Wikipedia:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 22
వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 1764: బక్సర్ యుద్ధం జరిగింది. బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీకి, బెంగాలులో మొగలుల పాలకుడు మీర్ కాసిం సేనలకు మధ్య జరిగిన ఈ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచి, భారత్లో తన అధికారాన్ని స్థిరపరచుకుంది. కంపెనీ సేనలకు హెక్టర్ మన్రో నాయకత్వం వహించాడు.
- 1879: బ్రిటిషు వారు మొట్ట మొదటి రాజద్రోహ నేరాన్ని నమోదు చేసారు. వాసుదేవ బల్వంత ఫడ్కే మొదటి ముద్దాయి.
- 1962: భాక్రానంగల్ ఆనకట్టను ప్రధాని నెహ్రూ జాతికి అంకితం చేసాడు.