చతుర్వేదాలు
వికీపీడియా నుండి
నాలుగు వేదములు
ఋగ్వేదము
సామవేదము
యజుర్వేదము
అధర్వణవేదము
హిందూమతమునకు, సంస్కృతికి, సంస్కృత భాషకు వేదములు అత్యంతమౌలికమైన ప్రామాణిక సాహిత్యము. దాదాపు అన్ని తత్వములవారు వేదముల ఆధారముగా తమ వాదనను సమర్ధించుకోవడం పరిపాటి. శాక్తేయము, వైష్ణవము,శైవము, అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము - ఇలా ఎన్నో తత్వమార్గాలవారు తమదే వేదాలకనుగుణంగా ఉన్న మార్గము అని వాదించి, తమ తమ తర్కాలను సమర్ధించుకొన్నారు. వేదాల ప్రభావం మతానికే పరిమితం కాదు. పాలనా పద్ధతులు, ఆయుర్వేదము, ఖగోళము, దైనందిన ఆచారాలు - ఇలా ఎన్నో నిత్యజీవనకార్యాలు వేదాలతో ముడివడి ఉన్నాయి.
అయితే బౌద్ధంవంటి సిద్ధాంతాలు మాత్రం వేదాలను పూర్తిగా త్రోసి పుచ్చాయి.
[మార్చు] సంస్కృత సాహిత్యము
పురాతన సంస్కృత సాహిత్యమును మతపరంగా ఆరు విభాగాలు, మతంతో సంబంధం లేకుండా నాలుగు విభాగాలుగా పరిగణిస్తారు. ఆరు మతపరమైన విభాగాలు:
- శృతులు
- స్మృతులు
- ఇతిహాసములు
- పురాణములు
- ఆగమములు
- దర్శనములు
మతంతో సంబంధంలేని విభాగాలు
- సుభాషితములు
- కావ్యములు
- నాటకములు
- అలంకారములు
[మార్చు] వేదములు
శృతులను వేదములనీ, ఆమ్నాయములనీ అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధంబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతను రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను "అపౌరుషేయములు" అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను "ద్రష్ట"లని అంటారు.
మొదట కలగలుపుగా ఉన్న వేదాలను వ్యాస మహర్షి ఒక క్రమం ప్రకారం విభజించాడనీ, కనుకనే ఆయన వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు.
ఇలా వేదాలు నాలుగయ్యాయి.
- ఋగ్వేదము: ఇది అన్నింటికంటె పురాతనమైనది. బహుశా ప్రపంచంలోనే అత్యంత పురాతన సాహిత్యం కావచ్చును. ఇందులో 21 అధ్యాయాలున్నాయి.
- సామవేదము: ఇందులో వెయ్యి అధ్యాయాలున్నాయి.
- యజుర్వేదము: ఇందులో 109 అధ్యాయాలున్నాయి. కాని ప్రధానంగా రెండు ఉపభాగాలున్నాయి.
-
-
-
- కృష్ణ యజుర్వేదము (తైత్తరీయము)
- శుక్ల యజుర్వేదము (వాజసనేయము)
-
-
- అధర్వణవేదముఇందులో 50 అధ్యాయాలున్నాయి.
ఇలా అన్ని వేదాలూ కలిపి లక్షపైగా శ్లోకాలుండాలని అంటారు. కఅని ప్రస్తుతం అమనకు లభించేవి 20,023 మాత్రమే (ఈ సంఖ్య 20,379 అని కూడా అంటారు)
ఒక్కొక్కవేదంలోను, మళ్ళీ నాలుగు ఉప విభాగాలున్నాయి. అవి
- మంత్ర సంహితము: మంత్రములు ఇందులో ఉంటాయి.
- బ్రాహ్మణము: మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేది.
- అరణ్యకము
- ఉపనిషత్తు.