మానసోల్లాస
వికీపీడియా నుండి
అభిలాషితార్థ చింతామణి అని కూడా పిలవబడే మానసోల్లాస 1130 లో కళ్యాణీ చాళుక్య చక్రవర్తి సోమేశ్వర III రచించిన సంస్కృత విజ్ఞాన సర్వస్వము. సోమేశ్వరుడు 1127 నుండి 1139 వరకు కళ్యాణీ ప్రాంతాన్ని పాలంచినాడు. ఆ కాలములో శాంతియుత వాతావరణము నెలకొని ఉండటము వలన మానసోల్లాసను పొందుపరచుటకు వీలైనది. ఆయన ఎంతో శ్రమతో కళలు, శిల్పశైలి, నృత్యము, సంగీతము, ఆభరణములు, వంటకాలు, పానీయాలు, ప్రేమ, శృంగారము మొదలైన వివిధ విషయముల గురించి సమాచారము సేకరించి ఒక క్రమబద్ధమైన విధముగా సమర్పించాడు.
ఈ గ్రంధము ఐదు వింశతులుగా విభజించబడినది. ఒకొక్క వింశతిలో 20 అధ్యాయములు ఉన్నవి. మొత్తము గ్రంధములో వంద అధ్యాయములు కలవు.
[మార్చు] అధ్యాయములు
మానసోల్లాసలోని కొన్ని అధ్యాయములు.
- యోసిదుపభోగ - శృంగారము
- నృత్యవినోద - నాట్య శాస్త్రము
- బలాధ్యాయ - ఏనుగుల పోషణ మరియు సమ్రక్షణ
- గజవ్యాహాళి - ఏనుగులతో క్రీడలు