నందన చక్రవర్తి

వికీపీడియా నుండి

నందన చక్రవర్తి 10వ శతాబ్దము లో ప్రస్తుత కర్నూలు జిల్లా ప్రాంతమును పరిపాలించిన రాజు. ఈయన పాండవ వంశమునకు చెందిన ఉత్తుంగ భోజుని కుమారుడు. ఉత్తరాది నుండి దండయాత్రల వలన రాజమండ్రి నుండి పారిపోయి ఈయన దక్షిణమున పెన్నా నది ప్రాంతమునకు చేరి అక్కడ రాజుగా నియమించబడెను. ఈయన కాలములోనే అటవీ మయమైన కర్నూలు ప్రాంతములో అడవిని తొలగించి జనావాసాలు యేర్పరచినారు. నందన చక్రవర్తి ఉత్తరాది నుండి 500 బ్రాహ్మణ కుటుంబములను ఈ ప్రాంతమునకు ఆహ్వానించి వారికి బనగానపల్లె దగ్గరి నందవరము గ్రామమును అగ్రహారముగా ఇచ్చెను.

[మార్చు] పుస్తక మూలములు

  • A Manual of Kurnool District in the Presidency of Madras - Narahari Gopalakristnamah Chetty Pub. Goverment press, Madras. 1886.