వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.39.0-wmf.22
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Gadget
Gadget talk
Gadget definition
Gadget definition talk
వాడుకరి:NAYAKULA RAJESH
2
57477
396967
396603
2022-07-27T02:13:28Z
2409:4070:4399:1354:DAB4:514F:E973:D43B
wikitext
text/x-wiki
Name :Nayakula Rajesh
Date of birth: 09-10-1997,
Birth Place :- Sirigayyadoddi,
Mother Name : N.Lakshmidevi,
Father Name : N.Nagaraju.
Education :-
1).1- 5th Class :-
Mandal Parishad Primary school - Sirigedoddi Village
2) 5- 10th Class :-
ZP High School -Gollapalli
3) Intermediate :-
AP Open School Society - Andhra Pradesh
4) Degree :-
Andhra University distance education
Job : AP Grama Volunteer, Sirigedoddi Grama Sachivalayam
Address :
Nayakula Rajesh
S/o N. Nagaraju
Door No : 4-89,
BC Colony,
Sirigedoddi Village,
Gollapalli Post,
Gummaghatta Mandal
Rayadurgam constituency,
Anantapur district,
AndhrPradesh State,
India
Pincode : 515865
Phone Number : 9346314349
k58jpszke2x6dtvrz0fjs17x65qj7np
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/5
104
105515
396971
369672
2022-07-27T05:55:46Z
Inquisitive creature
3593
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Shishirdasika" />{{c|vi}}</noinclude>ఈ గ్రంథంలో కనిపిస్తున్నది. మొత్తంమీద ఈ గ్రంథం సమగ్రమైన, ప్రామాణికమైన తెలుగుభాషాచరిత్ర లేని లోటును తీరుస్తున్నదని నమ్మకము. తెలుగును. ప్రధానవిషయంగా అధ్యయనం చేసే విద్యార్థులకే కాక, అంతకంటె ఎక్కువగా తెలుగుభాషపై పరిశోధనలు చేసే పండితులకు గూడా ఇది సహాయకగ్రంథంగా ఉపకరించగలదని ఆశిస్తున్నాము.
కోరినంతనే ఈ గ్రంథానికి సంపాదకత్వం వహించటానికి అంగీకరించి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, కొంత ఆలస్యమే అయినా గ్రంథాన్ని సమగ్రంగా వెలువరించిన ఉస్మానియా విశ్వవిద్యాలయ భాషాశాస్త్రశాఖాధ్యక్షులు భద్రిరాజు కృష్ణమూర్తిగారికి, ఆయా అధ్యాయాలను రచించిన వ్యాసకర్తలకు, సంపాదక సహాయకులకు సాహిత్య అకాడమీ పక్షాన కృతజ్ఞతలు.
{{rh|హైదరాబాదు||{{p|fs125}}'''దేవులపల్లి రామానుజరావు'''}}
{{Rh|2-9-75||{{p|fs100}}''కార్యదర్శి }}<noinclude><references/></noinclude>
mmiurt9xaiig34egvhcxejrm3ed19uw
పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/2
104
116208
396970
369669
2022-07-27T05:50:10Z
Inquisitive creature
3593
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Shishirdasika" /></noinclude>[[File:తెలుగు భాషాచరిత్ర.pdf 01.jpg|90px]]<br>
{{left|offset=5em|ప్రథమ ముద్రణ 1974<br>ప్రతులు 1500<br>రెండవ ముద్రణ జనవరి 1979<br>ప్రతులు 5,000}}
[[File:తెలుగు భాషాచరిత్ర.pdf 01.jpg|90px]]
{{right|offset=3em|వెల రూ. 16-00}}
[[File:తెలుగు భాషాచరిత్ర.pdf 01.jpg|90px]]
{{Right|Paper used for the Printing fo this book was<br>made available by the Government of India at concessional rate. (Partly)}}
[[File:తెలుగు భాషాచరిత్ర.pdf 01.jpg|90px|left]]
{{Right|ముద్రణ :<br>శివాజి ప్రెస్,<br>సికింద్రాబాదు.}}<noinclude><references/></noinclude>
8rqrw21yg1n5v09i2u4nv3ihxccae4f
పుట:కాశీమజిలీకథలు-06.pdf/107
104
129250
396959
396885
2022-07-26T23:49:13Z
శ్రీరామమూర్తి
1517
/* సమస్యాత్మకం */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="శ్రీరామమూర్తి" />{{rh|112|కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము|}}</noinclude>కనుపుము, మరియు నీవు కళారహస్య వేదివగుట నీ క్రీడలఁజొక్కి యక్కుసుమ కోమలి యొరుల వలవదు అని పలికిన నతండిట్లనియె తమ్ముడా ! అందులకే నేనుఁ దొలుతఁ బోవుదునని చెప్పితిని. బాహ్యరతోపచారములచే నా జవ్వని కుద్రేకముఁ గలుగఁ జేయవలయును. మరియుం బురుషుఁడు స్త్రీలయొక్క జాతియు స్వభావము గుణము దేశాచారము ధర్మము చేష్టలు భావములు ఇంగితములు తెలిసికొని యనుభవింపఁడేని యువతి వానిరతి కనుమోదింపదు. అదియుంగాక యాకోక స్తని విరక్తిఁ
జెందియున్నది. తత్తడియుఁ బడఁతియు నొక్కటని యెరుంగుము. నేనుఁ బోయి యా మచ్చకంటిని మచ్చికఁజేసి పచ్చవిల్తుగేళికిఁ బురికొల్పివచ్చెద ననుమతింపుమని ప్రార్థించిన స్థూలజంఘుఁ డిట్లనియె నీవు బాహాభ్యంతర సురతవిశేషములచే శాస్త్రోక్తప్రకార మాప్రోయాలిం గలియుచుండఁ దెల్లవారకమానదు అప్పుడు నేనేమి చేయువాఁడ? నాకీశాస్త్రము లేమియొ నక్కరలేదు. అక్కర దీరుచుకొని యొక్కముహూర్తములో నరుదెంచెద నన్నే పోనీయుమని ప్రార్థించెను. నే నర్ధమూహూర్తములోనే యరుదెంచద నాకే యనుజ్ఞయిమ్మని యతఁడడిగెను. నా కంతకాల
మవసరములేదు ఆలింగన సుఖంబిచ్చినఁ జాలుననుటయు నతం డదియు నేమొల్ల. నా ముద్దుగుమ్మ మొగ మొకముద్దు పెట్టుకొని వచ్చెద నిష్టమే యన నతఁడౌను నీవెప్పుడు నిట్లే యడ్డుచెప్పుచుందువు. నీతో నేస్తముకన్నఁ బగయే లెస్సయని తోచుచున్నదని యెత్తిపొడిచెను ?
అవును. నీ స్నేహమునంగాక నాకీసన్యాసి యోగమెట్లువచ్చును? అనంగ చంద్రికవస్తువు లెత్తికొని రమ్మనిచెప్పిన వాఁ డెవ్వఁడో జ్ఞాపకముండిన నీ మాటయేలఁ బలికెదవు ? చాలుఁజాలు. కొసరులు పలుకకుము నాకలుక వచ్చుచున్నదని తామ్రకేశుఁడు ప్రత్యుత్తరమిచ్చెను.
నీయలుక నాకు వెరపుఁ గలుగఁ జేయంజాలదు. నా చెప్పినట్లెల్ల నీవు పడతువా యేమిఁ నీ కప్పని యనుమతియేకావున నాచరించితివి. ఇప్ప డేమాట --- విననైతివి? నాకు సమయము దొరకక పోవదు. తెల్ల వారినీ అని స్థూలజంఘుఁడు బెదరించె
ఛీ ! రండాపుత్రుడా ? నీ వేమిచేయం గలవన గొత్తుకొన
జూడుమని ముష్టియెత్తును.
ఈ రీతి వారిద్దరు గొంతతడపు తగపుదాడి మరల సమాధాన ప
చామ్రకే.(డే ముందు వోయినచ్చుటకు నిశ్చయంచుకొనిసరి.
H
తామకేఁడు లోనికిఁ బోయి తలుపు వైచికొనియెదను. స్థూలజం.. పిల
సుబడి తలుపులు గొట్లము పెట్టి యిట్లుఁ జింతించెను. అన్నన్నా?
వినవచినదాని దానికంటె నే నేమిటిఁ దక్కు వందనం నెరచి
చొన్నకొంటి గుట్టు బయట పెట్టినచో నిరువురను చెరసాలకు లేవువ
ఉత్తని ను పెట్టి.చీ వాణి బ్లెగిరిపడియెను. అక్కటా: డమ్మోహనాంగితో సుఫింపు<noinclude><references/></noinclude>
jci9v6hgvtvlqbmljpvxmife92vpap4
పుట:కాశీమజిలీకథలు-06.pdf/108
104
129251
396964
396886
2022-07-27T01:18:47Z
శ్రీరామమూర్తి
1517
/* సమస్యాత్మకం */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="శ్రీరామమూర్తి" />{{rh|(15)|స్థూలజంఘ తామ్రకేశుల కథ|113}}</noinclude>చుండ నే ననద నై యీవాకిటఁ బడియుందునా? దుగ్దగటంబు బిల్లియందోలె వాఁడా చేడియను వీడి యీవలకు వచ్చునా? ఎంతమోసపోయితిని. ఎంత వెంగలినైతిని పశ్చాత్తాపముఁ జెందుచు మరలఁ దలుపురంద్రములో మొగముపెట్టి మిత్రమా ! తామ్రకేశా ! తలుపులొకసారి తీయుము. మాటఁ జెప్పవలసి యున్నదని పిలిచెను కాని యతండు వినంబడినను మాటాడక తొందరపడుచు నామంచముపైఁ గూర్చుండి చీకటిలో నేమియుం గనఁబడమి నిట్టూర్పుసవంబట్టి తలయంపి గురుతుపట్టి శాటీపటంబుఁ దొంగించి అతివేగమునఁ దాటాలున వంగి మోముపై దంతక్షతములు నాటించెను.
అప్పు డాయోగి యదరిపడి లేచి యెవడురా? యెవఁడురా నా మొగము గరచుచున్నవాఁడని యరచుటయు నాతఁడు యోగియని గ్రహించి వెరచుచు మాటాడిన గురుతుపట్టునని స్థూలజుంఘుని బిలువక మంచముక్రింద దూరెను. అత్తెరంగెరుంగక స్థూలజంఘుడు ఓరి ! తామ్రకేశా ! తలుపుతీయవేమిఁ తీయకుము. తీయకుము తలాతులం దీసికొనివచ్చి పట్టియిచ్చెదఁ జూడుము అని యరచెను.
ఆ రొద వినిన యా యోగి మంచముపైఁ గూర్చుండి యేమియుం దెలియక దిగ్బ్రమఁ జెంది ఆ మాట్లాడు వారెవ్వరు ? దీపముదీసికొని రండు ఏమియుం గనఁబడదేమి యని పలికిన స్థూలజంఘుడు కంఠధ్వని గ్రహించి గురువనియెరిఁగి గొలుసుబిగియించి యవ్వలికిఁ బారిపోయెను.
అయ్యోగి మంచముదిగి నలుమూలలు దడిమికొని గోడలు తగులుటయు నది యొక చెరసాలగాఁ దలంచి యోహో ? నే నిచ్చటి కెట్లువచ్చితిని ? నా బుగ్గం గరచిన వారెవ్వరు? ఇందు భూతములు లేవుగదా? యని యనుకొనుచుండ విని తామ్రకేశుఁడు మంచముక్రిందనుండి, హూం, హాం అని యవ్యక్త ధ్వనిగా మూలుగు చుండెను.
ఎట్టి వేదాంతులకైనను మరణమన్న వెఱపుగలుగక మానదు. పిశాచ భీతి భ్రాంతివలనం గలుగునని యెరింగియు నా తపసి జడియుచు మంచముపైకెక్కి యో పిశాచమా ! నన్నేమిటి కీ యంధకార రూపమునకుఁ దీసికొని వచ్చితివి ? మా వలన నీకేమి ప్రయోజనము గలదు ? మేము సన్యాసులము. సంసారులఁ బీడింపుము. నీ కామితములు తీరుపఁగలరు. అని ప్రార్ధించుచుండ యతి భీతితోఁగూడ మంచము క్రింది హుంకారము లెక్కువ యగుచుండెను.
ఆ యోగీంద్రుఁడు హస్తాస్ఫాలనముఁ గావింపుచు నాంజనేయ దండకము శివస్తుతి, భగవస్తవము పఠింపుచుండెను. అంతలోఁ దెల్ల వారినది కాని యందున్న --- భేదమేమియుఁ దెలిసినదికాదు. మఠంబునఁ జిదంబరయోగి కనంబడమిఁ
Oy: ఈ మహానుభావుందు ఆ ప్రాయముగల
అగ్నికాలవిడిచి యిచ్చటికిఁ బోవ వాఁడు. నే డెందు వోయెనో తెలియదు.
సిచిత్రమని తలఁచుచు నందుఁ కనబడినవారి తెల్ల నడుగుచుఁ దిరుగుమండ<noinclude><references/></noinclude>
o23k3sumir0atkblb8o1r5llh1qrird
పుట:కాశీమజిలీకథలు-06.pdf/109
104
129252
396965
396887
2022-07-27T01:43:03Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|114|కాశీమజిలీ కథలు - ఆఱవ భాగము|}}</noinclude>స్థూలజంఘుఁడు దాపునకు వచ్చి కమలా ! చిదంబరయోగి గోపురము దాపుననున్న శూన్య శివాలయములో నున్నట్లు నాకుఁ గలవచ్చినదిసుమీ ? యని చెప్పిన నప్పడఁతి వానితో నేమియు మాటాడినది కాదు. వాఁ డరిగిన వెనుక యా కనకగాత్రి యాలయ ప్రాకారములోని భూమియంతయు వెదకుచు దక్షిణగోపురము దాపుననున్న శూన్యాలయము నొద్దకుఁజని స్వామీ ! చిదంబరయోగింద్రా? యెందున్నావని పిలుచుటయు నా చప్పుడువిని అమ్మా ! కమలా ! యిందున్నాను. తలుపులు తీయుము అని యరచెను. అప్పుడా పడఁతి గొణ్ణెముతీసి తలుపులు తెరచి యందు మంచము
నడుమం గూరుచున్న యా యోగిం గాంచి దాపునకుఁ బోయి స్వామీ! మీ రిక్కడి కెట్లువచ్చితిరి? చిత్ర మయ్యెఁడు చెప్పుఁడని యడిగిన నతం డమ్మా ! ఇది దైవ మాయ. మంచముక్రింద నేదియో యున్నది. ఊరక యరచుచు నన్ను వెఱపించుచున్నది. అని సంజ్ఞజేయుచుండగనే తామ్రకేశుఁడు తటాలునఁ బ్రాకి గుడి బైటికి వచ్చి తలుపులు బిగించి యవ్వలికిఁ బారిపోయి స్థూలజంఘుం గలసికొనియెను.
వానింజూచి వాఁడు నవ్వుచు నోరీ ! యెట్లు వచ్చితివిరా ? యని యడిగిన ఛీ ! ఛీ ! నీవు మిత్రద్రోహుఁవు నీతో మాటాడరాదు. నే నందుఁ జిక్కి పడియుండఁ దలుపులు బిగించి వచ్చెదవా ? పాప మా కమలవచ్చి తీయకున్న నే నెంత చిక్కుపడిపోవుదును. అని నిందించిన వాఁ డిట్లనియె.
నీ కుపకారము చేసినను నిట్లే పలుకుచుందువు. కమలతోఁజెప్పి యచ్చటికిఁ బంపినవారెవ్వరో తెలిసికొనలేవు. అది వచ్చి తలుపులు తీసినతోడనే యా ముసలివాని నీవలకుఁ ద్రోసి దాని లోపలకు లాగికొనియుందువని యప్పని చేసితిని. అట్లు చేయక దొరకిన యర్ధము పారఁజిమ్ముకొనివచ్చి నన్నేమో దూరెదవు చాలులే. ఏమిజరిగినదని యడిగిన నవ్వుచు నిట్లనియె.
తెలిసినది తెలిసినది. అదియా ! నిన్ను నిందించినందులకు క్షమింపుము. మనము లేచినవేళ మంచిది. ఇంతపొరపాటు చేసితిమేల? నాకా ! రాత్రి నేను పడిన పాట్లు దయ్యమెరుంగు నేను దయ్యమని యతండూరక వెరచినకొలఁది యరచు చుంటిని. ఆ కమలవచ్చి తలుపుఁదెరచి యతని బరామర్శింపుచుండఁగ లేడివలె నెగిరి యీవలఁబడి తలపులు బిగించి వచ్చితిని. వింటివా యని చెప్పిన వాఁడుజూచి వీపు చరచుచు నిట్లనియె. బళి బళి. బాగుబాగు. మంచిపని చేసితివిగదా ? మరల
రాత్రిపడనిమ్ము అని వారు మాటాడుకొనుచుండగా రాజదూత వేత్రహస్తుఁ డొకడు వచ్చి మంత్రులతోఁగూడి శశాంక మహారాజుగారిందు వచ్చుచున్నవారు. సద్దు చేయ వలదని యాజ్ఞాపించెను. ఆ మాటనిని యందుఁ గల సన్యాసులెల్ల యెక్కడివారక్కడ గూర్చుండి జపమాలికలు త్రిప్ప మొదలుపెట్టిరి.
అప్పుడు ప్రధానులతోఁ గూడికొని యా భూభర్త యుచ్చటికి వచ్చి యోగి బృందమునెల్లఁ బరామర్శింపుచు భోజనభాజనాది సత్కారములన్నియు మీ కనుకూల<noinclude><references/></noinclude>
1xl0w4i72lr1i0cxgmgh4l0cq8vr4a8
పుట:కాశీమజిలీకథలు-06.pdf/110
104
129253
396966
396888
2022-07-27T02:03:12Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్థూలజంఘ తామ్రకేశుల కథ|115}}</noinclude>ముగా జరుగుచున్నవియా యని యడిగిన వారందరు నేకకంఠముగా మహాప్రభూ ! మా కేమియు లోపములేదు. ఉపచారములన్నియు బూర్ణముగా జరుగుచున్నవని చెప్పిరి.
పిమ్మట నతండు మంత్రులతో ముచ్చటింపుచు మఠవిశేషములఁ జూచుచు దిరుగుచుండ నొకదండ నంతఃపురంబునఁ గావలి యుండెడు సౌవిదల్లుఁడు కనంబడి నమస్కరించుటయు రాజు గురుతుపట్టి నీ వమ్మగారి ప్రతీహారివికావా? ఇందేమిటికి వచ్చితివనిన నతం డిట్లనియె.
దేవా ! నేను పరిచారకుండ నట్టివాఁడనే. అమ్మగారు ఇందున్న చితంబర యోగిగారివద్ద కరిగి మంత్రభస్మముఁ దెమ్మని యంపగా వచ్చితిని. అ య్యోగీంద్రుండు ప్రొద్దుటినుండియుఁ గనంబడుటలేదు. ఎందుఁబోయినది తెలియదు. ఎవ్వరి నడిగినను జెప్పకున్నారని చెప్పిన నన్నరేందుఁ డందు నిలువంబడి చిదంబరయోగి యెం దున్నవాఁడని కింకరులచేఁ గేకలు వేయించెను. ఆ యోగి బ్రతివచనము వినంబడలేదు. ఆ దాపుననున్న సన్యాసు లాయన నేటి యుదయమునుండియు గనంబడుటలేదు. ఎందుఁ బోయెనో తెలియదని చెప్పిరి.
అట్టి సమయమరసి స్థూలజంఘుఁడు దేవా ! నేనా యోగి శిష్యుండనే తమరు మన్నింతురేని
వక్కాణించెదమని సంశయాకులిత మతియుంబోలె పలికిన విని రాజూ మన్నింతుము. సత్యముఁ జెప్పుము అని చెప్పెను. అప్పుడా మాయావి వారినెల్ల వెంటఁబెట్టుకొని యా గుడియొద్దకుఁ బోయి తలుపుతీసి వారిం జూపుచు వీరే మా గురువులు. శిష్యురాలికి రహస్య మంత్రోపదేశముఁ జేయుచున్నారని పలికెను.
చిదంబరయోగి మంచముపైఁ గూర్చుండెను. కమల ప్రక్కను నిలువంబడి యున్నది. వారింజూచి రాజు ముక్కుపై వ్రేలు వైచుకొని భళిరా ! మకరాంకా ! నీ చేష్టలు కడు విపరీతములుకదా ! ఈ వృద్ధతాపసుఁ డేడ? ఈ బాలయోగిని యేడ ? ఎట్లు సంఘటించితివి. అని విస్మమయముఁ జెందుచు మహాత్మా ! యోగింద్రా ! మీరిందుఁ జిక్కితిరేల యని పరిహాసపూర్వకముగా నడిగెను.
కమల వారింజూచి తలుపుచాటునకుం బోయినది. చిదంబరయోగి రాజుగా నెరిఁగి మెల్లన మంచముదిగి యీవలకు వచ్చి దేవా ! మా కిదియొక ప్రారబ్ధము. దీనిలోనికి నే నెట్లు వచ్చితినో చెప్పఁజాలను ? రాత్రియెల్ల నే నిందుఁ బడినబాధ దైవమెరుఁగును. నా శిష్యురాలు నన్నుఁ జూడవచ్చినఁ దలుపులువైచి యెవ్వఁడో పారిపోయెనని యా కథ యంతయుం జెప్పెను.
నమ్మకము చెడినపిమ్మట నెంత సత్యముఁ జెప్పినను విశ్వాసము గలుగదు గదా ! శశాంకుఁ డయ్యతి వచనములయం దాదరము వహింపక మంత్రుల మొగముఁ జూచుటయు వారు దేవా ! ఇందున్న యోగులందరు నిట్టివారే ? ప్రతిసన్యాసికిని<noinclude><references/></noinclude>
5nxyljewss4ulzbpheb1tuvvwu4aoaz
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/40
104
129279
396930
2022-07-26T12:39:39Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ర్పణప్రకారము. 54. ధ్వజవిచారము. 55. కులధర్మంబులగు హింసాకార్యములకు నిర్దోషంబుగా గురుఁడు స్మృత్యర్ధంబు సమాధానము సెప్పుట. 56. మృగయావినోదము.
అభ్యాసఖండము - చతుర్థాశ్వాసము.
57. బ్రహ్మోపదేశమున స్వాయంభువమనువు ధనుశాస్త్రమును రచియించుట. 58. కర్దమశాపముచే వైకల్యము నొంది మరల హయగ్రీవపాదులవలన శాస్త్రదశకము కల్పింపబడుట. 59. గరుడుఁడు నిజరచితం
బైన భానశాస్త్రమును గాధేయుని కిచ్చుట. 50. గాధేయుఁడు రామచంద్రుని దోడి తెచ్చుట. 61. తాటకాపహరణము. 62. ఖాణోపదేశారంభము. 63. గుణపంచకప్రభావము. 64. వాయుధారణవిధమును ప్రకటించుట. 65. పరికరషట్కధారణ క్రమం బెరింగించుటయు తిద్విమోక్షణక్రమంబును. 61. వాయునిరూపణప్రకారము. 61. ఏకశృంగశరాభ్యాసలక్షణము. 68. స్తంభీకృతవిద్యాచమత్కారము. 69. స్థానసంచక ప్రతిస్థానలక్షణ వినియోగములు. 71. దూరాపాతిశరనైపుణ్యప్రకారము. 71. కుమారోపాఖ్యానము. 72 భారతయోధుల కౌశల చమత్కార భేదములు.
