191 2026-07-14T14:29:28Z శ్రీరామమూర్తి 1517 564533 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> నగరంలో ఓరగంత బెద్ద యెలుంగున నమ్మె సంపెంగ నూనె' అన్న మాటలు ఆనాడు సాధారణమైన నూనెతోపాటు సంపెంగవంటి సువాసన గల నూనెలను కూడా ఉపయోగించేవారని తెలుస్తోంది. 'జొన్నలు గొన్న ౠణంబు నీగుదున్' అని చెప్పడం వల్ల ఆనాటి పనివారికి డబ్బులు బదులు జొన్నలు జీతంగా ఇచ్చేవారని తెలుస్తోంది. రెడ్డిరాజుల కాలం నుండి నేటి వరకు తెలంగాణాలో వరి ముఖ్యమైన పంటగా పండిచబడేది. వీరి కాలంలో వరి, చెరకు, తేనె, పప్పు ధాన్యాలు, పాలు, నూనె, పండ్లు విరివిగ లభ్యమయ్యేవి. పండితుల రచనల్లోనే కాదు పామరులు, జానపదుల పాటల్లో కూడా ఆహార పదార్థాలు చోటు చేసుకున్నాయి. అందుకే 'తిండి కలిగితె కండ కలదోయ్... కండ కల్గినవాడే మనిషోయ్!' అన్నారు గురజాడవారు. '''సామెతల్లో ఆహారం:''' {{Css image crop |Image = తెలంగాణ_రుచులు.pdf |Page = 24 |bSize = 464 |cWidth = 114 |cHeight = 161 |oTop = 164 |oLeft = 53 |Location = left |Description = }} “అన్నదాత సుఖీభవ” - కడుపునిండ, రుచికరమైన భోజనం తిన్న తర్వాత ప్రతీ ఒక్కరు అనుకునే మాట ఇది. మనుష్యులందరికీ కూడు, గూడు, గుడ్డ తప్పకుండా కావలసినవి. అందులో తిండి చాలా ముఖ్యం. కోటి విద్యలు కూటికొఱకే అని ఊరకే అనలేదు. ఆకలిగొన్నవాడికి భైరవి రాగం కంటే, రవివర్మ చిత్రం కంటే పచ్చడన్నమే 'ఆకలి రుచెరుగదు' అని సామెత చెప్పిన మన పూర్వీకులే 'పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచీ' అని కూడా సెలవిచ్చారు. అంతేకాదు సామెతల్లో కూడా ఆహారపదార్థాలని తెలియజేసేవి ఉన్నాయి. వ్యవసాయ పనులకు వెళ్లేవాళ్లు పొద్దున్నే చద్దన్నంలో ఆవకాయ లేదా పచ్చడి వేసుకుని తినేవాళ్లు. దూరప్రయాణంలో కూడా చద్దిమూట కాస్త ఆవకాయ వేసుకుని వెంట తీసుకెళ్లేవారు. అందుకే ఎద్దు లేని సేద్యం చద్ది లేని పయనం అనేవారు. పిండి, నూకలు కలిపి జావగా చేస్తే అదే అంబలి అంటారు. ఇది ఎక్కువగా పేదవారు తాగుతారు. అంబలి అంటే మొగాలే చెపుతాయి, అంబలి తినే సమయాన అమతమబ్బినట్టు అనేవారు. పేదవారు అన్నం లేకపోతే ఇంటింటికి తిరిగి వారు పారబోసే గంజిని తెచ్చుకుని ఉప్పేసుకుని తాగేవారు అదే వాళ్లకు పంచభక్ష్య పరమాన్నం. 'ఎద్దులా కష్టపడినా గంజికి గతిలేదు', 'గతి లేనమ్మకు గంజే పానకం', 'కాలే కడుపుకు మండే గంజి' లాంటి సామెతలు కూడా వాడుకలో ఉన్నాయి. 'కుడుములు వండని పడతి (ఇల్లాలు) కూనిరాగం తీయని మగాడు ఉండరు', 'రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు', 'రొట్టెలోడి కంటే తునకలోడు మేలు', 'కక్కదింటే గారెలు చేదు', 'తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి' మొదలైన సామెతలు అందరికీ తెలిసినవే. '''వంటిల్లు, పొయ్యి :''' {{Css image crop |Image = తెలంగాణ_రుచులు.pdf |Page = 24 |bSize = 464 |cWidth = 177 |cHeight = 119 |oTop = 441 |oLeft = 240 |Location = right |Description = }} తెలంగాణాలో వంటిల్లు విడిగా ఇంటి వెనకాల ఉంటుంది. పొయ్యి పక్కన తప్పనిసరిగా 'కూరాడు' కూడా ఉంటుంది. ఈ కూరాడు కుండలో బియ్యం కడిగిన నీళ్లు, అన్నం వంపిన గంజి వంటివి కలిపి మూతపెట్టి ఉంచుతారు. వంటింట్లో ఉత్తర దిక్కున కట్టెల పొయ్యి ఉంటుంది. తాగేనీటిని మంచి కుండలో పోసి మూత పెట్టి కుదురుద పెడతారు. దాని మీద మూకుడుని కడిగి పెట్టి కొబ్బరిచిప్పతో చేసిన'చిప్పకట్టె'ను పెడ్తారు. ఎవరుబడితే వాళ్లు కుండలో చేతులు పెట్టకుండా ఈ చిప్పకట్టెతో నీళ్లు తీసుకుంటారు. వంటకు ఉపయోగించే సామాన్లు ఎన్నో ఉన్నాయి. రోలు, రుబ్బురాయి, రాచ్చిప్ప, విసుర్రాయి, కుదురు, కుందెన, రోకలి, రోకలిబండ.. పిండి చేసుకోవాలన్నా, ధాన్యం పొట్టు పోగొట్టటానికి, పొడులు, పచ్చళ్లు లేదా తొక్కులు చేసుకోవాలంటే సామాన్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. పాటలు పాడుకుంటూ చేసే ఈ పనులే ఇంటి ఇల్లాలికి మంచి వ్యాయామంగా ఉండేవి. పొయ్యిలో కూడా అనేక రకాలు ఉండేవి. అవి ఇటుకలతో గాని, మట్టితోగాని పొయ్యిలు వేసుకునేవారు (కట్టుకునేవారు). రేగడిమట్టితో చేసిన సాదాపొయ్యికి మూడువైపులా మట్టిగోడలుంటాయి. ప్రతీ గురువారం రాత్రి ఈ ప్రాంతమంతా ఎర్రమన్ను లేదా పేడతో అలికి ముగ్గులు పెట్టి శుక్రవారం రోజు వంట ప్రారంభిస్తారు. ఒకేసారి వంట చేస్తూ నీళ్లు వేడి<noinclude><references/> {{c|3}}</noinclude> n3bbxaxxuo9818z91fmz515dksvyzh1 564534 564533 2026-07-14T14:32:19Z శ్రీరామమూర్తి 1517 564534 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> నగరంలో ఓరగంత బెద్ద యెలుంగున నమ్మె సంపెంగ నూనె' అన్న మాటలు ఆనాడు సాధారణమైన నూనెతోపాటు సంపెంగవంటి సువాసన గల నూనెలను కూడా ఉపయోగించేవారని తెలుస్తోంది. 'జొన్నలు గొన్న ౠణంబు నీగుదున్' అని చెప్పడం వల్ల ఆనాటి పనివారికి డబ్బులు బదులు జొన్నలు జీతంగా ఇచ్చేవారని తెలుస్తోంది. రెడ్డిరాజుల కాలం నుండి నేటి వరకు తెలంగాణాలో వరి ముఖ్యమైన పంటగా పండిచబడేది. వీరి కాలంలో వరి, చెరకు, తేనె, పప్పు ధాన్యాలు, పాలు, నూనె, పండ్లు విరివిగ లభ్యమయ్యేవి. పండితుల రచనల్లోనే కాదు పామరులు, జానపదుల పాటల్లో కూడా ఆహార పదార్థాలు చోటు చేసుకున్నాయి. అందుకే 'తిండి కలిగితె కండ కలదోయ్... కండ కల్గినవాడే మనిషోయ్!' అన్నారు గురజాడవారు. '''సామెతల్లో ఆహారం:''' “అన్నదాత సుఖీభవ” - కడుపునిండ, రుచికరమైన భోజనం తిన్న తర్వాత ప్రతీ ఒక్కరు అనుకునే మాట ఇది. మనుష్యులందరికీ {{Css image crop |Image = తెలంగాణ_రుచులు.pdf |Page = 24 |bSize = 464 |cWidth = 114 |cHeight = 161 |oTop = 164 |oLeft = 53 |Location = left |Description = }} కూడు, గూడు, గుడ్డ తప్పకుండా కావలసినవి. అందులో తిండి చాలా ముఖ్యం. కోటి విద్యలు కూటికొఱకే అని ఊరకే అనలేదు. ఆకలిగొన్నవాడికి భైరవి రాగం కంటే, రవివర్మ చిత్రం కంటే పచ్చడన్నమే 'ఆకలి రుచెరుగదు' అని సామెత చెప్పిన మన పూర్వీకులే 'పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచీ' అని కూడా సెలవిచ్చారు. అంతేకాదు సామెతల్లో కూడా ఆహారపదార్థాలని తెలియజేసేవి ఉన్నాయి. వ్యవసాయ పనులకు వెళ్లేవాళ్లు పొద్దున్నే చద్దన్నంలో ఆవకాయ లేదా పచ్చడి వేసుకుని తినేవాళ్లు. దూరప్రయాణంలో కూడా చద్దిమూట కాస్త ఆవకాయ వేసుకుని వెంట తీసుకెళ్లేవారు. అందుకే ఎద్దు లేని సేద్యం చద్ది లేని పయనం అనేవారు. పిండి, నూకలు కలిపి జావగా చేస్తే అదే అంబలి అంటారు. ఇది ఎక్కువగా పేదవారు తాగుతారు. అంబలి అంటే మొగాలే చెపుతాయి, అంబలి తినే సమయాన అమతమబ్బినట్టు అనేవారు. పేదవారు అన్నం లేకపోతే ఇంటింటికి తిరిగి వారు పారబోసే గంజిని తెచ్చుకుని ఉప్పేసుకుని తాగేవారు అదే వాళ్లకు పంచభక్ష్య పరమాన్నం. 'ఎద్దులా కష్టపడినా గంజికి గతిలేదు', 'గతి లేనమ్మకు గంజే పానకం', 'కాలే కడుపుకు మండే గంజి' లాంటి సామెతలు కూడా వాడుకలో ఉన్నాయి. 