జి.ఎం.సి.బాలయోగి

వికీపీడియా నుండి

గంటి మోహనచంద్ర బాలయోగి ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు మరియు తొలి దళిత లోక్‌సభ స్పీకర్.

బాలయోగి 1951 అక్టోబర్ 1తూర్పు గోదావరి జిల్లా యెదురులంక గ్రామములో గంటి గన్నయ్య మరియు సత్యమ్మ దంపతులకు ఒక దళిత రైతు కుటుంబములో జన్మించాడు. ఈయన ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఏ మరియు లా డిగ్రీలతో పట్టభద్రుడయ్యాడు. 1982 ఏప్రిల్ 16 న విజయకుమారిని వివాహము చేసుకున్నాడు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు మరియు ఒక కుమారుడు.

2002 మార్చి 3 న భీమవరము నుండి తిరిగివస్తుండగా సాంకేతిక లోపమువలన హెలికాప్టర్ ఒక కొబ్బరి చెట్టుకు తగిలి కృష్ణా జిల్లా కువ్వడలంక గ్రామము సమీపములోని ఒక చేపల చెరువులో కూలిపోయి, ఆ ప్రమాదములో బాలయోగి మరణించాడు.

[మార్చు] నిర్వహించిన పదవులు

  • 1987 - 1991 తూర్పు గోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షుడు
  • 1991 10వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు.
  • 1996 - 1998 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు, ఉన్నత విద్యా శాఖా మంత్రి
  • 1998 12వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు.
  • 1998 మార్చి 24 - 2002 మార్చి 3 లోక్‌సభ స్పీకర్
  • 1999 13వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైనాడు.