మొదటి దేవరాయలు

వికీపీడియా నుండి

విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు
మొదటి బుక్క రాయలు
రెండవ హరిహర రాయలు
విరూపాక్ష రాయలు
రెండవ బుక్క రాయలు
మొదటి దేవరాయలు
రామచంద్ర రాయలు
వీర విజయ బుక్క రాయలు
రెండవ దేవ రాయలు
మల్లికార్జున రాయలు
రెండవ విరూపాక్ష రాయలు
ప్రౌఢరాయలు
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు
తిమ్మ భూపాలుడు
రెండవ నరసింహ రాయలు
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు
వీరనరసింహ రాయలు
శ్రీ కృష్ణదేవ రాయలు
అచ్యుత దేవ రాయలు
సదాశివ రాయలు
ఆరవీటి వంశము
అళియ రామ రాయలు
తిరుమల దేవ రాయలు
శ్రీరంగ దేవ రాయలు
రామ రాజు
వేంకటపతి దేవ రాయలు
శ్రీరంగ రాయలు
వేంకటపతి రాయలు
శ్రీ రంగ రాయలు 2
వేంకట పతి రాయలు

మొదటి దేవ రాయలు ఇతను రెండవ హరిహర రాయలు కుమారుడు, తన అన్నగారినుండి రాజ్యమును బలవంతముగా స్వాధీనము చేసుకున్నాడు.

విషయ సూచిక

[మార్చు] యుద్దములు

[మార్చు] ఫిరోద్ షా తో తొలి యుద్దం

సింహాసనము ఆక్రమించిన తొలిరోజులలోనే, విజయనగర రాజ్య అంతఃకలహాలను ఆసరాగా చేసుకోని ఫిరోద్ షా విజయనగరమును ముట్టడించి, ఓడించి 32 లక్షల రూపాయలను తీసుకోనిపోయినాడని సయ్యదలీ వ్రాతల వలన తెలుసుతున్నది.

[మార్చు] రెడ్డి రాజులు, బహుమనీలపై విజయాలు

తరువాత కందుకూరును పరిపాలిస్తున్న రెడ్డి రాజులు , ఉదయగిరి రాజ్యమందున్న పులుగునాడు, పొత్తపినాడులను జయించి తమ రాజ్యమున కలుపుకున్నారు, ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే ఉదయగిరి మన దేవరాయలగారికి తండ్రిగారు ఆధీనము చేసిన దుర్గము! ఈ సమయములో మన దేవ రాయలు వారు, రాజమహేంద్రవరంను పరిపాలిస్తున్న కాటయవేమునితో సంధి చేసుకున్నాడు. వీరు ఇద్దరూ కలసి కొండవీటికి చెందిన పెద కోమటి వేమునితో, అతని స్నేహితుడగు అన్న దేవ చోడునితో, బహుమనీ ఫిరోద్ షాతోనూ యుద్దము చేసినారు.

దేవ రాయని మిత్రుడైన కాటయ వేముడు, పెద కోమటి వేముడుతో యుద్దం చేస్తూ వీరమరణం పొందినాడు. దానితో దేవరాయడు రాజమహేంద్రవరం అధిపతిగా కాటయవేముని కుమారుడైన, పది సంవత్సరముల ప్రాయం వాడైన రెండవ కుమార గిరిని కూర్చొనబెట్టి, అల్లాడ రెడ్డి, అతని కుమారులు వేమ , వీర భద్రా రెడ్డి లుతో కలసి శతృవులైన ఫిరోద్ షా, పెద కోమటి వేమా రెడ్డి సైన్యాన్ని ఓడించి రాజమహేంద్రవరం పై అల్లాడరెడ్డి ఆధిపత్యాన్ని నిలబెట్టినాడు.


ఇటువంటి ఓటమి తరువాత ఫిరోద్ షా పానుగల్లు దుర్గమును ఆక్రమించెను, కానీ కొండవీడు, బహుమనీ ల స్నేహాన్ని చూసి కీడు శంకించిన పద్మ నాయకులు (గమనిక: వీరు ఇంతకు ముందు బహుమనీలతో కలసి విజయనగర రాజ్యంపై దండెత్తినారు) విజయనగరాధిపతతితో స్నేహం చేసుకోని పానుగల్లు దుర్గమును ఫిరోద్ షానుండి కాపాడటానికి రెండు సంవత్సరములు యుద్దము చేసినాడు.

ఇటువంటి సమయంలో మన దేవరాయలు వ్యూహాత్మకంగా బహుమనీ సుల్తానులకు కొండవీడునుండి ఎటువంటి సహాయం రాకుండా చేయడానికి సైన్యాన్ని ఏకకాలంలో తీరాంధ్రప్రదేశాన్ని ఆక్రమించడానికి పంపించినాడు. ఈ సైన్యము చాలా అమోఘమైన పురోగతి సాధించి పొత్తపినాడు, పులుగులనాడులను ఆక్రమించి మోటుపల్లిరేవు పట్టాణాన్ని ముట్టడించినది. విజయనగర ప్రభువులు ఈ రెండు యుద్దములందూ విజయాలు సాధించి బహుమనీ సుల్తానులనూ, కొండవీడురాజులనూ ఓడించి నల్గొండ, పానుగల్లు, తీరాంధ్ర మొత్తం విజయనగాన విలీనమయినాయి.

[మార్చు] ఇతర విశేషములు

మొదటి దేవరాయలు ఈ స్పూర్తివంతమైన విజయములతో పాటూ, తన రాజధాని నగరాన్ని చక్కగా పటిష్ట పరిచినాడు, కోట గోడలూ, బురుజులూ కట్టించినాడు, తుంగభద్రా నదికి ఆనకట్ట కట్టినాడు, వ్యవసాయాన్ని అభివృద్ది చేసినాడు. ఇతను సాధించిన విజయాలు తరువాత తరువాత విజయనగరాన్ని ఉన్నతస్తానంలో ఉంచడానికి చాలా తోడ్పడినాయి.



[మార్చు] కవులు

జక్కన అను మహాకవి విక్రమార్క చరిత్రను ఈ కాలముననే రచించినాడు.



విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము


ఇంతకు ముందు ఉన్నవారు:
రెండవ బుక్క రాయలు
విజయనగర సామ్రాజ్యము
1406 — 1422
తరువాత వచ్చినవారు:
రామచంద్ర రాయలు
ఇతర భాషలు