'కుడుములు వండని పడతి (ఇల్లాలు) కూనిరాగం తీయని మగాడు ఉండరు', 'రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు', 'రొట్టెలోడి కంటే తునకలోడు మేలు', 'కక్కదింటే గారెలు చేదు', 'తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి' మొదలైన సామెతలు అందరికీ తెలిసినవే. '''వంటిల్లు, పొయ్యి :''' {{Css image crop |Image = తెలంగాణ_రుచులు.pdf |Page = 24 |bSize = 464 |cWidth = 177 |cHeight = 119 |oTop = 441 |oLeft = 240 |Location = right |Description = }} తెలంగాణాలో వంటిల్లు విడిగా ఇంటి వెనకాల ఉంటుంది. పొయ్యి పక్కన తప్పనిసరిగా 'కూరాడు' కూడా ఉంటుంది. ఈ కూరాడు కుండలో బియ్యం కడిగిన నీళ్లు, అన్నం వంపిన గంజి వంటివి కలిపి మూతపెట్టి ఉంచుతారు. వంటింట్లో ఉత్తర దిక్కున కట్టెల పొయ్యి ఉంటుంది. తాగేనీటిని మంచి కుండలో పోసి మూత పెట్టి కుదురుద పెడతారు. దాని మీద మూకుడుని కడిగి పెట్టి కొబ్బరిచిప్పతో చేసిన'చిప్పకట్టె'ను పెడ్తారు. ఎవరుబడితే వాళ్లు కుండలో చేతులు పెట్టకుండా ఈ చిప్పకట్టెతో నీళ్లు తీసుకుంటారు. వంటకు ఉపయోగించే సామాన్లు ఎన్నో ఉన్నాయి. రోలు, రుబ్బురాయి, రాచ్చిప్ప, విసుర్రాయి, కుదురు, కుందెన, రోకలి, రోకలిబండ.. పిండి చేసుకోవాలన్నా, ధాన్యం పొట్టు పోగొట్టటానికి, పొడులు, పచ్చళ్లు లేదా తొక్కులు చేసుకోవాలంటే సామాన్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. పాటలు పాడుకుంటూ చేసే ఈ పనులే ఇంటి ఇల్లాలికి మంచి వ్యాయామంగా ఉండేవి. పొయ్యిలో కూడా అనేక రకాలు ఉండేవి. అవి ఇటుకలతో గాని, మట్టితోగాని పొయ్యిలు వేసుకునేవారు (కట్టుకునేవారు). రేగడిమట్టితో చేసిన సాదాపొయ్యికి మూడువైపులా మట్టిగోడలుంటాయి. ప్రతీ గురువారం రాత్రి ఈ ప్రాంతమంతా ఎర్రమన్ను లేదా పేడతో అలికి ముగ్గులు పెట్టి శుక్రవారం రోజు వంట ప్రారంభిస్తారు. ఒకేసారి వంట చేస్తూ నీళ్లు వేడి<noinclude><references/> {{c|3}}</noinclude> 0z34iinuy0i1ebozcnswhcqmmk1d6ps 564537 564534 2026-07-14T14:35:25Z శ్రీరామమూర్తి 1517 564537 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> నగరంలో ఓరగంత బెద్ద యెలుంగున నమ్మె సంపెంగ నూనె' అన్న మాటలు ఆనాడు సాధారణమైన నూనెతోపాటు సంపెంగవంటి సువాసన గల నూనెలను కూడా ఉపయోగించేవారని తెలుస్తోంది. 'జొన్నలు గొన్న ౠణంబు నీగుదున్' అని చెప్పడం వల్ల ఆనాటి పనివారికి డబ్బులు బదులు జొన్నలు జీతంగా ఇచ్చేవారని తెలుస్తోంది. రెడ్డిరాజుల కాలం నుండి నేటి వరకు తెలంగాణాలో వరి ముఖ్యమైన పంటగా పండిచబడేది. వీరి కాలంలో వరి, చెరకు, తేనె, పప్పు ధాన్యాలు, పాలు, నూనె, పండ్లు విరివిగ లభ్యమయ్యేవి. పండితుల రచనల్లోనే కాదు పామరులు, జానపదుల పాటల్లో కూడా ఆహార పదార్థాలు చోటు చేసుకున్నాయి. అందుకే 'తిండి కలిగితె కండ కలదోయ్... కండ కల్గినవాడే మనిషోయ్!' అన్నారు గురజాడవారు. '''సామెతల్లో ఆహారం:''' “అన్నదాత సుఖీభవ” - కడుపునిండ, రుచికరమైన భోజనం తిన్న తర్వాత ప్రతీ ఒక్కరు అనుకునే మాట ఇది. మనుష్యులందరికీ {{Css image crop |Image = తెలంగాణ_రుచులు.pdf |Page = 24 |bSize = 464 |cWidth = 114 |cHeight = 161 |oTop = 164 |oLeft = 53 |Location = left |Description = }} కూడు, గూడు, గుడ్డ తప్పకుండా కావలసినవి. అందులో తిండి చాలా ముఖ్యం. కోటి విద్యలు కూటికొఱకే అని ఊరకే అనలేదు. ఆకలిగొన్నవాడికి భైరవి రాగం కంటే, రవివర్మ చిత్రం కంటే పచ్చడన్నమే 'ఆకలి రుచెరుగదు' అని సామెత చెప్పిన మన పూర్వీకులే 'పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచీ' అని కూడా సెలవిచ్చారు. అంతేకాదు సామెతల్లో కూడా ఆహారపదార్థాలని తెలియజేసేవి ఉన్నాయి. వ్యవసాయ పనులకు వెళ్లేవాళ్లు పొద్దున్నే చద్దన్నంలో ఆవకాయ లేదా పచ్చడి వేసుకుని తినేవాళ్లు. దూరప్రయాణంలో కూడా చద్దిమూట కాస్త ఆవకాయ వేసుకుని వెంట తీసుకెళ్లేవారు. అందుకే ఎద్దు లేని సేద్యం చద్ది లేని పయనం అనేవారు. పిండి, నూకలు కలిపి జావగా చేస్తే అదే అంబలి అంటారు. ఇది ఎక్కువగా పేదవారు తాగుతారు. అంబలి అంటే మొగాలే చెపుతాయి, అంబలి తినే సమయాన అమతమబ్బినట్టు అనేవారు. పేదవారు అన్నం లేకపోతే ఇంటింటికి తిరిగి వారు పారబోసే గంజిని తెచ్చుకుని ఉప్పేసుకుని తాగేవారు అదే వాళ్లకు పంచభక్ష్య పరమాన్నం. 'ఎద్దులా కష్టపడినా గంజికి గతిలేదు', 'గతి లేనమ్మకు గంజే పానకం', 'కాలే కడుపుకు మండే గంజి' లాంటి సామెతలు కూడా వాడుకలో ఉన్నాయి. 'కుడుములు వండని పడతి (ఇల్లాలు) కూనిరాగం తీయని మగాడు ఉండరు', 'రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు', 'రొట్టెలోడి కంటే తునకలోడు మేలు', 'కక్కదింటే గారెలు చేదు', 'తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి' మొదలైన సామెతలు అందరికీ తెలిసినవే. '''వంటిల్లు, పొయ్యి :''' తెలంగాణాలో వంటిల్లు విడిగా ఇంటి వెనకాల ఉంటుంది. పొయ్యి పక్కన తప్పనిసరిగా 'కూరాడు' కూడా ఉంటుంది. ఈ కూరాడు కుండలో బియ్యం కడిగిన నీళ్లు, అన్నం వంపిన గంజి వంటివి కలిపి మూతపెట్టి ఉంచుతారు. వంటింట్లో ఉత్తర దిక్కున కట్టెల పొయ్యి ఉంటుంది. తాగేనీటిని మంచి కుండలో పోసి మూత పెట్టి కుదురుద పెడతారు. దాని మీద మూకుడుని కడిగి పెట్టి కొబ్బరిచిప్పతో చేసిన'చిప్పకట్టె'ను పెడ్తారు. ఎవరుబడితే వాళ్లు కుండలో చేతులు పెట్టకుండా ఈ చిప్పకట్టెతో నీళ్లు తీసుకుంటారు. వంటకు ఉపయోగించే సామాన్లు ఎన్నో ఉన్నాయి. రోలు, రుబ్బురాయి, రాచ్చిప్ప, విసుర్రాయి, కుదురు, కుందెన, రోకలి, రోకలిబండ.. పిండి చేసుకోవాలన్నా, ధాన్యం పొట్టు పోగొట్టటానికి, పొడులు, పచ్చళ్లు లేదా {{Css image crop |Image = తెలంగాణ_రుచులు.pdf |Page = 24 |bSize = 464 |cWidth = 177 |cHeight = 119 |oTop = 441 |oLeft = 240 |Location = right| |Description = }} తొక్కులు చేసుకోవాలంటే సామాన్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. పాటలు పాడుకుంటూ చేసే ఈ పనులే ఇంటి ఇల్లాలికి మంచి వ్యాయామంగా ఉండేవి. పొయ్యిలో కూడా అనేక రకాలు ఉండేవి. అవి ఇటుకలతో గాని, మట్టితోగాని పొయ్యిలు వేసుకునేవారు (కట్టుకునేవారు). రేగడిమట్టితో చేసిన సాదాపొయ్యికి మూడువైపులా మట్టిగోడలుంటాయి. ప్రతీ గురువారం రాత్రి ఈ ప్రాంతమంతా ఎర్రమన్ను లేదా పేడతో అలికి ముగ్గులు పెట్టి శుక్రవారం రోజు వంట ప్రారంభిస్తారు. ఒకేసారి వంట చేస్తూ నీళ్లు వేడి<noinclude><references/> {{c|3}}</noinclude> r68ok24w66a50t1si98t9k33ru0k4u2 564538 564537 2026-07-14T14:35:53Z శ్రీరామమూర్తి 1517 564538 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> నగరంలో ఓరగంత బెద్ద యెలుంగున నమ్మె సంపెంగ నూనె' అన్న మాటలు ఆనాడు సాధారణమైన నూనెతోపాటు సంపెంగవంటి సువాసన గల నూనెలను కూడా ఉపయోగించేవారని తెలుస్తోంది. 'జొన్నలు గొన్న ౠణంబు నీగుదున్' అని చెప్పడం వల్ల ఆనాటి పనివారికి డబ్బులు బదులు జొన్నలు జీతంగా ఇచ్చేవారని తెలుస్తోంది. రెడ్డిరాజుల కాలం నుండి నేటి వరకు తెలంగాణాలో వరి ముఖ్యమైన పంటగా పండిచబడేది. వీరి కాలంలో వరి, చెరకు, తేనె, పప్పు ధాన్యాలు, పాలు, నూనె, పండ్లు విరివిగ లభ్యమయ్యేవి. పండితుల రచనల్లోనే కాదు పామరులు, జానపదుల పాటల్లో కూడా ఆహార పదార్థాలు చోటు చేసుకున్నాయి. అందుకే 'తిండి కలిగితె కండ కలదోయ్... కండ కల్గినవాడే మనిషోయ్!' అన్నారు గురజాడవారు. '''సామెతల్లో ఆహారం:''' “అన్నదాత సుఖీభవ” - కడుపునిండ, రుచికరమైన భోజనం తిన్న తర్వాత ప్రతీ ఒక్కరు అనుకునే మాట ఇది. మనుష్యులందరికీ {{Css image crop |Image = తెలంగాణ_రుచులు.pdf |Page = 24 |bSize = 464 |cWidth = 114 |cHeight = 161 |oTop = 164 |oLeft = 53 |Location = left |Description = }} కూడు, గూడు, గుడ్డ తప్పకుండా కావలసినవి. అందులో తిండి చాలా ముఖ్యం. కోటి విద్యలు కూటికొఱకే అని ఊరకే అనలేదు. ఆకలిగొన్నవాడికి భైరవి రాగం కంటే, రవివర్మ చిత్రం కంటే పచ్చడన్నమే 'ఆకలి రుచెరుగదు' అని సామెత చెప్పిన మన పూర్వీకులే 'పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచీ' అని కూడా సెలవిచ్చారు. అంతేకాదు సామెతల్లో కూడా ఆహారపదార్థాలని తెలియజేసేవి ఉన్నాయి. వ్యవసాయ పనులకు వెళ్లేవాళ్లు పొద్దున్నే చద్దన్నంలో ఆవకాయ లేదా పచ్చడి వేసుకుని తినేవాళ్లు. దూరప్రయాణంలో కూడా చద్దిమూట కాస్త ఆవకాయ వేసుకుని వెంట తీసుకెళ్లేవారు. అందుకే ఎద్దు లేని సేద్యం చద్ది లేని పయనం అనేవారు. పిండి, నూకలు కలిపి జావగా చేస్తే అదే అంబలి అంటారు. ఇది ఎక్కువగా పేదవారు తాగుతారు. అంబలి అంటే మొగాలే చెపుతాయి, అంబలి తినే సమయాన అమతమబ్బినట్టు అనేవారు. పేదవారు అన్నం లేకపోతే ఇంటింటికి తిరిగి వారు పారబోసే గంజిని తెచ్చుకుని ఉప్పేసుకుని తాగేవారు అదే వాళ్లకు పంచభక్ష్య పరమాన్నం. 