వేటూరి సుందరరామ్మూర్తి
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
వేటూరి గా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి (జ. 192?) సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. వేటూరి జంట కవులుగా పేరు పొందిన తిరుపతి వేంకట కవులు దగ్గర శిష్యరికం చేసారు. తొలినాళ్ళలో పాత్రికేయినిగా పనిచేసిన వేటూరి కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కధ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసారు. తర్వాత కొన్ని వేల పాటలను రాసారు. మహానటుడు నందమూరి తారక రామారావు నటించిన చాలా సినిమాలకి గుర్తుండిపోయే పాటలను రాసారు.
వేటూరి చాలా రకాల పాటలను రాసారు.సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు క్లాస్ నుండి మాస్ వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు.శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు.ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... (నిర్మాత:కె.యస్.రామారావు,దర్శకుడు:అజయ్ కుమార్, సంగీతం:కీరవాణి) అనే పాటకి 1994 వ సంవత్సరానికి గాను ఈ పురష్కారం వచ్చింది.
కళాతపస్వి డా.కె.విశ్వనాథ్, కె.వి.మహదేవన్ మరియు ఇళయరాజాలతో వేటూరి అద్భుతమైన గీతాలను అందించారు. తను రాసిన పాటలలో తాను గొప్పగా భావించే పాటలు సాగర సంగమంలో తకిట తదిమి తకిట తదిమి తందాన..., నాదవినోదము....