పరికరఖండము - ప్రథమాశ్వాసము.
1. ధనుర్దండములు దేశ దేశ భేదములై జన్మించుట. 2. వేణుకులకీర్తనము. 3. భూసారవిశేషనిర్ణయము. 4. వంశసంభవప్రకారము. 5. వేణుఖండనముహూర్తములు. 6. వేణుఖండనప్రకారము. 7. భూవహ్నిపార్థనము. 8. ధనుస్సంగ్రహశాలానిర్ణయము. 9. విళ్ళగీతలకు రూపము లేర్పరించుట. 10. ధనుర్నిర్మాణ వస్తునిర్దేశములు. 11.చాపనిర్మితప్రకారము. 12. కళాయంత్రంబు కల్పించువిధము. 13. తులాయంత్రనిర్మాణప్రకారము. 14. బలువుల సంఖ్యాప్రకటనము. 5. యుగత్రయపురుషుల ధనుర్భల ప్రమాణములు. 16. గాండీవాది కోదండసంభవము. 17. ధనుర్దండము పండించుతెఱగు. 18. కుణవల్లీషట్కంబును సృజించు<noinclude><references/></noinclude>
1y6xswh95tznmbzmfc6hp2z224fs7hl
396931
396930
2022-07-26T12:39:58Z
దేవీప్రసాదశాస్త్రి
4290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ర్పణప్రకారము. 54. ధ్వజవిచారము. 55. కులధర్మంబులగు హింసాకార్యములకు నిర్దోషంబుగా గురుఁడు స్మృత్యర్ధంబు సమాధానము సెప్పుట. 56. మృగయావినోదము.
అభ్యాసఖండము - చతుర్థాశ్వాసము.
57. బ్రహ్మోపదేశమున స్వాయంభువమనువు ధనుశాస్త్రమును రచియించుట. 58. కర్దమశాపముచే వైకల్యము నొంది మరల హయగ్రీవపాదులవలన శాస్త్రదశకము కల్పింపబడుట. 59. గరుడుఁడు నిజరచితం
బైన భానశాస్త్రమును గాధేయుని కిచ్చుట. 50. గాధేయుఁడు రామచంద్రుని దోడి తెచ్చుట. 61. తాటకాపహరణము. 62. ఖాణోపదేశారంభము. 63. గుణపంచకప్రభావము. 64. వాయుధారణవిధమును ప్రకటించుట. 65. పరికరషట్కధారణ క్రమం బెరింగించుటయు తిద్విమోక్షణక్రమంబును. 61. వాయునిరూపణప్రకారము. 61. ఏకశృంగశరాభ్యాసలక్షణము. 68. స్తంభీకృతవిద్యాచమత్కారము. 69. స్థానసంచక ప్రతిస్థానలక్షణ వినియోగములు. 71. దూరాపాతిశరనైపుణ్యప్రకారము. 71. కుమారోపాఖ్యానము. 72 భారతయోధుల కౌశల చమత్కార భేదములు.
పరికరఖండము - ప్రథమాశ్వాసము.
1. ధనుర్దండములు దేశ దేశ భేదములై జన్మించుట. 2. వేణుకులకీర్తనము. 3. భూసారవిశేషనిర్ణయము. 4. వంశసంభవప్రకారము. 5. వేణుఖండనముహూర్తములు. 6. వేణుఖండనప్రకారము. 7. భూవహ్నిపార్థనము. 8. ధనుస్సంగ్రహశాలానిర్ణయము. 9. విళ్ళగీతలకు రూపము లేర్పరించుట. 10. ధనుర్నిర్మాణ వస్తునిర్దేశములు. 11.చాపనిర్మితప్రకారము. 12. కళాయంత్రంబు కల్పించువిధము. 13. తులాయంత్రనిర్మాణప్రకారము. 14. బలువుల సంఖ్యాప్రకటనము. 15. యుగత్రయపురుషుల ధనుర్భల ప్రమాణములు. 16. గాండీవాది కోదండసంభవము. 17. ధనుర్దండము పండించుతెఱగు. 18. కుణవల్లీషట్కంబును సృజించు<noinclude><references/></noinclude>
odx6mkv3u03abq9cxvg9ebvpvw1j9x3
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/63
104
129280
396932
2022-07-26T12:46:21Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>బేర్కొనరైరి. ఈ యిర్వుర గురువులను సంస్కృతముననున్న యాయాశాస్త్రగ్రంథముల నెఱుఁగక తత్తద్విషయవిశేషములనే గురుసాంప్రదాయానుసారమున నేర్చుకొని వానిని వారి వారి వ్యవహారభాషలలో
వ్రాసికొనియుందురు. ఈగ్రంథమున కృష్ణమాచార్యుఁడు “ఈలక్షణాలను కందాళ వెంకటాచార్యులుగారు చెప్పిన పద్యాలు” అని కొన్ని పద్యాలు చేర్చిరి. అతడు కృష్ణమాచార్యునికంటెఁ దర్వాతివాడు.
నేను కృతిపేరకుని వంశము వారగు రాచూరి జమీందారుగారికి జాబులువ్రాసి ముద్రణోపక్రమము తర్వాత నొకవ్రాతప్రతిని వారివల్ల బడసితిని. కాళహస్తి వ్రాతగ్రంథములలో నొకప్రతి తిరుపతి దేవస్థాన పుస్తకశాలకు లభించింది. ఈ రెంటి సహాయము లేకున్నచో నేతద్గ్రంథముద్రణ మీతీరుననేని నెఱవేఱకపోయెడిదే.
రాచూరు జమీందారు గారగు శ్రీ కృష్ణానేని హయగ్రీవరావుగారు వారివ్రాతప్రతి నొసగియు, తమవంశచరిత్రాది సాధనములను తమయుద్యోగి శ్రీ కోపల్లె రామకృష్ణరావుగారి ద్వారమున పంపియు, శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు తమదగ్గరనున్న ధనుశ్శాస్త్రగ్రంథముల నీపీఠికారచనకాలమున నొసగి, ప్రతిదినము ఉదయము వచ్చిన ప్రూపులను నాఁడే వానిని మద్రాసు పంపుటలో నాకు చిరంజీవి పంగనామముల బాలకృష్ణమూర్తి బి. ఓ. యల్ (ఆనర్సు) నా సహాయోగ్యోగి చాలదోడ్పడియు, విద్యాజన్మవంశములందు సంతానమగు చిరంజీవులు శ్రీనివాస, సచ్చిదానందులు; సుందరమూ ర్త్యానందమూర్తులు నన్ననువర్తించి యుపకరించిరి.
{{rh|విరోధి మాఘపూర్ణిమ||వేటూరి ప్రభాకరశాస్త్రి}}<noinclude><references/></noinclude>
g1h7teq9ixo0x0cj55asa525tnkzo5z
396933
396932
2022-07-26T12:48:23Z
దేవీప్రసాదశాస్త్రి
4290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>బేర్కొనరైరి. ఈ యిర్వుర గురువులును సంస్కృతముననున్న యాయాశాస్త్రగ్రంథముల నెఱుఁగక తత్తద్విషయవిశేషములనే గురుసాంప్రదాయానుసారమున నేర్చుకొని వానిని వారి వారి వ్యవహారభాషలలో
వ్రాసికొనియుందురు. ఈగ్రంథమున కృష్ణమాచార్యుఁడు “ఈలక్షణాలను కందాళ వెంకటాచార్యులుగారు చెప్పిన పద్యాలు” అని కొన్ని పద్యాలు చేర్చిరి. అతడు కృష్ణమాచార్యునికంటెఁ దర్వాతివాడు.
నేను కృతిపేరకుని వంశము వారగు రాచూరి జమీందారుగారికి జాబులు వ్రాసి ముద్రణోపక్రమము తర్వాత నొకవ్రాఁతప్రతిని వారివల్ల బడసితిని. కాళహస్తి వ్రాఁతగ్రంథములలో నొకప్రతి తిరుపతి దేవస్థాన పుస్తకశాలకు లభించింది. ఈ రెంటి సహాయము లేకున్నచో నేతద్గ్రంథముద్రణ మీతీరుననేని నెఱవేఱకపోయెడిదే.
రాచూరు జమీందారు గారగు శ్రీ కృష్ణానేని హయగ్రీవరావుగారు వారివ్రాఁతప్రతి నొసగియు, తమవంశచరిత్రాది సాధనములను తమయుద్యోగి శ్రీ కోపల్లె రామకృష్ణరావుగారి ద్వారమున పంపియు, శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు తమదగ్గరనున్న ధనుశ్శాస్త్రగ్రంథముల నీపీఠికారచనకాలమున నొసగి, ప్రతిదినము ఉదయము వచ్చిన ప్రూపులను నాఁడే వానిని మద్రాసు పంపుటలో నాకు చిరంజీవి పంగనామముల బాలకృష్ణమూర్తి బి. ఓ. యల్ (ఆనర్సు) నా సహాయోగ్యోగి చాలదోడ్పడియు, విద్యాజన్మవంశములందు సంతానమగు చిరంజీవులు శ్రీనివాస, సచ్చిదానందులు; సుందరమూ ర్త్యానందమూర్తులు నన్ననువర్తించి యుపకరించిరి.
{{rh|విరోధి మాఘపూర్ణిమ||వేటూరి ప్రభాకరశాస్త్రి}}<noinclude><references/></noinclude>
tck6b5va5bwccui8ljozwgp10f2rcwg
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/62
104
129281
396934
2022-07-26T12:54:18Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>తూర్పుగాఉండును. (16) ఈ కొండకుదగ్గర జద్దిగాల బావి దీనికి దగ్గరగా రెడ్డివారి చెరువుగలదు. (17) పెదదాసరాయ, చినదాసరాయ తోట లున్నవి. (18) ఈ గ్రామానికి దక్షిణంగా స్వయంభువు అయిన కొండ శింగరయ్య అనే నృసింహస్వామి బిలంలో ఉన్నాడు. (19) ఈ స్థలానికి ఉత్తరం తిరుమల లక్ష్మీనృసింహ ఆలయమున్నది. (20) గ్రామమున పశ్చిమం శ్రీరామేశ్వరస్వామివారి దేవాలయం ఉన్నది. (21) దీనికి దగ్గర రుక్మిణీ సత్యభామా సమేత గోపాలస్వామి దేవాలయం (22) దీనికి పశ్చిమంగా సీతాపతి అనేచెరువున్నది. (23) ఈ గ్రామానికి ఉత్తరం వీరభద్రస్వామివారు, (24) దీనికి ఉత్తరంగా రెడ్లు కట్టించిన దేవస్థానము లున్నవి. పెద్ద దర్వాజా ఉన్నది. (25) దీనికి ఉత్తరం పత్తేఖాను మశీదు ఉన్నది. (26) దీనికి ఉత్తరం .... అనే అత్తారు మశీదు ఉన్నది. (27) దీనికి ఉత్తరం పాడుబడ్డ మశీదు. (28) ఈ గ్రామాణికి పశ్చిమం పేట మహమ్మదాపురం. (39) దీనికి దక్షిణం నల్లమశీదు. (30) దీనికి పడమట గుమ్మల్ మశీదు. (31) దక్షిణ జామత్ కానా మశీదు. (32) చిన్న మశీదు (38) దక్షిణమున రెండుదర్వాజా లున్నవి. (34) దీనికి దక్షిణం కొండవీటి గోపీనాథస్వామి పట్టణం అనే మర్త్యుజానగరు. దీనికి ఉతరపువైపు కొండపల్లి దర్వాజా ఉన్నది. (35) దీనికి దక్షిణ గోపీనాథపట్నంలో నాదొడ్లదర్వాజాలు. (36) కుదుబ్ షాపేట. శ్రీవెన్ముద్ద కృష్ణస్వామి దేవాలయము గలదు. (37) కమాల్ దీన్ వారి మశీదు ఉన్నది.
{{p|ac|fwb}}గ్రంథార్థము</p>
ఈ గ్రంథమునఁ బ్రధానముగా ధనుర్నిర్మాణము మొదల్కొని శరప్రయోగాంతముగాఁ గల ధనుశ్శాస్త్రవిషయయములు, అనుభవరూఢకములు ససిగా వివరింపఁబడినవి. కాని యీ గ్రంథమునకంటెఁ
దునిరాజాగారు ప్రకటించిన ధనుశ్శాస్త్రము విపులమయినది. విషయవిశేషములు గలది. సంస్కృతధనుశ్శాస్త్రగ్రంథము లన్నింటను విషయసామ్య మున్నది. వాని ననుసరించియే యీ రెండు తెల్గుగ్రంథములు వెలసినవి. కాని యీయిర్వురుగూడ సంస్క్రతమూలగ్రంథముల<noinclude><references/></noinclude>
401fmfz9d5jj2zo32h083q721jrfx89
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/61
104
129282
396935
2022-07-26T13:00:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>తాలూక జమీందార్ల పరంచేసిరి. అప్పుడు యీ ఓంటుకు మానూరి నరసన్నకు ఒప్పగింపబడెను. ఆయన 1219 వరకు 20 సం॥ పాలించి వీరి తమ్ముని కుమారులు వెంకటకృష్ణునింగారు 1221వరకు పాలించెను.
(1) భీష్మకునినగరం కుండిననగరంపట్టున పోలయవేమారెడ్డి మరల పట్టణం కట్టించెను (2) దీనికి ఉత్తరం పుట్టకోట కట్టించిరి. (3) ఈగ్రామానికి ఉత్తరదార్వాజాకు పశ్చిమంగా శివాలయం పడిపోయినది. (4) ఈదేవాలయానికి తూర్పు లంకెలబావి ఉన్నది. (5) ఈ బావికి తూర్పున కైలాసరాయనికొండ ఉన్నది. 108 దేవాలయాలను రెడ్లు పూజించేవి మ్లేచ్ఛులు పాడుచేసిరి (6) ఈ స్థలానికి ఉత్తరం బార్ల ఆవీడు దేవాలయం దానికి క్రిందుగా బ్రహ్మగుండం కోనేరు ఉన్నది. (7) పట్నానికి ఆగ్నేయముగా వేంక టేశ్వరస్వామి - యీస్వామికి తూర్పు పుష్కరిణిఉన్నది. (8) ఈ స్వామికి ఆగ్నేయంగా కన్యకలబావి (9) ఈ పట్నానికి దక్షిణంగా గోపినాథస్వామి దేవాలయం ఈ ఆలయానికి పశ్చిమంగా రంగనాథస్వామివారిని గజపతివారు ప్రతిష్టించిరి. (11) నాగమయ్య దక్షిణముగా కో నేరు ఉన్నది. (12) ఈ కోనేరుకు దక్షిణంగా మాణిక్యారావువారి కోనేరుకలదు, పూర్వం కర్ణాటక ప్రభుత్వంలో యీ వెలుమవారు గోపీనాథపట్నం తురకలదని యిక్కడ రాజగృహములు కట్టించుకొని నివసించుతూ ఈ కోనేరు త్రవ్వించిరి. (18) ఈ కోనేటికి తూర్పుఁగా మాణిక్యారావు గుండాలని రెండుదద్దణాలున్నవి. పూర్వము యుద్ధాలలో మగవారు చనిపోతే స్త్రీలు సహగమనం చేసినారు యీగుండాలలో అని ప్రసిద్ధి. (14) ఈ గుండాలకు దక్షిణంగా రెడ్లు కట్టించిన పెద్దకోనేరు ఉన్నది. (15) ఈ కోనేటికి పశ్చిమమున గృహరాజ మేడదిబ్బ ఉన్నది. రెడ్లప్రభుత్వంలో కోమటి వేమారెడ్డిగారు శ్రీనాథుని ప్రభావంవల్ల నవులూరిపోతరాజు దేవాలయం వద్దనున్ను యేడుతాళ్లపొడుగు యేడుమోకులుతిరిగే లావును గల తుమ్మచెట్టును తెప్పించి ఒంటిస్తంభము మేడ కట్టించి ఆదిలక్ష్మి కామేశ్వరి అమ్మవారికి సింహాసనముగ ప్రతిష్టించిరి. ఈ మేడ శిఖరానను బొల్లిమోర వేంకటేశ్వరస్వామివారి దేవాలయమునకు మకరతోరణం కట్టించిరి. ఇక్కడకు వెంకటేశ్వరస్వామివారి కొండ<noinclude><references/></noinclude>
omqkemokxpyu0mwj3fg6tnzu80ur8ai
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/60
104
129283
396936
2022-07-26T13:06:31Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>లోనున్న శ్రీరంగనాయకస్వామివారిని జయవిజయలతో కూడ తెచ్చి ప్రతిష్టించి అక్కడ రంగపతి పేట కట్టించి సోల్ససమేతు శ్రీరంగనగరమని చుట్టు పొలిమేరిస్తంభములు వేయించి పై దుర్గానికి వాయవ్యమూలను మిరియాలచుట్టు? మీదను బురుజు కట్టించి మిరియాలబురుజు అని పేరు పెట్టించి 1538 నుండి 1540 వరకు మూడు సం॥ ప్రభుత్వం చేసెను. తానీశా, అలంగీరు వారి పరియంతం దుర్గములలో కిల్లేదార్లను ఉంచి హవేలీ గ్రామాలు వారి క్రింద ఉంచడమున్నూ, మిగతా సమతులు అమీళ్ల పరంగా ఉంచుతూ 1121 ఫసలీవరకు జరిగినది. ౧౧౨౨ ఫసలీలో నవాబు ముచరాజ ఖాను.....మృత్తుజానగరు మూడు...... విభాగించెను. అప్పుడు ఈ జిల్లా క్రింద 18 గ్రామాలు ఉంచి జమీందార్లకు సావరాలు ముడుతూ ఉండేటట్లుగా ఏర్పాటు చేసెను. తర్వాత ఆషబ్ షా నవాబు నిజాముల్ ముల్క్ బహద్దరుగారు సుభా అధ్యక్షులై జాజావాదుల్లా మొలతరము ఖానుడు బాలకృష్ణ మొదలయినవారికి అమీలు యిచ్చిరి. వారు వచ్చి అల్లకల్లోలముగా రాజ్యమును సరిచేసి దేశముఖి దేశ పాండ్యలవల్ల సుంకములు తీసికొంటు వచ్చినారు. తరువాత సాహెబు జావాగారు పరిపాలించిరి. తరువాత వీరి కుమారులు నజర్ జంగ్ ప్రభుత్వం వహించి 1160 ఫసలీలో పరాసువారి పరం చేసెను. తరువాత బసాలద్ జంగ్ దివాను అయిన రాజాబలవంతు ఇంద్రజిత్తు బహద్దరుగారికి ఖిల్లాదారు పని ఇచ్చి పంపగా వారు వచ్చి నల్గురు జమీందార్ల వ్యవహారం తానే చేసికొంటూ ఉండగా ముశ్చఫీలు ముశ్ నాభాముశే లాలి మొదలయిన పరాసువారు పెళ్లూరి రామయ్యగారిని మంత్రిగా యేర్చరచి వ్యవహరించిరి. ఆరవీటినుండి తద్దిఖానుడు మేస్తరుది వీలువచ్చి జమిందార్ల పరంగా వ్యవహరించిరి, ఇంతలో టిప్పుసుల్తాను తరపున గండికోటనుంచి మీరు సాహెబుగారు 6000 గుఱ్ఱాలతో వచ్చి దోపిడి జరిపెను. తరువాత గోలకొండనుంచి పంపబడ్డ సాహెబు వచ్చి జమిందార్ల నేర్పాటు చేసి గుంటూరు సుబా చేసి ఏడు సంవత్సరములు పరిపాలించిరి. 1177 పసలీలో... వారు వచ్చి 1177వరకు 3 సం॥ పరిపాలించిరి. 1200 ఫసలీలో ఈ<noinclude><references/></noinclude>
9q0nojsn77aztzkf4bzek6mk4khpfob
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/59
104
129284
396937
2022-07-26T13:14:48Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కొండవీటి జిల్లాలో హుజూరునాయకుడు ఖిల్లాదారు హోదాలో యున్న మాణ్యిక్యారావు స్వదేశిముఖి అనిన్నీ, మాసూరు వారికి మజుందారనిన్నీ, పాత్రునివారికి దేశపాండ్యగిరిన్నీ సదరు సమతులను స్వాధీనపరచి నాదెళ్ల సమతుకు కమ్మవారిని నియమించి వారి పరంగా మామ్లియతు జరిగేటట్లుగా నిర్ణయించినారు. తరువాత మహమదు పాదుషాహి రాయలంగారు గోల్కొండను రాజ్యంచేయుచు బందిపోట్లను అడచుటకై అమీనుముల్కును కొండవీటికి బంపగా అతను బందిపోటును అణచి 1514లో ముల్లగూరి అగ్రహారమును పాడు చేసి తన పేర మల్కాచెర్వు, మల్కామాహాలు, మల్కాబావి కట్టించి ముల్లగూరిని యాబలూరి గ్రామంలో కల్పి అమీనుబాదా అను పేరు పెట్టి దుర్గం కట్టించిరి. ఒక బురుజు పేరు మల్కాబురుజని పేరు పెట్టి హిందువుల కట్టడముల పాడొనరించి 1512 నుంచి 1520 వరకు 7 సం॥ పరిపాలించెను. కాలమందు సిగిలిన్ ఖాను ఈ పురమువచ్చి మహమ్మదు కుదుబ్ షావారి ఈ పురమునకు దక్షిణమున పేట, పురము కట్టించెను. తరువాత అబ్దుల్లా సుల్తాను, అబ్దుల్లాహుస్సేను, తానీషా అలంగీరు, పాదుషాలు రాజ్యము చేసిరి. వారి దినములలో అధికారము చేసిన హమీళ్ళు చితాపఖానుడు 1521 నుంచి 1524వరకు, 1524నుంచి ఒక సం॥ అబినిసిద్ధి చివులు ఖానుడు 1524నుంచి 1527వరకు అప్పరస ఖానుడు ప్రభుత్వం చేసిరి. వీరి తర్వాత యల్లాస్ ఖానుడు గుంటుపల్లి ముత్తురాజయ్యలు పరిపాలించి. తరువాత 1574లో యల్లాస్ ఖానుడు అమీలు అయి పూర్వము రెడ్లరాజులు చిన్నకొండమీద కట్టించిన విఘ్నేశ్వరాలయమును పడగొట్టించి ఈ దేవాలయానికి దక్షిణంగా కొంచెం నైరృతి మూలగా యల్లాస్ ఖాను పేట కట్టించి, ఆవూరు గణేశపేట అనికూడ పిలుస్తూ వచ్చిరి. పిమ్మట కుటిఖానుడు అమీను పదవికి వచ్చి 1574నుంచి 1577వరకు మూడు సం॥ పరిపాలించెను. తరువాత జూపల్లె రంగారావుగారి కుమారుడు రంగపతిరావు రాజ్యమునకు వచ్చి ఈ పట్నానికి నైరృతిమూలగా నాదెండ్లకుపోయే మార్గంలో ఈ ఊరి పొలం కొంత తీసికొని అందులో దేవాలయం కట్టించి ఈపట్టణం<noinclude><references/></noinclude>
ss9vkj3y530lv3tbpfao2zq41iq6s1s
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/58
104
129285
396938
2022-07-26T13:20:59Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>1443 మొనలు 1470 వరకు 27 సం॥లు పాలించెను. విజయనగరంలో అప్పుడు పరిపాలించుచున్న రామరాజయ్యదేవమహారాయలను 1487లో తురకలు చంపి రాజ్యము స్వాధీనము చేసుకొని మల్కిరాయపాదుషావారు పరిపాలించుచూ ముర్త్యుజ అనే తురకను ఈదేశానికి పరిపాలనకు పంపిరి. అతను దేవాలయములు పడగొట్టి గోపీనాథపురమునకు ముర్తుజానగరమని పేరిడి రాజ్యము చేయుచుండగా శ్రీ వీరప్రతాపతిరుమలదేవరాయలు కృష్ణయావలనున్న మొగలులను జయించి సామ్రాజ్యానికి వచ్చి ఆనెగొంది తిరుమల దేవరాయల పుత్రులయిన శ్రీరంగరాజయ్యకు ఈ దేశానికి ప్రభుత్వం కట్టిరి. ఆయనే కృష్ణాతీరమందున్న మూరంపూడి అనే గ్రామమును గంగాధర రామేశ్వరస్వామివారికి దానం చేసిరి. ఇది 1474లో జరిగెను. అజరత్ విభురా పాదుశాహావారు కృష్ణా ఆవలిభాగం ప్రభుత్వం చేస్తూయుండిరి. కర్ణాటక పాదుషాహా శ్రీరంగరాయలను జయించి కృష్ణ దక్షిణదేశ మందున్న వినుకొండ మొదలైన సాధించవలెనని రాయరావు అనే బ్రాహ్మడికి సేన ఇచ్చి పంపగా ఆయన వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ, మాచెర్లసీమ జయించి వెలమవారు పరిపాలించుచున్న నేలకోట కొబ్బెర్లతోట జయించి అద్దంకి, అమ్మనబ్రోలు, కందుకూరు, పొదిల, దరశికంభం, కాకర్ల, తూపాడు, తంగేడు, గురజాల, కేతవరం, కోడెపూడి మొదలైన నేలకోటలను జయించి కొండవీటిని ముట్టడించగా రాయలవారి ముతాలీమతులై ? ముఠాధిపతులైన? వెలుగోటి తిమ్మన్న లోబడి రాయరావుకి అధీనుడైనాడు. 1502లో స్వాధీనపరచుకొని 1504వరకు పరిపాలించి గోల్కొండకు వెళ్లెను. గోల్కొండలో ఉన్న అజరత్ గారు ఇక్కడ మన పూర్వీకుడు ముర్తుజాచే గట్టపడిన పట్టణము బాగుగా
కట్టించెను. వినుకొండ, బెల్లంకొండ మొదలయిన దుర్గముల వ్యవహారములుగూడ ఇక్కడ జరుగునట్లు యేర్పాటు చేసి దీనికి ముర్తుజానగరు సర్కారని పేరిడి కొండవీటి సీమనంతయు 14 సమతులు చేసినారు. పాలడ్లు, పులివఱ్ఱు, ప్రతిపాడు, సంతరావూరు, నూతక్కి, చీరాల, పాణం, మంగళగిరి, మునిగోరు, నాదెళ్ల, రావిపూడి, కూచిపూడి, గుంటూరు, తాడికొండ ఈ విధముగ 44 గ్రామాదులను 14 సమతులు చేసిరి.