'ఎద్దులా కష్టపడినా గంజికి గతిలేదు', 'గతి లేనమ్మకు గంజే పానకం', 'కాలే కడుపుకు మండే గంజి' లాంటి సామెతలు కూడా వాడుకలో ఉన్నాయి. 'కుడుములు వండని పడతి (ఇల్లాలు) కూనిరాగం తీయని మగాడు ఉండరు', 'రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు', 'రొట్టెలోడి కంటే తునకలోడు మేలు', 'కక్కదింటే గారెలు చేదు', 'తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి' మొదలైన సామెతలు అందరికీ తెలిసినవే. '''వంటిల్లు, పొయ్యి :''' తెలంగాణాలో వంటిల్లు విడిగా ఇంటి వెనకాల ఉంటుంది. పొయ్యి పక్కన తప్పనిసరిగా 'కూరాడు' కూడా ఉంటుంది. ఈ కూరాడు కుండలో బియ్యం కడిగిన నీళ్లు, అన్నం వంపిన గంజి వంటివి కలిపి మూతపెట్టి ఉంచుతారు. వంటింట్లో ఉత్తర దిక్కున కట్టెల పొయ్యి ఉంటుంది. తాగేనీటిని మంచి కుండలో పోసి మూత పెట్టి కుదురుద పెడతారు. దాని మీద మూకుడుని కడిగి పెట్టి కొబ్బరిచిప్పతో చేసిన'చిప్పకట్టె'ను పెడ్తారు. ఎవరుబడితే వాళ్లు కుండలో చేతులు పెట్టకుండా ఈ చిప్పకట్టెతో నీళ్లు తీసుకుంటారు. వంటకు ఉపయోగించే సామాన్లు ఎన్నో ఉన్నాయి. రోలు, రుబ్బురాయి, రాచ్చిప్ప, విసుర్రాయి, కుదురు, కుందెన, రోకలి, రోకలిబండ.. పిండి చేసుకోవాలన్నా, ధాన్యం పొట్టు పోగొట్టటానికి, పొడులు, పచ్చళ్లు లేదా {{Css image crop |Image = తెలంగాణ_రుచులు.pdf |Page = 24 |bSize = 464 |cWidth = 177 |cHeight = 119 |oTop = 441 |oLeft = 240 |Location = right |Description = }} తొక్కులు చేసుకోవాలంటే సామాన్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. పాటలు పాడుకుంటూ చేసే ఈ పనులే ఇంటి ఇల్లాలికి మంచి వ్యాయామంగా ఉండేవి. పొయ్యిలో కూడా అనేక రకాలు ఉండేవి. అవి ఇటుకలతో గాని, మట్టితోగాని పొయ్యిలు వేసుకునేవారు (కట్టుకునేవారు). రేగడిమట్టితో చేసిన సాదాపొయ్యికి మూడువైపులా మట్టిగోడలుంటాయి. ప్రతీ గురువారం రాత్రి ఈ ప్రాంతమంతా ఎర్రమన్ను లేదా పేడతో అలికి ముగ్గులు పెట్టి శుక్రవారం రోజు వంట ప్రారంభిస్తారు. ఒకేసారి వంట చేస్తూ నీళ్లు వేడి<noinclude><references/> {{c|3}}</noinclude> laofx8gd0prmd28ei5x127smxyownva ఆనందమఠము/పదునేడవ ప్రకరణము 0 216059 564535 564473 2026-07-14T14:34:05Z Rajasekhar1961 50 564535 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = పదునేడవ ప్రకరణము | ముందరి = [[../పదునాఱవ ప్రకరణము/]] | తదుపరి = [[../పదునెనిమిదవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=96 fromsection="96B" to=99 tosection="99A" /> 5yjxljr9dwwb7eyg0fp5dm6crlftxjj పుట:ఆంధ్ర భగవద్గీత.djvu/158 104 216073 564509 2026-07-14T12:55:44Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 564509 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||పదునెనిమిదవ యధ్యాయము|141}}</noinclude><poem> {{left margin|5em}} యీవు పరమప్రియుండవై యెసఁగునట్టి దానికతమునఁ జెపుదు హితంబు నీకు. {{float right|64}} మత్తకోకిల॥ నన్నె మానసమందు నిల్పుమ నాకె సేవ యొనర్పుమా నన్నెగూర్చి నమస్కరింపుమ నాకె పూజ యొనర్పుమా నన్నె పొందఁగలాఁడ వింక ధనంజయ 'మది నమ్ముమా అన్న నిక్కము బాసయిచ్చెద నైతి నాకుఁ బ్రియుండవే. {{float right|65}} కం॥ నర సర్వధర్మములనుం బరిత్యజించి శరణందుమా నన్నే నీ యురుదోషంబులు పాచుచుఁ బరిరక్షించెదను నిన్ను వగవకు మింకన్. {{float right|66}} కం॥ కఱపితిని నేను నీ కిది యెఱుఁగఁ దపము భక్తి శ్రద్ధ యెవ్వియు నెవ్వఁ డెఱుఁగఁ డెవఁడు న న్నొల్లం డెఱిఁగింపఁగరాదు వాని కెన్నఁడు కఱ్ఱీ. {{float right|67}} ఉత్సాహ॥ అరయఁ బరమ మౌరహస్య మైనయట్టి దీని నె వ్వ రుపదేశ మాచరించువారు నాకు భక్తులై పరఁగువారి కల్లవారు పరమభక్తి నాపయిం గరము కలిగి నన్నుఁ బొందఁగలరు నిక్కువమ్ముసూ. {{float right|68}} ఉత్సాహ॥ క్రీడి వారికంటె మిగులఁ బ్రియము చేయునట్టివాఁ డేడఁ జూడఁ గాను నాకు నీమనుష్యకోటిలో లేఁడు వారికంటె నోచె లీప్రియుండు పుట్టనుం బోఁడు నువ్వె యింకమీఁద భూమిమీఁద నాకునున్. {{float right|69}} కం॥ మనయిరువుర దగునీపా వనసంవాదంబు ధర నెవఁడు భక్తిఁబఠిం </poem><noinclude><references/></noinclude> jvz1vvmie0no5s23szqhfrtu9wyg73h పుట:ఆంధ్ర భగవద్గీత.djvu/159 104 216074 564511 2026-07-14T13:08:51Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 564511 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|142|భగవద్గీత|}}</noinclude><poem> {{left margin|5em}} చును వాఁడు జ్ఞాన యజ్ఞం బున ననుఁ బూజించినట్టి పురుషుఁడు తలఁపన్. {{float right|70}} కం॥ పుడమి మఱి యీసు లే కె వ్వఁడు శ్రద్ధం దీని వినును వాఁడుం దగ ము క్తుఁ డయి ఘనపుణ్యకర్ములు వడసెడుశుభలోకములను బడయుం జుమ్మీ. {{float right|71}} కం॥ అనఘా యీశాస్త్రంబుం బొనరఁగ నేకాగ్రచిత్తమున వింటే నీ కును జ్ఞానము లేమిని బు ట్టినయవివేకంబు నిను విడిచి చనెనొక్కో. {{float right|72}} వ॥ ఇట్లుభగవంతుండు బోధించుటయు నర్జునుండు. ఉత్సాహ॥ అనఘ యిపుడు నీయనుగ్రహమున నాదుమోహ మె ల్లను నశించె మంచితెలివి లబ్ధ మయ్యె నామనం బునను బొడమి యింతదాఁకఁ బొడుచుసందియములు వో యెను మహాత్మ నీదుపంపు నింక నెమ్మిఁ జేసెదన్. {{float right|73}} వ॥ అనిప్రత్యుత్తరంబిచ్చెననిచెప్పి సంజయుండు మరల ధృతరాష్ట్రునితో నిట్లనియె. కం॥ అమరంగ వాసుదేవున కు మహాత్ముండైననరునకును నిటు సంవా దము జరగఁగ నద్భుతగతి ని మెయి గగుర్పొడువ వింటిని మహీనాథా. {{float right|74}} తే॥ గీ॥ అఖిలయోగేశ్వరుం డైనయట్టి కృష్ణుఁ డీపరమగుహ్యయోగం బిలేశ తనకుఁ దాన చెప్పంగ నేను బ్రత్యక్షముగను </poem><noinclude><references/></noinclude> m5yn6wrackgdfybvudsyxha8jhurjss పుట:ఆంధ్ర భగవద్గీత.djvu/160 104 216075 564512 2026-07-14T13:19:01Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 564512 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||పదునెనిమిదవ యధ్యాయము|143}}</noinclude><poem> {{left margin|5em}} జక్కఁగా వింటి వ్యాసప్తసాదమునను. {{float right|75}} కం॥ నరనాధ పావనాద్భుత నరహరిసంవాద మిపుడు నామదిలోనన్ స్మరియించుచు స్మరియించుచుఁ బొరిఁబొరి నానందమందుఁ బొదలుచు నుంటిన్. {{float right|76}} కం॥ నరవర యద్భుత మగుత ద్ధరి రూపమునుం దలంచి తలఁచి కరమ్మ చ్చెరువుం బొందితి మఱియుం బొరిఁబొరి నానందమందుఁ బొదలుచు నుంటిన్. {{float right|77}} కం॥ ఎక్కడ విలుకాఁ డర్జునుఁ డెక్కడ యోగేశ్వరుండు కృష్ణుండు గలం డక్కడ లక్ష్మీయు గెలుపును నిక్కముగా భూతి నీతి నిలుచునటందున్. {{float right|78}} </poem> {{c|గద్యము.}} {{c|ఇది శ్రీ త్రికవిమిత్ర తాడూరి రామనభట్టారకాగ్రపుత్ర పండితారా}} {{c|ధన మండిత లక్ష్మీనరసింహ పండిత ప్రణీతంబైన యుపనిషత్తు}} {{c|ను బ్రహ్మవిద్యయును యోగశాస్త్రంబును శ్రీకృష్ణా}} {{c|ర్జున సంవాదంబును నగు శ్రీభగవద్గీతయందు}} {{c|మోక్షసన్యాసయోగంబను}} {{c|నష్టాదశాధ్యాయము.}} {{c|కృష్ణార్పణమస్తు.