తిరుమల తిరుపతి
వికీపీడియా నుండి
![]() |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
విషయ సూచిక |
[మార్చు] తిరుమల
[మార్చు] ఉపోద్ఘాతం
తిరుమల కలియుగ వైకుంఠం. తిరుమల ఆలయాన్ని తోండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తోండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు.
దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు.9వ శతాభ్దానికి చెందిన పల్లవులు, 10 వ శతాభ్దానికి చెందిన చోళులు (తంజావురు) పాండ్య రాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి.
విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతుడైన శ్రీ కృష్ణదేవ రాయలు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి.
[మార్చు] ఉన్న ప్రదేశం
[మార్చు] చేరుకునే విధం
[మార్చు] కాలి నడకన
తిరుమల గుడికున్న ఓ ప్రాముఖ్యత "కాలినడక"! తిరుపతి నుండి పైన కొండలమీద ఉన్న తిరుమల పట్టణానికి చేరడానికి కొండపైన కాలినడక కోసం మెట్లదారి ఉంది, భక్తులు ఈ దారిగుండా వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవడం ఒక మ్రొక్కుగా భావిస్తారు। తిరుమలకి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కాలిబాటలు ఉన్నాయని పెద్దలు చెపుతూ ఉంటారు। ప్రస్తుతం మాత్రం రెండు ఎక్కువ వినియోగంలో ఉన్నాయి. మూడవది, కడప జిల్లా నుండి ఉన్నది కూడా వినియోగంలో ఉందని విన్నాము కానీ వివరాలు పెద్దగా తెలియదు।
[మార్చు] అలిపిరి కాలిబాట
ఇది ఎక్కువ ప్రఖ్యాతిగాంచిన కాలిబాట. దానికి కారణం ఇది తిరుపతి పట్టణం నుండి ఉండటం, తిరుమల తిరుపతి దేవస్థానముల వారు దీన్ని బాగా అభివృద్ధి చేయటం అయి ఉండవచ్చు। బస్సు ద్వారా గాని, రైలు ద్వారా గాని తిరుపతి చేరుకున్న తరువాత మీరు అక్కడి నుండి తిరుమల తిరుపతి దేవస్థానములు వారు నడుపుతున్న ఉచిత బస్సు ద్వారా, లేదా ఆటో ద్వారా (ప్రస్తుతం ౨౦ రూపాయలు), లేదా ప్రయివేటు బస్సు ద్వారా (౪ రూపాయలు ప్రస్తుత చార్జీ), లేదా టాక్సీ/జీపు ద్వారా గాని ఈ కాలిబాట దగ్గరకు చేరుకోవచ్చు।
అక్కడ సాధారణంగా కర్పూరాలు కొని (ఏడు కొండలకు ఏడు అని అమ్ముతుంటారు), దారి మొదట్లో ఉన్న వేంకటేశ్వరుని పాదాల గుడి దర్శనం చేసుకుని నడక కొనసాగిస్తూ దారిలో ఉన్న ఆంజనేయస్వామి చిన్న చిన్న మందిరాలు దర్శిస్తూ నడుస్తారు! మీరు మంచి శరీర దారుఢ్యం గలవారైతే రెండుగంటలు లేదా అంతకు తక్కువ, ఓ మాదిరిగా అయితే మూడుగంటలు, మరీ చిన్నగా నడుస్తూ ప్రతి పదిమెట్లకీ ఆగుతూ ఉంటే ఐదు గంటలు పడుతుంది కొండ చేరుకోవడానికి। ఈ మెట్లదారి సుమారుగా తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది।
మొదటిసారి నడవాలి అని అనుకునేవారికి కొన్ని సలహాలు:
- నెమ్మదిగా నడవండి, పరుగెత్తవద్దు, పరుగెత్తితే తొందరగా అలసిపోతారు।
- సాధ్యమైనంతవరకూ మొదటి గంట ఎక్కడా కూర్చోవద్దు, కూర్చోకుండా నెమ్మదిగా నడిస్తే మొదటి గంటలో మెట్లన్నీ అయిపోయి మామూలు రోడ్డులాంటి దారికి వెళ్తారు, ఇక అక్కడి నుండి మోకాళ్ళ మంటపము వరకూ మెట్లు ఉండవు, ఉన్నా ఒకటీ అరా ఉంటాయి।
- మెట్లకి ఇరువైపులా ఉన్న అంగళ్లలో పానీయాలు, తినుబండారాలు తక్కువ తీసుకోండి। సాధ్యమైనంతవరకు గ్లూకోను డీ, నీళ్లు - వీటిపై ఆధారపడండి, ముఖ్యంగా కూల్ డ్రింకులు ఏ విధంగానూ మన నడకకు సహకరించవు।
- లగేజీలో విలువైన వస్తువులు లేకుండా చూసుకోండి, లగేజి ని కింద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానముల ఉచిత సేవలో పైకి పంపించండి।
[మార్చు] శ్రీవారి మెట్టు కాలిబాట
తిరుమల చేరుకోవడానికి ఇది రెండవ ప్రఖ్యాతి వహించిన కాలిబాట। తిరుమల పట్టణానికి కళ్యాణీ డ్యాము నీటి సరఫరాకి ఈ మార్గం నుండి పైపులైను వేసిన తరువాత నుండి ఈ దారి కొంత అభివృద్ధి చెందింది। అలాగే తిరుమల తిరుపతి దేవస్థానములువారు ఈ కాలిబాటను కూడా బాగా అభివృద్ధి చేస్తున్నారు। దీనికీ, అలిపిరి కాలిబాటకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా ౯ కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట సుమారుగా మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది। అయితే ఈ కాలిబాటతో సమస్య ఏమిటంటే దీనికి చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు ఎక్కువగా లేవు। ఈ దారిగుండానే వేంకటేశ్వరుడు వివాహానంతరం ఆరు నెలలు కాలురుఅగస్త్యేశ్వర స్వామి సన్నిధిలో గడిపి తరువాత తిరుమల చేరుకున్నారు।
ఆంధ్ర ప్రదేశు రోడ్డు రవాణా సంస్థవారు ఇక్కడికి తిరుపతి నుండి, చంద్రగిరి, శ్రీనివాస మంగాపురం ల మీదుగా ఒక బస్సు నడుపుతున్నారు। లేదా మీరు శ్రీనివాస మంగాపురం చేరుకొని అక్కడి నుండి ఆటో లో వెళ్లవచ్చు। శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు సుమారుగా ౬ కిలోమీటర్లు ఉంటాయి। లేదా మీకు ఓపిక ఉంటే శ్రీనివాసమంగాపురం నుండే నడిచి వెళ్ళవచ్చు।
ఈ దారి ద్వారా మొదటిసారి వెళ్లేవారికి కొన్ని సూచనలు:
- ఇక్కడ ఎటువంటి దుకాణాలూ ఉండవు, కనుక మంచినీళ్లు తీసుకొని వెళ్లడం మాత్రం మర్చిపోవద్దు।
- ఎక్కువ జనసంచారం ఉండదు, కనుక గుంపులుగా వెళ్లండి।
[మార్చు] రోడ్డు మార్గం
[మార్చు] రైలు మార్గం
[మార్చు] విమాన మార్గం
[మార్చు] చూడవలసినవి
[మార్చు] తిరుమల ముఖ్యాలయంలో
- గర్భగుడి
ధ్వజ స్తంభం నుండి శ్రీవారిని దర్శించుకోవడానికి వెండి వాకిలి దాటి బంగారు వాకిలి లోకి ప్రవేశించాలి. బంగారు వాకిలి గోపురాన్ని విమానం అంటారు. శ్రీనివాసుడు ఉండే నిలయాన్ని ఆనందనిలయం అంటారు.
- వరదరాజస్వామి గుడి
- రంగనాథ మండపము
- కళ్యాణ మండపము
- విమాన వెంకటేశ్వరస్వామి
విమాన వేంకటేశ్వరస్వామిని శ్రీవారి దర్శనం చేసుకున్నాక ప్రదక్షిణం చేశాక గర్భ గుడి ఉత్తర మాడా వీధి నుండి విమానం పైన దర్శన మిస్తాడు.శ్రీవారి గోపురాన్ని విమానం అంటారు.
- హుండీ
- యోగ నరసింహస్వామి గుడి
- అన్నమయ్య భాండాగారము
అన్నమయ్య భాంఢాగారం లో రాగి మీద చెక్కిన అన్నమయ్య పాటలు ను దాచి ఉంచారు.
[మార్చు] తిరుమల కొండలలో
- పాప వినాశనము
- ఆకాశ గంగ
- గోగర్భం డ్యాము
- తుంబురు తీర్థము
- రామకృష్ణ తీర్థము
- పసుపుధారా కుమారధారా తీర్థము
- స్వామి పుష్కరణి
- కాయరసాయన తీర్థము
- జాబాలి తీర్థము
- శేష తీర్థము
- శ్రీవారి పాదాలు
[మార్చు] మ్యూజియం
బేడీ ఆంజనేయస్వామి దేవాలయము
[మార్చు] శిలా తోరణము
[మార్చు] తిరుపతి
[మార్చు] ఉపోధ్ఘాతం
[మార్చు] తిరుపతి లోని గుడులు
[మార్చు] గోవిందరాజ స్వామి దేవాలయం
తిరుపతిలో మేఘాలను తాకేంత పెద్దదా అనిపించే అద్భుత రాజగోపురంతో తిరుపతికే ప్రత్యేక శోభను కలుగజేస్తున్న గోవిందరాజస్వామి ఆలయం ఉంది. క్రీ.శ. 1130లో రామానుజాచార్యులు ఈ ఆలయాన్ని భక్తజనాంకితం చేశారు. ఈ రాజగోపురాన్ని క్రీ.శ. 1624లో స్వామిభక్తుడు మాట్లి అనంతరాజా నిర్మించారు. గోవిందరాజస్వామి ఆలయం ఆవరణలో అనేకానేక ఆలయాలు ఉన్నాయి. గతంలో ఇది శ్రీకృష్ణ ఆలయం అయినా, నాటి మూలవిరాట్ అయిన శ్రీకృష్ణుని మీద తురుష్కుల విధ్వంస చర్యలవల్ల ఆ విగ్రహం పూజార్హత కోల్పోవటంతో, ఆలయం క్రమంగా గోవిందరాజస్వామి పరమయిందని అంటారు. తిరుమలలోని వేంకటేశ్వరుని పెద్దన్నగా భక్తులు కొలిచే గోవిందరాజస్వామి వారి ఆలయంలో కొన్ని పూజలూ పునస్కారాలూ తిరుమల ఆలయ పూజలతో ముడిపడి ఉంటాయి. ఈ ఆలయంలో స్వామివారి తలకింద ఒక పెద్ద కుంచం ఉంటుంది. వేంకటేశ్వరుడు తన వివాహ సమయంలో, కుబేరుడి వద్ద తీసుకున్న రుణాన్ని సకాలంలో, సరిగ్గా తీర్చే బాధ్యతలో నిమగ్నమయిన గోవిందరాజస్వామి, ఆ ధనాన్ని కొలిచి కొలిచి అలసిసొలసి, రవ్వంత విశ్రమిస్తున్నట్లుగా ఉంటుంది ఈ ఆలయంలోని విగ్రహం!
[మార్చు] కోదండ రామాలయం
ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏమిటంటే, సీతమ్మతల్లి రాములవారికి కుడివైపున ఉండటం! ఇది వైఖానసశాస్త్ర సంప్రదాయం. భద్రాచల రాముడి విగ్రహాన్ని మనం ఒకసారి స్ఫురణకు తెచ్చుకొంటే, అక్కడ సీతమ్మతల్లి, రాములవారి ఎడమవైపు తొడమీద కూర్చున్నట్లున్న దృశ్యం గుర్తొస్తుంది!
[మార్చు] వరద రాజ స్వామి దేవాలయం
[మార్చు] కపిల తీర్థం
శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది. కృతయుగంలో పాతాళలోకంలో కపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, భూమిని చిల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందులో ఇది 'కపిలలింగం'గా పేరొందింది. త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా 'ఆగ్నేయలింగం' అయి, ఇప్పుడు కలియుగంలో కపిలగోవు పూజలందుకుంటోంది. ముల్లోకాలలోని సకల తీర్థాలూ ముక్కోటి పౌర్ణమినాడు మధ్యాహ్నంవేళ పది ఘటికల(నాలుగు గంటల)పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానంచేసి, నువ్వుగింజంత బంగారాన్ని దానంచేసినా, అది మేరుపర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం.
[మార్చు] జీవకోన
[మార్చు] ఇస్కాన్ దేవాలయం
[మార్చు] తిరుపతి లోని చూడదగిన విశేషాలు
[మార్చు] జూ పార్కు
[మార్చు] తిరుపతి చుట్టుపక్కల గుడులు
[మార్చు] శ్రీనివాస మంగాపురం
తిరుపతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీనివాస మంగాపురం. ఇది ఆ శ్రీనివాసుడు విశ్రమించిన చోటు. నారాయణ వనంలో పద్మావతీదేవిని వివాహమాడిన వేంకటేశ్వరుడు, తిరుమలకు వెళ్తూ మార్గమధ్యంలో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నట్లు చెప్తారు. ఇక్కడ కల్యాణ వేంకటేశ్వరుడు నిలువెత్తుగా, బహు సుందరమూర్తిగా దర్శనం ఇస్తాడు.
[మార్చు] అలివేలు మంగాపురం
తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకొన్న భక్తులు- కొండ దిగి ముందుగా చేయాల్సిన పని తిరుచానూర్(దీన్నే అలివేలుమంగాపురం అంటారు)లోని పద్మావతీ అమ్మవారిని దర్శించుకోవటమే! అయితే స్వామివారికన్నాముందే, అమ్మవారిని దర్శించాలని చాలామంది అంటారు. తిరుచానూర్, తిరుపతికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. కార్తీకమాసంలో తిరుచానూర్ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలూ బహువైభవంగా జరుగుతాయి. స్వామికిలాగే, అమ్మవారికీ నిత్య కల్యాణమే.
[మార్చు] చంద్రగిరి కోట
తిరుపతికీ చంద్రగిరి పాలకులకూ అవినాభావ సంబంధం ఉండేది. తిరుమల ఆలయంలో నైవేద్య ఘంటికా రావాన్ని విన్న తర్వాతనే చంద్రగిరి పాలకులు ఏ ఆహారాన్ని అయినా ముట్టేవారట. అలనాటి చంద్రగిరి వైభవాన్ని కనులారా చూడాలంటే... అక్కడ ప్రతిరోజూ జరిగే లైట్ అండ్ సౌండ్ షోకు వెళ్ళాల్సిందే.
[మార్చు] చూడండి
తిరుపతి కి 70 కిలోమీటర్ల దూరములో ఉన్న నాగలాపురం కార్వేటి నగరం దర్శించడం మర్చిపోవద్దు. తిరుపతి యాస, భాష, పదాలు