{{nop}}<noinclude><references/></noinclude>
liz5zgotk0nvpx1r9plnjeo3vv1apmi
396942
396938
2022-07-26T14:23:37Z
దేవీప్రసాదశాస్త్రి
4290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>1443 మొదలు 1470 వరకు 27 సం॥లు పాలించెను. విజయనగరంలో అప్పుడు పరిపాలించుచున్న రామరాజయ్యదేవమహారాయలను 1487లో తురకలు చంపి రాజ్యము స్వాధీనము చేసుకొని మల్కిరాయపాదుషావారు పరిపాలించుచూ ముర్త్యుజ అనే తురకను ఈదేశానికి పరిపాలనకు పంపిరి. అతను దేవాలయములు పడగొట్టి గోపీనాథపురమునకు ముర్తుజానగరమని పేరిడి రాజ్యము చేయుచుండగా శ్రీ వీరప్రతాపతిరుమలదేవరాయలు కృష్ణయావలనున్న మొగలులను జయించి సామ్రాజ్యానికి వచ్చి ఆనెగొంది తిరుమల దేవరాయల పుత్రులయిన శ్రీరంగరాజయ్యకు ఈ దేశానికి ప్రభుత్వం కట్టిరి. ఆయనే కృష్ణాతీరమందున్న మూరంపూడి అనే గ్రామమును గంగాధర రామేశ్వరస్వామివారికి దానం చేసిరి. ఇది 1474లో జరిగెను. అజరత్ విభురా పాదుశాహావారు కృష్ణా ఆవలిభాగం ప్రభుత్వం చేస్తూయుండిరి. కర్ణాటక పాదుషాహా శ్రీరంగరాయలను జయించి కృష్ణ దక్షిణదేశ మందున్న వినుకొండ మొదలైన సాధించవలెనని రాయరావు అనే బ్రాహ్మడికి సేన ఇచ్చి పంపగా ఆయన వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ, మాచెర్లసీమ జయించి వెలమవారు పరిపాలించుచున్న నేలకోట కొబ్బెర్లతోట జయించి అద్దంకి, అమ్మనబ్రోలు, కందుకూరు, పొదిల, దరశికంభం, కాకర్ల, తూపాడు, తంగేడు, గురజాల, కేతవరం, కోడెపూడి మొదలైన నేలకోటలను జయించి కొండవీటిని ముట్టడించగా రాయలవారి ముతాలీమతులై ? ముఠాధిపతులైన? వెలుగోటి తిమ్మన్న లోబడి రాయరావుకి అధీనుడైనాడు. 1502లో స్వాధీనపరచుకొని 1504వరకు పరిపాలించి గోల్కొండకు వెళ్లెను. గోల్కొండలో ఉన్న అజరత్ గారు ఇక్కడ మన పూర్వీకుడు ముర్తుజాచే గట్టపడిన పట్టణము బాగుగా
కట్టించెను. వినుకొండ, బెల్లంకొండ మొదలయిన దుర్గముల వ్యవహారములుగూడ ఇక్కడ జరుగునట్లు యేర్పాటు చేసి దీనికి ముర్తుజానగరు సర్కారని పేరిడి కొండవీటి సీమనంతయు 14 సమతులు చేసినారు. పాలడ్లు, పులివఱ్ఱు, ప్రతిపాడు, సంతరావూరు, నూతక్కి, చీరాల, పాణం, మంగళగిరి, మునిగోరు, నాదెళ్ల, రావిపూడి, కూచిపూడి, గుంటూరు, తాడికొండ ఈ విధముగ 44 గ్రామాదులను 14 సమతులు చేసిరి.
{{nop}}<noinclude><references/></noinclude>
7m7maemd53ml283wbc3trrm7hov0nqy
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/41
104
129286
396939
2022-07-26T14:07:43Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>విధానము. 19. జాంగలాది భూనిర్ణయప్రకారము. 20. ఏకవింశతివేణువుల చాపదండములుగల రాజులనిర్ణయంబులు. 21. శార్ఞ్గాది చాపలక్షణములు.
పరికరఖండము - ద్వితీయాశ్వాసము
22. శిలీముఖకర్తనము. 23. సెలకట్టియలభేద ముపన్యసించుట. 21. శరోత్పత్తిక్రమము. 25. సెలకట్టియల రాజమార్గంబునంబరచి అందుత్తమసారంబుల సంగ్రహించుట. 26. ధారావక్రంబులు దీర్చువిధము. 27. పుంఖార్హవస్తునిర్దేశము. 28. మయవిశ్వకర్మ సంవాదము. 29. వర్ణభేదవస్తునిర్దేశము. 30. శిల్పవిద్యాచాతుర్యము. 31. శరములకు లక్కగరులు కట్టుమార్గము. 32. ప్రతిపత్రార్హంబులైన పులుగులనామధేయములు. 33. దూరాపాతి, తేజోఘాతి, పాషాణఘాత, లోహఘాతి రచితప్రకారము. 34. అలుకుల రూపప్రకటనము. 35. పంచధారలవలన శరకల్పలప్రకారము, 36. షడ్విధజాతులుంగల కట్టియలకు వినియోగంబు లెఱింగించుట.
పరికరఖండము - తృతీయాశ్వాసము
37. ఉపసాధనములు. 38. గోధాలలామంబులు, కనకశృంగ శిలాచర్మంబుల నిర్మించువిధము. 39. చెకినుల తారతమ్యంబు లేర్పఱించుట 40. ఏకవింశత్యంగుళీత్రాణ నిర్మాణ కౌసలప్రభావము. 41. కనకాంగుళీగుప్తంబు మూసనుబోయువిధము. 42. హేమచర్మ సంయుక్తాంగుళీగోపాయితమార్గము. 43. మయగౌతమసంవాదము. 44. వేణుతూణీరప్రకారము. 45. దారుతూణీరనిర్మాణవిధానము, 46. చర్మనిషంగప్రకారము. 47. కేకీముకురంబులు తరకసులం బొదువు విధము. 48 తరకసుల వినియోగము.
పరికరఖండము - చతుర్థాశ్వాసము
49. గురుస్తవము. 50. భార్గవదత్తమైన గ్రంథప్రకారము. 51. కులమారి పైశాచ కాశ్మిక ఘోరి కుటిలాభిధానంబులు గల ధను<noinclude><references/></noinclude>
6l8cnny17mpx4ers19iq5rg0fptfhuw
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/42
104
129287
396940
2022-07-26T14:15:17Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ద్దోషంబుల ప్రకారము. 57. రథవాహోపాఖ్యానము. 53. షణ్ముఖకుండల పద్మవరాట భుజంగచక్రపంచక లక్షణపలసూత్రంబు లుపన్యసించుట. 54. దివ్యాస్త్రప్రయోగార్హశరలక్షణములు, తత్పూజానిరూపణంబును. 55. అమోగాస్త్రసంభవము, 56. ధీయువధ. 51. దివ్యాస్త్రగర్వప్రకారము. 58. అమోఘాస్త్రము పరంపరానుగ్రహముగా భూలోకంబునకు వచ్చుట.
వ్యూహఖండము - పంచమాశ్వాసము.
1. అక్షౌహిణీసంఖ్య. 2, సమరంబులకు బయనంబగు సేనాలక్షణంబులు. 3. భటఘోటకరిరథాదుల స్వరూపప్రకటనము. 4. అతిరథ మహారధ సమరథార్ధరథులగుణంబులు. 5. రథీజమనోజ్ఞత్వకౌశలవిశేషంబులుగల సారథులచందము. 6. ఉపసైన్యంబగు బేడుదండున దీపించుతెఱగు. 7. మిత్రవ్యూహనామనిర్దేశము. 8. మహావ్యూహంబు లొడ్డెడువిధము, 9. పోటుమానసు లెక్కటికయ్యంబులకు జోళ్లు గట్టి పెనంగుమార్గము. 10. అసిచర్ముల యుద్ధము. 11. కుంతాయుధులసమరము. 12. మల్లరణము. 13. చక్రాయుధుల కథనము. 14. గదాధరుసంగ్రామము. 15. అశ్వవిద్వేషము. 16. వారణవిరోధము. 11. అర్ధరథ సమరథ మహారథా తిరథికుల యుద్ధచమత్కారము. 18. అర్ధరథాదుల నైజంబుల ప్రకటనము.
కడపటి దగుధర్మఖండ మిందు ముద్రితము గాలేదు, గాన దానివిషయసూచి యిందు చేరలేదు. ఈ గ్రంథము ధనుశ్శాస్త్రవిషయమున సంస్కృతగ్రంథము లన్నింటిని మించినది. దీనికి మూలమగు సంస్కృతగ్రంథమేదో తెలియరాలేదు. ఇందు ధనుర్వేదగ్రంథగర్తల పేళ్లు తత్సంప్రదాయాదులు చాల జెప్పబడినవి.
{{p|ac|fwb}}కృతిపతి</p>
ఈవని కోదండరామస్వామి.
కృష్ణానేని తిరుమల మాణిక్యారాయప్రభుఁడు ధనుర్విద్యావిశేషములు వివరింపఁగాఁ దదాస్థానకవి యగు కృష్ణమాచార్యుఁడు<noinclude><references/></noinclude>
8l5okxrp4haz1vgzi0cmw44u3cp88in
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/43
104
129288
396941
2022-07-26T14:22:32Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>తెలుఁగున మూడాశ్వాసములప్రబంధముగా కృతిప్రేరకుని యిలవేల్పయిన యీవని కోదండరామదేవున కర్పితముగా నీగ్రంథము రచియించినాఁడు. కృతిపతి వెలసియున్న యీవని గ్రామము గుంటూరు మండలమున తెనాలి తాలూకాలో నున్నది. ఈగ్రంథమునకు,
{{p|ac|fwb}}కృతికర్త</p>
కృష్ణమాచార్యుఁడు. ఈతని నివాసగ్రామ మేదో తెలియరాదు. ఈధనుర్విద్యావిలాసమునే కాక శకుంతలాపరిణయ మని మరొకప్రబంధమును గూడ నీతఁడు రచించినాఁడు. <ref>దీనిని పనప్పాకం శ్రీనివాసాచార్యులుగారు 1894 లో ముద్రించిరి.</ref>శకుంతలాపరిణయము నీతఁడు చిరుమామిళ్ల పాపయ్య ప్రభుఁడని నామాంతరముగల వెంకటాద్రినాయనింగారి ప్రేరణమున తిరుపతి వెంకటేశ్వరస్వామి కర్పించినాఁడు. అందా పాపయప్రభుని వంశవిస్తర మెల్ల వర్ణింపబడినది. చల్లపల్లి జమీందార్లగు నేర్లగడ్డవారికిని, ముక్త్యాల, అమరావతీ ప్రభులగు వాసిరెడ్డివారికిని చిరుమామిళ్లవారు దగ్గర బంధువులు. నేటికిని నది సాగుచునే యున్నది. చిరుమామిళ్ల వంశ్యులు, నాయఁడమ్మగారు, పాగోలు వాస్తవ్యులుఁ చల్లపల్లి శ్రీశివరామనృపునకుఁ చిన్నతల్లిభర్తయు, ముక్తాల శ్రీచంద్రమాళీశ్వర ప్రభునకు భావుకుఁడునై వర్ధిల్లుచున్నారు. శకుంతలాపరిణయమున గ్రంథకర్త తన్ను కృష్ణకవి యనియు ధనుర్విద్యావిలాసమున గృష్ణమాచార్యుఁడనియుఁ బేర్కొన్నాఁడు. శకుంతలాపరిణయమునాఁటి యీతనివై ష్ణవత ధనుర్విద్యావిలాసమునాటికి క్రమపాకము పొందినదిగాఁ బోలును. పేళ్లు మార్పునుబట్టి రెండు గ్రంధములకుఁ కర్తలు వేర్వేరువా రగుదురేమో యని సందేహింపరాదు. ఈనామభేదమే కాని రెండు గ్రంథముల గద్యములు సమానముగానున్నవి.
"ఇది శ్రీమత్కౌసల్యానందనప్రసాదసమాసాదితకవితావిచిత్ర మైత్రేయసగోత్ర నృసింహగురుపుత్ర కృష్ణమాచార్య ప్రణీతంబైనఁ<noinclude><references/></noinclude>
2p4w56zyxfq9byn5o6ge05v5w566ikx
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/44
104
129289
396943
2022-07-26T16:02:15Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>శకుంతలాపరిణయము” శకుంతలాపరిణయ రచనమునకుఁ దర్వాతి రచనముఁ గాబోలును ధనుర్విద్యావిలాసము. ఇందు గద్య మించుక మార్పు చెందినది ‘‘కౌసల్యానందనకటాక్షవీక్షణపరంపరాసమాసాదిత” అని. కాని రెండు గ్రంథములందును గురుస్తుతియుఁ కవి కులగోత్ర ప్రశంసయు నొక్కవిధముననే యున్నవి.
{{Telugu poem|type=క.|lines=<poem>భాసురసూరి గ్రామణి
భూసురముఖ పంకరుహనభోమణి నినమ
ద్దాసనిచయ చింతామణి
నే సింగర గురుశిఖామణిం గణుతింతున్.</poem>|ref=}}
{{Telugu poem|type=మ.|lines=<poem>నను రామానుజపాదపద్మయుగళీ నవ్యావ్యయధ్యానపా
వనహృద్భాగగవతావతంసపదసేవాసక్తచిత్తున్ మరు
త్తనయారాధన లబ్ధచారుకవితాధారున్ సదారూఢభా
వను నాస్థానకవిన్ నిజాశ్రితునిఁ బిల్వంబంచి పల్కెం గృపన్.</poem>|ref=}}
{{Telugu poem|type=క.|lines=<poem>పాత్రుఁడవై మైత్రేయస
గోత్రుఁడవై నారసింహగురువర్యునకున్
బుత్రుఁడవై వెలయుదు వి
ద్ధాత్రిన్ మాపనుపు సేయఁదగుఁ గృష్ణకవీ!</poem>|ref=}}
రెండు గ్రంథములందును పద్యము లున్నవి గావున రెండు నొక్కకవిరచనములే యగుట స్పష్టము ఇవి గాక, ఆంధ్రసాహిత్యపరిషత్తు కేటలాగులోనున్న కొమ్మాలపాటి దండకము, నింకొక యక్షగానము నీతని రచనములని శ్రీనిడదవో లు వెంకటరావుగారు చెప్పిరి. కావచ్చును. పరిషత్తు పుస్తకముల జాబితాలో నాదండకమున కృష్ణమాచార్య రచనమని కలదు. ఆగ్రంథమును నే జదివిచూడలేదు. ఆకాశరావణసంహారమని మరొక పద్యకావ్యము, రసవంతమయినది తెనాలి తాలూకాలోనే మోదుకూ రనువూర మొగసాటి మూర్తిరాజుగారను భట్టు రాజుగారి యింటదొరకినది. నేను మద్రాసు ప్రాచ్యలిఖితపుస్తక<noinclude><references/></noinclude>
c0lkprx0wuz2iey4xmqlarx43enq2zs
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/45
104
129290
396944
2022-07-26T20:32:25Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>శాలకుఁ జేర్చినాను. తద్గ్రంథకర్త ఉరుటూరి వెంకటకృష్ణకవి తన గ్రంథమునే తద్ధనుర్విద్యావిలాసరచనాప్రేరకుఁ డగు కృష్ణానేని తిరుపతి మాణిక్యారాయప్రభుని ప్రేరణముననే రచించినట్టు వ్రాసినాడు అదికూడ (ఈవని) కోదండరామస్వామికే యర్పితమై యున్నది. కృతిప్రేరకుఁడగు ఆతిరుపతిరాయనిగూర్చి ధనుర్విద్యావిలాసములో నున్న పద్యములే ఆకాశరావణసంహారమున నున్నవి. ఆకాశరావణసంహారమున గొన్ని తాటియాకు లేయానుపూర్వి లేక దొరకినవిగాన దానిని గూర్చి యింతకంటె హెచ్చువిషయములు గుర్తింపఁగా లేదు. అతని గద్య మిట్టిది. “ఇది శ్రీవిమలచిత్తమునిచరణసేవాధురీణ, రాఘవపాండవీయాది బహుప్రబంధనిబంధనప్రవీణ ఆపస్తంభసూత్రహరితసగోత్ర వురుటూరి........౦కశ్లేషకవితాపితామహోంక సంస్కృతాంధ్రభాషాచతుర్విధవివిధకవితానిలయ వెంగన మంత్రి తనయవినయవిశంకట వెంకటకృష్ణకవి ప్రణీతం బైన యాకాశరావణసంహారంబునందు తృతీయాశ్వాసము.”
{{p|ac|fwb}}కృతిప్రేరకులు – వెలమవారు</p>
'వెలమ' యని నేటివ్యవహార మైనను వెలుమ 'వెల్మ' పదములే ప్రాచీనన్యవహారరూఢములు, రెడ్డి, కమ్మ, వెలుమ, బలిజ జాతులవారు బహుప్రాచీనకాలమున నుండియు నంధ్రదేశమున మహాప్రాభవము ననుభవించినవారు. ఇప్పుడు ప్రసక్తులగు వెలుమవారిలో పద్మనాయకులనువారుఁ (వారికే పద్మవెలుమ లని వ్యవహారము) చాల సుందరాకారులు, రాచఠీవిగలవారు, ఏల్బడులు నెఱపుచు, వీరాధివీరు లయి చాల విఖ్యాతిగన్నవారు. వారియాచారవ్యవహారములు రాచవారితీరు లవి. కాకతీయుల నాఁట నుండి నేఁటిదాఁక నవిచ్ఛిన్నమయిన రాజ్యవైభవము ననుభవించుచు వర్థిల్లినవారు. వెలుమవారిలో రావువంశ్యులగు వెలుగోటి ప్రభువులు. ‘వెలుమ’ పదము 'వర్మ' పదవికృతి కావచ్చును. 'వర్మ' పదము వరుమ, వలుమ వెలుమ పదములుగాఁ గ్రమపరిణామము చెందియుండవచ్చును. 'నందాంతం క్షత్రియకులమ్' అన్న ప్రవాదముచొప్పున నెన్నఁడో క్షత్రియులు పలువురు చతుర్థ<noinclude><references/></noinclude>
sb5a4x85t5uj2up0bx9fyqpidx87ql0
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/46
104
129291
396945
2022-07-26T20:48:28Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వర్ణమువారు గా మాఱియుండవచ్చును. అయినను వారు క్షాత్రధర్మమును వీడనాడక వెలయుచునే యున్నారు. తెలుఁగున వెలుమలే ద్రవిడదేశమున 'వెళ్మాన్' అనఁబడు వెళ్లాలవారు నయిరి. అహనానూఱు అను నతిప్రాచీనద్రవిడగ్రంథమున 'వెణ్మాన్ - వెల్మాన్' వెల్మనుగూర్చి పద్య మొకటి కలదు.