}} {{Css image crop |Image = ఆంధ్ర భగవద్గీత.djvu |Page = 160 |bSize = 600 |cWidth = 137 |cHeight = 77 |oTop = 843 |oLeft = 206 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> 7jxhxhl2w05yuffi5cslmso789sfows పుట:తెలంగాణ రుచులు.pdf/1 104 216076 564515 2026-07-14T13:46:18Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 564515 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude> {{Css image crop |Image = తెలంగాణ రుచులు.pdf |Page = 1 |bSize = 600 |cWidth = 593 |cHeight = 765 |oTop = 8 |oLeft = 5 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> kv7dfruis9n2c5knmvlha9it5zn2rub పుట:తెలంగాణ రుచులు.pdf/2 104 216077 564516 2026-07-14T13:48:16Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 564516 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{Css image crop |Image = తెలంగాణ రుచులు.pdf |Page = 2 |bSize = 600 |cWidth = 600 |cHeight = 776 |oTop = -2 |oLeft = -2 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> 9v77cmqd962wydoj1vw4ltlp1y9w3gn రచయిత:జ్యోతి వలబోజు 102 216078 564521 2026-07-14T14:10:06Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{రచయిత |ఇంటిపేరు = వలబోజు |అసలుపేరు = జ్యోతి |పేరు_మొదటి_అక్షరం = జ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = జ్యోతి వలబోజు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లం...' 564521 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = వలబోజు |అసలుపేరు = జ్యోతి |పేరు_మొదటి_అక్షరం = జ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = జ్యోతి వలబోజు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[తెలంగాణ రుచులు]] () {{small scan link|Prasararamukulu022372mbp.pdf}} 8mevoa1hb13us3ad3vre3fxadzslnyx 564522 564521 2026-07-14T14:10:51Z Rajasekhar1961 50 /* రచనలు */ 564522 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = వలబోజు |అసలుపేరు = జ్యోతి |పేరు_మొదటి_అక్షరం = జ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = జ్యోతి వలబోజు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[తెలంగాణ రుచులు]] (2019) {{small scan link|తెలంగాణ రుచులు.pdf}} ijikfbqgihan8wz3rpdqps73h6wvmts ఆనందమఠము/పదునెనిమిదవ ప్రకరణము 0 216079 564539 2026-07-14T14:36:55Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = పదునెనిమిదవ ప్రకరణము | ముందరి = [[../పదునేడవ ప్రకరణము/]] | తదుపరి = ../ ప్రక...' 564539 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = పదునెనిమిదవ ప్రకరణము | ముందరి = [[../పదునేడవ ప్రకరణము/]] | తదుపరి = [[../ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=99 fromsection="99B" to=109 tosection="109A" /> dgzi0vyjw6mih8ak7qmw0754ree6yr6 564540 564539 2026-07-14T14:37:47Z Rajasekhar1961 50 564540 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = పదునెనిమిదవ ప్రకరణము | ముందరి = [[../పదునేడవ ప్రకరణము/]] | తదుపరి = [[../పందొమ్మిదవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=99 fromsection="99B" to=103 tosection="103A" /> kb6kfvyv0o1iy83pkqj3j62y50w7j5a ఆనందమఠము/పందొమ్మిదవ ప్రకరణము 0 216080 564542 2026-07-14T14:47:27Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = పందొమ్మిదవ ప్రకరణము | ముందరి = [[../పదునెనిమిదవ ప్రకరణము/]] | తదుపరి = ../ ప...' 564542 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = పందొమ్మిదవ ప్రకరణము | ముందరి = [[../పదునెనిమిదవ ప్రకరణము/]] | తదుపరి = [[../ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=103 fromsection="103B" to=109 tosection="109A" /> bjrbmzd3y6oy62z248mc49je1b5ipvf 564543 564542 2026-07-14T14:48:22Z Rajasekhar1961 50 564543 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = పందొమ్మిదవ ప్రకరణము | ముందరి = [[../పదునెనిమిదవ ప్రకరణము/]] | తదుపరి = [[../ఇరువదియవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=103 fromsection="103B" to=106 /> hy2bo874y54wuf7801fur8cl3npxd9i పుట:కాకతీయ ప్రస్థానం.pdf/1 104 216081 564544 2026-07-14T14:49:38Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 564544 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude> {{Css image crop |Image = కాకతీయ ప్రస్థానం.pdf |Page = 1 |bSize = 600 |cWidth = 605 |cHeight = 615 |oTop = -5 |oLeft = -7 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> 3bt0kbhv1381rsc5hozv1eccjy25bwl ఆనందమఠము/ఇరువదియవ ప్రకరణము 0 216082 564545 2026-07-14T14:49:50Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదియవ ప్రకరణము | ముందరి = [[../పందొమ్మిదవ ప్రకరణము/]] | తదుపరి = ../ ప్రక...' 564545 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదియవ ప్రకరణము | ముందరి = [[../పందొమ్మిదవ ప్రకరణము/]] | తదుపరి = [[../ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=107 to=116 /> 2xh3ejamb46ilsh9ygg81p2pk54606j 564547 564545 2026-07-14T14:51:23Z Rajasekhar1961 50 564547 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదియవ ప్రకరణము | ముందరి = [[../పందొమ్మిదవ ప్రకరణము/]] | తదుపరి = [[../ఇరువదొకటవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=107 to=111 /> 6vzzhij8ndroypir7ktbqxjb14x0pvc పుట:కాకతీయ ప్రస్థానం.pdf/2 104 216083 564549 2026-07-14T14:55:28Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 564549 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{Css image crop |Image = కాకతీయ ప్రస్థానం.pdf |Page = 2 |bSize = 600 |cWidth = 267 |cHeight = 222 |oTop = 24 |oLeft = 166 |Location = center |Description = }} {{c|రచన}} {{c|'''నగేష్ బీరెడ్డి'''}} {{c|ముందుమాట}} {{c|'''కట్టా శేఖర్ రెడ్డి'''}} {{c|సంపాదకులు}} {{c|'''మామిడి హరికృష్ణ'''}} {{Css image crop |Image = కాకతీయ ప్రస్థానం.pdf |Page = 2 |bSize = 600 |cWidth = 62 |cHeight = 59 |oTop = 453 |oLeft = 269 |Location = center |Description = }} {{c|'''భాషా సాంస్కృతిక శాఖ'''}} {{c|కళాభవన్, రవీంద్రభారతి ప్రాంగణం, హైదరాబాద్ - 500 004.}} {{c|ఫోన్: 040-23212832}}<noinclude><references/></noinclude> fzo7lpcwwtdgp3msfzx88ewgae2rzr5 ఆనందమఠము/ఇరువదొకటవ ప్రకరణము 0 216084 564556 2026-07-14T17:33:09Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదొకటవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదియవ ప్రకరణము/]] | తదుపరి = ../ ప్రకర...' 564556 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదొకటవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదియవ ప్రకరణము/]] | తదుపరి = [[../ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=111 to=119 /> iz1pbc6pqj9yl5x9g86vbk7wjxnpbb5 564557 564556 2026-07-14T17:33:30Z Rajasekhar1961 50 564557 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదొకటవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదియవ ప్రకరణము/]] | తదుపరి = [[../ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=112 to=119 /> ilv7klqfy6xyx0pywx4sg2yunznhwb9 564558 564557 2026-07-14T17:34:54Z Rajasekhar1961 50 564558 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదొకటవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదియవ ప్రకరణము/]] | తదుపరి = [[../ఇరువది రెండవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=112 