అందరూ శ్రీవైష్ణవులే- బుట్టెడు రొయ్యలు మాయ మయాయి.
వికీపీడియా నుండి
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
పొడుపు కధలు
|
ఆశ్చర్యార్థకాలు |
శ్రివైష్ణవులు అంటే బ్రాహ్మణులు. భ్రాహ్మణులు మాంసం భుజించరు. అందరూ వైష్ణవులే - శాకాహారులే - ఉన్న చోట బుట్టలో ఉన్న రొయ్యలు మాయమయ్యాయి. ఉన్నవాళ్ళలోనే ఎవరో తీసి ఉండాలి, అంటే వారిలో ఎవరో ఒకరో, కొందరో మాంసాహారులై ఉండాలన్న మాట. కానీ ఆ విషయం ఎవరూ ఒప్పుకోరు. అలాగే, ఎక్కడైనా ఒక తప్పు పని జరిగినప్పుడు అక్కడ వున్నవారంతా 'నేను కాదంటే నేను కాదు' అని అనే సందర్భంలో ఈ సామెతను వాడుతారు. తప్పు జరిగిపోయింది, అక్కడున్న వాళ్ళలో ఎవరో ఒకరు ఆ పని చేసి ఉండాలి. చేసినట్లు ఎవరూ ఎవరూ ఒప్పుకోవడం లేదు - అందరూ శ్రీవైష్ణవులే, బుట్టెడు రొయలు మాత్రం మాయమయ్యాయి.