{{left margin|2em<poem>"అహ వునర్ పురన్ద అన్బిన్ కడల్ తొడి నఱవు
మహిళ్ ఐరుక్కై నన్నన్ వేళ్మాన్"</poem>}} </div>
{{right|వయలై వేలివియలూర్ - 97పాట్టు}}
పాటలు నేర్చిన వారిని రక్షించేవాఁడు, ప్రేమగలవాఁడు, వదులు కంకణాలుగలవాఁడు, పానీయశాలలుగలవాఁడు, నన్నన్ అని పేరుగలవాఁడునగు, వెణ్మని (వెల్మని) బచ్చలి తీగలవృతి (చెంచ) గల వియలూరు అనుగ్రామము అనిపై నేదోయున్నది. వెళ్మాన్, వెల్మన్, వేళాలన్, వెల్లాళన్ అన్నీ ద్రవిడమునఁ బర్యాయపదములట.<ref>తిరుపతి శ్రీవెంకటేశ్వర రీసర్చి ఇన్స్టిట్యూట్ లో అరవరీడరుగానున్న శ్రీపళనియప్ప పిళ్ళగారు దీవిషయము తెల్పిరి.</ref>
ఐక్ష్వాకులు మొదలగుక్షత్రియు లంధ్రదేశమునకు వచ్చి రాచఱికము నెఱపి, ద్రవిడదేశమునకును వ్యాపించి (శ్రీరంగనాథస్వామి యిక్ష్వాకులనాఁటి కథలు) యుండవచ్చును. తెలుఁగుదేశమున క్షత్రియులు అట్లే వెలుమవారును క్షత్రధర్మముతో తెలుఁగుదేశమున వర్ధిల్లి ద్రవిడదేశమునకును జేరియుండవచ్చును. బసవపురాణమున వెల్మనికథ యొకటి హృద్యమైనది కలదు. అది ద్రవిడ దేశపు శివకవియగు సుందరి మూర్తినాయనారు నాఁటి కథ. అది తెలుఁగున నున్నట్లు గాక ద్రవిడమున పెరియపురాణమునఁ గొంతభేదముతో నున్నది. వెల్మలనుగూర్చి చాటువు.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>పైకొనువారితో నొరఁగిపాఱరు, నేరరు భంగసంగతుల్
చేకొనఁబూనికాని దొరఁజేరరు కోరరు దుష్టజంతుర</poem>|ref=}}<noinclude><references/></noinclude>
5wglpyhg3xqrpqdqjw2dc1urxvgvub1
396946
396945
2022-07-26T20:49:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వర్ణమువారు గా మాఱియుండవచ్చును. అయినను వారు క్షాత్రధర్మమును వీడనాడక వెలయుచునే యున్నారు. తెలుఁగున వెలుమలే ద్రవిడదేశమున 'వెళ్మాన్' అనఁబడు వెళ్లాలవారు నయిరి. అహనానూఱు అను నతిప్రాచీనద్రవిడగ్రంథమున 'వెణ్మాన్ - వెల్మాన్' వెల్మనుగూర్చి పద్య మొకటి కలదు.
{{left margin|2em<poem>"అహ వునర్ పురన్ద అన్బిన్ కడల్ తొడి నఱవు
మహిళ్ ఐరుక్కై నన్నన్ వేళ్మాన్"</poem>}} </div>
{{right|వయలై వేలివియలూర్ - 97పాట్టు}}
పాటలు నేర్చిన వారిని రక్షించేవాఁడు, ప్రేమగలవాఁడు, వదులు కంకణాలుగలవాఁడు, పానీయశాలలుగలవాఁడు, నన్నన్ అని పేరుగలవాఁడునగు, వెణ్మని (వెల్మని) బచ్చలి తీగలవృతి (చెంచ) గల వియలూరు అనుగ్రామము అనిపై నేదోయున్నది. వెళ్మాన్, వెల్మన్, వేళాలన్, వెల్లాళన్ అన్నీ ద్రవిడమునఁ బర్యాయపదములట.<ref>తిరుపతి శ్రీవెంకటేశ్వర రీసర్చి ఇన్స్టిట్యూట్ లో అరవరీడరుగానున్న శ్రీపళనియప్ప పిళ్ళగా రీవిషయము తెల్పిరి.</ref>
ఐక్ష్వాకులు మొదలగుక్షత్రియు లంధ్రదేశమునకు వచ్చి రాచఱికము నెఱపి, ద్రవిడదేశమునకును వ్యాపించి (శ్రీరంగనాథస్వామి యిక్ష్వాకులనాఁటి కథలు) యుండవచ్చును. తెలుఁగుదేశమున క్షత్రియులు అట్లే వెలుమవారును క్షత్రధర్మముతో తెలుఁగుదేశమున వర్ధిల్లి ద్రవిడదేశమునకును జేరియుండవచ్చును. బసవపురాణమున వెల్మనికథ యొకటి హృద్యమైనది కలదు. అది ద్రవిడ దేశపు శివకవియగు సుందరి మూర్తినాయనారు నాఁటి కథ. అది తెలుఁగున నున్నట్లు గాక ద్రవిడమున పెరియపురాణమునఁ గొంతభేదముతో నున్నది. వెల్మలనుగూర్చి చాటువు.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>పైకొనువారితో నొరఁగిపాఱరు, నేరరు భంగసంగతుల్
చేకొనఁబూనికాని దొరఁజేరరు కోరరు దుష్టజంతుర</poem>|ref=}}<noinclude><references/></noinclude>
ctgs2g5k0emn6tk1oc1bwxpkntu5etd
396947
396946
2022-07-26T20:50:21Z
దేవీప్రసాదశాస్త్రి
4290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వర్ణమువారు గా మాఱియుండవచ్చును. అయినను వారు క్షాత్రధర్మమును వీడనాడక వెలయుచునే యున్నారు. తెలుఁగున వెలుమలే ద్రవిడదేశమున 'వెళ్మాన్' అనఁబడు వెళ్లాలవారు నయిరి. అహనానూఱు అను నతిప్రాచీనద్రవిడగ్రంథమున 'వెణ్మాన్ - వెల్మాన్' వెల్మనుగూర్చి పద్య మొకటి కలదు.
{{left margin|2em}}<poem>"అహ వునర్ పురన్ద అన్బిన్ కడల్ తొడి నఱవు
మహిళ్ ఐరుక్కై నన్నన్ వేళ్మాన్"</poem> </div>
{{right|వయలై వేలివియలూర్ - 97పాట్టు}}
పాటలు నేర్చిన వారిని రక్షించేవాఁడు, ప్రేమగలవాఁడు, వదులు కంకణాలుగలవాఁడు, పానీయశాలలుగలవాఁడు, నన్నన్ అని పేరుగలవాఁడునగు, వెణ్మని (వెల్మని) బచ్చలి తీగలవృతి (చెంచ) గల వియలూరు అనుగ్రామము అనిపై నేదోయున్నది. వెళ్మాన్, వెల్మన్, వేళాలన్, వెల్లాళన్ అన్నీ ద్రవిడమునఁ బర్యాయపదములట.<ref>తిరుపతి శ్రీవెంకటేశ్వర రీసర్చి ఇన్స్టిట్యూట్ లో అరవరీడరుగానున్న శ్రీపళనియప్ప పిళ్ళగా రీవిషయము తెల్పిరి.</ref>
ఐక్ష్వాకులు మొదలగుక్షత్రియు లంధ్రదేశమునకు వచ్చి రాచఱికము నెఱపి, ద్రవిడదేశమునకును వ్యాపించి (శ్రీరంగనాథస్వామి యిక్ష్వాకులనాఁటి కథలు) యుండవచ్చును. తెలుఁగుదేశమున క్షత్రియులు అట్లే వెలుమవారును క్షత్రధర్మముతో తెలుఁగుదేశమున వర్ధిల్లి ద్రవిడదేశమునకును జేరియుండవచ్చును. బసవపురాణమున వెల్మనికథ యొకటి హృద్యమైనది కలదు. అది ద్రవిడ దేశపు శివకవియగు సుందరి మూర్తినాయనారు నాఁటి కథ. అది తెలుఁగున నున్నట్లు గాక ద్రవిడమున పెరియపురాణమునఁ గొంతభేదముతో నున్నది. వెల్మలనుగూర్చి చాటువు.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>పైకొనువారితో నొరఁగిపాఱరు, నేరరు భంగసంగతుల్
చేకొనఁబూనికాని దొరఁజేరరు కోరరు దుష్టజంతుర</poem>|ref=}}<noinclude><references/></noinclude>
ba1whrj3almxsuk57f5d8zfjw4urm1m
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/47
104
129292
396948
2022-07-26T20:59:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>క్షాకరణంబు నొడ్లకపకారులుగా రెపు డప్పుగోరు మం
దాకినితోడబుట్టియు గుణప్రతిభన్ వెలుమల్ పురంబునన్.</poem>|ref=}}
కాళహస్తి, వెంకటగిరి, నూజివీడు, పిఠాపురము, బొబ్బిలి, మైలవరము, నరసారావుపేట, పెదపవని, కొల్లాపురము, తిరువూరు రేపల్లె, రాచూరు, ఉల్లిపాలెము, మొదలగు స్థలముల వెలుమవా రిప్పటికిని
జమీందారులుగా నున్నారు. అందు మన కిప్పుడు ప్రసక్తులు, రేపల్లె, రాచూరు జమీందార్లగు మాణిక్యాలరావు వారు. వీరితొల్తటియింటిపేరు కృష్ణానేనివారు. వీరు పుణ్యపలిగోత్రమువారు. తొల్త వీరు తెలుంగాణమున (నైజాం రాష్ట్రమున) నుండిరి. ఇప్పటికిని వీరిబంధువులు, అనుమకొండ దగ్గఱ పెదపెండ్యాలలో ' పొట్లపల్లివారు' అనఁబరగుచున్నారట. వీరికి మాణిక్యారావు వారని బిరుదుపేరు కుతుబ్ షాహ యిచ్చినాఁడు. జైనులలో, మాణిక్యచంద. మాణిక్యసీన, మాణిక్యదేవాది నామములు మాణిక్య పదఘటితములు గలవు. తెలుఁగాణమున మాణిక్యప్రభువను యోగీంద్రుఁ డెప్పుడో" వెలసెనట. వారి శిష్యపరంపర నేఁడును తెలుఁగాణమునఁ గలదు. ఇది వారి పేర ఏర్పడిన బిరుదేమో! ఈ వెలమప్రభువు పూర్వుఁడో ఆమాణిక్యప్రభుయోగి పూర్వుఁడో నే నెఱుఁగను.
వీరి వంశవృక్ష మిట్టిది.
పద్మనాయఁకులు దెబ్బదియైదు గోత్రముల వారట. వారిలో కుతుబ్ షాహాకు ఆశ్రితుడు మాణిక్యారాయఁడు, అతఁడు కోవెలకొండ, మెదకు, పెదకొండపల్లి, కొండవీడు, దుర్గములఁ గాచినందుకు కుతుబ్ షహా, బిరుదు లిచ్చినాడు (చూ. 21 నుండి 29 పద్యముదాఁక, ప్రథమాశ్వాసము). ఆతని కుమారుఁడు కొండలరాయడు అబ్దుల్లా పాదుషా కాశ్రితుఁడై బిరుదులందెను. (చూ. 32 పద్యము) అతని మునిమనుమని కొడుకు అప్పభూపతి ఔరంగజేబునకు ఆశ్రితుఁ డయ్యెను (చూ. 32, 33 పద్యములు) తత్పుత్రుఁడు తిరుపతిరాయఁడు. ముర్తుజాన్నగరము పాలించెను. (చూ. 34 నుండి 40 దాఁక పద్యములు). ఈతని కాఱుగురు కొడుకులు. ఆఱవవాఁడగు సీతన్నమాణిక్యరావు (47 నుండి 50 దాఁక<noinclude><references/></noinclude>
1bkaed6apgzaqm0yd3ldku5mc5tf4xy
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/48
104
129293
396949
2022-07-26T21:02:11Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Css image crop
|Image = Dhanurvidyaa_vilaasamu_(1950).pdf
|Page = 48
|bSize = 425
|cWidth = 405
|cHeight = 320
|oTop = 20
|oLeft = 14
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
7yxfz29930xt2wasnqx4zzy6iflde48
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/49
104
129294
396950
2022-07-26T21:08:18Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>పద్యములు) అతని రెండవ కొడుకు తిరుపతియే యేతత్కృతి ప్రేరకుఁడు. ఈతడు క్రీ. 1775 దాకనున్నవాఁడు. (చూ. 56 నుండి 72 దాఁక పద్యములు). వీరి వంశము కృష్ణా, గుంటూరు మండలములందు చిరకీర్తి నార్జించినది. దాతృత్వమునండును, శౌర్యమునందును నీవంశమువారు సుప్రఖ్యాతులు. ఈ వంశమున నేఁడు వర్థమానులుగా నున్న శ్రీ వెంకటహయగ్రీవరావుగారి తాతగారు వెంకటగోపాలరావుగారు, విలువిద్యలోను అశ్వారోహణకలలోను జితశ్రములని, చాల సౌందర్యవంతులని, సకలకలారసికులని వారిని బ్రత్యక్షముగా నెఱిఁగినవారు మా నాయనగారు చెప్పఁగా వింటిని. వారిని గూర్చి వింతకథలు, కృష్ణా గుంటూరుమండలవాసు లిప్పటికిని జెప్పుకొనుచుందురు. వారి ప్రధానగ్రామమగు రాచూరి దగ్గఱనే పల్లెకోన గ్రామమున భట్టురాజులు చదువగా నీ క్రిందిచాటుపద్యములు నీ వంశమువారి యోగ్యతను వెల్లడించువానిని నేను చాటుపద్యమణిమంజరిలోఁ బ్రకటించితిని.
{{Telugu poem|type=సీ.|lines=<poem>సుమమౌక్తికానల్పసుప్రతీకంబుతోఁ
గంబుతోఁ బుండరీకంబుతోడఁ
బల్లవకుసుమ సంపాదనైకాంతుతో
గంతుతో రోహిణీకాంతుతోడ
నధిగతపరమోగ్రుఁ డైన స్వర్భానుతో
ఖాను నలచిత్రభానుతోడతో
దండిగాండీవకోదండాభిరాముతో
రాముతో నందనారాముతోడ</poem>|ref=}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>నీదుసత్కీర్తి నీమూర్తి నీప్రతాప
దీప్తి నీదోర్పలస్ఫూర్తి దీటు మిగిలి
యలరె మాణిక్యరాయవంశాబ్ధిసోమ
భాసురగుణాళి భావభూపాలమాళి.</poem>|ref=}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఒక తాత కుతుబుశా ప్రకటదక్షిణభుజా
దండుఁడై కోవెలకొండ యేలె</poem>|ref=}}<noinclude><references/></noinclude>
sx5x5lcwsgjgpy710mu0g5hhh13xopk
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/50
104
129295
396951
2022-07-26T21:14:06Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>నెలమి రెండవతాత యిభరాముపాదుశా
పంపునఁ బెదకొండపల్లె యేలె
మహి మంచు ముమ్మడిమాణిక్యరాయఁడు
వినుతి కెక్కి కొండవీటి నేలె
రాణించు రఘుపతి మాణిక్యరాయండు
పరభయంకరవృత్తిఁ బరిఢవిల్లెఁ</poem>|ref=}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>దండ్రికంటెను బెదతండ్రి తండ్రికంటె
తాతముత్తాతలకు నెల్ల ఖ్యాతి దనర
వన్నెగంటి కృష్ణానేని వంశమునను
నిర్మలోపాయ బళిర మాణిక్యరాయ.</poem>|ref=}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>దురములోఁ గదిసినదొరలశిరంబులు
భేదింప బలుదిట్ట నీదుపట్ట
కదనరంగమునందుఁ గదిసినపరరాజ
నిచయంబులను దాఁకు నీదుబాకు
జన్యసంతోషులై చనుదెంచువైరుల
నిముసంబులో మ్రింగు నీదు బాంగు
............................................
..............................................</poem>|ref=}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>సోరిది నీడాలు వై రులచుక్కవ్రాలు
బళిర నీపౌరుషం బెన్నఁ దరముగాదు
అవనిమాణిక్య రాజవంశాబ్ధిచంద్ర
రాజవేంకటగోపాలరాయభూప.</poem>|ref=}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>శ్రీకరవిజయలక్ష్మీవిరాజితవైభ
వేంద్రుండు సద్గుణసాంద్రమూర్తి
మాణిక్యరాడ్వంశమందారభూజంబు
పద్మనాయజ మనఃపద్మహేళి</poem>|ref=}}<noinclude><references/></noinclude>
35gqlo6bxy2migrkw3rky1neg6tdc8w
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/51
104
129296
396952
2022-07-26T21:22:13Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>మన్నెకులోద్యాన మధుమాసపైకంబు
కామినీమన్మధాకారవేషు
నలిపుణ్యపతిగోత్ర వితతాబ్ధిచంద్రముం
డర్థిచాతక వార్షుకాంబుదంబు</poem>|ref=}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>అని జనుల్ మెచ్చఁ గీర్తిచే నలరి తహహ
చరితదేశాంత సత్కవీశ్వరనితాంత
వర్ణితస్వాంత రేపల్లెపూర్నిశాంత
ధీపితాటోప! వేంకటగోపభూప.</poem>|ref=}}
వీ రనేకదేవాలయములకు భూముల నిచ్చిరి. బ్రాహ్మణులకు వసతులు గల్పించిరి.
మాణిక్యారావువారు కల్పించిన దేవబ్రాహ్మణవృత్తులు.
1. పెద్దపూడి :-
ఇది వకసంతు, కూచిపూడి సర్కారు. ముర్త్యుజానగరు తాలూకాలోనిది. ఇది ప్రస్తుతము వాసిరెడ్డివారికి పోయినది.
పూర్వము అరణ్యముగానున్న ఈ స్థలములో ఋషులు సోమేశ్వరస్వామిని, వీరు గోపాలస్వామిని ప్రతిష్టించిరి. 1056 శకంలో గజపతాన్వయులు, గణపతి మహారాజులుగారు పరిపాలించిరి. వీరికి ప్రధానులు గోపరాజురామన్న. గ్రామకరిణీకపు మిరాశీలు వీరు ఏర్పరచుచు, తెలగాణ్యులు, కౌశికగోత్రులై న పుచ్చరాజువారికి సగభాగంగా యిచ్చినారు. 1240 శకం లగాయతు రెడ్డిరాజులు ప్రభుత్వం చేసిరి. వీరికాలములో కొండవీటిసీమ 44 అగ్రహారములు బ్రాహ్మణులకు దానంచేసిరి. వేగినాటివారికి 3 అగ్రహారములు ద్రావిళ్లకు 5 వెలనాటివారికి 36. ఈ గ్రామము వెల్నాటివారిక్రిందకు వచ్చెను. ఈ గ్రామం యెల్లేపద్ది లక్ష్మణదీక్షితులుకు, షడ్దర్మనాల వల్లభసోమయాజులుకు దానం చేసిరి. పైజీర్ణదేవాయములను మరల ప్రతిష్టించి ఏర్పరచినవసతులు కుం 070 శ్రీ సోమేశ్వరస్వామివారికి. కుం 070 గోపాలస్వామివారికి. 1500 శకం వరకు చక్కగాజరిగెను. మహమ్మదీయుల పరిపాలనలో విచ్చిత్తు గలిగినది. కొండవీటిసమతుబందలు చేసేటప్పుడు, ఈ గ్రామం కూచిపూడి సమ<noinclude><references/></noinclude>
qq3itqp7os60pkzdzhphjtfiuvrouwt
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/52
104
129297
396953
2022-07-26T21:43:15Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>తులో చేర్చిరి. అప్పటికి షడ్దర్శనాలవారు ఖిలమైపోగా తిమ్మరాజువారిపరం చేయబడినది. కొండవీటి సీమ వంతుచేసి జమీందార్లుకు పంచిపెట్టేటప్పుడు ఈవంతు ఈగ్రామం రమణయ్య మాణిక్యరావు వంతులో వచ్చి రేపల్లెతాలూకాలో దాఖలు అయినది. 1122 ఫసలీ మొదలు 1126 ఫసలీవరకు పరిపాలించిరి. తరువాత వీరి తమ్ములు వల్లన్నగారు వచ్చి ఈ గ్రామానికి పశ్చిమభాగమందు వనంతోట వేయుంచి శ్రీ వేణుగోపాలస్వామివారికి దానవ్యయం ఒకుకు 070కుభూమి యిచ్చినారు. ఈవల్లన్నగారు సీతన్నగారు గోపన్న గారు 1168 వ ఫసలీవరకు ప్రభుత్వం చేశేరు. 1169 ఫసలీలో సీతన్నగారి కుమారులు జంగన్న మాణిక్యరాయలంగారు చాలధర్మవంతులై రాజ్యము పరిపాలించుచు శ్రీసోమేశ్వరస్వామివారి ఆలయం పునః నిర్మించి కుం 070కు భూమి దానంచేసిరి. మరియు వీరు చేయించిన దానముల వివరం. అయితం వేదావధానులు, రాయప్రోలు సూరంబొట్లు. వట్టెం రామలింగ దీక్షితులు, పోతుకుచ్చి పాపంబొట్లు, నేతి తెలగావధానులు, బూరుగుల నిమ్మంబొట్లుగార్లకు ఒకొక్కరికి కుం 82 చొ॥ దానం చేసిరి. వీరు 1169 నుంచి 1201 ఫసలీవరకు. 33 సం॥ ప్రభుత్వంచేసిరి. 1202 లో వీరికుమారులు భావన్నగారు రాజ్యమునకువచ్చిరి. వీరు కూడ తండ్రివలే దానములు చేయుచూ రాజ్యం పరిపాలించి 1213 ఫసలీవరకు రాజ్యం చేసిరి. ఆర్థికదుస్ధితివల్ల 22 గ్రామాదులు వాసిరెడ్డివారికి అమ్ముటవల్ల పొన్నూరు వగైరాలతో కూడ ఈ గ్రామము వారికి పోయినది, కనుక సదరు 1213 నుంచి వాసిరెడ్డి వెంకటాద్రినాయుడుగారు పరిపాలించిరి. ఈ గ్రామమీకట్టు 36కుచ్చళ్ళలో వనంతోటలు 6టికు వల్లన్నగారుకు 070 యెల్లేపెద్ది సుబ్బన్న 170 ప్రబల పేరుభొట్లు 070 జాస్తే భావన్న 070 చదలవాడ పట్టాభిరాముడు యీచదలవాడ రామన్న చేరి ఒక 070 గ్రామం కవార 070 మాలపల్లి 070 చెర్వులు 3 టికి. యెల్లేపద్ది సుబ్బన్న చెర్వు 070 చడలవారమణప్ప చెర్వు070 కర్ర తిరుపతి 070 - 070 జయనిపాడు డొంకలు 070 చవుడుభూమి 070 యీ యినాములు 070 వెరశి 850 పోను మిగతాది గుడికట్టు.<noinclude><references/></noinclude>
clb25cpwsp8yr4rg4aftk69wqq8uplf
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/53
104
129298
396954
2022-07-26T21:51:19Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left|(2) వల్లూరు గ్రామం గుడికట్టు కుచ్చళ్లు 20.}}
ఈగ్రామం 1122లో రమణయ్య మాణిక్యరాయలంగారు పరిపాలించిరి. 1160 వరకు రమణయ్యగారు వల్లన్నగారు సీతన్నగారు పరిపాలించిన తరువాత నిజాముల్ ములుకు పెద్ద కుమారుడైన నాసర జంగు దీనిని పరాసువారికి యిచ్చినారు. వారు 1160 నుండి 1168 వరకు ప్రభుత్వం చేసి అపజయులు కాగా సీతన్నమాణిక్యారాయణంగారి అన్న కుమారుడు గోపాలరావు మాణిక్యరాయణింగారు 1168లో ప్రభుత్వం చేసి సీతన్నగారి కుమారుడైన జంగన్నగారు 1167 ప్రభుత్వానికి వచ్చి 1178 ఫసలీలో మజుకూరి మిరాసదార్లు అయిన వల్లూరి వేంకటాచలం పర్వతాలు. శంకరప్ప, విస్సంరాజు, పునరుద్ధరించిన గణపేశ్వరస్వామి వీరభధ్రస్వామివార్ల ఆలయములు శ్రీ పూర్వమున్న చెన్నకేశ్వరస్వామివారి ఆలయము మ్లేచ్ఛలచే విచ్ఛిత్తుచేయబడినది కనుక తస్థానే శ్రీ వేంకటగోపాలస్వామివారిని ప్రతిష్టించి శ్రీ ఆంజనేయస్వామినికూడ ప్రతిష్టించిదిరి పై దేవాలయములు శ్రీవారు ఇచ్చిన వసతులు.
