గోదావరి

వికీపీడియా నుండి

కొవ్వూరు వద్ద గోదావరి నది
పెద్దది చెయ్యి
కొవ్వూరు వద్ద గోదావరి నది

గోదావరి నది భారత దేశము లో గంగ, సింధు తరవాత అతి పెద్ద నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకం లో, అరేబియా మహాసముద్రానికి 380 కిలో మీటర్ల దూరంలో జన్మించి దక్షిణ మధ్య భారత దేశము గుండా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోనికి ప్రవేశిస్తుంది. తరువాత అదిలాబాదు, ఖమ్మం జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవేశించి బంగాళా ఖాతము లో సంగమిస్తుంది. ఈ నది ఒడ్డున చాలా ప్రఖ్యాత పుణ్యక్షేత్రములు మరియు పట్టణములు కలవు. భద్రాచలము, రాజమండ్రి వంటివి మచ్చుకు కొన్ని. ధవళేస్వరం దగ్గర అఖండ గోదావరి ఏడు పాయలుగా చీలుతుంది. అవి గౌతమి , వశిష్ఠ , వైనతేయ , ఆత్రేయ ,భరద్వాజ , తుల్య. ఇందులొ , గౌతమి,వశిష్ఠ,వైనతేయ,మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహినిలు. ఆ పాయలు సప్తృషుల పేర్ల మీద పిలువబడుతున్నాయి.

[మార్చు] ఉప నదులు

ఈ వ్యాసం 2005 సెప్టెంబర్ 14 వ తేదీన విశేషవ్యాసంగా ప్రదర్శించబడింది.



భారతదేశ నదులు
సింధు | బ్రహ్మపుత్ర | గంగ | యమున | సరస్వతి | నర్మద | తపతి | మహానది | వంశధార | గోదావరి | కృష్ణ | కావేరి | పెన్న (పినాకిని)