గాడిచర్ల హరిసర్వేత్తమరావు
వికీపీడియా నుండి
[మార్చు] గాడిచర్ల హరిసర్వేత్తమరావు
స్వాతంత్ర్యసమరయోధుడు , రచయిత, పత్రికా సంపాదకుడు, గ్రంథాలయోద్యమ ప్రముఖులలో ఒకడు.
[మార్చు] తొలి జీవితం
గాడిచర్ల 1883 సెప్టెంబరు 14న కర్నూలు లో జన్మించాడు. మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో ఎమ్.ఏ పట్టాపొంది రాజమండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయశిక్షణా కళాశాలలో అధ్యాపకుడుగా చేరాడు. 1906 లో బి.సి.పాల్ రాజమండ్రి లో చేసిన ఉపన్యాసం విని ప్రభావితుడై హరిసర్వేత్తమరావు ' వందేమాతరం ' బ్యాడ్జిని ధరించాడు. ఆ భ్యాడ్జిని తీయడానికి నిరాకరించిన హరిసర్వేత్తమరావును కళాశాల ప్రిన్సిపాల్ మార్క్ హంటర్ కళాశాలనుండి బహిష్కరించాడు. దీనితో ఆయన దేశసేవకు నడుంబిగించి కార్యరంగంలోకి దూకాడు. 1908 లో అతను నిర్వహించిన ' స్వరాజ్య ' పత్రిక లోని ఒకరచనను పురస్కరించుకొని రాజద్రోహ అభియోగం బనాయించి ప్రభుత్వం అతన్ని మూడేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించింది. ఆంధ్రపత్రిక తొలి సంపాదకుడు హరిసర్వేత్తమరావు . మహిళల సమస్యలు పరిష్కరం కోసం " సౌందర్యవల్లి " అనే పత్రిక నడిపాడు. అలాగే ఆంధ్ర వార్త వయోజన విద్యా సమీక్ష, కౌముది, మాతృసేవ, తదితర పత్రికలకు సంపాదకత్వం వహించాడు.