కు 1 శ్రీ గణపేశ్వరస్వామి, వీరభద్రస్వామి వార్లకు కు 1 శ్రీ వేణుగోపాలస్వామివార్లకు:
1177 ఫసలీతో కుంఫిణీవారు మృత్తుజానగరుకు ప్రభుత్వానికి వచ్చి 3 సం॥ పరిపాలించి తిరిగి జమీందార్ల పరం చేసినారు. వీర్లకుమాళ్లు భావయ్య మాణిక్యరావు 1202లో రాజ్యమునకువచ్చి వీరు
పాలించుచుండిరి.
8. కట్టెంపూడి :—
గోపరాజురామన్నగారు ఈ గ్రామానికి తూములింగన్నగారికి యేకభోగముగా మిరాశీ వ్రాసియిచ్చినారు. ఈ తూములింగన్నగారు గ్రామమునకు దక్షిణభాగమందు కేశవస్వామివారి ఆలయమున్నూ ఉత్తరం శ్రీ మల్లికార్జున ఆలయం కట్టించి వీటికి 080 మాన్యం ఇప్పించిరి ఇదే ప్రకారం 1500 శకంవరకు జరిగెను తరువాత తురకల పరిపాలనలో ఇది విచ్చిత్తు అయినది. అప్పుడు పొన్నూరు సమతులో<noinclude><references/></noinclude>
4dur836y5p7eufw8otq22ont3zeisjs
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/54
104
129299
396955
2022-07-26T22:06:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నిది. అప్పుడు మాణిక్యరావువారు పాతృనివారు అలవర్తివార్ల అధికారములోనికి వచ్చినది. తరువాత కొండవీటిసీమ 3 వంతులుగా చేయగా ఈ గ్రామం రమణయ్య మాణిక్యరావు వారికి అప్పచెప్పగా వారు ప్రభుత్వంచేసి 1127౧లో సీతన్న మాణిక్యరాయలంగారు ప్రభుత్వానికి వచ్చి అచ్చన్నగారికి కు 080 మాన్యం ఇప్పించినారు. వీరి అన్నదమ్ములు ఆరుగురు క్రమేణ ప్రభుత్వం చేసి గోపాలమాణిక్యరాయలంగారు 1168 వరకు ప్రభుత్వం చేసిరి. వీరి కుమారులు సీతన్నగారి కుమారులు జంగన్నగారు ప్రభుత్వానికి వచ్చి 130 కుచ్చెళ్ల యీనాములు ఇప్పించిరి. 1201 వరకు ప్రభుత్వం చేసిరి. వీరి కుమారులు భావయ్య మాణిక్యరాయలంగారు 1202లో రాజ్యంకు వచ్చి 1122 ఫసలీవరకు ప్రభుత్వం చేస్తూవున్నారు. గ్రామంగుడికట్టు కుచ్చళ్లు 1754
(4) పూండ్ల :— పొన్నూరు తాలూకాలోని రేపల్లెలోని రాజా భావయ్యమాణిక్యరావు సర్కారులోని 1222 ఫసలీ; 1201 నుంచి గ్రామం గుడికట్టు 122 కుచ్చళ్లు.
(5) ఇనగర్తిపాడు :—— పొన్నూరుసంతు రేపల్లె తాలూకా పైమాదిరిగా పరిపాలనలు జరిగెను. ఈ గ్రామం విష్ణువర్థనుడు పరిపాలనలో చెఱుకూరు త్రివిక్రమస్వామివారికి అగ్రహారం యిచ్చినారు గ్రామం గుడికట్టు కుచ్చళ్లు 13.
(6) నుదురుమాడు ఖండ్రిక :— ఈఖండ్రికలో 5 గ్రామాదు లున్నవి ఒకప్పుడు ఈ 5 గ్రామాదులలోని రుసుము మాణిక్యరావు వసూలు చేయుచుండిరి.
(7) మండూరు :— కూచిపూడి సర్కారు ముర్తున్నజాగరు రాచూరు తాలూకే:
ఇక్కడ మాండవ్యమహాముని కొంతకాలం తపస్సు చేసిన చోటు. ఇక్కడ శివలింగం ప్రతిష్టించిరి. దీనికి మాండలేశ్వరస్యామి అని పేరు. దీనికి దక్షిణభాగమందు వేణుగోపాలస్వామివారిని ప్రతిష్టించిరి. ఇది
అరణ్యము మునీశ్వరులే ఈ దేవాలయములను పూజించుచుండిరి.
{{nop}}<noinclude><references/></noinclude>
c703nkv593gf08f1mp5g0mfquij6em4
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/55
104
129300
396956
2022-07-26T22:15:20Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>1122లో కొండసీమ 14 వంత్లు చేసి పంచిపెట్టుటలో ఈగ్రామం బరభద్ర పాతృని అప్పన వంతు వచ్చెను. ఈయన 170 కుచ్చిళ్లు శ్రీస్వామివార్లకు యిచ్చి వుత్సవము యేర్పాటు చేసిరి. ఈయన తదనంతరం ఈయన కుమార్డు పాపన్న రాజ్యపాలన చేయుచుండగా మాణిక్యారావువారు బలవంతముగా ఆక్రమించి వొలివేరు యెడ్లపల్లి మండూరు చినగాదెలవఱ్ఱు అంగలకుదురు కొండపాడు వగైరాగ్రామాదులు పాతృనివారి మనోవర్తిక్రింద వుంచిరి.
1211లో రాచూరు తాలూక వేలం వేయబడుటవల్ల ఈగ్రామం మల్రాజు వెంకటగుండారాయునింగారు కొనిరి గ్రామంగుడికట్టుకు 60.
చినగాదెల వర్కు కూచిపూడి తాలూకా రాచూరు సర్కారు ఇదిమండూరుకు వాయవ్యమూల వున్న ఒక దిబ్బ, ఈప్రదేశ మందు మండూరు ప్రజలు చిన్న గాదెలు కట్టుకొని ధాన్యం నిలవ చేసుకొంటూ వచ్చి క్రమేణ రయితులు నివసించుట వల్ల చినగాగాదెలవఱ్ఱు గ్రామమయినది. ఇది బలభద్రపాతృనివారిది. రాచూరు మాణిక్యరావువారు జయించి బలభదృపాతృని వారికి మనోవర్తి క్రింద వుంచిన 45 గ్రామాదులలో యిది ఒకటి. మాణిక్యారావు జంగన్నరావు తిరుపతిరాయంగార్లు ఆయన అన్నదమ్ములు భాగం పంచుకొనుటలో ఇది తిరుపతిరాయణింగారి వంతు వచ్చినది. తిరుపతి రాయణింగారికి సంతానం లేకపోవుట చేత జంగన్నగారి కుమారుడైన భావన్నారాయణంగారు 1208 ఫసలో ప్రభుత్వమునకు వచ్చి 1211 లో రాచూరు తాలుకా కుంఫిణీవారిచేత వేలం వేయనా ఈ గ్రామం రాజమల్రాజు వెంకట గుండారాయణింగారి పరిపాలన లోనికి పోయినది. గ్రామంగుడికట్టు 25 కుచ్చెళ్లు.
జానంచుండూడు: ఇదిగుంటూరు వండురు తాలూకా: 1122 ఫసవీలో మూడు వంతులుగా భాగించి నప్పుడు ఇది రేపల్లేతాలూకాలో చేర్చబడి రమణయ్య మాణిక్యరావుగారి పరం చేయబడగా క్రమముగా మల్లన్న సీతన్న గోపన్న జంగన్న గార్లు 1182 ఫసలీవరకు ప్రభుత్వం<noinclude><references/></noinclude>
2w5p1kizx5sfed3ei5kyuxq18ipsvjv
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/56
104
129301
396957
2022-07-26T22:23:26Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చేసిన తరువాత అన్నదమ్ములైన జంగన్న తిరుపతిరాయనంగార్లు భాగం పంచుకొనుటలో తిరుపతి రాయనంగారి వంతు వచ్చుటవల్ల రాచూరు తాలూకాలో చేరినది. వీరికుమారులైన అప్పారాయనంగారు సీతన్న గార్లు 1208 వరకు పాలించి నిస్సంతువల్ల జంగన్నగారి కుమారులైన భావన్నగారు 3 సం॥ పరిపాలించిన తరువాత 1211 వేలంలో మల్రాజువారికి పోయెను. గుడి కట్టు కుచ్చళ్ల 40
(10) పొత్తూరు సంతుగుంటూరు సర్కారు రాచూరు తాలూకా:- ఉత్తరం సోమేశ్వరస్వామి తూర్పు వేణుగోపాలస్వాములను ప్రతిష్టించిరి. 1182లో పంచుకొనుటలో తిరుపతి రాయన్నాగారివంతులో వచ్చి రాచూరులో చేరినది. గుడి కట్టు 75 మిగతా విషయములు పైదానిమాదరి—
(11) గారపాడుసంతు గుంటూరు సర్కారు రామారు తాలుకా:- ఇది అగ్రహరంగాసాలు 1కి 5వరహాలు ఇచ్చులాగున రమణయ్య మాణిక్యారావువారు ఏర్పాటు చేసి తిరువుల కృష్ణసోమయాజులం గారికి యిచ్చిరి. 1182లో కృష్ణసౌమయాజులంగారు ఈ గ్రామం తూర్పున గంగాధరస్వామిని ప్రతిష్టించి కుం10 మాన్యంను దక్షిణభాగమందు శ్రీఆంజనేయస్వామిని ప్రతిష్టించి కుం10 యిచ్చిరి మిగతది పై దానిమాదిరి. గ్రామం
గుడికట్టి 83 పగ్గానికి 1 కి 64 కుంటలు ప్రాప్తి అయిన కుచ్చళ్లు 25
(12) సుద్దపల్లి :—— సంతుగుంటూరు సర్కార్ రాచూరు తాలూకా గ్రామాన ఐదు పశ్చిమమున కాశీ విశ్వేశ్వర స్వామిని మధ్యను వేణుగోపాలస్వామిని దంటు దేవరాయి దీక్షుతులు ప్రతిష్టించి కు2 దానం చేసి అగ్రహార మనుభవించుచుండిరి. ఇది పైవారికి కృష్ణదేవరాయలుచేత యివ్వబడిన అగ్రహారం: మిగతా కథ పైదానిమాదిరి గుడికట్టు, కు 75
కొండవీటికైఫీయతులో మాణిక్యారావువారికి ప్రసక్తమయిన గ్రంథభాగమిది:——ఉడయగిరి, అద్దంకి, వినుకొండ, బెల్లకొండ, నాగార్జునకొండ, తంగేడుకేతవరం మొదలైన దుర్గములు జయించి కొండవీడు వచ్చి అప్పుడు పరిపాలించుచున్న ప్రతాపరుద్రగజపతి కుమారుడు<noinclude><references/></noinclude>
mq3u70h6xtpefhjv8zhnmo8v7s0xt49
పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/57
104
129302
396958
2022-07-26T22:28:32Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వీరభద్రగజపతిని జయించి అతనికి అభయమిచ్చెను. . . సింహాచలమువరకు సాధించెను, కటకం పర్యంతం జయించి గజపతివారి కుమార్తెను బలాత్కారముగా వివాహము చేసుకొనెను. సింహాచలం అవతలి దేశములు గజపతి వారికి వదలి కొండవీటికి సాళ్వతిమ్మరుసు మేనల్లుడు నాదెళ్ల గోపమంత్రికి పట్టం గట్టెను. నాదెళ్ల గోపమంత్రిగారు దేవాలయము కట్టించి పరిపాలించుచుండెను. రాయల భార్య కంభంలో ఉండిపోయి తన స్వంతద్రవ్యముతో కంభం చెరువు త్రవ్వించెను. దేవాలయము కట్టించినది, 1455 వరకు కృష్ణరాయలు రాజ్యం చేసెను. తరువాత అచ్యుతరాయలు 1456 నుంచి 1467 వరకు 8 సంవత్సరములు పరిపాలించెను. ఇతనికి ప్రధానియైన రామయభాస్కరునికి అధికార మిచ్చి కొండవీటికి పంపగా పూర్వము రెడ్డిరాజులు కట్టించిన సౌధములు గుళ్లు పడిపోవుటవల్ల ఆ రాళ్లు తెప్పించి యీ దుర్గానికి పశ్చిమభాగమందు మావులకోట గట్టించి పట్నం నిర్మించి గోపీనాథస్వామివారిని ప్రతిష్టించెను. ఇక్కడ ఒక బావి త్రవ్వించి తిరుగుబాటు చేసిన పాలెగాండ్లను నమ్మకముమీద పిలిపించి స్వామివారికి ప్రదక్షిణం చేయవలసినదని చెప్పి అదివరకు పూర్వమే తగిన ఏర్పాటు చేయబడిన ఆబావిలో వారిని కూలద్రోసి చంపెనని ప్రతీతి. ఈ పట్టణమునకు కొండవీటి గోపీనాథపురమని నామాంకితము చేసిరి. ఈ పురం దగ్గరగా వెన్నముద్ద కృష్ణుడు మూలస్థానేశ్వరుడు. అంగడివీరభద్రుడు మొదలయిన దేవస్థానములు నిర్మించెను. ఈయన సహోదరి చిన్నమాంబ ఈ పట్టణానికి మూడుఘడియల దూరాన రామచంద్రపురమనే అగ్రహారము కట్టించి పర్వతేశ్వరుడను ప్రతిష్టించి, గోపీనాథ అనే చెరువు త్రవ్వించి సాంతలూరు అనే అగ్రహారమును ధారాగ్రహితము చేసేను. ఇతను మొగలాయి పౌజును జయించి రాజ్యము నిర్వక్రముగా పరిపాలించెను. విజయనగరమందు సదాశివదేవమహారాయలు పరిపాలనము చేయుచుండి అత్రేయగోత్రులైన విఠలయ్య దేవమహారాజు గారిని ఈ దేశానికి పట్టం కట్టిరి. ఇతను కొండసింగయ్య అను దేవాలయమును ఈ దేవాలయమునకు ఉత్తరాన కొండపల్లి చెరువు పడమర వకతోట నిర్మించెను. ఇతను<noinclude><references/></noinclude>
1zkjefjnpt6t1nu033ak2lu4lzo8726
పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/26
104
129303
396960
2022-07-27T00:33:13Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>మెఱయుదాతలదాతయై మేటి యగుచు, శ్రీపెరంబూరివంశకిరీటి యగుచు
రాజసమున నజారతరాయవిజయ, విక్రమానందరంగభూవిభుఁడు వెలయ. </poem>|ref=129}}
{{p|ac|fwb}}షష్ఠ్యంతములు</p>
{{Telugu poem|type=క.|lines=<poem>ఇత్యాది సకలగుణసాం, గత్యునకు నసాధ్యకార్యఘటనాఢ్యునకున్
నిత్యమహాసత్యమహా, కృత్యమహారాజమణికిఁ గృతధోరణికిన్.</poem>|ref=130}}
{{Telugu poem|type=క.|lines=<poem>కలహాశనబలశాసన, జలజాసనభక్తివిభవచాతుర్యునకున్
ఖలభీషణబలశోషణ, బలభూషణునకు నపారపటుధిషణునకున్.</poem>|ref=131}}
{{Telugu poem|type=క.|lines=<poem>భటనాయక నటనాయక, విటగేయక సద్విశేషవితరణగుణికిన్
గుటిలాహితపటవాతత, చటులోద్ధత శౌర్యనికరసజలాబ్దునకున్.</poem>|ref=132}}
{{Telugu poem|type=క.|lines=<poem>కమలాహితకమలాహిత, కమలాహితసదృశశౌర్యకరుణాకృతికిన్
సుమనోగమసుమనోవిమ, లమనోజ్ఞమణీసముజ్జ్వలవిభూషునకున్.</poem>|ref=133}}
{{Telugu poem|type=క.|lines=<poem>నందకులామందకలా, నందవిలాసప్రభావునకు సారసభూ
నందనహరిచందనహరి, చందనహరినిభయశోవిశాలద్యుతికిన్.</poem>|ref=134}}
{{Telugu poem|type=క.|lines=<poem>యావనజన పావనఘన, పావనగుణశాలికి సముపార్జితభాస్వ
ద్భావిజయ శ్రీవిజయ, శ్రీవిజయానందరంగనృపచంద్రునకున్.</poem>|ref=135}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన లక్షణచూడామణి యైన
యానందరంగచ్ఛందం బను పేరం జైలువొందులక్షణగ్రంథంబునకుం గవితాలక్షణ
ప్రకరణంబునకుం గలిగిన మార్గంబు లన్నియు విశదంబుగా వివరించెద.</poem>|ref=136}}<noinclude><references/></noinclude>
llx52xplel4kifo60bxvozd5ypz3rct
పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/25
104
129304
396961
2022-07-27T00:46:05Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>లంబకదంబ మంజులకలానికురుంబ గుణావలంబ నె
య్యంబున జానకమ్మ వరియించె హరిన్ వరియించు శ్రీవలెన్.</poem>|ref=123}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>కలితాబ్ధికన్యకాకలితశుభాగారు నభినవమదనమోహనశరీరు
నిఖిలలోకైకవర్ణితకీర్తివిస్తారు భానుసూనుసమానదానశూరు
విశ్వవిశ్రుతసర్వవిద్వజ్జనాధారు జాంబూనదాచలసదృశధీరు
ఘనసదాశివమహీకాంతప్రియకుమారు శ్రీ చిదంబరనాథనృపవజీరు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>మానవిభవసమానసుశ్రీనిధాన, యైన త్రిపురసుందరి పెండ్లియాడెఁ గోరి
జనకసుకుమారి శ్రీరామచంద్రుఁ జేరి, పెండ్లియాడిన దారిన ప్రేమ మీఱి.</poem>|ref=124}}
{{Telugu poem|type=మ.|lines=<poem>రవితేజున్ ఘనపుణ్యమూర్తిని యశోలంకారునిన్ వీరరా
ఘవునారాయణభూమిపాలకమణిం గారుణ్య సంశీలన
ర్మవచోజాలగుణాలవాల యగు శ్రీమద్రాజరాజేశ్వరీ
యువతీముఖ్య వరించె గౌరి వృషవాహుం బెండ్లి యైనట్టులన్.</poem>|ref=125}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>సంతతసత్యభాషాహరిశ్చంద్రుని వరనందగోపాలవంశచంద్రుఁ
డనఘుఁ డాతిరువేంగడాధీశుపౌత్రుఁడు తిరువేంగడక్షమాధిపతిపుత్త్రుఁ
డానందరంగభూజానిప్రియమమారుఁ డల పెరంబూరిసత్కులవిహారుఁ
డలమేలుమంగాంబ యరిమె పెంచినబాలుఁ డల కుమారతిరువేంగళనృపాలుఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>డతులలక్షణవతి రూపపతి శుభవతి, పుణ్యవతిని యరుంధతిఁ బోలు కనక
వల్లిసతి నుల్లమలర వివాహమయ్యెఁ, గృష్ణమూర్తి రుక్ష్మిణిని వరించినటులు.</poem>|ref=126}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఈరీతి వేడ్క మీఱఁ గుమారీమణులకును సత్కుమారునకు మహో
దారతఁ గల్యాణమ్ముల, శ్రీ రంజిలఁ జేసి ముదము చేకొని వెలయన్.</poem>|ref=127}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>రాజాధిరాజులు రాయమన్నీలు సుబాదారులు వజీరు పౌఁజుదారు
సంస్థానపతులు నిజాముల్ నవాబులు వర్తకు ల్పాళయప్పట్లదొరలు
మొదలైనవారు సంపుగఁ బెండ్లివేడుక గనుఁగొని యాశ్చర్యకలితు లగుచు
నవరత్నభూషణాంబరగజాశ్వంబులు నదరులు ఘటియించి బదులుగాంచి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>వీడ్కొనిన యంతనత్యంతవిభవ మొదవ, నల్లురకు మువ్వురకుఁ జాల నరణమిచ్చి
కూఁతురులు మదిఁ గోరిన కోర్కె లొసఁగి, యెసఁగి సౌభరిసంతతి పొసఁగి వెలయు.</poem>|ref=128}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఇటులు సమస్తధాత్రీంద్రులు వజ్జీర్లు బలురాయమన్నీర్లు పౌఁజుదార్లు
మొదలైనదొరలచేఁ బొగడిగల్ గైకొని పుత్త్రులు పుత్త్రికా పౌత్త్రు లాప్త
భృత్యులు మంత్రులు హితులు బంధువులతోఁ దామరతంపరదారి నలరి
యాసేతుశీతాచలాంతరావనియందు నాచంద్రతారార్కయశము నించి</poem>|ref=}}<noinclude><references/></noinclude>
qpwfkr8q7cf2uja8cihj9ucyuyett4i
పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/24
104
129305
396962
2022-07-27T01:00:24Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>ఏఘనుజయభేరికాఘనధ్వని విన్నఁ బరరాజహంసలు పఱువులెత్తు
నేనరేంద్రునిధాటి నీక్షించినంతనె భోగికులంబులు పుట్ట లెక్కు
నేరాజుతేజంబు నిసుమంత విన్నంత శత్రుచక్రంబులు సంచలించు
నేనృపకేసరి హెచ్చుఢాకను విన్న వైరికుంజరపాళి పూరిగఱచు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నట్టియానందరంగధరాధినాథు, బలపరాక్రమవైఖరిఁ బ్రస్తుతింప
వశమె మహిలోన మనవంటివారి కనుచుఁ, బొగడుచును దమతమదేశములకుఁ జనిరి.</poem>|ref=121}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబున నబాబులు మొదలగునఖండమండలాధీశ్వరులచేఁ బొగడికలు గాంచి
యసమానవైభవంబు, ననుపమానకీర్తి, ననూనప్రభావంబు, నహీనదాతృత్వంబు,
నఖండసామ్రాజ్యంబు, నపారతరైశ్వర్యంబు, నమితోత్సాహంబు, ననవరతలక్ష్మీక
టాక్షంబు గలిగి చెలంగుచు నొక్కనాఁడు నిజపుత్త్రికాపుత్త్రికలకు వివాహ
మహోత్సవంబులు గావింప నిశ్చయించి చతుస్సముద్రముద్రితం బైనభూమండ
లంబునం గలుగు ప్రముఖులకు నాకల్యాణమహోత్సవంబు గనుంగొన వచ్చుటకై
శుభపత్రికలును వస్త్రతాంబూలంబులుం దగువారిచేఁ బనిచి సకలలక్షణవతి య
గుజానకీదేవిని నక్షిణలక్ష్మీకటాక్షవీక్షణాలంకృతుం డైనస్కందనృపాలపురం
దరునకు నిత్యకళ్యాణసౌభాగ్యవతి యైన త్రిపురసుందరీదేవిని నహార్యవర్యధైర్య
శౌర్యగాంభీర్యౌచార్యచారుర్యైశ్వర్యధుర్యం డగుచిదంబరనాథనరనా
థునకు నగణ్యతారుణ్యలావణ్యసాద్గుణ్యనైపుణ్యమహాపుణ్యవతి యగురాజరాజేశ్వ
రిని నశేషభాషామనీషావిశేషాశేషీకృతశేషాహిభాషాయోషాస్వామి యగునారా
యణభూపాలునకుం గన్యకాప్రదానంబులు సేయసమకట్టి యసమానసమానలసమా
నరూపానునయదాననిదానసుగుణనిదానసకలకలావిరాజమానయానారోహణస
మాశ్రయుఁడునై సహజనందనుఁ డగుతిరువేంగడమహిపాలపుంగవునకు శ్రితజన
కల్పకవల్లియుం బల్లవాధరీమతల్లియు నైన కనకవల్లీదేవినిం బరిణయంబుగాఁ గైకొన
నిర్ణయించి కుబేరునిపుష్పకంబును గేరి యింద్రుని యాస్థానమండపంబును మీఱి,
మయనిసభతోడన్ సరిపోరి, లక్ష్మీరంగస్థలంబుదారి విలసిల్లు పెండ్లిచవిక లొన
రవేయించి రెండులక్షలు నిష్కంబులుం బెండ్లినెలవులు నేనుకంబులుం జేసికొని
దొడ్డకొంచెంబుల నెంచక నలువదిదినంబులు నొకనాఁటిచందంబునం బెండ్లివేడు
కల నొనరింప నిశ్చయించి భూదానకన్యాదానోపనయనదానాన్నిదానభూరి
దానంబులును బదియాఱువిధంబుల మహాదానంబు లొనరించి యథాశాస్త్రప్రకా
రంబున వివాహమహోత్సవం బొనరించునవసరంబున.</poem>|ref=122}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>శంబరవైరినిం గెలుచుచక్కఁదనంబును వారివంటిభో
గంబును గల్గుకందవిభు కందనృపుం గబరీనిరస్తరో</poem>|ref=}}<noinclude><references/></noinclude>
o2r0nf5wso6z3hh193fk64av8a2hq6r
396963
396962
2022-07-27T01:02:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>ఏఘనుజయభేరికాఘనధ్వని విన్నఁ బరరాజహంసలు పఱువులెత్తు
నేనరేంద్రునిధాటి నీక్షించినంతనె భోగికులంబులు పుట్ట లెక్కు
నేరాజుతేజంబు నిసుమంత విన్నంత శత్రుచక్రంబులు సంచలించు
నేనృపకేసరి హెచ్చుఢాకను విన్న వైరికుంజరపాళి పూరిగఱచు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నట్టియానందరంగధరాధినాథు, బలపరాక్రమవైఖరిఁ బ్రస్తుతింప
వశమె మహిలోన మనవంటివారి కనుచుఁ, బొగడుచును దమతమదేశములకుఁ జనిరి.</poem>|ref=121}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబున నబాబులు మొదలగునఖండమండలాధీశ్వరులచేఁ బొగడికలు గాంచి
యసమానవైభవంబు, ననుపమానకీర్తి, ననూనప్రభావంబు, నహీనదాతృత్వంబు,
నఖండసామ్రాజ్యంబు, నపారతరైశ్వర్యంబు, నమితోత్సాహంబు, ననవరతలక్ష్మీక
టాక్షంబు గలిగి చెలంగుచు నొక్కనాఁడు నిజపుత్త్రికాపుత్త్రికలకు వివాహ
మహోత్సవంబులు గావింప నిశ్చయించి చతుస్సముద్రముద్రితం బైనభూమండ
లంబునం గలుగు ప్రముఖులకు నాకల్యాణమహోత్సవంబు గనుంగొన వచ్చుటకై
శుభపత్రికలును వస్త్రతాంబూలంబులుం దగువారిచేఁ బనిచి సకలలక్షణవతి య
గుజానకీదేవిని నక్షిణలక్ష్మీకటాక్షవీక్షణాలంకృతుం డైనస్కందనృపాలపురం
దరునకు నిత్యకళ్యాణసౌభాగ్యవతి యైన త్రిపురసుందరీదేవిని నహార్యవర్యధైర్య
స్థైర్యశౌర్యగాంభీర్యౌదార్యచాతుర్యైశ్వర్యధుర్యుం డగుచిదంబరనాథనరనా
థునకు నగణ్యతారుణ్యలావణ్యసాద్గుణ్యనైపుణ్యమహాపుణ్యవతి యగురాజరాజేశ్వ
రిని నశేషభాషామనీషావిశేషాశేషీకృతశేషాహిభాషాయోషాస్వామి యగునారా
యణభూపాలునకుం గన్యకాప్రదానంబులు సేయసమకట్టి యసమానసమానలసమా
నరూపానునయదాననిదానసుగుణనిదానసకలకలావిరాజమానయానారోహణస
మాశ్రయుఁడునై సహజనందనుఁ డగుతిరువేంగడమహిపాలపుంగవునకు శ్రితజన
కల్పకవల్లియుం బల్లవాధరీమతల్లియు నైన కనకవల్లీదేవినిం బరిణయంబుగాఁ గైకొన
నిర్ణయించి కుబేరునిపుష్పకంబును గేరి యింద్రుని యాస్థానమండపంబును మీఱి,
మయనిసభతోడన్ సరిపోరి, లక్ష్మీరంగస్థలంబుదారి విలసిల్లు పెండ్లిచవిక లొన
రవేయించి రెండులక్షలు నిష్కంబులుం బెండ్లినెలవులు నేనుకంబులుం జేసికొని
దొడ్డకొంచెంబుల నెంచక నలువదిదినంబులు నొకనాఁటిచందంబునం బెండ్లివేడు
కల నొనరింప నిశ్చయించి భూదానకన్యాదానోపనయనదానాన్నిదానభూరి
దానంబులును బదియాఱువిధంబుల మహాదానంబు లొనరించి యథాశాస్త్రప్రకా
రంబున వివాహమహోత్సవం బొనరించునవసరంబున.</poem>|ref=122}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>శంబరవైరినిం గెలుచుచక్కఁదనంబును వారివంటిభో
గంబును గల్గుకందవిభు కందనృపుం గబరీనిరస్తరో</poem>|ref=}}<noinclude><references/></noinclude>
00p0wplupm5f8ybj23x9daneox1smc0
పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/15
104
129306
396968
2022-07-27T05:33:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబున నవ్వధూవరులు సుపుత్రులఁ బడయుటకై కావించువూజల శ్రీ
కృష్ణమూర్తి సంతసిల్లి తొల్లి నందునికులంబున నవతరించెదనని యతనికి వరం
బొసంగినవిధంబు దలంచి యీతిరువేంగడనాథునకు అమ్మమాంబికకుఁ గూర్మి
నందనుఁడనై యుద్భవింతుంగాక యని నిశ్చయించి.</poem>|ref=63}}
{{Telugu poem|type=మ.|lines=<poem>క్షితిలోఁ గోసలరాజవర్యుసుతకున్ శ్రీరాముఁ డాపార్వతీ
సతికిన్ శక్తిధరుండు గల్గుగతి గృష్ణస్వామి విఖ్యాతిగా
నతులప్రౌడిని లక్ష్మమాంబసుతుఁ డై యానందరంగక్షమా
పతిచంద్రుండన నుద్భవించెను గలాభాగప్రపూర్ణాకృతిన్.</poem>|ref=64}}
{{Telugu poem|type=క.|lines=<poem>అతనికి సహోదరుం డై, మతిధృతి వితరణకళాచమత్కారమహో
న్నతుఁడు తిరువేంగడమహీ, పతి యుద్భవ మై చెలంగె బాలార్కుక్రియన్.</poem>|ref=65}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ధైర్యంబు సంతతౌదార్యంబు శౌర్యంబు గాంభీర్యచాతుర్యకౌశలములు
మతి శక్తి ఘనయుక్తి మధురోక్తి పితృభక్తి యుచితజ్ఞతయు నీవి యోర్పు నేర్పు
దాక్షిణ్యమును జల్లఁదనము చక్కదనంబు రసికత యాశ్రితరక్షకతియుఁ
దారతమ్యప్రౌఢి తంత్రంబు శీలంబు సత్యవాక్యోన్నతి చలము బలము</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నుగ్గుతోఁ బాలతోఁ దల్లి యొనరఁ గూర్చి, ప్రేమ నల్లారుముద్దుగాఁ బెంచినట్టు
లఖిలసుగుణాభిరాముఁ డై యనుదినంబుఁ, బ్రబలె నానందరంగభూపతికిరీటి.</poem>|ref=66}}
{{Telugu poem|type=చ.|lines=<poem>తెలివికిఁ బుట్టినిల్లు జగదీశుల కెల్లను మేలుబంతి వి
ద్యల కొరగల్లు తాలిమికిఁ దావు వదాన్యతకున్ నిధాన మా
ప్తులకును మెట్టపంట కవిభూసురవాటికి గల్పవాటి యై
కలియుగకృష్ణమూర్తి యనఁ గాంచెను రంగవిభుండు కీర్తులన్.</poem>|ref=67}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>శ్రీవిష్ణునంశచే నావిర్భవము చెందుకతమున శ్రీరంగపతి యనంగ
సర్వజనానందసంఛాయి యగుటచే నెలమి నానందరంగేంద్రుఁ డనఁగ
లఖిలదిక్కుల విజయముఁ గాంచగా విజయానందరంగభూజాని యనఁగ
మెచ్చి పాచ్చా కితా బిచ్చుటచే వజారత వజయానందరంగరాయ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>అనఁగ బౌరుషనామధేయముల వెలసి, శుక్లపక్షసుధాకరస్ఫూర్తిగాను
దినదినంబున కమితవర్ధిష్ణుఁ డగుచుఁ దేజరిల్లును దులలేని రాజసమున.</poem>|ref=68}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>బంగారుకొండ దా ముంగిట నమరెనో సురభూజరాజంబు పెరటిచెట్టొ
శ్రీరామమాడనించితము గానున్నదో కామధేనువు దొడ్డిఁ గట్టినాఁడొ
రసవాదశక్తి కరస్థలామలకమో తఱుచునిక్షేపంబు దొరకినదియొ
తగధనాంజనవిద్యఁ దా నేర్చుకొన్నాఁడొ స్పర్శవేధియు బొక్కసమునఁ గలదొ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
5n2l2c7eo2eph8em4v9phmgl4te0ikv
పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/16
104
129307
396969
2022-07-27T05:45:54Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>కాకయుండిన విటులు లక్షలకొలంది, నిచ్చి యర్ధులఁ దనియింప నెవరిశక్య
మని జనంబులు దనకీర్తి వినుతిసేయఁ, బ్రబలు జితవైరి యానందరంగశౌరి.</poem>|ref=69}}
{{Telugu poem|type=శా.|lines=<poem>ఆంతం జెంగలిపట్టునం దనరు శేషాద్రీంద్రుసత్పుత్రి యౌ
కాంతారత్నము రూపవిభ్రమకళాకారుణ్యదాక్షిణ్యవి
శ్రాంతిన్ లక్ష్మిని మించు సద్గుణసమాజన్ మంగతాయీసతిన్
సంతోషంబునఁ బెండ్లియాడె విభవైశ్వర్యంబు లుప్పొంగఁగన్.</poem>|ref=70}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>సదమలపతిభక్తి సాక్షాదరుంధతి యసమానగుణముల నాదిలక్ష్మి
దీనుల పాలిటి దేవతారత్నంబు నన్నదానప్రౌఢి నన్నపూర్ణ
యాశ్రయించినవారి కమరునిక్షేపంబు పొలుపొందునోర్పున భూమిదేవి
కొనియాడువారికిఁ గొంగుబంగారంబు బంధుజనములకుఁ బారిజాత</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>మనుచు జను లెల్ల వేనోళ్ల నభినుతింప
సత్యమును ధర్మమును బద్దుఁ జల్లఁదనము
దయయు దాక్షిణ్యమును బూని ధరను బ్రబలు
మాననికురుంబ యలమేలుమంగమాంబ.</poem>|ref=71}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>కన్నులా చిన్నారిపొన్నారికి బిడారు చూపులా కరుణకుఁ బ్రాపు దాపు
పలుకులా సత్యసంపదలకుఁ బుట్టిలు గుణములా యమృతానకు నిలయంబు
వితరణమా సదావిశ్వవిఖ్యాతంబు శీలమా లోకప్రసిద్ధికరము
చిత్తమా బహుధర్మచింతనాయత్తంబు పుణ్యమా సౌజన్యమునకుఁ దావు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నగుచు నేసతీమణికిఁ జెన్నలరు నట్టి, శ్రీ మదలమేలుమంగమ్మ చెయ్యివట్టి
నదిమొదలు ప్రాజ్యసామ్రాజ్యపదవిరంగ, భూపతికి నాఁడు నాఁటి కుప్పొంగుకున్నె.</poem>|ref=72}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>పెండ్లియాడిన మొదల్ పెనిమిటి కైశ్వర్య మధికమై వెలసినయతిశయంబు
చేపట్టినది మొదల్ చెలువునకును గీర్తి విస్తరిల్లుచు వచ్చు విస్మయంబు
బొట్టుగట్టిన మొదల్ పురుషునకును మండలాధిపత్యము వచ్చు నద్భుతంబు
చేకొన్నయది మొద ల్చెలఁగి భర్తకు దొరా దొరలెల్ల స్వవశులై పరఁగువింట</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>యింతయని కొనియాడ నెవరివశము, మహితలక్షణవతి యైన మంగతాయి
యాదిలక్ష్మియె నిజము కాదనిన నెట్లు, రంగశౌరికిఁ బట్టంపురాణి యగును.</poem>|ref=73}}
{{Telugu poem|type=క.|lines=<poem>అని జనములు దనుఁ బొగడఁగ, ఘనతరగోభూహిరణ్యకన్యాదానా
ద్యనుపమదానంబులు భ, క్తిని భూసురకోటి కొసఁగి కీర్తిఁ జెలంగున్.</poem>|ref=74}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అంత.</poem>|ref=75}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>సీమలోనుండి ఫ్రాన్సురాట్శేఖరుండు, పసిఁడిబెత్తంబు భూషణాంబరము లనిచి
కుంపినిదుబాసితన మీయ సొంపుమీఱి, రహి చెలఁగమీఱి యానందరంగశౌరి.</poem>|ref=76}}<noinclude><references/></noinclude>
ksfiuznftz1p4t6vunnc442nzxk6hzf
పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/23
104
129308
396972
2022-07-27T06:30:00Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>మట్లవారును హనుమంతరావు బరికి వేంకటరావుకపీలజంగు
నలరామరాజేంద్రుఁ డేఁచభూపాలుండు నగరాలవారును నూకరాజు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>వారు తక్కినపాళయప్పట్లదొరలు, ప్రబలుమోకోజిపంతులు రామదాస
పండితార్యులు మొదలైన ప్రభువు లెల్ల, వేడ్క వచ్చిరి శ్రీరంగవిభునిసభకు.</poem>|ref=114}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లతివైభవంబున సకలరాజాధిరాజులు నదురుగైకొని భేటికి వచ్చునెడ నతనినగరి
వాకిలి నీవు ముందు నేను ముం దని చొరవ సేయంబోయి యచ్చటి నకీబులు
మహలుదార్లచే నిలువరింపఁబడి వెలవెలఁబోయి యొండొరుల మొగంబులఁ జూచు
కొనుచు.</poem>|ref=115}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఈహజారముచెంత నెంతయు భేటికై చేరి నిల్వనిదునేదారు లెవ్వ
రీబంకునందు నకీబులచేత... ద్రొబ్బులు వడసినవాబు లెవ్వ
రీవాకిటను జాళువావెండిబెత్తాలచేఁ బెట్లువడనివజీరు లెవ్వ
రీదరుబారున నెపుడు దేవారికులఁ గనివేఁడని హుదురావు లెవ్వ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>రైన నేమాయె నివి యపమానము లన, రాదు మహి నెంతవారికి రంగవిభుని
సన్నిధిని హెచ్చుతక్కువ లెన్నఁదగునె, యనుచుఁ జేరిరి వారంద ఱతనిసభకు.</poem>|ref=116}}
{{Telugu poem|type=తే.|lines=<poem>ఇటులు సభఁజేరి వైభవం బెసఁగ మత్త, వారణతురంగకాంచనవస్త్రరత్న
భూషణంబుల బహుమానములు నొసంగ, నదురుఁ గైకొని యతులితానందముగను.</poem>|ref=117}}
{{Telugu poem|type=తే.|lines=<poem>వారివారికిఁ దగునుపచారములును
బలికి మర్యాద లొనరించి బాగుగాను
కరితురగరత్నభూషణాంబరము లొసఁగి
పసుప వీడ్కొని రుత్సాహభరితు లగుచు.</poem>|ref=118}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>తనరాక విన్నమాత్రమున బల్లిదుఁ డైన ఢిల్లిపాచ్ఛాగుండె తల్లడిల్లఁ
దనఢాక విన్నయంతనె జయసింగును భయపడి కాన్కకప్పము లొసంగఁ
దనపేరు విన్నంత దద్దరిల్లి మరాటిపౌఁజు చీకాకుగాఁ బరువులెత్తఁ
దనయాజ్ఞ బలుసుబాదారులు నితరదేశాధినాథులు శిరసావహింప</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>జగతిఁ బెంపొంద నాసరుజంగువంటి, వాని నవలీలఁ దెగటార్చి వన్నె వాసి
చెందిన వజారతవిజయానందరంగ, ఘనునిదృష్టికి నెవరైనఁ గాని యెదురె!</poem>|ref=119}}
{{Telugu poem|type=చ.|lines=<poem>నిలుకడ లేక ముందఱికి నిల్వక నూటికి మించ కేరికిం
దెలియక యుండుబ్రహ్మలిపి ధీరవజారతరంగశౌరి వ్రా
యులలితశాసనాక్షరము లుర్విఁ దిరంబుగ నాస్తియై యసం
ఖ్యలు నయి తేట యాఘనతఁ గాంచవె పూజ్యులు సేయు కార్యముల్.</poem>|ref=120}}<noinclude><references/></noinclude>
dm4s24lq9hza5bveck9yyuadpaevljl
పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/22
104
129309
396973
2022-07-27T07:23:45Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>గైకొని దొరయైనడూప్లెక్సు రాజేంద్రునిచేత నా నబాబునిజాములచేత ననేకస్తో
త్రంబులం బడసి యపారం బైన కీర్తింగాంచిన సకలదేశాధీశు లానందకందళిత
హృదయారవిందు లై.</poem>|ref=107}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>సాతారలో నున్న చందసాహేబును బెఱఁబాపి పిల్పించు నెఱతనంబు
ధృతి హిరాయిత మొహదీన్ ఖాను జతఁజేసి యనవర్ధిఖానుఁ గొట్టినచలంబు
హెచ్చుగా దండెత్తి వచ్చిన వాసరజంగును దునిమిన సాహసంబు
నార్కాడు మొదలైనయట్టికర్ణాటక సుబకు నబాబుగాఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>డాఁకఁగాఁ గృష్ణ హద్దుకన్యాకుమారి, దాఁకఁ గలిగిన దేశమంతయును గట్టి
నట్టిసామర్థ్యము విజయానందరంగ, ఘనునకేగాక యొరులకుఁ గలదె ధరను?</poem>|ref=108}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>వింతకు నందగోపకులవీరవరేణ్యుఁడు రంగధారణీ
కాంతునిచేతిహేతి కినుకన్ వెస మార్కొని పోరఁ జూచుదు
ర్దాంతునిజాముసైన్యనికరంబులు కొద్దిని బోవనీయదౌ
నంతకు నంతకుం బఱచునంతకు నంతకుఁ జేరునంతకున్.</poem>|ref=109}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>పురినుండి వెడలి గోపురి గొని వాకిళ్లు చొరవ నేర్చినరీతి చోద్య మయ్యె
రణమండలిని జొచ్చి రవిమండలముఁ జొచ్చి చనునది మిగుల నాశ్చర్య మయ్యె
నెత్తురుటేట మునింగి మిన్నేట లేచినచంద మెన్న విచిత్ర మయ్యెఁ
గరికుంభములనుండి సురవధూకుచకుంభములకు లంఘించు టద్భుతము నయ్యె</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>రాయవినుతవజారతరాయవిజయ, విక్రమానందరంగభూవిభుని హేతి
జగడమున నింద్రజాలవిద్య గనుపింప, వలయుఁ గాదేని రిపు లిట్లు మెలఁగఁగలరె?</poem>|ref=110}}
{{Telugu poem|type=క.|lines=<poem>అని యిట్లు సకలజనములుఁ, గొనియాడ ననర్ఘరత్నఘోటకమదనా
రణభూషణాంబరంబులు, ఘనమోదము మీఱ నజరుఁ గైకొని వేగన్.</poem>|ref=111}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ముష్కరి యౌ సైదులుష్క రిఖానుఁడు గరిమ యబ్బలిమీరుఖానుధీరుఁ
డబ్బల్నబీఖానుఁ డబ్బల్నజీరుఖాన్ ఘనులు దిలావరుఖాను మేటి
ప్రబలుఁ డాహిమ్మదుఖాదరుఖానుఁడు సైదుషరీబుఖాను షానవాసు
ఖానులు మహమదుఖాను నవాసులఖానుఁ డల్లవముషిఖాను మేటి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>యాదిగాఁ బేరుపెంపుచే నమరుపౌఁజు, దార్లు హుదురావులును కిలాదారులు సర
దారులు వజీరులును సుబాదార్లు దొరలు, వచ్చి రానందరంగభూవరునిసభకు.</poem>|ref=112}}
{{Telugu poem|type=వ.|lines=<poem>మఱియును.</poem>|ref=113}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>సరసరాజారామచంద్రరాయాగ్రణి జాకోటినింబాళు జనవరుండు
ధైర్యవంతుఁడు సులుతాన్ జనింబాళును మాధవరావు దామర్లవారు</poem>|ref=}}<noinclude><references/></noinclude>
qtoyc55kg4kfx1etnvon2tserdyzbr3
పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/17
104
129310
396974
2022-07-27T08:09:59Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>విసువక యేవేళ విషదవృత్తి భరించు కులపర్వతంబులకొలఁది యెఱిఁగి
చెదరి మూలకుమూలఁ జేరినహరిదంతదంతావళంబులఁదారిఁ జూచి
యెన్నాళ్లకును దల లెత్తనేరకయుండు పన్నగవల్లభు బలిమి గాంచి
సతతంబు తా నధోగతఁ బడియున్నట్టికచ్ఛపప్రభునియోగ్యత గణించి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>లీల సర్వంసహారమణీలలామ, శ్రీ నజారతరాయఁ డై చెలఁగువిజయ
రాజితానందరంగవీరాగ్రగణ్య, పటుభుజాస్తంభమున నిల్చి ప్రమద మొందె.</poem>|ref=77}}
{{Telugu poem|type=వ.|lines=<poem>తదనంతరంబ.</poem>|ref=78}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>సదమలాచారంబు సత్యవాక్యప్రౌఢ యమర చెల్వొందు లక్ష్మాంబ యనఁగ
దయయు దాక్షిణ్యంబు ధారాళగుణముచే హవణిల్లు కఠినస్వర్ణాంబ యనఁగ