to=119 /> edl6a6fcgz1jzmpxjprdfcz9y2laq2n 564559 564558 2026-07-14T17:35:30Z Rajasekhar1961 50 564559 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదొకటవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదియవ ప్రకరణము/]] | తదుపరి = [[../ఇరువది రెండవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=112 to=116 /> 5xy1nbnqbwf1dnq3f47fb8lfsio5wt5 ఆనందమఠము/ఇరువది రెండవ ప్రకరణము 0 216085 564560 2026-07-14T17:38:25Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువది రెండవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదొకటవ ప్రకరణము/]] | తదుపరి = ../ ప...' 564560 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువది రెండవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదొకటవ ప్రకరణము/]] | తదుపరి = [[../ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=117 to=119 /> jotkazbdyj58qcpyna8eh9igsbo4czs 564561 564560 2026-07-14T17:39:08Z Rajasekhar1961 50 564561 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువది రెండవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదొకటవ ప్రకరణము/]] | తదుపరి = [[../ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=117 to=120 /> nk4c0hwoj64j256s74efct5cb69bew9 564562 564561 2026-07-14T17:42:19Z Rajasekhar1961 50 564562 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువది రెండవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదొకటవ ప్రకరణము/]] | తదుపరి = [[../ఇరువది మూఁడవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=117 to=120 /> eipc1zyfhfsbche6geptrmhb8t8ewgh 564564 564562 2026-07-14T17:45:58Z Rajasekhar1961 50 564564 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువది రెండవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదొకటవ ప్రకరణము/]] | తదుపరి = [[../ఇరువది మూఁడవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=117 to=120 tosection="120A" /> 31mt5q5xc3ntt4tsd1vpusn7vyb5e26 ఆనందమఠము/ఇరువది మూఁడవ ప్రకరణము 0 216086 564565 2026-07-14T17:48:04Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువది మూఁడవ ప్రకరణము | ముందరి = [[../ఇరువది రెండవ ప్రకరణము/]] | తదుపరి = .....' 564565 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువది మూఁడవ ప్రకరణము | ముందరి = [[../ఇరువది రెండవ ప్రకరణము/]] | తదుపరి = [[../ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=120 to=129 tosection="129A" /> hypv4s2ai24eeni3yapugswbybdmyfp 564566 564565 2026-07-14T17:48:45Z Rajasekhar1961 50 564566 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువది మూఁడవ ప్రకరణము | ముందరి = [[../ఇరువది రెండవ ప్రకరణము/]] | తదుపరి = [[../ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=120 to=121 /> o0oy4tho15t3rdk1nceuz00og6qddmg 564586 564566 2026-07-15T02:10:36Z Rajasekhar1961 50 564586 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువది మూఁడవ ప్రకరణము | ముందరి = [[../ఇరువది రెండవ ప్రకరణము/]] | తదుపరి = [[../ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=120 fromsection="120B" to=121 /> 5andib8gi6grxdjb6k3tex0j0gs3535 564587 564586 2026-07-15T02:11:30Z Rajasekhar1961 50 564587 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువది మూఁడవ ప్రకరణము | ముందరి = [[../ఇరువది రెండవ ప్రకరణము/]] | తదుపరి = [[../ఇరువదినాలుగవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=120 fromsection="120B" to=121 /> 44i9w292xhdetsrfnzqmnfxvdfe1gvm పుట:కాకతీయ ప్రస్థానం.pdf/3 104 216087 564568 2026-07-14T18:19:30Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 564568 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude> {{c|<big>'''Kakatiya Prasthanam'''</big>}} {{c|Written by :}} {{c|'''Nagesh Beereddy'''}} {{c|Edited by :}} {{c|'''Mamidi Harikrishna'''}} {{c|First Published in August, 2018}} {{c|© Department of Language & Culture, Govt. of Telangana}} {{c|Published by:}} {{c|'''The Director'''}} {{c|'''Department of Language & Culture'''}} {{c|Ravindra Bharathi, Hyderabad}} {{c|Telangana State, India.}} {{c|Price : Rs. 250/-}} {{c|Cover Design by :}} {{c|'''Kiran Kumar Dasari'''}} {{c|Layout : '''Sridhar Ravula'''}} {{c|ISBN : 978-81-936452-1-5}} {{c|Printed at:}} {{c|'''Sai Likhita Printers'''}} {{c|Khairatabad, Hyderabad - 500 004.}} {{c|Ph: 7207045979}}<noinclude><references/></noinclude> c8rfr4heew4shrs6fhvkgmafsfvv5zv 564569 564568 2026-07-14T18:20:58Z శ్రీరామమూర్తి 1517 564569 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude> {{c|<big>'''Kakatiya Prasthanam'''</big>}} {{c|Written by :}} {{c|'''Nagesh Beereddy'''}} {{c|Edited by :}} {{c|'''Mamidi Harikrishna'''}} {{c|First Published in August, 2018}} {{c|© Department of Language & Culture, Govt. of Telangana}} {{c|Published by:}} {{c|'''The Director'''}} {{c|'''Department of Language & Culture'''}} {{c|Ravindra Bharathi, Hyderabad}} {{c|Telangana State, India.}} {{c|Price : Rs. 250/-}} {{c|Cover Design by :}} {{c|'''Kiran Kumar Dasari'''}} {{c|Layout : '''Sridhar Ravula'''}} {{c|ISBN : 978-81-936452-1-5}} {{c|Printed at:}} {{c|'''Sai Likhita Printers'''}} {{c|Khairatabad, Hyderabad - 500 004.}} {{c|Ph: 7207045979}}<noinclude><references/></noinclude> q1pdajw4f7trws0obt7p6hbhwc5caxv పుట:కాకతీయ ప్రస్థానం.pdf/4 104 216088 564570 2026-07-14T18:27:14Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 564570 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude> {{p|fs125|ac}}ధన్యవాదాలు</p> {{c|'''గౌ॥ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు'''}} {{c|ముఖ్యమంత్రి}} {{c|'''శ్రీ అజ్మీరా చందూలాల్ గారు'''}} {{c|మంత్రివర్యులు - గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ}} {{c|డా॥ కె.వి. రమణాచారి, ఐ.ఏ.ఎస్ (రి) శ్రీ బి.వి. పాపారావు, ఐ.ఏ.ఎస్. (రి)}} {{c|ప్రభుత్వ సలహాదారులు}} {{c|'''శ్రీ బుర్రా వెంకటేశం,''' ఐ.ఏ.ఎస్.}} {{c|ప్రభుత్వ కార్యదర్శి}} {{rh|||- '''మామిడి హరికృష్ణ'''}}<noinclude><references/></noinclude> 4j2y0keyg55s5wnlwbfffbjq6b1q5cd పుట:కాకతీయ ప్రస్థానం.pdf/5 104 216089 564571 2026-07-14T18:28:12Z శ్రీరామమూర్తి 1517 /* పాఠ్యం లేనిది */ 564571 proofread-page text/x-wiki <noinclude><pagequality level="0" user="శ్రీరామమూర్తి" /></noinclude>4<noinclude><references/></noinclude> nzf66fj2a1yh62byxvvl7rfxiiu8wop 564572 564571 2026-07-14T18:29:16Z శ్రీరామమూర్తి 1517 564572 proofread-page text/x-wiki <noinclude><pagequality level="0" user="శ్రీరామమూర్తి" /></noinclude><noinclude><references/></noinclude> ayztjahdx3h8u5dx34xf7xa8j87pkng పుట:Vidya Vikasam VBS JVV.pdf/1 104 216090 564573 2026-07-14T18:38:13Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 564573 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{Css image crop |Image = Vidya Vikasam VBS JVV.pdf |Page = 1 |bSize = 600 |cWidth = 598 |cHeight = 829 |oTop = 3 |oLeft = 0 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> 5cf8j1vk5rll7lcmn6na9n9mwtjldnz పుట:Vidya Vikasam VBS JVV.pdf/2 104 216091 564574 2026-07-14T18:38:59Z శ్రీరామమూర్తి 1517 /* పాఠ్యం లేనిది */ 564574 proofread-page text/x-wiki <noinclude><pagequality level="0" user="శ్రీరామమూర్తి" /></noinclude><noinclude><references/></noinclude> ayztjahdx3h8u5dx34xf7xa8j87pkng ఆనందమఠము/ఇరువదినాలుగవ ప్రకరణము 0 216092 564589 2026-07-15T02:12:33Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదినాలుగవ ప్రకరణము | ముందరి = [[../ఇరువది మూఁడవ ప్రకరణము/]] | తదుపరి = ...' 564589 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదినాలుగవ ప్రకరణము | ముందరి = [[../ఇరువది మూఁడవ ప్రకరణము/]] | తదుపరి = [[../ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=122 to=129 /> qi60szqtxyokope4akhzfnximgaw2x0 564590 564589 2026-07-15T02:13:37Z Rajasekhar1961 50 564590 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదినాలుగవ ప్రకరణము | ముందరి = [[../ఇరువది మూఁడవ ప్రకరణము/]] | తదుపరి = [[../ఇరువదియైదవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=122 to=129 tosection="129A" /> hhmc6ma6nrdy6isf2g7y0071ozgwgc2 ఆనందమఠము/ఇరువదియైదవ ప్రకరణము 0 216093 564592 2026-07-15T02:28:00Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదియైదవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదినాలుగవ ప్రకరణము/]] | తదుపరి = ../...' 564592 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదియైదవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదినాలుగవ ప్రకరణము/]] | తదుపరి = [[../ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=129 fromsection="129B" to=139 tosection="139A" /> cyx1ovbelmbyb1lwb7aoea5jzdxmt40 564593 564592 2026-07-15T02:29:24Z Rajasekhar1961 50 564593 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదియైదవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదినాలుగవ ప్రకరణము/]] | తదుపరి = [[../ఇరువదియాఱవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=129 fromsection="129B" to=140 tosection="140A" /> ngthatd39yee1i0i5714my9vl84qn5a ఆనందమఠము/ఇరువదియాఱవ ప్రకరణము 0 216094 564610 2026-07-15T06:32:29Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదియాఱవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదియైదవ ప్రకరణము/]] | తదుపరి = ../ ప్...' 564610 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదియాఱవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదియైదవ ప్రకరణము/]] | తదుపరి = [[../ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=140 fromsection="140B" to=149 tosection="149A" /> cjdlp8f945akst5ev4s6wv3mwx4tb4j 564612 564610 2026-07-15T06:45:40Z Rajasekhar1961 50 564612 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదియాఱవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదియైదవ ప్రకరణము/]] | తదుపరి = [[../ఇరువదేడవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=140 fromsection="140B" to=149 tosection="149A" /> 205r8t486g4n35cz5ej0qiqvqs687cx 564614 564612 2026-07-15T06:47:46Z Rajasekhar1961 50 564614 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదియాఱవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదియైదవ ప్రకరణము/]] | తదుపరి = [[../ఇరువదేడవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=140 fromsection="140B" to=146 tosection="146A" /> 4vmcj8stakpan84b1sc7ajd7m3yiz18 ఆనందమఠము/ఇరువదేడవ ప్రకరణము 0 216095 564615 2026-07-15T06:49:26Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదేడవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదియాఱవ ప్రకరణము/]] | తదుపరి = ../ప్రక...' 564615 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదేడవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదియాఱవ ప్రకరణము/]] | తదుపరి = [[../ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=146 fromsection="146B" to=149 tosection="149A" /> 8rieigpkxdkg3g1d4rzkcen3ynhjimj 564618 564615 2026-07-15T06:56:18Z Rajasekhar1961 50 564618 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదేడవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదియాఱవ ప్రకరణము/]] | తదుపరి = [[../ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=146 fromsection="146B" to=151 tosection="151A" /> qusvfloh3e7fhpj6kvhsu90u5dln53y 564619 564618 2026-07-15T06:57:15Z Rajasekhar1961 50 564619 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదేడవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదియాఱవ ప్రకరణము/]] | తదుపరి = [[../ఇరువదెనిమిదవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=146 fromsection="146B" to=151 tosection="151A" /> qa5zwocjyze7vggfjvl3n13mrpepmf2 ఆనందమఠము/ఇరువదెనిమిదవ ప్రకరణము 0 216096 564620 2026-07-15T06:58:33Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదెనిమిదవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదేడవ ప్రకరణము/]] | తదుపరి = ../ప్...' 564620 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదెనిమిదవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదేడవ ప్రకరణము/]] | తదుపరి = [[../ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=151 fromsection="151B" to=159 tosection="159A" /> 1a24i9hiovju2xm67ferefqa5c5r7k6 564621 564620 2026-07-15T06:59:48Z Rajasekhar1961 50 564621 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదెనిమిదవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదేడవ ప్రకరణము/]] | తదుపరి = [[../ఇరువది తొమ్మిదవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=151 fromsection="151B" to=154 tosection="154A" /> pbc1kej8a221d1wkbrg4cqi9wk844f9 564623 564621 2026-07-15T07:04:55Z Rajasekhar1961 50 564623 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదెనిమిదవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదేడవ ప్రకరణము/]] | తదుపరి = [[../ఇరువదితొమ్మిదవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=151 fromsection="151B" to=154 tosection="154A" /> n9f4o95fsb2kbfejgnux18lajlg36iu ఆనందమఠము/ఇరువదితొమ్మిదవ ప్రకరణము 0 216097 564624 2026-07-15T07:06:23Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదితొమ్మిదవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదెనిమిదవ ప్రకరణము/]] | తదుపర...' 564624 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదితొమ్మిదవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదెనిమిదవ ప్రకరణము/]] | తదుపరి = [[../ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=154 fromsection="154B" to=159 tosection="159A" /> 83myhu2vwlcvrjzelbr9mfhwsfwrbue 564625 564624 2026-07-15T07:08:13Z Rajasekhar1961 50 564625 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ఇరువదితొమ్మిదవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదెనిమిదవ ప్రకరణము/]] | తదుపరి = [[../ముప్పదియవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=154 fromsection="154B" to=165 tosection="165A" /> m54yzcv64a7g1knnnig46xjovgm5ix1 ఆనందమఠము/ముప్పదియవ ప్రకరణము 0 216098 564628 2026-07-15T07:15:10Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము =ముప్పదియవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదితొమ్మిదవ ప్రకరణము/]] | తదుపరి = ../...' 