నాదెండ్ల భాస్కరరావు

వికీపీడియా నుండి

ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి.


నాదెండ్ల భాస్కరరావు, కాంగ్రేసు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. 1984 లో ఆగష్టు 16 నుండి సెప్టెంబర్ 16 వ తేది వరకు ఒక నెలపాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు.

భాస్కర రావు 1935, జూన్ 23న గుంటూరులో[1] జన్మించాడు. ఈయన తండ్రి పిచ్చయ్య. 1958లో లలిత భాస్కరరావు ను వివాహము చేసుకొన్న ఈయనకు ఇద్దరు కుమారులు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన భాస్కరరావు ఉస్మానియా విశ్వవిద్యాలయము నుంది బి.ఏ ఎల్.ఎల్.బీ పట్టా పొందాడు.

1978 శాసన సభ ఎన్నికలలో విజయవాడ తూర్పు నియోజక వర్గము నుండి కాంగ్రేసు పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి శాసనసభ సభ్యుడయ్యాడు.

1978 నుండి 1989 వరకు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యునిగా కొనసాగిన ఈయన ఆ కాలములోనే మంత్రిగా, కేబినెట్ మంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. 1998 లో ఖమ్మం నియోజక వర్గం నుండి పన్నెండవ లోక్‌సభకు ఎన్నికై పార్లమెంటు సభ్యునిగా కొనసాగుతున్నాడు

[మార్చు] తెలుగుదేశం స్థాపన

1982, మార్చి29 న నందమూరి తారక రామారావుతో కలిసి అంధ్రుల ఆత్మాభిమానమే నినాదముగా తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. పార్టీ ప్రారంభించిన 9 నెలలకే 1983 శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించి ప్రభుత్వం యేర్పాటు చేసింది. రామారావు ముఖ్యమంత్రిగా, నాదెండ్ల భాస్కర రావు ఆయన మంత్రి వర్గములో కేబినెట్ హోదా కలిగిన ఆర్ధిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఆగష్టు 14, 1984
  • ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు టెక్సస్ లో గుండెకు ట్రిపుల్ బైపాస్ శస్త్రచికిత్స చేయించుకొని ఆగష్టు 14, 1984న తిరిగి వచ్చాడు. హైదరాబాదు విమానాశ్రయంలో ఈయన్ను ఆహ్వానించడానికి ఆర్ధిక మంత్రి భాస్కరరావు వెళ్లాడు
  • ఆ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ రాంలాల్ భాస్కరరావును మంత్రి పదవి నుండి తొలగించాడు.
ఆగష్టు 15, 1984
  • ఆగష్టు 15 (స్వాతంత్ర్య దినోత్సవము) ఉదయం గవర్నరు పతిపక్ష కాంగ్రేసు నాయకున్ని కలిశాడు. కేంద్ర ప్రభుత్వము నుండి టెలిఫోన్ సందేశము అందుకొన్నాడు
  • రామారావు గవర్నర్ని కలిసి సభలో తన మద్దతును నిరూపించుకోవడానికి శాసనసభను ఆగష్టు18 న సమావేశపరచవల్సిందిగా కోరాడు.
  • ఉద్వాసన పలికిన ఆర్ధిక మంత్రి, నాదెండ్ల భాస్కర రావు గవర్నర్ని కలిసి తనకు ముఖ్యమంత్రినయ్యే మద్దతు ఉన్నదని. తెలుగుదేశం అసమ్మతి సభ్యులు, కాంగ్రేస్ పార్టీ సభ్యుల మద్దతు తనకున్నదని. మంత్రివర్గమేర్పాటు చేసే అవకాశమివ్వాలని కోరాడు.
  • ఇంతలో తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష కార్యదర్శి ఎన్‌టీ రామారావుకు మద్దతునిస్తున్న 163 మంది సభ్యుల జాబితా గవర్నరుకు పంపాడు.
ఆగష్టు 16, 1984
  • ఆగష్టు 16 ఉదయం నాడెండ్ల భాస్కరరావు తన మద్దతుదారులతో 52 కార్ల పాటాలముతో గవర్నర్ కార్యాలయము చేరుకున్నాడు. కాంగ్రేసు శాసనసభా పక్ష పార్టీ భాస్క్రరావు మద్దతునిస్తున్నా తీర్మానాన్ని గర్వర్నరుకు పంపింది.
  • అదే సమయానికి ఎన్‌టీయార్ తనకు మద్దతునిస్తున్న 163 సభ్యుల జాబితా పత్రికలకు విడుదల చేశాడు. ఆ తరువాత వారిని గవర్నర్ నివాసము ముందు ప్రవేశపెట్టాడు.
  • గవర్నరు ఇరు పక్షాల మద్దతును ప్రత్యక్షముగా అంచనా వేయకుండా రామారావు ప్రభుత్వాన్ని గద్దె దించి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు. [2]


1984 ఆగష్టు 16 న నాదెండ్ల భాస్కరరావు, తన మద్దతుదారులతో పాటు అప్పటి రాష్ట్ర గవర్నరైన రాంలాల్ ని కలిసి పార్టిలో రామారావు మద్దతు కోల్పోయాడని, పార్టీ మద్దతు తనకే ఉన్నదని ప్రధానమంత్రి ఇందిరా గాంధీ లోపాయికారీ సహకారంతో ముఖ్యమంత్రి అయ్యాడు. గవర్నర్ ఈయనకు అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెల రోజులు గడువిచ్చాడు. తాను దొడ్డిదారిన గద్దెనెక్కడంతో రామారావు ప్రజల్లోకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో మిత్రపక్షాలు ఆయనకు ఎంతో సహాయం చేసాయి. నెలరోజుల గడువులో ఎంతో డబ్బు ఖర్చుపెట్టినా, భాస్కరరావు శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయాడు ఫలితంగా సెప్టెంబర్ 16 న భాస్కరరావు ముఖ్యమంత్రిగా వైదొలిగాడు.[3] కేంద్ర ప్రభుత్వం తిరిగి రామారావును ముఖ్యమంత్రిగా ప్రతిష్టించింది. భాస్కరరావు తెలుగు దేశం పార్టీ తన ఆలోచనల రూపమే అని చెప్పుకున్నాడు. అయితే ఈయనే ఆ తరువాత కాలములో అలా ప్రాంతీయ పార్టీని స్థాపించి తప్పుచేశానని చింతించాడు[4]

[మార్చు] మూలాలు

  1. పార్లమెంటు సభ్యుల పేజీ
  2. Democracy Triumphant in India: The Case of Andhra Pradesh - Krishna K. Tummala Asian Survey, Vol. 26, No. 3. (Mar., 1986), pp. 379. [1]
  3. Politics of Defection in India in the 1980s - P. M. Kamath Asian Survey, Vol. 25, No. 10. (Oct., 1985), pp. 1043. [2]
  4. హిందూ పత్రికలో జనవరి 20, 2003న వచ్చిన వార్త


ఇంతకు ముందు ఉన్నవారు:
నందమూరి తారక రామారావు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
16/08/1984—16/09/1984
తరువాత వచ్చినవారు:
నందమూరి తారక రామారావు