అమరిక బుద్ధి శీలము నోర్పు నేర్పుచేఁ దెలివొందుజానకీదేవి యనఁగ
హరిభక్తి గురుభక్తి యాశ్రితావనశక్తిఁ బరఁగి శ్రీ త్రిపురసుందరి యనంగ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నలుగురు సుపుత్త్రికలు తదానందరంగ, రాయశేఖరునకు మంగతాయిసతికి
నుదయ మొందిరి సంతతాభ్యుదయ మొదవఁ, దల్లిదండ్రులయుల్లము ల్పల్లవింప.</poem>|ref=79}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఆవిజయరాయరంగసు, ధీవరు సహజన్ము లైనతిరువేంగడగో
త్రావిభుఁడు నాఁడునాఁటికిఁ, బూవులచే రెత్తినటులఁ బొసఁగి చెలంగెన్.</poem>|ref=80}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>ఫ్రాన్సు పుడతకీసుహర్విపార్సి తెనుఁగు, నరవమును మొదలయినభాషాంతరముల
మాటలాడఁ జదువ వ్రాయ మేటియగుచు, సాంద్రతరకీర్తి తిరువేంగడేంద్రుఁ డమరె.</poem>|ref=81}}
{{Telugu poem|type=క.|lines=<poem>నెరయోధ యై తగినయా, తిరువేంగడభూపమణికిఁ దిరువేంగడధీ
వరమౌళి రాజరాజే, శ్వరి యనుసత్పుత్త్రికయును జనియించి రొగిన్.</poem>|ref=82}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>చక్కఁదనంబునఁ జక్కెరవిలుకాఁడు చల్లఁదనంబునఁ జందమామ
మిక్కుట మైనట్టి లెక్కకు శేషాహి విక్రమక్రమమున విక్రమార్కుఁ
డమరు నశ్వారోహణమున రేవంతుఁడు సురుచిరవాక్ప్రౌఢి సురగురుండు
ఘనదానవైఖరిఁ గలియుగకర్ణుండు సత్యవాక్యమున నజాతవైరి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>యనఁగఁ జెలువొంది తిరువేంగడావనీంద్రు
గర్భకలశాంబునిధికి రాకామృగాంకుఁ
డగుచు నానందరంగేంద్రుఁ డనుదినంబు
మనుపఁ దిరువేంగడేంద్రుండు మహినిఁ బ్రబలె.</poem>|ref=83}}
{{Telugu poem|type=వ.|lines=<poem> తదనంతరంబ.</poem>|ref=84}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ప్రభవవత్సరధనుర్మాసశుద్ధాష్టమి భానువాసరము రేవతియుఁ దనర
లగ్నంబు కటక మారాశిని గేతువు నాలుగింటను సూర్యనందనుండు</poem>|ref=}}<noinclude><references/></noinclude>
dh7hl2ba8j3vmovfbu0hfl4t5apacoj
పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/19
104
129311
396975
2022-07-27T08:41:49Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=గీ.|lines=<poem>ఆటను దగువినుఁడు పీతాంబరంబు, వరకిరీటము ముత్యాలసరులు దాల్చి
పరఁగుగజ్జెలహయ మెక్కి పశ్చిమమున, హౌసుగా స్వారి వెలువడునవసరంబు.</poem>|ref=92}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>సప్తమాధిపతిగురుండు స్వర్ణకాంతి, వెలయఁ గేతుసామ్రాజ్యాభివృద్ధి యొసఁగి
తగ శిరోవేష్టనముఁ బూని దక్షిణముగ, నమరి నైఋతిదిశఁ జూచునవసరంబు.</poem>|ref=93}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఆసప్తమాస్థాన మగుమకరంబున దీపించుశుక్రుఁడు తెల్లపాగ
తెల్లకోకలు గట్టి దివ్య మౌ పచ్చనిగంధంబుఁ బూసుకొ కాంతతోడఁ
దూర్పుఁ బడమటివాస్తువును దక్షిణముగ నెసఁగువాకిలి గలయింటిలోనఁ
బట్టెమంచము దూదిపఱపుపై నమరి యష్టైశ్వర్యసంపన్నుఁ డగుచు నెడను</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>జెయ్యి తలక్రింద నిడి దిండిచేరిమీఁది రాజ్యమునఁ గల్గుమదవదారాతివితతి
నశ్రమంబున ఖండింప నాత్మలోన నమరి యోజన గావించునవసరంబు.</poem>|ref=94}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>మఱియును నాసప్తమస్థితరాహువు యమునిముఖముఁ బోలునట్టిముఖము
రక్తనేత్రముల ఘోరముగాను జూపట్టి యలశుభాయుర్యోగములను బూని
భక్షించునంతఁ గోపంబుతో వాయవ్యదిశఁ దల యాగ్నేయదిశను దోఁక
యుంచి కేతువును నత్యుగ్రతఁ జూచుచు ననిశంబు సకలగ్రహములు తనకు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>వెఱచునట్లు నహంకారవివశుఁ డగుచు, నుండువేళ శరీరంబు రెండుగాను
విఱిచి గాయాలచేఁ బ్రజ్ఞ మఱచి సోలి యవనిమీఁదను బడియుండు నవసరంబు.</poem>|ref=95}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>అష్టమాధిపతి కుజుండు వరుదుముత్తి, యములఁ దగుకిరీటమును దూణాంబరంబు
చెలఁగుసింహాసనమును దనచేత నెత్తి, యచటికేతువు కొసఁగెడునవసరంబు.</poem>|ref=96}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>నవమాధిపతి శశి పవడాలకంబముల్ రతనాలకొణిగలు వితతములుగ
వన్నెకోకలు చందువలు గలమంటపం బొకటి నిర్మించి యం దున్నతాస
నమున హౌసుగ నర్తనసుగీతవాద్యము ల్గనుగొంచు లేఖలు వినుచు రాజ్య
శాసనుఁడై ధాన్యరాశి కట్టెదుటను రెండుప్రక్కలఁ బైఁడివెండికుప్ప</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>లొనర రత్నపరీక్ష చేయుదును గేతు, జాఠరులకును రెండవయాతఁ డగుచు
దిండు చేరుకొ పడమటిదిక్కుఁ జూచి, యధికసంతోషమున నుండునవసరంబు.</poem>|ref=97}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఈసహి నవగ్రహములు ని, జావసరప్రౌఢిఁ దనరి జాతకునకు సు
శ్రీయోగబలా(శ్రీవితతా)యుర్యోగమ, హావిభవము లొసఁగ నతఁడు హవణిల్లునెడన్.</poem>|ref=98}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ప్రభవ మొందిననాఁడె ప్రాంసురాజేంద్రుండు బహుమానములు చాలఁ బనిచినదియుఁ
బలుకనేర్చిననాఁడె పాచ్చాయి మొదలైన ప్రభువులు భవ్యులై పరఁగినదియు
నడువనేర్చిననాఁడె కడిమిసీమను సుబా దొరతనంబు వహించి మెఱసినదియు
నాడనేర్చిననాఁడె యఖిలభూపతులచేఁ గానుకకప్పము ల్గాంచినదియుఁ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
1afd18wxfppi5r2wp0v8l1ilp5xpawm
పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/18
104
129312
396976
2022-07-27T08:55:29Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>నాఱింట రవిబుధు లలసప్తమమున బృహస్పతికవిరాహు లష్టమమున
మహితనూజుఁడు నవమమునఁ జంద్రుఁడుగతి మనసార్వభౌమయోగం బెసంగ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>రాయసింహాసనాసీన రంగపతికి
శ్రీమదలమేలుమంగాసతీమణీకిని
రమణ ముద్దువిజయానందరంగరాయ
చంద్రుఁ డుదయించె సత్కళాసాంద్రుఁ డగుచు.</poem>|ref=85}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఈధన్యుఁడేకదా యెలమి సాక్షాద్విష్ణువంశచే నుదయించినట్టిదేవుఁ
డీఘనుఁడేకదా యిల ఢిల్లిపాచ్చాయిచేతఁ బూజలు గాంచు శ్రీనిధానుఁ
డీరాజరాజేగదా రాజసింహాసనోద్దామసామ్రాజ్యయోగశాలి
యీమహామహుఁడేగదా మేటిమండలాధీశులమ్రొక్కు లంచెడికెరీటి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>యనుచు సకలమహీపాలు రభినుతింప, శుక్లపక్షస్ఫురత్సుధాంశువలె దినది
నప్రవృద్ధి ముద్దువిజయానందరంగ, రాయమణి పట్టభద్రుఁడ్రై రహిఁ జెలంగు.</poem>|ref=86}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఈలీల నిరుపమానమ, హాలక్ష్మణశాలి యగుచు నతఁ డొదవినయా
వేళం దనరునవగ్రహ, లీలావసరములు నేర్పరించెద వేడ్కన్</poem>|ref=87}}
{{Telugu poem|type=వ.|lines=<poem>తద్విధంబు.</poem>|ref=88}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>రతనంబులను జాల జతనమౌ మొలనూలు బలుకిరీటంబు సొమ్ములు చెలంగఁ
దెలిచల్వఁ గట్టి ముత్తియపుఁబేరులు దాల్చి మురువైన సంగోలు పూని రత్న
సింహాసనస్థుఁడై చెనఁటివైరులఁ గొట్టి యఖిలధరామండలాధిపత్య
గర్వసంజనిత మౌఘనసంభ్రమమునందుఁ జిత్తంబు లీనతఁ జేసి మించి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>తగ నజాతారి యగుచు నుత్తరముఖముగఁ
బొడవుగాంచుచుఁ గుడిక్రే యొడరఁగాను
అలుక తోఁచుట యవసరంబయ్యె కటక
లగ్నయుతకేతునపసరోల్లాస మరయ.</poem>|ref=89}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>మఱి చతుర్ధాధిపతి శని సరిగె కంబి, నీలివలువకిరీటభూషాదిఁ దాల్చి
తూర్పు గని కుడికాలు ముందుంచి నిల్చి, యమరకేతుపట్టము గట్టు నవసరంబు.</poem>|ref=90}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>మఱియు నయ్యాఱింట మెఱయుచున్న బుధుండు లలిమీఱఁ బసపు దల్లడముఁ బూని
బలుతోలుకుళ్లాయిపై నిన్పగొల్సును జుట్టి జందెంబువేసుకొని విల్లు
నమ్ము చేఁ బూని యాయనిలునిదెస కేగి బలిమి సమస్తభూముల జయించి
యాగ్నేయదిక్కున కందుండి చనుదెంచి గగనమండలమున కెగసి నిలిచి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>దక్షిణాభిముఖంబుగాఁ దనరి యూర్ధ్వ, దృష్టి గైకొని శరము సంధించి మించి
పంతమున ముజ్జగముల దహింతువనుచు, నాగ్రహావేశమున నుండునవసరంబు.</poem>|ref=91}}<noinclude><references/></noinclude>
k7rigxgzs2jwx0jrvmnhlndytwy5v7u
పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/20
104
129313
396977
2022-07-27T09:25:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>జదువ నేర్చిననాఁడె విస్తారమండ, లాధిపత్యంబుఁ బూని చెలంగినదియు
నందకులజముద్దువిజయానందరంగ, నృపతికే కాక కలుగునే యితరులకును.</poem>|ref=99}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>చందమామను మించునంద మౌనెమ్మోము కమలంబుల హసించుకనులగోము
కదియఁబట్టినఁ బాలుగారుచెక్కులఠీవి చిగురుటాకును మీఱు చిన్నిమోవి
వాసించుసం పెఁగవంటిచక్కనిముక్కు వజ్రాలఁ గేరుపల్వరుసటెక్కు
వన్నె దేరువిశాలవక్షఃస్థలము వీఁక యొనరు నాజానుబాహువులజోఁక</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కలిగి మహి మహాపురుషలక్షణత నమరు, నితఁడు రాయసింహాసనాధీశుఁ డగుట
కేమియాశ్చర్య మని జనులెల్లఁ బొగడఁ, బ్రబలు ముద్దువిజయానందరంగశౌరి.</poem>|ref=100}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అంత.</poem>|ref=101}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>మహిఁ బ్రమోదూత సంవత్స రాశ్వయుజశుక్లాష్టమిదినమున నమరునుత్త
రాషాఢయందుఁ దివ్యం బైనలగ్నంబు మేష మారాశిని మెఱయు గురుఁడు
మిథునానఁ గేతువు మెలఁతయందుఁ గుజుండు తుల నర్కశుక్రబుధులును వృశ్చి
కమున మందుఁడు కార్ముకమున రాహువు మకరమునఁ జంద్రుండు రహిఁ జెలంగి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కలితసామ్రాజ్యవిభవయోగం బెసంగ, రంగనృపతికి నలమేలుమంగమకును
దనర రెండుపుత్రుఁ డై తగి కుమార, విజయతిరువేంగడేంద్రుఁ డావిర్భవించె.</poem>|ref=102}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఇల రామలక్ష్మణులవలె, బలకృష్ణుల జంటఁ బాయక వా రు
జ్జ్వలయోగశాలులై తగి, తలిదండ్రులు సంతసింపఁ దనరుదు రెలమిన్.</poem>|ref=103}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇ ట్లాపుత్రరత్నంబులు దినదినప్రవర్ధమానప్రతిభం ప్రబలిన నం దగ్రజుండగు
ముద్దువిజయానందరంగరాయనృసాలుఁడు బాలగోపాలమూర్తివలె ముద్దుగుల్కు
చు నేతుశీతాచలాంతరధరావలయం బంతయు నేకచ్ఛత్రాధిపత్యంబుగా నేలుచు
రాయసింహాసనారూఢుం డగుటం జేసి యతని ప్రబలజాతకఫలశుభసూచకంబు
నానాఁట వి స్తరిల్లి వెలయుకతంబునఁ దదీయయోగాతిశయంబునకు దృష్టాంతం
బెట్టిదనిన.</poem>|ref=104}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఇమ్మహిఁ బ్రబలినఢిల్లి య, హమ్మదుషా పాదుషా ధరాధీశ్వరుహు
క్కుమ్మున నాసరజంగ మ, నమ్మునఁ జేకొనక మెలఁగినన్ విని కినుకన్.</poem>|ref=105}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>వడిగ నాసరజంగుసత్వం బడంచి, కోరి దక్షిణసుబ కట్టుకొమ్మటంచు
ఘనహిరాయత మొహదీనుఖానుఁ బూని, పాదుషా పంప నతఁడు దోర్బలము చెలఁగ.</poem>|ref=106}}
{{Telugu poem|type=వ.|lines=<poem>తద్విధంబునఁ బరిపంథికంధరసందోహగంధవహదుస్సహగంధాంధసింధురబంధుర
సైంధవవరూధినీసంగతుండై తరంగిణీభుజోత్తుంగతరంగమాలికలపోలి కైదళంబు
వెంటనంటిరా వెడలి యందందుఁగలదుష్టుల మట్టుపెట్టి యిష్టులం జేపట్టి మట్టు</poem>|ref=}}<noinclude><references/></noinclude>
83i97ovyu0wgulqkb98bf5yo6sa41hd
పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/21
104
129314
396978
2022-07-27T09:36:47Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>మీఱినచలంబునం బలం బగ్గలంబై కనుపట్టి బహుదూరంబు గడచివచ్చునెడఁ దన
కుం బ్రాంసురాజు సహాయంబు సేయవలె నని మంతనంబునం జంతించి యా పుదు
చ్చేరికుంపినికిం గార్యస్వతంత్రియుఁ దండ్రియు మంత్రియు నైనవిజయానంద
రంగనృపాలపుంగవునకుఁ గాగిదంబు వ్రాసి తనకు సహాయంబు సేయవలె నని
ప్రార్థించిన నత్తెఱంగంతయు దొర యైన <ref>Dupleix</ref>డూప్లెక్సు మహారాజున కెఱింగించి
పరమప్రయత్నంబున నతని సమ్మతిలంజేసి నిజతంత్రశక్తివలన నాతారకుం దగిన
సూత్రంబులం బన్నియు, నచ్చటం జేరంబడియున్న ఛందాసాహేబు న్విడిపించి
యాహిరాయితమొహ(దీను)దినీఖాను వెంటనంటిరా దిట్టపఱిచి పుదుచ్చేరి నున్న
రజాసాహేబునకు నవాబుతనం బిప్పించి, యతనివెనువెంట విక్రమవిక్రమార్కు
లగుఫాన్సుసోల్దారులను నసహాయశూరు లగుబారుసిపాయీలను గూర్చి తగిన జగ
డంపుసామానుల దిట్టపఱిచిన నమితోత్సాహంబున వెలువడి యారజాసాహేబు,
ఛందాసాహేబు, హిరాయిత మొహ(దీను)దినీఖానుండు మొదలయినశూరు లేక
స్థులై ప్రాంసుపౌఁజును మున్నిడుకొని అనవర్లిఖానుని నతనిపౌఁజును నిముసమాత్రం
బున ముంచి యార్కా డాక్రమించి మించినకీర్తిచేఁ బ్రకాశించిన యానిజాము నబా
బుల పుదుచ్చేరికిఁ బిలిపించి సకలవైభవంబులతోన దొరచెంతం దోడ్కొనిపోయి
నవరత్నభూషణాంబరంబులు నపారంబుగా బహుమతిని గావించి మధుర, తంజా
పురి, మైసూరు, యిక్కేరి మొదలైన సంస్థానంబుల నిట్టట్టు గావించి తమపై దండెత్తి
వచ్చి నాసరజంగు లక్షగుఱ్ఱంబుతోఁ బుదువాపురి నావరించుకొనిన వాని నానెట్టున
నిలువనీయక తఱుమఁగొట్టి గులాంనహుషుమహమ్మదుఖానుని బలాయమానునిం
జేసి తురకతమాషుఖానుని నిర్నామంబు గావించి నబుసిందుఖానుని దండంతయుఁ
జూఱలాడించి మహమ్మదుఅబరాల్ పాళయం బంతయు నెత్తఁగొట్టించి మహమ
దల్లిఖానునిపౌఁ జంతయుఁ బటాపంచలై పాఱందఱిమి మఱియునుం గలుగువీరా
ధివీరుల నెచ్చ టఱకా లూఁదనీక చెల్లాచెదరు గావించి పరాక్రమించినయట్టి
యెడ నాహిరాయిత మొహదీనుఖానుఁడు నాసరజంగుదళంబునం జొచ్చి పీనుం
గుపెంటలు గావించి పేర్చి యార్చి పోరాడి యవగడంబుగా వారిచే బట్టువడిన
యాసుద్ది విని కట్టల్క రెట్టింప సామాద్యుపాయభేదంబులం దంత్రంబులం
బన్ని యన్నాసరజంగుం ద్రుంగడంచి వారిదం డంతయుఁ జూఱలాడించి యెప్ప
టియట్ల హిరాయతీ మొహదీనుఖానుని నిజాము పట్టనంబునఁ బ్రతిష్ఠించి యతనివలన
నజారతరాయఁ డను బిరుదుపేరునుం జెంగలిపట్టుకిల్లా జాగీరునుం గుమారశేఖరుం
డైన ముద్దువిజయానందరంగరాయాగ్రణిపేర మూఁడువేలగుఱ్ఱంబునకు మనసుబా
దొరతనంబును నవపత్తుమాయినురాతంబు మొదలయిన మహారాజలాంఛనంబులుం</poem>|ref=}}<noinclude><references/></noinclude>
fmwkan5gswwnltabgxkx5aj6g8nduto
ఆనందరంగరాట్ఛందము/ప్రథమాశ్వాసము
0
129315
396979
2022-07-27T09:39:49Z
దేవీప్రసాదశాస్త్రి
4290
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = కస్తూరి రంగయ |అనువాదం= | విభాగము = ప్రథమాశ్వాసము | ముందరి = [[../పీఠిక/]] | తదుపరి =[[../ద్వితీయాశ్వాసము/]] | వివరములు = |సంవత్సరం= 1922 }} <pages index="ఆనందరంగరాట్ఛందము...'
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = కస్తూరి రంగయ
|అనువాదం=
| విభాగము = ప్రథమాశ్వాసము
| ముందరి = [[../పీఠిక/]]
| తదుపరి =[[../ద్వితీయాశ్వాసము/]]
| వివరములు =
|సంవత్సరం= 1922
}}
<pages index="ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf" from=27 to=36/>
563f50yni50nu6rqtjt4w58uicfrytn
ఆనందరంగరాట్ఛందము/ద్వితీయాశ్వాసము
0
129316
396980
2022-07-27T09:41:31Z
దేవీప్రసాదశాస్త్రి
4290
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = కస్తూరి రంగయ |అనువాదం= | విభాగము = ద్వితీయాశ్వాసము | ముందరి = [[../ప్రథమాశ్వాసము/]] | తదుపరి =[[../తృతీయాశ్వాసము/]] | వివరములు = |సంవత్సరం= 1922 }} <pages index="ఆనందరంగర...'
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = కస్తూరి రంగయ
|అనువాదం=
| విభాగము = ద్వితీయాశ్వాసము
| ముందరి = [[../ప్రథమాశ్వాసము/]]
| తదుపరి =[[../తృతీయాశ్వాసము/]]
| వివరములు =
|సంవత్సరం= 1922
}}
<pages index="ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf" from=37 to=75/>
6a5h59ldmk0ao2vnbmbvaozl1yrqwhg
ఆనందరంగరాట్ఛందము/తృతీయాశ్వాసము
0
129317
396981
2022-07-27T09:43:11Z
దేవీప్రసాదశాస్త్రి
4290
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = కస్తూరి రంగయ |అనువాదం= | విభాగము = తృతీయాశ్వాసము | ముందరి = [[../ద్వితీయాశ్వాసము/]] | తదుపరి =[[../చతుర్థాశ్వాసము/]] | వివరములు = |సంవత్సరం= 1922 }} <pages index="ఆనందరంగ...'
