కావూరు (చెరుకుపల్లి మండలం)
వికీపీడియా నుండి
కావూరు గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలంలోని గ్రామం. కల్యాణ కావూరు దీని మరో పేరు. పొన్నూరు నుండి 17 కి.మీ. దూరంలోను, రేపల్లె నుండి 25 కి.మీ. దూరంలోను, తెనాలి నుండి 28 కి.మీ. దూరంలోను, మండల కేంద్రం చెరుకుపల్లి నుండి 3 కి.మీ. దూరంలోను కావూరు ఉంది.
[మార్చు] గ్రామ విశేషాలు
మండలంలోని గ్రామాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటైన మొట్టమొదటి గ్రామం, కావూరు. గ్రామంలోని వినయాశ్రమము ప్రముఖ సామాజిక సేవాకేంద్రం. స్వాతంత్ర్యోద్యమ సమయంలో మహాత్మా గాంధీ ఈ ఆశ్రమాన్ని సందర్శించాడు. గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ కృషి విజ్ఞాన పరిషత్తు, బాలికల గురుకుల విద్యాశాల ఏర్పాటయ్యాయి. గ్రామంలోని వ్యవసాయ పరపతి సంఘం చుట్టుపక్కల గ్రామాలకు కేంద్రంగా ఉంది.
- ఆర్థిక వ్యవస్థ: ముఖ్యంగా వ్యవసాయాధారితం. ప్రధానంగా ప్రకాశం బారేజి నుండి నీటి సరఫరా జరుగుతుంది. మెట్ట ప్రాంత భూములకు వర్షాలు, మరియు వ్యక్తిగత లిఫ్టులు నీటి సౌకర్యం కలిగిస్తున్నాయి. వరి ప్రధానమైన పంట. రెండవ పంటగా మినుమును ప్రధానంగా పండిస్తారు.
- ఆరోగ్యం: గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. మండల కేంద్రమైన చెరుకుపల్లిలో వివిధ ప్రైవేటు ఆసుపత్రులు వైద్య సౌకర్యాలు అందిస్తున్నాయి.
- విద్య: గ్రామంలో కింది విద్యా సౌకర్యాలున్నాయి.
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, హైస్కూలుతో సహా
- తిలక్ జాతీయ ప్రాథమిక పాఠశాల
- గ్రామ ప్రముఖులు:
- తెలుగులెంక, అభినవ తిక్కన బిరుదులు పొందిన తుమ్మల సీతారామమూర్తి కావూరు గ్రామంలో జన్మించాడు.
- ప్రముఖ మందుల తయారీ కంపెనీ నాట్కో ఫార్మస్యూటికల్స్ ను స్థాపించిన నన్నపనేని వెంకన్న చౌదరి కావూరు గ్రామంలోనే చదువుకున్నాడు.
[మార్చు] గణాంకాలు
- జనాభా: 6341
- పురుషులు: 3110
- స్త్రీలు: 3231
- అక్షరాస్యత: 53.65 శాతం
- పురుషుల అక్షరాస్యత: 66.96 శాతం
- స్త్రీల అక్షరాస్యత: 60.17 శాతం