శ్రీవారికి ప్రేమలేఖ

వికీపీడియా నుండి

శ్రీవారికి ప్రేమలేఖ (1984)
దర్శకత్వం జంధ్యాల
తారాగణం నరేష్,
పూర్ణిమ
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్
భాష తెలుగు


ప్రేమలేఖ పేరుతో చతుర మాసపత్రికలో వచ్చిన నవల ఈ సినిమాకు ఆధారం. రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి. 1984లో విడుదలైన ఈ సినిమా ఉషాకిరణ్ మూవీస్ వారి తొలిసినిమా. ఈ సినిమాతో రామోజీరావు నిర్మాతగా మారి తర్వాతి కాలంలో ప్రతిఘటన, మౌనపోరాటం, మయూరి లాంటి సంచలనచిత్రాలను నిర్మించాడు.

గాయని జానకి ఈ సినిమాలో పాడిన "మనసా తుళ్ళిపడకే..." పాటకు జాతీయబహుమతి వచ్చింది. ఈ సినిమాలోని మరొక పాట "తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు..." బహుళజనాదరణ పొందింది.