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = కస్తూరి రంగయ
|అనువాదం=
| విభాగము = తృతీయాశ్వాసము
| ముందరి = [[../ద్వితీయాశ్వాసము/]]
| తదుపరి =[[../చతుర్థాశ్వాసము/]]
| వివరములు =
|సంవత్సరం= 1922
}}
<pages index="ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf" from=76 to=123/>
eyxrgjgwmpm44db8jutffj6yuntfeq6
ఆనందరంగరాట్ఛందము/చతుర్థాశ్వాసము
0
129318
396982
2022-07-27T09:44:11Z
దేవీప్రసాదశాస్త్రి
4290
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = కస్తూరి రంగయ |అనువాదం= | విభాగము = చతుర్థాశ్వాసము | ముందరి = [[../తృతీయాశ్వాసము/]] | తదుపరి = | వివరములు = |సంవత్సరం= 1922 }} <pages index="ఆనందరంగరాట్ఛందము (కస్తూరి ర...'
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = కస్తూరి రంగయ
|అనువాదం=
| విభాగము = చతుర్థాశ్వాసము
| ముందరి = [[../తృతీయాశ్వాసము/]]
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం= 1922
}}
<pages index="ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf" from=124 to=155/>
kcs71ukn9le9ru6u3h7p53tp0gkj0kx
పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/36
104
129319
396983
2022-07-27T09:55:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>శ్వరనీకాశవచఃప్రమోదితసుధీసంతాన సంతానఖే
చరకానీనసమానదానకలనాసన్మానసన్మానదా!</poem>|ref=61}}
{{Telugu poem|type=పంచచామరము.|lines=<poem>దరాతికంపితాజిభూసదాపరాజయాంతభా
గరాతిరాజసుందరీకరాబ్జధూయమానచా
మరప్రకాండసంభవోగ్రమారుతప్రవృద్ధమా
నరౌద్రదుస్సహప్రతాపనవ్యహవ్యవాహనా!</poem>|ref=62}}
{{Telugu poem|type=క.|lines=<poem>సితధారావిస్ఫురదసి, లతికాసంచలితముష్కరవిపక్షధరా
పతిజీవమారుత వజా, రతవిజయానందరంగరాయ శుభాంగా!</poem>|ref=63}}
{{Telugu poem|type=గద్యము.|lines=<poem>ఇది శ్రీమదుమామహేశ్వరకరుణాకటాక్షలబ్ధసాహితీవిభవ ధర్మవెచ్చకుల
జలధికుముదమిత్ర శ్రీవత్సగోత్రపవిత్ర వేంకటకృష్ణార్యపుత్ర విద్వజ్జనమిత్ర కుకవి
విజనతాలతాలవిత్ర యార్వేలకమ్మనియోగికులీన లక్షణకవికస్తూరిరంగయనామ
ధేయప్రణీతం బైనయానందరంగచ్ఛందం బనులక్షణచూడామణియందుఁ బ్రథ
మాశ్వాసము.</poem>|ref=}}<noinclude><references/></noinclude>
hqw311c4oms3el39jzhiwvg89biuhmh
పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/27
104
129320
396984
2022-07-27T10:11:10Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fs150}}ప్రథమాశ్వాసము</p>
{{p|ac|fwb}}గ్రంథప్రారంభము</p>
{{Telugu poem|type={{Css image crop
|Image = ఆనందరంగరాట్ఛందము_(కస్తూరి_రంగయ).pdf
|Page = 27
|bSize = 435
|cWidth = 66
|cHeight = 131
|oTop = 98
|oLeft = 35
|Location = center
|Description =
}}
|lines=<poem>
రామారమణపదాం
భోరుహపూజావిశేష బుధసత్కవిమం
దారా! విపక్షశైలశ
తారా! యానందరంగధరణీశమణీ!</poem>|ref=1}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>అవధరింపుము నీపేర నంకితముగ, సకలలక్షణగ్రంథవిస్తారసార
పటిమ లన్నియు నొకటిగా ఘటనపఱిచి, లక్షణగ్రంథ మొనరింతు రంగనృపతి!</poem>|ref=2}}
{{Telugu poem|type=క.|lines=<poem>సుకవీంద్రులు తల లూఁచఁగ, గుకవు లొగిన్ దలలు వంచుకొనఁజేసెద నే
నొకలక్షణకావ్యంబును, రకముగ నానందరంగరాట్భంద మనన్.</poem>|ref=3}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>లక్షణమెకాని యెఱుఁగరు లక్ష్యపటిమ, లక్ష్యమే కాక యెఱుఁగరు లక్షణంబు
కొంద ఱేనంద ఱానంద మొంద లక్ష్య, లక్షణము లేర్పరించెద రంగనృపతి!</poem>|ref=4}}
{{Telugu poem|type=వ.|lines=<poem>తద్విధం బెట్టిదనిన.</poem>|ref=5}}
{{Telugu poem|type=క.|lines=<poem>చను నుత్తమగండాధ, ర్వణహనుమదనంతసు(న)కవిరాక్షసజయదే
వనుతశ్రీధరగోక, ర్ణనీలకంఠాదిభీమనచ్ఛందంబుల్.</poem>|ref=6}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఉత్తమగండచ్ఛందము, హనుమచ్ఛందము, అధర్వణచ్ఛందము, అనంతచ్ఛం
దము, కవిరాక్షసచ్ఛందము, జయదేవచ్ఛందము, శ్రీధరచ్ఛందము, గోకర్ణ
చ్ఛందము, నీలకంఠచ్ఛందము, ఆదిమకవిభీమనచ్ఛందము యీదశవిధచ్ఛందంబులు
గాక లక్షణగ్రంథములగు <ref>అన్నయ</ref>నన్నయభట్టు లక్షణసారంబును, విన్నకోట పెద్దిరాజు
నలంకారశాస్త్రంబును, రఘునాధీయలక్ష్మణదీపికయును, భైరవునికవిగజాంకుశ
మును, నప్పన యాంధ్రప్రయోగరత్నాకరంబును, నెఱ్ఱాప్రెగడ కవిసర్పగారుడము
ను, దాతంభట్టు కావ్యచింతామణియును, మల్లన <ref>వాదాంగ; పాదాంగద</ref>పాదాంగచూడామణియు నను
నీ మొదలగు లక్షణకావ్యంబులందుఁ గలుగు కవితాలక్షణప్రకరణంబు లన్నియుఁ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
83kkaoz4f8hxutrsi7152wkrtu90jva
పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/35
104
129321
396985
2022-07-27T10:39:26Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>నహము, తలము, సలలము, భలము, నలలము నను నీగణములు అగును. ఇవియే
చంద్రగణములు.</poem>|ref=57}}
{{left margin|5em}}అనంతచ్ఛందము:—— </div>
{{Telugu poem|type=క.|lines=<poem>ద్విత్రిచతుర్గురుభవములు, ధాత్రీధవ రెండు మడఁపఁ దక్కినగణముల్
మిత్రేంద్రచంద్రు లనఁదగు, మాత్రాదిగణంబుమొదల మాత్రలు నిలుపన్.</poem>|ref=58}}
{{right|(1. 18.)}}
{{left margin|5em}}మఱియుఁ బదునాలుగుచంద్రగణములకు నుదాహరణములు:— </div>
{{Telugu poem|type=సీ.|lines=<poem>కదనశూరా నగగంబు కమలనేత్ర నహ మరిమర్దన నాఁగ సలల
మిందురుచి భలంబు నందకులా యన్న భగురు రంగాధీశ మగణలఘువు
సువజారతా యన్న సవ మనఘస్వాంత సహము రంగాధిపసంజ్ఞ తలము
రంగశౌరి రలంబు రసికమణీ యన్న నవి మమితగుణ నా నలల మయ్యె</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>రగణగురువు రంగరాజా యనంగ వి, ద్వన్నుతా యనంగఁ దగణగురువు
విజయుఁడా యనంగ విజయుఁడ విజయాంక, నాఁగ నొప్పు నగము నలము సలము.</poem>|ref=59}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబున గణాష్టకసంభవనిర్ణయంబును, స్త్రీపున్నపుంసకాక్షరనిర్ణయంబును,
గణంబు లుద్భవించినయామంబులును, బీజాక్షరనిర్ణయంబును, వాని శుభాశుభఫలం
బులును, యతిప్రాసంబు లుంచుతెఱంగును, గురులఘుసంజ్ఞలును, గందసీసగీతవృత్త
ద్విపదలక్షణంబులును, నినేంద్రచంద్రగణప్రస్తారంబును వివరించినాఁడ. నింక
మగణాద్యష్టగణంబులకు నధిదేవిత గ్రహాదినిర్ధారణంబును, నన్యోన్యగణసాంగ
త్యంబును, వానిశుభాశుభఫలంబులును, బంచాదశద్వర్ణసముద్భవనిర్ణయంబును, దజ్జాతి
గ్రహాధిదేవతాఫలబీజనాయకనిర్ణయంబును, దదుపహారవస్త్రభూషణవర్ణవిమర్శనం
బును, దదూర్ధ్వముఖాధోముఖపార్శ్వముఖసమముఖవివేచనంబును, నమృతాక్షరవి
షాక్షరప్రకటనంబును, సంయుక్తనరఫలాఫలంబులును, సురనరతిర్యగ్రౌరవాక్షర
భేదంబులును, నల్పప్రాణమహాప్రాణాక్షరసూచనంబును, జీవపక్షమృతపక్షసంగతు
లును, దగ్ధజ్వలితధూమితనక్షత్రవిమర్శనయియిను, రాశివిరోధంబులును, సత్త్వరజస్త
మోవేళాపరిశీలన౦బును, రాశ్యధిపతిప్రకారంబును, నుచ్చనీచస్థానవిధంబును, గ్రహ
మిత్రామిత్రసమత్వభావంబులును, గ్రహవర్ణనిష్పత్తియు భూసురాదివర్ణంబులకు గ్ర
హమైత్రి ముఖ్యపొంతనములు పరికించు తెఱంగును, షోడశచక్రక్రమంబును, మాతృ
కాధ్యానపూజావిధానంబును నివి మొదలుగాఁ గల కవితాలక్షణప్రపంచంబు వివ
రించెద నవధరింపుము.</poem>|ref=60}}
{{Telugu poem|type=మ.|lines=<poem>పరరాజన్యచమూభిదుగ్రబలదీప్రస్థాన ప్రస్థాన<ref>భాం, కురు</ref>భా
గురుభేరీరవసంచలీకృతదిశాకుంభీన కుంభీనసే</poem>|ref=}}<noinclude><references/></noinclude>
pkecxq2pewz55uvdz6q8ndzdxfqtrd0
396986
396985
2022-07-27T10:40:22Z
దేవీప్రసాదశాస్త్రి
4290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>నహము, తలము, సలలము, భలము, నలలము నను నీగణములు అగును. ఇవియే
చంద్రగణములు.</poem>|ref=57}}
{{left margin|2em}}'''అనంతచ్ఛందము''':—— </div>
{{Telugu poem|type=క.|lines=<poem>ద్విత్రిచతుర్గురుభవములు, ధాత్రీధవ రెండు మడఁపఁ దక్కినగణముల్
మిత్రేంద్రచంద్రు లనఁదగు, మాత్రాదిగణంబుమొదల మాత్రలు నిలుపన్.</poem>|ref=58}}
{{right|(1. 18.)}}
{{left margin|2em}}'''మఱియుఁ బదునాలుగుచంద్రగణములకు నుదాహరణములు:—''' </div>
{{Telugu poem|type=సీ.|lines=<poem>కదనశూరా నగగంబు కమలనేత్ర నహ మరిమర్దన నాఁగ సలల
మిందురుచి భలంబు నందకులా యన్న భగురు రంగాధీశ మగణలఘువు
సువజారతా యన్న సవ మనఘస్వాంత సహము రంగాధిపసంజ్ఞ తలము
రంగశౌరి రలంబు రసికమణీ యన్న నవి మమితగుణ నా నలల మయ్యె</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>రగణగురువు రంగరాజా యనంగ వి, ద్వన్నుతా యనంగఁ దగణగురువు
విజయుఁడా యనంగ విజయుఁడ విజయాంక, నాఁగ నొప్పు నగము నలము సలము.</poem>|ref=59}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇవ్విధంబున గణాష్టకసంభవనిర్ణయంబును, స్త్రీపున్నపుంసకాక్షరనిర్ణయంబును,
గణంబు లుద్భవించినయామంబులును, బీజాక్షరనిర్ణయంబును, వాని శుభాశుభఫలం
బులును, యతిప్రాసంబు లుంచుతెఱంగును, గురులఘుసంజ్ఞలును, గందసీసగీతవృత్త
ద్విపదలక్షణంబులును, నినేంద్రచంద్రగణప్రస్తారంబును వివరించినాఁడ. నింక
మగణాద్యష్టగణంబులకు నధిదేవిత గ్రహాదినిర్ధారణంబును, నన్యోన్యగణసాంగ
త్యంబును, వానిశుభాశుభఫలంబులును, బంచాదశద్వర్ణసముద్భవనిర్ణయంబును, దజ్జాతి
గ్రహాధిదేవతాఫలబీజనాయకనిర్ణయంబును, దదుపహారవస్త్రభూషణవర్ణవిమర్శనం
బును, దదూర్ధ్వముఖాధోముఖపార్శ్వముఖసమముఖవివేచనంబును, నమృతాక్షరవి
షాక్షరప్రకటనంబును, సంయుక్తనరఫలాఫలంబులును, సురనరతిర్యగ్రౌరవాక్షర
భేదంబులును, నల్పప్రాణమహాప్రాణాక్షరసూచనంబును, జీవపక్షమృతపక్షసంగతు
లును, దగ్ధజ్వలితధూమితనక్షత్రవిమర్శనయియిను, రాశివిరోధంబులును, సత్త్వరజస్త
మోవేళాపరిశీలన౦బును, రాశ్యధిపతిప్రకారంబును, నుచ్చనీచస్థానవిధంబును, గ్రహ
మిత్రామిత్రసమత్వభావంబులును, గ్రహవర్ణనిష్పత్తియు భూసురాదివర్ణంబులకు గ్ర
హమైత్రి ముఖ్యపొంతనములు పరికించు తెఱంగును, షోడశచక్రక్రమంబును, మాతృ
కాధ్యానపూజావిధానంబును నివి మొదలుగాఁ గల కవితాలక్షణప్రపంచంబు వివ
రించెద నవధరింపుము.</poem>|ref=60}}
{{Telugu poem|type=మ.|lines=<poem>పరరాజన్యచమూభిదుగ్రబలదీప్రస్థాన ప్రస్థాన<ref>భాం, కురు</ref>భా
గురుభేరీరవసంచలీకృతదిశాకుంభీన కుంభీనసే</poem>|ref=}}<noinclude><references/></noinclude>
mfoy37a4lj73sfzpzopaiamwwrg602p
పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/34
104
129322
396987
2022-07-27T10:55:43Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}ద్విపదలక్షణము</p>
{{Telugu poem|type=క.|lines=<poem>సురపతిగణములు నాలుగు, తరణిగణద్వయముఁ గూర్పఁ దనరు ద్విపద యీ
తెఱఁగున నలుచరణమ్ములు, సరుసుకొనన్ జౌపద యనఁజను రంగనృపా.</poem>|ref=51}}
{{Telugu poem|type=వ.|lines=<poem>నాలు గింద్రగణములు రెండు సూర్యగణములు నొకచరణమగును. ఇట్టిచరణములు
రెండు ద్విపద యనఁబడును. ఇట్లే నాలుగైనఁ జౌపద యనఁబడును. వీనినే మహా
నవమిపద్య మందురు.</poem>|ref=52}}
{{p|ac|fwb}}ప్రస్తారక్రమము</p>
{{Telugu poem|type=గీ.|lines=<poem>వరుస సర్వగురువు లుంచి గురువుక్రింద, లఘువు నవతలఁ బైబంతిలాగు వ్రాసి
దాపట గురువు లుంచఁ బ్రస్తారమయ్యె, ననఘ యానందరంగరాయాగ్రగణ్య.</poem>|ref=53}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఎన్నవఛందము ప్రస్తరింపవలసిన నన్నిగురువులు వ్రాసి తొలిగురువుక్రింద లఘువు
వ్రాసి యావలఁ బైబంతిలాగుననే వ్రాసి దాపల నంతట గురువులే యుంచవలెను. ఇ
ట్లన్నియు లఘువు లగుదనుకఁ బ్రస్తరించవలెను. ఇదియే ప్రస్తారక్రమము.</poem>|ref=54}}
{{left margin|2em}}'''సులక్షణసారమున''':— </div>
{{Telugu poem|type=క.|lines=<poem>చాలుగను సర్వగురులిడి, లాలితముగ గురువుక్రింద లఘువు వెలుపలన్
ఓలిసమంబును దాఁపలి, వ్రాలునకున్ గురువులిడినఁ బ్రస్తార మజా!</poem>|ref=55}}
{{p|ac|fwb}}ఇనేంద్రచంద్రగణప్రస్తారము</p>
{{Telugu poem|type=గీ.|lines=<poem>గురువు లొగి రెండు మూఁడు నా ల్గుంచి ప్రస్త
రింపఁ బ్రభవించు గణముల రెండు త్రోసి
లఘుగణాదుల నొక్కొక్కలఘువుఁ బెట్ట
రవిబలారీందుగణము లౌ రంగధీర!</poem>|ref=56}}
{{Telugu poem|type=వ.|lines=<poem>రెండుగురువు లుంచి ప్రస్తరించిన నాల్గుగణములు పుట్టును. అందు రెండుగణములు మొదటఁ ద్రోసి తక్కినరెంటిలో లఘువు మొదలనుండుగణము మొదలు మఱియొక
లఘువుఁ గూర్చుకొనినచో హగణనగణము లగును. ఇవి సూర్యగణములు. మూఁడు
గురువు లుంచి ప్రస్తరించిన నెనిమిదిగణములు పుట్టును. అందు మొదలిరెండుగణ
ములు గాక తక్కినయాఱుగణములలో మొదట లఘువుగలగణమునకు మరియొక
లఘువుఁ జేర్చినయెడ నవి రగణము, నగణము, తగణము, సలము, భగణము, నలము
అగును. ఈయాఱుగణములు నింద్రగణములు. నాలుగుగురువు లుంచి ప్రస్తరింప
బదునాఱుగణములు పుట్టును. అందు మొదటి రెండుగణములుగాక తక్కినపదు
నాల్గుగణములలో మొదట లఘువుగలగణముమొదల నొకలఘువుఁ జేర్చిన రగురువు,
నగగము, తగురువు, సవము, భగురువు, నవము, మలఘువు, సహము, రలము,</poem>|ref=}}<noinclude><references/></noinclude>
78xlveo2454ew2x9ay2jmov4k935y32
పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/28
104
129323
396988
2022-07-27T11:53:51Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దబడిన */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>గ్రోడీకరించి సారవంతంబుగా సకలకవిజనసమ్మతంబుగా లక్షణలక్ష్యంబు లేర్పఱచి
భవదీయ విపులకృపావిభవసంపాదిత మనీషాచాతుర్యంబున వివరించెద నాకర్ణిం
పుము.</poem>|ref=7}}
{{p|ac|fwb}}గణాష్టకసంభవనిర్ణయము</p>
{{Telugu poem|type=క.|lines=<poem>హరునిత్రినేత్రములం దిగ, గురువు లొదవి మగణ మయ్యె గురుతుగ వరుసన్
యరసతజభనగణంబులు, స్థిరముగ దానికి జనించె శ్రీరంగనృపా!</poem>|ref=8}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>ఆదు లచ్చులు కాదులు వ్యంజనములు, హల్లు లనఁ జెల్లు సందులో యరలవశష
సహలు నంతస్థ లూష్మ లన్ సంజ్ఞఁ దనరు, సుందరీమోహనాంగ యానందరంగ!</poem>|ref=9}}
{{p|ac|fwb}}స్త్రీపున్నపుంసకాక్షరనిర్ణయము</p>
{{Telugu poem|type=గీ.|lines=<poem>సక్షలును రెండు నొత్తనియక్షరములుఁ, బడియు మగలచ్ఛషలు నొత్తఁబడినపదియు
రమణు లౌ ఙఞణనమయరసహలళలు, రహిని బేడులౌ నానందరంగశౌరి.</poem>|ref=10}}
{{Telugu poem|type=వ.|lines=<poem>సకారక్షకారములు రెండు నొత్తనియగరము లగుకగచజటడతదపబయనునీపది
యును గూడఁ బండ్రెండక్షరములు పురుషజాతివి. ఆకారాదిస్వరములు పదునైదు,
నొత్తుగలయక్షరములు పదియును, శషలు రెండును మొత్త మిరువదేడక్షరములు
స్త్రీజాతివి. ఙఞణనమయరలవహళయను నీపదునొకండక్షరములు నపుంసకజాతివి
అని తెలియునది. మఱియు నీశ్వరునిమూఁడుకన్నులనుండి మూఁడుగురువులు పుట్టి
మగణ మాయెను. దానివలన వరుసగా యగణరగణసగణతగణజగణభగణనగణం
బులు పుట్టెను.</poem>|ref=11}}
{{p|ac|fwb}}గణంబు లుద్భవించిన యామములు</p>
{{Telugu poem|type=గీ.|lines=<poem>సరవిని జయవిజయశంఖమహాశంఖ,ము లను జాల మయరసలు జనించె
రాత్రిజాము లైనరామవిరామసు, ప్తప్రసుప్తలఁ దజభనలు పుట్టె.</poem>|ref=12}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఏజామునఁ గృతిఁ బూన్చిన, నాజాముగణంబె మొదట నమరింపక వే
ఱే జెప్పఁదగదు సద్గుణ, రాజిత యానందరంగ! రమణీయాంగా!</poem>|ref=13}}
{{Telugu poem|type=వ.|lines=<poem>ఆయెనిమిదిగణములు నెనిమిదిజాములయందుఁ బుట్టినవి గనుక నందుఁ బగటిజాము
లయిన జయవిజయశంఖమహాశంఖముల మగణయగణరగణసగణంబు లుద్భవించె.
రాత్రిజాము లయినరామవిరామసుప్తప్రసుప్తలయందుఁ దగణజగణభగణనగణం
బులు జనియించినవి. కాన సుకవీంద్రుఁ డేవేళఁ గృతిసేయ నుపక్రమించె నా
వేళఁ బుట్టినగణమును పద్యాదిని బ్రయోగించినఁ గృతీశ్వరునకుఁ దనకు మేలుగలు
గును. భేదముగాఁ జెప్పినఁ గీడొదవును.</poem>|ref=14}}<noinclude><references/></noinclude>
m70k5rptxblvsiac2awp35q7sgo04nt