వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.5
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
విష్ణు సహస్రనామ స్తోత్రము
0
2230
557961
479857
2026-06-04T14:40:09Z
~2026-33191-23
7345
ఒక చివరి శ్లోకం చేర్చాను
557961
wikitext
text/x-wiki
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం <poem>
''పూర్వపీఠిక'' :
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||
వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం|
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్||
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే|
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః||
అవికారాయ శుద్ధాయ నిత్యాయపరమాత్మనే|
సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే||
యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్|
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే||
ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే
''శ్రీ వైశంపాయన ఉవాచ'' :
శ్రుత్వా ధర్మా నశేషేణ పావనాని చ సర్వశః|
యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత||
''యుధిష్టిర ఉవాచ'' :
కిమేకం దైవతం లోకే కిం వా ప్యేకం పరాయణం|
స్తువంతః కం క మర్చంతః ప్రాప్నుయుః మానవాశ్శుభమ్||
కో ధర్మ స్సర్వధర్మాణాం భవతః పరమో మతః|
కిం జపన్ ముచ్యతే జంతుః జన్మసంసారబంధనాత్||
''శ్రీ భీష్మ ఉవాచ'' :
జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం|
స్తువన్నా మసహస్రేణ పురుషస్సతతోత్థితః
తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయం|
ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ||
అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం|
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్||
బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం|
లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవమ్||
ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః|
యద్భక్త్యా పుణ్డరీకాక్షం స్తవైరర్చే న్నర స్సదా||
పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః|
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్||
పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం|
దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపితా||
యత స్సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే|
యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే||
తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే|
విష్ణో ర్నామసహస్రం మే శృణు పాపభయాపహం||
యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః|
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే||
విష్ణో ర్నామసహస్రస్య వేదవ్యాసో మహా నృషిః|
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే||
ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః
చందో నుష్టుప్ తథా దేవోః భగవాన్ దేవకీసుతః|
అమృతాం శూద్భవో బీజం శక్తిర్దేవకి నందనః|
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే||
విష్ణుజిష్ణుం మహా విష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం|
అనేక రూపదైత్యాంతం నమామి పురుషోత్తమం||
అస్య శ్రీ విష్ణోః దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య |
శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః|
అనుష్టుప్ఛన్ధః |
శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా |
అమృతాంశూద్భవో భానురితి భీజం |
దేవకీ నందన స్రష్టేతి శక్తిః |
ఉద్భవః క్షోభణోదేవ ఇతి పరమోమన్త్రః |
శంఖభృన్నందకీ చక్రీతి కీలకం |
శారంగ ధన్వా గదాధర ఇత్యస్త్రం |
రధాంగపాణి రక్షోభ్య ఇతినేత్రం |
త్రిసామా సామగస్సామేతి కవచం |
ఆనందం పరబ్రహ్మేతి యోనిః |
ఋతుస్సుదర్శనః కాల ఇతి దిగ్భందః|
శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం |
శ్రీ మహావిష్ణు (కైంకర్యరూపే) ప్రీత్యర్ధే శ్రీ సహస్రనామ స్తోత్రజపే వినియోగః ||
కరన్యాసః
విశ్వం విష్ణుర్వషట్కార ఇత్యంగుష్ఠాభ్యాం నమః
అమృతాం శూద్భవో భానురితి తర్జనీభ్యాం నమః
బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మేతి మధ్యమాభ్యాం నమః
సువర్ణబిందు రక్షోభ్య ఇతి అనామికాభ్యాం నమః
నిమిషోఽనిమిషః స్రగ్వీతి కనిష్ఠికాభ్యాం నమః
రథాంగపాణి రక్షోభ్య ఇతి కరతల కరపృష్ఠాభ్యాం నమః
అంగన్యాసః
సువ్రతః సుముఖః సూక్ష్మ ఇతి జ్ఞానాయ హృదయాయ నమః
సహస్రమూర్తిః విశ్వాత్మా ఇతి ఐశ్వర్యాయ శిరసే స్వాహా
సహస్రార్చిః సప్తజిహ్వ ఇతి శక్త్యై శిఖాయై వషట్
త్రిసామా సామగస్సామేతి బలాయ కవచాయ హుం
రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రాభ్యాం వౌషట్
శాంగధన్వా గదాధర ఇతి వీర్యాయ అస్త్రాయఫట్
ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్భంధః
''ధ్యానమ్'' :
క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం
మాలాకౢప్తాసనస్ధః స్ఫటికమణి నిభైః, మౌక్తికైః మణ్డితాంగః|
శుభ్రైరభ్రైరదభ్రైః ఉపరి విరచితైః ముక్తపీయూషవర్షైః|
ఆనందీ నః పునీయాత్ అరినళిన గదా శంఖపాణిః ముకుందః||
భూఃపాదౌ యస్యనాభిః వియదసురనిలః చంద్రసూర్యౌచనేత్రే|
కర్ణావాసాశ్శిరోద్యౌః ముఖమపి దహనో యస్యవాస్తేయమబ్ధిః|
అన్తస్థం యస్యవిశ్వం సురనర ఖగగో భోగి గంధర్వ దైత్యైః
చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి|
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం|
లక్ష్మీకాన్తం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వన్దే విష్ణుంభవభయహరం సర్వలోకైక నాధమ్||
మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకంకౌస్ధుభోద్భాసితాంగం|
పుణ్యోపేతం పుణ్డరీకాయతాక్షం విష్ణుం వన్దే సర్వలోకైకనాధమ్||
సశంఖ చక్రం సకిరీటకుణ్డలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం|
సహారవక్షస్ధల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్||
|| హరిః ఓం ||
విశ్వం విష్ణు ర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః||
భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః||
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః|
అవ్యయః పురుష స్సాక్షీ క్షేత్రజ్ఞోక్షర ఏవ చ||
యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః|
నారసింహవపు శ్రీమాన్ కేశవః పురుషోత్తమః||
సర్వశ్శర్వ శ్శివ స్ధాణుః భూతాది ర్నిధి రవ్యయః|
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః||
స్వయంభూశ్శంభు రాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః|
అనాది నిధనో ధాతా విధాతా ధారురుత్తమః||
అప్రమేయా హృషీకేశః పద్మనాభో మరప్రభుః||
విశ్వకర్మా మనుస్త్వష్టా స్ధవిష్ఠః స్ధవిరో ధ్రువః||
అగ్రాహ్యాః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః|
ప్రభూత స్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరమ్||
ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః|
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః||
ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః|
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్||
సురేశ శ్శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః|
అహ స్సవంత్సరో వ్యాళః ప్రత్యయ స్సర్వదర్శనః||
అజ స్సర్వేశ్వర స్సిద్ధః సిద్ధి స్సర్వాది రచ్యుతః|
వృషాకపి రమేయాత్మా సర్వయోగ వినిస్సృతః||
వసు ర్వసుమనా స్సత్యః సమాత్మా సమ్మిత స్సమః|
అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః||
రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శ్శుచిశ్రవాః|
అమృత శ్శాశ్వతః స్ధాణుః వరారోహో మహాతపాః||
సర్వగ స్సర్వవిద్భానుః విష్యక్సేనో జనార్దనః|
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః||
లోకాధ్యక్ష స్సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః|
చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రశ్చతుర్భుజః||
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః|
అనఘో విజయోజేతా విశ్వయోనిః పునర్వసుః||
ఉపేన్ద్రో వామనః ప్రాంశుః అమోఘ శ్శుచి రూర్జితః|
అతీన్ద్ర స్సంగ్రహా స్సర్గో ధృతాత్మా నియమో యమః||
వేద్యో వైద్య స్సదా యోగీ వీరహా మాధవో మధుః|
అతీన్ద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః||
మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః|
అనిర్దేశ్యవపు శ్శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్||
మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాంగతిః||
