యానాం
వికీపీడియా నుండి
యానాం, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతము లోని ఒక జిల్లా మరియు ఆ జిల్లా యొక్క ముఖ్య పట్టణము. ఈ జిల్లా ఆంధ్ర ప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో 30 చ.కి.మీల విస్తీర్ణములో ఉంటుంది. ఇక్కడ నివశించే 32,000 జనాభాలో, చాలామంది తెలుగు, తమిళము లేదా మళయాళము మాట్లాడతారు.
విషయ సూచిక |
[మార్చు] భౌగోళికము మరియు వాతావరణము
రేఖాంశము: 16°42'ఉత్తరం - 16°46'ఉత్తరం.
అక్షాంశము: 82°11'తూర్పు - 82°19'తూర్పు.
యానాంలో ఉష్ణోగ్రత వేసవిలో 27°సెం. నుండి 45°సెం. వరకు మరియు చలికాలములో 17°సెం. నుండి 28°సెం. వరకు ఉంటుంది. ఎండా కాలంలో ఇక్కడ వాతావరణంలోని తేమ శాతం 68% నుండి 80% వరకు ఉంటుంది. ఈ జిల్లా గోదావరి నది డెల్టాలో ఉంటూంది, ఈ పట్టణము గీదావరి నది కోరింగ నదితో కలిసే చోట ఉంటుంది, బంగాళా ఖాతతీరము నుండి 9 కిలోమీటర్లు దూరములో ఉన్నది.
[మార్చు] జనావాసాలు
యానాం పట్టణమే కాకుండ, అగ్రహారము, దరియలతిప్ప, ఫారంపేట, గ్వెరెంపేట, జాంబవన్పేట, కనకాలపేట, కురసంపేట మరియు మెత్తకూరు మొదలైన గ్రామాలు ఈ జిల్లా యొక్క అధికార పరిధిలో ఉన్నాయి.
[మార్చు] చరిత్ర
1723లో భారతదేశంలో యానాం మూడొ కాలనీగా ఫ్రెంచి పాలనలోకి వెళ్ళింది. అయితే ఆర్ధికంగా పెద్ద పెద్ద ప్రయోజనాలు కనిపించక పోవటం వలన ఈ కాలనీని ఫ్రెంచివారు 1727లో వదిలేసారు. తరువాత 1742లో దీనిని మరలా ఆక్రమించి మొగలు సామ్రాజ్యాధిపతులువద్దనుండి ఒక ఫర్వానా ద్వారా అదికారాన్ని పొందారు. అయితే వారి అంగీకారమును వారు ఇనాంల రూపంలో తెలిపారు. ఆ ఇనాం కాస్తా ఫ్రెంచివారి చేతులలో యానాంగా మారిపోయింది. ఇక్కడి ప్రజలు ఈ ప్రదేశమును మొదట విజయనగర రాజు, బొబ్బిలి యుద్దంలో తనకు సహాయ పడినందుకుగాను, ఫ్రెంచి గెనరల్ అయిన బుషీకి కానుకగా ఇచ్చాడని చెబుతారు. ఇక్కడ బుషీ పేరుతో ఒక వీధి కూడా ఉండి. అంతే కాదు అదే వీధిలో ఉండే ఒక భవంతిలో బుషీ నివశించేవాడనికూడా అంటారు. యానాంకు పడమరలో నీలిపల్లి అనే గ్రామంలో ఆంగ్లేయుల పాలనలో ఉండేది. ఆందుకని యానాము 18వ శతాబ్దంలో అడపాదడపా ఆంగ్లేయుల పాలనలోకి వెళ్ళేది. 1750లో హైదరాబాదు నిజాము, ముసాఫర్ జంగ్, ఫ్రెంచివారి వాదనలను అంగీకరిస్తూ ఈ ప్రదేశమును వారికి అప్పగించాడు.
ఆంగ్లేయులనుండి భారత దేశానికి 1947ళో స్వాతంత్ర్యం వచ్చినా యానాం జూన్ 13 1954 వరకు ఫ్రెంచు వారి ఆధీనంలోనే ఉండి పోయింది.