564628 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము =ముప్పదియవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదితొమ్మిదవ ప్రకరణము/]] | తదుపరి = [[../ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=165 fromsection="165B" to=169 tosection="169A" /> 2ox1fyuijtw35xlvpj37q3u1hn2c5a4 564629 564628 2026-07-15T07:16:13Z Rajasekhar1961 50 564629 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము =ముప్పదియవ ప్రకరణము | ముందరి = [[../ఇరువదితొమ్మిదవ ప్రకరణము/]] | తదుపరి = [[../ముప్పదియొకటవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=165 fromsection="165B" to=169 tosection="169A" /> qm8b3qax76o5spargiyy8un25sykuke గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 2/మల్లారెడ్డి 0 216099 564631 2026-07-15T08:26:54Z Vjsuseela 1850 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 2]] | రచయిత = శేషాద్రి రమణ కవులు | అనువాదం= | విభాగము = [[../మల్లారెడ్డి/]] | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం=1918 }} <pages index="Grandhalay...' 564631 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 2]] | రచయిత = శేషాద్రి రమణ కవులు | అనువాదం= | విభాగము = [[../మల్లారెడ్డి/]] | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం=1918 }} <pages index="Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf" from=24 to=26/> {{PD-India}} [[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]] [[వర్గం:జీవితచరిత్రలు]] p038vwc0lyzx8kblilz34ot6h40mzxq గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 2/శాద్వలము 0 216100 564632 2026-07-15T08:30:15Z Vjsuseela 1850 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 2]] | రచయిత = శేషాద్రి రమణ కవులు | అనువాదం= | విభాగము = [[../శాద్వలము/]] | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం=1918 }} <pages index="Grandhalaya Sarvasv...' 564632 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 2]] | రచయిత = శేషాద్రి రమణ కవులు | అనువాదం= | విభాగము = [[../శాద్వలము/]] | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం=1918 }} <pages index="Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf" from=27 to=28 tosection="28A"/> {{PD-India}} [[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]] tkr1or7kah6530wer4u4hir3kaqhqcg పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/28 104 216101 564634 2026-07-15T08:32:03Z Vjsuseela 1850 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '<section begin="28A" />చ. అలతిగనున్న లేత కస వందునఁ బొల్చిన యచ్చమా కాలం కులఁ, గవఁగూడి యిచ్చమెయిఁ శుల రమణీయ నిస్వనము* పొలుపు రసప్రలుబ్ద జనము గ్రుమ్మకు నం చల మోతలు మదా బ్రకృతి ప్రభ బోధఁజేయు...' 564634 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Vjsuseela" /></noinclude><section begin="28A" />చ. అలతిగనున్న లేత కస వందునఁ బొల్చిన యచ్చమా కాలం కులఁ, గవఁగూడి యిచ్చమెయిఁ శుల రమణీయ నిస్వనము* పొలుపు రసప్రలుబ్ద జనము గ్రుమ్మకు నం చల మోతలు మదా బ్రకృతి ప్రభ బోధఁజేయు నీ దానియించును శాశ్వలస్థలీ. చ. కువలయవై వేఁడివెలుగుల్ దెసల బరగించువేళఁ గెం. గొవ చెలికాఁడు వెన్నెలలఁ దోరముగాఁ వెలయించునప్పు డె క్కువగను మంచువాన చినుకుల్ పదు నత్తఱి నీదు చెల్వ ము త్సవకరమై ప్రమోదమును సంధిలఁ జేయును శార శాద్వలస్థకీ. -- - శేషాద్రిరమణకవులు, శతావధానులు. <section end="28A" /> <section begin="28B" />అలాడు నరసింహకవి ఆంధ్రభాష యందుఁ బురాణములు నుపపురాణములు కూడఁ జాలభాగము భాషాంతరీకరింపఁబడినవి. శైవు లును వైష్ణవులును వారివారి మతములకు సంబంధించిన పురాణములు చాలవఱకు భాషాంతరీకరించి యుండిరి. శైవ వైష్ణవనుత ప్రతిపాదకములగు పురాణములు నుప పురాణములు నెన్ని యో ఆంధ్రపరిశోధక నుహామండలివా రికిఁ జిక్కినవి. అందుఁ బ్రస్తుతము నారదీయమును గురిం చి ప్రస్తావించెదను. క్రొత్తలంక మృత్యుంజయుఁడు వ్రా సిన బృహన్నారదీయము మంచి ప్రతులు 2, 3 వేఱుగ మాకడనున్న వి. ఇప్పుడు చెప్పఁబోవునది నారవేయము. ఇందు ౭ ఆ శ్వాసములు సంపూర్ణముగనున్న వి. ఎనిమిదవ ఆశ్వాసము కొఱఁతలతోనున్న ది, ది. దీనిని రచియించినది అల్లాడు నార సింహకవి. ఇది వైష్ణవమత ప్రతిపాదకమైన గ్రంథము. కృష్ణునకుఁ గృతి యీయఁబడినది. శ్రీకృష్ణుఁడే కృతి భర్త కావున కృతి భర్త వంశావతార వర్ణనముగ విష్ణు పురాణ భాగవతముల సారాంశమంతయుఁ బ్రథమాశ్వా | సమునఁ గవివర్ణించి భక్తిని బ్రదర్శించియున్నాడు. కవిని గురించి యీ క్రింది యాధారములవలనఁ దెలి యఁదగిన విశేషములఁ జరిత్ర కారులు తీసికొందురు గాక ! (౧) ఆదిక విస్తుతియందు కవిత్రయమును మాత్రము పేర్కొ నెను, “నన్నయభట్టు దిక్కక వి నాధుని నెట్టినమంత్రి గొల్చెదకా” అని (అ) కశ్యపుని వంశమునఁ దనపూర్వుల వంశము కలిగి నట్లు చెప్పుకొనినాఁడు. క. కరుణాకర మంత్రీంద్రుఁడు కరుణావరుణాలయుండు గంభీరుం డా తరుణార్క దివ్య తేజుం దురుణానుజ రాజిరాజితాతు. రాజరాజితాత్ముఁడుగలిగెజ్ • అతనికి 'అల్లాడు చన్నప్ప' అను వైష్ణవ భక్తాగ్రే సరుఁడు పుట్టెను. కవి యీ చన్నప్ప కొడుకు.<section end="28B" /><noinclude><references/></noinclude> 426oed8e2hpcn8jjimqqe102dcc66kd గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 2/అలాడు నరసింహకవి 0 216102 564635 2026-07-15T08:36:24Z Vjsuseela 1850 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 2]] | రచయిత = వంగూరి సుబ్బారావు | అనువాదం= | విభాగము = [[../అలాడు నరసింహకవి/]] | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం=1918 }} <pages index="...' 