అనిరుద్ధ స్సురానందో గోవిన్దో గోవిదాం పతిః||
మరీచి ర్దమనో హంసః సువర్ణో భుజగోత్తమః|
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః
అమృత్యు స్సర్వదృక్సింహః సన్ధాతా సన్ధిమాన్ స్ధిరః|
అజో దుర్మర్షణ శ్శాస్తా విశ్రుతాత్మా సురారిహా||
గురు ర్గురుతమో ధామః సత్యస్సత్య పరాక్రమః|
నిమిషో నిమిష స్స్రగ్వీ వాచస్పతి రుదారధీః||
అగ్రణీర్ద్రామణీ శ్శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః|
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్||
ఆవర్తనో నివృత్తాత్మా సంవృత స్సంప్రమర్దనః|
అహస్సంవర్తకో వహ్ని రనిలోధరణీధరః
సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వ సృగ్విశ్వభుగ్విభుః|
సత్కర్తా సత్కృతస్సాధుః జహ్నుర్నాయణో నరః||
అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శ్శిష్టకృచ్ఛుచిః|
సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిద సిద్ధి సాధనః||
వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః|
వర్థనో వర్ధమానశ్చ వివిక్త శ్ర్శుతిసాగరః||
సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః|
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః||
ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః|
ఋద్ధఃస్పష్టాక్షరో మంత్రః చంద్రాంశుర్భాస్కరద్యుతిః||
అమృతాంశూద్భవో భానుః శశిబిందుస్సురేశ్వరః|
ఔషధం జగత స్సేతుః సత్యధర్మ పరాక్రమః||
భూతభవ్య భవన్నాథః పవనః పావనో నలః
కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః||
యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః|
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిత్ అనన్తజిత్||
ఇష్టోవిశిష్ట శ్శిష్టేష్టః శిఖణ్ణీ నహుషో వృషః|
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః||
అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః|
అపాంనిధి రధిష్ఠానం అప్రమత్తః ప్రతిష్ఠితః
స్కందః స్కందధరో ధుర్యోవరదో వాయువాహనః|
వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురన్దరః||
అశోక స్తారణ స్తారః శూరశ్శౌరి ర్జనేశ్వరః|
అనుకూల శ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః||
పద్మనాభోరవిన్దాక్షః పద్మగర్భశ్శరీరభృత్|
మహర్థి ఋద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః||
అతులశ్శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః|
సర్వలక్షణ లక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః||
విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదర స్సహః|
మహీధరో మహాభాగో వేగవానమితాసనః||
ఉద్భవ క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః|
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః||
వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః||
పరర్థిః పరమస్పష్టః తుష్టః పుష్టశ్శుభేక్షణః||
రామో విరామో విరజో మార్గో నేయో నయోనయః||
వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః|
వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః
హిరణ్యగర్భ శ్శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః||
ఋతుస్సుదర్శనః కాలఃపరమేష్ఠీ పరిగ్రహః|
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః||
విస్తారః స్ధావర స్ధాణుః ప్రమాణం బీజమవ్యయం|
అర్థో నర్థో మహాకోశో మహాభోగో మహాధనః||
అనిర్విణ్ణః స్థవిష్ఠో భూః ధర్మయూపో మహామఖః|
నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామస్సమీహనః||
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాం గతిః|
సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం||
సువ్రతస్సుముఖసూక్ష్మః సుఘోషస్సుఖదస్సుహృత్|
మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః||
స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్|
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశరః||
ధర్మకృబ్ధర్మకృద్ధర్మీ సదసక్షర మక్షరం|
అవిజ్ఞాతా సహస్రాంశుః విధాతా కృతలక్షణః||
గభస్తినేమిస్సత్వస్ధః సింహో భూతమహేశ్వరః|
ఆదిదేవో మహాదేవో దేవోశో దేవభృద్గురుః||
ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః
శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః||
సోమపో మృతపస్సోమః పురుజిత్పురుసత్తమః|
వినయోజయస్సత్ససన్ధో దాశార్హ స్సాత్వతాం పతిః||
జీవో వినయితా సాక్షీ ముకున్దోమిత విక్రమః|
అమ్భోనిధి రనన్తాత్మా మహోదధిశయో న్తకః||
అజో మహర్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః|
ఆనన్దో నన్దనో నన్దః సత్యధర్మా త్రివిక్రమః
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః|
త్రిపదస్త్రిదశాధ్యక్షః మహాశృంగకృతాన్తకృత్||
మహావరాహో గోవిన్దః సుషేణః కానాకాంగదీ|
గుహ్యోగభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః||
వేదాస్వ్యాంగో జితఃకృష్ణోదృఢస్సంకర్షణోచ్యుతః|
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహమనాః||
భగవాన్ భగహానన్దీ వనమాలీ హలాయుధః|
ఆదిత్యో జ్యోరిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః||
సుధన్వా ఖణ్డపరశుః దారుణో ద్రవిణః ప్రదః|
దివిస్పృక్సర్వ దృగ్వ్యాసో వాచస్పతి రయోనిజః||
త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్|
సన్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠాశాన్తిః పరాయణమ్||
శుభాంగశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః|
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః||
అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః|
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః||
శ్రీదశ్శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిశ్శ్రీవిభావనః|
శ్రీధరశ్శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః||
స్వక్ష స్స్వంగ శ్శతానన్దో నన్దిర్జ్యోతి ర్గణేశ్వరః|
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్న సంశయః||
ఉదీర్ణస్సరతశ్చక్షుః అనీశ శ్శాశ్వతః స్ధిరః|
భూశయో భూషణో భూతిః విశోక శ్శోకనాశనః||
అర్చిష్మా నర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః
అనిరుద్ధో ప్రతిరధః ప్రద్యుమ్నోమితవిక్రమః||
కాలనేమినిహా శౌరిః శూర శ్శూరజనేశ్వరః|
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః||
కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః|
అనిర్దేశ్యవపుః విష్ణుః వీరోనంతో ధనంజయః||
బహ్మణ్యోబ్రహ్మకృత్ బ్రహ్మ బ్రహ్మబ్రహ్మ వివర్థనః
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః||
మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః|
మహాక్రతు ర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః||
స్తవ్యస్తవప్రియ స్తోత్రం స్తుత స్తోతారణప్రియః|
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తి రనామయః||
మనోజవ స్తీర్థకరో వసురేతా వసుప్రదః|
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః||
సద్గతి స్సత్కృతిస్సత్తా సద్భూతి స్సత్పరాయణః|
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాస స్సుయామునః||
భూతావాసో వాసుదేవః సర్వాసు నిలయో నలః|
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరో థాపరాజితః||
విశ్వమూర్తిర్మహామూర్తిః దీప్తమూర్తి రమూర్తిమాన్|
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తి శ్శతాననః||
ఏకో నైక స్సవః కః కిం యత్తత్పద మనుత్తమం|
లోకబన్ధు ర్లోకనాథో మాధవో భక్తవత్సలః||
సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చన్దనాంగదీ|
వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచల శ్చలః||
అమానీ మానదో మాన్యో లోకఃస్వామీ త్రిలోకధృత్|
సుమేధా మేధజో ధన్యః సత్యమేథా ధరాధరః||
తేజో వృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాం వరః|
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైక శృంగో గదాగ్రజః|
చతుర్మూర్తి శ్చతుర్బాహుః చతుర్వ్యూహః చతుర్గతిః|
చతురాత్మా చతుర్భావః చతుర్వేద విదేకపాత్||
సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః|
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా||
శుభాంగో లోకసారంగః స్తతన్తు స్తన్తువర్ధనః|
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః||
ఉద్భవ స్సుందర స్సున్దో రత్ననాభ స్సులోచనః|
అర్కో వాజసనః శృంగీ జయన్తః సర్వవిజ్జయీ||
సువర్ణ బిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః|
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః||
కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనో నిలః|
అమృతాంశోమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః||
సులభ స్సువ్రత స్సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః|
న్యగ్రోధోదుంబరో శ్వత్థః చాణూరాన్ద్ర నిషూదనః||
సహస్రార్చి స్సప్తజిహ్వః సప్తైథా స్సప్తవాహనః|
అమూర్తి రనఘో చింత్యో భయకృద్భయనాశనః||
అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్|
అధృత స్స్వధృత స్య్సాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్థనః||
భారభృత్ కథితో యోగీ యోగీశ స్సర్వకామదః|
ఆశ్రమ శ్శ్రమణః క్షామః సుపర్ణో వాయువాహనః||
ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః|
అపరాజిత స్సర్వసహో నియన్తా నియమో యమః||
సత్త్వవాన్ సాత్విక స్సత్యః సత్యధర్మపరాయణః||
అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః||
విహాయసగతి ర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః|
రవి ర్విరోచన స్సూర్యః సవితా రవి లోచనః||
అనన్తో హుతభుగ్భోక్తా సుఖదో నైకదో గ్రజః|
అనిర్విణ్ణ స్సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః||
సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః|
స్వస్తిద స్స్యస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తి దక్షిణః||
అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః|
శబ్దాతిగ శ్శబ్దసహః శిశిర శ్శర్వరీకరః||
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః|
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః||
ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుస్స్యప్న నాశనః|
వీరహా రక్షణ స్సన్తో జీవనం పర్యవస్ధితః||
అనన్తరూపో నన్త శ్రీః జితమన్యుర్భయాపహః|
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః||
అనాది ర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః|
జననో జన జన్మాదిః భీమో భీమపరాక్రమః||
ఆధార నిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః|
ఊర్ధ్వగ స్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః||
ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః
తత్త్వం తత్త్వ విదేకాత్మా జన్మమృత్యు జరాతిగః||
భూర్భువ స్స్యస్తరుస్తారః సవితా ప్రపితామహః|
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః|
యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధనః|
యజ్ఞాన్తకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాద ఏవచ||
ఆత్మయోని స్స్యయంజాతో వైఖాన స్సామగాయనః|
దేవకీ నన్దన స్స్రష్టా క్షితీశః పాపనాశనః||
శంఖభృత్ నన్దకీ చక్రీ శారంగధన్వా గదాధరః|
రథాంగపాణి రక్ష్యోభ్యః సర్వ ప్రహరణాయుధః||
శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి
వనమాలీ గదీ శారంగీ శంఖీ చక్రీ చ నన్దకీ|
శ్రీమన్నారాయణో విష్ణుః వాసుదేవో భిరక్షతు||
శ్రీ వాసుదేవోభి రక్షతు ఓం నమ ఇతి
''ఉత్తర పీఠిక'' :
ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః|
నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితమ్||
య ఇదం శృణుయాత్ నిత్యం యశ్చాపి పరికీర్తయేత్
నాశుభం ప్రాప్నుయాత్కించిత్ సో ముత్రేహచమానవః||
వేదాన్తగోబ్రాహ్మణస్స్యాత్ క్షత్రియో విజయీ భవేత్|
వైశ్యో ధనసమృద్ధస్స్యాత్ శూద్ర స్సుఖ మవాప్నుయాత్||
ధర్మార్థీ ప్రాప్నుయాద్ధర్మం అర్థార్థీ చార్ధమాప్నుయాత్
కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థీ చాప్ను యాత్ప్రజాః||
భక్తిమాన్య స్సదోత్థాయ శుచిస్తద్గత మానసః|
సహస్రం వాసుదేవస్య నామ్నా మేతత్ ప్రకీర్తయేత్||
యశః ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమేవచ|
అచలాం శ్రియ మాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమం||
న భయం క్వచి దాప్నోతి వీర్యం తేజశ్చ విన్దతి|
భవ త్యరోగో ద్యుతిమాన్ బలరూప గుణాన్వితః||
రోగార్తో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యేత బన్ధనాత్|
భయా న్ముచ్యేత భీతస్తు ముచ్యే తాపన్న ఆపదః||
దుర్గాణ్యతితర త్యాశు పురుషః పురుషోత్తమం|
స్తువ న్నామసహస్రేణ నిత్యం భక్తి సమన్వితః||
వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవ పరాయణః|
సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం||
న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్|
జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైవోపజాయతే|
ఇమం స్తవ మధీయానః శ్రద్ధాభక్తి సమన్వితః|
యుజ్యే తాత్మ సుఖక్షాన్తిః శ్రీ ధృతి స్మృతి కీర్తిభిః||
నక్రోధో న చ మాత్సర్యం న లోభో నా శుభామతిః|
భవన్తి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే||
ద్యౌ స్సచంద్రార్కనక్షత్రం ఖం దిశో భూర్మహోదధిః|
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః||
ససురాసుర గంధర్వం సయక్షోరగ రాక్షసం|
జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరం||
ఇన్ద్రియాణి మనోబుద్ధిః సత్త్వం తేజోబలం ధృతిః||
వాసుదేవాత్మ కాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ||
సర్వాగమానా మాచారః ప్రథమం పరికల్పితః||
ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః||
ఋషయః పితరో దేవః మహాభూతాని ధాతవః|
జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవమ్||
యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శ్శిలాది కర్మచ|
వేదశ్శాస్త్రాణి విజ్ఞానం ఏతత్సర్వం జనార్దనాత్||
ఏకోవిష్ణు ర్మహద్భూతం పృథగ్భూతా న్యనేకశః|
త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః||
ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం|
పఠేద్య ఇచ్ఛేత్ పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖానిచ||
విశ్వేశ్వర మజం దేవం జగతః ప్రభుమవ్యయం|
భజన్తి యే పుష్కరాక్షం నతే యాన్తి పరాభవమ్||
నతే యాంతి పరాభవమ్ ఓమ్ నమ ఇతి
''అర్జున ఉవాచ'' :
పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ|
భక్తానా మనురక్తానాం త్రాతా భవ జనర్ధన||
''శ్రీ భగవానువాచ'' :
యోమాం నాం సహస్రేణ స్తోతు మిచ్ఛతి పాణ్డవ|
సో హ మేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః||
స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి
''వ్యాస ఉవాచ'' :
వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం|
సర్వభూత నివాసో సి వాసుదేవ నమోస్తుతే||
శ్రీ వాసుదేవ నమోస్తుత ఓమ్ నమ ఇతి
''పార్వత్యువాచ'' :
కేనోపాయేన లఘనా విష్ణోర్నామ సహస్రకం|
పఠ్యతే పండితిః నిత్యం శ్రోతు మిచ్ఛామ్యహం ప్రభో||
''ఈశ్వర ఉవాచ'' :
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే|
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే||
శ్రీ రామనామ వరానన్ ఓమ్ నమ ఇతి
''బ్రహ్మోవాచ'' :
నమో స్త్వనన్తాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే |
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీయుగధారిణే నమః ||
శ్రీ సహస్ర్రకోటీ యుగధారిణే ఓమ్ నమ ఇతి
''సంజయ ఉవాచ'' :
యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః|
తత్రశ్రీః విజయోభూతిః ధ్రువా నీతిః మతిర్మమ||
''శ్రీ భగవానువాచ'' :
అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే|
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం||
పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్|
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే||
ఆర్తా విషణ్ణాశ్శిథిలాశ్చభీతాః ఘోరేషుచవ్యాధిషు వర్తమానాః|
సంకీర్త్యనారాయణ శబ్దమాత్రం విముక్త ధుఃఖాస్సు ఖినోభవన్తి||
కాయేనవాచా మనసేంద్రిఐర్వ బుద్యాత్మన్నావా ప్రకృతే స్వభావాత్|
కరోమి యద్యసకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి||
యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్|
తత్సర్వం క్షమ్యతాం దేవ! నారాయణ! నమోస్తుతే||
ఇతి శ్రీ మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం
ఆనుశాసనిక పర్వణి మోక్షధర్మే శ్రీ భీష్మ-యుధిష్ఠిర సంవాదే
శ్రీ విష్ణోః దివ్యసహస్రనామ స్తోత్రం నామ ఏకోన పంచాశదధిక ద్విశతతమోధ్యాయః |
</poem>
|| ఓం తత్ సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ||
హరిఓం
1.విశ్వం --- విశ్వము అంతా తానే ఐన వాడు (నామ రూపాత్మకమై, చిత్రాతి చిత్రమై, వికసించి, విస్తరించి, విరాజిల్లుచు గాన వచ్చు సకల చరాచర జడ చైతన్య సంహితమగు ప్రపంచమే విశ్వము) , సకల విషయములందును సంపూర్ణమైన వాడు. (అంతా తానైన వాడు). ఇది శ్రీ విష్ణుసహస్రనామములలో మొదటి నామము. అంతా భగవంతుడే అన్న భావంలో ఈ నామానికి భాష్యకారులు వ్యాఖ్యానం చెప్పారు
2.విష్ణుః --- అంతటనూ వ్యాపించి యున్నవాడు. సర్వ వ్యాపకుడు. (అంతటా తానున్నవాడు).
