తక్కెళ్ళపాడు

వికీపీడియా నుండి

తక్కెళ్ళపాడు, గుంటూరు జిల్లా, పెదకాకాని మండలానికి చెందిన గ్రామము.

గుంటూరుకు 5 కి.మీ. దూరంలో 5వ నెంబరు జాతీయ రహదారి (NH-5)లో ఈ గ్రామం ఉంది. ప్రస్తుత జనాభా షుమారు 10,000. కాని ఊరు అంతగా అభివృద్ధి చెందలేదని చెప్పవచ్చును. ఊరికి ఒక ప్రక్క ప్రకృతి ఉద్యానవనం (ఎన్.టి.ఆర్. మానస సరోవర్) ఉన్నది. మరో ప్రక్క ఒక దంతవైద్య కళాశాల, ఒక I.T.I ఉన్నాయి. రోడ్లపైన వెళ్ళే పశువుల మంద, గుళ్ళోంచి వినిపించే భక్తి పాటలు, కూడలిలో జనం - ఇది క్లుప్తంగా ఊరి ముఖచిత్రం.

2 చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న ఈ గ్రామానికి 500 సంవత్సరాలపైగా చరిత్ర ఉంది. నది (కాలువ?) ఒడ్డున ఉన్న శివాలయం 150 సంత్సరాలు పురాతనమైనది. 60 పైచిలుకు "అర్ధోత్సవాలు" వైభవంగా జరిగాయి.

వ్యవసాయం ఇక్కడి ప్రధాన వృత్తి. కృష్ణానది నీరు వ్యవసాయానికి ముఖ్యమైన వనరు. పుగాకు, వరి, ప్రత్తి- ఇవి ముఖ్యమైన పంటలు


.