కృష్ణా నది
వికీపీడియా నుండి
కృష్ణా నది (Krishna river) ఆంధ్ర ప్రదేశ్ లో రెండవ పెద్ద నది. కృష్ణను తెలుగు వారు ఆప్యాయంగా కృష్ణవేణి అని కూడా అంటారు. మహారాష్ట్ర లోని మహాబలేశ్వర్ కు ఉత్తరంగా, పడమటి కనుమలలోని మహదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీ. ఎత్తున పుట్టింది. తూర్పు దిక్కుగా, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ లలో 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి బంగాళాఖాతంలో కలుస్తుంది.
విషయ సూచిక |
[మార్చు] ప్రయాణం
ద్వీపకల్పం పడమర చివరి నుండి తూర్పు చివరికి సాగే తన ప్రస్థానంలో కృష్ణ 29 ఉపనదులను తనలో కలుపుకుంటూంది. పుట్టిన మహాబలేశ్వర్ నుండి 135 కి.మీ.ల దూరంలో కొయినా నదిని తనలో కలుపుకుంటుంది. తరువాత వర్ణ, పంచగంగ, దోధ్గంగ లు కలుస్తాయి. నది పడమటి కనుమలు దాటాక, జన్మస్థానం నుండి దాదాపు 500 కి.మీ దూరంలో ఘటప్రభ, మలప్రభ నదులు కృష్ణలో కలుస్తాయి. ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశించే ముందు, భీమ నది కలుస్తుంది. తరువాత కర్నూలు కు దగ్గరలో కృష్ణ యొక్క అతిపెద్ద ఉపనది తుంగభద్ర కలుస్తుంది.
తరువాత కొద్ది దూరంలోనే నది నల్లమల కొండల శ్రేణి లోని లోతైన లోయల లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే శ్రీశైలం, నాగార్జున సాగర్ ల వద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించబడ్డాయి. ఇక్కడి నుండి చిన్న చిన్న ఉపనదులైన దిండి, మూసి, పాలేరు, మున్నేరు వంటివి కలుస్తాయి. విజయవాడ వద్ద బ్రిటిషు వారి కాలంలో నిర్మించబడ్డ ప్రకాశం బారేజిని దాటి డెల్టా ప్రాంతంలో ప్రవేశించి, హంసల దీవి వద్ద బంగాళాఖాతం లో కలుస్తుంది.
ఉపనదులు అన్నిటితో కలిపిన కృష్ణా నదీ వ్యవస్థ యొక్క మొత్తం పరీవాహక ప్రాంతం 2,56,000 చ.కి.మీ. ఇందులో మూడు పరీవాహక రాష్ట్రాల వాటా ఇలా ఉంది:
- మహారాష్ట్ర: 26.8%
- కర్ణాటక: 43.8%
- ఆంధ్ర ప్రదేశ్: 29.4%
[మార్చు] కృష్ణా నది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రాలు
కృష్ణా నదికి భారత దేశంలోన్ని ఇతర నదుల వలెనే పౌరాణిక ప్రశస్తి ఉన్నది. ఎన్నో పుణ్య క్షేత్రాలు నది పొడుగునా వెలిసాయి. వీటిలో ప్రముఖమైనవి:
- శ్రీశైలం: ప్రసిద్ధ శివక్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, శ్రీశైలం.
- శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రం (కనకదుర్గ) - విజయవాడ
- అమరావతి: అమరారామం ఇక్కడ శివుడు అమరలింగేశ్వర స్వామి గా పూజలందుకుంటాడు. బౌద్ధుల ఆరామలకు కూడా ఇది ప్రసిద్ధి.
[మార్చు] ప్రాజెక్టులు
కృష్ణా నదిపై ప్రాజెక్టులు |
ప్రకాశం బారేజి |
నాగార్జునసాగర్ |
శ్రీశైలం |
తెలుగుగంగ |
ఎ.మాధవరెడ్డి ప్రాజెక్టు |
శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ |
పులిచింతల |
ప్రియదర్శిని జూరాల |
పోతిరెడ్డిపాడు |
ట్రిబ్యునళ్ళు |
బచావత్ ట్రిబ్యునల్ |
- ప్రధాన వ్యాసము: కృష్ణా నదీ వ్యవస్థలోని ప్రాజెక్టులు
కృష్ణా నది పరీవాహక రాష్ట్రాలు మూడూ కూడా విస్తృతంగా సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించుకున్నాయి. వీటిలో ముఖ్యమైనవి:
[మార్చు] కర్ణాటక
- అలమట్టి ప్రాజెక్టు
- నారాయణపూర్ ప్రాజెక్టు
పై రెంటినీ కలిపి అప్పర్ కృష్ణా ప్రాజెక్టు అని అంటారు.
[మార్చు] ఆంధ్ర ప్రదేశ్
- జూరాల ప్రాజెక్టు
- శ్రీశైలం ప్రాజెక్టు
- నాగార్జునసాగర్ ప్రాజెక్టు
ఇవిగాక, రెండు రాష్ట్రాల్లోనూ మరిన్ని భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు వివిధ నిర్మాణా దశల్లో ఉన్నాయి.
[మార్చు] బయటి లింకులు
భారతదేశ నదులు | |
---|---|
సింధు | బ్రహ్మపుత్ర | గంగ | యమున | సరస్వతి | నర్మద | తపతి | మహానది | వంశధార | గోదావరి | కృష్ణ | కావేరి | పెన్న (పినాకిని) |