వికీపీడియా నుండి
రంగారెడ్డి జిల్లా |
రాష్ట్రము: |
ఆంధ్ర ప్రదేశ్ |
ప్రాంతము: |
తెలంగాణ |
ముఖ్య పట్టణము: |
హైదరాబాదు |
విస్తీర్ణము: |
7,493 చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) |
మొత్తము: |
35.06 లక్షలు |
పురుషులు: |
18.06 లక్షలు |
స్త్రీలు: |
17.00 లక్షలు |
పట్టణ: |
18.68 లక్షలు |
గ్రామీణ: |
16.38 లక్షలు |
జనసాంద్రత: |
468 / చ.కి.మీ |
జనాభా వృద్ధి: |
37.41 % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) |
మొత్తము: |
66.31 % |
పురుషులు: |
75.02 % |
స్త్రీలు: |
57.03 % |
చూడండి: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు |
రంగారెడ్డి జిల్లా దక్షిణ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. ఈ జిల్లా యొక్క విస్తీర్ణము 7,493 చ.కి.మీ., మరియు జనాభా 3,506,670 (2001 లెక్కలు). హైదరాబాదు నగరము మరియు జిల్లా చుట్టూ నలువైపుల రంగారెడ్డి జిల్లా ఆవరించి ఉన్నది. హైదరాబాదు నగరమే ఈ జిల్లాకు కూడా పరిపాలనా కేంద్రము.
రంగారెడ్డి జిల్లాకు తూర్పున నల్గొండ జిల్లా, దక్షిణాన మహబూబ్ నగర్ జిల్లా, పశ్చిమమున కర్నాటక రాష్ట్రము మరియు ఉత్తరాన మెదక్ జిల్లా సరిహద్దులు. హైదరాబాదు రాష్ట్రములో బూరుగుల రామకృష్ణా రావు మంత్రివర్గములో మరియు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత నీలం సంజీవ రెడ్డి మంత్రివర్గములో సభ్యుడైన శ్రీ కె.వి.రంగారెడ్డి పేరు మీదుగా జిల్లాకు నామకరణము చేశారు. ఈ జిల్లా ఇంతకు మునుపు హైదరాబాదు జిల్లాతో కలసి ఉండేది కానీ, తర్వాత 1978లో ప్రత్యేక జిల్లాగా అవతరించినది.
[మార్చు] కొన్ని గణాంకాలు, వాస్తవాలు
మనదేశంలో ఉన్న ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన అబ్జర్వేటరీలలో రంగాపూర్ అబ్జర్వేటరీ ఒకటి. ఇది రంగాపూర్ గ్రామంలో ఉంది. ఈ గ్రామం హైదరాబాద్్కి 56 కి.మీ. దూరంలో ఇబ్రహింపట్నం దగ్గరగా ఉంది. జిల్లాలోని కీసరగుట్టలో ఉన్న మల్లికార్జునస్వామి ఆలయం చూడతగింది. వికారాబాద్ కు 4 కి.మీ. దూరంలోని అనంతగిరి పల్లెలోని అనంతస్వామి దేవాలయం ప్రఖ్యాతమైంది. ఈ దేవాలయంలో దేవుని విగ్రహం లేకపోవడం ప్రత్యేకత.
[మార్చు] రంగారెడ్డి జిల్లా మండలాలు
భౌగోళికంగా రంగారెడ్డి జిల్లాను 30 రెవిన్యూ మండలములుగా విభజించినారు.
[మార్చు] బయటి లింకులు