564635 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 2]] | రచయిత = వంగూరి సుబ్బారావు | అనువాదం= | విభాగము = [[../అలాడు నరసింహకవి/]] | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం=1918 }} <pages index="Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf" from=28 to=29 fromsection="28B" tosection="29A"/> {{PD-India}} [[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]] 584ho3ysuxgqnlfgo9kwzstw6xh43ro ఆనందమఠము/ముప్పదియొకటవ ప్రకరణము 0 216103 564639 2026-07-15T09:59:08Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ముప్పదియొకటవ ప్రకరణము | ముందరి = [[../ముప్పదియవ ప్రకరణము/]] | తదుపరి = ../ ప...' 564639 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ముప్పదియొకటవ ప్రకరణము | ముందరి = [[../ముప్పదియవ ప్రకరణము/]] | తదుపరి = [[../ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=169 fromsection="169B" to=179 tosection="179A" /> qdz80b5w7lfos48trnzd4dwitq728ns 564640 564639 2026-07-15T10:00:13Z Rajasekhar1961 50 564640 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ముప్పదియొకటవ ప్రకరణము | ముందరి = [[../ముప్పదియవ ప్రకరణము/]] | తదుపరి = [[../ముప్పది రెండవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=169 fromsection="169B" to=171 /> 9jluxd1t2ml6miicnud1nynxp765hu3 ఆనందమఠము/ముప్పది రెండవ ప్రకరణము 0 216104 564641 2026-07-15T10:01:32Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with ' {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ముప్పది రెండవ ప్రకరణము | ముందరి = [[../ముప్పదియొకటవ ప్రకరణము/]] | తదుపరి =...' 564641 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ముప్పది రెండవ ప్రకరణము | ముందరి = [[../ముప్పదియొకటవ ప్రకరణము/]] | తదుపరి = [[../ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=172 to=179 /> lffbt1n19wp74aweuifyasymuo2fhr3 564642 564641 2026-07-15T10:02:55Z Rajasekhar1961 50 564642 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ముప్పది రెండవ ప్రకరణము | ముందరి = [[../ముప్పదియొకటవ ప్రకరణము/]] | తదుపరి = [[../ముప్పది మూఁడవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=172 to=175 tosection="175A" /> c8320u3r88kx8sql59jtx4ffx59hrge ఆనందమఠము/ముప్పది మూఁడవ ప్రకరణము 0 216105 564644 2026-07-15T10:05:46Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with ' {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ముప్పది మూఁడవ ప్రకరణము | ముందరి = [[../ముప్పది రెండవ ప్రకరణము/]] | తదుపరి...' 564644 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ముప్పది మూఁడవ ప్రకరణము | ముందరి = [[../ముప్పది రెండవ ప్రకరణము/]] | తదుపరి = [[../ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=175 to=179 tosection="179A" /> 0et4rrew3fsugk4c75952apztpidp5u 564646 564644 2026-07-15T10:08:40Z Rajasekhar1961 50 564646 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ముప్పది మూఁడవ ప్రకరణము | ముందరి = [[../ముప్పది రెండవ ప్రకరణము/]] | తదుపరి = [[../ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=175 fromsection="175B" to=179 tosection="179A" /> 96gq9e6k17hwrb01unreq9wamrlw84o 564647 564646 2026-07-15T10:09:19Z Rajasekhar1961 50 564647 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ముప్పది మూఁడవ ప్రకరణము | ముందరి = [[../ముప్పది రెండవ ప్రకరణము/]] | తదుపరి = [[../ముప్పదినాలుగవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=175 fromsection="175B" to=179 tosection="179A" /> 55s4uh95wxe2tflnflhwhh0i6fr4ykz ఆనందమఠము/ముప్పదినాలుగవ ప్రకరణము 0 216106 564649 2026-07-15T10:13:25Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with ' {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ముప్పదినాలుగవ ప్రకరణము | ముందరి = [[../ముప్పది మూఁడవ ప్రకరణము/]] | తదుపర...' 564649 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ముప్పదినాలుగవ ప్రకరణము | ముందరి = [[../ముప్పది మూఁడవ ప్రకరణము/]] | తదుపరి = [[../ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=179 fromsection="179B" to=189 tosection="189A" /> fqhqt9wbqb39vzm63l3pwk0qzt0fd1c 564650 564649 2026-07-15T10:14:17Z Rajasekhar1961 50 564650 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ముప్పదినాలుగవ ప్రకరణము | ముందరి = [[../ముప్పది మూఁడవ ప్రకరణము/]] | తదుపరి = [[../ముప్పదియైదవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=179 fromsection="179B" to=183 /> 9hwqpqdu5u0gj6az7uoybnddofbtlm1 ఆనందమఠము/ముప్పదియైదవ ప్రకరణము 0 216107 564651 2026-07-15T10:15:39Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with ' {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ముప్పదియైదవ ప్రకరణము | ముందరి = [[../ముప్పదినాలుగవ ప్రకరణము/]] | తదుపరి =...' 564651 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ముప్పదియైదవ ప్రకరణము | ముందరి = [[../ముప్పదినాలుగవ ప్రకరణము/]] | తదుపరి = [[../ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=184 to=189 /> jdh26nmc55ftxm586io1lmh4xged5wi 564653 564651 2026-07-15T10:17:28Z Rajasekhar1961 50 564653 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ముప్పదియైదవ ప్రకరణము | ముందరి = [[../ముప్పదినాలుగవ ప్రకరణము/]] | తదుపరి = [[../ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=184 to=188 tosection="188A" /> qlis1zf3ssmkx1xj6svs31yv5zk69zg 564654 564653 2026-07-15T10:17:53Z Rajasekhar1961 50 564654 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ముప్పదియైదవ ప్రకరణము | ముందరి = [[../ముప్పదినాలుగవ ప్రకరణము/]] | తదుపరి = [[../ముప్పదియాఱవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=184 to=188 tosection="188A" /> 24k0nrx4wsxfboalx47145l48mn5kez ఆనందమఠము/ముప్పదియాఱవ ప్రకరణము 0 216108 564657 2026-07-15T10:21:35Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with ' {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ముప్పదియాఱవ ప్రకరణము | ముందరి = [[../ముప్పదియైదవ ప్రకరణము/]] | తదుపరి = ../...' 564657 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ముప్పదియాఱవ ప్రకరణము | ముందరి = [[../ముప్పదియైదవ ప్రకరణము/]] | తదుపరి = [[../ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=188 fromsection="188B" to=198 tosection="198A" /> rg7xproaqwlqzq0e01tcorni8u2tplq 564659 564657 2026-07-15T10:22:34Z Rajasekhar1961 50 564659 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆనందమఠము]] | రచయిత = బంకించంద్ర చటర్జీ |అనువాదం= వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి | విభాగము = ముప్పదియాఱవ ప్రకరణము | ముందరి = [[../ముప్పదియైదవ ప్రకరణము/]] | తదుపరి = [[../ముప్పది యేడవ ప్రకరణము/]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Aananda-Mathamu.pdf" from=188 fromsection="188B" to=195 tosection="195A" /> 2ky1envu71sob27z6vxocp2xu8c19u7 పుట:Kavyamanjari By Veturi Prabhakara Sastry.pdf/11 104 216109 564665 2026-07-15T11:01:15Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నామాట అభినందనం పీఠిక కడుపుతీపు విశ్వాసము విషయ సూచిక దివ్యదర్శనము పాత కథ మూన్నాళ్ల ముచ్చట 8 V viii 1 - 26 27-37 38-60 61-85 86 -107 2' 564665 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>నామాట అభినందనం పీఠిక కడుపుతీపు విశ్వాసము విషయ సూచిక దివ్యదర్శనము పాత కథ మూన్నాళ్ల ముచ్చట 8 V viii 1 - 26 27-37 38-60 61-85 86 -107 2<noinclude><references/></noinclude> sf1hk6obzhdqwos4omc97jd3rnys370