సారస్వత నికేతనం
వికీపీడియా నుండి
సారస్వత నికేతనం ప్రకాశం జిల్లా వేటపాలెం లోని తెలుగు గ్రంథాలయము. తెలుగు భాషకు 80 సంవత్సరాలుగా మహోన్నత సేవలు చేసిన ఈ గ్రంథాలయము చాలా మందికి సాహితీకారులకు కుడా తెలియదంటే నమ్మశక్యము కాదు. ఈ గ్రంథాలయము 1918 లో వి.వి.శ్రేష్టి స్థాపించాడు. స్వాతంత్ర్యము రాక ముందు స్థాపించబడిన ఈ గ్రంథాలయము మొదటి నుండి ప్రైవేటు కుటుంబము నిర్వహించే గ్రంథాలయముగానే ఉన్నది. అంధ్ర ప్రదేశ్ లో కెళ్లా ఇటువంటి అరుదైన ఏకైక గ్రంథాలయము సారస్వత నికేతనం.
ఎదైనా తెలుగు పుస్తకము వెతకడములో ఇంతవరకు మీ ప్రయత్నాలు సఫలముకాకపోతే వేటపాలెం సారస్వత నికేతనంలో ఆ పుస్తకము దొరికే అవకాశము ఉన్నది. ఈ గ్రంథాలయము ఆంధ్ర ప్రదేశ్లో పరిశోధన ఓరియంటెడ్ గ్రంథాలయాలలో అగ్రగణ్యమైనది. ఈ గ్రంథాలయానికి 1929 లో జాతిపిత మహాత్మా గాంధీ శంకుస్థాపన చేశాడు. 1935 లో బాబూ రాజేంద్ర ప్రసాద్ దీన్ని సందర్శించి ఆశీర్వదించారు. కట్టడము పూర్తైన భవనాలను సేఠ్ జమ్నాలాల్ బజాజ్ మరియు టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు. స్వాంతంత్ర్యోద్యమ కాలములో ఎందరో యువకులకు స్పూర్తి ప్రదాత అయినది. ఆ తరువాత కాలములో వచ్చిన ముఖ్య మంత్రులు మరియు ఎందరో విద్యావేత్తలు గ్రంథాలయమును సందర్శించారు.
ఈ గ్రంథాలయములో పాత పుస్తకాలు, వార్తా పత్రికలు, మేగజిన్లు, పత్రికల విస్తారమైన సేకరణ కలదు. కొన్ని వార్తాపత్రికలు 1909 వ సంవత్సరమునుండి కలవు. 70,000కు పైగా సేకరణలు ఉన్న ఈ గ్రంథాలయములో చాలా మటుకు సేకరణలు అరుదైనవి. దేశము నలుమూలల నుండి, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా మొదలైన విదేశాలనుండి పలువురు పరిశోధకులు తమ పరిశోధనా ప్రాజెక్టుల కొరకు ఇక్కడ బసచేసి గ్రంథాలయ వనరులను ఉపయోగించుకొన్నారు. ఈ గ్రంథాలయము తన చుట్టు ఉన్న ప్రజల జీవితాలను ఎంతగానో ప్రభావితము చేసినది. విద్య మరియు సమాజ కళ్యాణ ఉద్యమాలెన్నింటికో కేంద్రబిందువైనది. ఈ గ్రంథాలయము అందరికీ అందుబాటులో ఉన్నది. చిన్న ఒక అంతస్థు భవనము నుండి ప్రస్తుతము ఇది రెండంతస్థుల భవనముగా ఎదిగినది. సారస్వత నికేతనం, ప్రకాశం జిల్లా, వేటపాలెం మండలానికి చెందిన గ్రామము
ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |