బొబ్బిలి
వికీపీడియా నుండి
బొబ్బిలి మండలం | |
---|---|
![]() |
|
జిల్లా: | విజయనగరం |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | బొబ్బిలి |
గ్రామాలు: | 38 |
విస్తీర్ణము: | చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 116.213 వేలు |
పురుషులు: | 57.91 వేలు |
స్త్రీలు: | 58.303 వేలు |
జనసాంద్రత: | / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 58.44 % |
పురుషులు: | 70.75 % |
స్త్రీలు: | 46.35 % |
చూడండి: విజయనగరం జిల్లా మండలాలు |
బొబ్బిలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాలోని ఒక పట్టణం, అదే పేరుతో గల ఒక మండలానికి కేంద్రం. ఉత్కృష్టమైన చరిత్ర కలిగిన పట్టణమిది. పరాసు ప్రభువుల (ఫ్రెంచి) పాలనలో ఒక సంస్థానంగా ఉన్న బొబ్బిలికి పొరుగు రాజ్యం విజయనగరం తో శతృత్వం ఉండేది. ఈ శతృత్వం ముదిరి బొబ్బిలికీ, పరాసు, విజయనగర సంయుక్త సైన్యానికి మధ్య యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ద్ధంలో జరిగిన మారణకాండ, బొబ్బిలి వీరుల వీరమరణాలు, బొబ్బిలి స్త్రీల ఆత్మాహుతి మొదలైనవి బొబ్బిలి కథకు ఒక వీరోచిత జానపద గాథ స్థాయి కల్పించాయి.
విషయ సూచిక |
[మార్చు] బ్రిటిషు వారి కాలంలో బొబ్బిలి గణాంకాలు
బ్రిటిషు వారి ఇంపీరియల్ గెజెట్ ప్రకారం బొబ్బిలి వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి అప్పటి విజాగపటం జిల్లాలో ఉండేది. 1901లో దీని జానాభా 17,387. బొబ్బిలి రాజా వారి సంస్థానం 227 చ.మై. విస్తీర్ణంలో ఉండేది. ఆదాయం - రూ 40,000. అందులో భూమి శిస్తు: రూ 9,000.
[మార్చు] చరిత్ర
1756లో బుస్సీ బొబ్బిలిపై చేసిన దాడి భారత చరిత్రలో ఒక మరపురాని ఘట్టం. బొబ్బిలికి, పొరుగున ఉన్న విజయనగరానికి మధ్య నిరంతర శతృత్వం ఉండేది. విజయనగర రాజు బుస్సీతో చేతులు కలిపి బొబ్బిలిపై దాడి చేసాడు. బొబ్బిలి పురుషులు వీరమరణం చెందగా, స్త్రీలు ఆత్మ త్యాగం చేసారు. యుద్ధం ముగిసాక, వీజయరామరాజు తన గుడారంలో నిదుర పోతుండగా, బొబ్బిలి రాజు బావమరిది యైన తాండ్ర పాపారాయుడు అతడిని హతమార్చాడు.
బొబ్బిలి రాజు రంగారాయుని కుమారుడు, పసి బాలుడు చిన్న రంగారావు బుస్సీకి చిక్కాడు. ఆ బాలుడినే బొబ్బిలి రాజుగా బుస్సీ పట్టాభిషేకం చేసాడు. అయితే అతని పసితనాన్ని అవకాశంగా తీసుకుని బంధువులు రాజ్య పీఠాన్ని ఆక్రమించుకున్నారు. విజయనగరం రాజుతో సంధి కుదిరినా అది తాత్కాలికమే అయింది. ఇద్దరి మధ్యా మళ్ళీ ఘర్షణలు మొదలై బొబ్బిలి రాజు పారిపోయి నిజాము రాజ్యంలో తలదాచుకున్నాడు. 1794 లో బ్రిటిషు వారు చిన్న రంగారావును మళ్ళీ పీఠంపై కూర్చోబెట్టారు.
1801 లో ఆయన కుమారుడితో బ్రిటిషువారు శాశ్వత సంధి ఒడంబడిక కుదుర్చుకున్నారు. రాజా అనే బిరుదును వంశపారంపర్య చిహ్నంగా గుర్తించారు. మహారాజ బిరుదును చిన్న రంగారావు ముని మనుమడైన సర్ వేంకటాచలపతి రంగారావు కు వ్యక్తిగత హోదాగా సమర్పించారు.
[మార్చు] మండలంలోని పట్టణాలు
- బొబ్బిలి (m)
[మార్చు] మండలంలోని గ్రామాలు
- నిమ్మలపాడు
- వెలగవలస (దరి) అడ్డుమండ
- గొపాలరాయుడుపేట
- రాజుపేట
- సీతయ్యపేట
- జనార్ధన రంగ రాయపురం @ కింతలవానిపేట
- లింగంవలస
- కోమటిపల్లి (దరి) బొబ్బిలి
- కలవరాయి అగ్రహారం
- వాకాడవలస
- చింతాడ
- పక్కి
- రాముడువలస
- సివాడవలస
- కొండదెవుపల్లి
- కమ్మవలస
- ముత్తవలస
- పిరిడి
- కృష్ణాపురం
- జగన్నాధపురం (దరి) బొబ్బిలి
- పాత బొబ్బిలి (గ్రామీణ)
- చిత్రకోట బొద్దవలస
- దొంగురువలస
- కసిదొరవలస
- నారాయనప్పవలస
- పరఢి
- బంకురువలస
- భొజరాజపురం
- గొర్ల సీతారాంపురం
- మెట్టవలస
- పనుకువలస (దరి) మెత్తవలస
- గున్నతొటవలస
- బుర్జావలస (దరి) మెత్తవలస
- పెంట
- రంగరాయపురం
- జనార్ధనరంగరాయపురం @ కునుకువానివలస
- అలజంగి
- కరద
[మార్చు] విజయనగరం జిల్లా మండలాలు
కొమరాడ | గుమ్మలక్ష్మీపురం | కురుపాం | జియ్యమ్మవలస | గరుగుబిల్లి | పార్వతీపురం | మక్కువ | సీతానగరం | బాలాజీపేట | బొబ్బిలి | సాలూరు | పాచిపెంట | రామభద్రాపురం | బడంగి | తెర్లాం | మెరకముడిదం | దత్తిరాజేరు | మెంటాడ | గజపతినగరం | బొందపల్లి | గుర్ల | గరివిడి | చీపురుపల్లి | నెల్లిమర్ల | పూసపాటిరేగ | భోగాపురం | దెంకాడ | విజయనగరం మండలం | గంట్యాడ | శృంగవరపుకోట | వేపాడ | లక్కవరపుకోట | జామి | కొత్తవలస