3.వషట్కారః --- వేద మంత్ర స్వరూపి, వషట్ క్రియకు గమ్యము (యజ్ఞములలో ప్రతిమంత్రము చివర మంత్రజలమును 'వషట్' అనే శబ్దముతో వదులుతారు); అంతటినీ నియంత్రించి పాలించు వాడు.
4.భూతభవ్యభవత్ ప్రభుః --- భూత కాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము - మూడు కాలములకు అధిపతి, మూడు కాలములలోను అన్నింటికి ప్రభువు.
5 .భూతకృత్ --- సకల భూతములను సృష్టించువాడు; ప్రళయ కాలమున సకల భూతములను నాశనము చేయువాడు (భూతాని కృన్తతి).
6.భూతభృత్ --- సమస్త భూతములను పోషించువాడు, భరించువాడు.
7.భావః --- అన్నింటికి ఉనికియైనవాడు. తనలోని సర్వ విభూతులను ప్రకాశింపజేయువాడు. సమస్త చరాచర భూతప్రపంచమంత వ్యాపించి యుండు భగవానుడు. తాను తయారు చేసిన సృష్టి తనకన్నా అన్యముగాక పోవుటవేత తాను సర్వవ్యాపి అయినాడు.
8.భూతాత్మా --- సమస్త భూతములకు తాను ఆత్మయై యుండువాడు. సర్వ జీవకోటియందు అంతర్యామిగా యుండువాడు. సర్వభూతాంతరాత్మకుడైన భగవానుడు సమస్త శరీర మనుగడకు కర్తయై, సాక్షియై యుండు చైతన్యము.
9.భూతభావనః --- అన్ని భూతములను సృష్టించి, పోషించి, నిలుపువాడు. జీవులు పుట్టి పెరుగుటకు కారణమైనవాడు. తల్లిదండ్రులవలె జన్మనిచ్చి, పెంచి, పోషించు వాడు భగవానుడు. అతడే జగత్పిత.
10.పూతాత్మా --- కర్మ ఫల దోషములు అంటని పవిత్రమైన ఆత్మ. 'పూత' అనగా పవిత్రమైన, 'ఆత్మా' అనగా స్వరూపము గలవాడు. పవిత్రాత్ముడు. భూతములు ఆవిర్భవించి, వృద్ధిచెందుటకు భగవానుడు కారణమైనను జీవగుణములతో సంబంధము లేనివాడు.
11.పరమాత్మా --- పరమమైన, అంతకు అధికము లేని, ఆత్మ. సర్వులకూ తానే ఆత్మ గాని, తనకు వేరు ఆత్మ యుండని వాడు. నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్యకారణములకంటె విలక్షణమైనవాడు. తాను సర్వులకు ఆత్మయై తనకు మరొక ఆత్మ లేనివాడు.
12.ముక్తానాం పరమాగతిః --- ముక్తులైన వారికి (జనన మరణ చక్రమునుండి విముక్తి పొందిన వారికి) పరమాశ్రయమైన వాడు. ముక్తులకు ఇంతకంటె ఆశించవలసినది మరొకటి లేదు. ముక్త పురుషులకు పరమగమ్యమయిన వాడు - భగవంతుడు. గతి యనగా గమ్యము. పరమా అను విశేషణము యొక్క అర్ధము ఉత్తమము. ఏది గ్రహించిన పిదప మరొకటి గ్రహించనవసరములేదో, ఏ స్థానమును చేరిన జ్ఞానికి పునర్జన్మ ప్రాప్తించదో అదియే పరమగతియని తెలియదగును. నదికి సాగరము పరమగతి అయినట్లు-మానవులకు భగవానుడు పరమగమ్యమయి ఉన్నాడు. సాగరములో లయించిన నది తన వ్యక్తిత్వమును కోల్పోయి అనంత సాగరములో ఐక్యమయిన రీతిని భగవానుని చేరిన జీవి భగవద్వైభవములో లయించుట జరుగుచున్నది. అది కరిగిపోవు సమస్థితియేగాని తిరిగివచ్చు దుస్థితి కాదు. "దేనిని చేరిన పిదప జీవులు తిరిగి రాలేరో అట్టి పవిత్ర పరమగతియే నా నివాసము" అని భగవానుడు భగవద్గీతలో తెలియజేసి యున్నాడు.
13.అవ్యయః --- తరుగు లేని వాడు; తనను చేరిన వారిని మరల జనన మరణ చక్రములో పడనీయని వాడు. వినాశము కానివాడు మరియు వికారము లేనివాడు. గోచరమగునది యేదయినను పరిణామము చెందును. పరిణామశీలమయిన వస్తువు నశించి తీరును. భగవానుడలా పరిణామము చెందు వస్తు సముదాయములలో చేరడు.
14.పురుషః --- ముక్తులకు పుష్కలముగా బ్రహ్మానందానుభవమును ప్రసాదించువాడు; శరీరమందు శయనించియున్నవాడు; సమస్తమునకు పూర్వమే ఉన్నవాడు. జగత్తునకు పరిపూర్ణతనిచ్చువాడు.
15.సాక్షీ --- సర్వమును ప్రత్యక్షముగా (ఇంద్రియ సాధనములు అవుసరము లేకుండా) చూచువాడు; సమస్తము తెలిసినవాడు; భక్తుల ఆనందమును వీక్షించి ప్రీతితో కటాక్షించువాడు. సా+అక్షి = చక్కగా దర్శించువాడు. చక్కగా సమస్తమును దర్శించువాడు సాక్షి యని పాణిని వ్యాకరణము తెలియజేయుచున్నది.
16.క్షేత్రజ్ఞః --- ఈ శరీరమను క్షేత్రమున విలసిల్లుచు, నాశనరహితుడై, క్షేత్ర తత్వమును తెలిసిన వాడు; ముముక్షువుల పరమార్ధమైన శుద్ధ సచ్చిదానంద పర బ్రహ్మానుభవము తెలిసి, వారినక్కడికి చేర్చువాడు.
17.అక్షరః --- ఎన్నడునూ (కల్పాంతమునందు కూడ) నశింపక నిలచియుండువాడు; ముక్తులు ఎంత అనుభవించినా తరగని అనంత సచ్చిదానంద ఐశ్వర్య స్వరూపుడు
18.యోగః --- ముక్తి సాధనకు ఏకైక మార్గము, సాధనము, ఉపాయము; యోగము వలననే పొందదగినవాడు; కోర్కెలు తీరుటకు తిరుగులేణి ఉపాయము. ధ్యానము వలన, సమత్వ భావము వలన తెలియబడువాడు. యోగముచే పొందదగినవాడు - భగవానుడు. సాధ్య సాధనములు తానైన భగవానుడే సాధకులకు మార్గగామి. సాధ్యవస్తువయిన భగవానుడు తనకన్నా అన్యం కాదని గ్రహించిన సాధకుడు ఇంద్రియ మనోబుద్దులను నిగ్రహించి, యోగయుక్తుడయిన భగవానునితో కలసి కరిగిపోవుటయే యోగము.
19.యోగవిదాం నేతా --- తానే మార్గదర్శియై, నాయకుడై, యోగ సాధన చేయువారిని గమ్యమునకు చేర్చువాడు. యోగులకు నేత; కర్మజ్ఞానాది సాధనాంతరములకు ఫలమునొసగువాడు.
20.ప్రధాన పురుషేశ్వరః --- ప్రధానము (ఆనగా ప్రకృతి, మాయ), పురుషుడు (జీవుడు) - రెండింటికిని ఈశ్వరుడు (అధిపతి, నియామకుడు).
21.నారసింహ వపుః --- ప్రహ్లాదుని కాచుటకై శ్రీనారసింహావతారమును ధరించి అవతరించినవాడు; అభయమునొసగువాడు. మంగళ మూర్తి.
22 .శ్రీమాన్ --- రమణీయమైన స్వరూపము గలవాడు (శ్రీనారసింహ మూర్తిగా); సదా లక్ష్మీదేవిని తన వక్షస్థలమున ధరించినవాడు.
23.కేశవః --- సుందరమైన కేశములతో విరాజిల్లువాడు. కేశి అను రాక్షసుని సంహరించినవాడు. బ్రహ్మ, విష్ణు, శివ రూపములు ధరించువాడు (త్రిమూర్తి స్వరూపి); అందమైన కిరణములతో విశ్వమును చైతన్యవంతులుగా చేయువాడు. 'కేశ' యనెడి అసురుని వధించినవాడు - విష్ణుమూర్తి. మనోహరములైన శిరోజములు (కేశములు) కలిగియున్నవాడు - శ్రీ కృష్ణుడు. "క + అ + ఈశ" కలసి "కేశ" శబ్దమయినది. 'క' అనగా బ్రహ్మ. 'అ' అనగా విష్ణువు, 'ఈశ' అనగా ఈశ్వరుడు. ఈ త్రిమూర్తులకు ఆధారమయిన వాసుదేవ చైతన్యమే కేశవుడు.
24.పురుషోత్తమః --- పురుషులలో ఉత్తముడు; త్రివిధ చేతనులైన బద్ధ-నిత్య-ముక్తులలో ఉత్తముడు. క్షరుడు (నశించువాడు), అక్షరుడు (వినాశన రహితుడు) - ఈ ఇద్దరు పురుషులకు అతీతుడు, ఇద్దరికంటె ఉత్తముడైన వాడు.
25.సర్వః --- సర్వము తానెయైన వాడు. సృష్టి స్థితి లయములకు మూలము.
26.శర్వః --- సకల పాపమును పటాపంచలు చేయువాడు. సమస్త జీవుల దుఃఖములను, అనిష్టములను నాశనము చేయువాడు. ప్రళయ కాళములో సమస్త భూతములను తనలో లీనం చేసుకొనేవాడు.
27.శివః --- మంగళములనొసగు వాడు. శుభకరుడు.
28.స్థాణుః --- స్థిరమైన వాడు. భక్తుల పట్ల అనుగ్రహము కలిగి నిశ్చయముగా ఇష్ట కామ్యములు సిద్ధింపజేయువాడు. వృద్ధి క్షయ గుణములకు లోబడనివాడు.
29.భూతాదిః --- సకల భూతములకు మూలము, కారణము, సకల భూతములచే ఆత్రముగా కోరబడువాడు. పంచ భూతములను సృష్టించిన వాడు.
30.నిధిరవ్యయః --- తరుగని పెన్నిధి, ప్రళయకాలమునందు సమస్త ప్రాణికోటులను తనయందే భద్రపరచుకొనువాడు.
31.సంభవః --- తనకు తానుగానే (కర్మముల వంటి కారణములు, బంధములు లేకుండానే) అవతరించువాడు. శ్రద్ధా భక్తులతో కోరుకొన్నవారికి దర్శనమిచ్చువాడు.
32.భావనః --- కామితార్ధములను ప్రసాదించువాడు. మాలిన్యములు తొలగించి వారిని పునరుజ్జీవింపజేయువాడు.
33.భర్తా --- భరించువాడు; భక్తుల యోగ క్షేమములను వహించువాడు; సకల లోకములకును పతి, గతి, పరమార్ధము.
34.ప్రభవః --- దివ్యమైన జన్మ (అవతరణము) గలవాడు; కర్మ బంధములకు లోనుగాకుండనే అవతరించువాడు.
35.ప్రభుః --- సర్వాధిపతి, సర్వ శక్తిమంతుడు; బ్రహ్మాదులకు కూడ భోగ మోక్షములొసగు సమర్ధుడు.
36.ఈశ్వరః --- సర్వులనూ పాలించి పోషించువాడు; అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు; మరే విధమైన సహాయము, ప్రమేయము లకుండ, ఇచ్ఛామాత్రముగ, లీలామాత్రముగ ఏదయిన చేయగలవాడు.
37.స్వయంభూః --- స్వయముగా, ఇచ్ఛానుసారము, వేరు ఆధారము లేకుండ జన్మించువాడు.
38.శంభుః --- శుభములను, సుఖ సంతోషములను ప్రసాదించువాడు.
39.ఆదిత్యః --- సూర్య మండల మధ్యవర్తియై బంగారు వర్ణముతో ప్రకాశించువాడు; ద్వాదశాదిత్యులలో విష్ణువు;సమస్తమును ప్రకాశింపజేసి పోషించువాడు; అదితి కుమారుడైన వామనుడు. సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు - భగవానుడు. "ద్వాదశాదిత్యులు లో విష్ణువు అను పేరు గలవాడు తానే" యని భగవానుడు భగవద్గీత విభూతి యోగములో తెలియజేసి యున్నాడు. 'ఆదిత్యః' అనగా ఆదిత్యుని వంటి వాడని కూడా భావము. ఆదిత్య ఉపమానము ద్వారా ఈ అద్వైత సత్యమును నిత్యానుభవములోనికి తెచ్చుకొని సంతృప్తి చెందవచ్చును.
40.పుష్కరాక్షః --- తామరపూవు వంటి కన్నులు గల వాడు.
41.మహాస్వనః --- గంభీరమైన దివ్యనాద స్వరూపుడు; వేద నాదమునకు ప్రమాణమైనవాడు.
42.అనాదినిధనః --- ఆది (మొదలు, పుట్టుక) లేనివాడు మరియు నిధనము (తుది, నాశనము) లేనివాడు.
43.ధాతా --- బ్రహ్మను కన్న వాడు; నామ రూపాత్మకమైన ఈ చరాచర విశ్వమునంతను ధరించిన మహనీయుడు.
44.విధాతా --- బ్రహ్మను ఆవిర్భవింపజేసిన వాడు; విధి విధానములేర్పరచి, తగురీతిలో కర్మ ఫలములనొసగువాడు. కర్మఫలముల నందించువాడైన భగవానుడు. విశ్వ యంత్రాంగమంతయు అతని ఆజ్ఞకు లోబడి నడచుచున్నది. తనకు భయపడి ప్రకృతి ప్రవర్తించుచున్నది. సర్వమును కదిలించి, కదిలిన సర్వమును కనిపెట్టి, ధర్మబద్ధంగా ఫలితముల నందించి, పోషించుటచే ఆదిదేవుడు విధాత ఆయెను.
45.ధాతురుత్తమః --- బ్రహ్మకంటెను శ్రేష్ఠుడు, ముఖ్యుడు; సృష్టికి మూలములైన సమస్త ధాతువులలోను ప్రధానము తానే అయినవాడు.
46.అప్రమేయః --- ఏ విధమైన ప్రమాణములచేత తెలియరానివాడు; కొలతలకందనివాడు; సామాన్యమైన హేతు ప్రమాణముల ద్వారా భగవంతుని నిర్వచించుట, వివరించుట, అంచనా వేయుట అసాధ్యము.
47.హృషీకేశః --- ఇంద్రియములకు (హృషీకములకు) అధిపతి; సూర్య, చంద్ర రూపములలో కిరణములు పంచి జగముల నానందింప జేయువాడు. హృషీకములకు అనగా ఇంద్రియములకు ప్రభువు - భగవానుడు. సూర్యచంద్ర కిరణములు హరి ముంగురులని వేద ప్రవచనము. సూర్యచంద్ర రూపులగు భగవానుని కేశములు (కిరణములు) జగత్తునకు హర్షమును కలిగించుచున్నవి. అందుచేత కూడా తాను హృషీకేశుడయ్యెనని మహాభారత శ్లోకము వివరించుచున్నది.
48.పద్మనాభః --- నాభియందు పద్మము గలవాడు. ఈ పద్మమునుండే సృష్టికర్త బ్రహ్మ ఉద్భవించెను. పద్మము నాభియందు కలిగియుండువాడు - భగవానుడు. అట్టి పద్మము నుండి సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించెను. పద్మము జ్ఞానమునకు ప్రతీక. విష్ణుదేవుడు తన జ్ఞానశక్తిచే బ్రహ్మను సృష్టించి, తద్వారా సకల జీవులు పుట్టుటకు కారణమాయెను.
49.అమరప్రభుః --- అమరులైన దేవతలకు ప్రభువు
50.విశ్వకర్మా --- విశ్వమంతటికిని సంబంధించిన కర్మలను తన కర్మలుగా గలవాడు. విశ్వమును సృష్టించిన వాడు. విశ్వరచన చేయగలుగువాడు - భగవానుడు. విచిత్రమైన సృష్టినిర్మాణము చేయగల సామర్ధ్యమును కలిగియుండెను. బ్రహ్మ ఆవిర్భావమునకు పూర్వమే భగవానుదు సృష్టిరచన సాగించెను; కాని సృష్టిని అనుసరించలేదు. అందుచేత సృష్టిలోని అశాశ్వత లక్షణములు భగవానునియందు లేవు. "సర్వభూతములు నాయందున్నవి. నేను వానియందు లేను" అని భగవానుడు భగవద్గీత-రాజవిద్యా రాజగుహ్యమునందు తెలియజేసియున్నాడు.
51.మనుః --- మననము చేయు మహిమాన్వితుడు; సంకల్పము చేతనే సమస్తమును సృష్టించిన వాడు.
52.త్వష్టా --- శిల్పివలె నానా విధ రూపములను, నామములను తయారు చేసినవాడు; బృహత్పదార్ధములను విభజించి సూక్ష్మముగా చేసి ప్రళయ కాళమున తనయందు ఇముడ్చుకొనువాడు.
53.స్థవిష్ఠః --- బ్రహ్మాండమును తనయందు ఇముడ్చుకొన్న బృహద్రూప మూర్తి; సమస్త భూతజాలమునందును సూక్ష్మ, స్థూల రూపములుగా నుండు విశ్వ మూర్తి.
54.స్థవిరః --- సనాతనుడు; సదా ఉండెడివాడు
55.ధ్రువః --- కాలముతో మార్పు చెందక, ఒకే తీరున, స్థిరముగా ఉండెడివాడు
స్థవిరో ధ్రువః (ఆది శంకరాచార్యులు ఒకే నామముగా పరిగణించిరి) --- స్థిరుడై, నిత్యుడై, కాలాతీతుడైన వాడు
56.అగ్రాహ్యః --- తెలియరానివాడు. ఇంద్రియ, మనో బుద్ధులచే గ్రహింప నలవి కానివాడు.
57.శాశ్వతః --- కాలముతో మార్పు చెందక ఎల్లప్పుడు ఉండెడివాడు.
58.కృష్ణః --- సర్వమును ఆకర్షించువాడు; దట్టమైన నీల వర్ణ దేహము గలవాడు; సృష్ట్యాది లీలా విలాసముల వలన సర్వదా సచ్చిదానందమున వినోదించువాడు..
59.లోహితాక్షః --- తామర పూవు వలె సుందరమగు ఎర్రని కనులు గలవాడు; అంధకారమును తొలగించు ఎర్రని కనులు గలవాడు.
60.ప్రతర్దనః --- ప్రళయకాలమున అంతటిని (విపరీతముగ) నాశనము చేయువాడు.
61.ప్రభూతః --- పరిపూర్ణుడై జన్మించిన వాడు; జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజము మొదలగు సర్వగుణములు సమృద్ధిగా గలవాడు.
62.త్రికకుద్ధామః , త్రికకుబ్ధామః --- సామాన్యలోకము కంటె మూడు రెట్లు పెద్దదైన పరమ పదమందు ఉండెడివాడు; మూడు గుణ వర్గములకును ఆశ్రయమైన వాడు; ఊర్ధ్వ, మధ్య, అధో లోకములకు ఆధార భూతుడు; జాగ్రత్, స్వప్న, సుషుప్తి - మూడు అవస్థలందును వ్యాపించియున్నవాడు.
త్రికకుత్ --- మూడు కొమ్ములు (మూపులు) గల శ్రీవరాహమూర్తి
ధామః --- నివాస స్థానము, ప్రకాశవంతమైన కిరణము.
63.పవిత్రం --- పరమ పావన స్వరూపుడు, పరిశుద్ధమొనర్చువాడు.
64.మంగళం పరం --- అన్నింటికంటె మంగళకరమగు మూర్తి; స్మరణ మాత్రముననే అన్ని అశుభములను తొలగించి, మంగళములను ప్రసాదించువాడు.
65.ఈశానః --- సమస్తమునూ శాసించు వాడు; సకలావస్థలలోనూ సకలమునూ పాలించువాడు.
66.ప్రాణదః --- ప్రాణములను ప్రసాదించువాడు (ప్రాణాన్ దదాతి);ప్రాణములను హరించువాడు (ప్రాణాన్ ద్యాతి); ప్రాణములను ప్రకాశింపజేయువాడు (ప్రాణాన్ దీపయతి).
67.ప్రాణః --- ప్రాణ స్వరూపుడు; జీవనము; చైతన్యము.
68.జ్యేష్ఠః --- పూర్వులకంటె, వారి పూర్వులకంటె, పెద్దవాడు; తరుగని ఐశ్వర్య సంపదచే పెద్దవాడు, మిక్కిలి కొనియాడదగినవాడు.
69.శ్రేష్ఠః --- ప్రశంసింపదగిన వారిలోకెల్ల ఉత్తముడు.
70.ప్రజాపతిః --- సకల ప్రజలకు ప్రభువు, తండ్రి; నిత్యసూరులకు (పరమపదము పొందినవారికి) ప్రభువు.
71.హిరణ్యగర్భః --- రమణీయమగు స్థానమున నివసించువాడు, పరంధాముడు; సంపూర్ణానందమగువానిని ప్రసాదించువాడు; చతుర్ముఖ బ్రహ్మకు ఆత్మయై యున్నవాడు.
72.భూగర్భః --- భూమిని (కడుపులో పెట్టుకొని) కాపాడువాడు; విశ్వమునకు పుట్టినిల్లు అయినవాడు.
73.మాధవః --- మా ధవః -శ్రీమహాలక్ష్మి(మా)కి భర్త ; మధువిద్య (మౌనము, ధ్యానము, యోగము) ద్వారా తెలిసికొనబడువాడు; సకల విద్యా జ్ఞానములకు ప్రభువు; పరమాత్మను గూర్చిన జ్ఞానము ప్రసాదించువాడు; మధు (యాదవ) వంశమున పుట్టినవాడు; తనకు వేరు ప్రభువు లేనివాడు (అందరకు ఆయనే ప్రభువు); మౌనముగానుండి, సాక్షియై నిలచువాడు.
74.మధుసూధనః --- మధు, కైటభులను రాక్షసులను సంహరించినవాడు; బంధకారణములైన కర్మఫలములను నాశనము చేయువాడు.
75.ఈశ్వరః --- సర్వులనూ పాలించి పోషించువాడు; అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు; మరే విధమైన సహాయము, ప్రమేయము లేకుండ, ఇచ్ఛామాత్రముగ, లీలామాత్రముగ ఏదయిన చేయగలవాడు.
76.విక్రమీ --- విశిష్టమగు పాద చిహ్నములు గలవాడు; అమిత శౌర్య బల పరాక్రమములు గలవాడు.
77.ధన్వీ --- (దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు) శార్ఙ్గము అను ధనుసును ధరించినవాడు.
78.మేధావీ --- అసాధారణ, అపరిమిత మేధ (జ్ఞాపక శక్తి) గలవాడు; సర్వజ్ఞుడు.
79.విక్రమః --- బ్రహ్మాండమును కొలిచిన అడుగుల గలవాడు (శ్రీవామన మూర్తి); పక్షిరాజగు గరుత్మంతునిపై పాదములుంచి పయనించువాడు.
80.క్రమః --- సమస్తము ఒక క్రమవిధానములో చరించుటకు హేతువు (క్రమ - పద్ధతి); సమస్త జీవరాశులలోను చైతన్యము (క్రమ - కదలిక); అనంత, అసాధారణ వైభవ సంపన్నుడు (క్రమ - సంపత్తు); సంసార సాగరమును దాటించువాడు (క్రమణ - ఈదుట).
81.అనుత్తమః ---అంతకంటె ఉత్తమమైనది మరొకటి లేదు.
82.దురాధర్షః --- తననెదిరింపగల గల శక్తి వేరెవ్వరికి లేనట్టివాడు.
83.కృతజ్ఞః --- నామ స్మరణము, శరణాగతి, పూజాది భక్తి కార్యములచే ప్రసన్నుడై భక్తులననుగ్రహించువాడు; పత్ర పుష్పాది అల్ప నివేదనల చేతనే సంతుష్టుడై కామితార్ధ మోక్షములను ప్రసాదించువాడు; సమస్త ప్రాణుల పుణ్య, అపుణ్య కర్మలనెరిగినవాడు.
84.కృతిః --- తన భక్తుల సత్కార్యములకు కారణమైనవాడు; తన అనుగ్రహముచే పుణ్య కర్మలను చేయించువాడు.
85.ఆత్మవాన్ --- సత్కార్యములొనర్చు ఆత్మలకు నిజమైన ప్రభువు; తన వైభవమునందే ప్రతిష్ఠుడైనవాడు.
86.సురేశః --- సకల దేవతలకును దేవుడు; దేవదేవుడు; భక్తుల కోర్కెలను తీర్చువారిలో అధిపుడు.
87.శరణం --- తన్ను శరణు జొచ్చినవారిని రక్షించువాడు; ఆర్తత్రాణ పరాయణుడు; ముక్తుల నివాస స్థానము.
88.శర్మ --- సచ్చిదానంద స్వరూపుడు; మోక్షగాముల పరమపదము.
89.విశ్వరేతాః --- విశ్వమంతటికిని బీజము, మూల కారణము.
90.ప్రజాభవః --- సకల భూతముల ఆవిర్భావమునకు మూలమైనవాడు, జన్మకారకుడు.
91.అహః --- ఎవరినీ ఎన్నడూ వీడనివాడు; పగటివలె ప్రకాశ స్వరూపుడై అజ్ఞానమును తొలగించి జ్ఞానోన్ముఖులను చేయువాడు; తన భక్తులను నాశనము కాకుండ కాపాడువాడు.
92.సంవత్సరః --- భక్తులనుద్ధరించుటకై (వెలసి)యున్నవాడు; కాల స్వరూపుడు.
93.వ్యాళః --- భక్తుల శరణాగతిని స్వీకరించి అనుగ్రహించువాడు; (సర్పము, ఏనుగు, పులి వంటివానివలె) పట్టుకొనుటకు వీలుగానివాడు (చేజిక్కనివాడు)
94.ప్రత్యయః --- ఆధారపడ దగినవాడు; విశ్వసింపదగినవాడు (ఆయనను నమ్ముకొనవచ్చును); ప్రజ్ఞకు మూలమైనవాడు.
95.సర్వదర్శనః --- తన కటాక్షపరిపూర్ణ వైభవమును భక్తులకు జూపువాడు; సమస్తమును చూచుచుండెడివాడు.
96.అజః --- జన్మము లేనివాడు; అన్ని అడ్డంకులను తొలగించువాడు; భక్తుల హృదయములందు చరించుచుండువాడు; అన్ని శబ్దములకు మూలమైనవాడు.
97.సర్వేశ్వరః --- ఈశ్వరులకు ఈశ్వరుడు, ప్రభువులకు ప్రభువు; ఎవరు తనను వేడుకొందురో వారి చెంతకు తానై వేగముగా వచ్చి అనుగ్రహించువాడు.
98.సిద్ధః --- పొందవలసిన సమస్త సిద్ధులను పొదియే యున్నవాడు; తన భక్తులకు అందుబాటులో నుండెడివాడు; ఏ విధమైన లోపములు లేని, సకల పరిపూరహనత్వమైన రూపము గలవాడు.
99.సిద్ధిః --- సాధనా ఫలము, పరమ లక్ష్యము; సర్వ కార్య ఫలములు తానై యున్నవాడు; భక్తులకు నిధివలె సిద్ధముగా నున్నవాడు.
100.సర్వాదిః --- సర్వమునకు మూలకారణము, ప్రప్రధమము; సకల సృష్టికి పూర్వమందే యున్న పరమాత్మ.
101. అచ్యుతః --- తన దివ్య తేజో విభూతి శక్తి సంపన్నత్వములనుండి యెన్నడును జారని (తరగని) వాడు; తన భక్తులెన్నడును పతనము చెందకుండ గాచువాడు; జన్మ, పరిణామ, వార్ధక్యము వంటి దశలకు అతీతమైనవాడు.
102.వృషాకపిః --- జలములలో (అధర్మములో) మునిగిపోవు భూమిని ఉద్ధరించిన శ్రీవరాహమూర్తి; ధర్మ పరిరక్షకుడు.
103.అమేయాత్మా --- ఆ పరమాత్ముని స్వరూపము కొలుచుటకు (తెలిసికొనుటకు) సాధ్యము కాదు; ఆశ్రితులను అనుగ్రహీంచుటలో పరిమితి లేనివాడు.
104.సర్వ యోగ వినిసృతః --- అన్ని సంగములకు, బంధములకు, విషయ వాసనలకు అతీతుడు; ఎన్నో విధములైన (జ్ఞాన, కర్మ, భక్తి వంటి) యోగములద్వారా సులభముగా పందనగువాడు.
