సాళువ వంశము

వికీపీడియా నుండి

విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు
మొదటి బుక్క రాయలు
రెండవ హరిహర రాయలు
విరూపాక్ష రాయలు
రెండవ బుక్క రాయలు
మొదటి దేవరాయలు
రామచంద్ర రాయలు
వీర విజయ బుక్క రాయలు
రెండవ దేవ రాయలు
మల్లికార్జున రాయలు
రెండవ విరూపాక్ష రాయలు
ప్రౌఢరాయలు
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు
తిమ్మ భూపాలుడు
రెండవ నరసింహ రాయలు
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు
వీరనరసింహ రాయలు
శ్రీ కృష్ణదేవ రాయలు
అచ్యుత దేవ రాయలు
సదాశివ రాయలు
ఆరవీటి వంశము
అళియ రామ రాయలు
తిరుమల దేవ రాయలు
శ్రీరంగ దేవ రాయలు
రామ రాజు
వేంకటపతి దేవ రాయలు
శ్రీరంగ రాయలు
వేంకటపతి రాయలు
శ్రీ రంగ రాయలు 2
వేంకట పతి రాయలు

సాళువ వంశము విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన రెండవ వంశము. ఈ వంశస్థులు 1485 నుండి 1505 వరకు విజయనగరాన్ని పాలించారు. సాళువ వంశము కన్నడ వంశము. ఈ వంశస్థులు కళ్యాణీపురవరాధీశ్వర అనే బిరుదు ధరించడము వలన కర్ణాటకలోని కళ్యాణీ నగరము వీరి జన్మస్థలమని చరిత్రకారుల అభిప్రాయము. ముస్లింల దండయాత్రలవలన ఆంధ్ర దేశానికి వలస వచ్చారు. వీరి రాజకీయ ప్రాభల్యము కర్నూలు, చంద్రగిరి ప్రాంతాలలో ప్రారంభమైనది.

సాళువ వంశ స్థాపకుడు, సాళువ నరసింహుని ప్రపితామహుడు (ముత్తాత) మంగిరాజుకు ప్రతిపక్ష సాళువ అనే బిరుదు ఉన్నది. బిరుదనామమే వంశనామమయ్యిందని ఒక ఆలోచన. వీరి పూర్వీకులకు కూడా కటారిసాళువ అనే బిరుదు ఉన్నది. అయితే వీరి అసలు వంశనామము తెలియదు.

సాళువాభ్యుదయము గ్రంథమును అనుసరించి కంపరాయల మధురాపురి దండయాత్రలో, శ్రీరంగనాథుని పునప్రతిష్టించుటలో సాళువ మంగిరాజు ప్రముఖ పాత్ర పోషించాడు. ఈయన శ్రీరంగనాథునికి 60వేల మాడలు, 8 గ్రామాలు దానము చేశాడు. అప్పటి నుండి సాళువ వంశస్థులు కర్నూలు, చంద్రగిరి ప్రాంతాలను విజయనగర ఉద్యోగులుగా పాలించినట్లు స్థానిక చరిత్రలు, శాసనాలు చెబున్నాయి కానీ సాళువాభ్యుదయము ప్రకారము సాళువ నరసింహుని తండ్రి గుండరాజు కళ్యాణీ నుండి పాలించాడని చెబుతున్నది. గుండరాజు మరణానంతరము కళ్యాణీ నగరానికి విపత్తు సంభవించగా నరసింహదేవ రాయలు రాజధానిని చంద్రగిరికి మార్చాడట.

[మార్చు] మూలములు

  • ఆంధ్రుల చరిత్ర - బి.యస్.యల్.హనుమంతరావు


విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము