టంగుటూరి అంజయ్య
వికీపీడియా నుండి
![]() |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
టంగుటూరి అంజయ్య(1919 - అక్టోబర్ 19,1986), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి. ఈయన 1980 అక్టోబర్ నుండి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
కాంగ్రేసు పార్టీకి చెందిన అంజయ్య మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గము నుండి రాష్ట్ర శాసన సభకు ఎన్నికైనాడు. 1984 పార్లమెంటు ఎన్నికలలో సికింద్రాబాదు నియోజకవర్గము నుండి గెలిచి మరణించే వరకు పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. ఆ ఎన్నికలలో రాష్ట్రము నుండి ఎన్నికైన ఆరుగురు కాంగ్రేసు పార్టీ పార్లమెంటు సభ్యులలో అంజయ్య ఒకడు అవటము విశేషము. ఈ కాలములోనే అంజయ్య కేంద్ర కార్మిక శాఖా మత్రిగా రాజీవ్ గాంధీ మంత్రివర్గములో పనిచేశాడు.ఈయన తర్వాత ఈయన సతీమణి మణెమ్మ కూడా సికింద్రాబాదు నియోజకవర్గము నుండి పార్లమెంటుకు ఎన్నికైనది.
ఇంతకు ముందు ఉన్నవారు: డా.మర్రి చెన్నారెడ్డి |
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి 11/10/1980—24/02/1982 |
తరువాత వచ్చినవారు: భవనం వెంకట్రామ్ |