ప్రకాశం బారేజి

వికీపీడియా నుండి

కృష్ణా నదిపై ప్రాజెక్టులు
ప్రకాశం బారేజి
నాగార్జునసాగర్
శ్రీశైలం
తెలుగుగంగ
ఎ.మాధవరెడ్డి ప్రాజెక్టు
శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ
పులిచింతల
ప్రియదర్శిని జూరాల
పోతిరెడ్డిపాడు
ట్రిబ్యునళ్ళు
బచావత్ ట్రిబ్యునల్

కృష్ణా, గుంటూరు జిల్లాలలోని కృష్ణా డెల్టా ప్రాంతానికి సాగునీటిని అందించే నీటిపారుదల ప్రాజెక్టు, ప్రకాశం బారేజి. ఇప్పటి బారేజి 1952లో నిర్మించబడినా, అంతకు 100 సంవత్సరాల కిందటే -1853లో - కృష్ణా నది జలాలను వినియోగించుకోవడాన్ని ఉద్దేశించిన మొట్టమొదటి నిర్మాణం జరిగింది. అదే కాటన్ ఆనకట్ట. తెలుగుదేశంలో సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన రెండు ప్రముఖ ఆనకట్టలలో ఇది రెండోది. మొదటిది, గోదావరి నదిపై గల కాటన్ బారేజి.

విషయ సూచిక

[మార్చు] నేపథ్యం

1832, 1833 లలో ఈ ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడింది. డొక్కల కరువు, నందన కరువు, గుంటూరు కరువు, పెద్ద కరువు గా పేరుపొందిన ఈ కరువు వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఎక్కడ చూసినా శవాలగుట్టలే కనిపించేవి. దాదాపు 40% ప్రజలు ఈ కరువుకు బలయ్యారు. బ్రిటిషు ప్రభుత్వం పన్నుల రూపేణా రూ.2.27 కోట్లు నష్టపోయింది. ఇంత తీవ్ర కరువులోనూ కృష్ణానది ఎండిపోలేదు. అయినా ఆ నీటిని వాడుకునే మార్గం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో కృష్ణ నీటిని సాగుకు వాడుకునే ఉద్దేశంతో నదిపై బెజవాడ (విజయవాడ) వద్ద ఆనకట్టను ప్రతిపాదించారు.

[మార్చు] ఆనకట్ట నిర్మాణం

ప్రతిపాదన కార్యరూపానికి రావడానికి మరో ఇరవై ఏళ్ళు పట్టింది. బెజవాడ వద్ద ఎడమ గట్టునగల ఇంద్రకీలాద్రి, కుడి గట్టున ఉన్న సీతానగరం మధ్య ఈ ఆనకట్ట నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఆనకట్ట నిర్మాణం 1853లో మొదలై, 1854లో పూర్తయింది. 1132 మీ. పొడవు, 4 మీటర్ల ఎత్తుతో అనకట్ట పైగుండా వరదనీరు ప్రవహించేలా నిర్మించబడింది. రూ.1.49 కోట్లు ఖర్చయింది. 10 ప్రధాన కాలువల ద్వారా సాగునీటి సరఫరా చేయడం మొదలుపెట్టారు. కాలువల నిర్మాణాన్ని కాటన్ శిష్యుడైన మేజర్ ఓర్ పర్యవేక్షించాడు. వంద సంవత్సరాలపాటు ఆనకట్ట ప్రజలకు వరప్రసాదమైంది. 1952లో వచ్చిన వరదలకు అది కొట్టుకొని పోవడంతో మరో ఆనకట్ట ఆవశ్యకత ఏర్పడింది.

[మార్చు] బారేజి నిర్మాణం

పాత ఆనకట్ట కొట్టుకొని పోయిన వెంటనే కొత్త బారేజి నిర్మాణం మొదలయింది. పాత ఆనకట్టకు కొద్ది మీటర్ల ఎగువన బారేజిని నిర్మించారు. ఇసుక పునాదులపై నిర్మించిన ఈ బారేజి నీటి నియంత్రణకే కాక, 24 అడుగుల వెడల్పుతో రోడ్డు, రోడ్డుకు రెండు వైపులా 5 అడుగుల వెడల్పుతో నడకదారి కలిగిఉంది. ఈ రోడ్డు చెన్నై, కోల్‌కతా జాతీయ రహదారిలో ఉంది. బారేజీకి తూర్పు, పడమరల్లోని కృష్ణా డెల్టా ప్రాంతంలోని 13.08 లక్షల ఎకరాలకు ఈ బారేజి నుండి సాగునీరు లభిస్తుంది.

1954 ఫిబ్రవరి 13 న మొదలైన బారేజి నిర్మాణం దాదాపు నాలుగేళ్ళలో పూర్తయింది. 1957 డిసెంబర్ 24 న బారేజిపై రాకపోకలు మొదలయ్యాయి. బారేజి నిర్మాణానికి రూ. 2.78 కోట్లు ఖర్చయింది.

[మార్చు] ఆయకట్టు వివరాలు

బచావత్ ట్రిబ్యునల్, కృష్ణా డెల్టా కు 181.2 టి.ఎం.సి.ల నీటిని కేటాయించింది. బారేజి కింద సాగునీరు లభించే ఆయకట్టు వివరాలు

ఎడమ గట్టు - (కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు)
సంఖ్య కాలువ పేరు ఆయకట్టు, ఎకరాలలో
1. ఏలూరు కాలువ 1,15,000 (55,000 పశ్చిమ గోదావరి)
2 రైవస్ & దిగువ పుల్లేరు కాలువ 1,75,000
3 పోలరాజు కాలువ 44,400
4 బంటుమిల్లి కాలువ 64,600
5 కాంప్‌బెల్ కాలువ 49,000
6 బందరు కాలువ 1,07,837
7 ఆర్.ఆర్.పాలెం 32,389
8 ఎగువ పుల్లేరు కాలువ 10,992
9 కృష్ణా ఎడమగట్టు కాలువ 1,36,280
మొత్తం 7,35,498


కుడిగట్టు (గుంటూరు, ప్రకాశం జిల్లాలు)
సంఖ్య కాలువ పేరు ఆయకట్టు, ఎకరాలలో
1 కె.డబ్ల్యు.ప్రధాన కాలువ 22,172
2 కుడిగట్టు కాలువ 1,55,344
3 తూర్పు కాలువ 53,992
4 పశ్చిమ కాలువ 27,588
5 నిజాంపట్నం కాలువ 22,124
6 హైలెవెల్ కాలువ 26,414
7 కొమ్మమూరు కాలువ (బకింగ్‌హాం కాలువ) 2,63,717 (75,500 ప్రకాశం)
మొత్తం 5,71,351


ఎత్తిపోతలు
సంఖ్య కాలువ పేరు ఆయకట్టు, ఎకరాలలో
1 కృష్ణా జిల్లా వైపు 11,500
2 గుంటూరు వైపు 4,500
మొత్తం 16,000