వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.3
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
శరణంటి మాతనిసమ్మంధమున
0
1890
557032
14312
2026-05-26T03:08:39Z
Dglasri
7328
557032
wikitext
text/x-wiki
{{Annamayya-box1-top|శరణంటి (రాగం: ) (తాళం : )}}
<poem>
శరణంటి మాతని సమ్మంధమునఁ జేసి
మరిగించి మము నేలి మన్నించవే ॥పల్లవి॥
సకలవేదములు సంకీర్తనలు చేసి
ప్రకటించి నినుఁ బాడి పావనుఁడైనఁ-
అకలంకుఁడు తాళ్లపాకన్నమాచార్యుల
వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ ॥శర॥
నారదాది సనకసనందనాదులవలె
పేరుపడి నిన్నుఁ బాడి పెద్దలైనట్టి
ఆరీతిఁ దాళ్లపాకన్నమాచార్యుల
చేరి యేలినయట్టి శ్రీవేంకటనిలయ ॥శర॥
సామవేదసామగాన సప్తస్వరములను
బాముతో నీసతి నిన్నుఁ బాడినయట్టి
ఆముకొన్న తాళ్లపాకన్నమాచార్యుల
వేమరు మెచ్చిన శ్రీవేంకటనిలయా ॥శర॥
</poem>
{{Annamayya-box-bottom}}
{{Annamayya-box2-top|Saranamti (Raagam: ) (Taalam: )}}
<poem>
Saranamti maatanisammamdhamuna
Marigimchi mamunaeli mannimchavae pallavi
Sakalavaedamulu samkeertanalu chaesi
Prakatimchi ninu baadi paavanudaina
Akalamkudu taallapaakannamaachaaryula
Vekaliyai yaelina sreevaemkatanilaya sara
Naaradaadi sanakasanamdanaadulavale
Paerupadi ninnu baadi peddalainatti
Aareeti daallapaakannamaachaaryula
Chaeri yaelinayatti sree vaemkatanilaya sara
Saamavaedasaamagaanasaptasvaramulanu
Baamuto neesati ninnu baadinayatti
Aamukonna taallapaakannamaacharula
Vaemaru mechchina sree vaemkatanilayaa sara
</poem>
{{Annamayya-box-bottom}}
===బయటి లింకులు===
[http://www.esnips.com/doc/caa07ccc-bacb-4f23-b124-d31df1bbe1a8/SaraNaMTimAtani_BKP SaraNaMTimAtani_BKP]
----
{{అన్నమయ్య పాటలు}}
[[Category:అన్నమయ్య పాటలు ]]
sjazy1jynhpx8qmtsr5s5c35qowk6zn
557033
557032
2026-05-26T03:10:02Z
Dglasri
7328
557033
wikitext
text/x-wiki
{{Annamayya-box1-top|శరణంటి మాతని (రాగం: ) (తాళం : )}}
<poem>
శరణంటి మాతని సమ్మంధమునఁ జేసి
మరిగించి మము నేలి మన్నించవే ॥పల్లవి॥
సకలవేదములు సంకీర్తనలు చేసి
ప్రకటించి నినుఁ బాడి పావనుఁడైనఁ-
అకలంకుఁడు తాళ్లపాకన్నమాచార్యుల
వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ ॥శర॥
నారదాది సనకసనందనాదులవలె
పేరుపడి నిన్నుఁ బాడి పెద్దలైనట్టి
ఆరీతిఁ దాళ్లపాకన్నమాచార్యుల
చేరి యేలినయట్టి శ్రీవేంకటనిలయ ॥శర॥
సామవేదసామగాన సప్తస్వరములను
బాముతో నీసతి నిన్నుఁ బాడినయట్టి
ఆముకొన్న తాళ్లపాకన్నమాచార్యుల
వేమరు మెచ్చిన శ్రీవేంకటనిలయా ॥శర॥
</poem>
{{Annamayya-box-bottom}}
{{Annamayya-box2-top|Saranamti maatani (Raagam: ) (Taalam: )}}
<poem>
Saranamti maatani sammamdhamuna
Marigimchi mamunaeli mannimchavae pallavi
Sakalavaedamulu samkeertanalu chaesi
Prakatimchi ninu baadi paavanudaina
Akalamkudu taallapaakannamaachaaryula
Vekaliyai yaelina sreevaemkatanilaya sara
Naaradaadi sanakasanamdanaadulavale
Paerupadi ninnu baadi peddalainatti
Aareeti daallapaakannamaachaaryula
Chaeri yaelinayatti sree vaemkatanilaya sara
Saamavaedasaamagaanasaptasvaramulanu
Baamuto neesati ninnu baadinayatti
Aamukonna taallapaakannamaacharula
Vaemaru mechchina sree vaemkatanilayaa sara
</poem>
{{Annamayya-box-bottom}}
===బయటి లింకులు===
[http://www.esnips.com/doc/caa07ccc-bacb-4f23-b124-d31df1bbe1a8/SaraNaMTimAtani_BKP SaraNaMTimAtani_BKP]
----
{{అన్నమయ్య పాటలు}}
[[Category:అన్నమయ్య పాటలు ]]
cbuzz81efcssi5e33igeumi6k99dj8f
557034
557033
2026-05-26T03:14:46Z
Dglasri
7328
/* బయటి లింకులు */
557034
wikitext
text/x-wiki
{{Annamayya-box1-top|శరణంటి మాతని (రాగం: ) (తాళం : )}}
<poem>
శరణంటి మాతని సమ్మంధమునఁ జేసి
మరిగించి మము నేలి మన్నించవే ॥పల్లవి॥
సకలవేదములు సంకీర్తనలు చేసి
ప్రకటించి నినుఁ బాడి పావనుఁడైనఁ-
అకలంకుఁడు తాళ్లపాకన్నమాచార్యుల
వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ ॥శర॥
నారదాది సనకసనందనాదులవలె
పేరుపడి నిన్నుఁ బాడి పెద్దలైనట్టి
ఆరీతిఁ దాళ్లపాకన్నమాచార్యుల
చేరి యేలినయట్టి శ్రీవేంకటనిలయ ॥శర॥
సామవేదసామగాన సప్తస్వరములను
బాముతో నీసతి నిన్నుఁ బాడినయట్టి
ఆముకొన్న తాళ్లపాకన్నమాచార్యుల
వేమరు మెచ్చిన శ్రీవేంకటనిలయా ॥శర॥
</poem>
{{Annamayya-box-bottom}}
{{Annamayya-box2-top|Saranamti maatani (Raagam: ) (Taalam: )}}
<poem>
Saranamti maatani sammamdhamuna
Marigimchi mamunaeli mannimchavae pallavi
Sakalavaedamulu samkeertanalu chaesi
Prakatimchi ninu baadi paavanudaina
Akalamkudu taallapaakannamaachaaryula
Vekaliyai yaelina sreevaemkatanilaya sara
Naaradaadi sanakasanamdanaadulavale
Paerupadi ninnu baadi peddalainatti
Aareeti daallapaakannamaachaaryula
Chaeri yaelinayatti sree vaemkatanilaya sara
Saamavaedasaamagaanasaptasvaramulanu
Baamuto neesati ninnu baadinayatti
Aamukonna taallapaakannamaacharula
Vaemaru mechchina sree vaemkatanilayaa sara
</poem>
{{Annamayya-box-bottom}}
===బయటి లింకులు===
[https://annamayya-u.blogspot.com/2010/10/saranamti-maatani.html Sarananti matani - శరణంటి మాతని by GBKP]
----
{{అన్నమయ్య పాటలు}}
[[Category:అన్నమయ్య పాటలు ]]
2kckitlo2fnkmbv0qc094fy5c5aaw73
557036
557034
2026-05-26T03:57:12Z
Dglasri
7328
557036
wikitext
text/x-wiki
{{Annamayya-box1-top|శరణంటి మాతని (రాగం: ) (తాళం : )}}
<poem>
శరణంటి మాతని సమ్మంధమునఁ జేసి
మరిగించి మము నేలి మన్నించవే ॥పల్లవి॥
సకలవేదములు సంకీర్తనలు చేసి
ప్రకటించి నినుఁ బాడి పావనుఁడైనఁ-
అకలంకుఁడు తాళ్లపాకన్నమాచార్యుల
వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ ॥శర॥
నారదాది సనకసనందనాదులవలె
పేరుపడి నిన్నుఁ బాడి పెద్దలైనట్టి
ఆరీతిఁ దాళ్లపాకన్నమాచార్యుల
చేరి యేలినయట్టి శ్రీవేంకటనిలయ ॥శర॥
సామవేదసామగాన సప్తస్వరములను
బాముతో నీసతి నిన్నుఁ బాడినయట్టి
ఆముకొన్న తాళ్లపాకన్నమాచార్యుల
వేమరు మెచ్చిన శ్రీవేంకటనిలయా ॥శర॥
</poem>
{{Annamayya-box-bottom}}
{{Annamayya-box2-top|Saranamti maatani (Raagam: ) (Taalam: )}}
<poem>
SaraNaMTi maatani sammaMdhamuna@M jaesi
marigiMchi mamu naeli manniMchavae pallavi
sakalavaedamulu saMkeertanalu chaesi
prakaTiMchi ninu@M baaDi paavanu@MDaina@M-
akalaMku@MDu taaLlapaakannamaachaaryula
vekaliyai yaelina SreevaeMkaTanilaya Sara
naaradaadi sanakasanaMdanaadulavale
paerupaDi ninnu@M baaDi peddalainaTTi
aareeti@M daaLlapaakannamaachaaryula
chaeri yaelinayaTTi SreevaeMkaTanilaya Sara
saamavaedasaamagaana saptasvaramulanu
baamutO neesati ninnu@M baaDinayaTTi
aamukonna taaLlapaakannamaachaaryula
vaemaru mechchina SreevaeMkaTanilayaa Sara
</poem>
{{Annamayya-box-bottom}}
===బయటి లింకులు===
[https://annamayya-u.blogspot.com/2010/10/saranamti-maatani.html Sarananti matani - శరణంటి మాతని by GBKP]
----
{{అన్నమయ్య పాటలు}}
[[Category:అన్నమయ్య పాటలు ]]
f6uhfrbx0yorufmam095spcd2j3r4dg
557037
557036
2026-05-26T04:00:30Z
Dglasri
7328
557037
wikitext
text/x-wiki
{{Annamayya-box1-top|శరణంటి మాతని (రాగం: ) (తాళం : )}}
<poem>
శరణంటి మాతని సమ్మంధమునఁ జేసి
మరిగించి మము నేలి మన్నించవే ॥పల్లవి॥
సకలవేదములు సంకీర్తనలు చేసి
ప్రకటించి నినుఁ బాడి పావనుఁడైనఁ-
అకలంకుఁడు తాళ్లపాకన్నమాచార్యుల
వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ ॥శర॥
నారదాది సనకసనందనాదులవలె
పేరుపడి నిన్నుఁ బాడి పెద్దలైనట్టి
ఆరీతిఁ దాళ్లపాకన్నమాచార్యుల
చేరి యేలినయట్టి శ్రీవేంకటనిలయ ॥శర॥
సామవేదసామగాన సప్తస్వరములను
బాముతో నీసతి నిన్నుఁ బాడినయట్టి
ఆముకొన్న తాళ్లపాకన్నమాచార్యుల
వేమరు మెచ్చిన శ్రీవేంకటనిలయా ॥శర॥
</poem>
{{Annamayya-box-bottom}}
{{Annamayya-box2-top|SaraNaMTi maatani (Raagam: ) (Taalam: )}}
<poem>
SaraNaMTi maatani sammaMdhamuna@M jaesi
marigiMchi mamu naeli manniMchavae ||pallavi||
sakalavaedamulu saMkeertanalu chaesi
prakaTiMchi ninu@M baaDi paavanu@MDaina@M-
akalaMku@MDu taaLlapaakannamaachaaryula
vekaliyai yaelina SreevaeMkaTanilaya ||Sara||
naaradaadi sanakasanaMdanaadulavale
paerupaDi ninnu@M baaDi peddalainaTTi
aareeti@M daaLlapaakannamaachaaryula
chaeri yaelinayaTTi SreevaeMkaTanilaya ||Sara||
saamavaedasaamagaana saptasvaramulanu
baamutO neesati ninnu@M baaDinayaTTi
aamukonna taaLlapaakannamaachaaryula
vaemaru mechchina SreevaeMkaTanilayaa ||Sara||
</poem>
{{Annamayya-box-bottom}}
===బయటి లింకులు===
[https://annamayya-u.blogspot.com/2010/10/saranamti-maatani.html Sarananti matani - శరణంటి మాతని by GBKP]
----
{{అన్నమయ్య పాటలు}}
[[Category:అన్నమయ్య పాటలు ]]
slw5lkq51vsvgfu3gol5hd7nope9zct
కర్మ యోగము
0
2239
557015
556996
2026-05-25T13:26:32Z
రవిచంద్ర
146
/* జ్యాయసీ చేత్కర్మణస్తే మతా */ అక్షర దోష సవరణ
557015
wikitext
text/x-wiki
{{header3
| title = [[భగవద్గీత - తెలుగు అనువాదము]]
| author =
| section = {{PAGENAME}}
| translation = [[అథ తృతీయోऽధ్యాయః |సంస్కృత శ్లోకములు]]
}}
===జ్యాయసీ చేత్కర్మణస్తే మతా ===
అర్జున ఉవాచ
జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన|
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ|| 3-1 ||
అర్జునుడు ఇలా అన్నాడు;
జనార్ధనా! నీ అభిప్రాయంలో కర్మ కంటే జ్ఞానమే ఎక్కువైతే కేశవా! ఘోరకర్మలో నన్ను ఎందుకు నియోగించుతావు?
===వ్యామిశ్రేణేవ వాక్యేన ===
వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే|
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోऽహమాప్నుయామ్|| 3-2 ||
అయోమయమైన మాటలతో నా బుద్ధికి భ్రాంతిని కలిగిస్తున్నావు.ఏది నాకు శ్రేయమో దానిని నిశ్చయముగా చెప్పు.
===లోకేऽస్మిన్ ద్వివిధా నిష్ఠా ===
శ్రీభగవానువాచ|
లోకేऽస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ|
జ్ఞానయోగేన సాఙ్ఖ్యానాం కర్మయోగేన యోగినామ్|| 3-3 ||
భగవంతుడు ఇలాపలికాడు;
పాప రహితుడా ఈ లోకంలో సాంఖ్యులకు జ్ఞానయోగం చేతను యోగులకు కర్మయోగం చేతను సాధన, సృష్టికి ముందే నాచేత చెప్పబడినది.
===న కర్మణామనారమ్భాన్నైష్కర్మ్యం===
కర్మలను చేయనంత మాత్రాన నిష్కర్మ సిద్ధి కలగదు.కేవలం సన్యసించడం వలన సరైన సిద్ధి కలగదు.
===న హి కశ్చిత్క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్|===
న కర్మణామనారమ్భాన్నైష్కర్మ్యం పురుషోऽశ్నుతే|
న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి|| 3-4 ||
ఎవరూ ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు.ప్రకృతి జన్యమైన గుణాల వలన అన్ని కర్మలు అవశ్యంగానే చేయబడుతున్నాయి.
===కర్మేన్ద్రియాణి సంయమ్య య ===
కర్మేన్ద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్|
ఇన్ద్రియార్థాన్విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే|| 3-6 ||
ఎవరైతే కర్మేంద్రియాలను నిగ్రహించి మనస్సులో ఇంద్రియ విషయాలను స్మరిస్తూ ఉంటాడో,అతడు పరమ మూర్ఖుడు,కపటాచారి అని పిలవ బడతాడు.
===యస్త్విన్ద్రియాణి మనసా===
యస్త్విన్ద్రియాణి మనసా నియమ్యారభతేऽర్జున|
కర్మేన్ద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే|| 3-7 ||
అర్జునా;జ్ఞానేంద్రియాలను మనస్సు ద్వారా నిగ్రహించి,కర్మేంద్రియాల ద్వారా అసక్త భావంతో కర్మయోగాన్ని ఎవరు ప్రారంభిస్తాడో అతడు విశిష్టుడు అవుతాడు.
===నియతం కురు కర్మ త్వం===
నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః|
శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః|| 3-8 ||
నీ విధ్యుక్త కర్మని నీవు చెయ్యి;కర్మ మానడం కంటే కర్మ చేయడం మేలు.కర్మ చేయకపోతే శరీర యాత్ర జరగదు.
===యజ్ఞార్థాత్కర్మణోऽన్యత్ర===
యజ్ఞార్థాత్కర్మణోऽన్యత్ర లోకోऽయం కర్మబన్ధనః|
తదర్థం కర్మ కౌన్తేయ ముక్తసఙ్గః సమాచర|| 3-9 ||
కోసం చేసే కర్మలకంటే ఇతర కర్మలతో ఈ లోకం బంధింప బడి ఉన్నది.కుంతీకుమారా యజ్ఞ కర్మలనే సంగమము వదిలి కర్మలను చక్కగా చెయ్యి.
===సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా===
సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః|
అనేన ప్రసవిష్యధ్వమేష వోऽస్త్విష్టకామధుక్|| 3-10 ||
యజ్ఞాలతో సహా ప్రజలను శృష్టించి ప్రజాపతి పూర్వం ఇలాచెప్పాడు.యజ్ఞం వలన మీరు వృద్ధి పొందండి.అది మీ ఇష్ట కామధేనువు.
===దేవాన్భావయతానేన===
దేవాన్భావయతానేన తే దేవా భావయన్తు వః|
పరస్పరం భావయన్తః శ్రేయః పరమవాప్స్యథ|| 3-11 ||
దేవతలను ఈ యజ్ఞంలో ఆరాధించండి.ఆదేవతలు మిమ్మలను అనుగ్రహిస్తారు.
===ఇష్టాన్భోగాన్హి వో దేవా===
ఇష్టాన్భోగాన్హి వో దేవా దాస్యన్తే యజ్ఞభావితాః|
తైర్దత్తానప్రదాయైభ్యో యో భుఙ్క్తే స్తేన ఏవ సః|| 3-12 ||
యజ్ఞం చేత ఆరాధించబడిన దేవతలు మీకు ఇష్ట భోగాలను ఇస్తారు.వారికి ఏమీ సమర్పించకుండా వాళ్ళు ఇచ్చిన వాటిని అనిభవించేవాడు చోరుడే అవుతాడు .
===యజ్ఞశిష్టాశినః సన్తో===
యజ్ఞశిష్టాశినః సన్తో ముచ్యన్తే సర్వకిల్బిషైః|
భుఞ్జతే తే త్వఘం పాపా యే పచన్త్యాత్మకారణాత్|| 3-13 ||
యజ్ఞంలో దేవతలకు ఇవ్వగా మిగిలినది తినేసజ్జనుడు అన్ని పాపాలనుండి విముక్తుడు అవుతాడు.తమ కోసం మాత్రం ఎవరు వండు కునే పాపాత్ములు వాళ్ళు పాపాన్నే తింటారు.
===అన్నాద్భవన్తి భూతాని===
అన్నాద్భవన్తి భూతాని పర్జన్యాదన్నసమ్భవః|
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః|| 3-14 ||
అన్నము వలన జీవులు పుట్టును,అన్నము మేఘము వలన పుట్టును,మేఘము యజ్ఞము వలన పుట్టును,యజ్ఞము కర్మ వలననే సంబవము.
===కర్మ బ్రహ్మోద్భవం===
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్|
తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్|| 3-15 ||
కర్మ బ్రహ్మదేవుని వలన జనించినది ఆ బ్రహ్మ అనంతమైన పరమాత్మ వలన ఉద్భవించాడు.కాబట్టి సర్వ వ్యాపకమగు పర బ్రహ్మము నిత్యమూ యజ్ఞములో ప్రతిష్టితమై ఉంటుందని తెలుసుకో.
=== ఏవం ప్రవర్తితం చక్రం ===
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః|
అఘాయురిన్ద్రియారామో మోఘం పార్థ స జీవతి|| 3-16 ||
ఇలా పరిభ్రమించే చక్రాన్ని అనుసరించని వాడు పాపి,ఇంద్రియలోలుడు,అర్జునా;అతడు జీవించడం వ్యర్ధం.
===యస్త్వాత్మరతిరేవ===
యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః|
ఆత్మన్యేవ చ సన్తుష్టస్తస్య కార్యం న విద్యతే|| 3-17 ||
ఆత్మలోనే రమిస్తూ,ఆత్మలో తృప్తి పడుతూ,ఆత్మలోనే పరిపూర్ణ తృప్తిని పొందే వాడికి చేయదగిన కార్యమంటూ లేదు.
===నైవ తస్య కృతేనార్థో===
నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన|
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః|| 3-18 ||
అతడికి పని చేయడం వలన ప్రయోజనం కాని ,మానడంవలన దోషం ఏమీ ఉండదు.తన ప్రయోజనం కోసం సమస్త ప్రాణులలోనూ దేనిపైనా ఆధారపడడు.
===తస్మాదసక్తః సతతం===
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర|
అసక్తో హ్యాచరన్కర్మ పరమాప్నోతి పూరుషః|| 3-19 ||
అందుచే కర్మఫలములందు ఆసక్తి లేనివాడై తన ధర్మముగా భావించి మానవుడు కర్మ నాచరింపవలెను. ఆసక్తి లేకుండ పనిచేయుటచే మానవుడు పరమసత్యమును పొందును.
===కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా===
కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః|
లోకసంగ్రహమేవాపి సమ్పశ్యన్కర్తుమర్హసి|| 3-20 ||
జనకుడు మొదలైన వారు(నిస్కామ)కర్మల ద్వారానే మోక్షాన్ని పొందారు.లోకకల్యాణాన్ని దృష్టిలో ఉంచుకుని అయినా కర్మ చేయడమే నీకు తగును.
===యద్యదాచరతి===
యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః|
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే|| 3-21 ||
శ్రేష్టుడు దేనినైతే ఆచరిస్తాడో దానినే ఇతర జనులు ఆచరిస్తారు.అతడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే లోకం అనుసరిస్తుంది.
===న మే పార్థాస్తి కర్తవ్యం===
న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కిఞ్చన|
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి|| 3-22 ||
అర్జునా నాకు ఈ మూడు లోకాలలో చేయవలసిన పని లేదు.ఇంతకు ముందు పొందకుండా ఉన్నది ముందు పొందవలసినది ఏమీలేదు.అయిననూ కర్మలలో వర్తిస్తాను.
===యది హ్యహం న వర్తేయం===
యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతన్ద్రితః|
మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః|| 3-23 ||
అర్జునా;నేను విశ్రాంతి లేకుండా నిరంతరం పని చేయకపోతే,మనుష్యులు అన్ని విధాల నామార్గమే అనుసరిస్తారు.
===ఉత్సీదేయురిమే లోకా===
ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్|
సఙ్కరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః|| 3-24 ||
నేను కర్మలు చేయకపోతే ఈలోకాలన్నీ నశించి పోతాయి.వర్ణ సంకరానికి కారకుడనౌతాను.ఈ ప్రజలను నాశనం చేసిన వాడనౌతాను.
===సక్తాః కర్మణ్యవిద్వాంసో===
సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వన్తి భారత|
కుర్యాద్విద్వాంస్తథాసక్తశ్చికీర్షుర్లోకసంగ్రహమ్|| 3-25 ||
అర్జునా;అజ్ఞానులు కర్మతో మునిగి తేలుతూ ఎలా పని చేస్తారో వివేకి లోక శ్రేయస్సు కోరుతూ అలాగే పని చేయాలి.
===న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం===
న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసఙ్గినామ్|
జోషయేత్సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్|| 3-26 ||
కర్మలలో ఇరుక్కు పోయిన అజ్ఞానుల బుద్ధిని వివేకి చెదర కొట్టరాదు.తాను యోగంలో నిలిచి చక్కగా పని చేస్తూ వాళ్ళని ఆ మార్గంలో నడుస్తూ కర్మలాచరించేలా ప్రోత్సహించాలి.
===ప్రకృతేః క్రియమాణాని===
ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః|
అహఙ్కారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే|| 3-27 ||
ప్రకృతి గుణాల వలన అన్ని కర్మలు నిర్వహింప బడతాయి.అహంకార వలన భ్రమించిన మూఢుడూ తానే కర్తనని తలపోస్తాడు.
===తత్త్వవిత్తు మహాబాహో===
తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః|
గుణా గుణేషు వర్తన్త ఇతి మత్వా న సజ్జతే|| 3-28 ||
మహాబలుడా;గుణకర్మ విభాగాల తత్వం తెలిసిన వాడుగుణాలు గూణాలలో వర్తిస్తాయని తెలిసి ఆ కర్మలలో తగుల్కోడు.
===ప్రకృతేర్గుణసంమూఢాః ===
ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జన్తే గుణకర్మసు|
తానకృత్స్నవిదో మన్దాన్కృత్స్నవిన్న విచాలయేత్|| 3-29 ||
ప్రకృతి యొక్క గుణాల వలన మోహంలో పడిన వారు గుణ కర్మలలో మునుగుతుంటారు.సరిగా తెలియని మంద బుద్ధులను సర్వం తెలిసిన జ్ఞాని చెదర కొట్టరాదు.
===మయి సర్వాణి కర్మాణి ===
మయి సర్వాణి కర్మాణి సంన్యస్యాధ్యాత్మచేతసా|
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః|| 3-30 ||
సర్వ కర్మలను నాయందు సమర్పించి,చిత్తాన్ని ఆత్మలో నిలిపి,ఆశా మమకారాలను వదిలి,ఆరాటాన్ని విసర్జించి యుద్ధం చెయ్యి.
===యే మే మతమిదం ===
యే మే మతమిదం నిత్యమనుతిష్ఠన్తి మానవాః|
శ్రద్ధావన్తోऽనసూయన్తో ముచ్యన్తే తేऽపి కర్మభిః|| 3-31 ||
నాయీ మతాన్ని ఏమానవులు మత్సరం లేకుండా ఆచరిస్తారో వాళ్ళు కూడా కర్మల నుండి విడుదల పొందుతారు.
===యే త్వేతదభ్యసూయన్తో===
యే త్వేతదభ్యసూయన్తో నానుతిష్ఠన్తి మే మతమ్|
సర్వజ్ఞానవిమూఢాంస్తాన్విద్ధి నష్టానచేతసః|| 3-32 ||
ఎవరైతే అసూయాపరులై నా ఈ మతాన్ని అనుష్టించరో ఆ తెలివితక్కువ వాళ్ళు సర్వ జ్ఞానములనుండి వంచితులై నశించిపోతారని తెలుసుకో.
===సదృశం చేష్టతే స్వస్యాః===
జ్ఞానవంతుడైనా తన ప్రకృతి ననుసరించే వ్యవహరిస్తాడు.ప్రాణులు తమ ప్రకృతిని అనుసరిస్తాయి.నిగ్రహమేమి చేస్తుంది.
===ఇన్ద్రియస్యేన్ద్రియస్యార్థే ===
ప్రతి ఇంద్రియ విషయంలోను రాగాద్వేషాలు ఉంటాయి కర్మయోగి వాటికి లోబడ రాదు.అవే అతనికి శత్రువులు.
===శ్రేయాన్స్వధర్మో విగుణః===
బాగా ఆచరించిన పర ధర్మం కన్నా లోపభూయిష్టమైనది ఐనా స్వధర్మం మేలు.పర ధర్మం భయంకర మైనది.
===అథ కేన ప్రయుక్తోऽయం===
అర్జునుడు ఇలాఅడిగాడు;
కృష్ణా ఇష్టం లేకపోయినా ఎవరో బలవంత పెడుతున్నట్లు మానవుడు పాపం ఎందుకు చేస్తున్నాడు?ఆ ప్రేరణశక్తి ఎవరిది?ఎవరి కారణంగా పాపం చేస్తాడు?
===కామ ఏష క్రోధ ఏష ===
శ్రీ భగవానుడన్నాడు;
ఇవి కామము,క్రోధము,రజోగుణం నుండి ఉద్భవిస్తాయి.దానికి మహా ఆకలి.అది పాపిష్టిది.ఈలోకంలో అందరికి అదేశత్రువని తెలుసుకో.
===ధూమేనావ్రియతే===
అగ్నిని పొగ ఆవరించినట్లు,అద్దాన్ని దుమ్ము కప్పినట్లు,గర్భస్త శిశువుని మావి కప్పినట్లు జ్ఞానాన్ని కామం కప్పి వేస్తుంది.
===ఆవృతం జ్ఞానమేతేన===
కామం తృప్తి పరచడానికి వీలులేని అగ్ని వంటిది.ఇది జ్ఞానానికి నిత్య శత్రువు.దీనితోజ్ఞాని జ్ఞానం కప్పబడి ఉంటుంది.
===ఇన్ద్రియాణి మనో===
ఇంద్రియాలు మనస్సు,భుద్ధి,కామానికి ఆధార స్థానాలు అని చెప్పబడుతున్నాయి.ఈ కామం జ్ఞానాన్ని కప్పి వేసి ఇంద్రియాల ద్వారా దేహధారిని వ్యామోహ పరుస్తుంది.
===తస్మాత్త్వమిన్ద్రియాణ్యాదౌ===
అందువలన భరత కుల శ్రేష్టుడా;ముందుగానీవు ఇంద్రియాలని నిగ్రహించి,జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే పాపిష్టి కామాన్ని నిర్మూలించు.
===ఇన్ద్రియాణి పరాణ్యాహురిన్ద్రియేభ్యః===
ఇంద్రియాలు గొప్పవని చెబుతారు.ఇంద్రియాలకన్నా అధికమైనది మనస్సు.మనస్సు కన్నాగొప్పది బుద్ధి,బుద్ధి కంటే శ్రేష్టమైనది ఆత్మ.
===ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా===
మహాబాహుడా ఇలా ఆత్మను బుద్ధికన్నా ఎక్కువైన దానిగా తెలుసుకొని నిన్ను నీవు నిగ్రహించుకొని,కామరూపి అయిన శత్రువుని జయించు.
{{header3
| title = [[భగవద్గీత - తెలుగు అనువాదము]]
| author =
| section =
| translation = [[అథ తృతీయోऽధ్యాయః |సంస్కృత శ్లోకములు]]
}}
{{భగవద్గీత}}
kjm5s9i2o4zd81xakzmbp71hz83j5p4
మహాప్రస్థానం/అద్వైతం
0
2301
557021
370643
2026-05-25T16:06:36Z
Prakashparvath
7335
557021
wikitext
text/x-wiki
{{మహాప్రస్థానం}}
ఆనందం అర్ణవమైతే,
అనురాగం అంబరమైతే----
అనురాగపు టంచులు చూస్తాం,
ఆనందపు లోతులు తీస్తాం. నీ కంకణ నిక్వాణంలో,
నా జీవన నిర్వాణంలో---
నీ మదిలో డోలు తూగీ,నా హృదిలో జ్వాలలు రేగీ---
నీ తలపున రేకులు పూస్తే,
నా వలపున బాకులు దూస్తే---
మరణానికి ప్రాణం పోస్తం,
స్వర్గానికి నిచ్చెన వేస్తాం.
హసనానికి రాణివి నీవై,
వ్యసనానికి బానిస నేనై---
విషమించిన మదీయ ఖేదం,
కుసుమించిన త్వదీయ మోదం---
విషవాయువులై ప్రసరిస్తే,
విరితేనియలై ప్రవహిస్తే---
ప్రపంచమును పరిహాసిస్తాం,
భవిష్యమును పరిపాలిస్తాం.
వాసంత సమీరం నీవై,
హేమంత తుషారం నేనై---
నీ ఎగిరిన జీవవిహంగం
నా పగిలిన మరణమృదంగం
చిగురించిన తోటలలోనో---
చితులుంచిన చోటులలోనో---
వలయుములై చలించునపుడే,
విలయుములై జ్వలించినపుడే---
కాలానికి కళ్ళేం వేస్తాం,
ప్రేమానికి గొళ్ళెం తీస్తాం
నీ మోవికి కావిని నేనై,
నా భావికి దేవివి నీవై---
నీ కంకణ నిక్వాణంలో,
నా జీవన నిర్వాణంలో,
ఆనందం అర్ణవమైతే,
అనురాగం అంబరమైతే---
ప్రపంచమును పరిహాసిస్తాం,
భవిష్యమును పరిపాలిస్తాం.
cxtqtohvhmitxf0pxz75t2zs9gydu5p
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/443
104
212148
557018
556998
2026-05-25T15:44:19Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557018
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
సంఘాలు, వ్యాపారుల పరిస్థితులు బాగుచేయడానికి వర్తక సంఘాలు నెలకొలిపినారు.
వెట్టిచాకిరికి వ్యతిరేకంగా తెలంగాణ పల్లెలు మేల్కొన్నాయి. ఆ రోజుల్లో అలుముకున్న గాంఢాంధకారంలో కాంతిరేఖ ఆంధ్ర జన సంఘం. ఈ సంఘాలన్నింటికి ఒకే కేంద్ర సంఘం వుండాలన్న సంకల్పంతో 1930లో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. యువ కార్యకర్తగా ఆంధ్రమహాసభల్లో 6వ సభవరకు కార్యకర్తగా పాల్గొని 1940 నాటి 7వ సభ
నాటికి కీలక స్థానానికి వచ్చారు.
ఈలోగా నెహ్రూ "డిస్కవరీ ఆఫ్ ఇండియా” జయప్రకాష్ నారాయణ గారి “సోషలిజం ఎందుకు” రచనలు చదివి, సోషలిజం వైపు ఆకర్షితులైనారు. అప్రకటిత కమ్యూనిస్ట్ పార్టీలో 1939 చివరిలో సభ్యులు అయినారు. 1941 సంవత్సరంలో చిలుకూరు సభకు ఆయన అధ్యక్షుడైనారు. ఆ అధ్యక్షోపన్యాసంలో జాతీయ, అంతర్జాతీయ సమస్యలను ప్రస్థావించి తమ కమ్యూనిస్ట్ దృక్పధంతో తెలంగాణలో వున్నటువంటి స్థానిక సమస్యలను కూడా
ప్రస్థావించారు. అప్పటిదాకా జరిగినటువంటి ఆంధ్ర మహాసభలకు భిన్నంగా ఇక్కడ రాజకీయ సమస్యలను
ప్రస్థావించడం ఈ సభయొక్క విశేషం.
అప్పటివరకు సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమిత మైనటువంటి ఆంధ్రమహాసభ అప్పటివరకు మహాధనులకు,
విద్యార్థులకే పరిమితమైనటు వంటి ఆంధ్ర మహాసభ ఈ సభతో ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడమనేది గమనించ
తగినటువంటి విశేషం. ఈలోగా బ్రిటీష్ వారు 1935లో ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు. మంత్రివర్గాలు ఏర్పడు తున్నాయి. ఆ ప్రభావంతో నిజాం రాష్ట్రంలో కూడా ఇటువంటి బాధ్యతాయుత ప్రభుత్వం రావాలనే ఆలోచన అనాటి నాయకులకు కలిగింది.
ఆ ఉద్దేశ్యంతోనే 1938లో స్టేట్ కాంగ్రెస్ ను స్థాపించుకోవాలనే అభిప్రాయం రాష్ట్ర నాయకులకు కలిగింది. రావి నారాయణ రెడ్డి, బూర్గుల రామకృష్ణారావు మొదలగు వారితో సన్నాహాక సంఘం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంఘం నుంచి సత్యాగ్రహం చేయాలనే నిర్ణయం కూడా జరిగింది. అయితే ఆనాటి నిజాం నిరంకుశపాలనలో సత్యాగ్రహానికి మించి ఆలోచించడం కూడా సాధారణమైన విషయం కాదు. తెలంగాణలో సత్యాగ్రహం చేయడానికి ముందుకు వచ్చిన ఏకైక యువకుడు రావి నారాయణ రెడ్డి.
1938 నవంబరులో సుల్తాన్ బజారులో జరిగిన సత్యాగ్రహంలో ఆయన అరెస్ట్ అయి 2నెలలు జైలుకెళ్ళారు. సంస్థాన చరిత్రలో ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించడం ఒక సాహసం. ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించి ఈరకంగా సత్యాగ్రహ
దళాలు జైలుకి వెళుతున్నాయన్న వార్త ప్రజలలో విశేష సంచలనాన్ని కలిగించింది. అయితే గాంధీ ఈ సత్యాగ్రహాన్ని
ఆపించారు. ఈలోగా ఆంధ్ర మహాసభ కార్యక్రమాలు జరుగుతూనే వున్నాయి. 1944లో రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభలో అతివాద, మితవాద వర్గాల మధ్య భిన్నమైన అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఆ తరువాత ఆంధ్ర మహాసభ రెండుగా చీలిపోయింది.
ఒకటి జాతీయ ఆంధ్రమహాసభ, రెండవది రావి నారాయణరెడ్డిగారి నాయకత్వంలో ఉన్న కమ్యూనిస్ట్ ఆంధ్రమహాసభ. కమ్యూనిస్ట్ పార్టి నాయకత్వంలో తెలంగాణలో జరిగిన రైతాంగ సాయుధ పోరాటం భూస్వామి వర్గాలకు వెన్నులో చలి పుట్టించింది. రైతులను జాగృతం చేయడంలో ఆపార్టీ జరిపిన కృషి తెలంగాణలో చారిత్రాత్మకమైంది.
భూస్వాముల ఆగడాలకు అడ్డుకట్టవేయాలంటే పోరాటం తప్ప వేరే మార్గం లేదని ఆంధ్ర మహాసభ అభిప్రాయ పడింది. గెరిల్లా యుద్ధం ప్రారంభించాలని తెలంగాణ రథసారథి రావి నారాయణ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీలోపల వున్న బి.ఎన్. రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి మొదలగువారు పోరాటం చేయాలని నిర్ణయించారు.
ఈ నాయకుల పిలుపు మేరకు తెలంగాణలో సాయుధ పోరాటం ఉదృతంగా ముందుకు సాగింది, బ్రహ్మాండమైన
ఈ పోరాటానికి రావి నారాయణరెడ్డి నాయకత్వం వహించారు. భారత స్వాతంత్య్ర సమరంలో తెలంగాణ సాయుధ పోరాటం సువర్ణాక్షరాలతో లిఖింప తగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పోరాటం ప్రఖ్యాతిగాంచింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ పోరాటం ఉదృతంగా ముందుకు సాగుతుంటే భయాందోళనకు గురైన నిజాం ప్రభుత్వం 1946 నవంబరులో కమ్యూనిస్ట్ పార్టీని<noinclude><references/>
{{rh|తెలంగాణ |422 | తేజోమూర్తులు}}</noinclude>
es2oxd91iqcfuxynsaf4cfsfyy42jco
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/444
104
212149
557019
553058
2026-05-25T15:54:06Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557019
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
నిషేదించింది. 1946 నుండి 1951 వరకు జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి రావి నారాయణరెడ్డి నాయకత్వం వహించారు.
1948 సెప్టెంబరు వరకు నైజాం పోలీసులు -ప్రజాకారులకు వ్యతిరేకంగా బ్రహ్మాండమైన పోరాటం జరిగింది. పోలీసు చర్య తరువాత కూడా ఈ పోరాటాన్ని కొనసాగించాలనే వాదనని రావి నారాయణ రెడ్డి తిరస్కరించారు.
సోషలిస్టు సమాజ స్థాపనకు హింసావాదమే ఏకైక లక్ష్యమన్న పిడివాదాన్ని ఆయన అంగీకరించలేదు. తెలంగాణ
రైతాంగ సాయుధ పోరాటంలో పోలీసు చర్యకంటే ముందు తక్కువమంది ప్రజలు మరణించారని, ప్రజలు వారిని
సమయస్ఫూర్తితో కాపాడు కున్నారని నారాయణ రెడ్డి అభిప్రాయ పడ్డారు.
పోలీసు చర్య తరువాత పార్టీ సభ్యులు, ముఖ్య నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో మరణించారని ఇది యదార్ధ సత్యమని నారాయణ రెడ్డి పలు సందర్భాలలో వ్యాఖ్యానించారు. యూనియన్ ప్రభుత్వ బలగాలు రంగంలోకి
దిగినపుడు పోరాటాన్ని నిలిపివేస్తే పార్టీకి ఎక్కువ నష్టం జరిగేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏమైతేనేమి
1951లో పోరాటాన్ని నిలిపివేయక తప్పలేదు.
పోరాటాన్ని ఆపినప్పటికి హెూలిస్టిక్ గా తరువాత జరిగిన సాయుధ పోరాటం గురించి, జరిగిన నష్టం గురించి,
కోల్పోయిన పార్టీ క్యాడర్ గురించి పార్టీ వేదికపై చర్చించక పోవడాన్ని కూడా రావి నారాయణ రెడ్డిగారు తప్పుపట్టారు.
హైద్రాబాద్ సంస్థానంలో వయోజన ఓటింగ్ ఆధారంగా ప్రజాస్వామిక ప్రభుత్వం స్థాపించటానికి ఈ పోరాటమే కారణ భూతమైంది. వెట్టిచాకిరి నుండి ప్రజలకు విముక్తి లభించడానికి, అక్కన్నదేవి వసూళ్ళు పోవడానికి ఈ పోరాటమే కారణం. తెలంగాణ సాయుధ పోరాటమే భూ సంస్కరణలు ప్రవేశపెట్టడానికి బాటలు వేసిందని రావి నారాయణ రెడ్డి అన్నారు.
భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని ఒక అభ్యుదయ కౌలుదారి చట్టం ఇక్కడ ప్రవేశ పెట్టడం కూడా ఈ పోరాట ఫలితమే. ఈ పోరాటం ద్వారా దాదాపు 10 లక్షల ఎకరాల భూమి పేదరైతుల స్వాధీనమైంది. రైతుల నుండి అక్రమంగా భూస్వాములు లాక్కున్న భూములను తిరిగి రైతులు స్వాధీనం చేసుకున్నారు.
ఉద్యమనేత, సాయుధ పోరాటయోధులకు తలమానికంగా నిలిచారు రావి నారాయణ రెడ్డి. ఆయన కేవలం సిద్ధాంతాలకు మాత్రమే పరిమితం కాలేదు ఆయన. తండ్రి 3వేల ఎకరాల భూస్వామి. అతనికి నలుగురు కొడుకులు.
రావి నారాయణ రెడ్డిగారు తనవంతుగా 700 ఎకరాల భూమివస్తే, అందులోనుంచి 500 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసారు. అంతటి ఉత్తమ సంస్కారుడు రావి నారాయణ రెడ్డి. ఈ సందర్భంలో ఆయన 5 సంవత్సరాల జైలు, రహస్య నిర్బంధాలను అనుభవించారు. ఈలోగా 1952లో జరిగిన తొలి సారత్రిక ఎన్నికల్లో నల్లగొండ పార్టీ నియోజకవర్గంలో పోటీచేసి భారతావని మొత్తంమీద ఏ వ్యక్తికి రానటువంటి అతిపెద్ద మెజారిటీతో ఎన్నికై భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ద్వారా పార్లమెంటులో ఘనసన్మానం పొందారు.
1957 ఎన్నికల్లో భువనగిరి నుంచి శాసనసభకు ఎన్నికై ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారు. 1962లో కూడా తిరిగి భువనగిరి నుండి పోటీ చేసి శాసన సభకు ఎన్నికయ్యారు.
ఒక సందర్భంలో సొంత తన బావమరిదితో పోటీచేసి, తన బావమరిదిని లెక్కచేయకుండా ఆయనమీద అఖండమైన
మెజారిటి సాధించి ఎన్నికైనారు.
చివరగా ఆయన 1967 నుండి స్వచ్ఛందంగా రాజకీయాల నుండి నిష్క్రమించారు. తెలంగాణలో మొదటి నుంచి చివరిదాకా తాను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలకు నిబద్దుడై దానికి కట్టుబడి జీవితాంతం రాజకీయాలతో
పున్నటువంటి నిష్కల్మష హదయుడు రావి నారాయణ రెడ్డి,<noinclude><references/>
{{rh|తెలంగాణ |423 | తేజోమూర్తులు}}</noinclude>
pc6442macijvzbno91v9slwqmswqi8h
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/445
104
212150
557020
553059
2026-05-25T16:01:30Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557020
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''121. సదాశివుడు '''</p>}}
{{right|- వఝల శివకుమార్}}
:తెలంగాణ బీళ్ళను తడిపిన
:గోదారి పాట సదాశివుడు
"తలాపునా పారుతుంది గోదారి, నీ చేనూ, నీ చెలుకా ఎడారి, రైతన్నా! నీ బతుకు అమాస, నీ చుట్టూ సిరులు
ఉన్నా నికేది దక్కదన్నా / నీ చేతిలోని బువ్వే నీ నోటి కందదన్నా / చేతికి మూతికి నడుమ గీత గీసిరన్నా /
మోసపోతివన్న అరిగోసపడితివన్నా "అంటూ ఆయన రాసిన పాట ఉద్యమానికి ఊపిరి పనిచేసింది. ఆ పాటే అందరినీ ఆలోచింపజేసే పోరు బాటైంది. ఆయన పాట దగాపడ్డ తెలంగాణ పల్లె జీవితాల చిత్రికైంది. నీళ్ళు, నిధులున్నా తెలంగాణలో ఎందుకు బతుకలేకపోతున్నామో... మోసం చేసిందెవరో తన కవిత్వం, పాటలతో ప్రజల్ని చైతన్యవంతం చేశారు.
తలాపున గోదావరి పారుతున్నా తెలంగాణ గొంతెండు తున్న తీరును తన గొంతెత్తి పాడిన గాయకుడు. ఎండి బీటలు వారిన తెలంగాణ బీళ్లను చూసి కన్నీళ్ళను సిరా చుక్కగా మార్చి పాలకులను ప్రశ్నించిన కవిగాయకుడు. బతికినంత కాలం తెలంగాణను పలవరించి, మన పాలన మనకే కావాలని నినదించిన ఉద్యమకారుడు అతని పాటలు విముక్తి ఉద్యమ సాంస్కృతిక కార్యాచరణకు చుక్కానిలా పని చేసినాయ్.
ఆయన కీ.శే. మల్లావఝల సదాశివుడు. ఉత్తర తెలంగాణా పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖని నుంచి పాటల శివుడిగా ప్రసిద్ధుడైన ఆయన తన రాతలనిండా జనసామాన్యం వాడుక భాషలో, చిన్న చిన్న పదాలతో లోతైన
భావాలను అగ్ని కీలలలాంటి భావనలను పలికించారు. పాఠశాలలోనూ పాటల శాలలోనూ తన గురువు స్వర్గీయ
చొప్పకట్ల చంద్రమౌళి అని, తన పాటలో తడీ, తండ్లాట, మార్ధవం తెలంగాణా మట్టి పెట్టిన భిక్ష అని సవినయంగా
చెప్పుకునేవాడాయన. సమాజాన్ని చూసి చేతనైనంతచేసి పాట రాసి పల్లవించమన్న ఒక ప్రజాపోరాటయోధుని
మాటనే బాటగా కదిలి, అతనిచ్చిన చూపుతోనే సమాజాన్ని చూసి సంక్షోభాల మూలాలను గ్రహించి ప్రజల పాలై
నినదించిన ప్రజా చైతన్య స్వరం సదాశివుడు.
తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించడానికి సైతం వెనుకాడుతున్న కాలంలో నిర్బంధాన్ని ధిక్కరించి నీటి వాటా
పంపిణీలో జరుగుతున్న అన్యాయాలమీద పాటను ఎక్కుపెట్టి తన తెగువను ప్రదర్శించిన కవి, గాయకుడు, బడిపంతులే అయినా, కష్టాల చీకట్లలో కూరుకుపోయి ఉన్నా, తాను బలహీనుడిని కాదూ, కలం గళం సంధించిన సంపూర్ణ మానవుడిని అని సగర్వంగా ప్రకటించుకున్నా తెలంగాణా తల్లి గుండె చప్పుడు ఆయన.<noinclude><references/>
{{rh|తెలంగాణ |424 | తేజోమూర్తులు}}</noinclude>
dcl7q6ewkgsicajlqvxb7b2bt6pv3ef
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/446
104
212151
557022
553060
2026-05-25T16:11:01Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557022
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
మలిదశ ఉద్యమానికి సాంస్కృతిక ప్రేరణలోని సమయంలో ఆయన పాటే ఉద్యమానికి చుక్కానిలా పనిచేసిం దనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆయన పాట దగాపడ్డ తెలంగాణ పల్లె జీవితాల చిత్రికైంది. నీళ్ళు, నిధులున్నా తెలంగాణలో ఎందుకు బతుకలేక పోతున్నామో, మోసం చేసిందెవరో తన కవిత్వం, పాటలతో ప్రజల్ని చైతన్యం చేశారు. సదాశివుడు పుట్టింది.
02-09-1943న కరీంనగర్ జిల్లా (నేడు పెద్దపల్లి జిల్లా) రామగుండం మండలంలోని మురుమూర్ గ్రామంలో తండ్రి.
వెంకట క్రిష్ణయ్య తల్లి లక్ష్మీనరసమ్మ. వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడైనా అప్పటి సామాజిక పరిస్థితుల్లో విప్లవ
మార్గం పట్టి రైతుకూలీ పోరాటాలు, యువజన సంఘాల నిర్మాణంలో కీలక పాత్ర వహించారు. అనంతరం సామాజిక
ఉద్యమాల్లో కొనసాగుతూనే ఉపాధ్యాయ సంఘాల నాయకత్వాన్ని, కూడా కొనసాగించారు.
20 ఏళ్ళ పాటు విప్లవ, అభ్యుదయ గీతాలెన్నింటిలో ఊపిరి పోశారు. ఆయన పాటలు నాటి పాలకులు తీరును
ప్రశ్నించినవే. వలస బతుకుల వలపోతకు అద్దంపట్టినట్టు ఆయన రచించి, గానం చేసిన "ఏమున్నదక్కా.. ఈ పార్టీ
మనకింక ఏమున్నదక్కా.. ఇళ్ళు సర్దుకున్న... ముల్లె సర్దుకున్న ఎళ్ళిపోతావున్నా ఈ ఊళ్ళే మనకింక ఏమున్న దక్కా” ఈ పాట వినని తెలుగోడు ఉండడు. ఆర్. నారాయణమూర్తి ఎర్రసైన్యం కోసం సదాశివుడు రాసిన ఈ పాట దిక్కులేని పక్షుల్లా వలసపోయే తెలంగాణా రైతుల వెతలను కట్టింది.
ఈ పాట గురించి చెప్పుతూ నేనూ ఊరు విడిచి ముల్లె సద్గురుకొని బయల్దేరిన్నాడు ఏ మట్టిమీది మమకారం తన
గాత్రాన్ని గద్దడం చేసిందో ఆ మమకారమే తన పాటకు అశృలిపిగా అమరిందని ఇవాళ ఆ వేదనే వలసల దుఃఖంగా
ప్రవహించిందని అంటాడు. దళారులు తమ దోపిడీ విధానాల కింద స్వార్ధ రాజకీయల అందతో అప్పుకింద భూమిని, ఇళ్ళనూ లాక్కుంటే అన్నీ పోగొట్టుకున్న రైతు గుండెకోత పాట నిలువెల్లా కన్నీటిస్నె కమ్ముకున్నది అంటాడు.
అంతేకాక "జాబిలమ్మకు జిలుగు పొగుల దుప్పటి కప్పిన చేతులివి" అంటూ చేనేత కార్మికుల జీవనశైలిని
అర్ధంగా వర్ణించాడాయన. వరకట్న రక్కసి కోరలకు బలవుతున్న ఆడబిడ్డల చూసి కళ్ళు చెమర్చాడాయన. చిన్న
వయస్సులోనే తనువు చాలిస్తున్న అబలలను చూసి "పారాణి అరలేదు చెల్లిలా... అప్పుడే నూరేళ్ళు నిండాయా చెల్లెలా? అని అన్నగా ఆక్రోశించాడు. ఇలా ఒక్కటని కాదు ఆయన పాటలన్నీ వినేవారి గుండెకు సూటిగా గుచ్చుకుంటాయి. ఆలోచనలు రగిలిస్తాయ్. ఆయన పాటల్లోని పల్లె వాతావరణం పల్లె ఆత్మకు అద్దంపడుతాది, పల్లె పాయిరానికి పాదాలు కడుగుతాది.
బతుకు తత్వాలను బతుకమ్మ గొప్పంగా పల్లె పాడిన పచ్చ పచ్చని పాటకు ఆనవాలు తానై ప్రతిధ్వనించిండు.
గత పాలకుల పన్నాగాలను ఎండగడుతూ "ఇంకుడు గుంతల ఇగురుంజెప్పవ్ అన్నో ఓరన్నా! మా చెరువు కుంటలను మింగిందెవరో చెప్పవేందిరోకన్నా! అంటాడు. రైతులూ, చేనేత కార్మికులూ, కూలీలూ, కష్టాలు పడుతున్న స్త్రీలూ, బాల కార్మికులూ, పల్లెలూ, రాజ్యం దౌష్ట్యానికి బలైన ఎందరో అమరులు సదాశివుడి పాటల్లో ప్రాణమున్న చరణాలైండ్రు.
వరంగల్ జనార్దనక్కు స్మృతిగీతాన్ని సమర్పిస్తూ” మహర్షీ నా తెలంగాణా వాల్మీకీ! వలసవాదం అణచివేత ఇంకా ఇకపై సాగవంటూ యుద్ధం ప్రకటించి / నేలకొరిగిన వీరుడా! పరాజితుల కోసం సాగిన నీ పాట మా దగ్గర స్వరంజీవిగా ఉంది / అది గాలై ఏరై హోరై / అంతటా విస్తరిస్తోంది... మా కోటి రతనాల వీణపై కదన
కుతూహలమై మోగుతుంది / అంటూ ఆయన దీక్షను తన గొంతుకెత్తుకొని ఉద్యమ ప్రస్థానానికి పునరంకితమౌతాడు.
తన పాటలను అభిమానించిన కాళోజీ, శివసాగర్ వంటి మహాకవులతో ప్రేమగా శివుడూ అని పిలిపించుకుని తనదైన
నడకను సార్థకం చేసుకున్నాడు.
కేవలం ఉద్యమ పాటలే కాకుండా 90వ దశకంలో కరీంనగర్ జిల్లాలో చేపట్టిన అక్షరాస్యత కార్యక్రమం అక్షర ఉజ్వల కోసం ఆయన ఎన్నో పాటలు రాశారు. రాయడమే కాకుండా కంచుకంఠం లాంటి ఆయన గొంతుతో ఎన్నో వేదికల మీద స్వయంగా ఆలపించాడు. పారిశ్రామిక ప్రాంతంలో మరియు ఉత్తర తెలంగాణా పల్లెల్లో, కాలనీల్లో<noinclude><references/>
{{rh|తెలంగాణ |425 | తేజోమూర్తులు}}</noinclude>
5sthrduzc6tqfb2uhcthxrfpzjq7lj7
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/447
104
212152
557023
553061
2026-05-25T16:15:47Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557023
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
వఝల శివకుమార్తో కలిసి ఔత్సాహికులైన ఏలేశ్వరం వెంకటేశ్వర్లు వంటి యువకులను ప్రోత్సహించి వారి సహకారంతో పలు సాహిత్య సాంస్కృతిక సంస్థల స్థాపనలో ముఖ్య భూమికను పోషించాడు. గ్రంథాలయోద్యమంలో
చురుకుగా పాల్గొని ఊరూరా నిర్వహింపబడిన గ్రంథాలయ సభల్లో స్ఫూర్తివంతమైన తన ప్రసంగాలతో ప్రజలలో చైతన్య బీజాలు నాటారు.
స్వయంగా ప్రజా సాంస్కృతికోద్యమ నిర్మాణంలో భాగంగా చేతన సాహితి సాంస్కృతిక సమాఖ్యను స్థాపించి ఎందరో గాయనీ గాయకులను తీర్చిదిద్దారు. పారిశ్రామిక ప్రాంతంలోని ఎందరో ప్రసిద్ధ గాయకుల గొంతుల్లో పాటలై
పరవళ్ళు తొక్కాడు.
సదాశివుడు రాసిన పాటలను ఎర్రకుంకుమ పేరుతో ఆడియో క్యాసెట్, పుస్తకం, సైరన్ పేరుతో ఆయన కవితలను
పుస్తక రూపంలోకి తీసుకువచ్చారు. ఎర్రకుంకుమతో పాటై పోటెత్తిన శివుడు కాలేరన్నల నిత్యఘర్షణలనూ, స్వేదనదుల్లో తడిపి ఆరేసుకుంటున్న బండకిందిబతుకుల పెనుగు లాటలనూ తన కవితా స్వరాలుగా ఈ సైరన్ కవితా సంపుటిలోనూ మోగించాడు. తెలంగాణా నేల విముక్తి కోసం పాటను ఉద్యమ బాటగా స్వీకరించి కలమెత్తి కవనమై, గొంతెత్తి నాదమైన ఈ కవి గాయక యోధుడు 2005 నవంబర్ 25న ఆకస్మికంగా తనువు చాలించాడు.
మనకు అమూల్యమైన తన పాటలను, కవితలనూ వదిలి ఆయన గొంతు మూగబోయింది. ఆయన పాట మాత్రం ఉద్యమమై తెలంగాణను మోసుకొచ్చింది.
<poem>
పల్లె గొంతు పెగిలితే పాట
నేల చెమ్మగిల్లితే పాట ఆ పాటే సదాశివుడు
ఎన్నెల కోనల ఊపిరి ధారలమీద
అక్షరాల అగ్ని కణం సదాశివుడు
కాలేరన్నల దిగులు చీకట్లమీద
జ్వలత్ కవనాల జైత్రయాత్ర సదాశివుడు.</poem>
2007 నుంచి ప్రతి ఏడాది సదాశివ స్మారక అవార్డులను సాంస్కృతిక రంగంలో రాణిస్తున్న వారికి అందజేస్తున్నారు. గోదావరిఖని కేంద్రంగా సదాశివుడి సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఏడాది ఒక సాహితీ మూర్తిని ఆయన స్మారక అవార్డుతో సత్కరిస్తున్నారు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |426 | తేజోమూర్తులు}}</noinclude>
evh7b91d0pk5bcwlv7yzecdrdzhs03b
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/448
104
212153
557024
553062
2026-05-25T16:24:21Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557024
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''122. సాహు '''</p>}}
{{right|-అన్నవరం దేవేందర్
ఆయన గోండు గూడెం వెలుగురేక. గిరిజనుల గుండె చప్పుడు. గిరిజనుల చరిత్రను లోకానికి అందించిన దర్మానికుడు అడవిలో వెలుగులు పంచిన సూర్యుడు ఆయన సాహు ఈ మారు పేరే గోండు భాషకుచెందినది అసలు పేరు శనిగరం వెంకటేశ్వర్లు ఆయన కవి రచయిత ఉద్యమకారుడు. ఇతడు వెలుగునాట ఆ మాటకు వస్తే అందరికీ పరిచయమైన 'కుమ్రం భీం' చరిత్రను గిరిజనుల మౌఖిక గాథల్లోంచి వెలికి తీసి అందించిన వారిలో ఆయన సహరచయిత. మరో కుమ్రం భీం నవలను సాహు, అల్లం రాజయ్యలు కల్సి 1984లో వెలువరించారు.
ఉద్యమాల్లో ఉండి గొప్ప సాహిత్యం సృష్టించినవారు అందరూ సాహిత్య చరిత్రలో ప్రాచుర్యం పొందకపోవచ్చు.
ఎందుకంటే వాళ్ళకు రచనలే అసలు పనికాదు. అసలు వృత్తి ఉద్యమం. అందునా రహస్యోద్యయం. ఆ కారణాల
వల్ల పాటలు కళలకు సాహిత్య స్రవంతికి కొంచెం తక్కువగానే తెలుస్తాయి. సాహు కథలు రాసిండు, పాటలు రాసిండు. తెలుగు, గోండు, హిందీ భాషల్లోనూ రాసి పాడిన గాయకుడు.
<poem>
"నీ కన్నీరు నా కన్నీరు
కలిగినోల్లకు పన్నీరాయె
ఒంటిగ నువ్వే శోకం పెడితే
ఎట్లా చిన్న తమ్మయా!</poem>
అని ఆయన రాసి పాడిన పాటలు 1980 దశకంలో ఊరూర ఉద్యమ వేదికల మీద అందరూ పాడుకున్నారు.
ఇదేకాకుండా వెట్టిదారిరి బానిసత్వండు వ్యతిరేకంగా జరిగి ఆందోళనల్లో పాటలీ ప్రధానం పాటలు జనం భాషలో
బాణిని పట్టుకొని ఆకట్టుకుంటాయి. ఆ పాటల్లో సమస్య పోరాటం పరిష్కారం ఉండవచ్చు అందువల్ల జానపద జనం
బాణీల్లో ఉన్న సాహిత్యం విస్తృతమయింది. అట్లనే
<poem>
"పొదల పొదల గట్ల నడుమ
పొడిచెనాళ్ళు చందమామ
కొమురెల్లి కొండల్లోనా! ఓ రాజన్న
కొలిమి అంటుకున్నదిరో... ఓ రాజన్న”</poem>
ఈ పాట ఆ కాలంలో రేతు కూలి సంఘాల విద్యార్థి సంఘాల్లో సభల్లో ఊరురిల్లో పాడేవారు. ఆ కాలంలో ఈ పాటలు ఎవరు రాసిండ్రో కూడా పేరు ప్రచారం అయ్యేది. కాదు జన నాట్యమండలి పాటలుగా ప్రసిద్ధమయ్యేవి. అనంతర కాలంలో ఇవి సాహు రాసిన పాటలు అనే విషయం అవగాహనకు వచ్చేది.
ఇట్లా సాహు అనేక పాటలు రాసినాడు. ఇంద్రవెల్లిలో గిరిజనుల సభ మీద కాల్పుల అనంతరం 'రగల్ జెండా'
అనే నృత్య రూపకం రూపొందించి కూడా సాహు ఈ ప్రదర్శన మొత్తం ఆదివాసీలపై జరుగుతున్న దోపిడి అంసాలు<noinclude><references/>
{{rh|తెలంగాణ |427 | తేజోమూర్తులు}}</noinclude>
fi1aaddntbx7d928eqbe4xsmjrck919
557039
557024
2026-05-26T04:05:51Z
A.Murali
3019
557039
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''122. సాహు '''</p>}}
{{right|-అన్నవరం దేవేందర్}}
ఆయన గోండు గూడెం వెలుగురేక. గిరిజనుల గుండె చప్పుడు. గిరిజనుల చరిత్రను లోకానికి అందించిన దర్మానికుడు అడవిలో వెలుగులు పంచిన సూర్యుడు ఆయన సాహు ఈ మారు పేరే గోండు భాషకుచెందినది అసలు పేరు శనిగరం వెంకటేశ్వర్లు ఆయన కవి రచయిత ఉద్యమకారుడు. ఇతడు వెలుగునాట ఆ మాటకు వస్తే అందరికీ పరిచయమైన 'కుమ్రం భీం' చరిత్రను గిరిజనుల మౌఖిక గాథల్లోంచి వెలికి తీసి అందించిన వారిలో ఆయన సహరచయిత. మరో కుమ్రం భీం నవలను సాహు, అల్లం రాజయ్యలు కల్సి 1984లో వెలువరించారు.
ఉద్యమాల్లో ఉండి గొప్ప సాహిత్యం సృష్టించినవారు అందరూ సాహిత్య చరిత్రలో ప్రాచుర్యం పొందకపోవచ్చు.
ఎందుకంటే వాళ్ళకు రచనలే అసలు పనికాదు. అసలు వృత్తి ఉద్యమం. అందునా రహస్యోద్యయం. ఆ కారణాల
వల్ల పాటలు కళలకు సాహిత్య స్రవంతికి కొంచెం తక్కువగానే తెలుస్తాయి. సాహు కథలు రాసిండు, పాటలు రాసిండు. తెలుగు, గోండు, హిందీ భాషల్లోనూ రాసి పాడిన గాయకుడు.
<poem>
"నీ కన్నీరు నా కన్నీరు
కలిగినోల్లకు పన్నీరాయె
ఒంటిగ నువ్వే శోకం పెడితే
ఎట్లా చిన్న తమ్మయా!</poem>
అని ఆయన రాసి పాడిన పాటలు 1980 దశకంలో ఊరూర ఉద్యమ వేదికల మీద అందరూ పాడుకున్నారు.
ఇదేకాకుండా వెట్టిదారిరి బానిసత్వండు వ్యతిరేకంగా జరిగి ఆందోళనల్లో పాటలీ ప్రధానం పాటలు జనం భాషలో
బాణిని పట్టుకొని ఆకట్టుకుంటాయి. ఆ పాటల్లో సమస్య పోరాటం పరిష్కారం ఉండవచ్చు అందువల్ల జానపద జనం
బాణీల్లో ఉన్న సాహిత్యం విస్తృతమయింది. అట్లనే
<poem>
"పొదల పొదల గట్ల నడుమ
పొడిచెనాళ్ళు చందమామ
కొమురెల్లి కొండల్లోనా! ఓ రాజన్న
కొలిమి అంటుకున్నదిరో... ఓ రాజన్న”</poem>
ఈ పాట ఆ కాలంలో రేతు కూలి సంఘాల విద్యార్థి సంఘాల్లో సభల్లో ఊరురిల్లో పాడేవారు. ఆ కాలంలో ఈ పాటలు ఎవరు రాసిండ్రో కూడా పేరు ప్రచారం అయ్యేది. కాదు జన నాట్యమండలి పాటలుగా ప్రసిద్ధమయ్యేవి. అనంతర కాలంలో ఇవి సాహు రాసిన పాటలు అనే విషయం అవగాహనకు వచ్చేది.
ఇట్లా సాహు అనేక పాటలు రాసినాడు. ఇంద్రవెల్లిలో గిరిజనుల సభ మీద కాల్పుల అనంతరం 'రగల్ జెండా'
అనే నృత్య రూపకం రూపొందించి కూడా సాహు ఈ ప్రదర్శన మొత్తం ఆదివాసీలపై జరుగుతున్న దోపిడి అంసాలు<noinclude><references/>
{{rh|తెలంగాణ |427 | తేజోమూర్తులు}}</noinclude>
ob2kzlm6j7sswl2j6cpj209yitqaadu
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/449
104
212154
557040
553063
2026-05-26T04:14:30Z
A.Murali
3019
557040
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>
త్యాగాలపై అక్కడ జరుగుతున్న నైజాన్ని కళ్ళకు కట్టినట్లురూపొందించారు. ఈ 'రగల్ జెండా' వందలుకాదు ఆరోజుల్లో వేలాది ప్రదర్శనలు జరిగాయి.
సాహు అసలు పేరు శనిగరం వెంకటేశ్వర్లు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని మాణిక్యాపూర్లో 1955 అక్టోబర్ 2 గాంధీ మహాత్ముని జన్మదినంనాడే జన్మించారు. ఆయన తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు. నైజాం వ్యతిరేక పోరాటంలో గాంధేయ వర్గం అవలంబించిన మహనీయుడు. మాణిక్యాపూర్ గ్రామమే మొత్తం స్వాతంత్య్ర పోరాట వారసత్వం పుణికిపుచ్చుకున్నది. అక్కడి నుంచి ఎంతోమంది పూర్తిస్థాయి ఉద్యమ కార్యకర్తలుగా జీవితాల్ని త్యాగం చేసినవారున్నారు. వెరసి సాహు పూర్తిస్థాయి రాజకీయ జీవితంలోకి వెళ్ళి మనకు 'కొమురంభీం'ను అందించిన రచయిత.
1980కి ముందు మనందరికీ మన్యంలో అల్లూరిసీతారామరాజు గురించే తెలుసుకాని మన నేలమీదనే నిజం
రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొమురంభీం గుర్చి తెలియదు. ఇప్పుడైతే పాఠ్యపుస్తకాల్లో ప్రభుత్వ రికార్డుల్లో ఆదివాసి గిరిజన వీరున్ని తలచుకొని గౌరవిస్తున్నాం. అసలు కొమురంభీం గూర్చి ప్రపంచానికి సాహు, అల్ల రాజయ్యలు రాసిన నవలద్వారానే తెల్సింది. సాహు అజ్ఞాత జీవితంలో ఉండగా గొండు భాష
నేర్చుకున్నారు.
1979 ప్రాంతంలో ఆదిలాబాద్ అడవుల్లో అజ్ఞాతంలో ఉన్న క్రమంలో 'భీం' పోరాటం గూర్చి మాట్లాడుకోవడం
విన్నాడు. ఆయనకు అప్పటికే గొండు భాష తెల్సుకాబట్టి ఒక రచయితగా పరిశోధకుడుగా ఆయన పుట్టింది, పెరిగింది, పోరాటం చేసింది, ఆయా గోండు నాయకుల ద్వార కొమురంభీ, వారసుల ద్వారా రీసెర్చి చేసిండు.
ప్రఖ్యాత కథ, నవలా రచయిత అల్లం రాజయ్యతో చంద్ర పంచుకున్న ఇద్దరూ కల్సి నవలకు శ్రీకారం చుట్టిండ్రు.
ఇది 1983లో పుస్తకంగా బయటకు వచ్చింది. కొమురంభీం 1940లోనే అమరుడయ్యిండు. ఆనాటి పచ్చ పచ్చ జ్ఞాపకాల చరిత్రను వెలికితీసిన తర్వాత ఆయన ఆదివాసుల హక్కుల కోసం రాజ్యంపై తుపాకితో యుద్ధం చేసిన చరిత్రగా లోకానికి తెల్చింది. అనంతరం ఇదే కథ సినిమాగా కూడ వచ్చింది. ఇప్పుడు కామురంభీం విగ్రహాలు అంతటా కన్పిస్తున్నాయి.
సాహు, అల్లం రాజయ్య వెలికి తీసిన చరిత్రాత్మకమైన
చరిత్ర ఇది. ఇది గాకుండా సాహు ఎన్నో కథలు రాసిండు.
కరీంనగర్ బుక్ ట్రస్టీ వారు 1886లో వెలువరించిన 'అడవిలో
వెన్నెల' కథా సంకలనంలో కన్నీటి నీటికథ, పెళ్ళికావాలి,
కాయిదా, సాంప్రదాయం, ఐదు రూపాయల కథ, భూమి
కొరకు, రక్తపింజెర, జెండా కథ, ఆకలి, మరడ్యడుం
పాయం. నిర్ణయం కథలు ప్రఖ్యాతమైనవి. అవి కథలు అనే
కంటే ఆదివాసి జీవితాలు అంటే బాగుంటుంది.
సాహు విద్యార్థిదశలో ఉన్నప్పుడే విప్లవ రాజకీయ
అవగాహన ఏర్పరుచుకున్నాడు. 1975లో హుజురాబాద్లో
'జనసాహితీ సంస్థను అవునురి సమ్మయ్య, నరెడ్ల శ్రీనివాస్
తదితర మిత్రులతో కల్సి స్థాపించారు 1978లోనే మహా
కవి శ్రీశ్రీని హజూరాబాద్కు ఆహ్వానంచి బహిరంగ సభ
ఏర్పాటు చేశారు. అదే సభలో శ్రీశ్రీ ఊగరా ఊగరా ఊరి
కొయ్యందుకొని ఊగరా అనే పాటను రాసి పాడారు.
హుజురాబాద్ పురవీధులగుండా సాహు, ఆవునూరి
సమ్మయ్య తదితరులు ఊరేగింపు తీసారు. అనంతరం సాహు
విప్లవరాజకీయల్లోకిపోయి 1976లో 'మీసా చట్టం కింద
డిటెన్యూ అయి జైలుశిక్ష అనుభవించాడు. తిరిగి బెయిలుపై
1977లో బయటికి వచ్చారు. హుస్నాబాద్ ప్రాంతంలో
అడవిలోకి వెళ్ళారు. అప్పుడే అడవిలో 'గొండు' భాషను
అభ్యసించాడు.
జైలు జీవితంపై కూడా సాహు ఎన్నో కథలు రాసారు.
జైలులో 'బందీ' అనే రాత పత్రికను వెలువరించారు.
ఇంద్రవెల్లిలో గిరిజనులపై పోలీసు కాల్పుల అనంతరం
'రగలెండా' అనే బ్యాలెను రచించారు. రగల్ జెండా బ్యాలెను
దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జన నాట్యమండలి
ప్రదర్శించింది. సాహు తెలుగు, హిందీ, గోండు భాషలోనూ
పాటలు రాశారు. రెండవసారి ఆదిలాబాద్లో 1983లో
అరెస్ట్ అయి వరంగల్, విశాఖపట్నం జైల్లలో గడిపారు.
జైలు నుంచి 1988 లో విడుదల అయ్యేవరకు విరసం
సభ్యునిగా కొనసాగారు.
అయయం చేయుటయు తెలంగాణ (428 తేజోమూర్తులు ఉండి<noinclude><references/>
{{rh|తెలంగాణ |428 | తేజోమూర్తులు}}</noinclude>
ivxelfh462jwt2fys7ad2gp4i1yaklm
557041
557040
2026-05-26T04:19:49Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557041
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
త్యాగాలపై అక్కడ జరుగుతున్న నైజాన్ని కళ్ళకు కట్టినట్లురూపొందించారు. ఈ 'రగల్ జెండా' వందలుకాదు ఆరోజుల్లో వేలాది ప్రదర్శనలు జరిగాయి.
సాహు అసలు పేరు శనిగరం వెంకటేశ్వర్లు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని మాణిక్యాపూర్లో 1955 అక్టోబర్ 2 గాంధీ మహాత్ముని జన్మదినంనాడే జన్మించారు. ఆయన తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు. నైజాం వ్యతిరేక పోరాటంలో గాంధేయ వర్గం అవలంబించిన మహనీయుడు. మాణిక్యాపూర్ గ్రామమే మొత్తం స్వాతంత్య్ర పోరాట వారసత్వం పుణికిపుచ్చుకున్నది. అక్కడి నుంచి ఎంతోమంది పూర్తిస్థాయి ఉద్యమ కార్యకర్తలుగా జీవితాల్ని త్యాగం చేసినవారున్నారు. వెరసి సాహు పూర్తిస్థాయి రాజకీయ జీవితంలోకి వెళ్ళి మనకు 'కొమురంభీం'ను అందించిన రచయిత.
1980కి ముందు మనందరికీ మన్యంలో అల్లూరిసీతారామరాజు గురించే తెలుసుకాని మన నేలమీదనే నిజం రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొమురంభీం గుర్చి తెలియదు. ఇప్పుడైతే పాఠ్యపుస్తకాల్లో ప్రభుత్వ రికార్డుల్లో ఆదివాసి గిరిజన వీరున్ని తలచుకొని గౌరవిస్తున్నాం. అసలు కొమురంభీం గూర్చి ప్రపంచానికి సాహు, అల్ల రాజయ్యలు రాసిన నవలద్వారానే తెల్సింది. సాహు అజ్ఞాత జీవితంలో ఉండగా గొండు భాష నేర్చుకున్నారు.
1979 ప్రాంతంలో ఆదిలాబాద్ అడవుల్లో అజ్ఞాతంలో ఉన్న క్రమంలో 'భీం' పోరాటం గూర్చి మాట్లాడుకోవడం
విన్నాడు. ఆయనకు అప్పటికే గొండు భాష తెల్సుకాబట్టి ఒక రచయితగా పరిశోధకుడుగా ఆయన పుట్టింది, పెరిగింది, పోరాటం చేసింది, ఆయా గోండు నాయకుల ద్వార కొమురంభీ, వారసుల ద్వారా రీసెర్చి చేసిండు.
ప్రఖ్యాత కథ, నవలా రచయిత అల్లం రాజయ్యతో చంద్ర పంచుకున్న ఇద్దరూ కల్సి నవలకు శ్రీకారం చుట్టిండ్రు.
ఇది 1983లో పుస్తకంగా బయటకు వచ్చింది. కొమురంభీం 1940లోనే అమరుడయ్యిండు. ఆనాటి పచ్చ పచ్చ జ్ఞాపకాల చరిత్రను వెలికితీసిన తర్వాత ఆయన ఆదివాసుల హక్కుల కోసం రాజ్యంపై తుపాకితో యుద్ధం చేసిన చరిత్రగా లోకానికి తెల్చింది. అనంతరం ఇదే కథ సినిమాగా కూడ వచ్చింది. ఇప్పుడు కామురంభీం విగ్రహాలు అంతటా కన్పిస్తున్నాయి.
సాహు, అల్లం రాజయ్య వెలికి తీసిన చరిత్రాత్మకమైన చరిత్ర ఇది. ఇది గాకుండా సాహు ఎన్నో కథలు రాసిండు.
కరీంనగర్ బుక్ ట్రస్టీ వారు 1886లో వెలువరించిన 'అడవిలో వెన్నెల' కథా సంకలనంలో కన్నీటి నీటికథ, పెళ్ళికావాలి, కాయిదా, సాంప్రదాయం, ఐదు రూపాయల కథ, భూమి కొరకు, రక్తపింజెర, జెండా కథ, ఆకలి, మరడ్యడుం పాయం. నిర్ణయం కథలు ప్రఖ్యాతమైనవి. అవి కథలు అనే కంటే ఆదివాసి జీవితాలు అంటే బాగుంటుంది.
సాహు విద్యార్థిదశలో ఉన్నప్పుడే విప్లవ రాజకీయ అవగాహన ఏర్పరుచుకున్నాడు. 1975లో హుజురాబాద్లో 'జనసాహితీ సంస్థను అవునురి సమ్మయ్య, నరెడ్ల శ్రీనివాస్ తదితర మిత్రులతో కల్సి స్థాపించారు 1978లోనే మహాకవి శ్రీశ్రీని హజూరాబాద్కు ఆహ్వానంచి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అదే సభలో శ్రీశ్రీ ఊగరా ఊగరా ఊరి కొయ్యందుకొని ఊగరా అనే పాటను రాసి పాడారు. హుజురాబాద్ పురవీధులగుండా సాహు, ఆవునూరి సమ్మయ్య తదితరులు ఊరేగింపు తీసారు. అనంతరం సాహు విప్లవరాజకీయల్లోకిపోయి 1976లో 'మీసా చట్టం కింద డిటెన్యూ అయి జైలుశిక్ష అనుభవించాడు. తిరిగి బెయిలుపై 1977లో బయటికి వచ్చారు. హుస్నాబాద్ ప్రాంతంలో అడవిలోకి వెళ్ళారు. అప్పుడే అడవిలో 'గొండు' భాషను అభ్యసించాడు.
జైలు జీవితంపై కూడా సాహు ఎన్నో కథలు రాసారు. జైలులో 'బందీ' అనే రాత పత్రికను వెలువరించారు.
ఇంద్రవెల్లిలో గిరిజనులపై పోలీసు కాల్పుల అనంతరం 'రగలెండా' అనే బ్యాలెను రచించారు. రగల్ జెండా బ్యాలెను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జన నాట్యమండలి ప్రదర్శించింది. సాహు తెలుగు, హిందీ, గోండు భాషలోనూ పాటలు రాశారు. రెండవసారి ఆదిలాబాద్లో 1983లో అరెస్ట్ అయి వరంగల్, విశాఖపట్నం జైల్లలో గడిపారు. జైలు నుంచి 1988 లో విడుదల అయ్యేవరకు విరసం సభ్యునిగా కొనసాగారు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |428 | తేజోమూర్తులు}}</noinclude>
rvmv4atvxqsvjszey4fnz6h5q7hft7h
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/450
104
212155
557042
553064
2026-05-26T04:22:16Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557042
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
సాహు అనంతరం బి.యస్. రాములుకు విప్లవ ఉద్యమాల సాహిత్యంపైన సామాజిక స్థితిగతుల లోటుపాట్లపై
ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన విభేదిస్తున్న అంశాలను ఏ కరువుపెట్టారు.
సాహు ఆదివాసి ప్రజల గుండెల చప్పుడు. గిరిజనుల్లో వెలుగు నింపేందుకు వాల్ల భాషలోనే ఆడి పాడి మాట్లాడి ఆ
చరిత్రలో లీనమయిన సాహు సాహసి. చరిత్రకారుడు చరిత్ర నిర్మాత.
1993 మార్చి 16న సాహు గుండె పోటుతో మాణిక్యాపురం గ్రామంలోనే కన్ను మూసాడు. అయితే ఆయన 'కొమురంభీం' జీవిత చరిత్రను వెలికితీసిన రచయితగ గొప్ప పాటల రచయితగా తెలుగు సమాజంలో సాహిత్యంలో పేరెన్నికగన్నాడు. సాహు ఒక వ్యక్తికాదు ఆదివాసులు శక్తి. అతడు తెలంగాణ వైభవానికి స్థంభం వంటివాడు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |429 | తేజోమూర్తులు}}</noinclude>
0w8wavdp6ksuei1grhocwf0dc2aka9n
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/451
104
212156
557043
553065
2026-05-26T04:30:43Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557043
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''123. సైబ పరంధాములు '''</p>}}
{{right|-కందాళై రాఘవాచార్య}}
పెద్దబజారు చిన్నసందులోని కళాత్మకమైన దర్వాజా లోంచి సన్నగా - సన్నని నడిమి పాపిట ఒత్తైన వెంట్రుకలతో, చేతిలో ఎన్నో పుస్తకాలతో స్టూడియో 'ఆకృతి'కి నడిచి వెళ్తుంటే కళా సెలయేరు పారుతున్నట్లనిపిస్తుండేది...
ఆ కళామూర్తే సైబ పరంధాములు.
కీ.శే. సైబ పరంధాములు, శ్రీ సైబ లింయ్య, శ్రీమతి గంగూబాయి దంపతులకు 08-4-1945న నిజామాబాద్
నగరంలో జన్మించారు.
అప్పటి మల్టీపర్పస్ లో చదివి గోల్డ్ మెడల్ సంపాదించారు. అనారోగ్య కారణాల వల్ల బి.టెక్. పూర్తి చేయలేక
పోయారు. ఇది ఒకవైపు వారి శారీరక కోణం. కాని వారి అంతరాంతరాల్లో అనేక కళలు సజీవంగా నడుస్తూ ఉండేవి.
కొంతకాలం శ్రీరాధాకృష్ణ విద్యాలయం ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా వారి అనంతమైన
కళాజీవనానిక ఆ వృత్తి కట్టేసినట్లుగా అనిపించింది. తానే స్వయంగా 'ఆకృతి' స్టూడియోను ప్రారంభించారు.
పూసలగల్లి - జవహరురోడ్లో ఉండే ఆ స్టూడియో, కళాకారులను, చిత్రకారులకు, కవులకు కూడలైంది. 'ఆకృతి'ని అందరి చిరునామాగా మార్చివేసిన కళామూర్తి సైబ. మనిషిలో ఒక కళ ఉంటేనే ఎంతో గొప్ప. సైబ పరంధాములులో కవిత్వం, చిత్రకళ, ఫోటోగ్రఫీ, నఖచిత్రం శిల్పం ఇలా అన్ని కళలు పూర్ణమై ఉన్నాయి.
1969 మకరసంక్రాంతి 14న ప్రారంభమైన ఇందూరు భారతి మూలస్తంభాలలో వీరు ముఖ్యులు. ఇందూరు భారతి
ద్వారా 'చౌరస్తా' కవితా సంకలనానికి వీరు చిత్రాలు గీశారు. ఇది సాహితీ చరిత్రలో అపూర్వఘట్టం. చౌరస్తా కవులని
తెలునాట సైబ, ఎ. సూర్యప్రకాష్, బద్ధూరి నరసింహం, శ్రీపాద స్వాతి సుప్రసిద్ధులు.
వీరి ఇంట్లోనే గ్రంథాలయం ఏర్పాటు చేశారు. యువ కవులకు కొత్త కొత్త కవితా సంకనాలు ఇక్కడి నుండే ప్రాప్తించేవి. అనేక మంది కవులకు మార్గదర్శకత్వం వహించేవారు. ఇందూరు భారతి అనేక గ్రంథాలకూ సైబ గీసిన బొమ్మలే ముఖ్యచిత్రాలు. చూస్తుండగానే మనిషి ముఖాకృతిని క్షణంలో పెన్సిల్తో చిత్రించేవారు.
టౌను హాలులో జుగల్బంది ఉత్సవంలో ఒక కళాకారుడు తబలా వాయిస్తుంటే దానికనుగుణంగా చిత్రాలు పెయింట్ చేశారు. ఈ అద్భుత చిత్రాలు ఇప్పటికి నిజామాబాద్ ఎఫ్.ఎమ్. ఆకాశవాణి కేంద్రంలో కుఢ్య చిత్రాలుగా మనకు సైబను జ్ఞాపకం చేస్తాయి. అనాటి ఉత్సవానికి కలెక్టర్ శంకరన్ విచ్చేసి సైబను అభినందించారు.
సైబ సార్ గీసిన నిలువెత్తు గాంధీగారి ఫోటో అప్పట్లో వ్యాపారవేత్త వెలాస్య సాయిరెడ్డి కొన్ని వేలకు దక్కించు
కున్నారు. చాలా కాలం శాంతినివాస్ లాడ్జ్ ఎదురుగా ఉండేది. కవి మిత్రులు వచ్చినప్పుడు సైబ పెయింట్ చేసిన<noinclude><references/>
{{rh|తెలంగాణ |430 | తేజోమూర్తులు}}</noinclude>
4vhoa5iezu5dc3izmytte17u0uqjcjf
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/452
104
212157
557044
553066
2026-05-26T04:31:18Z
A.Murali
3019
557044
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>గాంధీగారి అద్భుత కళా ఖండాన్ని చూపించేవాళ్లం. ఇడ
ఫోటోగ్రఫీ అంటే సైబకు ఆరవ ప్రాణమే. దానిని వ్యాపారంగా
భావించక ప్రవృత్తిగానే స్వీకరించేవారు. పెండ్లిల్లకు, సభా
కార్యక్రమాలకు ఫోటో తీయడానికి వెళ్లినా అంత డబ్బు
కావాలని డిమాండ్ చేసేవారు కారు. గోలుకొండ కోటలో
అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల మేళ 1978లో జరిగినప్పుడు
సైబ తీసిన అనేక ఫోటోలకు అవార్డులు లభించాయి. కవి
మిత్రుల పెండ్లిల్లకు సైబ కెమెరాతో విచ్చేసేవారు. వారు
తీసిన ఆల్బమ్లు దాదాపు అందరి మిత్రుల ఇండ్లల్లో ఆయన
జ్ఞాపకంగా ఉన్నాయి.
సైబకు ఉన్నవి రెండే చేతులైనా కలంతో కవిత్వం
రాస్తూ- కుంచెతో చిత్రాలు వేస్తూ కెమెరాతో ఫోటోలు
తీసేవారు దారువును శిల్పాలుగా మలిచేవారు. వారు
మొదట్లో 'వెన్నెల' అనే లిఖిత మాసపత్రిక బాల సాహిత్యం
కోసం అవిష్కరించారు.
తరువాత ఇందూరు భారతి ద్వారా ఆవిష్కరింపబడ్డ
కొన్ని చిత్రాలు, వెలుగులో రావటానికి సంకలనాలుగా మలచ
బడటానికి రూపశిల్పి వీరే.
ప్రముఖుల సన్మాన పత్రాలకు సైబ డిజైన్లు
కూర్చేవారు. జగ్గయ్యకు సమర్పించిన చిట్టిబాబు, ఈమని
శంకర శాస్త్రులకు వేదికపై అందజేసిన అనేక సన్మాన
పత్రాలకు సైబ ఆకృతే ముఖ్యం.
కవిగా సైబ పరంధాములు అనేక రచనలు గావిం
చారు. సైబ పద చిత్రాలు, సైబ శబ్ద చిత్రాలు, భావ చిత్రాలు,
భావ గీతాలు మొదలైన సంకనాలకు అనేక అవార్డులు
లభించాయి. వీటికి తాను వేసిన చిత్రాలే అంతర్వాహినిగా
అద్భుతాలు! కేవలం కవిత్వమే కాకుండా వీరు అనేక సంగీత
రూపకాలు రచించారు. ఇవి రేడియోలోనూ వేదికలపై
ప్రసారము - ప్రదర్శన ఐనాయి.
వీరు రచించిన 'సిద్ధార్థ' నృత్యరూపకం మహారాష్ట్రలోని
నాందేడ్ జిల్లాలో ప్రదర్శింపబడి మన్ననలందుకుంది.
విషజ్వాల, ప్రత్యూష చిత్రాలకు కళాదర్శకత్వం వహించారు.
ఆర్మూర్ ప్రజలు సైబ పరంధాములు గారికి మహోన్నత
వేదికపై ప్రముఖులు, పెద్దలు, కవులు, కళాకారుల సమక్షంలో
'కళానిధి' బిరుదుతో సన్మానించారు. ఇటు కవులకు
శిక్షణనిచ్చి ఎందరో ప్రముఖ కవులుగా తీర్చిదిద్దారు. సాహితీ
సేవలో క్లుప్తగోష్టులు, చర్చలు, కవితా పఠన పోటీలు
నిర్వహించి కవులకు అండదండగా ఉండేవారు.
ఎందరో ఫోటోగ్రాఫర్లను అవుట్ డోర్ కు తీసుకువెళ్లి
శిక్షణ నిచ్చేవారు. ముఖ్యంగా వాటిలో జిల్లా, నందిగుట్ట,
సారంగపూర్, అలీసాగర్ యాత్రలు మరువలేనివి. ఈ
రోజున స్టూడియోలు పెట్టుకొని జీవితాన్ని గడుపుతున్నారు.
ఆయన శిష్యులు ఎందరెందరో!
నిజామాబాదులో తమ ఆకృతి సంస్థ ద్వారా అనేక
ఆర్ట్ ఎగ్జిబిషన్లు నిర్వహించారు అలిశెట్టి ప్రభాకర్, చిత్రాలు,
చంద్ర చిత్రాలు, సిద్దిపేట రాజయ్య గారి పెయింటింగ్స్
సై నిర్వహించి అనేక చిత్రకారులకు స్ఫూర్తి దాతలైనారు.
Lions, Lio లాంటి అనేక సంస్థలకు తమ సేవల
నందించి సభలు జయప్రదం జరిగేలా పర్యవేక్షణ
జరిపేవారు. వీరి స్టూడియోను దర్శించిన ప్రముఖులు
దాశరథి, ఆరుద్ర, జగ్గయ్య, సినారె గారలు.
ఇందూరు ఉత్సవాలకు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత
సి. నారాయణరెడ్డి గారు విచ్చేసినప్పుడు అస్వస్థతగా ఉన్న
సైబను ఎన్నో మెట్లు ఎక్కి వచ్చి పలకరించారు. సైబ కృషిని,
చిత్రాలను చూసి ప్రశంసించారు. ఆ వేళ సైని ఇంట్లో వీధి
జాతరే ఐంది.
సైబ నిరంతరం సేవా కార్యక్రమాల్లో వుండటంవల్ల
ఒత్తిడి, ఎల్లవేళలా సంచారం, సమావేశాలు, అవుట్ డోర్
ఫోటోగ్రఫీ సమావేశాలు - పని ఒత్తిడితో సైబకు అనారోగ్యం
కలిగింది. ఎంత అనారోగ్యంగా ఉన్న సైబసార్ సమావేశం
అంటే సై అనేవారు. వారు చాలాసార్లు అనారోగ్యంగా
వున్నా, వారి మార్గదర్శకత్వంలో పెద్ద సమావేశాలు
నిర్వహించాం. సైబకి ముగ్గురు మగపిల్లలు, శశాంక, సారిక,
తూనిక. ఇప్పుడు సారిక మాత్రమే మిగిలున్నారు. భార్య
'అహల్య' సైబని అమ్మలా చూసేది. సైబకి ఆడపిల్లలంటే
ఎంతో ఇష్టం. ఇందూర్ వాస్తవ్యురాలు, అప్పుడే డిగ్రీ కళాశాల
మెట్లెక్కిన అయినంపూడి శ్రీలక్ష్మిని స్వంత కూతురిలా
చూసుకునేవారు. ఆ దంపతులు తాను ప్రముఖ
-
bash తెలంగాణ (431 తేజోమూర్తులు ఓడ
సమరము తెలంగాణ (431<noinclude><references/>
{{rh|తెలంగాణ |431 | తేజోమూర్తులు}}</noinclude>
36z2bf1elbt1kc7ix667zqx22kec64f
557059
557044
2026-05-26T06:56:41Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557059
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
గాంధీగారి అద్భుత కళా ఖండాన్ని చూపించేవాళ్లం. ఇక ఫోటోగ్రఫీ అంటే సైబకు ఆరవ ప్రాణమే. దానిని వ్యాపారంగా
భావించక ప్రవృత్తిగానే స్వీకరించేవారు. పెండ్లిల్లకు, సభా కార్యక్రమాలకు ఫోటో తీయడానికి వెళ్లినా ఇంత డబ్బు
కావాలని డిమాండ్ చేసేవారు కారు. గోలుకొండ కోటలో అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల మేళ 1973లో జరిగినప్పుడు
సైబ తీసిన అనేక ఫోటోలకు అవార్డులు లభించాయి. కవి మిత్రుల పెండ్లిల్లకు సైబ కెమెరాతో విచ్చేసేవారు. వారు
తీసిన ఆల్బమ్లు దాదాపు అందరి మిత్రుల ఇండ్లల్లో ఆయన జ్ఞాపకంగా ఉన్నాయి.
సైబకు ఉన్నవి రెండే చేతులైనా కలంతో కవిత్వం రాస్తూ- కుంచెతో చిత్రాలు వేస్తూ కెమెరాతో ఫోటోలు తీసేవారు దారువును శిల్పాలుగా మలిచేవారు. వారు మొదట్లో 'వెన్నెల' అనే లిఖిత మాసపత్రిక బాల సాహిత్యం కోసం అవిష్కరించారు.
తరువాత ఇందూరు భారతి ద్వారా ఆవిష్కరింపబడ్డ కొన్ని చిత్రాలు, వెలుగులో రావటానికి సంకలనాలుగా మలచ
బడటానికి రూపశిల్పి వీరే.
ప్రముఖుల సన్మాన పత్రాలకు సైబ డిజైన్లు కూర్చేవారు. జగ్గయ్యకు సమర్పించిన చిట్టిబాబు, ఈమని శంకర శాస్త్రులకు వేదికపై అందజేసిన అనేక సన్మాన పత్రాలకు సైబ ఆకృతే ముఖ్యం.
కవిగా సైబ పరంధాములు అనేక రచనలు గావించారు. సైబ పద చిత్రాలు, సైబ శబ్ద చిత్రాలు, భావ చిత్రాలు,
భావ గీతాలు మొదలైన సంకనాలకు అనేక అవార్డులు లభించాయి. వీటికి తాను వేసిన చిత్రాలే అంతర్వాహినిగా
అద్భుతాలు! కేవలం కవిత్వమే కాకుండా వీరు అనేక సంగీత రూపకాలు రచించారు. ఇవి రేడియోలోనూ వేదికలపై
ప్రసారము - ప్రదర్శన ఐనాయి.
వీరు రచించిన 'సిద్ధార్థ' నృత్యరూపకం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ప్రదర్శింపబడి మన్ననలందుకుంది.
విషజ్వాల, ప్రత్యూష చిత్రాలకు కళాదర్శకత్వం వహించారు. ఆర్మూర్ ప్రజలు సైబ పరంధాములు గారికి మహోన్నత
వేదికపై ప్రముఖులు, పెద్దలు, కవులు, కళాకారుల సమక్షంలో 'కళానిధి' బిరుదుతో సన్మానించారు. ఇటు కవులకు
శిక్షణనిచ్చి ఎందరో ప్రముఖ కవులుగా తీర్చిదిద్దారు. సాహితీ సేవలో క్లుప్తగోష్టులు, చర్చలు, కవితా పఠన పోటీలు
నిర్వహించి కవులకు అండదండగా ఉండేవారు.
ఎందరో ఫోటోగ్రాఫర్లను అవుట్ డోర్ కు తీసుకువెళ్లి శిక్షణ నిచ్చేవారు. ముఖ్యంగా వాటిలో జిల్లా, నందిగుట్ట, సారంగపూర్, అలీసాగర్ యాత్రలు మరువలేనివి. ఈ రోజున స్టూడియోలు పెట్టుకొని జీవితాన్ని గడుపుతున్నారు.
ఆయన శిష్యులు ఎందరెందరో!
నిజామాబాదులో తమ ఆకృతి సంస్థ ద్వారా అనేక ఆర్ట్ ఎగ్జిబిషన్లు నిర్వహించారు అలిశెట్టి ప్రభాకర్, చిత్రాలు,
చంద్ర చిత్రాలు, సిద్దిపేట రాజయ్య గారి పెయింటింగ్స్ సైబ నిర్వహించి అనేక చిత్రకారులకు స్ఫూర్తి దాతలైనారు.
Lions, Lio లాంటి అనేక సంస్థలకు తమ సేవల నందించి సభలు జయప్రదం జరిగేలా పర్యవేక్షణ జరిపేవారు. వీరి స్టూడియోను దర్శించిన ప్రముఖులు దాశరథి, ఆరుద్ర, జగ్గయ్య, సినారె గారలు.
ఇందూరు ఉత్సవాలకు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి. నారాయణరెడ్డి గారు విచ్చేసినప్పుడు అస్వస్థతగా ఉన్న సైబను ఎన్నో మెట్లు ఎక్కి వచ్చి పలకరించారు. సైబ కృషిని, చిత్రాలను చూసి ప్రశంసించారు. ఆ వేళ సైని ఇంట్లో వీధి
జాతరే ఐంది.
సైబ నిరంతరం సేవా కార్యక్రమాల్లో వుండటంవల్ల ఒత్తిడి, ఎల్లవేళలా సంచారం, సమావేశాలు, అవుట్ డోర్
ఫోటోగ్రఫీ సమావేశాలు - పని ఒత్తిడితో సైబకు అనారోగ్యం కలిగింది. ఎంత అనారోగ్యంగా ఉన్న సైబసార్ సమావేశం
అంటే సై అనేవారు. వారు చాలాసార్లు అనారోగ్యంగా వున్నా, వారి మార్గదర్శకత్వంలో పెద్ద సమావేశాలు నిర్వహించాం. సైబకి ముగ్గురు మగపిల్లలు, శశాంక, సారిక, తూనిక. ఇప్పుడు సారిక మాత్రమే మిగిలున్నారు. భార్య
'అహల్య' సైబని అమ్మలా చూసేది. సైబకి ఆడపిల్లలంటే ఎంతో ఇష్టం. ఇందూర్ వాస్తవ్యురాలు, అప్పుడే డిగ్రీ కళాశాల మెట్లెక్కిన అయినంపూడి శ్రీలక్ష్మిని స్వంత కూతురిలా చూసుకునేవారు. ఆ దంపతులు తాను ప్రముఖ<noinclude><references/>
{{rh|తెలంగాణ |431 | తేజోమూర్తులు}}</noinclude>
8nlal625m2s280c6vvnmymwdhuwh3xl
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/453
104
212158
557060
553067
2026-05-26T07:02:43Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557060
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
కవయిత్రిగా, వ్యాఖ్యాతగా నిలబడటానికి కారణభూతులు సైబ. అలాగే పంచారెడ్డి లక్ష్మణ్, చందనరావు, సమీర,
బద్ధూరిల స్నేహం మర్చిపోలేనిది.
ఒకసారి రక్తహీనతతో ప్రభుత్వ వైద్యశాలలో చేరినప్పుడు అనుకోకుండా విచ్చేసిన మహాకవి ఆరుద్ర సైబను పరామర్శించారు. అంత అనారోగ్యస్థితిలోనూ సైబసారు పెన్సిల్తో ఆరుద్ర చిత్రం గీసి అందించి చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పారు. వరంగల్లు సమావేశాలకు వెళ్లినప్పుడు సైబ ఆరోగ్యం చాలా క్షీణించింది. త్వరలోనే
కోలుకున్న వారిపై పనిభారం వేసేవారం కాదు. ఒక్కోరోజు స్టూడియోకు వెళ్ళకున్నా - కవిమిత్రులను కలువకున్నా
సైబకు పొద్దుపోయేది కాదు.
తరువాత కాలంలో స్టూడియో ఆకృతిని పెద్దబజారుకు మార్చారు. ఇంటికి దగ్గర అవడం కొంత అనుకూలం. ఇక్కడ
ఉన్నప్పుడే చాలా సంకలనాలు తన చేతితో రాసి ముద్రించారు.
సైబ గీసిన చిత్రాలు ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, ఆంధ్రపత్రికల్లో ప్రచురణమైనాయి. అనేక కవితలకు పత్రికలవారు వీరి ఫోటోలను సందర్భానుసారం కళాత్మకంగా వేసేవారు.
అది 15-08-1997 భారత స్వాతంత్య్ర దినోత్సవం. సైబ శ్వాస పీల్చుకోవడం చాలా కష్టమైంది. ఈ రోజే అంతిమ శ్వాసను ఈ లోకానికి ఇచ్చేసి సైబ కీర్తిశేషులైనారు. అంతిమ యాత్రలో నిజామాబాద్ కళాకారులు కొన్ని కిలోమీటర్ల పర్యంతం వాటికకు కదలివచ్చారు. కళామూర్తిని కోల్పోయిన దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు.
కవిత్వం, ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం మూడు ముమ్మూర్తులా కలిసిన త్రివేణి సంగమం కళానిధి మన సైబ పరంధాములు. వీరు క్షణం క్షణం ఎప్పుడు కార్యక్రమం నిర్వహించినా స్మృతికి వస్తూనే ఉంటారు.
తెలంగాణ ప్రభుత్వం సైతం కీ.శే. కళానిధి పరరధాములు గారి కళాసేవను ప్రశంసించి పెద్ద సభను స్మృతిగా
నిర్వహించింది. వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించింది. సైబ సహధర్మచారిణి శ్రీమతి అహల్యగారు
సభకు హాజరై సంభావనను గ్రహించారు. అలాగే రాష్ట్ర ఆవిర్భావానంతరం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు
మామిడి హరికృష్ణగారు 'సైబ' ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి, 75వేల రూపాయలు ఆర్థిక సహకారం అందివ్వటం
ద్వారా తెలంగాణ కళాకారులకు రాష్ట్రావిర్భావం ద్వారా వెలుగురోజులు వచ్చాయనిపించింది. ప్రముఖ చలనచిత్ర
దర్శకులు బి. నరసింగరావు రూపొందించిన 'ఆర్ట్ @ తెలంగాణ పుస్తకంలో కూడా సైబగారి చిత్రాల్ని వేసి వారికి కళా
నీరాజనం అందించడం ఇందూర్ వాసులకి గర్వకారణం.
కళామూర్తి సైబ పరంధాములు శరీరంతో భౌతికంగా లేకున్నా ఇందూరు నగరం ప్రతి ఉత్సవంతో ఆయనను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంది. ఈనాడున్న కవులు, ఫోటోగ్రాఫరులు, చిత్రకారులు ఆయన తీర్చిదిద్దిన జ్ఞాపికలే!
ఈనాటికి ఆకృతి స్టూడియో దగ్గరకు వెళ్లినా వారున్న వీధిలోకి వెళ్లినా వారి మృదువైన కవితాగానం - వారి వర్ణమయ చిత్రాలు వినిపిస్తాయి, కనిపిస్తాయి.<noinclude><references/>
{{rh|తెలంగాణ |432 | తేజోమూర్తులు}}</noinclude>
c0jfz7zgh7twx5r2so8zjnza221ny8m
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/454
104
212159
557061
553068
2026-05-26T07:10:35Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557061
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{center|{{p|fa150}}'''124. సామల సదాశివ (యాది)'''</p>}}
{{right|-తుమ్మూరి రాంమోహన్రావు}}
తెలుగు వారికి ఉర్దూ భాష మాధుర్యాన్ని రుచి చూపిన వారిలో అగ్రగణ్యులు డా. సామల సదాశివ మాస్టారు. ఆదివాసులు జిల్లా, అడువుల జిల్లా అని పేరు వడసిన ఆదిలాబాదు జిల్లాకు సదాశివ మాస్టారు జిల్లా అన్న ప్రాచుర్యం రావడానికి దశాబ్దాల ఆయన సాహిత్య కృషితోపాటు, పెద్దవారితో విన్న వారితో వారేర్చరుచుకున్న
సాన్నిహిత్య ప్రేమానురాగాలు కూడా కారణాలు.
తన ప్రతిభ ప్రస్తావన రానీయకుండా ఎదుటి వారిలోని ప్రతిభా పాటవాలు పసి గట్టడంలో ప్రసిద్ధులు సదాశివ
సారు. పనివారు, పసివారల నుండి పండితులు, ప్రతిభా వంతులదాకా తనకు పరిచయమైన వారిలోని, ప్రావీణ్యాలను మానవతా విలువలను, సౌజన్య సౌశీల్యాలను గుర్తించి పనిగట్టుకుని ముచ్చట్ల రూపంలో ప్రజావళికి పలు పత్రికల ద్వారా వెలువరించిన వితరణ శీలి సదాశివ. ఇప్పుడంటే రవాణా సౌకర్యాలున్నాయి. ఫోన్ లున్నాయి. పత్రికలు, టీవీల వంటి పలు మాధ్యమాలున్నాయి. ఊరూరికి బడులున్నాయి. కాలేజిలున్నాయి. కాని ఏడెనిమిది దశాబ్దాల కిందటి ఆదిలాబాదు జిల్లాను గురించి ఆలోచిస్తే, సదాశివ బాల్యాన్ని తలచుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు. పుట్టిననప్పటినుండి. చివరి శ్వాస వరకు ఏ కొన్నినాళ్ళో బయటి ఊళ్ళల్లో గడిపినా జిల్లాను వదిలి పెట్టకుండానే అక్కడనుంచే ప్రపంచ వ్యాప్తంగా పరిచయాలు పెంచుకున్నారంటే ఆయన లక్ష్యకుద్ధి ఎంత
గొప్పనైనదో ఊహించవచ్చు.
సదాశివ మాస్టారు పుట్టింది ఒకప్పటి ఆదిలాబాదు ఇప్పటి కొమురం భీము జిల్లా కాగజునగరం ప్రాంతంలోని తెనుగుపల్లె. అది అప్పటికీ పల్లెనే. ఆ పల్లెలోని పూరి గుడిసెలో కన్ను తెరిచిన సదాశివ బాల్యం. తండ్రి నాగయ్య
పంతులు బడి పంతులుగా పని చేసిన కాగజ్ నగర్ సమీపంలోని నవెగాంలో గడచింది. అది నైజాం జమానా,
బళ్ళల్లో ఉర్దూ మీడియంలో బోధన జరిగేది. సారు కూడా ఉర్దూ మీడియంలోనే చదువుకున్నా తండ్రి నేర్పిన తెలుగుతో ఇంట్లో ఉన్న భారత భాగవతాలు చదివి తెలుగు భాష పై పట్టు చేజిక్కించుకున్నారు. అలాగే అరబ్బీ తెలిసిన గురువు దగ్గర అరబ్బీ నేర్చుకున్నారు.
వరంగల్లులో మెట్రిక్ వరకు చదివి స్వంత జిల్లాలో ఉపాధ్యాయ వృత్తిలో చేరినారు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు
నిర్వహిస్తూనే, మరోవైపు సాహిత్య రంగంలో ప్రవేశించి పద్యాలు, కథలు, వ్యాసాలు రాసి పత్రికలకు పంపడం,
పండిత ప్రకాందులతో ఉత్తర ప్రత్యుత్తరాలు నెరపడంతో గుర్తింపదగిన స్థాయికి చేరుకోవడమేకాదు పలువురి
ప్రశంసలకు పాత్రులైనారు. సదాశివ గారు తొలుత తన పద్యకృతి ప్రభాతము వెలువరించారు. ఆ పిదప సాంబశివ
శతకము, నిరీక్షణము లఘు కావ్యములను వెలువరించారు. ఈ రెండింటికీ ముందు మాట వ్రాసిన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సదాశివ పద్య రచనను మనసారా కొనియాడారు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |433 | తేజోమూర్తులు}}</noinclude>
k5kth5dnezdg4l512xx17ir1pbi0g38
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/455
104
212160
557062
553069
2026-05-26T07:22:50Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557062
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
ఆ తరువాత మంచి మాటలు, ధర్మ వ్యాధుడు, విశ్వామిత్రము, అంబపాలి, వంటి పలు పద్య కృతులు రాసినారు. ఇవిగాక అర్జద్ రుబాయీలు అందమైన తేటగీతల్లోకి తర్జుమా చేశారు. వీరి రుబాయీల అనువాదాలు చూసి మురిసిపోయిన వేలూరి శివరామ శాస్త్రి సదాశివలోని నిష్ట పద్య రచనా శైలిని, భావ గాంభీర్యాన్ని ప్రస్తుతించారు.
ఒకవైపు తెలుగు రచనలు కొనసాగిస్తూనే మరోవైపు ఉర్దూ పత్రికలకు వ్యాసాలు రాస్తుండేవారు. ఈ తరుణంలోనే
గోలకొండ పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి గారు పద్య కవిత్వం పక్కకు పెట్టి పారసీ, అరబ్బీ, ఉర్దూ భాషలలోని విశేషాల గురించి రాయమని సూచించడంతో సదాశివ గారు వారి మాటకు విలువనిచ్చి తన దిశను మార్చుకున్నారు.
ఇక అప్పటి నుంచి సదాశివ తన దృష్టినంతా ఉర్దూ అరబ్బీ ఫారసీ భాషా సాహిత్యాలవైపు మళ్ళించి ఫారసీ కవుల
ప్రసక్తి, గాలిబు జీవిత చరిత్ర, ఉరుదూ సాహిత్య చరిత్ర వంటి పుస్తకాలు ప్రచురించారు. గీటురాయి, మిసిమి
పత్రికల్లో గజల్ రుబాయీ వంటి ప్రక్రియల గురించిన సాధికారిక వ్యాసాలు రాశారు. సియాసన్ పత్రిక ద్వారా
తెలుగులోని ప్రసిద్ధ కవులను ఉరుదూ వారికి పరిచయం చేసి ఇరు భాషల వారధియైనారు. సామల సదాశివ.
ఇదంతా ఒక పార్శ్వమైతే సదాశివ సంగీతజ్ఞత ఆయనకు ఎందరో అభిమానులను సమకూర్చింది. ఆదిలాబాదుకు ఆనుకుని ఉన్న మహారాష్ట్ర సంస్కృతి సంప్రదాయాల ప్రభావం తెలంగాణ ప్రాంతంపై ఉన్నది. అది ఆదిలాబాదులో మరీ ఎక్కువ. తరచుగా హిందూస్తానీ కచేరీలు వినడం ఆ మాధుర్యానికి అలవాటుపడటంతో హిందూస్తానీ సంగీత గాయనీ గాయకులు, గాయన పద్ధతులు, ఘరానాలు మొదలైన విషయాలపై పట్టు సాధించారు. తనకు తెలిసిన విషయాలను, తాను అనుభవించిన ప్రతి రసరమ్య సన్నివేశాలను ముచ్చట్లుగా అటు పాఠకులకు, ఇటు తనను కలువడానికి వచ్చిన అభిమాన శ్రోతలకు చెబుతుండేవారు. అవును ఆయన రచనలు చదివే పాఠకులకు చదివి నట్లుగా కాకుండా ఆయన చెబుతుంటే విన్నట్లుగా ఉండేవి. అదే వారి వచన రచనలోని విశేషం.
అవే తరువాత మలయ మారుతాలు, సంగీత శిఖరాలు, యాది, స్వరలయలు పుస్తకాలుగా వెలువడ్డాయి. ఇందులో ఒక్కో పుస్తకం ప్రత్యేకతను సంతరించుకుని సదాశివకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టాయి. వాకాటి పాండురంగారావు గారి అభ్యర్ధనతో ఆంధ్రప్రభకు మలయమారుతాలు రాస్తే ఎంతోమంది సంగీత సాహిత్య ప్రేమికులు ఆయనకు అభిమానులయ్యారు. అట్లే మానవీయతా పరిమళాలతో యాది పేరుతో, వార్త ఆదివారం అనుబంధంలో ఆయన రాసిన వ్యాసాలు ఆయనను యాది సదాశివను చేశాయి. ఇక స్వరలయలు ఏకంగా ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తెచ్చిపెట్టింది. హైదరాబాదుకు చెందిన సూఫీకవి అష్టద్ రుబాయీలను సదాశివగారు అనువదిస్తే దానికి పరిచయం పేరిట ముందు మాట రాసిన వేలూరి శివరామశాస్త్రి గారు సదాశివ నిర్దుష్టపద్య రచనా విధానానికి, భావ గాంభీర్యానికి మురిసిపోయి ప్రశంసల జల్లులు కురిపించారు.
సూఫీయిజాన్ని అరటిపండు ఒలిచిపెట్టినట్లు చెప్పేవారు. ఆయన సాహిత్యజ్ఞత ఎంత లోతైనదో సంగీతజ్ఞత అంత
గొప్పది. ఇంకో విచిత్రమైన విషయ మేమిటంటే ఆయన మంచి తైల వర్ణ చిత్రకారుడు కూడ బళ్ళో చదువుకునే
రోజుల్లో చిత్రలేఖన ఉపాధ్యాయులుగా దీనదయాళ్ నాయుడు, పిళ్ళై బొమ్మలు నేస్తుంటే స్ఫూర్తి పొంది నేర్చుకున్నారు. దాంతో సదాశివ మాస్టారు ఉపాధ్యాయులపై పని చేసిన కాలంలో నాటకాలకు అవసరమయ్యే పరదాలను చిత్రించడం, తమ కవితలకు తగిన బొమ్మలు గీయడం, ముఖాకృతల చిత్రాలు వేయడం చేస్తుండేవారు. ప్రసిద్ధ చిత్రకారులు కాపు రాజయ్య తన తొలి దశలో సారు దగ్గర చిత్రకళలో మెళుకువలు నేర్చుకున్నారట. బహుముఖ ప్రజ్ఞాశాలియైన సదాశివ అనేక ప్రక్రియల్లో పట్టు సాధించారు. వారు రాసిన కొన్ని కథలు అప్పట్లో
సుజాత పత్రికలో ప్రచురించబడ్డాయి. వారు అపశ్రుతి, రేవతి. అనే రెండు నవలలు కూడా రచించారు. మరాఠీ నుండి కేశవ సుత్ జీవిత కథ తెనిగించారు. పలు పుస్తకాలకు ముందు మాటలు రాసారు. నాటకాలకు సందర్భోచిత
పద్యాలు రాసిచ్చారు. సదాశివ గారి జీవితంలో కాళోజీ సోదరుల మైత్రి ఒక ప్రధాన ఘట్టం. వారి గురించి ప్రస్తావించని ముచ్చట ఉండదు. తలచుకుని పరవశించని<noinclude><references/>
{{rh|తెలంగాణ |434 | తేజోమూర్తులు}}</noinclude>
9lgqvawncddu79lvwllhtnydzt60zoo
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/456
104
212161
557063
553070
2026-05-26T07:24:09Z
A.Murali
3019
557063
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>రోజు ఉండదు. అదొక అపూర్వ మైత్రీబంధం, పూర్వజన్మల
బంధం. దానికి ఒక కారణం ఆ సోదరుల అన్యోన్య
ప్రేమానుబంధం
ఆయనకు అన్ని వర్గాలవారితోనూ, అన్ని వాదాల
వారితోనూ, అన్ని ప్రాంతాలవారితోనూ సత్సంబంధాలు
దేవి ముఖ్యమైన విషయం ఒకటి చెప్పుకోవాలి.
ఆదిలాబాద్కు చెందిన గొండి వీరుడు కొమురం భీం. నిజామ్
దురాగతాల నెదిరించి ప్రాణ త్యాగ మొనర్చిన ఉద్యమ
కారుడు. మాస్టారు పాఠ్యపుస్తక రచయితగా ఉన్నప్పుడు
కొమురం భీం జీవిత విశేషాలను తెలుగు పాఠ్యాంశంగా
చేర్చారు. ఉత్తర భారత దేశం నుండి వచ్చి ఆదిలాబాదులో
స్థిరపడి, ఆదివాసులతో మమేకమై, వారిలోని కళాశ్మర
నైపుణ్యాలను పునురుద్దరించడానికి కంకణం కట్టుకున్న
కళాక్రమ నిర్వాహకులను రవి కర్యంటే ఎంత అవ్యాజ ప్రేమో
మాటల్లో చెప్పనలవికానిది. ఆయన నుండి స్ఫూర్తి
పొందడానికి అనేక మందికి ఆయనను పరిచయం చేసిన
ఘనత సదాశివ గారికి దక్కుతుంది.
రచనలలో వ్యక్తులను పరిచయం చెయ్యడంలో
మాస్టారికి అనితర సాధ్యమైన శైలి. ప్రస్తుతించే పద్ధతిలోగాక
ప్రస్తావనలోనే వ్యక్తుల గొప్పతనాన్ని గోచరింపజేయడం
ఆయనలోని విశేషం. మంచిని పంచడం మమతల్ని
పంచడం, మానవతా విలువల్ని పెంపొందించడం ఆయన
నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన అంశం. యౌవన
దశలో యోగాభ్యాసం కూడా చేసేవారట. త్రాటకం అభ్యాసం
చేసిన వారని విన్నాను. అన్నీ నిర్చిన భావయోగి, కర్మయోగి
డా. సామల సదాశివ.
ఉద్యోగం చేస్తూనే స్నాతకోత్తర విద్యను సాధించిన
సదాశివ గారిని పదవులు, వరస్కారాలు వెతుక్కుంటూ
వచ్చాయి. ఉపాధ్యాయులుగా, పాఠశాలల తణిఖీ అధికారిగా,
ఉపాధ్యాయ శిక్షణ సంస్థ లోధకుడిగా పనిచేసిన సదాశివ
పదోన్నతిపై భద్రాచలం కళాశాల పరిని పాలుగా చేసి పదవీ
విరమణ పొందారు. ఉరుదూ భాషాభిజ్ఞులుగా రెండు
దశాబ్దాలు ఆం.ప్ర. సాహిత్య అకాడమీ ఉర్దూ సలహా సంఘ
సభ్యులుగా, విజ్ఞులుగా, మూడేళ్ళు కాకతీయ విశ్వవిద్యాలయ
సెనేట్ మెంబరుగా గౌరవ పదవులలంకరించారు. వీరి
అనువాదాలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ
పురస్కారాన్ని పొందారు. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు
విశ్వవిద్యాలయం నుండి ప్రతిభా పురస్కారాన్ని గౌరవ
డాక్టరేటును, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ
డాక్టరేటును పొందారు. వీరి 'స్వరలయల'కు కేంద్ర సాహిత్య
అకాడమీ అవార్డు లభించింది. అవికాక మరెన్నో సన్మాన
సత్కారాలు జరిగినా అవన్నీ చంద్రునికో నూలు పోగు
వంటివే. ఇటీవల వీరి రచనలపై పరిశోధనలు మొదల
య్యాయి.
ఆకాశవాణిలో వీరు చేసిన ప్రసంగాలు ఎందరో
రసజ్ఞులైన శ్రోతలనలరించాయి. తొణుకు బెణుకులేని వీరి
కంఠస్వరం, సహజసుందరి శైలి, చిన్న చిన్న వాక్యాలతో
వీరి ప్రసంగం శ్రోతల నలరించేదిగా ఉండేది. కరీంనగర్
విశ్వనాథ వీఠంవారు సదాశివ అభినందన సంచికగా
ఏడువందలకు పైగా పేజీలుగల జయంతి సంచిక
ఆదిలాబాదు ఆకాశవాణి కేంద్రంలో ఆవిష్కరణ జరిగినప్పుడు
ఒక పండుగలా అనిపించటం అతిశయోక్తి కాదు. మాటల
కందని మహనీయుల గురించి ఎంత చెప్పినా తక్కువే.
తెలంగాణా వైతాళికులలో ఒకరయిన డా. సామల సదాశివ
మాస్టారు 11 మే 1928న జన్మించి 7 ఆగస్టు 2012లో
పరమపదించారు. భౌతికంగా లేకున్నా వారి స్ఫూర్తి
చిరకాలం ఉంటుంది.
చేతులు తెలంగాణ 435 తేజోమూర్తులు విడు<noinclude><references/>
{{rh|తెలంగాణ |435 | తేజోమూర్తులు}}</noinclude>
mkkopqsv88ynktgevss9ofv59zyumce
557065
557063
2026-05-26T09:05:47Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557065
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
రోజు ఉండదు. అదొక అపూర్వ మైత్రీబంధం, పూర్వజన్మల బంధం. దానికి ఒక కారణం ఆ సోదరుల అన్యోన్య
ప్రేమానుబంధం
ఆయనకు అన్ని వర్గాలవారితోనూ, అన్ని వాదాల వారితోనూ, అన్ని ప్రాంతాలవారితోనూ సత్సంబంధాలు దేవి ముఖ్యమైన విషయం ఒకటి చెప్పుకోవాలి. ఆదిలాబాద్కు చెందిన గొండి వీరుడు కొమురం భీం. నిజామ్ దురాగతాల నెదిరించి ప్రాణ త్యాగ మొనర్చిన ఉద్యమకారుడు. మాస్టారు పాఠ్యపుస్తక రచయితగా ఉన్నప్పుడు కొమురం భీం జీవిత విశేషాలను తెలుగు పాఠ్యాంశంగా చేర్చారు. ఉత్తర భారత దేశం నుండి వచ్చి ఆదిలాబాదులో స్థిరపడి, ఆదివాసులతో మమేకమై, వారిలోని కళాత్మక నైపుణ్యాలను పునురుద్దరించడానికి కంకణం కట్టుకున్న కళాశ్రమ నిర్వాహకులను రవి కర్యంటే ఎంత అవ్యాజ ప్రేమో మాటల్లో చెప్పనలవికానిది. ఆయన నుండి స్ఫూర్తి పొందడానికి అనేక మందికి ఆయనను పరిచయం చేసిన ఘనత సదాశివ గారికి దక్కుతుంది.
రచనలలో వ్యక్తులను పరిచయం చెయ్యడంలో మాస్టారికి అనితర సాధ్యమైన శైలి. ప్రస్తుతించే పద్ధతిలోగాక
ప్రస్తావనలోనే వ్యక్తుల గొప్పతనాన్ని గోచరింపజేయడం ఆయనలోని విశేషం. మంచిని పంచడం మమతల్ని పంచడం, మానవతా విలువల్ని పెంపొందించడం ఆయన నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసిన అంశం. యౌవన
దశలో యోగాభ్యాసం కూడా చేసేవారట. త్రాటకం అభ్యాసం చేసిన వారని విన్నాను. అన్నీ నిర్చిన భావయోగి, కర్మయోగి డా. సామల సదాశివ.
ఉద్యోగం చేస్తూనే స్నాతకోత్తర విద్యను సాధించిన సదాశివ గారిని పదవులు, వరస్కారాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఉపాధ్యాయులుగా, పాఠశాలల తణిఖీ అధికారిగా, ఉపాధ్యాయ శిక్షణ సంస్థ లోధకుడిగా పనిచేసిన సదాశివ
పదోన్నతిపై భద్రాచలం కళాశాల పరిని పాలుగా చేసి పదవీవిరమణ పొందారు. ఉరుదూ భాషాభిజ్ఞులుగా రెండు
దశాబ్దాలు ఆం.ప్ర. సాహిత్య అకాడమీ ఉర్దూ సలహా సంఘ సభ్యులుగా, విజ్ఞులుగా, మూడేళ్ళు కాకతీయ విశ్వవిద్యాలయ సెనేట్ మెంబరుగా గౌరవ పదవులలంకరించారు. వీరి అనువాదాలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురస్కారాన్ని పొందారు. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ప్రతిభా పురస్కారాన్ని గౌరవ డాక్టరేటును, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటును పొందారు. వీరి 'స్వరలయల'కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అవికాక మరెన్నో సన్మాన సత్కారాలు జరిగినా అవన్నీ చంద్రునికో నూలు పోగు వంటివే. ఇటీవల వీరి రచనలపై పరిశోధనలు మొదలయ్యాయి.
ఆకాశవాణిలో వీరు చేసిన ప్రసంగాలు ఎందరో రసజ్ఞులైన శ్రోతలనలరించాయి. తొణుకు బెణుకులేని వీరి కంఠస్వరం, సహజసుందరి శైలి, చిన్న చిన్న వాక్యాలతో వీరి ప్రసంగం శ్రోతల నలరించేదిగా ఉండేది. కరీంనగర్ విశ్వనాథ పీఠంవారు సదాశివ అభినందన సంచికగా ఏడువందలకు పైగా పేజీలుగల జయంతి సంచిక ఆదిలాబాదు ఆకాశవాణి కేంద్రంలో ఆవిష్కరణ జరిగినప్పుడు ఒక పండుగలా అనిపించటం అతిశయోక్తి కాదు. మాటల కందని మహనీయుల గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలంగాణా వైతాళికులలో ఒకరయిన డా. సామల సదాశివ మాస్టారు 11 మే 1928న జన్మించి 7 ఆగస్టు 2012లో పరమపదించారు. భౌతికంగా లేకున్నా వారి స్ఫూర్తి చిరకాలం ఉంటుంది.<noinclude><references/>
{{rh|తెలంగాణ |435 | తేజోమూర్తులు}}</noinclude>
clpjkml13k3iisu7ovox9xm9c1zdvzv
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/457
104
212162
557066
553071
2026-05-26T09:15:59Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557066
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''125. శంకర్ (జైకిషన్)'''</p>}}
{{right|- హెచ్. రమేష్ బాబు}}
హిందీ సినిమా సంగీతాన్ని నౌషాద్, సి. రామచంద్ర, అనిల్బిశ్వాస్లు ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న కాలం అది. నూనూగు మీసాలు కూడా రాని ఇద్దరు కుర్రాళ్లు ఆ ముగ్గురి అంశను కలబోసుకొని బాలీవుడ్ వెండి తెరవెనుక ప్రత్యక్షమయ్యారు. వారే శంకర్ - జైకిషన్లు.
బాలీవుడ్లో భారతీయ సినీ సంగీతాన్ని రెండున్నర దశాబ్దాల పాటు చకచ్చకితం చేసిన సంగీత కోవిదులు శంకర్
జైకిషన్లు. వీరు సినిమాలకు పని చేసిన కాలమంతా ఒక 'స్వర్ణయుగమే'. ఈ శంకర్ - జైకిషన్లలోని శంకర్ సింగ్
రఘువంశీ అచ్చమైన మన హైదరాబాద్ పహిల్వాన్. 1922 అక్టోబర్ 15న హైదరాబాదులో పుట్టాడు. తండ్రి రాంసింగ్,
తల్లి ఎల్లమ్మ. చిన్నప్పటి నుంచే సంగీత నాట్యాలంటే ఆసక్తి చూపి బడికి వెళ్ళే రోజుల్లోనే శాస్త్రీయ సంగీతంపై దృష్టి పెట్టాడు. కథక్ నృత్యంలోనూ శిక్షణ పొందాడు. నెమ్మదిగా అతని అడుగులు రంగస్థలం వైపు నడిచాయి. సత్యనారాయణ, హేమావతి థియేటర్ గ్రూపులో చేరి నాటకాల్లో వేషాలు వేయడం మొదలుపెట్టాడు. సంగీతానికి కూడా
చేరువగానే మసలుకునేవాడు.
హైదరాబాద్లో తాలింఖానాలో కసరత్తులు చేసిన వస్తాదుగా కుస్తీలు పట్టిన మన శంకర్ సింగ్. అంతే ఇష్టంగా
తబాలాపై దరువు వేశాడంటే మోగిపోయేది లయగా. ఏది ఏమైనా సరే, నేర్చుకున్నది చాలని బొంబాయి చేరుకున్న
శంకర్ కొంతకాలం హుస్న్ లాల్ భగత్ రాంల వద్ద శిష్యరికం చేశాడు. ఆ తరువాత అనుకోకుండా పృథ్వీరాజ్ కపూర్ దృష్టిలో పడ్డాడు. పృథ్వీ థియేటర్లో నెల జీతానికి కుదిరాడు. వారి నాటకాలకు తబలా వాయించేవాడు. 1929
నవంబర్ 21న గుజరాత్కు చెందిన బల్సార్లో జన్మించిన జైకిషన్తో ఒకనాడు శంకర్ కి పరిచయం కలిగింది. హార్మోనియం నేర్చుకున్న జైకిషన్తో ఏర్పడిన ఆ పరిచయం మంచి స్నేహంగా మారింది.
జైకిషన్ను శంకరే తన వెంట తీసుకెళ్లి పృథ్వీరాజ్తో చెప్పి ఉద్యోగం ఇప్పించాడు. అయితే జైకిషన్ ఎడమ చేతివాటం. మన శంకర్ మాత్రం కుడిచేతినే ఉపయోగించాడు. ఇలా ఈ కుడి ఎడమలు రెండూ కలిసి బాలీవుడ్లో ఆనాడు మధుర స్వరాలను సృష్టించాయి. అద్భుతమైన సినిమాలు తీయాలని కలలు గంటున్న రాజకపూర్, కవులు హస్రత్ జైపూరి, శైలేంధ్రలు అప్పటికి అక్కడ ఉండనే ఉన్నారు. వారికి శంకర్ జైకిషన్లు తోడైయ్యారు. ఇంకేముంది, భారతీయ సినిమాలో నూతన అధ్యాయానికి తెర లేచింది. రాజ్కపూర్ మొదటి సినిమా 'ఆగ్' (1948) తీయాలనుకున్నప్పుడు రామ్ గంగూలీని మ్యూజిక్ డైరెక్టర్గా, అసిస్టెంట్స్ గా శంకర్ జైకిషన్లను తీసుకున్నారు. కానీ, తన సినిమా బాణీలను రామ్ గంగూలీ ముందుగానే బయటకు వినిపిస్తున్నాడని తెల్చుకుని రాజకపూర్ తన<noinclude><references/>
{{rh|తెలంగాణ |436 | తేజోమూర్తులు}}</noinclude>
7u702123uzlsdwaenz1fbsf0o2jqwjv
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/458
104
212163
557067
553072
2026-05-26T09:28:38Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557067
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
తరువాతి సినిమాకి శంకర్ - జైకిషన్ లే సంగీత దర్శకు లన్నారు. ఆ చిత్రం 1949లో వచ్చిన 'బర్సాత్,
'బర్సాత్ మె హమ్సే మిలే తుమ్ సజన్', 'హవామె ఉడ్తాజాయే', 'రాజాకీ ఆయేగీ బారాత్' పాటలు వీరిని మొదటి
చిత్రంతోనే హిమాలయ శిఖరాలపై కూర్చో పెట్టాయి. ముఖ్యంగా 'రాజాకీ ఆయేగి బారాత్' పాట రాసిన శైలేంద్ర
కవిత్వం మన శంకర్ సంగీతానికి సరైన జోడి అయ్యింది. అట్లానే - హస్రత్ జైకిషన్ బాగా కుదిరాడు. ఇట్లా థీమ్
సాంగ్స్ శంకర్ శైలేంద్రలు చేస్తే, డ్యూయెట్ సాంగ్స్ -జైకిషన్ హస్రత్లు చేయడానికి ఎవరంతట వారే డిసైడ్
అయిపోయాడు. అయితే, ఏ పాటను ఎవరు చేశారన్నది బయటికి చెప్పకూడదనేది వీరిరువురి మధ్య ఉన్న ఓ
ఒప్పందం. దీనికి లోబడే వాళ్లు చాలాకాలం పనిచేశారు. శంకర్ - జైకిషన్లు ఇట్లా రాజ కపూర్ సినిమాలకు శాశ్వత
సంగీత దర్శకులుగా చాలా కాలం పనిచేశారు.
ఈ నేపథ్యంలో శంకర్ - జైకిషన్ సంగీతం సమకూర్చిన కొన్ని చిత్రాలు 1949లో బర్బాత్, 1951-60 దశకంలో ఆవారా, బాదల్, కాలీఘటా, నగీనా, దాగ్, పరబత్, పూనమ్, ఆహ్, ఆస్, ఔరత్, నయాఘర్, పతితా, షికస్త్, బాషా, బూట్పాలిష్, మయూర్ పంఖ్, పూజా, సీమా, శ్రీ 420, బసంత్ బహార్, చోరీచోరీ, హాలాకు, కిస్మత్కే ఖేల్, న్యూఢిల్లీ, పట రాణి, రాజార్, బేగునాహ్, కట్పల్లి, బాఘీ సిపాహీ, యహూది, అనాడీ, ఛోటీ బహెన్, కన్హయ్యా, లవ్ మేరేజ్, మై నషే మే హూ, షరారత్, ఉడాలా, కాలేజ్ గర్ల్స్, దిల్ అప్పా ప్రీత్వరాయీ, ఏకే పూల్ చార్కాంటే, జిన్ దేశమే గంగా బత్తీ హై, గబన్, సింగపూర్, 1961-1971 దశకంలో ఆస్కాపంచీ, బాయ్ ఫ్రెండ్, జబ్బార్ కిసీసే హెూతాహై, జంగ్లీ, ససురాల్, అవిక్, ఆప్షనరీ, హరియాలీ ఔర్ రాస్తా, ప్రొఫెసర్, రంగోలి, దిల్ ఏక్ మందిర్, హమ్హీ, ఆయీ మిలన్ కీ బేలా, రాజ్కుమార్, నంగమ్, సాంఝ బెర్ సవేరా, ఆర్దూ, గుమ్నామ్, జాన్వర్, ఆమ్రపాలి, లవ్ ఇన్ టోక్యో, సూరజ్, తీస్రీకసమ్, రాత్ ఔర్ దిన్, బ్రహ్మచారి, మేరే హుజూర్, యకీస్, మేరానామ్ జోకర్ వంటి చిత్రాలకు శంకర్ -జైకిషన్లు అందించిన సంగీతాన్ని ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు.
హిందీ సినీ సంగీతంలో శంకర్-జైకిషన్లు ఎన్నో ప్రయోగాలు మరెన్నో అద్భుతాలు చేశారు.
శంకర్ జైకిషన్ లు ఆ కాలంలో ఎక్కువ శాతం పాటలన్నీ శాస్త్రీయ సంగీతంలో చేసినవే. ఆ సమయంలో 'బర్సాల్' పాటలతో మొత్తం భారతీయులనే వారు సమ్మోహితం చేశారు. శంకర్-జైకిషన్లు ఎన్ని ప్రయోగాలు చేశారో చెప్పడం అసాధ్యం.
పంకజ్ మల్లిక్ తప్ప ఆర్మిస్ట్రేషన్ కి అంత ప్రాధాన్య మివ్వని ఆ కాలంలో భారీ సంఖ్యలో అర్నెస్ట్రాతో పాటలు
చేయడంలో వారు విజయం సాధించారు. నృత్య గీతాలకు, క్లాసిక్ గీతాలను ట్యూన్స్ చేయడంలో శంకర్ది అందెవేసిన
చేయి. వీరి చిత్రాల్లో దాదాపు ప్రతి సినిమాలో టైటిల్ సాంగ్ చేసింది మన శంకరీ, శైలేంద్ర పాటలకు ఎక్కువ మ్యూజిక్
చేసింది కూడా శంకరే అని చాలా మందికి తెలుసు.
ఈ జంట 'చోరి చోరి' (1956), 'అనారీ' (1959), దిల్ అప్నా ప్రీత్ పరాయీ (1960), 'ప్రొఫెసర్ (1962),
'సూరజ్' (1966), 'బ్రహ్మచారి' (1968), 'పెహచాన్' (1970), 'మేరానామ్ జోకర్ (1971), 'బేయిమాన్'
(1972), చిత్రాలకు ఫిలింఫేర్ అవార్డులు పొందారు. వీరి సంగీతంలో పాడిన లత 'చోరిచోరి' చిత్రానికి, రవి
'ససురాల్', 'సూరజ్' చిత్రాలకు, ఆషా భోంస్లే 'షికార్', 'నైనా' చిత్రాలకు గాను ఉత్తమ గాయనీ గాయకులుగా
అవార్డులు అందుకున్నారు.
శంకర్, జైకిషన్లు పాశ్చాత్య బాణీలు అనుకరిస్తారనే అపవాదు ఒకటి ఉండింది. కానీ, వారి బాణీలుంటేనే డిస్ట్రిబ్యూటర్లు సినిమాలు కొనే కాలం అది. అట్లాంటి సమయంలో 'బసంత్ బహార్' వచ్చింది. ఈ చిత్రానికి
ముందుగా అనిల్ బిస్వాస్ ను ఎంపిక చేశారు భరత్ భూషణ్. కానీ, డిస్ట్రిబ్యూటర్లు శంకర్ జైలే కావాలని తేల్చేశారు.
అయిష్టంగానే వీరిని ఎంపిక చేశారాయన. కానీ, మన శంకర్- జైలు దీన్నొక మహత్తర అవకాశంగా, సవాల్గా తీసుకుని
అద్భుతమైన పాటలు కూర్చారు.
శంకర్ - జైకిషన్లకు అత్యంత ప్రీతిపాత్రమైన రాగం భైరవి. నిజానికి అప్పటికే నౌషాద్, అనిల్ బిస్వాల్ భైరవి
రాగాన్ని ఆధారం చేసుకొని అనేక పాటలకు స్వరకల్పన<noinclude><references/>
{{rh|తెలంగాణ |437 | తేజోమూర్తులు}}</noinclude>
odbo0we3lxr3g3a6uis4xhe57a1stmd
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/459
104
212164
557071
553073
2026-05-26T09:42:58Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557071
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
చేశారు. అయితే అదే భైరవిని శంకర్ - జైకిషన్లు తమ సంగీతానికి ప్రాతిపదిక రాగంగా పెట్టుకొని పాటలను రూపొందంచారు. సునో చోటీసి గుడియాకి లంబి కహానీ (సీమా), బర్సాత్మే హమ్సే మిలే తుమ్ (బర్సాత్), కిసీసె
అప్పా బనాకె ముజు (పతిత), మైపియా తేరీ (బసంత్ బహార్), మెరానామ్ రాజు (జిన్ దేశ్మ గంగా బెహతీ హై), బోల్ రాధాబోల్ (సంగమ్) ఇంకా ఎన్నో సుమధుర స్వరకల్పనలు శంకర్ - జైకిషన్లు సృష్టించారు.
రాజ్ కపూర్ తరువాత ఆయ సోదరుడు షమ్మీకపూర్ చిత్రాలకు సంగీతం చేయడంలో కూడా శంకర్ - జైకిషన్లు
బాగా పాపులర్ అయ్యారు. అయితే, ఈ ఇద్దరి స్నేహం కొందరికి కన్ను కుట్టి ఉంటుంది. ఎలా జరిగిందో ఏమో
కానీ, 'ఎవరు, ఏ పాట చేశారనేది బయటికి చెప్పకూడదన్న' ఒప్పందం కాస్తా అనుకోకుండా ఉల్లంఘించబడింది.
'సంగం' (1964) లోని 'ఏ మేరా ప్రేమ్ పత్రే పడ్ కర్' పాటకు తానే ట్యూన్ చేశానని తన భార్య పల్లవికి రాసిన
ప్రేమ లేఖలో, హస్రత్ చేత పాట రాయించానని 'ఫిలిం ఫేర్ ' లో జైకిషన్ రాశాడు. దాంతో శంకర్ జైకిషన్ల
నడుమ విభేదాలు పొడసూపాయి. ఒప్పంద ఉల్లంఘన జరిగిందని శంకర్ అభ్యంతర పెట్టాడు.
'దిల్ ఏక్ మందిర్ తరువాత వారిద్దరూ విడిపోయారు. ఆ తరువాతి చిత్రాలకు విడిగానే సంగీతం సమకూర్చు
కున్నారు. అయితే, ఎవరికి వారు రెండు పేర్లను వాడుకున్నారు. కొన్నాళ్లు అలా శంకర్, జైకిషన్లుగా కొనసాగారు.
వారు విడిపోయాక రాజ్కపూర్ కోరిక మేరకు 'మేరా నాం 'జోకర్' సినిమాకు మాత్రం కలిసి పని చేశారు. 1948
నుండి 1971 వరకు శంకర్ - జైకిషన్లు చేసిన సినిమాల సంఖ్య సుమారు 180. ఒక్కో సినిమాకు అయిదు లక్షలు
హరితోషికం తీసుకున్న రికార్డు వీరిది.
జై కిషన్ 1971 సెప్టెంబర్ 12న తనువు చాలించారు. అప్పుడు సంగీతం అంతా జైకిషన్ చేశారని, శంకర్ దేనికీ
పనికి రాడని కొందరు నిందలు మోపారు. దీంతో అవకాశాలు సన్నగిల్లాయి. రెండేళ్లు ఒక్క సినిమా కూడా లేకుండా గడిపిన శంకర్ మళ్లీ 'సన్యాసి' చిత్రంతో పెద్ద హిట్ కొట్టారు. ఆ తరువాత స్వతంత్రంగా 30 సినిమాలకు
సంగీతాన్ని సమకూర్చి తన సత్తాను చాటాడు.
శంకర్ వెండితెరపై తెలంగాణ బతుకమ్మ పాటకు పట్టం కట్టిన సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
శంకర్ చొరవపట్లే అప్పట్లో 'ఫిలింఫేర్' అవార్డుల్లో గాయనీ, గాయకులకు చోటు కల్పించారు. ఫలితంగా లతాకు
వరుసగా 'ఉత్తమగాయని' అవార్డులొచ్చాయి. కాని తరువాతి రోజుల్లో లతాతో శంకర్కు అభిప్రాయభేదాలు వచ్చాయి.
గాయనీ శారదను ఎక్కువగా ప్రోత్సహించడం ఇందుకు కారణంగా చెప్తారు.
శంకర్ వెండితెరపై తెలంగాణ బతుకమ్మ పాటకు పట్టం కట్టిన సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, శంకర్ హైదరాబాదీ కావడం వల్ల ఆయన్ను హైదరాబాద్ తెలంగాణ సంస్కృతి నీడలు వీడ లేదనడానికి తన కంపోజింగ్సే సాక్ష్యాలుగా నిలిచాయి. 'శ్రీ 420'లో ముఖేష్తో పాడించిన 'రామయ్యా వస్తావయ్యా! రామయ్యా వస్తావయ్యా!' పాట నేటికీ ఎవర్గ్రీన్ సాంగ్. అట్లాగే 1964లో విడుదలైన 'రాజ్కుమార్' చిత్రంలోని 'నాచ్ రే మన్ బతుకమ్మ పాట, జెమీనీ వాళ్ళు 1969లో తీసిన 'షత్రంజ్ ' లో బతుకమ్మ బతుకమ్మ బతుకమ్మ - ఎక్కడ పోతావ్, ఇక్కడ ఇక్కడ రా!!” పాటను మహమూద్, రఫీ, శారదలచే పాడించారాయన.
ఆ రోజుల్లో ఈ ఒక్క పాట కోసమే చిత్రం హిట్ అయ్యింది. అదీ మన శంకర్ గొప్పతనమే. ఆ తరువాత 1971లో తెలుగులో వచ్చిన 'జీవిత చక్రం' సినిమాకి శంకర్ సంగీత దర్శకత్వం వహించారు. అందులో 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో...' పాట తెలంగాణ సంస్కృతిని ఆయన మరచిపోలేదనడానికి నిదర్శనం. అలా శంకర్ ఆనాడే మన బతుకమ్మకు పట్టం గట్టారు.
శంకర్ సినిమా రంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా 1979లో 'పద్దుశ్రీ' పురస్కారం లభించింది. ముంబాయిలో ఒక వీధికి శంకర్ జైకిషన్ పేరు పెట్టారు. ఇండస్ట్రీలో కొచ్చి తొలిరోజుల్లోనే యోధాను యోధుల సంగీతంతో పోటీపడి జయించిన ఆయన ఒక సందర్భంలో డెబ్భైల్లో వచ్చిన ఆర్డీ బర్మన్, లక్ష్మీ-ప్యారే, కళ్యాణీజీ ఆనంద్ జీల రణగొణుల హెూరులో ఇమడలేని తానుగానే<noinclude><references/>
{{rh|తెలంగాణ |438 | తేజోమూర్తులు}}</noinclude>
irvb09l1m16ubm3wv8jacrep4tf0f2v
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/460
104
212165
557073
553074
2026-05-26T09:45:08Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557073
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
సినిమాలు తగ్గించుకున్నట్టు చెప్పారు. బాలీవుడ్ వైభవానికి ఎంతో కృషి సల్పిన శంకర్ 1987 ఏప్రిల్ 26న కాలం
చేసి తన స్వరయాత్రను ముగించాడు. హైదరాబాద్ నుండి హిందీ చిత్రసీమకు జైరాజ్ అజిత్, చంద్రశేఖర్ల తరువాత
వెళ్లిన శంకర్ అక్కడ చేసిన స్వరయాత్ర దేశదేశాల్లో మార్మోగింది. రష్యా, జపాన్ వంటి దేశాల్లో ఆవారా, శ్రీ420
సినిమా పాటలు మార్మోగినవి. రాజకపూర్ సినీ విజయాలలో శంకర్ - జైల పాత్ర ఎంతైనా ఉంది. వారు బాణీలు
సమకూర్చిన ఎన్నో వందల పాటలు స్వర ప్రపంచాన్నింకా ఏలుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రజలంతా గర్వించదగిన
సినీ సంగీత దర్శకుడు శంకర్ సింగ్ రఘువంశి.<noinclude><references/>
{{rh|తెలంగాణ |439 | తేజోమూర్తులు}}</noinclude>
irir79jlbmnlcgw1hpk6dyymzydhdwx
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/461
104
212166
557087
553075
2026-05-26T10:26:00Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557087
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''126. శేఖర్ '''</p>}}
{{right|-చేతన కె.}}
పేజీల కొద్ది పూర్తిగా చదివితేగానీ అవగాహనకాని అంశాన్ని, ఒక కార్టూన్ చూడగానే తెలుసుకోవచ్చు. భాషకందని భావాన్ని, మాటలకందని సొగసుల్ని, కఠోర సత్యాన్ని, నగ్న నైజాన్ని, వెలుగునీడల సమ్మిశ్రంగా....
సమాజహితం కోసం అందించేదే కార్టూన్.
మాటల ద్వారాకాక కార్టూన్. ద్వారా ప్రయోజన ద్వారాలు తెరువగల కళ ఒక కార్టూనిస్టుది మాత్రమే. అటువంటి కార్టూన్ని ప్రేమించిన గొప్ప వ్యక్తి.
కీ॥శే॥ కంబాలపల్లి చంద్రశేఖర్
నల్లగొండ నేలలో పుట్టిన ఆయన, తెలుగు కార్టూన్కు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చి, అమెరికా ప్రభుత్వ ఆహ్వానంతో
ఆ దేశంలోని పలు రాష్ట్రాల్లో అధ్యయన పర్యటన జరిపిన తొలి తెలుగు వ్యంగ్య చిత్రకారుడు. కార్టూన్ కళా రంగంలో
ఏకలవ్యుడై మార్గదర్శకులను ఎంచుకొని జనం పక్షాన కుంచె పట్టి తనను తాను తీర్చిదిద్దుకుని, ప్రజా ఉద్యమాల్లో
తనవంతు సేవలు అందించినవారు శేఖర్.
కంభాలపల్లి వెంకయ్య, మల్లమ్మల రెండో సంతానమైన శేఖర్ చిన్నప్పటి నుండి ఇక్కట్ల మధ్యనే పెరిగాడు.
తల్లిదండ్రులు రైతు కూలీలు. పిల్లల్ని ఇంటిదగ్గరే వదిలేసి వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్ళాల్సిన దైన్యం
రెక్కాడితే కానీ డొక్కాడని స్థితి. తోటి పిల్లలతో ఆడుకుంటూ తనకంటే చిన్న పిల్లలు 6 గురి ఆలనా పాలనా చూసుకోవల్సి వచ్చేది. ఎంత పేదరికాన్ని చవిచూసినా ప్రతిభను పెంచుకోవటంలో వెనుకడుగు వేయలేదు శేఖర్. చిన్నప్పటి నుండి లైబ్రేరిలకు వెళుతూ - ఊర్లలోకి వచ్చే జానపద కళాకారుల జీవన విధానాలు గమనిస్తూ యువతతో మమేకమవుతూ ఉండేవారు. 4వ తరగతి వరకు సూర్యపేటలోని అడవి దేవులపల్లిలో చదువుకున్న శేఖర్ ఆ తర్వాత అన్నగారైన చంద్రయ్యగారి దగ్గరకు వచ్చేశారు. ఆర్థికంగా పాఠశాల బాధ్యతలు స్వీకరించలేని తల్లిదండ్రుల అన్నగారి దగ్గరకు పంపిస్తేనన్నా నాలుగు రీతుల ప్రపంచజ్ఞానం తెలుస్తుందని ఆశపడ్డారు. మొదటి మలుపు నల్గొండలో పడితే మరో మేలిమలుపు బి.ఏ. చదవటానికి ఉస్మానియా యూనివర్శిటీకి వచ్చినప్పుడు పడింది.
యూనివర్శిటీ వాతావరణం శేఖర్లో విపరీతమైన మార్పుల్ని తెచ్చింది. సౌమ్యుడు, నిరాడంబరుడు, నిగర్వి, స్నేహశీలి అయిన శేఖర్ ఆలోచనలు మరింత పరివ్యాపితమై ఉద్యమాల వెంట, బడుగుజనాల బాధలవెంట పయనించటం
ఆరంభమయ్యింది. ఆలోచనల పరిధిని అడుగడుగునా పెంచుకున్న శేఖర్ మిత్రబృందంలో నాయకత్వ లక్షణాలను
పెంచుకున్నారు. సహజంగా కార్టూనిస్టులందరూ అంతర్మయిలు. కానీ శేఖర్ సవ్యసాచి. ఒక దశలో కార్య నిర్వాహకుడుగా, కార్యకర్తగా, నాయకుడిగా, స్ఫూర్తి ప్రదాతగా అనేక పాత్రల్ని ఒకేసారి పోషించేవాడు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |440 | తేజోమూర్తులు}}</noinclude>
b77tp84as3au2irmvioc70om450ly37
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/462
104
212167
557090
553076
2026-05-26T10:36:06Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557090
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
చాలామంది ఎన్నెన్నో ఆశయాలున్నాయని చెప్తారు. 'చెప్తారు కోరి చెయ్యరు ఒక్కటి' అంటుంటారు అలాంటి
వాళ్ళను చూసినప్పుడు కానీ శేఖర్ ఏది చెప్తాడో అదే చేస్తాడు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని చివరికంటూ నిలబెట్టుకుంటూ నడిచిన ధీశాలి. అందుకే మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్ళికి కలుపుతీసే స్థాయి నుండి కంప్యూటర్ ఆపరేట్ చేసే చేర్చాడు. శేఖర్ అంటే అది. అది కుటుంబమైనా సమాజమైనా ఆశతో ఆశయాన్ని బ్రతికించుకుంటాడు. సమాజం ఆరోగ్యంగా బ్రతకటం కోసం అహర్నిశలు కష్టపడ్తాడు.
ఆయన తన జీవితకాలంలో 46 వేల కార్టూన్లు వేసారు. సుమారు పది భాషల్లో ఆయన కార్టూన్లు వెలువడ్డాయి. మెయిన్, పాకెట్, సండే శీర్షికల కార్టూన్లు, పోస్టర్లు, చిన్నా చితకా ఉద్యమ పత్రికలకు వేసే కవర్ పేజీ కార్టూన్లు, రాజకీయ పార్టీల ప్రచారానికి బినామి పేర్లతో వేసే కార్టూన్లు అన్ని కలిపి వెలిసి అన్ని వేల సంఖ్యకు చేరాయి.
1996లో బెల్జియమ్లో జరిగిన కార్టూన్ ఎగ్జిబిషన్లో పాల్గొని ఉత్తమ కార్టూనిస్ట్గా అవార్డు అందుకున్నారు. హిందుస్తాన్ టైమ్ 1998లో నిర్వహించిన పోటీలో పాల్గొని విజేతగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ కార్టూనిస్టు (2006) గ్రహీతగా, పదునైన చురకలు వేస్తూ పత్రికా రంగంలో పొలిటికల్ కార్టూనిస్ట్ గా పాతికి సంవత్సరాలు పూర్తిచేసు కున్నారు. కార్టూనిస్టు శేఖర్.
తన తొలి కార్టూన్ 1984లో అచ్చయిందని చెప్పేవారు శేఖర్ గారు. తొలిరోజుల్లో ఆయన 'కంభా' అనే పేరుతో
కార్టూన్లు వేస్తూ ఉండేవారు. 1989 జూన్ 16న ప్రజాశక్తి దినపత్రికలో ఆయన తొలి పొలిటికల్ కార్టూన్ ప్రచురింపబడింది. ప్రజాశక్తి దినపత్రికలో కార్టూనిస్టుగా నిలద్రొక్కుకున్న తర్వాత ఆయన ఆలోచనాసరళ, కార్టూన్ల
స్వభావం, పూర్తిగా మారిపోయాయి అని అనేవారు. అప్పటివరకు 'రంభా' పేరుతో 'అప్పడాల కర్ర' టైపు కార్టూన్లు
వేసిన ఆయన, మారిన తన ఆలోచన దృక్పథంతో 'శేఖర్' పేరుతో రాజకీయ కార్టూన్లు వేయటం మొదలుపెట్టారు.
ప్రతి అంశాన్ని పీడితుల కోణంలో సమాజంలోని భిన్న దొంతరల కోణంలో పరిశీలిస్తూ కార్టూన్లు వేయడం
ప్రారంభించారు.
ఎక్కువగా ఆర్.కె. లక్ష్మణ్ని గురుతుల్యుడిగా భావించేవారు. రాజకీయాలను ఆయన విశ్లేషించే తీరును ఎక్కువగా
స్టడీ చేసేవారు. అవసరాలకొద్ది ఇతర సీనియర్ కార్టూనిస్టుల శైలిని అనుకరిస్తూ కొంతకాలానికి తనదైన "శైలిని" క్రియేట్ చేసుకున్నానని చెప్తుండేవారు.
ఎమ్.ఎ., ఎల్.ఎల్.బి. చేసినా కూడా, కేవలం 1200 రూపాయల జీతానికి ఏరి కోరి కార్టూనిస్ట్ ఉద్యోగం చేసేవారని వారి శ్రీమతి చంద్రకళ చెప్తుంటే, ఆశ్చర్య పోయేవాళ్ళం. అది శేఖర్ గారికి కార్టూన్ రంగంమీద గల ప్రేమ, కమిట్మెంట్ అని తరువాత అర్థమైంది. కార్టూన్ రంగం కోసం రెండూ ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకున్న ఘనత శేఖర్ గారిది.
దినపత్రికల్లో వృత్తిపరంగా వేసే కార్టూన్లకంటే ప్రవృత్తి పరంగా, ఇతర ఆర్ధిక అవసరాల కోసం మారుపేర్లతో కనీసం
సంతకం చేయడం లేకుండా వేసిన కార్టూన్లు కోకొల్లలు. ఇక సిండికేట్ ద్వారా ఇతర భాషల్లో వచ్చిన కార్టూన్లు తెలుగు
పాఠకులకు తెలియనే తెలియదు. అలా ఫ్రీలాన్సర్గా వివిధ సంస్థలకు పనిచేస్తూ, “చేతన పబ్లికేషన్స్" పేరిట పుస్తక
ప్రచురణలు కూడా చేసారు. ఆ తరువాత ఆయన ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రజ్యోతుల్లో పొలిటికల్ కార్టూన్ ఎడిటర్ గా పని చేసారు.
వృత్తిలో బిజీగా ఉన్నా, నిరక్షరాస్యురాలైన తన భార్య చంద్రకళను చదివించుకున్నాడు. తనచేత 'కలుపు తీసిన.... కంప్యూటర్ చేసిన అనే పుస్తకం రాయించారు. అందుకే “కొమ్మ చెక్కితే బొమ్మరో - కొలిసి మొక్కితె అమ్మరో” అన్నట్టు నన్ను తయారుచేసారు అని శేఖర్ గారి గురించి ఆ పుస్తకంలో చెప్పింది.
కేవలం రోజువారి రాజకీయ కార్టూన్లే కాకుండా, అగ్రదేశాల పెత్తనం మీద, ప్రపంచీకరణం మీద, మతోన్మాదం, అధిక ధరలు, అమెరికా డాలర్ రుబాబులపై ఇతర కార్టూనిస్టులు ఎవరూ ముట్టని అంశాలపై లెక్కకు మిక్కిలి కార్టూన్లు గీశారాయన. మారుతున్న కాలానికి అనుగుణంగా 'శేఖర్ టూన్స్' సిండికేట్ను దిగ్విజయంగా నడిపి తెలుగు
సత్తా చాటిన అత్యుత్తమ కార్టూనిస్ట్ శేఖర్.<noinclude><references/>
{{rh|తెలంగాణ |441 | తేజోమూర్తులు}}</noinclude>
5wu1vhbaxwkmt20gie5lo6fym6k2h4s
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/463
104
212168
557091
553077
2026-05-26T10:44:41Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557091
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
కార్టూన్ ఐడియాల మీద ఆయనకు వివరీతమైన కమాండ్ ఉంది. నిద్రలో లేపి అడిగినా దేనికి ఎలా వేయాలో
చెప్పగలిగే నేర్పు అతని స్వంతం. కొందరు బొమ్మ మీద శ్రద్ధ పెడితే, ఆయన ఐడియాల మీద శ్రద్ధపెట్టి 'రపీ' మని
పేల్చేవారు. ఇంట్లో ఎటు చూసినా నోట్సులు, ఆ నోట్సుల్లో ఐడియాలు. ఆయన పూర్తిగా కార్టూన్ రూపంలోకి మలచని
ఐడియాలు అనేకానేకం అలానే ఉన్నాయి. అంత శ్రమపడ్డానికి చాలా ఓపిక కావాలి. ఎంతో ప్రేమ వాటిమీద
ఉండాలి.
కార్టూనిస్టుగా శేఖర్ గారు గీసిన వేలాది కార్టూన్లు దేశంలోని, విదేశాల్లోని అణేక భాషల్లో వచ్చాయి. ఒక ప్రాంతీయ భాషా పత్రికలో కార్టూనిస్టుకి ఇంతగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావడం అసాధారణ, వేలాది కార్టూన్లు వేసిన కమ్యూనిస్టుగా తాను గోడలపై రాసిన రాతలే తనకు స్ఫూర్తి అంటారు. “ఒక ఆర్ట్ ఫామ్గా కార్టూన్ చాలా గొప్పది. కార్టూన్ రాత్రికి రాత్రి అద్భుతాలు సృష్టించక పోవచ్చు. కానీ ఒక ఆలోచన సృష్టించే కార్జున్ దాని పని అది చేసుకుపోతుంది" అంటారాయన.
'ప్రపంచంలో ఏ మూల పీడిత ప్రజలున్నా, చూసి ఒక చిత్రకారుడిగా మనం స్పందిస్తాం. అలాంటిది మనం
పుట్టిన గడ్డమీదే సమస్యలు ఉన్నప్పుడు స్పందించకపోతే ఎలా' అంటూ 'గిదీ తెలంగాణా' పుస్తకం వెలువరించారు.
తెలుగు కార్టూనిస్టులకి ఎవరికి రాని అమెరిగా ఆహ్వానం తనకి వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్న అవకతవకలు అన్నీ
చమత్కారంగా చూపే కార్టూన్లతో 'కలర్స్ ఆఫ్ ఇండియా' అనే పుస్తకం వేశారు.
వేర్వేరు అంశాలమీద అప్పటికే పారాహుషార్, శేఖర్జూన్, బ్యాంక్ బాబు వంటి అనేక పుస్తకాలు ప్రచురించినప్పటికి, అచ్చయిన తన కార్టూన్లలో ఇప్పటికీ వాడిపోని కార్టూన్లలో కనీసం ఏడెనిమిది కార్డును సంపుటాలు తేవచ్చు అంటారు ఆయన.
పాతికేళ్ళ శేఖర్ కార్టూన్ ప్రయాణంలో అనేక అటుపోట్లు ఉన్నాయి. పాత్రికేయ వృత్తిలో ఉండే కులం కుళ్ళు పల్ల అనేక ఒత్తిళ్ళను ఎదుర్కొన్నారు. ఎన్నోసార్లు మానసిక వ్యధకు గురయ్యేవారు. అయినా అధైర్యపడకుండా వాటిని
అధిగమిస్తూ అన్నేళ్ళు కార్టూనిస్టువ నిలదొక్కుకోవడం అంటే సామాన్యమైన విషయంకాదు. క్యాన్సర్తో బాధపడిన ఆయన, ఆరోగ్యం సహకరించకపోయినా నా చేయి కదులుతున్నది చాలు అని సంబరపడుతూ కార్టూన్లు వేయడం ఆయనకే సాధ్యం.
తన శరీరంలోని క్యాన్సర్లో ఆయనకు ఈ వ్యవస్థను పట్టిపీడిస్తున్న కుల క్యాన్సర్ కనిపించింది. తాను వ్యక్తిగా తనదైన ఈ క్యాన్సర్ మీద కాక, కుల క్యాన్సర్పై యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇదొక సాహసం. శేఖర్ క్యాన్సర్ వ్యాధిపై పోరాడుతూనే సమాజంలో నెలకొన్న కులవివక్షతను ఎండగడుతూ 'క్యాన్సర్' పేరుతో కార్టూన్ల పుస్తకాన్ని తెచ్చారు.
చివరి రోజుల్లో ఒకవైపు అనారోగ్యం, మరోవైపు కార్టూన్లతో రాజకీయ యుద్ధం చేస్తున్న శేఖర్బాబు, ఆయన రజతోత్సవ కార్యక్రమంలో ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఘనంగా సత్కరించుకున్నారు. అతని మిత్రబృందం.
దీర్ఘకాలంగా పోరాడుతున్న మృత్యువుకి అతను తలొగ్గక తప్పలేదు. మరణం అనివార్యం. కానీ మరణాన్ని కూడా సవాలు చేస్తూ చివరి వరకూ కార్టూన్ కళకి అంకితమైన ఆయన్ను తలచుకుంటే, కార్ట్యూన్ల పట్ల ఆయన తపన, ప్రేమ, అంకితభావం అన్నీ మనకు అవగతమవుతాయి. దాదాపు రెండేళ్ళు క్యాన్సర్తో బాధపడిన ఆయన, సంకల్ప బలంతో దాన్ని జయించే ప్రయత్నం చేసి మే 19, 2014న కన్ను మూసారు. మే 20, కార్టూనిస్టుల దినోత్సవానికి ఒకరోజు ముందు కన్ను మూసారు.
అతని వ్యక్తిత్వంలో ఎదురీదేతత్వం, సాధించే పట్టుదల మొదటి నుండిబట్టి, కష్టకాలంలో అతనలా జీవించడం
సాధ్యపడింది. నేడు ఆయన మన మధ్య భౌతికంగా లేకున్నా ఆయన కార్టూన్లు మాత్రం సజీవంగా ఉంటాయి.<noinclude><references/>
{{rh|తెలంగాణ |442 | తేజోమూర్తులు}}</noinclude>
7t82mfip2vrya929c52boljsac40ylj
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/464
104
212169
557093
553078
2026-05-26T10:52:59Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557093
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''127. షోయబుల్లాఖాన్ '''</p>}}
{{right|-దేవులపల్లి ప్రభాకరరావు}}
దాదాపు వంద సంవత్సరాలు నిరంతరంగా కొనసాగి అంతిమ విజయంతో లక్ష్యాన్ని సాధించిన భారత జాతీయ, స్వాతంత్య్ర, ఉద్యమాలలో నిరంకుశ పాలకుల నిర్బంధాలకు, అమానుష చర్యలకు, అక్రమ ఆంక్షలకు గురి
అయి చెఱసాలలో కఠిన శిక్షలు అనుభవించిన, ఉరికంబా లెక్కిన, శరీరాలలో బుల్లెట్లు నిండిన, బాకుల పోట్లతో
శరీరాలు ఛిద్రమయి రక్తం చిందిన, చివరికి అమూల్య ప్రాణాలను కోల్పోయిన దేశభక్తులు, స్వాతంత్య్ర సమర
యోధులు అనేకులు, అసంఖ్యాకులు, దేశభక్తి, మాతృభారతి సేవానురక్తి జలపాతాలయి పొంగివచ్చి కొందరు గళమెత్తగా, మరి కొందరు కలాలను ఎత్తినారు.
దేశభక్తులందరికి, స్వాతంత్య్ర యోధులందరికి, సకల భారత జనకోటికి స్ఫూర్తినిచ్చింది. ఆలంబనమయినది.
ముందుకు నడిపించింది కఠోర వజ్ర సంకల్పం - స్వాతంత్య్ర సాధన ప్రబల ఆకాంక్ష. స్వాతంత్య్ర సాధన అగ్నిహోత్రంలో ఉతుతాభక్తిగ ఎవరికి అందిన సమిదలనువారు జ్వలింపజేసారు. భారత జాతీయ, స్వాతంత్య్ర ఉద్యమాల చరిత్రలో భారతీయ పత్రికలు, పాత్రికేయులు, పత్రికా రచయితలు, సంపాదకులు అత్యంత సాహసవంతంగా నిర్వహించిన పాత్ర మహోజ్వలమయినది. అదొక ఉజ్వల అధ్యాయం. దేశభక్తి ఉద్దేశించిన పత్రికల, స్వాతంత్య్ర యోధులయిన పాత్రికేయుల, పత్రికా రచయితల, సంపాదకుల గొంతు నొక్కడానికి, వారి మేధస్సులను బంధించడానికి, వారి కలాలకు సంకెళ్లు వేయడానికి బ్రిటిష్ పాలకులు పలు దుష్టచట్టాలను
ప్రవేశపెట్టి పత్రికా స్వేచ్చా స్వాతంత్య్రాలకు భంగం కల్గించారు.
అయినప్పటికీ, అన్ని అవరోధాలను ఎదుర్కొంటూ స్వాతంత్య్ర ప్రియులు పత్రికా ప్రచురణను కొనసాగించారు. తమ పత్రికల ద్వారా స్వాతంత్ర్యోద్యమాన్ని విజృంభింప జేయడానికి అపార కృషి జరిపారు. గాంధీజీ మొదట దక్షిణాఫ్రికాలో, తరువాత స్వదేశంలో తన ఆశయాలకు సిద్ధాంతాలకు కాహళిగా హరిజన్, నవజీవన్ పత్రికలను
స్వయంగా తన సంపాదకత్వంలోనే ప్రచురించారు. గాంధీజీ కంటే ముందు గత శతాబ్ది ప్రారంభంలో భారత జాతీయ, స్వాతంత్య్ర ఉద్యమాలలో ప్రముఖ స్థానం ఆక్రమించిన లోకమాన్య బాలగంగాధర తిలక్ స్వరాజ్యం నా జన్మహక్కు అని గర్జించి యువతరాన్ని ఉత్తేజపరిచారు.
ఆయన సంపాదకత్వంలో, మార్గదర్శకత్వంలో ప్రచురిత మయిన రెండు పత్రికలు కేసరి (మరాఠీలో) మరాఠా (ఇంగ్లీషు). మహామేధావి తిలక్ ఈ రెండు పత్రికలలో రాసిన వ్యాసాలు వాటిలో, ఆయన ఇతర రచనలు ఆంగ్లేయ పాలకులకు ఆగ్రహం కల్గించాయి. ఆయనకు వ్యతిరేకంగా 1898లో ఒక కేసుపెట్టి 18 మాసాల కఠిన కారాగార శిక్ష విధించారు. 1908లో మరో కేసు పెట్టి 6 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించి మాండలేల<noinclude><references/>
{{rh|తెలంగాణ |443 | తేజోమూర్తులు}}</noinclude>
kklrqfihmwvksx9ezbfdmxcpqom966p
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/465
104
212170
557096
553079
2026-05-26T11:22:23Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557096
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
(బర్మాల) నిర్బంధించారు. మండలే జైలులో తిలక్ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. అయినప్పటికి ఆ జైలులోనే ఆ మహా భాష్యకారుడు గీతారహస్య వ్యాఖ్యానం రచించారు. బ్రిటిష్ ఇండియాతో పోల్చినప్పుడు హైదరాబాద్ తదితర సంస్థానాలలో రాచరిక నిరంకుశత్వం ప్రజల హక్కులను జీవితాలను విపరీతంగా అణగదొక్కింది. నాటి హైదరాబాద్ సంస్థానంలో ఒకవంక నిజామ్ నిరంకుశ పాలన, మరోవంక నిజాం ప్రోత్సాహంతో మతోన్మాద పైశాచిక మూకల రాక్షసత్వం, అమానుష కృత్యాలు భయంకర పరిస్థితిని సృష్టించాయి.
కవులు, రచయితలు, సంపాదకులు, పత్రికా రచయితలు, మేధావులు, దేశభక్తితో, మానవతా దృక్పదంతో, ఆవేశంతో ఆవేదన పొందిన భయానకమైన రోజులవి. నిజాంరాజు నిరంకుశ పాలనల మతోన్మాదులు చెలరేగి
అరాచకం, అగ్నిగుండం సృష్టించిన భయంకరమయిన రోజులవి. మారణ హోమం మండిన ఆ రోజుల్లో నిజాం
నిరంకుశత్వాన్ని, నిజాం నీడలో వడగలిప్పి బుసకొట్టిన మతోన్మాదాన్ని అమానుషత్వంతో చెలరేగిన దుండగులను
నరరూప రాక్షసులను ధైర్యసాహసాలతో ప్రతిఘటించి, వనవత్వ విలువల పరిరక్షణ నిమిత్తం కంకణం కట్టిన
నిరుపమాన యోధుడు.
పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు పోయబుల్లాఖాన్, పూర్వపు హైదరాబాద్ రాష్ట్రవిముక్తి ఉద్యమ, స్వాతంత్య్ర
సమర చరిత్రలో ప్రముఖుడు షోయిబ్ పాత్ర రక్తాక్షరాలతో లిఖితమవుతుంది. ఆయన అసమానత్యాగం ఉత్తేజ పరచే
ఒక ఉజ్వల అధ్యాయం. ఆ అమరవీరుని గాధ ఆదర్శప్రాయం. చిరస్మరణీయం, హిందూ - ముస్లిం సోదరత్వానికి
సజీవ ప్రతీక షోయబుల్లాఖాన్,
షోయబ్ పుట్టింది వరంగల్లు జిల్లా మానుకోటలో, ఆయన తండ్రి హబీబుల్లాఖాన్ నిజాం సర్కారులో ఒక పోలీసు
అధికారి. షోయబ్ జననానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. దాదాపు వంద సంవత్సరాల కిందట అప్పుడే భారత
రాజకీయ రంగంలో అడుగుపెట్టి ఒక వినూత్న రీతి స్వాతంత్య్ర సమరానికి శంఖారావం విన్పించిన గాంధీ మహాత్ముడు దేశమంతటా పర్యటిస్తూ 1920 అక్టోబర్ 12న తేదీన విజయవాడ నుంచి వార్ల రైలులో వెళ్ళుతూ మానుకోట రైలు స్టేషనులో కొద్ది నిమిషాలు ఆగి అక్కడకి చేరిన అసంఖ్యాక ప్రజలకు దర్శనం ఇచ్చారు. ఆ రోజు పోలీసు
అధికారి హబీబుల్లాఖాన్ మానుకోట స్టేషనులో శాంతి భద్రతల బాధ్యత, విధి నిర్వర్తించడానికి నియుక్తులయ్యారు.
గాంధీ మహాత్ముడి నిరాడంబరత్వం, ఆయన ముఖంలోని తేజస్సు హబీబుల్లాఖాన్ ను బాగా ఆకర్షించాయి. స్టేషనులో విధి నిర్వహణ తరువాత ఇంటికి వెళ్ళిన హబీబుల్లాఖాను కొడుకు పుట్టిన శుభవార్త తెలిసింది. తన పసిబిడ్డ ముఖంలో హబీబుల్లాఖాన్ కు గాంధీ మహాత్ముడు కన్పించాడు. ఆ బిడ్డకు షోయబుల్లాఖాన్ అని నామకరణం చేసారు.
ముద్దుగా అందరు ఆ బిడ్డను 'గాంధీ షోయబ్' అని పిలిచేవారు. షోయబ్లో చిన్నప్పటి నుంచే చురుకుతనం ఎక్కువ. బాల్యంలోనే షోయబ్ రచనా పాటవం వికసించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆయన పట్టభద్రుడు. పట్టభద్రత అనంతరం పత్రికా రచయితగా ఆయన జీవన రంగంలో ప్రవేశించాడు. షోయబ్ పత్రికా రచన మొదట తేజ్ వారపత్రికలో ప్రారంభమయింది. సామాజిక ప్రయోజనంతో, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా,
మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ మతోన్మాదాన్ని ఖండిస్తూ తన లేఖినిని శక్తివంతమయిన ఒక అస్త్రంగా ప్రయోగించడానికి షోయబ్ కంకణం ధరించాడు.
నిజాం నిరంకుశ పాలనలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, అరాచకత్వాలను, తీవ్రంగా విమర్శిస్తూ
షోయబ్ రాసిన వ్యాసాలు తేజ్ పత్రికలో ప్రచురితమయినాయి. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ అధిపతి
కాసింరజ్వీ దుష్ట విధానాలను, మతతత్వాన్ని, అక్రమ చర్యలను విమర్శించినందుకు నిజాం ప్రభుత్వం తేజ్ పత్రికను నిషేదించింది.
ఆ రోజుల్లో ప్రముఖ స్వాతంత్రోద్యమ నాయకులు మందుముల నరసింగరావు సంపాదకత్వంలో వెలువడుతున్న
'రయ్యత్' ఉర్దూ పత్రికలో షోయబ్ రచయితిగా ప్రవేశించాడు. రయ్యత్ పత్రికలో గూడ షోయబ్ నిర్భయంగా నిజాం
నిరంకుశత్వాన్ని, దమన నీతిని, మతోన్మాదాన్ని ఖండిస్తూ రాసాడు. నిజాం ప్రభుత్వం రయ్యత్ను సైతం నిషేధించింది.
షోయబ్ స్వయంగా, తన సంపాదకత్వంలో ఇమ్రోజ్<noinclude><references/>
{{rh|తెలంగాణ |444 | తేజోమూర్తులు}}</noinclude>
reujulu7tfl08kg0jqjawjzbw4m11iu
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/467
104
212172
557097
553081
2026-05-26T11:31:30Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557097
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''128. సిద్ధప్ప వరకవి '''</p>}}
{{right|- డా॥ బి.వి.ఎస్. స్వామి}}
ఆయన చదివింది ఏడవతరగతి. ఆరు భాషలపై ఆయనకు పట్టుంది. చేపట్టింది ఉపాధ్యాయ వృత్తి. సమాజ సేవ ఆయన ప్రవృత్తి. స్వరాజ్య ఉద్యమంలో రూమి టోపీకి బదులుగా, గాంధీ టోపి ధరించి విధులకు వెళ్ళినందుకు ఉపాధ్యాయ ఉద్యోగం నుండి నిజాం ప్రభుత్వం ఆయనను తొలగించింది. అప్పటి నుండి తన ప్రవృత్తి కనుగుణంగా వాస్తు, వైద్య ఆయుర్వేద శాస్త్రాల్లో ప్రాముఖ్యం సంపాదించి ప్రజలకు సేవ చేసారు. ఆయనే సిద్దప్ప వరకవి.
కోహెడ మండలం గుండారెడ్డి పల్లెకు చెందిన లక్ష్మమ్మ, పెద్ద రాజయ్యలకు 1903లో జన్మించారు. 1984లో తాను
చనిపోయే రోజును ముందుగానే ప్రకటించి తేది. 23.3.1984 రోజున సాయంత్రం 3 గంటలకు ప్రాణాలు విడిచారు. తెలంగాణ తొలి సమాజ వేదాంత కవి, గోల్గొండ కవి, తత్వకవిగా పేరు పొందారు.
తెలంగాణాలో నిజాం కాలాన సంక్లిష్టమైన పరిస్థితు లుండేవి. ఒకవైపు అవిద్య, అనారోగ్యం, అసమానతలు, నిజాం సైన్యం, దొరలు, దేశముఖ్ ఆగడాలతో ఈ ప్రజలు అసహాయులై దీనంగా కాలం గడిపారు.
అలాంటి ప్రజలను స్వాంతన పరచడానికి ఈ ప్రాంతంలో వరకవులు పుట్టుకొచ్చారు. అందులో ప్రసిద్ధుడీ సిద్దప్ప భక్తి భావన ముందు అసమానతలు, కుల భేదాలు కానరావు కనుకనే అంతా ఒక్కటే అని నినాదించాడు. ఆ మాట ప్రజలకు బలాన్ని ఇచ్చింది. మూఢ విశ్వాసాలను ఖండించి ప్రజలకు జ్ఞానమార్గాన్న చూపించారు. తమ కష్టసుఖాలను పట్టించుకొని, వాటి పరిగీతమార్గాలను చూపించటంవల్ల ప్రజలకు ఆరాధ్యుడయ్యాడు. అందుకే
శిష్యగణం తయారయ్యారు. జలస్థంబన ఊరి జనం మంచి చెడ్డలు బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్లు, వీరు తన వద్దకు వచ్చిన ప్రజలకు భవిష్యత్తు బోధించి వారికి ధైర్యాన్ని ఇచ్చి పంపేవారు. ఆపాటి మాట సాయం అనేది ఆనాడు ఒక పెద్ద బాధ్యత అది నెరవేర్చి సిద్దప్ప వరకవి చిరస్మరణీయుడయ్యాడు.
సిద్దప్ప వరకవి జ్ఞానబోధిని నాలుగు భాగాల్లో రచించి వరకవిగా గొప్ప పేరుతోపాటు యక్షగానాలు, స్తోత్రాలు, వర్ణమాలలు, సుభాషితాలు, హితబోధలు, వేదాంత తత్వకీర్తనలు, కాలజ్ఞానములు, కందార్థ దరువులు, నక్షత్రమాలలు వంటి ఎన్నో రచనలు చేసారు. సురవరం ప్రతాపరెడ్డి తన గోల్కొండ పత్రికలో రాసారు. నీల జంగయ్య, తెలుగు తత్వకవి పరిశోధన గ్రంథంలో వేమన, కబీర్ దాస్ పద్య పోలికలు ఎలా ఉన్నాయో సిద్ధప్ప రచనలోనూ అలా ఉన్నాయని అన్నారు.
పల్లెలో పుట్టి పెరిగినవాడవటంవల్ల, తన కులవృత్తిని విడువకపోవటంవల్ల, నిత్యం ప్రజలలో సేవా సంబంధాలు
నెరపటంవల్ల సిద్దప్ప సాహిత్యంలో తెలంగాణ పలుకుబడులు<noinclude><references/>
{{rh|తెలంగాణ |446 | తేజోమూర్తులు}}</noinclude>
sgqk8s1cngt3aipazzbfbt57hojgfnv
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/468
104
212173
557098
553082
2026-05-26T11:44:15Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557098
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
తేలియాడతాయి. తన కులవృత్తిలో భాగంగా మట్టి తడపడం, కుండలు చేయడం, వాము పెట్టడంవంటివన్నీ చేస్తూనే మంత్రముగ్ధులను చేసే గొప్ప కవితాత్మక ప్రయోగాలు చేసారు. ఆయన తన గురించి గొప్పలు ఎప్పుడు చెప్పుకోకపోగా, తనలోని అక్షరశక్తి కతటికీ వానరమ్మ (బాసర సరస్వతీదేవి) కృపాకటాక్షణాలే కారణమని ప్రకటించడం
విశేషం. సీసం, గీతం, కందం, ఆటవెలది, తేటగీతి వంటి పద్యాల శైలిలో అద్భుతంగా, సరళసుందరమైన వద
ప్రయోగాలు చేసారు. వీరి పద్యాలు, వేమన పద్యాలవలె పండిత పామర నాలుకలపై తారాడతాయి.
సామాజిక స్థితిగతులకు స్పందించి రచనలు చేయడం, దురన్యాయాలను దునుమాడడం వీరికి ఇష్టమైన కర్తవ్యాలు.
దొరలు, పెత్తందారులు, దేశీయులు, దేశముఖ్ లు వంటి పెత్తందార్లపై తన పద్యాలలో విరుచుకపడ్డారు.
<poem>
బూతి జంద్యాలు చేతుల రాతి లింగాలు
చేతురూ శివపూజ చెలుల ఇంట
చక్కనీ దండాలు చంక కమండలాల్
పడకవేతురు-- పడుచులకునూ!</poem>
అంటూ నేడు చూస్తున్న దొంగస్వాముల బాణాన్ని నాడే తేటతెల్లం చేసారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి,
యోగివేమనలను ఆదర్శంగా చేసుకొని సాహితీ సేద్యం చేసారు.
<poem>
ఆకాశమొక్కటే తెప్పలతీరులెన్నో
జలా ఒక్కటే అయినా చెట్ల సారంవేరు
మానవ జన్మ ఒక్కటేకాని గుణాలు వేరు.</poem>
ఇలా ఎన్నో తత్వ ప్రబోధనలు సిద్దప్ప వరకవి రచనల్లో మనకు కనిపిస్తాయి.
<poem>
"చదువులేదిక నాంధ్ర సంగ్రహంబులలెన్స.
కనిచూడలేదొక్క కావ్యమైన
నోట బల్కియు చేత నొనరంగ వ్రాసింది చెలువొంద
మీ పాదసేవకుడను</poem>
అని వినమ్రంగా తెలిపాడు. వాడివరంచే కవిత్వానికి చేరువై పద్యం రాయగలిగానని, అందుకే తాను వరకవినని
తెలుపుకున్నాడు. "గొప్పవాడనుగాను, కోవిదుడనుగాను తప్పులున్నను దిద్దుడీ తండ్రులార” అని విశదపరిచాడు.
చాలామంది తాత్వికుల్లానే సిద్దప్ప కూడా వైరాగ్యాన్ని బోధించారు. ప్రజలు ఈ బోధనలను కళ్ళకద్దుకున్నారు.
<poem>
సీ. అజ్ఞానియే శూద్రుడవనిలో నెవడైన
సుజ్ఞానియే యాత్మ సుజనుతదు
వేదంబు జదివినా విప్రుడా విహితుండు
బ్రహ్మమెరిగిన వాడే బ్రాహ్మణుడు
వర్తకంబును జేయు వణిజుండు వైశ్యుందు
అవని పాలించె నరుడె ప్రభువు
సకల నిందలు నోర్చు సదయిడు నరుడౌను
మత భేద విడిచిన యతివరుండు
గీ. జన్మచేతను వీరింక కలియంషమున
పేరు గాంచిన యెవరెవరి బెర్మి పనులు
వినుడి మాయప్ప సిద్దప్ప విహితుడప్ప
కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప</poem>
అంటూ చాతుర్వర్ల లక్షణాలను పునర్నిర్వచించి, భావజాలపరంగా సమతను సాధించాడు. చాలా పద్యాలలో
ఆర్తి, వేదన, సంఘరీతిపట్ల కసి, అసమానతలపట్ల అసహ్యం కనపడుతుంటాయి.
<poem>
సీ. ఏ కులంబని నన్ను ఎరుకతో నడిగేరు
నా కులంబును జెప్ప నాకు సిగ్గు
తండ్రి బొందిలివాడు తల్లి దాసరి వనిత
మా తాత మాలోడు మరియు వినుడి
మా యత్త మాదిగది మామ యెరుకలవాడు
మా బావ బలతడు మానవతుడు
కాపువారీ పడుచుకంత దొమ్మరి వేశ్య
భార్యగావలె నాకు ప్రాణకాంత
ఈ విధంగా కులవాదాన్ని నిరసిస్తాడు. సమస్త కులాల విరాట్ స్వరూపంగా కనిపిస్తాడు.
"రాతి బొమ్మల మొదట రాశిగా అన్నంబు
తినమన్న యా రౌతు తినదురన్న
తినెడి వాడవు నీవె తీవంబు చెందేవు
కానలేవు నీలోని తిమిరములను
పేదలకు అన్నంబు పెటు ధైర్యంబులేదు.
గట్టురాళ్ళకు తిండి పెట్టగలవే...." అంటాడు.</poem>
వీరి పద్యాల్లో జాషువా, కాళోజీల అడుగుజాడలు కనపడతాయి. భక్తి మార్గంలో ఉంటూనే మూఢ భక్తిని
చతురుడు తెలంగాణ (447) తేజోమూర్తులు మీడ<noinclude><references/>
{{rh|తెలంగాణ |447 | తేజోమూర్తులు}}</noinclude>
6chuc9360p6w7143ffb8ekybsjhuqrk
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/469
104
212174
557099
553083
2026-05-26T11:48:34Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557099
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
నిరసించాడు. జ్ఞాన మార్గంలో పయనిస్తూ కొత్త దాడులు చూపాడు. ఛందస్సును పుక్కిట పట్టుకున్నా. వ్యాకరణాన్ని
తోసివేయలేదు.
తెలంగాణలో మరణం తరువాత కూడా బతికున్న సిద్దప్ప వరకవి అత్యంత ప్రసిద్ధుడు. సిద్దప్ప జ్ఞాపకార్ధం 1996లో అతని సమాధి వద్ద విగ్రహప్రతిష్ట ఏర్పాటు చేశారు. ప్రతి కార్తీక పౌర్ణమి రోజున నలుమూలల నుంచి వచ్చిన వీరి శిష్యులు విగ్రహం సాక్షిగా గురుపూజోత్సవాన్ని జరుపుతారు. కార్తీక పౌర్ణమే కాకుండా గురుపౌర్ణమి పాల్గుణ బహుళ సప్తమి రోజుల్లో ఆశ్రమంలో అన్నదానాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుపుతుంటారు. 1984లో సిద్దప్ప వరకవి భౌతికంగా ఈ లోకం నుండి వెళ్ళిపోయినా శిష్యుల చేతుల ద్వారా సారస్వతిభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినాక, కొత్తగా తీర్చిదిద్దబడిన తెలుగు వాచక పుస్తకాల్లో ఒకటైన తొమ్మిదవ తరగతి తెలుగు వాచకంలో సిద్దప్ప వరకవి జ్ఞానబోధిని రెండవ భాగం నుంచి ఒక సీసపద్యం "కోపంబు మనుషులా కొంపముంచు” అనే పద్యాన్ని చేర్చారు. అలా సిద్దప్ప ఎదుగుతున్న చిన్నారుల నోళ్ళలో నానుతున్నాడు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |448 | తేజోమూర్తులు}}</noinclude>
kyzuwfketx5n6o5xvf3kg6458en205d
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/470
104
212175
557100
553084
2026-05-26T11:51:00Z
A.Murali
3019
557100
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''129. సిరికొండ వెంకటరావు '''</poem>
{{right|- డా॥ వెల్చాల కొండలరావు}}
రికొండ వెంకట్రావు గారు కరీంనగర్ జిల్లా
సిరికొండ గ్రామంలో జన్మించి ఉస్మానియా
యూనివర్సిటీలో ఎం.ఎ., ఎల్.ఎల్.బి. వరకు చదివి,
న్యాయవాదిగా సిద్ధిపేటలో స్థిరపడ్డారు. జులై నెల 13,
1933నాడు జన్మించిన వెంకట్రావు గారు మార్చి నెల 10,
2010 సంవత్సరంలో పరమపదించారు. మెదక్ జిల్లాకు
చెందిన సిద్ధిపేటలో బహు ప్రతిభావంతునిగా, సాహిత్య
ప్రియునిగా, సాహిత్య ప్రోత్సాహకునిగా, సంఘసేవకునిగా,
పుట్టపర్తి సాయిబాబా ప్రియభక్తునిగా, మెదక్ కరీంనగర్
జిల్లాల్లోనే కాక తెలంగాణా ప్రాంతంలో, హైదరాబాదు
నగరంలో చాలామంది మేధావులకు, సాహిత్యవేత్తలకు,
సంఘసేవకులకు తెలిసినవారు.
విమర్శకుల్లో ఎంతో చక్కని విమర్శనాత్మక, పరిశోధనా
త్మక దృష్టి దృక్పథమున్న వారుంటారు. వారు గ్రంథకర్తలు
కాకపోవచ్చు. వ్రాత రూపేణా వారి అభిప్రాయా లను అబ్బే
వెలిబుచ్చక పోవచ్చు. అయినా వారు బహు గ్రంథాలు
చదివినవారు కావచ్చు. సాహిత్య చర్చల్లో పాల్గొని వారి
ప్రతిభా పాటవాలతో ఎంతో మందిని ప్రభావితం చేసి
పలువురి ప్రశంసలందు కున్నవారు కావచ్చు.
సాహిత్య సభలకు, సదస్సులకు రచయితలెంత
ముఖ్యమో, బాగా తెలిసిన శ్రోతలు, విమర్శకులు కూడా
అంతే ముఖ్యం. వీరు లేకపోతే వారు లేరు, వారు లేకపోతే
సిరికొండ వెంకటరావు
- డా॥ వెల్చాల కొండలరావు
వీరు లేరు. రచయితలను ప్రొవోక్ చేసెడివారే సద్వి
మర్చకులు. విశ్వనాథ వారిని బాగా ఇన్స్పైర్న్ మాట్లాడించా
అంటే వారికి వాక్ చేసే విమర్శకుడైనా, శ్రోతైనా కావాలని
వారిని విన్నవారు అప్పట్లో అంటుండే వారు, అలా వారిని
ప్రొవోక్ చేసేవారు కూడా.
ఒకప్పుడు తెలంగాణలో కొందరి ఇళ్ళల్లో కావ్య
పఠనాలు జరిగేవి. వాటిని వినడానికి చాలామంది మంచి
సాహిత్యాభిరుచి కలవారు వచ్చేవారు. రచనలపై,
రచయితలపై చర్చా గోష్టులు జరిగేవి. అచటికి మేధావులు,
కవులు, విమర్శకులు, సాహిత్య ప్రియులు మాత్రమే ఎక్కువ
వచ్చేవారు. రచనలపై, రచయితలపై చర్చాగోష్టులు జరిగేవి.
అచటికి మేధావులు, కవులు, విమర్శకులు, సాహిత్య
ప్రియులు మాత్రమే ఎక్కువ వచ్చేవారు. అవి మేధో ప్రేరణకు,
హృదయ స్పందనకు, ఆలోచనా అవలోకనలకు ఎంతో
నిండుగా, మెండుగా, సరదాగా నడిచేవి. అలాంటి కొద్ది
మంది మేధావులు పాల్గొనే మితమైన ఇంటలెక్చువల్ మీట్స్
ఇపుడు బహు అరుదైపోయాయి. ఇపుడన్నీ పెద్ద వేదికల
పాలై ఎక్కువ ఆవిష్కరణ, అభినందన సభల్లాంటివై
పోయాయి.
అలాంటివి కరీంనగర్లో జువ్వాడి గౌతంరావు
గారింట్లో, సిద్ధిపేటలో సిరికొండ వెంకటరావు గారింట్లో
ఎంతో ఇంపుగా, సొంపుగా జరిగేవి. అవి తెలంగాణలోని
చేతులు తెలంగాణ (449 తేజోమూర్తులు విడు<noinclude><references/>
{{rh|తెలంగాణ |449 | తేజోమూర్తులు}}</noinclude>
61cynr8wsz2lqhidtmur4yoq1wxn2pr
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/88
104
212525
557025
554743
2026-05-25T20:43:56Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
557025
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వంబును = మధురమైన జలసమృద్ధిని; క్లేశనిర్నామకృతియున్ = క్లేశముల పరు లేకుండఁ జేయుటయును; ప్రసంగము = ప్రస్తావము; ఉత్తుంగభద్రరాజిన్ రాజిల్లు = అధికమైన శుభముల పరంపరచేఁ బ్రకాశించు; గౌతమియోజన్ = గోదావరివిధమును; వార్తకెక్కిన = ప్రసిద్ధికెక్కిన; తీర్థప్రవర్తనములు = తీర్థముల చరిత్రములు; స్వామి = కుమారుఁడు; వింధ్యసంస్తంభయితకున్ = వింధ్యపర్వతము నణఁచిన యగస్త్యునికి; వినిపించెన్.
{{Telugu poem|type=క.|lines=<poem>ఆకుంభజుతో మఱియుం
గేకిధ్వజుఁ డనియె మౌనికేసరి! విను మిం
కే కథ వినియెదు సకలము
నీ <ref>చ. పలికితిన</ref>కెఱిగించితినెకా ధునీచరితంబుల్.</poem>|ref=149}}
'''టీక'''. కుంభజుతోన్ = అగస్త్యునితో; కేకిధ్వజుఁడు = కుమారస్వామి; మౌనికేసరి! = మునిశ్రేష్ఠుఁడా! ధునీచరితంబుల్ = నదులచరిత్రములను.
{{Telugu poem|type=క.|lines=<poem>ఈగంగా<ref>చ. (దిశ - లేదు)</ref>దికతీర్ధము
లీఁగంగానీవు తమ సమిద్ధాంబువులన్
దోఁగెడువారల గనగనఁ
గ్రాఁగెడు నంగారసింధుకల్లోలములన్.</poem>|ref=150}}
'''టీక'''. ఈగంగాదికతీర్థములు = గంగ మొదలైన మీఁది తీర్థములు; తమ సమిద్ధాంబువులన్ = మిక్కిలి పవిత్రములైన తమ జలములయందు; తోఁగెడివారలన్ = మునుగువారిని; గనగనగ్రాఁగెడు = గనగన మండుచున్న; అంగారసింధుకల్లోలములన్ = నిప్పుటేటియలలయందు; ఈఁగంగానీవు = మునుఁగనీయవు - అనఁగా గంగాదితీర్ధములందు మునుఁగువారికి నరకలోకములోని నిప్పుటేళ్లలో మునిఁగి బాధ పడవలసిన యవసరము లేదని భావము. ఈ మీఁదితీర్థములందు మునుఁగువారికి పుణ్యము కల్గును. '''అలం'''. పర్యాయోక్తము.
{{Telugu poem|type=క.|lines=<poem>వివిధక్షేత్రచరిత్రలు
వివిధ<ref>చ. సుపర్ణా</ref>సుపర్వానుభావవిలసనములుఁ దీ
ర్థవిశేషశ్రవణముతఱిఁ
జెవికిం జనియొసఁగెనే విశిష్టవిచారా!</poem>|ref=151}}
'''టీక'''. వివిధ...నములు = పెక్కువిధములైన దేవతాప్రభావవిలాసములు; చవి = రుచి; విశిష్టాచారా! = ఉత్తమాచారము కల మునీ!
{{Telugu poem|type=చ.|lines=<poem>అనుడు నగస్త్యుఁ డి ట్లనియె హైమవతీసుతుతోడఁ దోడి స
న్మును లలరంగ నోయనఘమూర్తి! సమస్తముఁ గ్రిందుచేసి మిం
చిన బలువేల్పుఁ దీర్థమును క్షేత్రము నొక్కెడఁ గూడియుండెనే
ని <ref>చ. మాకృతిం</ref>నిరుపమాదృతిం దెలిపి నీవు మముం గరుణింపఁగాఁదగున్.</poem>|ref=152}}
'''టీక'''. హైమవతీసుతుతోడన్ = హిమవంతుని పుత్రికయగు పార్వతియొక్క పుత్రునితో; తోడిసన్మునులు = తనతోఁగూడ వచ్చిన గొప్పమునులు; అలరంగన్ = సంతోషించఁగా; క్రిందుచేసి = తక్కువచేసి - అతిక్రమించి; బలువేల్పు = గొప్పదేవత; ఒక్కెడన్ = ఒక్కచోట; నిరుపమాదృతిన్ = సాటిలేని యాదరముతో.
{{Telugu poem|type=క.|lines=<poem>అని పలుకుకలశభవముఖ
మునిజనములపశ్నవాక్యములు విని పురభి
త్తనయుఁడు తత్త్రివిధము నొ
క్క<ref>శ.ర. నెలన, చ. నేల</ref>నెలం గుమిగూడి యునికిఁ గనజాలమికిన్.</poem>|ref=153}}
'''టీక'''. కలశ..ముల = అగస్త్యుఁడు మొదలుగాఁ గల మునులయొక్క; పురభిత్తనయుఁడు = త్రిపురసంహారియగు శివునికి పుత్రుఁడు; ఒక్కనెలన్ = ఒక్కచోటనే; గుమికూడి = చేరి, ఉనికిన్ = ఉండుటను.<noinclude><references/></noinclude>
d9enwztjseum3ppjy3nc3r1ci8t3xeb
557026
557025
2026-05-25T20:44:27Z
దేవీప్రసాదశాస్త్రి
4290
557026
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వంబును = మధురమైన జలసమృద్ధిని; క్లేశనిర్నామకృతియున్ = క్లేశముల పరు లేకుండఁ జేయుటయును; ప్రసంగము = ప్రస్తావము; ఉత్తుంగభద్రరాజిన్ రాజిల్లు = అధికమైన శుభముల పరంపరచేఁ బ్రకాశించు; గౌతమియోజన్ = గోదావరివిధమును; వార్తకెక్కిన = ప్రసిద్ధికెక్కిన; తీర్థప్రవర్తనములు = తీర్థముల చరిత్రములు; స్వామి = కుమారుఁడు; వింధ్యసంస్తంభయితకున్ = వింధ్యపర్వతము నణఁచిన యగస్త్యునికి; వినిపించెన్.
{{Telugu poem|type=క.|lines=<poem>ఆకుంభజుతో మఱియుం
గేకిధ్వజుఁ డనియె మౌనికేసరి! విను మిం
కే కథ వినియెదు సకలము
నీ <ref>చ. పలికితిన</ref>కెఱిగించితినెకా ధునీచరితంబుల్.</poem>|ref=149}}
'''టీక'''. కుంభజుతోన్ = అగస్త్యునితో; కేకిధ్వజుఁడు = కుమారస్వామి; మౌనికేసరి! = మునిశ్రేష్ఠుఁడా! ధునీచరితంబుల్ = నదులచరిత్రములను.
{{Telugu poem|type=క.|lines=<poem>ఈగంగా<ref>చ. (దిశ - లేదు)</ref>దికతీర్ధము
లీఁగంగానీవు తమ సమిద్ధాంబువులన్
దోఁగెడువారల గనగనఁ
గ్రాఁగెడు నంగారసింధుకల్లోలములన్.</poem>|ref=150}}
'''టీక'''. ఈగంగాదికతీర్థములు = గంగ మొదలైన మీఁది తీర్థములు; తమ సమిద్ధాంబువులన్ = మిక్కిలి పవిత్రములైన తమ జలములయందు; తోఁగెడివారలన్ = మునుగువారిని; గనగనగ్రాఁగెడు = గనగన మండుచున్న; అంగారసింధుకల్లోలములన్ = నిప్పుటేటియలలయందు; ఈఁగంగానీవు = మునుఁగనీయవు - అనఁగా గంగాదితీర్ధములందు మునుఁగువారికి నరకలోకములోని నిప్పుటేళ్లలో మునిఁగి బాధ పడవలసిన యవసరము లేదని భావము. ఈ మీఁదితీర్థములందు మునుఁగువారికి పుణ్యము కల్గును. '''అలం'''. పర్యాయోక్తము.
{{Telugu poem|type=క.|lines=<poem>వివిధక్షేత్రచరిత్రలు
వివిధ<ref>చ. సుపర్ణా</ref>సుపర్వానుభావవిలసనములుఁ దీ
ర్థవిశేషశ్రవణముతఱిఁ
జెవికిం జనియొసఁగెనే విశిష్టవిచారా!</poem>|ref=151}}
'''టీక'''. వివిధ...నములు = పెక్కువిధములైన దేవతాప్రభావవిలాసములు; చవి = రుచి; విశిష్టాచారా! = ఉత్తమాచారము కల మునీ!
{{Telugu poem|type=చ.|lines=<poem>అనుడు నగస్త్యుఁ డి ట్లనియె హైమవతీసుతుతోడఁ దోడి స
న్మును లలరంగ నోయనఘమూర్తి! సమస్తముఁ గ్రిందుచేసి మిం
చిన బలువేల్పుఁ దీర్థమును క్షేత్రము నొక్కెడఁ గూడియుండెనే
ని <ref>చ. మాకృతిం</ref>నిరుపమాదృతిం దెలిపి నీవు మముం గరుణింపఁగాఁదగున్.</poem>|ref=152}}
'''టీక'''. హైమవతీసుతుతోడన్ = హిమవంతుని పుత్రికయగు పార్వతియొక్క పుత్రునితో; తోడిసన్మునులు = తనతోఁగూడ వచ్చిన గొప్పమునులు; అలరంగన్ = సంతోషించఁగా; క్రిందుచేసి = తక్కువచేసి - అతిక్రమించి; బలువేల్పు = గొప్పదేవత; ఒక్కెడన్ = ఒక్కచోట; నిరుపమాదృతిన్ = సాటిలేని యాదరముతో.
{{Telugu poem|type=క.|lines=<poem>అని పలుకుకలశభవముఖ
మునిజనములపశ్నవాక్యములు విని పురభి
త్తనయుఁడు తత్త్రివిధము నొ
క్క<ref>శ.ర. నెలన, చ. నేల</ref>నెలం గుమిగూడి యునికిఁ గనజాలమికిన్.</poem>|ref=153}}
'''టీక'''. కలశ...ముల = అగస్త్యుఁడు మొదలుగాఁ గల మునులయొక్క; పురభిత్తనయుఁడు = త్రిపురసంహారియగు శివునికి పుత్రుఁడు; ఒక్కనెలన్ = ఒక్కచోటనే; గుమికూడి = చేరి, ఉనికిన్ = ఉండుటను.<noinclude><references/></noinclude>
t98x6a6c2205qjwhg963bs6we2c2yux
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/89
104
212526
557035
554744
2026-05-26T03:54:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
557035
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>ముహూర్తమాత్రవిచారడోలారూఢనిజస్వాంతుండై యా
<ref>యావాస్త, ట. యక్రాంతమాశ్ర</ref>యాశ్రమవిశ్రాంతులం గూర్చి యి ట్లనియె.</poem>|ref=154}}
'''టీక'''. ముహూర్త...స్వాంతుండై = క్షణకాలము ఆలోచన యనెడి యుయ్యాలయం దూఁగుచున్న మనస్సు కలవాఁడై - ఆలోచనవలన నిలకడలేని మనస్సు కలవాఁడై; ఆయాశ్రమవిశ్రాంతులం గూర్చి = ఆమహర్షులతో.
{{Telugu poem|type=క.|lines=<poem>ఏతత్త్రితయము నొకచో
భూతలమున మేళవించి పొగడొందుట మ
చ్చేతోగతిఁ దోఁపదు సము
పేతావృతి ముకురకుక్షి నిభమును బోలెన్.</poem>|ref=155}}
'''టీక'''. ఏతత్త్రితయమున్ = ఈ మూటిని; మేళవించి పొగడొందుట = కలిసి పేరుపడి యు౦డుట; మచ్చేతోగతిన్ = నామనోమార్గమందు - మనస్సున; సముపే...కుక్షిన్ = ఆవరణ (కప్పు)తోఁ గూడిన యద్దమందు; ఇభమును బోలెన్ = ఏనుఁగువలె తోఁపదు.
అద్దమునకు మూఁత లేనపు డెంత చిన్నవస్తువైన నందు ప్రతిఫలించును; మూత యున్నపుడు ఏనుఁగంత పెద్దజంతువైన నందు కనఁబడదు. '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=తే.|lines=<poem>చిత్త మాశ్చర్యరసమున జొత్తిలంగఁ
జేయు నీపశ్న మక్షికౌక్షేయుచేత
నిందుధరుచేత హరుచేత నెఱుఁగవలయు
రండు పోదము మునులార! రజతగిరికి.</poem>|ref=156}}
చిత్త మాశ్చర్యరసమున జొత్తిలంగఁ, జేము నీ ప్రశ్న ముక్షి కౌక్షేయు చేత
నిందుధరుచేత హరుచేత నెఱుఁగవలయు, గండు పోదవని మునులార! జతగిరికి
'''టీక'''. చిత్తము = మనస్సును; ఆశ్చర్యరసమున = ఆశ్చర్యమను ద్రవమున; జొత్తిలంగఁజేయు = తడియునట్లు చేయు - మనస్సుకు హత్తుకొనఁజేయు; అక్షికౌక్షేయుచేతన్ = (మూఁడవ)కన్ను ఆయుధముగాఁ గల శివునివలన; ఇందుధరుచేతన్ = చంద్రుని ధరించినవానిచేత - శివునివలన (పంచమ్యర్థమున తృతీయ); రజతగిరికిన్ = కైలాసపర్వతమునకు; పోదము; రండు.
{{Telugu poem|type=క.|lines=<poem>పొడమిన సందేహంబుల
జడిసిన మందేహులం బ్రసన్నులఁ జేయన్
మృడునకుఁ బని గావున మన
మడిగినయర్థంబు నతఁడ యాదేశించున్.</poem>|ref=157}}
'''టీక'''. పొడమిన = కలిగిన; సందేహంబులన్ = సందేహములచేత; బడిసిన = చలించిన; మందేహులన్ = నిదానము చెడినవారిని; ప్రసన్నులన్ = వికాసము నొందినవారినిగా; మృడునకున్ = శివునకు; ఆదేశించున్ = ఉపదేశించును - తెలియఁజేయును.
{{Telugu poem|type=క.|lines=<poem>అని కృతనిశ్చయమతి న
మ్మునులం గొని రజతశైలమున కేఁగఁదలం
చిన గుహుఁ బొగడెడుక్రియ బో
రన మోసెఁ బ్రయాణభేరి ప్రసభారభటిన్.</poem>|ref=158}}
'''టీక'''. కృతనిశ్చయమతిన్ = నిశ్చయింపఁబడిన మనస్సుతో; బోరనన్ = వేగముగా; ప్రసభారభటిన్ = ఎక్కువధ్వనితో; '''అలం'''. ఉత్ప్రేక్ష.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆసమయంబునన్ ధృతనిజాయుధు లాధృతభూషణుల్ మహో
ల్లాసలసన్ముఖుల్ వివిధలాంఛనలక్షితు లాసురాన్వయ
త్రాసకరుల్ విమానగులు దైవతవీరులు తారకారిపె
న్మోసలమ్రోల నిల్చి రొకముప్పదికోటులు మూఁడుకోటులున్.</poem>|ref=159}}
'''టీక'''. ధృతనిజాయుధులు = ధరింపఁబడిన తమతమ ఆయుధములు కలవారు; అదృతభూషణుల్ = ఆదరింపఁబడిన - ధరింపఁబడిన నగలు కలవారు; మహోల్లాసముఖుల్ = గొప్పసంతోషముతోఁ గూడిన (వికసించిన) ముఖములు కలవారు; వివిధలాంఛన లక్షితులు = పెక్కువిధములచిహ్నములతోఁ గూడినవారు; అసురాన్వయత్రాసకరుల్ = రాక్షసులవంశమునకు భయముగొల్పు<noinclude><references/></noinclude>
qh9sykg842bctzxnyegl8au5o95kqpg
557038
557035
2026-05-26T04:03:28Z
దేవీప్రసాదశాస్త్రి
4290
557038
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>ముహూర్తమాత్రవిచారడోలారూఢనిజస్వాంతుండై యా
<ref>యావాస్త, ట. యక్రాంతమాశ్ర</ref>యాశ్రమవిశ్రాంతులం గూర్చి యి ట్లనియె.</poem>|ref=154}}
'''టీక'''. ముహూర్త...స్వాంతుండై = క్షణకాలము ఆలోచన యనెడి యుయ్యాలయం దూఁగుచున్న మనస్సు కలవాఁడై - ఆలోచనవలన నిలకడలేని మనస్సు కలవాఁడై; ఆయాశ్రమవిశ్రాంతులం గూర్చి = ఆమహర్షులతో.
{{Telugu poem|type=క.|lines=<poem>ఏతత్త్రితయము నొకచో
భూతలమున మేళవించి పొగడొందుట మ
చ్చేతోగతిఁ దోఁపదు సము
పేతావృతి ముకురకుక్షి నిభమును బోలెన్.</poem>|ref=155}}
'''టీక'''. ఏతత్త్రితయమున్ = ఈ మూటిని; మేళవించి పొగడొందుట = కలిసి పేరుపడి యు౦డుట; మచ్చేతోగతిన్ = నామనోమార్గమందు - మనస్సున; సముపే...కుక్షిన్ = ఆవరణ (కప్పు)తోఁ గూడిన యద్దమందు; ఇభమును బోలెన్ = ఏనుఁగువలె; తోఁపదు.
అద్దమునకు మూఁత లేనపు డెంత చిన్నవస్తువైన నందు ప్రతిఫలించును; మూత యున్నపుడు ఏనుఁగంత పెద్దజంతువైన నందు కనఁబడదు. '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=తే.|lines=<poem>చిత్త మాశ్చర్యరసమున జొత్తిలంగఁ
జేయు నీపశ్న మక్షికౌక్షేయుచేత
నిందుధరుచేత హరుచేత నెఱుఁగవలయు
రండు పోదము మునులార! రజతగిరికి.</poem>|ref=156}}
చిత్త మాశ్చర్యరసమున జొత్తిలంగఁ, జేము నీ ప్రశ్న ముక్షి కౌక్షేయు చేత
నిందుధరుచేత హరుచేత నెఱుఁగవలయు, గండు పోదవని మునులార! జతగిరికి
'''టీక'''. చిత్తము = మనస్సును; ఆశ్చర్యరసమున = ఆశ్చర్యమను ద్రవమున; జొత్తిలంగఁజేయు = తడియునట్లు చేయు - మనస్సుకు హత్తుకొనఁజేయు; అక్షికౌక్షేయుచేతన్ = (మూఁడవ)కన్ను ఆయుధముగాఁ గల శివునివలన; ఇందుధరుచేతన్ = చంద్రుని ధరించినవానిచేత - శివునివలన (పంచమ్యర్థమున తృతీయ); రజతగిరికిన్ = కైలాసపర్వతమునకు; పోదము; రండు.
{{Telugu poem|type=క.|lines=<poem>పొడమిన సందేహంబుల
జడిసిన మందేహులం బ్రసన్నులఁ జేయన్
మృడునకుఁ బని గావున మన
మడిగినయర్థంబు నతఁడ యాదేశించున్.</poem>|ref=157}}
'''టీక'''. పొడమిన = కలిగిన; సందేహంబులన్ = సందేహములచేత; బడిసిన = చలించిన; మందేహులన్ = నిదానము చెడినవారిని; ప్రసన్నులన్ = వికాసము నొందినవారినిగా; మృడునకున్ = శివునకు; ఆదేశించున్ = ఉపదేశించును - తెలియఁజేయును.
{{Telugu poem|type=క.|lines=<poem>అని కృతనిశ్చయమతి న
మ్మునులం గొని రజతశైలమున కేఁగఁదలం
చిన గుహుఁ బొగడెడుక్రియ బో
రన మోసెఁ బ్రయాణభేరి ప్రసభారభటిన్.</poem>|ref=158}}
'''టీక'''. కృతనిశ్చయమతిన్ = నిశ్చయింపఁబడిన మనస్సుతో; బోరనన్ = వేగముగా; ప్రసభారభటిన్ = ఎక్కువధ్వనితో; '''అలం'''. ఉత్ప్రేక్ష.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆసమయంబునన్ ధృతనిజాయుధు లాధృతభూషణుల్ మహో
ల్లాసలసన్ముఖుల్ వివిధలాంఛనలక్షితు లాసురాన్వయ
త్రాసకరుల్ విమానగులు దైవతవీరులు తారకారిపె
న్మోసలమ్రోల నిల్చి రొకముప్పదికోటులు మూఁడుకోటులున్.</poem>|ref=159}}
'''టీక'''. ధృతనిజాయుధులు = ధరింపఁబడిన తమతమ ఆయుధములు కలవారు; ఆదృతభూషణుల్ = ఆదరింపఁబడిన - ధరింపఁబడిన నగలు కలవారు; మహోల్లాసముఖుల్ = గొప్పసంతోషముతోఁ గూడిన (వికసించిన) ముఖములు కలవారు; వివిధలాంఛనలక్షితులు = పెక్కువిధములచిహ్నములతోఁ గూడినవారు; అసురాన్వయత్రాసకరుల్ = రాక్షసులవంశమునకు భయముగొల్పు<noinclude><references/></noinclude>
7xezp0edg6dugncguozeu5j34dmjvbe
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/90
104
212527
557045
554745
2026-05-26T04:54:15Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
557045
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వారు; విమానగులు = విమానములపై నున్నవారు; దైవతవీరులు = దేవవీరులు; తారకారిపెన్మోసలమ్రోలన్ = కుమారస్వామిమొగసాలయెదుటను; నిల్చిరి.
{{Telugu poem|type=మ.|lines=<poem>పనితప్రక్రియ నల్దెఱంగు లెసఁగన్ బ్రస్థాననైపథ్యశో
భనముం గైకొని బ్రహ్మగర్భుఁడు వహత్పల్యాణకల్యాణమై
ఘనగర్జన్ <ref>చ. సగిలించు</ref>సకిలించువారువము నెక్కంబోవుచోఁ బర్వె సం
జనితాశాకరికర్ణసంజ్వరభరాంచత్కంచుకీధ్వానముల్.</poem>|ref=160}}
'''టీక'''. పనితప్రక్రియ = పొగడఁబడిన (గొప్ప) విధము; నల్దెఱంగులు, ఎసఁగన్ = నాల్గుదిక్కులను వ్యాపింపఁగా; ప్రస్థాననైపథ్యశోభనమున్ = ప్రయాణమునకుఁ దగిన వస్త్రాభరణాదులను; బ్రహ్మగర్భుఁడు = శివునిపుత్రుఁడు - కుమారస్వామి; వహత్పల్యాణకల్యాణమై = మోయుచున్నజీనిచేత మేలయినదై; ఘనగర్జన్ = మేఘగర్జనతో - గొప్పధ్వనితో; వావురమున్ = వారువమును - వాహనమును; సంజని...ధ్వానముల్ = పుట్టిన - దిగ్గజముల కర్ణములను బాధించు (బ్రద్దలు చేయు) కంచుకులయొక్క అఱపులు; పర్వెన్ = వ్యాపించినవి.
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఆటకు మెచ్చి బలారి యీగొను మరు
త్ఫల మిది యన బర్హభార మమర
హరుఁ గుత్తుకనకాక శిరసునఁ బోలఁ దా
ల్చినజటాచ్ఛటలీల శిఖ వెలుంగ
క్షితిశిరోభూషావిశేషనిర్మితికిఁ బా
ల్పడు పడియచ్చుల ట్లడుగులు దగ
ధాతృవాహనభుక్తిఁ దా నభ్యసింప బి
సము మ్రింగుభంగి దష్టఫణి గ్రాలఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>గంఠగంభీరనినదంబు ఖచరయువతి
గానవిద్యకు షడ్జసంధాన మొసఁగ
నెసఁగు దెలికన్నుగోనల యెక్కిరింత
నెక్కె బలుకొండఁ దూఁటువోనేయుమేటి.</poem>|ref=}}
'''టీక'''. బలారి = ఇంద్రుఁడు; ఈగొను = ఈయఁగా, గ్రహించు; మరుత్ఫలము = వాయుఫలము - ఇంద్రధనుస్సు [మరుత్ఫలము = దేవతలవలని లాభము అని పూర్వటీక. అది తప్పు]; బర్హభారము అమరన్ = పింఛము ప్రకాశింపఁగా; హరున్ = శివుని; కుత్తుకనకాక = కంఠముచేతనే కాక; శిరసునన్ = శిరస్సుచేతను గూడ; తాల్చిన = ధరించిన; జటాచ్ఛటలీలన్ = జడలగుంపువలె; శిఖ వెలుంగన్ = జుట్టు ప్రకాశింపఁగా [శివుఁడు నీలకంఠుఁడు, నెమలియు నీలకంఠము - ఆ నీలగళత్వమే కాక జటిలత్వము కూడ శివ, మయూరములకు సామాన్యధర్మమని యర్థము.]; క్షితి...నిర్మితికిన్ = భూమియొక్క శిరోభూషణవిశేషములను నిర్మించుటకు; పాల్పడు = పూనుకొనునట్టి - ఏర్పఱుపఁబడునట్టి; పడియచ్చులట్లు = కరువులవలె - ముద్రసాధనములవలె; తగన్ = ఒప్పియుండఁగా; ధాతృవాహనభుక్తిన్ = బ్రహ్మవాహనమైన హంసముయొక్క ఆహారపద్ధతిని - తామరతూండ్లను దినుటను; బిసము మ్రింగుభంగిన్ = తామరతూడు తినునట్లు; దష్టఫణి = (నోటఁ) గఱచిన పాము; క్రాలన్ = ప్రకాశింపఁగా; కంఠగంభీరనినదంబు = గంభీరమైన కేకాధ్వని; ఖచరయువతిగానవిద్యకున్ = గంధర్వస్త్రీలయొక్క సంగీతమునకు; షడ్జసంధానము = షడ్జస్వరపుకూర్పును [నెమలియఱపు షడ్జస్వరము కలదని సంగీతశాస్త్రము.]; ఒసఁగన్ = కలుగఁజేయఁగా; ఎసఁగు = ప్రకాశించునట్టి; తెలియకన్నుగోనల యెక్కిరింతన్ = తెల్లని కనుఁగొలుకులు కల వాహనమైన నెమలిని; బలుకొండఁదూటువోనేయుమేటి = గొప్పకొండను (క్రౌంచమును) చిల్లులుపడునట్లు కొట్టిన వీరుఁడు - కుమారస్వామి; ఎక్కెన్.
కుమారుని వాహనమైన నెమలియొక్క పింఛము దానియాటకు మెచ్చి యింద్రుఁ డిచ్చిన యింద్రధనుస్సువలె రంగురంగులు కలిగియున్నదనియు, జుట్టు శివునిజడలవలెను, అడుగులు భూమియనుస్త్రీ తలపై ధరించు నగలు కరువుబోయు నచ్చులవలెను, నోటితో పట్టుకొన్న పాము బినమువలెను ఉన్నదనియు, దాని కనుగొలుకులు తెల్లనివనియు, కేక షడ్జస్వరయుక్తమనియు తాత్పర్యము. '''అలం'''. ఉత్ప్రేక్ష.<noinclude><references/></noinclude>
42otz77r75zwzh1wwckqlhj8nxzw239
557046
557045
2026-05-26T04:54:55Z
దేవీప్రసాదశాస్త్రి
4290
557046
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వారు; విమానగులు = విమానములపై నున్నవారు; దైవతవీరులు = దేవవీరులు; తారకారిపెన్మోసలమ్రోలన్ = కుమారస్వామిమొగసాలయెదుటను; నిల్చిరి.
{{Telugu poem|type=మ.|lines=<poem>పనితప్రక్రియ నల్దెఱంగు లెసఁగన్ బ్రస్థాననైపథ్యశో
భనముం గైకొని బ్రహ్మగర్భుఁడు వహత్పల్యాణకల్యాణమై
ఘనగర్జన్ <ref>చ. సగిలించు</ref>సకిలించువారువము నెక్కంబోవుచోఁ బర్వె సం
జనితాశాకరికర్ణసంజ్వరభరాంచత్కంచుకీధ్వానముల్.</poem>|ref=160}}
'''టీక'''. పనితప్రక్రియ = పొగడఁబడిన (గొప్ప) విధము; నల్దెఱంగులు, ఎసఁగన్ = నాల్గుదిక్కులను వ్యాపింపఁగా; ప్రస్థాననైపథ్యశోభనమున్ = ప్రయాణమునకుఁ దగిన వస్త్రాభరణాదులను; బ్రహ్మగర్భుఁడు = శివునిపుత్రుఁడు - కుమారస్వామి; వహత్పల్యాణకల్యాణమై = మోయుచున్నజీనిచేత మేలయినదై; ఘనగర్జన్ = మేఘగర్జనతో - గొప్పధ్వనితో; వావురమున్ = వారువమును - వాహనమును; సంజని...ధ్వానముల్ = పుట్టిన - దిగ్గజముల కర్ణములను బాధించు (బ్రద్దలు చేయు) కంచుకులయొక్క అఱపులు; పర్వెన్ = వ్యాపించినవి.
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఆటకు మెచ్చి బలారి యీగొను మరు
త్ఫల మిది యన బర్హభార మమర
హరుఁ గుత్తుకనకాక శిరసునఁ బోలఁ దా
ల్చినజటాచ్ఛటలీల శిఖ వెలుంగ
క్షితిశిరోభూషావిశేషనిర్మితికిఁ బా
ల్పడు పడియచ్చుల ట్లడుగులు దగ
ధాతృవాహనభుక్తిఁ దా నభ్యసింప బి
సము మ్రింగుభంగి దష్టఫణి గ్రాలఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>గంఠగంభీరనినదంబు ఖచరయువతి
గానవిద్యకు షడ్జసంధాన మొసఁగ
నెసఁగు దెలికన్నుగోనల యెక్కిరింత
నెక్కె బలుకొండఁ దూఁటువోనేయుమేటి.</poem>|ref=161}}
'''టీక'''. బలారి = ఇంద్రుఁడు; ఈగొను = ఈయఁగా, గ్రహించు; మరుత్ఫలము = వాయుఫలము - ఇంద్రధనుస్సు [మరుత్ఫలము = దేవతలవలని లాభము అని పూర్వటీక. అది తప్పు]; బర్హభారము అమరన్ = పింఛము ప్రకాశింపఁగా; హరున్ = శివుని; కుత్తుకనకాక = కంఠముచేతనే కాక; శిరసునన్ = శిరస్సుచేతను గూడ; తాల్చిన = ధరించిన; జటాచ్ఛటలీలన్ = జడలగుంపువలె; శిఖ వెలుంగన్ = జుట్టు ప్రకాశింపఁగా [శివుఁడు నీలకంఠుఁడు, నెమలియు నీలకంఠము - ఆ నీలగళత్వమే కాక జటిలత్వము కూడ శివ, మయూరములకు సామాన్యధర్మమని యర్థము.]; క్షితి...నిర్మితికిన్ = భూమియొక్క శిరోభూషణవిశేషములను నిర్మించుటకు; పాల్పడు = పూనుకొనునట్టి - ఏర్పఱుపఁబడునట్టి; పడియచ్చులట్లు = కరువులవలె - ముద్రసాధనములవలె; తగన్ = ఒప్పియుండఁగా; ధాతృవాహనభుక్తిన్ = బ్రహ్మవాహనమైన హంసముయొక్క ఆహారపద్ధతిని - తామరతూండ్లను దినుటను; బిసము మ్రింగుభంగిన్ = తామరతూడు తినునట్లు; దష్టఫణి = (నోటఁ) గఱచిన పాము; క్రాలన్ = ప్రకాశింపఁగా; కంఠగంభీరనినదంబు = గంభీరమైన కేకాధ్వని; ఖచరయువతిగానవిద్యకున్ = గంధర్వస్త్రీలయొక్క సంగీతమునకు; షడ్జసంధానము = షడ్జస్వరపుకూర్పును [నెమలియఱపు షడ్జస్వరము కలదని సంగీతశాస్త్రము.]; ఒసఁగన్ = కలుగఁజేయఁగా; ఎసఁగు = ప్రకాశించునట్టి; తెలియకన్నుగోనల యెక్కిరింతన్ = తెల్లని కనుఁగొలుకులు కల వాహనమైన నెమలిని; బలుకొండఁదూటువోనేయుమేటి = గొప్పకొండను (క్రౌంచమును) చిల్లులుపడునట్లు కొట్టిన వీరుఁడు - కుమారస్వామి; ఎక్కెన్.
కుమారుని వాహనమైన నెమలియొక్క పింఛము దానియాటకు మెచ్చి యింద్రుఁ డిచ్చిన యింద్రధనుస్సువలె రంగురంగులు కలిగియున్నదనియు, జుట్టు శివునిజడలవలెను, అడుగులు భూమియనుస్త్రీ తలపై ధరించు నగలు కరువుబోయు నచ్చులవలెను, నోటితో పట్టుకొన్న పాము బినమువలెను ఉన్నదనియు, దాని కనుగొలుకులు తెల్లనివనియు, కేక షడ్జస్వరయుక్తమనియు తాత్పర్యము. '''అలం'''. ఉత్ప్రేక్ష.<noinclude><references/></noinclude>
mb5rcnnb7d3zj053f4pevjbpan4ccbp
557058
557046
2026-05-26T06:47:45Z
దేవీప్రసాదశాస్త్రి
4290
557058
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వారు; విమానగులు = విమానములపై నున్నవారు; దైవతవీరులు = దేవవీరులు; తారకారిపెన్మోసలమ్రోలన్ = కుమారస్వామిమొగసాలయెదుటను; నిల్చిరి.
{{Telugu poem|type=మ.|lines=<poem>పనితప్రక్రియ నల్దెఱంగు లెసఁగన్ బ్రస్థాననైపథ్యశో
భనముం గైకొని బ్రహ్మగర్భుఁడు వహత్పల్యాణకల్యాణమై
ఘనగర్జన్ <ref>చ. సగిలించు</ref>సకిలించువారువము నెక్కంబోవుచోఁ బర్వె సం
జనితాశాకరికర్ణసంజ్వరభరాంచత్కంచుకీధ్వానముల్.</poem>|ref=160}}
'''టీక'''. పనితప్రక్రియ = పొగడఁబడిన (గొప్ప) విధము; నల్దెఱంగులు, ఎసఁగన్ = నాల్గుదిక్కులను వ్యాపింపఁగా; ప్రస్థాననైపథ్యశోభనమున్ = ప్రయాణమునకుఁ దగిన వస్త్రాభరణాదులను; బ్రహ్మగర్భుఁడు = శివునిపుత్రుఁడు - కుమారస్వామి; వహత్పల్యాణకల్యాణమై = మోయుచున్నజీనిచేత మేలయినదై; ఘనగర్జన్ = మేఘగర్జనతో - గొప్పధ్వనితో; వావురమున్ = వారువమును - వాహనమును; సంజని...ధ్వానముల్ = పుట్టిన - దిగ్గజముల కర్ణములను బాధించు (బ్రద్దలు చేయు) కంచుకులయొక్క అఱపులు; పర్వెన్ = వ్యాపించినవి.
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఆటకు మెచ్చి బలారి యీగొను మరు
త్ఫల మిది యన బర్హభార మమర
హరుఁ గుత్తుకనకాక శిరసునఁ బోలఁ దా
ల్చినజటాచ్ఛటలీల శిఖ వెలుంగ
క్షితిశిరోభూషావిశేషనిర్మితికిఁ బా
ల్పడు పడియచ్చుల ట్లడుగులు దగ
ధాతృవాహనభుక్తిఁ దా నభ్యసింప బి
సము మ్రింగుభంగి దష్టఫణి గ్రాలఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>గంఠగంభీరనినదంబు ఖచరయువతి
గానవిద్యకు షడ్జసంధాన మొసఁగ
నెసఁగు దెలికన్నుగోనల యెక్కిరింత
నెక్కె బలుకొండఁ దూఁటువోనేయుమేటి.</poem>|ref=161}}
'''టీక'''. బలారి = ఇంద్రుఁడు; ఈగొను = ఈయఁగా, గ్రహించు; మరుత్ఫలము = వాయుఫలము - ఇంద్రధనుస్సు [మరుత్ఫలము = దేవతలవలని లాభము అని పూర్వటీక. అది తప్పు]; బర్హభారము అమరన్ = పింఛము ప్రకాశింపఁగా; హరున్ = శివుని; కుత్తుకనకాక = కంఠముచేతనే కాక; శిరసునన్ = శిరస్సుచేతను గూడ; తాల్చిన = ధరించిన; జటాచ్ఛటలీలన్ = జడలగుంపువలె; శిఖ వెలుంగన్ = జుట్టు ప్రకాశింపఁగా [శివుఁడు నీలకంఠుఁడు, నెమలియు నీలకంఠము - ఆ నీలగళత్వమే కాక జటిలత్వము కూడ శివ, మయూరములకు సామాన్యధర్మమని యర్థము.]; క్షితి...నిర్మితికిన్ = భూమియొక్క శిరోభూషణవిశేషములను నిర్మించుటకు; పాల్పడు = పూనుకొనునట్టి - ఏర్పఱుపఁబడునట్టి; పడియచ్చులట్లు = కరువులవలె - ముద్రసాధనములవలె; తగన్ = ఒప్పియుండఁగా; ధాతృవాహనభుక్తిన్ = బ్రహ్మవాహనమైన హంసముయొక్క ఆహారపద్ధతిని - తామరతూండ్లను దినుటను; బిసము మ్రింగుభంగిన్ = తామరతూడు తినునట్లు; దష్టఫణి = (నోటఁ) గఱచిన పాము; క్రాలన్ = ప్రకాశింపఁగా; కంఠగంభీరనినదంబు = గంభీరమైన కేకాధ్వని; ఖచరయువతిగానవిద్యకున్ = గంధర్వస్త్రీలయొక్క సంగీతమునకు; షడ్జసంధానము = షడ్జస్వరపుకూర్పును [నెమలియఱపు షడ్జస్వరము కలదని సంగీతశాస్త్రము.]; ఒసఁగన్ = కలుగఁజేయఁగా; ఎసఁగు = ప్రకాశించునట్టి; తెలియకన్నుగోనల యెక్కిరింతన్ = తెల్లని కనుఁగొలుకులు కల వాహనమైన నెమలిని; బలుకొండఁదూటువోనేయుమేటి = గొప్పకొండను (క్రౌంచమును) చిల్లులుపడునట్లు కొట్టిన వీరుఁడు - కుమారస్వామి; ఎక్కెన్.
కుమారుని వాహనమైన నెమలియొక్క పింఛము దానియాటకు మెచ్చి యింద్రుఁ డిచ్చిన యింద్రధనుస్సువలె రంగురంగులు కలిగియున్నదనియు, జుట్టు శివునిజడలవలెను, అడుగులు భూమియనుస్త్రీ తలపై ధరించు నగలు కరువుబోయు నచ్చులవలెను, నోటితో పట్టుకొన్న పాము బిసమువలెను ఉన్నదనియు, దాని కనుగొలుకులు తెల్లనివనియు, కేక షడ్జస్వరయుక్తమనియు తాత్పర్యము. '''అలం'''. ఉత్ప్రేక్ష.<noinclude><references/></noinclude>
m92sqqndyunrpmnkf6t2acpry0k4nxl
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/91
104
212528
557056
554746
2026-05-26T06:45:23Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
557056
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>అది సజ్జస్యందనమై
మదకరియై తత్తదుచితమార్గంబుల నే
ర్పొదవ నొకకొంత చని పా
రద నిభశుభమూర్తి నశ్వరత్నం బగుడున్.</poem>|ref=162}}
'''టీక'''. అది = ఆ నెమలి; సజ్జన్యందనమై = సిద్ధముచేయఁబడిన రథమై; మదకరియై = మదపుటేనుఁగై; తత్తదుచితమార్గంబులన్ = ఆయారీతులకుఁ దగినట్లు; పారదనిభశుభమూర్తిన్ = పాదరసముతో సమానమగు స్వచ్ఛమైన దేహముతో; అగుడున్ = కాఁగా - మాఱఁగా ననుట.
ఆనెమిలి కొంతదనుక రథమువలెను, ఏనుఁగువలెను నడిచి, తుదకు అశ్వమువలె పరుగిడెనని భావము.
{{Telugu poem|type=క.|lines=<poem>శితికంఠసుతుఁడు ఖచర
స్తుతుఁడై యా<ref>క. యచ్చరూపు</ref>యిచ్చరూపు<ref>శ.ర. తురికిని</ref>తురికీ నాస్కం
దితధౌరితప్లుతరే
చితవల్గితగతులఁ దరటు చేసిన నదియున్.</poem>|ref=163}}
'''టీక'''. శితికంఠసుతుఁడు = శివపుత్రుఁడు - కుమారస్వామి; ఖచరస్తుతుఁడై = దేవతలచే
కొనియాడఁబడినవాఁడై; ఆ యిచ్చరూపుతురికీని = కోరినరూపము ధరించు నావాహనమును; ఆస్కందిత...గతులన్ = ఆస్కందితాదిగమనములచేత; [ఆస్కందితము = మిక్కిలి వేగమును, మిక్కిలి మందమును గాని గమనము; ధౌరితకము = మీఁది గమనముకంటెఁ గొంచెము వడిగల నడక; ప్లుతము = అతివేగముగా దాఁటుచు పోవుట; రేచితము = వంకరగాఁ దిరుగక వడిగాఁ బోవు గమనము; వల్గితము = మీఁదికి కాళ్లెత్తి కదలించుచు వడిగాఁ బోవు గమనము.] తరటు సేయఁగాన్ = కొరడాతో గొట్టి నడిపించఁగా.
{{Telugu poem|type=క.|lines=<poem>మురళిఁ గొనియు రవణమునన్
బరువడి గోమూత్రికాదిభంజళులఁ గడున్
గెరలి చతుర్విధధావిత
పరిపాటీపాటవమునఁ బతి మెప్పించెన్.</poem>|ref=164}}
'''టీక'''. మురళి, రవణము, పరువడి, భంజళి అను నాలుగును గుఱ్ఱము దౌడుతీయుటయందలి భేదములు; అందు మిక్కిలి వడిగాఁ బరుగెత్తుట (పరుగు+వడి) పరువడి; పామువలె వంకర, వంకరగా నడుచుట భంజళి; గోమూత్రికము భంజళిలో నొకవిశేషము; ఇట్లు పూర్వటీక. కెరలి = రేఁగి. చతు...పాటవమునన్ = నాల్గువిధముల ధావనపద్ధతుల నేర్పుచే; పతిన్ = యజమానుని; మెప్పించెన్.
{{Telugu poem|type=సీ.|lines=<poem>బలుపాఁపతలచుట్టు లలవరించినవారు
లేఁత<ref>చ. చంద్రులను</ref>చందురులఁ దాలిచినవారు
పునుకతమ్మంటులఁ బొలుచు వీనులవారు
<ref>క. నొసల, చ. నొసలి</ref>నొసలి మిక్కిలిచూపు లెసఁగువారు
<ref>ట. బూజు, క. బూదు, శ.ర. బూఁదు</ref>బూదుఁపారఁగ మేన బూదిఁ బూసినవారు
త్రిముఖాస్త్రములు కేలఁ ద్రిప్పువారు
పులితోలుహొంబట్టుపుట్టము ల్గలవారు
కొమ్ము తేజుల నెక్కి గునియువారు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>ఘోరతపముల హరు దక్కఁగొన్నవారు
కరటిదైతేయకుంభముక్తాలలామ
హారిభుజమధ్యములవా రుదారయశులు
ప్రమథవీరులు <ref>సూర్య. గొల్చి</ref>గొలిచిరా బాహులేయు.</poem>|ref=165}}
'''టీక'''. శివుని రూపములతో నున్న ప్రమథగణములు ఇందు వర్ణింపఁబడెను. బలుపాపతలచుట్టులు = పెద్దపాముల తలపాగలు; అలవరించినవారు = ధరించినవారు; పురు...వారు = తలపులచేఁ జేయఁబడిన కుండలములచేఁ ప్రకాశించువారు; నొసల...వారు = నొసట మూఁడవకన్ను కలవారు; బూఁదువారఁగన్ = బూజు పట్టినట్లు; బూది = భస్మము; త్రిముఖాస్త్రములు = త్రిశూలములు; హొంబట్టుపుట్టముల్ = బంగారుపట్టువస్త్రములు; కొమ్ముతేజులన్ = వృషభవాహనములను; గునియువారు = పలికెడివారు; హరున్ = శివుని; తక్కఁగొన్నవారు = స్వాధీనము చేసికొన్నవారు; కరటి...మధ్యములవారు = (శివునిచేఁ జంపఁబడిన) గజాసురునియొక్క కుంభస్థలమునందలి మంచిముత్యములచే సొగసైన వక్షములు కలవారు; ఉదారయశులు =<noinclude><references/></noinclude>
9y0dyeuiwbhwq9tjzidrw9bq4q9k19w
557057
557056
2026-05-26T06:46:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
557057
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>అది సజ్జస్యందనమై
మదకరియై తత్తదుచితమార్గంబుల నే
ర్పొదవ నొకకొంత చని పా
రదనిభశుభమూర్తి నశ్వరత్నం బగుడున్.</poem>|ref=162}}
'''టీక'''. అది = ఆ నెమలి; సజ్జన్యందనమై = సిద్ధముచేయఁబడిన రథమై; మదకరియై = మదపుటేనుఁగై; తత్తదుచితమార్గంబులన్ = ఆయారీతులకుఁ దగినట్లు; పారదనిభశుభమూర్తిన్ = పాదరసముతో సమానమగు స్వచ్ఛమైన దేహముతో; అగుడున్ = కాఁగా - మాఱఁగా ననుట.
ఆనెమిలి కొంతదనుక రథమువలెను, ఏనుఁగువలెను నడిచి, తుదకు అశ్వమువలె పరుగిడెనని భావము.
{{Telugu poem|type=క.|lines=<poem>శితికంఠసుతుఁడు ఖచర
స్తుతుఁడై యా<ref>క. యచ్చరూపు</ref>యిచ్చరూపు<ref>శ.ర. తురికిని</ref>తురికీ నాస్కం
దితధౌరితప్లుతరే
చితవల్గితగతులఁ దరటు చేసిన నదియున్.</poem>|ref=163}}
'''టీక'''. శితికంఠసుతుఁడు = శివపుత్రుఁడు - కుమారస్వామి; ఖచరస్తుతుఁడై = దేవతలచే
కొనియాడఁబడినవాఁడై; ఆ యిచ్చరూపుతురికీని = కోరినరూపము ధరించు నావాహనమును; ఆస్కందిత...గతులన్ = ఆస్కందితాదిగమనములచేత; [ఆస్కందితము = మిక్కిలి వేగమును, మిక్కిలి మందమును గాని గమనము; ధౌరితకము = మీఁది గమనముకంటెఁ గొంచెము వడిగల నడక; ప్లుతము = అతివేగముగా దాఁటుచు పోవుట; రేచితము = వంకరగాఁ దిరుగక వడిగాఁ బోవు గమనము; వల్గితము = మీఁదికి కాళ్లెత్తి కదలించుచు వడిగాఁ బోవు గమనము.] తరటు సేయఁగాన్ = కొరడాతో గొట్టి నడిపించఁగా.
{{Telugu poem|type=క.|lines=<poem>మురళిఁ గొనియు రవణమునన్
బరువడి గోమూత్రికాదిభంజళులఁ గడున్
గెరలి చతుర్విధధావిత
పరిపాటీపాటవమునఁ బతి మెప్పించెన్.</poem>|ref=164}}
'''టీక'''. మురళి, రవణము, పరువడి, భంజళి అను నాలుగును గుఱ్ఱము దౌడుతీయుటయందలి భేదములు; అందు మిక్కిలి వడిగాఁ బరుగెత్తుట (పరుగు+వడి) పరువడి; పామువలె వంకర, వంకరగా నడుచుట భంజళి; గోమూత్రికము భంజళిలో నొకవిశేషము; ఇట్లు పూర్వటీక. కెరలి = రేఁగి. చతు...పాటవమునన్ = నాల్గువిధముల ధావనపద్ధతుల నేర్పుచే; పతిన్ = యజమానుని; మెప్పించెన్.
{{Telugu poem|type=సీ.|lines=<poem>బలుపాఁపతలచుట్టు లలవరించినవారు
లేఁత<ref>చ. చంద్రులను</ref>చందురులఁ దాలిచినవారు
పునుకతమ్మంటులఁ బొలుచు వీనులవారు
<ref>క. నొసల, చ. నొసలి</ref>నొసలి మిక్కిలిచూపు లెసఁగువారు
<ref>ట. బూజు, క. బూదు, శ.ర. బూఁదు</ref>బూదుఁపారఁగ మేన బూదిఁ బూసినవారు
త్రిముఖాస్త్రములు కేలఁ ద్రిప్పువారు
పులితోలుహొంబట్టుపుట్టము ల్గలవారు
కొమ్ము తేజుల నెక్కి గునియువారు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>ఘోరతపముల హరు దక్కఁగొన్నవారు
కరటిదైతేయకుంభముక్తాలలామ
హారిభుజమధ్యములవా రుదారయశులు
ప్రమథవీరులు <ref>సూర్య. గొల్చి</ref>గొలిచిరా బాహులేయు.</poem>|ref=165}}
'''టీక'''. శివుని రూపములతో నున్న ప్రమథగణములు ఇందు వర్ణింపఁబడెను. బలుపాపతలచుట్టులు = పెద్దపాముల తలపాగలు; అలవరించినవారు = ధరించినవారు; పురు...వారు = తలపులచేఁ జేయఁబడిన కుండలములచేఁ ప్రకాశించువారు; నొసల...వారు = నొసట మూఁడవకన్ను కలవారు; బూఁదువారఁగన్ = బూజు పట్టినట్లు; బూది = భస్మము; త్రిముఖాస్త్రములు = త్రిశూలములు; హొంబట్టుపుట్టముల్ = బంగారుపట్టువస్త్రములు; కొమ్ముతేజులన్ = వృషభవాహనములను; గునియువారు = పలికెడివారు; హరున్ = శివుని; తక్కఁగొన్నవారు = స్వాధీనము చేసికొన్నవారు; కరటి...మధ్యములవారు = (శివునిచేఁ జంపఁబడిన) గజాసురునియొక్క కుంభస్థలమునందలి మంచిముత్యములచే సొగసైన వక్షములు కలవారు; ఉదారయశులు =<noinclude><references/></noinclude>
bhcjp431ub5prfdyjf4l1t0sffsctrb
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/92
104
212529
557064
554747
2026-05-26T07:50:52Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
557064
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గొప్పకీర్తి కలవారు; ఆ బాహులేయున్ = పెక్కుమందితల్లులు గల ఆకుమారస్వామిని; కొలిచిరి
= సేవించిరి.
{{Telugu poem|type=శా.|lines=<poem>క్షోణీరేణుకృతంబు లంజనరజోగుచ్చాసితంబుల్ తమ
శ్శ్రేణుల్ దూషితపూష<ref>చ. భూషణ</ref>భూషణగతిన్ జృంభించియున్ దూలె న
క్షోణోత్తంభితశక్తి భృద్భటశిరస్సీమాకిరీటస్ఫుర
న్మాణిక్యాతపపల్లవస్తబకసామగ్రీహృతాగ్రంబులై.</poem>|ref=166}}
'''టీక'''. క్షోణీరేణుకృతంబులు = నేలనుండి లేచిన దుమ్ముచే ఏర్పడినవి; అంజన...తంబుల్ = కాటుకపొడికుప్పలవలె నల్లనైనవి; తమశ్శ్రేణుల్ = చీఁకట్లు; దూషిత...గతిన్ = (కొఱతచేయఁబడిన) సూర్యునికి భయము కల్గునట్లుగా (సూర్యుని తిరస్కరించి, అతనికి భయము కల్గునట్లుగా); జృంభించియు = విజృంభించియు - వ్యాపించినను; అక్షీణో...గ్రంబులై — అక్షీణ = తక్కువవి కానివియు; ఉత్తంభిత = మీఁదికి వ్యాపించినవియు నగు; శక్తిభృద్భటశిరస్సీమాకిరీట = కుమారస్వామి భటుల తలలపై నున్న కిరీటములందు; స్ఫురత్ = ప్రకాశించుచున్న; మాణిక్యాతపపల్లవస్తబకసామగ్రీ = కెంపులవెలుగుల గుంపుల సామగ్రిచే; హృతాగ్రంబులై = పోఁగొట్టఁబడినకొనలు గలవై; తూలెన్ = చెదరిపోయినవి.
సేనలరాపిడివలన నేలనుండి నల్లనిదుమ్ము వ్యాపించి లోకమును చీఁకట్లలో ముంచినను, వీరులకిరీటములందలి మాణిక్యములకాంతిచే ఆ చీఁకట్లు నశించినవని భావము.
{{Telugu poem|type=క.|lines=<poem>స్మరశశితటిదజపవమా
నరవిసుధాసలిలమునిజనక్ష్మారిష్టా
సురమృత్యుజ్వలన లగు
సురవేశ్యలు గొలిచి రపుడు సుబ్రహ్మణ్యున్.</poem>|ref=167}}
'''టీక'''. స్మర...జ్వలనజలు = (క్రమముగా) మన్మథుఁడు, చంద్రుఁడు, మెఱుపు, బ్రహ్మ, వాయువు, సూర్యుఁడు, అమృతము, నీరు, మహర్షులు, భూమి, (దక్షపుత్రికయగు) ఆరిష్ట, దేవతలు, మృత్యువు, అగ్ని - అనువారివలనఁ బుట్టినవారు - పదునాల్గుతెగలవారు; సురవేశ్యలు = అప్సరసలు.
{{Telugu poem|type=క.|lines=<poem>దైవతభటభుజశిఖర
వ్యావల్గన్నవకృపాణవల్లిక లలరెన్
దైవపథవారినిధిసలి
లావిష్కృతవిషమషీమహార్చులువోలెన్.</poem>|ref=168}}
'''టీక'''. దైవత...వల్లికలు = దేవవీరుల మూఁపులయందు కళకళలాడుచు చలించుచున్న తీగలవంటి సానపట్టిన కత్తులు; దైవ...హార్చులువోలెన్ = ఆకాశ మను సముద్రపునీటినుండి వెడలిన విషముయొక్క నల్లనిమంటలవలె; అలరెన్ = ప్రకాశించెను. '''అలం'''. రూపకము, ఉపమ.
{{Telugu poem|type=క.|lines=<poem>నయనత్రిభాగ<ref>చ. దరహాస</ref>వృతహా
సయుతంబుగ సాధ్యసతులు చల్లిన లాజల్
నయనాయుధతనయాయుధ
చయలతికావళుల కుసుమసమత వహించెన్.</poem>|ref=169}}
'''టీక'''. నయన...తంబుగన్ = కనుకొలుకులయం దావరించిన నవ్వుతో కూడునట్లు; లాజలు = ఆచారార్థము చల్లిన పేలాలు; నయనా...వళుల = శివుని పుత్రుఁడగు కుమారస్వామియొక్క ఆయుధచయము లను లతలయందలి; కుసుమసమతన్ = పూవులతోడి సామ్యమును; వహించెన్ = పొందెను. '''అలం'''. ఉత్ప్రేక్ష.
{{Telugu poem|type=తే.|lines=<poem>వివిధదివిషద్వధూముక్తదివిజవిటపి
కుసుమకేసర<ref>లసదున</ref>లసదంసకూటుఁ డగుచు
వేల్పుఁబడవాలు కడువాలు విరియఁబడిన
కంఠమునఁబొల్చు దుర్గకంఖాళ మనఁగ.</poem>|ref=170}}
'''టీక'''. వివిధ...కూటుఁడు = దేవతాస్త్రీలచేత విడుపఁబడిన పెక్కువిధములగు కల్పవృక్షపుష్పకేసరములచేఁ బ్రకాశించు శిఖరములవంటి మూపురములు కలవాఁడు; వేల్పుఁబడవాలు = దేవతల<noinclude><references/></noinclude>
klr2apw1kl542nto9jm9axmb9ibe9iq
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/93
104
212530
557081
554748
2026-05-26T10:12:47Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
557081
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సేనాధిపతి = కుమారస్వామి; విరియఁబడిన కందమునన్ = వికాసమును వహించిన మూపురముచేత; పొల్చు = ప్రకాశించునట్టి; దుర్గకంఖాణమనఁగన్ = దుర్గకు వాహనమైన సింహమో యనునట్లు; కడున్ = మిక్కిలి; వాలున్ = అతిశయించెను. '''అలం'''. ఉత్ప్రేక్ష.
{{Telugu poem|type=తే.|lines=<poem>విబుధమధురాధరాభుజావీజ్యమాన
విమలచామరబహుసహస్రములు వొలిచె
స్వామియిరుగడఁ బుష్పవర్షములఁ దలఁకి
సురవిమానమరాళముల్ దెరలె ననఁగ.</poem>|ref=171}}
'''టీక'''. విబుధ...సహస్రములు = దేవతాస్త్రీలచేతులచే వీఁచబడుచు చక్కనై వేలకొలఁదిగ నుండు వింజామరలు; స్వామియిరుగడ = స్వామికి రెండువైపులను; పుష్పవర్షముల = పుష్పవర్షములవలన; తలఁకి = భయపడి; సురవిమానమరాళముల్ = దేవతల విమానములైన హంసలు; తెరలె ననంగన్ = తొలఁగిపోయెనో యనునట్లు; పొలిచెన్ = ప్రకాశించెను. వర్షమును జూచి హంసలు పాఱిపోవుట సహజము; కానీ పుష్పవర్షములకుఁ దలఁకి విమానమరాళములు తెరలెనని వర్ణితము. '''అలం'''. రూపకము, ఉత్ప్రేక్ష.
{{Telugu poem|type=తే.|lines=<poem>సామిమలనుండి రాజతాచలముదాఁక
సేతు వెత్తినగతి మహాసేనసేన
రోదసీరంధ్రనీరంధ్రరూప మగుచు
నడచె గిరిసింధువన<ref>చ. పుష్టి</ref>సృష్టి పుడమి నడఁగ.</poem>|ref=172}}
'''టీక'''. సామిమలనుండి = (కుమార)స్వామి పర్వతమునుండి; రాజతాచలముదాఁక = కైలాసమువఱకును; సేతువు ఎత్తినగతిన్ = వారధి కట్టినట్లు; మహాసేనసేన = కుమారస్వామిసైన్యము; రోదసీరంధ్రనీరంధ్ర రూపము అగుచున్ = భూమ్యాకాశముల మధ్యభాగమున సందు లేనిదై - (క్రిక్కిరిసి); పుడమిన్ = భూమిపై; గిరిసింధువనసృష్టి = కొండలయు, నదులయు, అడవులయు సృష్టి; అడంగన్ = అణఁగిపోవునట్లు; నడచెన్. దక్షిణమున నున్న స్వామిమలమొదలుకొని ఉత్తరమున నున్న కైలాసమువఱకును వ్యాపించి కుమారస్వామి సైన్యము నడచుచుండఁగా కొండలు పిండియై, నదులు (దుమ్ముతోఁ గలసి) నిర్జలములయి, అడవులు నేలమట్టమై పేరు లేకుండఁ బోవుచున్నవని భావము. '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>పుట్టినమోములై శిఖరముల్ వెలుఁగొంద నితంబమండలిం
గట్టిన కృత్తియై నిబిడకాననరేఖ దలిర్ప, లోనఁ జూ
పట్టిన విశ్వమై వెలుఁగుప్రాణికులం బలరన్ ,గిరీశుఁ డ
ప్పట్టికిఁ గానిపించినప్రభం గలధౌతనగంబు తోచిఁనన్.</poem>|ref=173}}
'''టీక''', కైలాసపర్వతము తనతండ్రియగు శివునివలెఁ గుమారస్వామికిఁ గానిపించెనని యీపద్యమున వర్ణింపఁబడుచున్నది. శిఖరముల్ = కొండకొనలు; పుట్టిన మోములై = సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములను (శివుని) పంచముఖములయి; వెలుగొందన్ = ప్రకాశింపఁగా; నిబిడకాననరేఖ = దట్టమైన అడవులవరుస; నితంబమండలిన్ = నడుమున; కట్టిన = ధరించిన; కృత్తియై = తోలై; తలిర్పన్ = ప్రకాశింపఁగా; లోనన్ = కుక్షిలో; చూపట్టిన = కనఁబడిన - ఉన్న; విశ్వమై = ప్రపంచమై; వెలుఁగు = ప్రకాశించు; ప్రాణికులంబు = జీవజాలము; అలరన్ గిరీశుఁడు = శివుఁడు; అప్పట్టికిన్ = ఆకుమారునికి; కానిపించిన ప్రభన్ = కనిపించునట్లు చేసిన రీతిని; కలధౌతనగంబు = కైలాసము; తోఁచినన్ = కనఁబడఁగా.<noinclude><references/></noinclude>
5f7lz0w54l3ct30bnp0ial18lcbf82a
557082
557081
2026-05-26T10:13:12Z
దేవీప్రసాదశాస్త్రి
4290
557082
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సేనాధిపతి = కుమారస్వామి; విరియఁబడిన కందమునన్ = వికాసమును వహించిన మూపురముచేత; పొల్చు = ప్రకాశించునట్టి; దుర్గకంఖాణమనఁగన్ = దుర్గకు వాహనమైన సింహమో యనునట్లు; కడున్ = మిక్కిలి; వాలున్ = అతిశయించెను. '''అలం'''. ఉత్ప్రేక్ష.
{{Telugu poem|type=తే.|lines=<poem>విబుధమధురాధరాభుజావీజ్యమాన
విమలచామరబహుసహస్రములు వొలిచె
స్వామియిరుగడఁ బుష్పవర్షములఁ దలఁకి
సురవిమానమరాళముల్ దెరలె ననఁగ.</poem>|ref=171}}
'''టీక'''. విబుధ...సహస్రములు = దేవతాస్త్రీలచేతులచే వీఁచబడుచు చక్కనై వేలకొలఁదిగ నుండు వింజామరలు; స్వామియిరుగడ = స్వామికి రెండువైపులను; పుష్పవర్షముల = పుష్పవర్షములవలన; తలఁకి = భయపడి; సురవిమానమరాళముల్ = దేవతల విమానములైన హంసలు; తెరలె ననంగన్ = తొలఁగిపోయెనో యనునట్లు; పొలిచెన్ = ప్రకాశించెను. వర్షమును జూచి హంసలు పాఱిపోవుట సహజము; కానీ పుష్పవర్షములకుఁ దలఁకి విమానమరాళములు తెరలెనని వర్ణితము. '''అలం'''. రూపకము, ఉత్ప్రేక్ష.
{{Telugu poem|type=తే.|lines=<poem>సామిమలనుండి రాజతాచలముదాఁక
సేతు వెత్తినగతి మహాసేనసేన
రోదసీరంధ్రనీరంధ్రరూప మగుచు
నడచె గిరిసింధువన<ref>చ. పుష్టి</ref>సృష్టి పుడమి నడఁగ.</poem>|ref=172}}
'''టీక'''. సామిమలనుండి = (కుమార)స్వామి పర్వతమునుండి; రాజతాచలముదాఁక = కైలాసమువఱకును; సేతువు ఎత్తినగతిన్ = వారధి కట్టినట్లు; మహాసేనసేన = కుమారస్వామిసైన్యము; రోదసీరంధ్రనీరంధ్ర రూపము అగుచున్ = భూమ్యాకాశముల మధ్యభాగమున సందు లేనిదై - (క్రిక్కిరిసి); పుడమిన్ = భూమిపై; గిరిసింధువనసృష్టి = కొండలయు, నదులయు, అడవులయు సృష్టి; అడంగన్ = అణఁగిపోవునట్లు; నడచెన్. దక్షిణమున నున్న స్వామిమలమొదలుకొని ఉత్తరమున నున్న కైలాసమువఱకును వ్యాపించి కుమారస్వామి సైన్యము నడచుచుండఁగా కొండలు పిండియై, నదులు (దుమ్ముతోఁ గలసి) నిర్జలములయి, అడవులు నేలమట్టమై పేరు లేకుండఁ బోవుచున్నవని భావము. '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>పుట్టినమోములై శిఖరముల్ వెలుఁగొంద నితంబమండలిం
గట్టిన కృత్తియై నిబిడకాననరేఖ దలిర్ప, లోనఁ జూ
పట్టిన విశ్వమై వెలుఁగుప్రాణికులం బలరన్ ,గిరీశుఁ డ
ప్పట్టికిఁ గానిపించినప్రభం గలధౌతనగంబు తోచిఁనన్.</poem>|ref=173}}
'''టీక'''. కైలాసపర్వతము తనతండ్రియగు శివునివలెఁ గుమారస్వామికిఁ గానిపించెనని యీపద్యమున వర్ణింపఁబడుచున్నది. శిఖరముల్ = కొండకొనలు; పుట్టిన మోములై = సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములను (శివుని) పంచముఖములయి; వెలుగొందన్ = ప్రకాశింపఁగా; నిబిడకాననరేఖ = దట్టమైన అడవులవరుస; నితంబమండలిన్ = నడుమున; కట్టిన = ధరించిన; కృత్తియై = తోలై; తలిర్పన్ = ప్రకాశింపఁగా; లోనన్ = కుక్షిలో; చూపట్టిన = కనఁబడిన - ఉన్న; విశ్వమై = ప్రపంచమై; వెలుఁగు = ప్రకాశించు; ప్రాణికులంబు = జీవజాలము; అలరన్ గిరీశుఁడు = శివుఁడు; అప్పట్టికిన్ = ఆకుమారునికి; కానిపించిన ప్రభన్ = కనిపించునట్లు చేసిన రీతిని; కలధౌతనగంబు = కైలాసము; తోఁచినన్ = కనఁబడఁగా.<noinclude><references/></noinclude>
kbkv53qjehhnanez1nx2ikr40rr7sdx
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/94
104
212531
557094
554749
2026-05-26T10:59:31Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
557094
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>జైవాతృకబింబము నిజ
జీవాతువుఁ గాంచి ప్రాప్తజీవము లగుచున్
జీవంజీవము లలరెడు
భావంబున బాహులేయుబలములు పొదలెన్.</poem>|ref=174}}
'''టీక'''. నిజజీవాతువున్ = తమజీవనౌషధమగు; జైవాతృకబింబమున్ కాంచి = చంద్రబింబమును చూచి; ప్రాప్తజీవములు అగుచున్ = (పోనున్న) ప్రాణములు వచ్చినవై; జీవంజీవములు = చకోరములు; అలరెడు భావంబునన్ = సంతోషించునట్లు; బాహులేయుబలములు = కుమారుని సేనలు; పొదలెన్ = సంతోషించెను. '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=తే.|lines=<poem>పద్మరాగమణిమయపాదలబ్ధి
స్ఫురితగైరికశిఖరచంచూసమృద్ధి
గంధవతి <ref>చ. యును</ref>యను నొక్కపంకజమునడుమ
మించు నక్కొండ కొదమరాయంచఁ బోలి.</poem>|ref=175}}
'''టీక'''. పద్మ...లబ్ధిన్ = పద్మరాగమణులను పొందుటచేతను - (కాళ్లను పొందుటచేతను, దగ్గఱనుండు చిన్నకొండలను పొందుటచేతను); స్ఫురిత...సమృద్ధిన్ = ప్రకాశించుచు, గైరికాదిధాతువు(రంగు)లతోఁ గూడిన శిఖరములను ముక్కుల సమృద్ధిచేతను; గంధవతియను = భూమి యనునట్టి; పంకజమునడుమన్ = తామరపూవుమధ్యయందు; కొదమరాయంచఁ బోలి = జవ్వనము గల రాజహంసమువలె; అక్కొండ; మించెన్ = ప్రకాశించెను.
భూమి యొకతామరపూవువలెను, అందున్న కైలాసము (తెల్లనికొండ) ఒకరాజహంసవలె నున్నవి. పద్మరాగమణులు గల (ఎఱ్ఱని) కైలాసప్రత్యంతపర్వతములు హంసకాళ్లవలెను, గైరికాదిధాతువులచే నెఱ్ఱనైన కైలాసశిఖరములు హంసముక్కువలెను ఉన్నవని భావము. '''అలం'''. రూపకము, ఉపమ.
{{Telugu poem|type=తే.|lines=<poem>నీలగళవాహరింఖాఖనిత్రనిహతి
నింగి కెగసిన వెండిరానేలదుమ్ము
ప్రాంతవర్తిష్ణు సప్తర్షిపరివృఢులకు
<ref>చ. నొసఁగు</ref>నొసఁగు నిర్యత్నభసితవిలసిత మచట.</poem>|ref=176}}
'''టీక'''. నీల...నిహతిన్ = శివునివాహనమగు వృషభముయొక్క గిట్టలను గొడ్డళ్లదెబ్బలవలన; నింగికి = ఆకాశముపైకి; ఎగసిన = ఎగిరిన; వెండిరానేలదుమ్ము = వెండిరాళ్ల తెల్లదుమ్ము; ప్రాంత...పరివృఢులకున్ = దగ్గఱనున్న సప్తర్షిమండలమునకు [కశ్యపుఁడు, అత్రి, భరద్వాజుఁడు, విశ్వామిత్రుఁడు, గౌతముఁడు, వశిష్ఠుఁడు, జమదగ్ని అను నేడుగురును సప్తర్షులు.] నిర్యత్నభసితవిలసితము = ప్రయత్న మక్కఱలేని భస్మధారణమును; అచటన్; ఒసఁగున్.
నందీశ్వరు డెగురఁగొట్టిన తెల్లని వెండిదుమ్ము సప్తక్తర్షులదేహములపైఁ బడి, వారు వేఱే శ్రమపడి బూడిద పూసికొననక్కఱలేకుండ చేయుచున్నదని భావము.
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు నిజబలనిఖిలనిరీక్షణనిస్తంద్రచంద్రికా<ref>క. ధీనంబ, చ. ఫేనంబ</ref>ధీనం బగు నగ్గట్టుఱేని వైమానికసే
నాని మానధనుం డగు నధికుండు నిజపురుషాకారంబునుంబోలె నధిరోహించి.</poem>|ref=177}}
'''టీక'''. నిజ...ధీనంబు = తనసేనలచూపులకు (దృష్టికి) తక్కువకాని వెన్నెలకు లొంగినది - క్షేత్రములకు వెన్నెలవలె చల్లదనము కలిగించునది - ఆనందకరమైనది; (ఇచట 'చంద్రికాధీనంబు' అను నమహత్తు మహద్విశేషణముగా వాఁడబడినది.) గమ్యస్థానము చేరినందులకు మార్గాయాసపరిశ్రాంతము లగుసేనలు మిగుల సంతసించిన వనుట. వైమానికసీనాని = దేవసేనాపతి - కుమారస్వామి; నిజపురుషకారంబునుంబోలెన్ = తనప్రయత్నమువలె; అధిరోహించి = ఎక్కి. '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=క.|lines=<poem>వాహనము డిగి గగనచర
వాహినిఁ దత్కుధరసవిధవననిహరణకాం
క్షాహూతహృదయ నఁట యఁట
యోహో నిలు మనుచు నిలిపి యుల్లం బలరన్.</poem>|ref=178}}<noinclude><references/></noinclude>
8fm8svva6q8c7absgalty0cxccfitxn
557095
557094
2026-05-26T11:02:16Z
దేవీప్రసాదశాస్త్రి
4290
557095
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>జైవాతృకబింబము నిజ
జీవాతువుఁ గాంచి ప్రాప్తజీవము లగుచున్
జీవంజీవము లలరెడు
భావంబున బాహులేయుబలములు పొదలెన్.</poem>|ref=174}}
'''టీక'''. నిజజీవాతువున్ = తమజీవనౌషధమగు; జైవాతృకబింబమున్ కాంచి = చంద్రబింబమును చూచి; ప్రాప్తజీవములు అగుచున్ = (పోనున్న) ప్రాణములు వచ్చినవై; జీవంజీవములు = చకోరములు; అలరెడు భావంబునన్ = సంతోషించునట్లు; బాహులేయుబలములు = కుమారుని సేనలు; పొదలెన్ = సంతోషించెను. '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=తే.|lines=<poem>పద్మరాగమణిమయపాదలబ్ధి
స్ఫురితగైరికశిఖరచంచూసమృద్ధి
గంధవతి <ref>చ. యును</ref>యను నొక్కపంకజమునడుమ
మించు నక్కొండ కొదమరాయంచఁ బోలి.</poem>|ref=175}}
'''టీక'''. పద్మ...లబ్ధిన్ = పద్మరాగమణులను పొందుటచేతను - (కాళ్లను పొందుటచేతను, దగ్గఱనుండు చిన్నకొండలను పొందుటచేతను); స్ఫురిత...సమృద్ధిన్ = ప్రకాశించుచు, గైరికాదిధాతువు(రంగు)లతోఁ గూడిన శిఖరములను ముక్కుల సమృద్ధిచేతను; గంధవతియను = భూమి యనునట్టి; పంకజమునడుమన్ = తామరపూవుమధ్యయందు; కొదమరాయంచఁ బోలి = జవ్వనము గల రాజహంసమువలె; అక్కొండ; మించెన్ = ప్రకాశించెను.
భూమి యొకతామరపూవువలెను, అందున్న కైలాసము (తెల్లనికొండ) ఒకరాజహంసవలె నున్నవి. పద్మరాగమణులు గల (ఎఱ్ఱని) కైలాసప్రత్యంతపర్వతములు హంసకాళ్లవలెను, గైరికాదిధాతువులచే నెఱ్ఱనైన కైలాసశిఖరములు హంసముక్కువలెను ఉన్నవని భావము. '''అలం'''. రూపకము, ఉపమ.
{{Telugu poem|type=తే.|lines=<poem>నీలగళవాహరింఖాఖనిత్రనిహతి
నింగి కెగసిన వెండిరానేలదుమ్ము
ప్రాంతవర్తిష్ణు సప్తర్షిపరివృఢులకు
<ref>చ. నొసఁగు</ref>నొసఁగు నిర్యత్నభసితవిలసిత మచట.</poem>|ref=176}}
'''టీక'''. నీల...నిహతిన్ = శివునివాహనమగు వృషభముయొక్క గిట్టలను గొడ్డళ్లదెబ్బలవలన; నింగికి = ఆకాశముపైకి; ఎగసిన = ఎగిరిన; వెండిరానేలదుమ్ము = వెండిరాళ్ల తెల్లదుమ్ము; ప్రాంత...పరివృఢులకున్ = దగ్గఱనున్న సప్తర్షిమండలమునకు [కశ్యపుఁడు, అత్రి, భరద్వాజుఁడు, విశ్వామిత్రుఁడు, గౌతముఁడు, వశిష్ఠుఁడు, జమదగ్ని అను నేడుగురును సప్తర్షులు.] నిర్యత్నభసితవిలసితము = ప్రయత్న మక్కఱలేని భస్మధారణమును; అచటన్; ఒసఁగున్.
నందీశ్వరుఁ డెగురఁగొట్టిన తెల్లని వెండిదుమ్ము సప్తర్షులదేహములపైఁ బడి, వారు వేఱే శ్రమపడి బూడిద పూసికొననక్కఱలేకుండ చేయుచున్నదని భావము.
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు నిజబలనిఖిలనిరీక్షణనిస్తంద్రచంద్రికా<ref>క. ధీనంబ, చ. ఫేనంబ</ref>ధీనం బగు నగ్గట్టుఱేని వైమానికసే
నాని మానధనుం డగు నధికుండు నిజపురుషాకారంబునుంబోలె నధిరోహించి.</poem>|ref=177}}
'''టీక'''. నిజ...ధీనంబు = తనసేనలచూపులకు (దృష్టికి) తక్కువకాని వెన్నెలకు లొంగినది - క్షేత్రములకు వెన్నెలవలె చల్లదనము కలిగించునది - ఆనందకరమైనది; (ఇచట 'చంద్రికాధీనంబు' అను నమహత్తు మహద్విశేషణముగా వాఁడబడినది.) గమ్యస్థానము చేరినందులకు మార్గాయాసపరిశ్రాంతము లగుసేనలు మిగుల సంతసించిన వనుట. వైమానికసీనాని = దేవసేనాపతి - కుమారస్వామి; నిజపురుషకారంబునుంబోలెన్ = తనప్రయత్నమువలె; అధిరోహించి = ఎక్కి. '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=క.|lines=<poem>వాహనము డిగి గగనచర
వాహినిఁ దత్కుధరసవిధవననిహరణకాం
క్షాహూతహృదయ నఁట యఁట
యోహో నిలు మనుచు నిలిపి యుల్లం బలరన్.</poem>|ref=178}}<noinclude><references/></noinclude>
37iu3m07x8i2koezzcd8wru477idnu2
సూచిక:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf
106
213069
557054
556177
2026-05-26T06:12:57Z
Rajasekhar1961
50
557054
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=ఆచార్య యస్వీ జోగారావు సాహితీ వరివస్య
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:వెలమల సిమ్మన్న]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=విశాఖపట్నం
|సంవత్సరం=2025
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist
16=1
/>
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
ihcw66zka0jfa0tjld5ylplwt5u1umo
557055
557054
2026-05-26T06:14:10Z
Rajasekhar1961
50
557055
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=ఆచార్య యస్వీ జోగారావు సాహితీ వరివస్య
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:వెలమల సిమ్మన్న]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=విశాఖపట్నం
|సంవత్సరం=2025
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist
15="విసూ"
16=1
/>
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
a3cgpbsc1w3nbdohpobc6cwi4m4i90d
557068
557055
2026-05-26T09:33:58Z
Rajasekhar1961
50
557068
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=ఆచార్య యస్వీ జోగారావు సాహితీ వరివస్య
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:వెలమల సిమ్మన్న]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=విశాఖపట్నం
|సంవత్సరం=2025
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist
1="ముఖచిత్రం"
2="ప్రవి"
15="విసూ"
16=1
/>
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
ctoknobfyl4rve0ip2lvey8pfbk9tlu
అమ్మా అమ్మా తల్లీ
0
213408
557011
556928
2026-05-25T13:17:50Z
రవిచంద్ర
146
అక్షర దోష సవరణ
557011
wikitext
text/x-wiki
<poem>
అమ్మా అమ్మా తల్లీ అఖిలాండేశ్వరి నీవే - 2
అన్నపూర్ణేశ్వరీ తల్లీ ఆదిపరాశక్తి నీవే - 2
శ్రీభువనేశ్వరి తల్లీ రాజరాజేశ్వరి నీవే - 2
శ్రీచక్రవాసిని తల్లీ చిన్మయరూపిణి నీవే - 2
</poem>
gmbs7lbt9fqfvzdp6c6gw13ts8g53r2
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/160
104
213430
557005
2026-05-25T12:41:53Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557005
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|154|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>కు పరిశుద్ధ మగుసాత్వికాహారము నొసఁగునెడ బ్రహ్మవిద్యానిష్ఠు లగుసచ్ఛోత్రియులకరతల సంపర్కంబున పవిత్రంబైన సదాహారము నాస్వాదించిన పుణ్యంబువలన కుక్కలు, కాకులు, క్రిములును పరిశుద్ధి నొంది యనంతర ముత్తమ మగుమానవ జన్మమునే పొందఁగలవు. జన్మాంతరప్రాప్తికి చరమవాసనయే హేతు వగుగదా?
లోకమున, ప్రాణు లాహారమున కెప్పుడును దిరుగుచు నది యెచ్చట సులభముగా దొరకునో యచ్చట సిద్ధ మగుచుండును. ఎల్లప్పుడు నాచోటికి కాలము దప్పకుండ వచ్చుచుండుననుట యనుభవసిద్ధము. ఇట్లు పశుపక్ష్యాదులును ఎల్లపుడు నాహారప్రదుని ధ్యానించుచు కొనకు నట్టివాసనచే నుత్తమజన్మమునే పొందుచుండును. వానివృత్తి కృతజ్ఞతారూప మైనది గావునమానవులయందుఁ బుట్టియు కృతజ్ఞత గలిగి
ఉత్తమగుణయుక్తములే యగుచుండును. ఇట్లు ఆర్యులు పశువులను పక్షులను క్రిములను అతిసులభముగా తరింపజేయుచున్నారు. మహాత్ముల కిట్టిలోకోపకారప్రవణత్వము న్యాయ్యమే.
ఈవిధమున ప్రాణాగ్నిహోత్రవిధిని సమాప్తి నొందించి తత్కాలమునంద లేచి ముఖమును హస్తములను పాదములను జలముచే గడిగికొనవలయు: ప్రాణప్రణాడులశుద్ధికై శుధ్యాచమనము నాచరింపవలయు.<noinclude><references/></noinclude>
6tw8ip276hooxk9a4vcunayhiqgvodn
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/161
104
213431
557006
2026-05-25T12:50:46Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557006
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|155}}</noinclude>అనంతరము ప్రాణప్రేరకుఁ డగుపరమేశ్వరుని స్మరించుచు కన్నులుమొదలగువాని స్పృశింపవలయును. నేత్రములను స్పృశించుటవలన మహాఫలము గలదు. ఎట్లనిన, భోజనకాలమునందు షడ్రససంసర్గము కలిగియున్నచేతిని జలముచే గడిగినను రసశేష మాచేతివ్రేళ్లను విడువకయే యుండును. అట్టివ్రేళ్ళతో కనుగ్రుడ్డును తాకుటవలన నేత్రరోగములు చాలవరకు శమించుచున్నవి. మఱియు నిట్టియభ్యాసమును ప్రతిదినము విడువక యాచరించువారికి తఱచుగ నెల్లరకు నలుబదియేండ్లకు తటస్థించుచున్న చత్వార మనుదృష్టిదోషము వచ్చుటయే లేదు. ఇది యనుభవసిద్ధమై యున్నది. దీనింబట్టి తక్కినయవయవముల స్పర్శమునకును ఫల మూహించుకొనవలయు. తరువాత కొంచెము నడువవలయు. ఇదియు సఫలమని శ్లో॥ భుక్త్వాశతపదంగచ్ఛేత్॥ అనుటచే ఆరోగ్యశాస్త్ర విదులు నంగీకరించుచునే యున్నారు.
ఇట్లు తిరుగుచు, ఇష్టదేవతను ధ్యానించుచును ప్రశాన్త చిత్తుఁడై భుజించినయన్నముచే తనచిత్తము సత్యమార్గమునందే ప్రవర్తించునట్లును. గర్వించి యథేచ్ఛముగాఁ దిరుగకుండు నట్లును పరమేశ్వరుఁ బ్రార్థింపవలయు. ఈ సందర్భమున విష్ణుపురాణమునందు
<poem>
{{left margin|5em}}
శ్లో॥ సత్యేన తేన యద్భుకం జీర్య త్యన్న మిదం తథా!
ఇత్యుచ్చార్య స్వహస్తేన పరిమృజ్యా త్తథోదరం॥
</poem><noinclude><references/></noinclude>
nyp4m8a9368w75paiq8bn8lf5i9yu69
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/162
104
213432
557007
2026-05-25T13:00:46Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557007
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|156|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>సత్యమార్గమున భుజింపఁబడినయన్నము ఆవిధముననే జీర్ణమగుగాక. (సత్యమార్గమునే వృద్ధినొందించుగాక యని భావము.) అని పలికి తనచేతితో కడుపు తుడువవలయు నని యున్నది.
దీనింబట్టి ఆర్యులభోజనము ఈశ్వనారాధనరూప మైనదియు, ప్రాణిసామాన్యమును తరింపజేయునదియు, ప్రాణివర్గమును పోషించునదియు నగు. ఇట్లు భోజనవిధి కనంతరము గృహస్థునకు మాత్రము తాంబూలచర్వణము విధింపఁబడియెను. మార్కండేయుఁడు శ్లో॥ భూయోప్యాచమ్య కర్తవ్యం తతస్తాంబూలభక్షణం అనివిధంచెను.
తమలపాకు, పోకఫలము, సున్నము ఈమూడు చేరిన దానికి తాంబూలమని పేరు, ఇం దన్నియు వగరు కారము, అనురసములు ప్రధానముగా గలవి. ఈరసములకు, మహోపకారత్వంబును, ఇంకను నందు జేరుజాతీఫలాదులకు శుక్లవృద్ధికరత్వంబు నుండుటచే తాంబూలమునకు గృహస్థుఁడే అధికారియని నిరూపింపఁబడియెను, దీనికిని నియమముకలదు.
<poem>
{{left margin|5em}}
శ్లో॥ సువూగంచ సుపర్ణంచ సుమార్ణేన సునంయుతం।
అదత్వా ద్విజదేవేభ్య స్తాంబూలం వర్జయే ద్బుధః॥
</poem>
మంచిపోకలు మంచియాకులు మంచిసున్నము చేర్చి యీతాంబూలమును మొదట దేవతలకు బ్రాహ్మణులకు నర్పించి గ్రహింపవలయునని యర్థము. ఈశ్వరున కర్పింపనిది<noinclude><references/></noinclude>
orkblx7oz8dik3otnvdi6u8a8al48dg
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/163
104
213433
557008
2026-05-25T13:10:43Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557008
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|157}}</noinclude>యు బ్రాహ్మణుల కొసగనిదియు నేదియైనగ్రహింపఁ జనదు. ఆర్యులు పరోపకారము పరబ్రహ్మవిద్యయు ప్రధానముగాఁ గలవారు గాన నిట్టు లాచరించుచున్నారు. తాంబూలచర్వణము విషయమున నామునియే.
{{left margin|5em}}
శ్లో॥ పర్ణమూలే మహావ్యాధిః పర్ణాగ్రే పాపసంభవః।
చూర్ణపర్ణం హర త్యాయుః సిరాబుద్ధివినాశనీ॥
తస్మా దగ్రంచ మూలంచ సిరాంచైవ విశేషతః।
చూర్ణపర్ణం వర్జయిత్వా తాంబూలం భక్షయే ద్భుధః॥
</poem>
తమలపాకుతొడిమ భక్షించునెడ వ్యాధియు, ఆకుయొక్క కొనగ్రహించునెడ పాపంబును సంభవించు. సున్నపాకును భక్షించునెడ ఆయువు తరుగును. తమలపాకు ఈనెలు గ్రహించునెడ బుద్ధి నశించు. కావున తమలపాకు యొక్క తొడిమను, సున్నపాకును విడిచి తాంబూలము భక్షింపవలయునని యున్నది. దీనింబట్టి తమలపాకుయొక్క తొడిమ ఈనెలు వీనియందు విషాంశము కలదని తెలియుచున్నది. వీనిలో సున్నపాకు సున్నమును చాలకాలము ధరించెనుగాన నందు క్షారమధికమగు నని నిషేధింపఁబడియెను. ఇటులే యితరము నూహించుకొనవలయు. ఇట్లు తాంబూలంబు నీశ్వరార్పితంబే గావున దానినమలునపుడును దేవతాస్మరణము సిద్ధమేయని యెఱుంగునది.
{{c|ఇది మాధ్యాహ్నికప్రకరణము.}}
{{Css image crop
|Image = Aryadharma-Pratyaksha-Phalabodhini_(1923,_Telugu).pdf
|Page = 163
|bSize = 419
|cWidth = 108
|cHeight = 30
|oTop = 546
|oLeft = 159
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
o1bq8ww2q4r7t22vfz9eta2koje3lls
557009
557008
2026-05-25T13:11:21Z
శ్రీరామమూర్తి
1517
557009
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|157}}</noinclude>యు బ్రాహ్మణుల కొసగనిదియు నేదియైనగ్రహింపఁ జనదు. ఆర్యులు పరోపకారము పరబ్రహ్మవిద్యయు ప్రధానముగాఁ గలవారు గాన నిట్టు లాచరించుచున్నారు. తాంబూలచర్వణము విషయమున నామునియే.
<poem>
{{left margin|5em}}
శ్లో॥ పర్ణమూలే మహావ్యాధిః పర్ణాగ్రే పాపసంభవః।
చూర్ణపర్ణం హర త్యాయుః సిరాబుద్ధివినాశనీ॥
తస్మా దగ్రంచ మూలంచ సిరాంచైవ విశేషతః।
చూర్ణపర్ణం వర్జయిత్వా తాంబూలం భక్షయే ద్భుధః॥
</poem>
తమలపాకుతొడిమ భక్షించునెడ వ్యాధియు, ఆకుయొక్క కొనగ్రహించునెడ పాపంబును సంభవించు. సున్నపాకును భక్షించునెడ ఆయువు తరుగును. తమలపాకు ఈనెలు గ్రహించునెడ బుద్ధి నశించు. కావున తమలపాకు యొక్క తొడిమను, సున్నపాకును విడిచి తాంబూలము భక్షింపవలయునని యున్నది. దీనింబట్టి తమలపాకుయొక్క తొడిమ ఈనెలు వీనియందు విషాంశము కలదని తెలియుచున్నది. వీనిలో సున్నపాకు సున్నమును చాలకాలము ధరించెనుగాన నందు క్షారమధికమగు నని నిషేధింపఁబడియెను. ఇటులే యితరము నూహించుకొనవలయు. ఇట్లు తాంబూలంబు నీశ్వరార్పితంబే గావున దానినమలునపుడును దేవతాస్మరణము సిద్ధమేయని యెఱుంగునది.
{{c|ఇది మాధ్యాహ్నికప్రకరణము.}}
{{Css image crop
|Image = Aryadharma-Pratyaksha-Phalabodhini_(1923,_Telugu).pdf
|Page = 163
|bSize = 419
|cWidth = 108
|cHeight = 30
|oTop = 546
|oLeft = 159
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
ni6jlo1a8k1lkv63q42ecu8l6ivs39j
దేవి భజనలు
0
213434
557010
2026-05-25T13:16:24Z
రవిచంద్ర
146
దేవీ భజనలు
557010
wikitext
text/x-wiki
== అమ్మా అమ్మా తల్లీ ==
{{:అమ్మా అమ్మా తల్లీ}}
== అంబా భవానీ శారదే ==
{{:అంబా భవానీ శారదే}}
== అంబ పరమేశ్వరి ==
{{:అంబ పరమేశ్వరి}}
== అంబుజవాసిని సుందరివాణి ==
{{:అంబుజవాసిని సుందరివాణి}}
== కామాక్షివే మీనాక్షివే ==
{{:కామాక్షివే మీనాక్షివే}}
== జగజ్జననీ జగన్మాతా ==
{{:జగజ్జననీ జగన్మాతా}}
== జయ జయ దేవి దయాళు ==
{{:జయ జయ దేవి దయాళు}}
== వాణి సరస్వతి వాగ్దేవి ==
{{:వాణి సరస్వతి వాగ్దేవి}}
== శారదే శారదే వీణావాణి శారదే ==
{{:శారదే శారదే వీణావాణి శారదే}}
== సంగీత రసికే శారదే ==
{{:సంగీత రసికే శారదే}}
6av4y2rxcixo2qfihcck6cljcxbz98e
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/164
104
213435
557012
2026-05-25T13:21:33Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557012
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|158|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>ఇఁక నపరాహ్ణప్రకరణ మారంభింపఁబడును. అపరాహ్ణమనఁగా పందొమ్మిదవగడియమొదలుకొని ఇరువదినాలుగవ గడియవరకు నారుగడియలకాలము. ఈకాలము తఱుచుగా గృహస్థులకు సంగవకాలముంబలె లోకయాత్ర కుపయోగించును. మఱియు నీకాలము. పరసేవనాదిదుఃఖములు, కృష్యాదికష్టంబులును లేనివారికి సత్కథాశ్రవణమునకును ధర్మశాస్త్రపరిశీలనమునకు నుపయోగించును.
ఇట్లు కృతకృత్యులును, పరమేశ్వరు నారాధించినవారును, అర్థుల నాదరించినవారును, భోజనసుఖము నొందినవారునగు జనులకు వ్యవహారావలోకనము కలుగునెడ మిగుల లాభకరమగునని యపుడు లోకయాత్ర విధింపఁబడియె.
{{c|ఇది అపరాహ్ణప్రకరణము.}}
{{Css image crop
|Image = Aryadharma-Pratyaksha-Phalabodhini_(1923,_Telugu).pdf
|Page = 164
|bSize = 528
|cWidth = 191
|cHeight = 32
|oTop = 378
|oLeft = 165
|Location = center
|Description =
}}
{{c|సాయాహ్నప్రకరణము.}}
ఇపుడు సాయాహ్నికకర్మముయొక్క రహస్యము నిరూపింపఁబడును. సర్వకర్మంబులకును సాయాహ్నంబున నుపక్రమము శ్లాఘ్యము. దానిఫలము పదంపడి తెలుపంబడును. ఇది పగటియైదవభాగము, ఆరుగడియలకాలమగును. కాలతత్వం బెట్టిదనిన.<noinclude><references/></noinclude>
sf0txprqkgx9u3k5fduvn8nutfuu4qr
557013
557012
2026-05-25T13:23:17Z
శ్రీరామమూర్తి
1517
557013
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|158|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>ఇఁక నపరాహ్ణప్రకరణ మారంభింపఁబడును. అపరాహ్ణమనఁగా పందొమ్మిదవగడియమొదలుకొని ఇరువదినాలుగవ గడియవరకు నారుగడియలకాలము. ఈకాలము తఱుచుగా గృహస్థులకు సంగవకాలముంబలె లోకయాత్ర కుపయోగించును. మఱియు నీకాలము. పరసేవనాదిదుఃఖములు, కృష్యాదికష్టంబులును లేనివారికి సత్కథాశ్రవణమునకును ధర్మశాస్త్రపరిశీలనమునకు నుపయోగించును.
ఇట్లు కృతకృత్యులును, పరమేశ్వరు నారాధించినవారును, అర్థుల నాదరించినవారును, భోజనసుఖము నొందినవారునగు జనులకు వ్యవహారావలోకనము కలుగునెడ మిగుల లాభకరమగునని యపుడు లోకయాత్ర విధింపఁబడియె.
{{c|ఇది అపరాహ్ణప్రకరణము.}}
{{Css image crop
|Image = Aryadharma-Pratyaksha-Phalabodhini_(1923,_Telugu).pdf
|Page = 164
|bSize = 528
|cWidth = 191
|cHeight = 32
|oTop = 378
|oLeft = 168
|Location = center
|Description =
}}
{{c|సాయాహ్నప్రకరణము.}}
ఇపుడు సాయాహ్నికకర్మముయొక్క రహస్యము నిరూపింపఁబడును. సర్వకర్మంబులకును సాయాహ్నంబున నుపక్రమము శ్లాఘ్యము. దానిఫలము పదంపడి తెలుపంబడును. ఇది పగటియైదవభాగము, ఆరుగడియలకాలమగును. కాలతత్వం బెట్టిదనిన.<noinclude><references/></noinclude>
d0zz4sgnw2qpfv0m08vj5wmag6wz7i4
557014
557013
2026-05-25T13:24:25Z
శ్రీరామమూర్తి
1517
557014
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|158|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>ఇఁక నపరాహ్ణప్రకరణ మారంభింపఁబడును. అపరాహ్ణమనఁగా పందొమ్మిదవగడియమొదలుకొని ఇరువదినాలుగవ గడియవరకు నారుగడియలకాలము. ఈకాలము తఱుచుగా గృహస్థులకు సంగవకాలముంబలె లోకయాత్ర కుపయోగించును. మఱియు నీకాలము. పరసేవనాదిదుఃఖములు, కృష్యాదికష్టంబులును లేనివారికి సత్కథాశ్రవణమునకును ధర్మశాస్త్రపరిశీలనమునకు నుపయోగించును.
ఇట్లు కృతకృత్యులును, పరమేశ్వరు నారాధించినవారును, అర్థుల నాదరించినవారును, భోజనసుఖము నొందినవారునగు జనులకు వ్యవహారావలోకనము కలుగునెడ మిగుల లాభకరమగునని యపుడు లోకయాత్ర విధింపఁబడియె.
{{c|ఇది అపరాహ్ణప్రకరణము.}}
{{rule|2cm}}
{{c|సాయాహ్నప్రకరణము.}}
ఇపుడు సాయాహ్నికకర్మముయొక్క రహస్యము నిరూపింపఁబడును. సర్వకర్మంబులకును సాయాహ్నంబున నుపక్రమము శ్లాఘ్యము. దానిఫలము పదంపడి తెలుపంబడును. ఇది పగటియైదవభాగము, ఆరుగడియలకాలమగును. కాలతత్వం బెట్టిదనిన.<noinclude><references/></noinclude>
ppgehtygxzldmmp4slqe7aduby27cs6
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/165
104
213436
557016
2026-05-25T14:14:09Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557016
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|159}}</noinclude>
{{c|కాలతత్వము.}}
కాలము సర్వంబును కల్పించు ననువచనమువలన సర్వ కర్మములచే పూజ్యుం డగుపరమేశ్వరుఁడు నిత్యకాలస్వరూపుండనుట యార్యుల కందఱకును సమ్మతమైన యంశమే. శాస్త్రములయం దాపరమేశ్వరుఁడే జగమున కాధారభూతుఁడని యున్నది. గోపథబ్రాహ్మణమునందు, దినస్వరూపుండును, పక్షరూపుండును, ఋతురూపుండును, అయనరూపుండును, సంవత్సరరూపుండు నగుపరమేశ్వరుఁ డాయాకాలములయందుఁ జేయంబడు కర్మములచే నుపాసింపఁబడుచున్నాఁడని చెప్పంబడియెను. అందు సంవత్సరము గొప్పదియైనను దినమునందును దానిధర్మము నతిదేశించి యార్యులు కాలము నుపాసించుచున్నారు. అందు పగటికి సూర్యుడు దేవత. ప్రతిపగలురూప మైనసంవత్సరమునకు ఉత్తరాయణము గొప్పదేవత యగు. అట్లు రాత్రికి చంద్రుఁ డధిదేవత. ప్రతిరాత్రిరూప మగుసంవత్సరమునకు దక్షిణాయనము గొప్పదేవత. శ్రు॥ య ఏవ విద్వా నుదగయనే ప్రమీయతే దేవానామేవ మహిమానం గత్వా ఆదిత్యస్య సాయుజ్యం సలోకతా మాప్నోతి! అథ యో దక్షిణె ప్రమీయతే పితౄణామేవ మహిమానం గత్వా చంద్రమ
స స్సాయుజ్యగ్ం సలోకతా మాప్నోతి॥ ఎవఁడు ఉత్తరాయణమున మృతి నొందునో వాఁడు దేవతలమాహాత్మ్యమును పొంది సూర్యునిసాలోక్యమును, సాయుజ్యమును జెందును<noinclude><references/></noinclude>
juqm7tx8onndq25yqwepiwn7x26jdp7
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/166
104
213437
557017
2026-05-25T14:23:39Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557017
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|160|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>మఱియెవఁడు దక్షిణాయనమున మృతి నొందునో వాఁడు పితరులమహిమను పొంది చంద్రునిసాలోక్యమును సాయుజ్యమును పొందును, అని చెప్పఁబడియున్నది.
ఆకారణముననే పండ్రెండురాసులుగలదియు, ప్రతిరాశికి ముప్పదియంశములు గలదియు, ప్రతియంశమునకు నరువది కలలుగలదియు నగునొకదినము కాలచక్రమునకు (21600) ఇరువదియొక్కవేయిఆరునూర్లుకలలు గలవు. ఇవియే ప్రతిదినము పురుషుఁడు విడుచుశ్వాసము లగును. కాలచక్రమున నెంత సేపులో నొకకల గతించునో అంతసేపులో పురుషునకు నొక శ్వాసముమాత్ర మాయువు ఖర్చుపడును. భగణపరిస్పంద
రూపంబును, బ్రహ్మరూపంబు నగుదినమునకు నైదవస్థలు విభాగింపఁబడినవి. ఎట్లనిన, సృష్టి, స్థితి, సంహారము, తిరోధనము, అనుగ్రహము ననఁబడునవి.
అందు ఉషఃప్రాతఃకాలములయందు సృష్టియు, సంగవ మధ్యాహ్నములయందు లోకయాత్రచే పోషణము జరుగుచుండునుగాన స్థితియు, అపరాహ్ణ సామీహ్నములయందు సంహారంబును పూర్వరాత్రియందు సర్వంబు నుపసంహరింపఁబడుటచే తిరోధానంబును, అర్థరాత్రమున సుషుప్తివలన సుఖ మనుభవింపఁబడుచుండుటంజేసి యనుగ్రహంబును, ఇట్లు దినము బ్రహ్మముయొక్క లక్షణము లగుపంచకృత్యములను చేయుచున్నది. దీనియం దనుగ్రహ మల్పకాల మగు. అదియే పరమే<noinclude><references/></noinclude>
dx0ecq23ddpe7ojoflhvvmzy8er6iog
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/167
104
213438
557027
2026-05-25T22:47:21Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557027
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|161}}</noinclude>శ్వరునియందైననో పునరావృత్తిరహిత మగును.
ఇం దింకొక విభాగంబును కలదు. ఉషఃకాలముమొదలుకొని సాయంకాలమువరకు జాగ్రదవస్థయు, పిదప పూర్వరాత్రివరకు స్వప్నంబును, పిమ్మట సుషుప్తియు నగు. అందు సంధ్య రుద్రసంబంధమని చెప్పంబడుచున్నది.
ప్రాతస్సంధ్యయందు బ్రాహ్మముహూర్తమునకు పిదప రౌద్రముహూర్తము సంధ్యానుష్ఠానమున కుపయోగించు
చున్నది. అటులే సాయంసధ్యాకాలంబును పరమేశ్వరుని తాండవకాలమే యని చెప్పఁబడుచున్నది. అప్పటికర్మంబులు కొద్దివైనను ఎక్కువఫలముగలవియే యగును. ఆకాలమున నుద్రేకించినభూతాదులవలన లోకమునకుఁ గలుగుబాధ యొక్క నివృత్తి పరమేశ్వరనటనమునకు ఫలమని పురాణములయందు గలదు.
ఇది యిచట నెఱుంగవలయు. సర్వేంద్రియములు ఉదయముమొదలుకొని వ్యాపారమునఁ బ్రవర్తించి యలసియుండి గొప్పగర్తంబునందుంబలె తమోమయం బగురాత్రిసమయంబున విశ్రాంతిసుఖము ననుభవింపఁగోరుచు సాయంకాలముననే పనులనుండి తొలఁగుచున్నవి. సర్వపాపములకు నిదానమైనదియు, నింద్రియగతికి యోగ్యముకానిదియు నగురాత్రీసమయము సమీపించెను. అప్పుడు పగటికంటె పాప మధిక మనుట స్పష్టమే. ఏలన,<noinclude><references/></noinclude>
dnfzfewrl7t09rtowlv59409th22wxp
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/168
104
213439
557028
2026-05-25T22:55:07Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557028
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|162|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>రాత్రియందు సూర్యకాంతి లేమిచే చీకటి యంతటను వ్యాపించును. దానింబట్టి దేశస్వరూపము, వస్తుస్వరూపంబును తెలియనేరదు. కావున నప్పుడు పాపముల కవకాశము కలుగును.
ఎట్లనిన, క్రూరచిత్తులు తమస్థితి యితరుల కెఱుకపడకుండ వైరుల వధించుట కప్పుడే యత్నించుచుందురు. మఱికొందఱు తమతమకృత్యములవలన నాయాసపడి ద్రవ్యము నార్జించికొని యింటికి వచ్చుచు నడుమ మద్యముద్రావి మత్తుగొని అవ్యవస్థముగా సంచరించుచుందురు. వెరపుగలవారైనను అప్పు డెవ్వరికి తెలియదుగదాయని మద్యపానాదులకై యత్నింతురు. దొంగలుమొదలగువారి కాకాల ముపయోగపడునని వేరఁ జెప్పఁబనిలేదు. ఇఁక జారులు, వ్యభిచారిణులు మొదలగువారికి మిగుల సంతోషకాల మనుట స్పష్టమే. దీనింబట్టి పగటికంటె రాత్రికాలము దోషముల కెక్కువ యనుకూలమనుట నిర్వివాదము.
ఇదిగాక రాత్రియందు శరీరము ద్వారము లన్నిటినుండి మలములు స్రవించుచుండును, మఱియు, స్త్రీసంపర్కాదుల వలన శరీర మశుచిభూయిష్ఠ మగును. అప్పుడు పరిశుద్ధి విధింపఁబడినను సూర్యకిరణసంపర్కముగల పగటినీరములకుంబలె నప్పటిజలములకు నంతటి శోధకశక్తి యుండనేరదు. కావున తగినపరిశుద్ధి గలుగనేరదు. మఱియు, సమస్తమగుకర్మేం<noinclude><references/></noinclude>
ki3o2jaowqmammjlfd57eah2ssr5wb5
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/169
104
213440
557029
2026-05-25T23:02:23Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557029
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|163}}</noinclude>ద్రియములు, జ్ఞానేంద్రియములు నుదయముమొదలుకొని కర్మమునందుఁ బ్రవర్తించి యలసియున్నవిగావున నప్పు డేకర్మమునందు బలవంతముగాఁ బ్రవేశపెట్టినను పూర్వమువలె ఫలము కలుగనేరదు.
ఇదియునుంగాక, రాత్రియందు సూర్యకిరణసంచారము లేమిచే జఠరాగ్ని మందగించియుండుటంజేసి పగలు రెండుమూడుసారులు భుజించువారును రాత్రియం దొకమారుకంటె భుజింపఁజాలరు. అట్లు భుజించిరేని వారు రోగములచే బాధనొందుచునేయున్నారు. మఱియు నిద్రయందు శవప్రాయముగా నున్నవానికి సర్వవిధముల లోపము సంభవించును.
కాఁబట్టి విశ్రమించుటకంటె ముందు బుద్ధిమంతుఁ డగువాఁడు రాఁబోవునాపదలవల్లనుండి కాపాడుకొనుటకై జాగరూకుఁడై యుండుట శ్రేయము. అట్లు కాపాడుకొనుట భగవంతునికరుణ లేకున్న మనుష్యమాత్రునకు స్వాధీనము కానేరదు. కావున నప్పుడు శరీరము నిర్మలముచేసికొని భగవదుపాస్తి చేయవలయు. అప్పుడు వరుణునిధ్యానము విధింపఁబడెను.
ఆసమయమున లౌకికవ్యాపారము వదలి మహాగుణము గలసౌరకిరణములను సేవించుపురుషుని శరీరమునకు దోషసామ్యము కలుగునని వైద్యశాస్త్రమునఁ జెప్పబడియున్నది. సూర్యుఁడు కిరణముల నుపసంహారము చేయుచున్నపుడు సూర్యకిర<noinclude><references/></noinclude>
mhdezr70vfh14mlsc86sommzl2w3tgm
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/170
104
213441
557030
2026-05-25T23:10:00Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557030
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|164|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>ణములకు భూమియం దగువస్తువుల నాకర్షించుటయం దెక్కువశక్తి గలదు. ప్రాతఃకాలమున శీతమధికముగను పిత్తము కొంచెముగ నుండును. మధ్యాహ్నమున తేజము పూర్ణమై యున్నందున కేవలము పిత్తరూపముగానే యుండును. సాయంకాలమందైననో పిత్తము తగ్గిపోవుచుండును. శీత మంకురించుచుండును. వాతము శీతము ననుసరించి వచ్చు చుండును.
కావున సాయంకాలమున సూర్యకిరణములచే దోషసామ్యము కలుగుచున్నది. ఆరోగ్య మనగా, దోషసామ్యమే
యగు.
వాగ్భటుఁడు శ్లో॥ రోగస్తు దోషవైషమ్యం దోషసామ్య మరోగతా॥ అని వచించెను. కాఁబట్టి కేవల మారోగ్యము
గోరువారును నవశ్యముగా సాయంకాలమునం దగుసూర్యకిరణముల సేవింపవలయు. ఇట్లు నియతముగా సాయంకాలపు సూర్యకిరణములను సేవించునార్యులకు నన్నివిధముల నారోగ్యము సంభవించుచునేయున్నది. ఆకారణమువలన సాయంకాలమునందు సకలకర్మంబులు నారంభింపఁబడుచున్నవి.
సంధ్యోపాసన మన్నికర్మములలోనను ముఖ్యమైనది. దానియొక్క మహిమ మొదటనే నిరూపింపఁబడియె.
ఆసంధ్యోపాసనంబు నప్పుడే యారంభింపఁబడుచున్నది. ఎట్లనిన, ప్రాతఃకాలమున నాహ్నికము చేసికొనినవా రగునాచార్యులచే<noinclude><references/></noinclude>
neqaveqqxijg3kxo4n2f9vdmsxju7xi
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/171
104
213442
557031
2026-05-25T23:20:11Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557031
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|165}}</noinclude>వటువు సంస్కరింపఁబడినవాఁడై తత్కాలముననే సకలవైదిక స్మార్తకర్మంబులయందు నధికారసంపత్తి గలిగి అనార్యు లెఱుంగనిదియు, నధిక మగుబ్రహ్మతేజము నిడునదియు, పూర్వపుణ్యపరిపాకఫలంబును నగుబ్రాహ్మణ్యముయొక్క యభివ్యక్తిలక్షణ మైనసంస్కారము నొంది కర్మసాక్షియు, జగచ్చక్షుండు నగుసూర్యునిఁ జూచి పరమేశ్వరుని ధ్యానించుచు ససంప్రదాయముగా సంకల్పముతోడను, ప్రాణాయామముతోడను, ప్రోక్షణముతోడను, నంగములతోడను సంద్యోపాసనను సాయంకాలమునందే యారంభించుచున్నాఁడు. ద్విజత్వము నొందినవానికి సాయంసంధ్యయే ప్రథమంబును, సర్వకర్మంబులకు నుపనయనమే ప్రధానంబునగుగదా? దీనింబట్టి సర్వకర్మంబులకు సాయంకాలమునందే యుపక్రమము న్యాయ్యమని ఏర్పడుచున్నది.
కర్మము శ్రౌతము, స్మార్తము, తాంత్రికము, మూడువిధములే యగుచున్నది. సర్వకర్మంబులు నీమూడిటియందే యంతర్ధానము నొందుచున్నవి. శ్రౌతస్మార్తకర్మములలో ముఖ్యమైనసంధ్యావందనమునకు సాయంకాలముననే యారంభమని చెప్పఁబడియెను.
అనంతరము, సాంగవేదమును జదివి సమావర్తనము జేసుకొని రెండవయాశ్రమమునఁ బ్రవేశించినవాఁడును అగ్న్యుపాసనమును సాయంకాలమునందే యారంభించుచున్నాఁడు. అట్టు లాధానమున నగ్న్యుపక్రమంబును సాయంకాలమునందే జరు<noinclude><references/></noinclude>
35lu931nlxv4hjrnh6k7q12lunmtppg
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/17
104
213443
557047
2026-05-26T05:51:57Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ' రావుగారు సంస్కృతాంధ్ర, ఆంగ్ల భాషల్లో నిష్ణాతులు, జోగారావు గారి గురువులు శిష్ట్లా కలియుగం, వడ్లమాని సుబ్బావధాని, కర్రి కామేశం, రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, తణికెళ్ళ ప్...'
557047
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>
రావుగారు సంస్కృతాంధ్ర, ఆంగ్ల భాషల్లో నిష్ణాతులు, జోగారావు గారి
గురువులు శిష్ట్లా కలియుగం, వడ్లమాని సుబ్బావధాని, కర్రి కామేశం, రాంభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, తణికెళ్ళ ప్రకాశశాస్త్రి, అంగర సోమశేఖరరావు ఈయుణ్ని వెంకటవీర రాఘవాచార్యులు, చెళ్లపిళ్ళ సీతారామ మూర్తి, గంటి జోగి సోమయాజి, దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, అప్పల సోమేశ్వరశర్మ, విశ్వనాథ సత్యనారాయణ, మల్లంపల్లి సోమశేఖర శర్మ, శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు మొదలైన వారు.
1954 జనవరిలో ఆంధ్ర విశ్వ కళాపరిషత్, తెలుగు శాఖలో లెక్చరర్ గా చేరారు.
1967లో గుంటూరులో ఏర్పాటు చేసిన పి.జి. సెంటర్, తెలుగుశాఖలో కొంత కాలం
పనిచేశారు. మరల ఆంధ్ర విశ్వకాళాపరిషత్ కు వచ్చారు. 1965-67లో రష్యాలో
“లెనిన్ గ్రాడ్” విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేశారు. 1976 నుంచి
1979 వరకు ఆంధ్ర విశ్వకళాపరిషత్, తెలుగు శాఖలో అధ్యక్షులుగా పనిచేశారు.
1980లో ఉత్తమ అధ్యాపక అవార్డు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవించింది.
1980-83 వరకు అర్హు, కామర్సు, లా కాలేజికి ప్రిన్సిపాల్ గా బాధ్యతలను నిర్వర్తించారు.
విశ్వవిద్యాలయంలో అనేక కీలక పదవులు చేపట్టి, విద్యార్థుల ఆదరాభిమానాల్ని
పొందారు. వీరి ప్రతిభకు గుర్తింపుగా 1984లో యు.జి.సి. వారు వీరిని జాతీయ ఆచార్యునిగా పరిగణించారు. జాతీయ స్థాయికి ఎదిగిన అధ్యాపక ప్రముఖుల్లో రావుగారు అగ్రగణ్యులు. రావుగారి దగ్గర ముప్పైకి పైగా పిహెచ్.డిలు. నలుగురికి
ఎంఫిల్ లు లు వచ్చాయి. 1984లో ఆంధ్ర విశ్వకళాపరిషత్ వీరికి గౌరవ డి.లిట్ ఇచ్చి ఘనంగా గౌరవించింది. వీరు జీవితంలో ఎన్నో సభల్లో పాల్గొని, గొప్పగా ఉపన్యసించడం మరుపురాని అంశం. వీరి ఉపన్యాసకళ మహా పండితుల ప్రశంసల్ని అందుకుంది.
1970లో ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారు వీరిని ఘనంగా
నవ్మానించారు. 1981 ఏప్రిల్ లో మలేషియాలో జరిగిన ప్రపంచ తెలుగు
మహాసభలకు ఆంధ్ర విశ్వకళా పరిషత్ ప్రతినిధిగా వెళ్ళారు. 1987లో మదరాసు తెలుగు అకాడమి వారిచే “గురజాడ అప్పారావు మెమోరియల్ అవార్డు" అందుకున్నారు. 1989లో (మణిప్రవాళం) కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.
వీరు రష్యా, ఫ్రాన్సు, ఇంగ్లాండు, ఇటలీ, చెకోస్లోవేకియా, డెన్మార్కు, అమెరికా,
2<noinclude><references/></noinclude>
lo7le1u4jidfvyr4ci830fp8bppqsce
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/18
104
213444
557048
2026-05-26T05:55:33Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కెనడా, మలేషియా, సింగపూర్ లాంటి ఎన్నో దేశాలు పర్యటించారు. “వరల్డ్ యూయూనియర్సిటీ" అమెరికా వారు సాంస్కృతిక, సారస్వత రంగాల్లో జోగారావు గారు చేసిన గొప్ప కృషిని గుర్తించి వీరిన...'
557048
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>కెనడా, మలేషియా, సింగపూర్ లాంటి ఎన్నో దేశాలు పర్యటించారు. “వరల్డ్ యూయూనియర్సిటీ" అమెరికా వారు సాంస్కృతిక, సారస్వత రంగాల్లో జోగారావు గారు చేసిన గొప్ప కృషిని గుర్తించి వీరిని అత్యున్నత అవార్డు డి.లిట్ గౌరవ పట్టాతో ఘనంగా సత్కరించింది.
జోగారావుగారు తన ప్రతిభాపాటవాలతో అనేక వినూత్న సాహితీ సభలకు
రూపకల్పన చేసి ప్రముఖుల ప్రశంసల్ని అందుకున్నారు. ఇందిరామందిరం, ఇంద్రసభ,
చంద్రసభ, యమసభ, బ్రహ్మసభ, సరస్వతీ సామ్రాజ్యం, మన్మథ సామ్రాజ్యం,
శృంగార ధర్మాననం, ట్రైలోక్యవిజయం, కనకాభిషేకం, అష్టకష్టావధానం,
నవరస తరంగిణి, మొదలైన సభల్ని ఏర్పాటు చేసి సహృదయ ప్రేక్షకుల్ని రసమయ
జగత్తులో ఓలలాడించిన రసిక రాజశేఖరుడు రావుగారు. అంతేకాదు శ్రీకృష్ణ
దేవరాయలు, రఘునాథరాయలు, ఇంద్రుడు, మున్నగు పాత్రలు పోషిస్తూ సభను
రంజింపచేశారు జోగారావుగారు.
వీరికి ఎన్నో బిరుదులు, బహుమానాలు, పురస్కారాలు లభించాయి. వీరి
కవిత్వాన్ని మెచ్చుకొని విశ్వనాథ సత్యనారాయణగారు “మధుర సరస్వతి” అనే
బిరుదును ఇచ్చారు. 1974లో తణుకు పండిత పరిషత్తు వారు "మహాకవి" అనే
బిరుదును ఇచ్చారు. భీమవరం జాషువా సాహితీ సమితివారు “సాహితీ రత్నాకర”
బిరుదును ఇచ్చారు. వీరికి "అభినవ కృష్ణ రాయ”, “పరిశోధన పరమేశ్వర”, “తెలుగు
తానీషా" లాంటి బిరుదులున్నాయి.
22-5-1982 గుంటూరులో జరిగిన జోగారావు గారి "శృంగార సర్వజ్ఞ" కృతి
సమర్పణ సభలో రావుగారికి "శృంగార సర్వజ్ఞ” బిరుదు ఇచ్చారు. ఆ బిరుదు
పత్రంలో ఇలావుంది. “ప్రాచార్య శ్రీ యస్వీ జోగారావు మహోదయులకు "శృంగార
సర్వజ్ఞ" కావ్య సమర్పణ సభలో గుంటూరుమండల రచయితల సహకార సంఘం,
శ్రీ నాథ పీఠం, కవి పండిత పరిషత్తు, ప్రజాప్రతినిధుల సమక్షంలో వారి
నాన్యతోదర్శనీయము, అపూర్వము అసాధారణము అయిన కవితా ప్రతిభకు ఆశ్చర్య
చకితులు, ఆనందతుందిల హృదయులు అయిన సహృదయులు వారికి "శృంగార
సర్వజ్ఞ" బిరుదును సప్రశ్రయముగా సమర్పించుచున్నారు".
ఆంధ్రవిశ్వకళాపరిషత్లో సిండికేట్ సెనేట్ ఎకడమిక్ కౌన్సిలులో సభ్యుడుగా
పనిచేశారు. ప్రాచ్య విద్యాపరిషత్ అధ్యక్షుడుగా, తెలుగు బోర్డు ఆఫ్ స్టడీస్ అధ్యక్షుడుగా,
3<noinclude><references/></noinclude>
re6fqdsn4ei63dhaos60kdnqslc7vmx
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/19
104
213445
557049
2026-05-26T05:57:24Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పదవులు నిర్వహించారు. ఉస్మానియా, శ్రీవేంకటేశ్వర, బెనారసు, బెంగుళూరు, మొదలైన విశ్వవిద్యాలయాల్లో "తెలుగు బోర్డు ఆఫ్ స్టడీస్"లో సభ్యుడుగా బాధ్యతలు నిర్వహించారు. కాకతీయ, అన్నా...'
557049
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>పదవులు నిర్వహించారు. ఉస్మానియా, శ్రీవేంకటేశ్వర, బెనారసు, బెంగుళూరు,
మొదలైన విశ్వవిద్యాలయాల్లో "తెలుగు బోర్డు ఆఫ్ స్టడీస్"లో సభ్యుడుగా బాధ్యతలు
నిర్వహించారు. కాకతీయ, అన్నామలై, మద్రాసు, మైసూరు, ధార్వాడ, గుల్బర్గా,
మొదలైన విశ్వవిద్యాలయాల్లో ఎమ్, ఫిల్, పిహెచ్.డి పట్టా పరీక్షల కమిటీల్లో
సభ్యులుగా, అధ్యక్షులుగా వ్యవహరించారు. ఢిల్లీ, వారణాసి మొదలైన కేంద్ర
విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ నిర్ణయ విధాన సమితుల్లో సభ్యత్వం వహించారు.
భారతప్రభుత్వ విద్యా శాఖ, యు.జి.సి. సాహిత్య అకాడమి, ఆలహాబాదు,
జ్ఞానపీఠం మొదలైన వాటికి సలహా దారుడుగా పనిచేశారు. యు.పి.యస్.పి ఉ
ద్యోగ నిర్ణయ విధాన సమితిలో సభ్యత్వం వహించారు. ఆలిండియా ఓరియంటల్
రైటర్స్, ఫోక్ లోర్, ప్లేసేమ్సు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి మొదలైన సంస్థల్లో
సభ్యత్వం, వయోజన విద్య, ఎన్.పి.సి శిక్షణ శిబిరాల్లో సభత్వం వహించారు. గుంటూరు
జిల్లా రచయితల సహకార సంఘానికి వీరు వ్యవస్థాపకాధ్యక్షులుగా పనిచేశారు.
ఒక సంవత్సరకాలం గుంటూరు రోటరీ క్లబ్బుల్లో “డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్
సర్వీసు"లో సేవలందించారు. స్వయం కృషితో, నిరంతర నిర్విరామ సాధనతో,
ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ, తెలుగు సాహిత్య శిఖరాలను అధిరోహించిన ఘనత
జోగారావుగారిది 21 సెప్టెంబర్ 1992లో విశాఖపట్నంలో వీరు పరమపదించారు.
రచనలు :
I. కవిత్వం:
1. పంచకళ్యాణి (1958), 2. ఉపనిషత్తు (1961), 3. ప్రసన్న
కుసుమాయుధం (1973), 4. అడిగొప్పుల హోరు గాలి (1979), 5. శృంగార
సర్వజ్ఞం (1981), 6. శృంగార భృంగారువు (1987), 7. గంధర్వనగరం (1988)
II. ఊహాప్రహేళికలు :
1. అవతారం (1958), 2. మన్వంతరం (1958)
III. కథలు : సువర్ణ శృంఖల (కథా సంపుటి 1961)
1. సువర్ణశృంఖల, 2. విషాదాంతం, 3. ఉత్తిష్ఠన్తు భూతపిశాచా, 4.
రసాభాసం, 5. అసలు సంగతి, 6. డాక్టర్ సుదర్శనం, 7. సుబ్బారాయుడి షష్ఠి
కథా సంకలనంలో లేని కథలు- 3<noinclude><references/></noinclude>
hcfxi65sqlapk83dz141yoo897nfgiv
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/20
104
213446
557050
2026-05-26T05:58:51Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ' 1. మహాకవి శివయ్య గారి జీవిత చరిత్ర, 2. శభాష్ శేషయ్య కటకటా కాంతమ్మ, 3. ధ IV. నవల : మేరు శిఖరం (చోమోలుంగ్మా (1988) V. నాటకాలు (అ). అప్సరస (గేయనాటికలు-1961) 1. అప్పరస, 2. సమభాణం, 3. సాక్షాత్కారం, 4. అవిముక...'
557050
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>
1. మహాకవి శివయ్య గారి జీవిత చరిత్ర, 2. శభాష్ శేషయ్య కటకటా
కాంతమ్మ, 3. ధ
IV. నవల :
మేరు శిఖరం (చోమోలుంగ్మా (1988)
V. నాటకాలు
(అ). అప్సరస (గేయనాటికలు-1961)
1. అప్పరస, 2. సమభాణం, 3. సాక్షాత్కారం, 4. అవిముక్తం
(ఆ). మధుర మాధవం (వచనవాటికలు - 1963)
1. మధుర మాధవం, 2. పాచికలు, 3. దూతవాక్యం, 4. అఘాయిత్వం,
5. కథానాయకులు, 6. విచిత్రచిత్ర గుప్తం, 7. పాపారాయుడు, 8. మదనకామేశ్వరి,
9. చిత్రపతి
VI. పరిశోధన యక్షగాన వాఙ్మయచరిత్ర (1957)
VII. విమర్శ
1. సప్త తంతువు (1959), 2. సారస్వతనీరాజనం (1965), 3. మహాకవి మార్గం
(1965), 4. తెలుగు జీవుడు (1968), 5. అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు ఆంతర్యం
(1987), 6. కాదంబరీ స్వాదం (1988), 7. మణిప్రవాళం (1988), 8. శ్రీనాథ శ్రీ
(1989), 9. సాహిత్య భావలహరి (1989), 10. సాహిత్య వల్లి (1990), 11. ఆదిభట్ల
నారాయణ దాన సారస్వతా స్వాదం (1992)
జోగారావుగారు ఏడు కవితా సంపుటాలు, రెండు ఊహా ప్రహేళికలు, ఒక
కథా సంపుటి, ఒక నవల, పదమూడు వాటికలు, పదకొండు విమర్శ గ్రంథాలు,
ఒక పరిశోధన గ్రంథం రాశారు. రోటరీ చరిత్రను రాశారు. ఒక గ్రంథాన్ని అనువాదం
చేశారు. ఒక ఆంగ్ల గ్రంథాన్ని ప్రకటించారు. అనేక సాహిత్య ప్రక్రియలను చేపట్టి,
అందులో విజయం సాధించిన బహుముఖ ప్రజ్ఞావంతులు జోగారావు గారు. వీరి
రచనలన్నీ ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నవే. అనేక సమీక్షలు, లెక్కలేనన్ని
గ్రంథాలకు ముందుమాటలు రాశారు. ఎన్నో ఉత్తమ గ్రంథాల్ని పరిష్కరించారు.
మరెన్నో గ్రంథాలకు సంపాదకత్వం వహించారు.
ఇలా ఎన్నో గ్రంథాలు రాసి, తెలుగు సాహిత్యంలో మంచిపేరు ప్రఖ్యాతులు
5<noinclude><references/></noinclude>
dt7zjxrbhn6xzpwhzfrt0bbz8sqztb4
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/21
104
213447
557051
2026-05-26T06:02:41Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సంపాదించారు జోగారావు గారు. వీరి రచనలన్నీ ప్రామాణికమైనవే. వీరి రచనా శైలి మధురాతి మధురమైంది. వీరి వచనం కమనీయమైన కవిత్వంలావుంటుంది. సంప్రదాయ కవిత్వంలోనూ, ఆధునిక కవిత్వంలోనూ...'
557051
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>సంపాదించారు జోగారావు గారు. వీరి రచనలన్నీ ప్రామాణికమైనవే. వీరి రచనా శైలి మధురాతి మధురమైంది. వీరి వచనం కమనీయమైన కవిత్వంలావుంటుంది. సంప్రదాయ కవిత్వంలోనూ, ఆధునిక కవిత్వంలోనూ, రెండింటిలోనూ వీరు అందెవేసిన చేయి.
వీరి ఆలోచన విలక్షణమైంది. భావప్రకటన అంతకంటే విశిష్టమైంది. తాను
చెప్పదలచుకున్నది నిర్భయంగా చెప్పడం వారి ప్రత్యేకత. రావుగారి సాహితీ సేవ అపూర్వం. అందుకే సాహిత్యలోకంలో జోగారావుగారు “సాహితీబంధు"గా సహృదయ పాఠకుల హృదయాల్లో స్థిర స్థాయిగా నిలిచిపోయారు.
"ప్రాచీన మార్గములు గౌరవించుచు క్రొత్తbత్రోవలకు మోజువడుట పిన్న నాటినుండి జోగారావు తత్త్వము. అనుకరణముల నభిలషింపడు. ఉపజ్ఞకు
బలాటపడును. రచనము నూతనము. బాణీ కొత్తది"
- దువ్వూరి వేంకటరమణ శాస్త్రి<noinclude><references/></noinclude>
98ykydxprlb84n9v3fqcspr5att9aon
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/22
104
213448
557052
2026-05-26T06:04:25Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'II. కవిత్వం - పరిశీలన "ఎవరు ఏమనుకున్నా నాకు పరవాలేదు. వా మార్గంనాది. అదే శృంగార రసరాజమార్గం. ఆశృంగారమే నా కవిత్వానికి సహృదయ నైవేద్యం". - యస్వీ జోగారావు జోగారావుగారు 1) పంచ కళ్యా...'
557052
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>II. కవిత్వం - పరిశీలన
"ఎవరు ఏమనుకున్నా నాకు పరవాలేదు. వా
మార్గంనాది. అదే శృంగార రసరాజమార్గం. ఆశృంగారమే నా
కవిత్వానికి సహృదయ నైవేద్యం".
- యస్వీ జోగారావు
జోగారావుగారు 1) పంచ కళ్యాణి (1958), 2) ఉపనిషత్తు (1961), 3) ప్రసన్న కుసుమాయుధం (1973), 4) అడిగొప్పుల హెూరుగాలి (1979), 5) శృంగార సర్వజ్ఞం (1981), 6) శృంగార భృంగారువు (1987), 7) గంధర్వ నగరం (1988) అనే ఏడు కవితా సంపుటాల్ని వీరు రాశారు.
1. పంచకళ్యాణి:
"శ్రీ డాక్టరు యస్వీ జోగారావుగారు రంచించిన "పంచ
కళ్యాణి" అన్న కావ్య సంపుటిని చూచితిని, గ్రంథకర్త గారు ఆంధ్ర
విశ్వవిద్యాలయములో బండితులు, పరిశోధన చేసినవారు. మంచి
భావుకులు. వీరి కలము పూర్వాధునికములయిన రెండు సంప్రదాయ
మార్గములలోను నిరాఘాటముగ నడచినది. వీరి కవితా శక్తి
ప్రశంసనీయముగ నున్నది. ఎక్కువ భాగము వీరి అభిరుచి
ఆధునిక కవుల మార్గమునందె యున్నట్లు తోచును. కాని పద్య
రచన పూర్వకవి మార్గమునందు మేలిమి తెలిసినవానిదిగాని
యితరముకాదు. మరియు నీవాడు ప్రసిద్ధులయిన కొందఱు కవుల
రచనలయందు వీరికిఁగల యభిమానము వీరి కొన్ని పద్యచరణ
పద్య రచనలయందు కనిపించుచున్నది. వీరు విమర్శకులు,
పరిశోధకులేగాక చక్కని కవులు కూడ నగుట ప్రశంసనీయము.
వీరికి బరమేశ్వరుఁడు ఇతోధిక రచనయందవకాశములు కలిగించి
యాంధ్ర సరస్వతీవికాసము కలిగించుగాతమని ప్రార్ధించుచున్నాను.”
- విశ్వనాథ సత్యనారాయణ<noinclude><references/></noinclude>
qna9sp648m1omlg13pa3cfxm16x4al4
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/23
104
213449
557053
2026-05-26T06:06:09Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ' “పంచకళ్యాణి” గ్రంథం 1958లో వెలువడింది. ఇది ఖండకావ్య సంపుటి. “ముందు మాట" బిరుదు రాజు రామరాజు గారు రాశారు. భారతి, ఆంధ్రపత్రిక ఉగాది సంచిక, తెలుగు, స్వతంత్ర, సమీక్ష మొదలైన పత్రికల...'
557053
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>
“పంచకళ్యాణి” గ్రంథం 1958లో వెలువడింది. ఇది ఖండకావ్య సంపుటి.
“ముందు మాట" బిరుదు రాజు రామరాజు గారు రాశారు. భారతి, ఆంధ్రపత్రిక ఉగాది సంచిక, తెలుగు, స్వతంత్ర, సమీక్ష మొదలైన పత్రికల్లో ఈ కవితలు వెలువడ్డాయి.
జోగారావుగారి రచనల్లో శృంగార రసం ఎక్కువుగా చోటు చేసుకుంది. ఆయన
రస ప్రపూర్ణుడు, రసరాజు. ఆంధ్ర రచయితల సంఘం, హైదరాబాదు వారు దీన్ని
ప్రచురించారు.
కవికైవారం, కావ్య సూక్తం, పొలిమేరలు, వసంతశ్రుతి, ఊహాకలాపం, రమణీ
దూతిక, మధుర లాలస, మనసులోని మాధవితో, ఉపశ్రుతి, కాంక్ష, సహవాసం,
ధ్రువతార, ముత్తైదువ, నవోఢ, పరామర్శ, దృష్టి భేదం, సమన్వయం, తత్వమని,
శారదరాత్రి, శుభలేఖ, అక్షత, బొమ్మరిల్లు, బాలారిష్ట, బహువ్రీహి, దీపావళి, స్వగతం,
తృప్తి, సినీవాలి, ఆరిందా, సువర్ణ శృంఖల, అనుభవశాలి, ఎందరో మహాను భావులు,
చక్షుశ్శావాలు, నష్టజాతకాలు, గడియారాలు, ధర్మ సందేహం, పరమపద సోపాన
పటం, హెూయాంగు హెూ, నిజం, కాళ రాత్రి, ప్రాయోపవేశము, మరణ వాబ్మూలం,
ప్రళయలయ సిద్ధిర్భవతు మేసదా, ఫలశ్రుతి, పంచకళ్యాణి మొదలైన శీర్షికలు
ఇందులో వున్నాయి.
ఇందులోని కవిత్వం పంచకళ్యాణి వలె అనేక విధాలైన ఛందస్సులతో,
భావశిల్ప సమ్మేళనంగా నడిచింది. ఈ సంపుటిని బొప్పరాజు రామకృష్ణం రాజుగారికి
అంకితం ఇచ్చారు. కృతి సమర్పణోత్సవం, హైదరాబాద్ "శ్రీకృష్ణ రాయాంధ్ర భాషా
నిలయం"లో 1958 అక్టోబర్లో జరిగింది. సభాధ్యక్షులుగా ఖండవల్లి లక్ష్మీ రంజనం
వ్యవహరించారు. ఈ సభలో అతిరథ మహారథులు విశ్వనాథ సత్యనారాయణ,
మాడపాటి హనుమంతరావు, తాపీ ధర్మారావు, దివాకర్ల వెంకటావధాని,
కాళోజీ నారాయణ రావు, సి. నారాయణరెడ్డి, దాశరధి మొదలైన వారు పాల్గొన్నారు.
ఇందులోని కవిత్వాన్ని విశ్వనాథ సత్యనారాయణ, కాళోజీ నారాయణ రావు,
దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, గంటిజోగి సోమయాజి, కె.వి.ఆర్. నరసింహం,
ఖండవల్లి లక్ష్మీ రంజనం, పి.వి. రాజమన్నారు, మల్లంపల్లి సోమశేఖర శర్మ మొదలైన
వారు ప్రశంసించారు.
గ్రంథప్రారంభంలో "కవి కైవారం" ఖండికలో నన్నయ తిక్కన మొదలైన
పూర్వ కవులవే కాక నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం, ఆధునిక
8<noinclude><references/></noinclude>
hwc531h92ccc9spe577xfbeggkyqaoq
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/24
104
213450
557069
2026-05-26T09:38:29Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తెలుగు సాహిత్య యుగ కర్త గురజాడ అప్పారావు మొదలైన వారిని గూర్చి కూడా తలచుకున్నారు రావుగారు. తర్వాత "అస్తవ్యస్త వర్తమాన కాలవ్యవస్థలో ఆశలు పరికిస్తూ పరిక్రమిస్తూ కవితా చరిత...'
557069
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>తెలుగు సాహిత్య యుగ కర్త గురజాడ అప్పారావు మొదలైన వారిని గూర్చి కూడా తలచుకున్నారు రావుగారు. తర్వాత
"అస్తవ్యస్త వర్తమాన కాలవ్యవస్థలో
ఆశలు పరికిస్తూ పరిక్రమిస్తూ
కవితా చరిత్రలో
కడచిన కాలం
కాదని వాదిస్తూ
నివేదిస్తా
భావికాల భవ్యకవితా
వ
పునఃప్రావిర్భూతికి
పురోహితులైన మహితాత్ములందరికీ
నా నమస్సుమనస్సులు
తరతరాల దేశ దేశ
సారస్వత సత్య వ్రతు
లెందరో మహానుభావు
లందరికీ వందనములు"
వర్తమాన కాలంలోని కవితా వ్యవస్థ అస్త వ్యప్తంగా వుందని ఆవేదన చెందారు.
కవితా చరిత్ర చాలా గొప్పదని కొనియాడారు. త్వరలో మంచి కవిత్వం వస్తుందని
తెలియజేశారు రావుగారు. ఈ కవితలో మంచి కవితకు ఎల్లలు వుండవని చెప్పారు.
ఇదే ఖండిలో జోగారావు గారు ప్రతిభను గూర్చి ఇలా అన్నారు.
"ప్రతిభ యన్నది నిత్య మాత్నము
ప్రతిభ కవితకు ప్రాణ సారము
ప్రతిభ ప్రకటితమైన చోటను
త క్రొత్తలు లేవు కవితకు
క్రాంతదర్శనమున్న చోటను<noinclude><references/></noinclude>
olfi6h0v7va0l8v28lpozc0mucskhk8
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/25
104
213451
557070
2026-05-26T09:40:05Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కావ్య గతులకు లేవు ఎల్లలు దృష్టి దోషము లేనిచోటను కాలదోషము లేదు కవితకు" ప్రతిభ వుంటే, కవితకు కాలదోషం లేదని వున్నది వున్నట్లు చెప్పిన ప్రతిభా వంతుడు రావుగారు. జోగారావు గారు...'
557070
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>కావ్య గతులకు లేవు ఎల్లలు
దృష్టి దోషము లేనిచోటను
కాలదోషము లేదు కవితకు"
ప్రతిభ వుంటే, కవితకు కాలదోషం లేదని వున్నది వున్నట్లు చెప్పిన ప్రతిభా
వంతుడు రావుగారు.
జోగారావు గారు కవిత్వానికి ఇచ్చిన విలువలను మనం “కావ్యసూక్తం”
ఖండికలో చూడవచ్చు.
“సర్వ సారస్వతము నభిరుచి
సాక్షికమ్మది భావగమ్యము
భావ మన్నది వ్యక్తినిష్ఠము
- వ్యక్తి వ్యక్తికి వాసి గలదది
సార్వకాలికమైన సత్యము
కాన వావా కావ్య చర్చల
వలదు వలదతివాద శౌర్యము
కావ్యమది యధికార గమ్యము
మనిషి మనిషికి తార తమ్యము
కలదు కావున కాదు కావ్యము
సర్వజనులకు సంతవస్తువు"
ఇదే ఖండికలో సాహిత్య జగత్తులో సహృదయతలోని రహస్యాన్ని జోగారావు
గారు గుర్తించిన తీరు నిరూపమానం.
"ప్రగతి శీలము నతివిశాలము
నగు చరాచర జగతి లోపల
కావ్యగతి మార్గము లనేకము
మము ఖజన మగమముల సర్వము
సహృదయ మందలి రహస్యము
సర్వ సత్పథ సామరస్యము"
కవితా జగత్తులో ఆవేశానికి ఆలోచనలకు గల స్థానాన్ని నిర్దేశిస్తూ
జోగారావుగారు చెప్పిన మాటలు ఎంత సున్నితమైనవో, సుదూరాలోచ వా<noinclude><references/></noinclude>
r7aqb2m8vf0jvzibkn4htdflmxo5t0y
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/172
104
213452
557072
2026-05-26T09:44:44Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557072
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|166|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>గుచున్నది. సమస్త మగువ్రతములయందును పూజ సాయంకాలమే యారంభింపఁబడును.
తాంత్రికయజ్ఞముల యారంభంబును సాయంకాలమే జరుగును. దీనింబట్టి కర్మారంభంబునకు సాయంకాలమే యుక్తమని తెలియుచున్నది.
కర్మారంభనిర్ణయము కాలస్వభావమునుబట్టి చేయఁబడును. ఉదయకాలమునందును సాయంకాలమునందును, సూర్యునకు, పురుషునకును గలయంతరాళము సమానమైనను, ఉత్పత్తియమును, నుపసంహారమునందును గలగుణభేదమును బట్టి సాయంకాలమె ముఖ్యమని నిశ్చయింపఁబడును.
ప్రాతఃకాలమున నుపస్థానము చెప్పుటకును, సాయంకాలమున సంధ్య నారంభించుటకును నొక్కటే కాలము. అనగా, ప్రాతసంధ్యయందు నుపస్థానసమయమున సూర్యునకు పురుషునకు నెంతయంతరాళ ముండునో సాయంసంధ్యయుపక్రమ సమయమునందు నంతయె యంతరాళ ముండును.
దీనింబట్టి ప్రాతఃకాలమున సూర్యు: డెంతదూరమున నుండి పురుషునకు దోషమును గలిగింప నారంభించునో సాయంకాలమున నంతదూరముననుండియె పురుషునకు గుణమును పెనుపనారంభించునని పెద్దలయభిప్రాయము.
కావున నెవ్వఁడైన నేదొకక్రొత్తపని నారంభింపఁ బూనునెడ నద్దానిని గుణ మభివృద్ధి నొందుకాలముననె యారంభించుట యుక్తము.<noinclude><references/></noinclude>
lies2in4jqqu6n90yfvwvzkp44gnpww
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/173
104
213453
557074
2026-05-26T09:52:16Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557074
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|167}}</noinclude>సాయంకాలమున నక్షత్రములు కనఁబడుచుండఁగను, వానికాంతి హెచ్చుచుండఁగను సంధ్యావందనముయొక్క సమాప్తి ముఖ్యము. ప్రాతఃకాలమున నక్షత్రములకాంతి బాగుగా నుండ నారంభము ముఖ్యము. సాయంకాలమున సూర్యునివలె ప్రాతఃకాలమున తారకలును, ప్రాతఃకాలమున తారకలవలె సాయంకాలమున సూర్యుండును గ్రహింపఁబడియె.
అట్లు, ప్రాతఃకాలమున సూర్యుని గాంచినక్షణమందే యింద్రియములు తమతమపనులయందు స్వభావముననే ప్రవర్తించుచున్నవి. మనసు నాకర్షించుచున్నవి. అద్దానికి వ్యాకులతను గలిగించుచున్నవి.
సాయంకాలమునందు సూర్యకిరణములు కనఁబడనందున విషయములనుండి మరలి విశ్రమించుచున్నవి.
అసహాయములై యప్పుడు మనసునకు వైకాగ్ర్యమును గలిగించుచున్నవి.
మనస్సు ఉషః కాలమున నిద్రవిడిచి యింద్రియములకు వశపడక నిశ్చలమై యేకాగ్రమై యెటులుండునో సాయంకాలంబుసను నటులే యుండును.
మఱియు, ప్రాతఃకాలమునందు సూర్యాలోకసాహచర్యమువలన విషయములమీదికిఁబోవు మనస్సుయొక్క చాంచల్యము కర్మారంభముచే నివర్తింపఁబడుచున్నది. సాయంకాలముననైననో సూర్యాలోకసాహచర్యములేమిచే నింద్రియవిషయ సాంగత్యములేక మనస్సు అంత చంచలమై యుండనేరదు.<noinclude><references/></noinclude>
bokui694jzy8hexgxt3317anehp96sw
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/174
104
213454
557075
2026-05-26T10:01:37Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557075
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|168|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>ఇట్లు, సాయంకాలమున నింద్రియవృత్తులు క్షీణించు చుండుటచే మనస్సు వానినుండి మరలి చాంచల్యమును విడువగనె దాని నొకకర్మమునందుఁ బ్రవేశపెట్టునెడ నాకర్మముయొక్క వాసనతో సుప్తి నొంది మేల్కాంచినను తిరుగ నాకర్మమునే ధ్యానించుచుండును. ఆకార్యమునే చేయుచుండును.
ఈకారణమువలన సత్కర్మమును సాయంకాలమున నుపక్రమించుటె న్యాయ్యము.
మఱియు, ప్రతిదినము సాధింపఁబడు త్రివర్గమునకు సాయంకాలము ఉపసంహారకాల మగుచున్నది. అప్పు డేభావముతో మనస్సు నుపసంహరించుచున్నాఁడో జన్మాంతరన్యాయముచే తిరుగ నాభావమే మనస్సునఁ దలంపఁబడుచుండును.
ఇట్టికారణములవలన గర్మముల నాకాలమునం దారంభింపవలయునని నియమింపఁబడియె.
ఇఁక, ప్రాతఃకాలమున కర్మ మారంభించునెడ నడుమ సంభావితము లగులౌకికవ్యవహారములతో సముద్రతుల్య మగు పగటిచే చిత్తైకాగ్ర్యము చెడుననియు, దానంజేసియాకర్మము మనస్సున పట్టనేరదనియు
నాలోచించి యిట్లు విధించిరి.
ఇట్లు, సాయంకాలమున కర్మ మారంభించునెడ నాకర్మము మనస్సునందు లగ్నమగును. దానింబట్టి కర్మమునందు శ్రద్ధ వృద్ధి నొందును. రాత్రియందు స్వభావసిద్ధ మగునింద్రియప్రవృత్తి పగటియందుఁబోలె నుండదు. కావున నప్పుడు<noinclude><references/></noinclude>
binocekobq3599fciik7ofw4bzcd2ee
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/26
104
213455
557076
2026-05-26T10:05:09Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సన్నిహితమైనవో, మనం గమనించవచ్చు. "సిద్ధిర్భవతు మే సదా" ఖండికలో- "ఆవేశ నిరంతర భావ పరంపరలో అవలు పునికి పోవచ్చును ఆలోచనా సులోచనాలతో మనోనయనామయము శ్రమిస్తుంది. ఆ వాడాది కవి భావయి...'
557076
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>సన్నిహితమైనవో, మనం గమనించవచ్చు. "సిద్ధిర్భవతు మే సదా" ఖండికలో-
"ఆవేశ నిరంతర
భావ పరంపరలో
అవలు పునికి పోవచ్చును
ఆలోచనా సులోచనాలతో
మనోనయనామయము
శ్రమిస్తుంది.
ఆ వాడాది కవి భావయిత్రి
ఆకస్మాత్తుగా
కావ్యవాణి కలగానమై
రసనిషాద స్వరమందుకుంది.
శోకము శ్లోకమైనది మొదట
కాని రామాయణ కావ్య రచన
నసమాధికమై సాగినదే
ఆలోచన
నవనీతము
కవియంత స్పారభూత
మావేశము
విద్యుల్లత
హృద్యుక పద్విక స్వరత
ఆవేశము
భావుకాత్మకూపులాట
ఆలోచన జోలపాట
ఊపుట వాపుటతో
ఊగుట యాగదుగా
అది కావ్యపఠన కడపట
మిగిలే రసధ్యాస
పాట మధ్యమగత పట్టు<noinclude><references/>
11</noinclude>
mezyefud3faykmd5w2smp0lxn2u07co
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/27
104
213456
557077
2026-05-26T10:07:02Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నదియే రససిద్ధి కదా! సిద్ధిర్భవతు మే సదా!" సాహిత్యాన్ని గూర్చి జోగారావు గారు ఎంతో విశాలమైన భావనను ప్రకటించారు. "పొలిమేరలు" అనే ఖండికలో "దిగిరాను దిగిరాను దివినుండి భువికనకు...'
557077
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>నదియే రససిద్ధి కదా!
సిద్ధిర్భవతు మే సదా!"
సాహిత్యాన్ని గూర్చి జోగారావు గారు ఎంతో విశాలమైన భావనను ప్రకటించారు.
"పొలిమేరలు" అనే ఖండికలో
"దిగిరాను దిగిరాను దివినుండి భువికనకు
ఎగురులే నెగురలేన్ భువినుండి దివికనకు
దీవిభువుల నడుమ నొక దీపమున్నదిలే
కవితలోవాదీపకాంతి యున్నదిలే
అని అనడంలో ఇమేజినేషన్ అనేది ఫేన్సీ అండ్ ఫేంటసీల స్థాయిల దాక
సాగకూడదనీ, వాస్తవికత అనేది ఫోటో గ్రాఫిక్ రియాలిటీకి దిగజారకూడదని
జోగారావుగారి అభిప్రాయం.
"ఆదర్శమే దీప మాదీప మందదని
దాదాపు వెలుగులను దర్శించలే ననకు
దౌ దవ్వులను కొరవిదయ్యములను నమ్ముకొని
నీదారిలో నిరుల వేమరచి వేమరచిపోకోయి".
అని అనడంలో ఐడియలిజమే పరమధ్యేయమని, అయితే అది ఒక వేళ
అందుబాటులోకి రాకపోతే వాస్తవికతను విస్మరించరాదని జోగారావుగారి అభిప్రాయం.
“దివినుండి ఎగరకిక భువినుండి మరిదిగకు
అతిమానుషము వలదు వలద మానుషమున్
మర్యాదగానుంటే మానవత్వమే చాలు
మానవుని గుర్తిస్తె మనకవిత్వమే మేలు".
అని అనడంలో మనిషిని మనిషిగా నిలబెట్టవలసిన ఆవశ్యకం ఆధునిక
కవితకు కలదని జోగారావుగారు తెలియజేశారు.
జోగారావుగారు కావ్య వస్తువును గూర్చి చెబుతూ అటు భావుకత, ఇటు
అభ్యుదయకవితల కులగురువులు కృష్ణ శాస్త్రి, శ్రీశ్రీ మతంలో నాయికాస్థానం
ఆక్రమింప వలసిన వారు ప్రియురాలు, పేదరాలు, ఒక్కొక్కరిది ఒక్కొక్కదృష్టి, భావకవి దృష్టివేరు. అభ్యుదయ కవి దృష్టివేరు. తాజమహాల్ నిర్మాణ విషయంలో<noinclude><references/></noinclude>
s5lcq2uo5u7xj5bealtxj6qfaxnhha4
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/28
104
213457
557078
2026-05-26T10:08:45Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయంగా సమాజంలో వుంది. ఒకడు శిల్ప మనమను ప్రశంసిస్తాడు. మరొకరు ప్రేమమహిమను ప్రస్తుతిస్తాడు. ఇంకొకడు రాళ్ళెత్తిన కూలీల శ్రమను గూర్చి పరితపిస్తా...'
557078
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయంగా సమాజంలో వుంది. ఒకడు శిల్ప మనమను
ప్రశంసిస్తాడు. మరొకరు ప్రేమమహిమను ప్రస్తుతిస్తాడు. ఇంకొకడు రాళ్ళెత్తిన కూలీల
శ్రమను గూర్చి పరితపిస్తాడు.
"ఒక్కొక్కరి గురి యొక్కటి
గురి యన్నది గుణ గ్రహణవణ సాధ్యము
కావ్యమునకు వస్తువు కాదానందము పరమార్ధము
సందేశము పదాశయము
ఇది సమయము సమన్వయము”
అని జోగారావుగారి అభిప్రాయం. కావ్యంలో వస్తువు ఏదైనా సరే,
సందేశమున్ననూ, లేకున్ననూ, సరే అసలు వుండవలసింది ప్రధానమైంది. "ఈస్తటిక్
వేల్యూ" అని జోగారావుగారు అన్నారు. "పంచకళ్యాణి" కావ్యంలో కవిత్వానికి
సంబంధించిన ఇలాంటి అనేక మంచి అంశాలు చోటుచేసుకున్నాయి.
రావుగారు కవితా ధోరణుల్లోనే కాక వస్తువు, ఛందస్సు, భాష, భావంలో
కూడా ఎంతో వైవిధ్యాన్ని చూపించారు. ప్రాచీన పద్య ఛందస్సులు చంపకమాల, ఉత్పలమాల, శార్ధూలం, మత్తేభం, తేటగీతి, ఆటవెలది, సీసం, కందపద్యాలే కాక
మధ్యాక్కర, మధుర్కారాలను కూడా జోగారావుగారు వాడారు. గేయ ఛందస్సుకూడా
ఈ గ్రంథంలో చోటుచేసుకుంది. వచన కవితా రచన కూడా కడు రమణీయంగా
వుంది. రావుగారు ఏ ఛందస్సులో రాసినా, రమణీయంగానే వుంటుంది. ఆయన
ప్రజ్ఞ అలాంటిది. సహృదయ పాఠకుల హృదయాన్ని కదిలిస్తుంది ఆయన కవిత్వం.
సుదీర్ఘ సమానబంధురమైన ప్రబంధమార్గం రావుగారిది. అలాగని ఆయన కవిత్వం
అంతా అలావుండదు. తెలుగు పలుకుబడులతో అలరారుతుంది. అన్యదేశ్యాలను
ఆమోదించిన ఆధునిక శిష్ట వ్యావహారికుడు జోగారావుగారు. ప్రాచీన మైనా,
ఆధునికమైనా, రెండింటిలో కడు సమర్థులు రావుగారు. వస్తువులో, భావంలో,
ఎంతో వైవిధ్యం కన్పిస్తుంది.
"ఈకృతి కవిత్వమును గూర్చి, జీవితమును గూర్చి
కవిగారికి గల సువిశాల సుకుమార మరుచిర కర్కశ
దృక్పథమునే గాక స్తిమితపడని చిత్త వృత్తిని, స్థిర ప్రకృతివైపును<noinclude><references/>
13</noinclude>
o5pd6twyhodorqs2fe61bljci4trpx6
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/175
104
213458
557079
2026-05-26T10:08:58Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557079
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|169}}</noinclude>మనస్సు నెందైనఁ బ్రవేశపెట్టుటకు శక్యమగును.
ఇట్లు, ఫఫలము, సఫలతమము నగుసాయంకాలికసూర్యోపాసనమునందు పారమేశ్వరప్రపత్తి న్యాయ్యమైనది.
రాత్రికాలమున నిద్రాదులయం దింద్రియములకు విపరీతప్రవర్తన కలుగ కుండుటకై పరమేశ్వరోపాసనము విధింపఁబడియెను. అందు కుశోదకప్రోక్షణము త్వగింద్రియాది సంశుద్ధికిని, అర్ఘ్యప్రదానము శరీరమునకు మధ్యాహ్నముమొదలుకొని సంభవించినవిపరీతౌష్ణ్యము నివర్తించుద్వారా బుద్ధి శక్తి వృద్ధినొందుటకును నుపయోగించును. తక్కునంశము పూర్వముంబలె నూహించుకొనునది.
{{c|ఇది}}
{{c|సాయంకాలప్రకరణము.}}
{{rule|2cm}}
{{c|పూర్వనిశాప్రకరణము.}}
ఇపుడు పూర్వనిశాప్రకరణము ప్రకృతము. ఈకాలమున కర్మము లధికముగా విధింపఁబడియుండలేదు. అయినను నప్పటికర్మములయావశ్యకత్వమును నిరూపింపవలసియు<noinclude><references/></noinclude>
j7jvf01npad1zi0dapj0k1teak86rkj
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/29
104
213459
557080
2026-05-26T10:10:03Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అర్రులు చాచు ఆశయశీలమును వ్యక్తము చేయుచున్నది. ఈయనకు ప్రాచీన, నవీన భేదభావనయే లేనట్లును, మంచి యన్నది యించుక ఎక్కడున్నను ఉపాధేయమననట్లును తోచును. ఈయనకు ప్రాచీన సంప్రదాయ ప్రవ...'
557080
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>అర్రులు చాచు ఆశయశీలమును వ్యక్తము చేయుచున్నది.
ఈయనకు ప్రాచీన, నవీన భేదభావనయే లేనట్లును, మంచి
యన్నది యించుక ఎక్కడున్నను ఉపాధేయమననట్లును
తోచును. ఈయనకు ప్రాచీన సంప్రదాయ ప్రవణత్వ
మెంతులలో నవీన ప్రమాణ వరసత్వ మంతకలదు. రచనా
రాయణీయకము, భావ బంధురత, ఛందస్సౌందర్యము ఒక
దానిని మించి మరియొకటి, ఒక దానిని బలిగొనకుండ
మరియొకటి పొత్తు కుదిరిపొందు పొసగి అలరారుచుండును.
తనదైన ఒక సారవంతమైన శైలి, జటిలత లేని ప్రౌఢితో,
ఆపేలవమైన లాలిత్యముతో సర్వత్ర జాలువారుచున్నది.
పలు సరిక్రొత్త పదబంధములు, ప్రౌఢ ప్రయోగములును
గ్రంథము నందంతటను చోటు చేసికొన్నవి" అని డాక్టర్
తటవర్తి రాజగోపబాలం గారు తెలియజేశారు.
"ప్రస్తుత పంచకళ్యాణి పరుగులుతీసిన విధానం చూస్తే
“నవారు” గట్టివాడనే తోస్తుంది. ఆ సవారు యస్వీజోగారావు
ఉరప్ యశస్వి జోగారావు.
అందమైన అనుభవాల బాట
యశస్వి జోగారావు పాట
చక్కని సమన్వయవాది మన జోగారావు
ఆదిమానవుని అవతారముతో ప్రారంభమైన మానవుడు
అందుకొన్న స్థాయిని చూపిస్తూ, అందుకోవలసిన స్థాయిని
సూచిస్తూ, మన్వంతరంతో ముగిసిన యీ పంచకళ్యాణి
పరుగుల్లో మొదటిది, తుదిది రెండును సరిక్రొత్త సాహిత్య
ప్రక్రియా ప్రయోగములు, ఊహా ప్రహేళికలో ఆకాశమును
తనలో ఇమిడించుకొనుటకు ఆలోచన చేసిన ప్రయత్నం.
కనబడుతుంది".
-
కాళోజీ నారాయణ రావు<noinclude><references/></noinclude>
oz29275kzrg5ra2sxdpaf70cn107y3h
ఇచ్చోటనే పద్యం
0
213460
557083
2026-05-26T10:13:54Z
రవిచంద్ర
146
నాటక పద్యం
557083
wikitext
text/x-wiki
సత్యహరిశ్చంద్ర పద్యనాటకంలో ప్రజాదరణ పొందిన, గుర్రం జాషువా రాసిన కాటి సీను పద్యం
<poem>
ఈ భూమిని ఏమని వర్ణింతును
ఎంతని వర్ణింతును
ఎందరెందరో మహానుభావులు ఈ భూమిలోనే
ఇచ్చోట నేసత్కవీంద్రుని కమ్మని
కలము, నిప్పులలోనఁ గఱఁగిపోయె
యిచ్చోట నేభూములేలు రాజన్యుని
యధికారముద్రిక లంతరించె
యిచ్చోటనే లేఁత యిల్లాలి నల్లపూ
సలసౌరు గంగలోఁ గలసిపోయె
యిచ్చోట నెట్టిపే రెన్నికం గనుఁగొన్న
చిత్రలేఖకుని కుంచియె నశించె
ఇది పిశాచులతో నిటలేక్షణుండు
గజ్జె గదలించి యాడు రంగస్థలంబు
ఇది సరణదూత తీక్ష్ణమౌ దృష్టు లొలయ
నవనిఁ బాలించు భస్మసింహాసనంబు
</poem>
12e6b3rgzpgeprea0fjki4ozs0rey9e
ఎన్నో ఏండ్లు గతించిపోయినవి
0
213461
557084
2026-05-26T10:17:03Z
రవిచంద్ర
146
పద్య నాటకాలు
557084
wikitext
text/x-wiki
<poem>
ఇది ఒక విచిత్రమైన ప్రకృతి, విచిత్రమైన ప్రకృతి,
ఎన్నో యేండ్లు గతించి పోయినవి - 2
కానీ
యీ శ్మశానస్ధలిన్ గన్నుల్ మోడ్చిన, మందభాగ్యుడు
ఒకఁడు ఒక్కడు ఒక్కడు అయినను లేచిరాడు,
అయ్యో!
యెన్నాళ్ళీ చలనంబు లేని, శయనంబు
ఏతల్లులు అల్లాడిరో ఏ తల్లులు అల్లాడి అల్లాడి అల్లాడిరో
కన్నీటంబడి, క్రాగిపోయినవి - 2
నిక్కంబిందు పాషాణముల్
</poem>
pospvtxb94qav066hkjy4gt0jpsxiax
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/176
104
213462
557085
2026-05-26T10:17:18Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557085
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|170|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>న్నది. ఇందు మొదట నీకాలముయొక్క స్వరూపము నిరూపింపఁబడును.
పగటియందుంబలె నైదువిధములవిభాగము రాత్రియందులేదు. ఇఁక నెట్లనిన, రాత్రికి నాదియగునర్థయామమునకు ప్రదోష మనియు, చివరదగునర్థయామమునకు ప్రత్యూషమనియు సంజ్ఞవిధించి మిగిలినయామత్రయమును రాత్రియని వ్యవహరించుచున్నారు. ఇందు ప్రదోషముతోగూడ, జామున్నరసేపుకాలమునకు పూర్వరాత్ర మనిపేరు. ఆకాలమునందే కర్మములు చేయవలయు.
అపుడు సూర్యకిరణములకాంతి లేదు. సూర్యుని తేజము లేకున్న జఠరాగ్ని యాహారమును జీర్ణము చేయఁజాలదు. దానంజేసి యింద్రియశక్తులును తగ్గిపోవుచుండును. కావున నప్పుడు జనులు
పగటియందుంబలె కృత్యములను చేయం జాలరు.
శరీరమున నుష్ణబల ముండువరకు నింద్రియములు విషయములమీదికిఁ బోవుచుండును. కావున నాయింద్రియములను సంస్కరించుపనియందు వానినిఁ బ్రశేశపెట్టుట కర్మమని పండితులయభిప్రాయము. రాత్రికాలమున ముందటికాలముకంటె తర్వాతికాలము శీతబాహుళ్యముగలది.
కావున క్రమముగ జాడ్య మభివృద్ధి నొందుచుండును. కావున ముందుముందే కర్మము చేయవలయు. అపుడు నియ<noinclude><references/></noinclude>
0d7nmmrbec6qsoztj3b91e0iefp4gi2
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/177
104
213463
557086
2026-05-26T10:25:38Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557086
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|171}}</noinclude>తములగు నగ్ని హోత్రము, ఈశ్వరారాధనము, వైశ్వదేవము అభ్యవహారము ననువానిఫలము వెనుక చెప్పఁబడినదే యగు.
ప్రాతఃకాలమున సూర్యకిరణములసంపర్కము గలిగిన క్షణము మొదలుకొని యౌష్ణ్య మభివృద్ధియగుటంబట్టి రాత్రి శీతకాలమని యనుభవమువలనఁ దెలియుచున్నది.
తృప్తిగా భుజించుయోగ్యత మధ్యాహ్నముననేగాని రాత్రికాలమున లేదు. ఉదయమునుండి క్రమముగా నభివృద్ధి నొంది మధ్యాహ్నమున భుజించినపదార్థములు జీర్ణింపఁజేయుచు క్రమముగ తగ్గియుండినయుష్ణము సాయంకాలమునఁ జేయఁబడు నగ్న్యుపాస్త్రి, దీపప్రభ మొదలగువానిచే పోషింపఁబడుచున్నను క్రమముగా తగ్గిపోవుచుండును.
కావున నీసమయమున మధ్యాహ్నమునంబలె భోజనము చేయఁగూడదు. ప్రతిదినము రెండుమార్లు భుజించుటయె యుక్తము. మూడునాలుగుసారులు అవ్యవస్థముగా భుజించువారలశరీరమునందు దార్ఢ్యముగాని, కష్టము నోర్చుశక్తిగాని, కర్మములయం దాసక్తిగాని, సూక్ష్మబుద్ధిగాని లేదు.
ఆకారణమువలన, శ్లో॥ నాంతరా కించి దశ్నీయా దగ్నిహోత్రసమో విధిః॥ అగ్న్యుపాసనముంబలె భోజనంబును రెండుమారులే చేయనగుగాని నడుమ భుజింపఁగూడదని విధింపఁబడియెను. కావుననే భోజనసంస్కారాంగము లైనవైశ్వదేవపరిషేచనములు రెండువిధములుగనే, శాస్త్రములయం<noinclude><references/></noinclude>
cb3yynz0ejypjqi09mi8sx6pz5s88om
జెండాపై కపిరాజు పద్యం
0
213464
557088
2026-05-26T10:32:06Z
రవిచంద్ర
146
నాటకపద్యం
557088
wikitext
text/x-wiki
<poem>
జెండా పై కపిరాజు, ముందు శిత వాజిశ్రేణియుం పూంచినే
దండంబున్ గొని తోలు సెందనము మీదన్ నారి సారించుచున్
గాండీవమ్ము ధరించి ఫల్గునుఁడు మూకన్ చెండు చున్నప్పుడొ
క్కండున్ నీ మొర ఆలకింపడు! కురుక్ష్మానాధ సంధింపగన్!
<poem>
mm5ym10htoqmv5blqu3n2t939o3z335
557089
557088
2026-05-26T10:32:18Z
రవిచంద్ర
146
557089
wikitext
text/x-wiki
<poem>
జెండా పై కపిరాజు, ముందు శిత వాజిశ్రేణియుం పూంచినే
దండంబున్ గొని తోలు సెందనము మీదన్ నారి సారించుచున్
గాండీవమ్ము ధరించి ఫల్గునుఁడు మూకన్ చెండు చున్నప్పుడొ
క్కండున్ నీ మొర ఆలకింపడు! కురుక్ష్మానాధ సంధింపగన్!
</poem>
58fjo6op2adfbpden2iwuxmbvdkql0c
సీతమ్మ జాడ
0
213465
557092
2026-05-26T10:48:42Z
రవిచంద్ర
146
రామాంజనేయ యుద్ధంలో పద్యం
557092
wikitext
text/x-wiki
గబ్బిట వెంకటరావు రాసిన రామాంజనేయ యుద్ధంలో ఆంజనేయుడు పాడే పద్యం.
<poem>
స్వామీ ఏమంటివి ప్రభూ
మా జాతి కొత్తదా
ఈ కోతి మీకు పరాయిదా
సీతమ్మ జాడ మీ చెవివేయమయితిమా
నాటితో రామాయణమ్ము సున్నా
సేతుబంధనం మాకు చేతగాదంటిమా
యుద్ధంబు లంకా బద్ధమగును
మైరావణుని ప్రాణమర్మంబు తెలపమా
రావణుడిందాకా రాజ్యమేలు
నిశిరాత్రివేళ సంజీవి తేమైతిమా
సౌమిత్రి స్వర్గాన సభలు దీర్చు
ఆలు బిడ్డలు మాకు ప్రాణాలటంచు
అపుడు కిష్కింధ వీడి రామైతిమేని
కదన విజయంబు మాట యుగాలు దాటు
ఇంత చేసిన రవ్వంతయైన
మా జాతి లక్షణంబులు
మా కోతి లక్షణంబులు
మా కులపు లక్షణంబులు
ఆనాడు అపుడు మీకె తెలియున్
ఈనాడు ఇపుడు
చింతించి చింతించి వగచిన వగచిన వగచిన ఏమి ఫలము
రామా....
</poem>
6awbvkr7acr20ocn58qtkemvqoujh0t