మంజీరా నది

వికీపీడియా నుండి

మంజీరా, గోదావరి యొక్క ఉపనది.

ఈ నది కర్నాటక రాష్ట్రములోని బీదరు జిల్లా పటోడా తాలూకాలో పుట్టి, నైరుతి దిక్కునుండి నిజామాబాదు జిల్లాలో ప్రవేశించి, రెంజల్‌ మండలములోని కందకుర్తి గ్రామము వద్ద గోదావరిలో కలుస్తుంది. మంజీరానది పై, ఇదివరకటి బాన్స్‌వాడ బ్లాక్‌ లోని అచ్చంపేట గ్రామము వద్ద నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణము జరిగినది. ఈ ప్రాజెక్టులో భాగముగా 35 M.V.A.ల స్థాపక సామర్ధ్యము కలిగిన జలవిద్యుత్‌ కేంద్రము కూడా కలదు.