పరశురామ అవతారము
వికీపీడియా నుండి
శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురాముని అవతారము ఆరవది. త్రేతాయుగము ఆరంభములో జరిగినది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడనికూడా అంటారు.
విషయ సూచిక |
[మార్చు] ప్రధాన గాధ
జమదగ్ని గొప్ప ముని. భృగుమహర్షి వంశమువాడు.కాని ఆయనకు కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి కుశీకవంశమునకు చెందినది. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు రాముడు. శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి పరశువు(గండ్రగొడ్డలి) పొంది, పరశురాముడైనాడు.
ఒకసారి రేణుక నీటికొఱకై చెరువునకు వెళ్ళినది. అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమైనది. కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశించాడు. పెద్దకొడుకులు అందుకు ఒప్పుకొనలేదు. పరశురాముడు మాత్రము వెంటనే తన తల్లి తల తెగనరికాడు. అప్పుడు జమదగ్ని ఏమైనా వరములు కోరుకొమ్మని పరశురామునికి చెప్పెను. పరశురాముడు రెండు వరములు కోరుకొన్నాడు - (1) తన తల్లిని బ్రతికించమని (2) తండ్రి కోపమును త్యజింపవలెనని. - ఈ విధముగా పరశురాముడు తన తల్లిని తిరిగి బ్రతికించుకొన్నాడు.
హైహయ వంశజుడైన కార్తవీర్యుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వేయి చేతులు పొంది, మహావీరుడైనాడు. కాని ఒకమారు పరశురాముని చేత భంగపడినాడు. ఒకసారి కార్తవీర్యుడు జమదగ్ని ఆశ్రమమునకు వచ్చెను. తనవద్దనున్న కామధేనువు సహాయముతో జమదగ్ని రాజునకు సగౌరవముగా రాజులకు తగిన ఆతిథ్యము ఇచ్చెను. ఆ ధేనువును తనకిమ్మని కార్తవీర్యుడు కోరగా జమదగ్ని నిరాకరించెను. అందుకు కోపించిన కార్తవీర్యుని సైన్యము జమదగ్నిని వధించారు. కొడుకుకు విషయం తెలిపి రేణూకాదేవి సహగమనం చేసింది.
ఆశ్రమమునకు తిరిగివచ్చిన పరశురాముడు ఆగ్రహంతో 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేశాడు. దశరధునివంటి కొద్దిమంది అంతఃపురంలో దాగుకొని తప్పుకొన్నారు. శ్యమంతకపంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పించాడు. తరువాత పరశురాముడు భూమినంతనూ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.
[మార్చు] రాముడు, రాముడు
సీతా స్వయంవరంలో శ్రీ రాముడు శివధనుస్సును విరచిన తరువాత సీతారాముల కల్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరచినందుకు పరుశురాముడు కోపించి, రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరధుని అభ్యర్ధనలను, రాముని సాంత్వ వచనాలనూ పట్టంచుకొనలేదు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునకిచ్చాడు. రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు. ఆ విధంగా ధనస్సును పరశురాముడు రామునకు అందించినపుడు పరశురామునికీ రామునికీ భెదం లేదని ఇద్దరికీ అవగతమైనది. తన అవతార కార్యము సమాప్తమైనదని పరశురాముడు గ్రహించి, తన సర్వ శక్తులనూ రామునకు ధారపోసి, తాను మహేంద్రగిరిపై తపస్సు చేసికోవడానికి వెళ్ళిపోయాడు.
[మార్చు] మహాభారతంలో
మహాభారతంలో పరశురాముడు ముగ్గురు వీరులకు గురువైనాడు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్మునకు అస్త్రవిద్యలు బోధీంచాడు. తరువాత అంబికను వివాహంచేసుకొనమని చెప్పగా ఆజన్మబ్రహ్మచర్యవ్రతుడైనందున భీష్ముడు అందుకు తిరస్కరించాడు. ఇద్దరికీ జరిగిన మహాయుద్ధంలో ఎవరూ వెనుకకు తగ్గలేదు. దేవతల అభ్యర్ధనమేరకు యద్ధం నిలుపబడింది.
కర్ణుడు తాను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు. తరువాత కర్ణుని అబద్ధాన్ని తెలిసికొన్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపించాడు.
ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు. అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకొన్నాడు.
[మార్చు] మరికొన్ని విషయాలు
- పరశురాముడు దత్తాత్రేయుని వద్ద శిష్యునిగా చేరి అనేక విద్యలను నేర్చుకొన్నాడు.
- ఒకమారు పరశురాముడు శివుని దర్శించబోగా ద్వారం వద్ద వినాయకుడు అడ్డగించాడు. కోపంతో పరశురాముడు తన పరశువును విసిరేశాడు. తన తండ్రియైన శివుని ప్రసాదమైన పరశువుపై గౌరవంతో వినాయకుడు ఆ పరశువుతో తన దంతం విరిగేలా సమర్పించుకొన్నాడు.
- పరశురాముడు చిరంజీవి. కల్క్యవతారమునకు విద్యలుపదేశిస్తాడనీ, తరువాతి మన్వంతరములో సప్తర్షులలో ఒకడవుతాడనీ కధ.
- పరశురాముడు పూర్ణావతారము కాదనీ, అవశేషావతారమనీ అంటారు. కనుక పరశురాముని స్తోత్రాలూ, మందిరాలూ చాలా తక్కువ.
- భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చిన తరువాత పరశురామునికి తపస్సు చేసికోవడానికి చోటు లేదు. ఆయన తన పరశువును సముద్రంలోకి విసిరేయగా, ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక.
- కేరళలో తిరువనంతపురం దగ్గర, తిరువళ్ళంలో కరమణ నది ఒడ్డున ఒక పురాతనమైన పరశురామ మందిరం ఉన్నది. ఇది 2వేల సంవత్సరాలనాటిదంటారు. ఇక్కడ పితృదేవతలను పూజించడం ఆచారం.
[మార్చు] స్తోత్రాలు
[మార్చు] రామదాసు రచించిన దాశరధీ శతకములో పరశురాముని స్తుతి
-
- ఇరువదియొక్క మాఱు ధరణీశులనెల్ల వధించి తత్కళే
- బర రుధిర ప్రవాహమున భైతృక తర్పణమొప్పజేసి భూ
- సురవరకోటికిన్ ముదము సొప్పడ భార్గవరామమూర్తివై
- ధరణినొసంగితీనె కద దాశరధీ కరుణా పయోనిధీ.
[మార్చు] జయదేవుని దశావతార స్తుతి నుండి
-
- క్షత్రియ రధిర మయే జగదపగతపాపమ్
- స్నపయసి పయసి శమిత భవ తాపమ్
- కేశవ! ధృత భృగుపతి రూప!
- జయ జగదీశ ! హరే!
దశావతారములు | ![]() |
---|---|
మత్స్య | కూర్మ | వరాహ | నరసింహ | వామన | పరశురామ | రామ | కృష్ణ | బలరామ / బుద్ధ | కల్కి |