ఇస్కాన్ టెంపుల్, బెంగుళూరు

వికీపీడియా నుండి

బెంగులూరులోని ఇస్కాన్ టెంపుల్
పెద్దది చెయ్యి
బెంగులూరులోని ఇస్కాన్ టెంపుల్

బెంగుళూరులోని ఇస్కాన్ 1987 సెప్టెంబర్లో ఒక చిన్న అద్దైంట్లో ప్రారంభమయినది.[1] మధు పండిట్ దాస గారి అధ్యక్షతన భూమికై ప్రభుత్వానికి దరకాస్తు పెట్టుకొనగా ప్రస్తుతం గుడి ఉన్న ప్రాంతంలో 11 ఎకరాల స్థలం కేటాయించినారు. అలా కేటాయించిన స్థలంలో 1990 - 1997ల మధ్యలో గుడి కట్టడం పూర్తి అయినది. అలా పూర్తయిన గుడిని 1997 మే 31న అప్పటి రాష్ట్రపతి, డా.శంకర దయాళ్ శర్మ చేతుల మీదుగా ప్రారంభమయినది.

ఇక్కడ బంగారు పూతతో ఉన్న ద్వజస్థంభం, 56 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తయినది. అంతేకాదు (36 అడుగులు x 18 అడుగులు) వైశాల్యం కలిగిన బంగారు పూత గోపురం కూడా ప్రపంచంలోనే అతి పెద్దది.[2]

[మార్చు] మూలాలు

  1. ఇస్కాన్ బెంగలూరు చరిత్ర మరియు వివరణ మొదటి పేజీ
  2. ఇస్కాన్ బెంగలూరు చరిత్ర మరియు వివరణ మూడవ పేజీ

[మార్చు] బయటి లింకులు

  1. ఇస్కాన్ వారి అధికారిక సైటు
  2. ఇస్కాన్ బెంగలూరు వారి అధికారిక సైటు
  3. ఇంటర్‌నెట్‌లోనే ఈ గుడిని సందర్శించండి