Wikipedia:మీకు తెలుసా? భండారము
వికీపీడియా నుండి
ఈ జాబితా మొదటి పేజిలోని మీకు తెలుసా? విభాగమునకు మూలము
- మీరు ఏదైనా వికిపీడియా వ్యాసము చదువుతున్నపుడు మీకు ఆహా! అనిపించే విషయము ఏదైనా కనిపిస్తే ఇక్కడ దానిని చేర్చండి. బహుశా మీలాగే చాలా మందికి ఆ విషయము తెలిసి ఉండకపోవచ్చు.
- ఈ భాండారములోనుండి ఒక సమయములో కేవలం మూడూ లేదా నాలిగిటిని మాత్రమే మూసలో చేర్చండి.
మీకు తెలుసా?
- నరస భూపాలీయం గా ప్రఖ్యాతి చెందిన కావ్యాలంకార సంగ్రహ కర్త రామరాజ భూషణుడు అని.
- శబ్దాలంకారాలకు ప్రసిద్ధుడైన తెలుగు పూర్వకవి పోతన అని.
- ...కృష్ణుని ప్రియ మిత్రుడు, సహాధ్యాయి సుదాముని స్వస్థలము, జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన నేటి పోర్బందర్ అని.
- ...పాకిస్తాన్ లో మాట్లాడే ఏకైక ద్రవిడ భాష బ్రహుయి అని. ఇది ఏదో ఒకరిద్దరు మాట్లాడే భాష కాదు 22 లక్షల మంది మాట్లాడే భాష.
- ... జగ్గయ్య, లోక్సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీనటుడు అని.
- ... 1934 లో విడుదలైన తొలి కన్నడ టాకీ చలనచిత్రము సతీ సులోచనను తీసినది తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు మరియు తెలుగు సినీనటి లక్ష్మి తండ్రి అయిన యెర్రగుడిపాటి వరదరావు(వై.వి.రావు) అని.
- ... ఆంధ్ర మహిళలు ఐదవతనముగా భావించే నల్లపూసల గురించిన ప్రస్థావన సాహిత్యములో తొలిసారిగా చేసినది శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజములలో ఒకడైన మాదయ్యగారి మల్లన అని.
- ... 1885లో పుట్టిన సురభి వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు అని. కడప జిల్లా సురభి గ్రామంలో మొదట కీచక వధ తో సురభి నాటక ప్రస్థానం మొదలయ్యిందని.
- ...హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన అలంఅరా, కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఎల్.వి.ప్రసాద్ నటించాడని.
- ...హైదరాబాదునందలి ట్యాంకుబండ్నందు మొత్తం 32 మంది ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయని!..
- ...19వ శతాబ్దంలో ఆంధ్ర దేశములోని ప్రతి గ్రామమునకు 12 మంది గ్రామ సేవకులు ఉండేవారనీ, వారిని బారబలావతి అనేవారనీ.
- ...తెలుగు అనే శబ్దం త్రిలింగ నుండి వచ్చిందని చదువుకుంటూ వచ్చాం. కాదు, తెలివాహ అని పిలవబడిన గోదావరి నుండి వచ్చింది అని అంటోంది ఈ పరిశోధనాత్మక వ్యాసం.
- రాయలసీమ కు ఆ పేరు పెట్టింది గాడిచర్ల హరిసర్వోత్తమ రావు. 1928 లో కర్నూలు జిల్లా నంద్యాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభలో ఆయన ఈ పేరు పెట్టాడు. అంతకు ముందు దానిని దత్తమండలం (Ceded) అని పిలిచేవారు.
- 1951 లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన ప్రపంచ కథల పోటీకి భారత్ నుండి మూడు కథలు ఎంపికయ్యాయి. మొత్తం 23 దేశాల నుండి 59 కథలు పోటీకి వచ్చాయి. వాటిలో రెండవ బహుమతిని భారత కథే గెలుచుకుంది. ఆ కథ పేరు గాలివాన , రచయిత పాలగుమ్మి పద్మరాజు - తెలుగు వాడి కథ.
- ...మన జాతీయ పతకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య మన తెలుగు వారేనని.
- ...బంగాళాఖాతము ను తూర్పు సముద్రం అని పిలిచేవారని.
- ...మొదటి ప్రయాణంలోనే మునిగిపోయిన టైటానిక్ లో ప్రయాణించిన ఏకైక భారతీయ కుటుంబం గుంటూరు నుండి అని. అయితే వీరు బ్రిటిషు వారు.
- ...ఆలంపూర్ లోని నవబ్రహ్మ దేవాలయములు శివుని గుళ్లని.
- ...కోస్తా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల నాయకుల మధ్య జరిగిన పెద్దమనుషుల ఒప్పందం, 1956 లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు మార్గం సుగమము చేసిందని.
- ...తెలుగు భారత దేశం లో అత్యంత ఎక్కువ మంది మాట్లాడే భారతీయ భాషలలో హిందీ తర్వాత రెండవదని.
- తొలి తెలుగు మూకీ చిత్రం 1920 లలో తీసిన భీష్మ ప్రతిజ్ఞ అని.
- తెలుగు నాట తీయబడ్డ తొలి తెలుగు చిత్రం భక్త మార్కండేయ (1926) అని.
- తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద (1931) అని.
- తెలుగులో ఒకరి జీవిత కథ ఆధారంగా తీసిన తొలి (బయోగ్రాఫికల్) సినిమా భక్త రామదాసు (1933) అని.
- తొలి తెలుగు సాంఘిక చిత్రం ప్రేమ విజయం (1936) అని.
- తొలి తెలుగు అభ్యుదయ చిత్రం మాలపిల్ల (1938) అని.
- తొలి తెలుగు డాక్యుమెంటరీ మహాత్మా గాంధీ అని.
- ఒక అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో పాల్గొన్న తొలి తెలుగు సినిమా స్వర్గసీమ (1945) అని.
- రాష్ట్రప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందిన మొదటి చిత్రం 'పదండి ముందుకు' (1962) అని.
- తొలి తెలుగు రంగుల సినిమా లవకుశ (1963) అని.
- ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలంసంజీవరెడ్డి. ఈయన భారతరాష్ట్ర్రపతిగా కూడాపనిచేసారు.
- రాష్ట్రప్రభుత్వ నంది బహుమతి పొందిన తొలి సినిమా డాక్టర్ చక్రవర్తి (1964 లో) అని.
- తొలి తెలుగు జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి 116 (1966) అని.
- తొలి తెలుగు కౌబాయ్ సినిమా మోసగాళ్ళకు మోసగాడు (1971) అని.
- తొలి తెలుగు స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు (1974) అని.
- జాతీయ బహుమతి పొందిన తొలి తెలుగు పాట 'తెలుగువీర లేవరా' (1974) అని.
- తొలి తెలుగు 70 ఎం.ఎం. సినిమా సింహాసనం (1986) అని.
- 1952 లో తొలి మిస్ మద్రాసు టంగుటూరి సూర్యకుమారి.
- రాష్ట్రగీతమైన "మా తెలుగుతల్లికి...." గీతాన్ని రచించిన శంకరంబాడి సుందరాచారి తిరుపతిలో జన్మించారని.