శ్లోకం 12సవరించు
105.వసుః --- సమస్త భూతములు తనయందు గలవాడు; తన భక్తుల హృదయములందు వసించువాడు; క్షీరసాగరమున వసించువాడు; భక్తులు కోరుకొను పరమార్ధము; అష్ట వసువులలో శ్రేష్టుడైన పావకుడు; అంతరిక్షమున వసించువాడు.
106.వసుమనాః --- శ్రేష్ఠమయిన, సకలైశ్వర్యవంతమయిన మనసు గలవాడు; ఏ విధమైన వికారములకును లోనుగాని పరమ శాంతిచిత్తుడు; తన భక్తులను గొప్ప నిధులుగా భావించువాడు.
107.సత్యః --- నిజమైనది, మూడు కాలములలోనుండునది, నాశనము లేనిది; ప్రాణము, పదార్ధము (అన్నము), సూర్యుడు అనే మూడింటిచే కూడిన రూపము గలవాడు; సత్ప్రవర్తనయందు ప్రీతిగలవాడు,
108.సమాత్మా --- సమమైన, భేదభావములేని, రాగద్వేష రహితమగు ఆత్మ;
109.సమ్మితః --- తన భక్తులచే ఇచ్ఛానుసారముగా నియంత్రింపబడువాడు (వారి అనుభవములకు గోచరించువాడు) ; ఋషులచే అంగీకరింపబడి, ఉపనిషత్తుల ద్వారా తెలుపబడినవాడు;
అసమ్మితః --- పరిచ్చేదింపబడజాలనివాడు; అంత్యము, హద్దు లేనివాడు
110.సమః --- అన్నింటియందును సమభావముగలవాడు; మార్పులేకుండ ఎల్లప్పుడు సమముగా (ఒకే తీరున) ఉండువాడు; (స మయా-) శ్రీలక్ష్మీ సమేతుడు.
111.అమోఘః --- తనను పూజించువారికి నిశ్చయముగ సత్ఫలితములనిచ్చువాడు (భగవంతుని ఆరాధన వ్యర్ధము కాదు).
112.పుణ్డరీకాక్షః --- తామరపూవు వంటి కన్నులు గలవాడు; అందరి హృదయ కమలమున వసించి సమస్తమును చూచువాడు; వైకుంఠవాసులకు కనుచూపువంటివాడు.
113.వృషకర్మా --- ధర్మమే తన నిజకర్మగా గలిగినవాడు.
114.వృషాకృతిః --- మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు.
శ్లోకం 13సవరించు
115.రుద్రః --- కన్నులలో నీరు తెప్పించువాడు (1. ప్రళయకాలమున ప్రాణుల లయము చేయునపుడు 2. తనను స్మరించు భక్తులను ఆనందపరచుచు) ; భక్తులకు శుభములను కలిగించువాడు; దుఃఖమును, దారిద్ర్యమును నాశనము చేయువాడు.
116.బహుశిరాః --- అనేకములైన శిరములు గలవాడు; ఆదిశేషునిగా అవతరించినవాడు; అనంతుడు.
117.బభ్రుః --- ఆధారమైనవాడు, భరించువాడు (ఆదిశేషుడై, ఆది కూర్మమై, ఆదివరాహ మూర్తియై)
118.విశ్వయోనిః --- విశ్వమునకు కారణమైనవాడు; తనను ఆశ్రయించిన భక్తులను తనలో విలీనము చేసుకొనువాడు.
119.శుచిశ్రవాః --- శుభప్రథమైన, శ్రవణమాత్రముననే పవిత్రులను చేయగల దివ్యనామములు గలవాడు; ధర్మపూరితములు, సత్యములునగు వాక్కులు విని ఆనందించువాడు; దివ్య సుందరమగు చెవులు గలవాడు.
120.అమృతః --- భక్తులకు తనివి తీరని అమృతమూర్తి; అజరుడు, అమరుడు.
121.శాశ్వత స్థాణుః --- కాళముతో నిమిత్తము లేకుండ నిశ్చలముగా, నిత్యమై, సత్యమై, నిరంతరమైనవాడు; ఆదిమధ్యాంత రహిత పరబ్రహ్మము; స్థిరుడై భక్తులకు నిత్యభోగమైనవాడు.
122.వరారోహః --- అన్నింటికంటె శ్రేష్టమగు ఊర్ధ్వగతి, పొందదగిన అత్యున్నత పదము; ఏ స్థానము చేరినపిదమ మరల తిరిగి జన్మింపరో అట్టి పరమోత్కృష్ట స్థానము గలవాడు; అత్యుత్తమమగు వృద్ధి గలవాడు; ఆదిశేషునిపై పవళించువాడు.
123.మహాతపాః --- గొప్ప తపస్సు (జ్ఞానైశ్వర్య ప్రతాపములు) గలవాడు; మహత్తరమైన జ్ఞానము గలవాడు.
శ్లోకం 14సవరించు
124.సర్వగః --- అంతటను గమనము గలవాడు; ఎక్కడైనా చేయూతనిచ్చువాడు.
125.సర్వవిత్ --- సమస్తము తెలిసినవాడు; సమస్తమునకు పునరుజ్జీవనము ప్రసాదించువాడు (వెలుపలికి తీయువాడు)
సర్వవిద్భానుః --- (శంకరాచార్యులు ఒకేనామముగా పరిగణించిరి) సర్వము తెలిసి, అవిరామముగ, అవికారముగ ప్రకాశించేవాడు.
126.భానుః --- ప్రకాశించువాడు.
127.విష్వక్సేనః --- లోక రక్షణార్ధము అన్ని దిక్కులందు సైన్యము గలవాడు; తన తలంపు మాత్రమున సర్వదానవ సైన్యమును నాశనము చేయువాడు.
128.జనార్దనః --- దుష్టులను శిక్షించువాడు; దుష్టుల బారినుండి సజ్జనులను రక్షించువాడు; భక్తుల రక్షణలో విఘ్నములు కలిగించువారిని పరిమార్చువాడు; కామితార్ధములకై భక్తులు ఎవరిని ఆశ్రయింతురో ఆ దేవుడు.
129.వేదః --- సమస్త జ్ఞానము మూర్తీభవించినవాడు; వేదమూర్తి.
130.వేదవిత్ --- వేదములను, వాని సారము (అర్థమును) సంపూర్ణముగా నెరిగినవాడు; వేదజ్ఞానము బోధీంచువాడు.
131.అవ్యఞ్గః --- ఏ విధమైన లోపములు లేనివాడు (వేద జ్ఞానమందు, గుణ వైభవమునందు). వేదాంగములు తానే అయినవాడు.
132.వేదాఞ్గః --- వేదములే శరీరముగా (అంగములుగా) గలవాడు; వేదమూర్తి.
133.వేదవిత్ --- వేదములనెఱుగుటయే గాక, వేదసారమైన ధర్మమునెరిగినవాడు.
134.కవిః --- సామాన్య దృష్టినధిగమించి, సునిశిత దర్శనము (సూక్ష్మ దృష్టి) కలిగిన వాడు; సకలమును దర్శించువాడు; రమ్యముగా కనుపించువాడు.
శ్లోకం 15సవరించు
135.లోకాధ్యక్షః --- లోకములకు స్వామి, త్రిలోకాధిపతి.
136.సురాధ్యక్షః --- దేవతలకు స్వామి; దేవదేవుడు.
137.ధర్మాధ్యక్షః --- ధర్మమునకు ప్రభువు.
138.కృతాకృతః --- ఇహపరములు రెండింటను ఫలములు ప్రసాదించువాడు; ప్రవృత్తి, నివృత్తి ధర్మములచే జీవులకు నిత్యఫలమునిచ్చువాడు; కారణ రూపమున అవ్యక్తమైనవాడు, కార్యరూపమున వ్యక్తమైనవాడు.
139.చతురాత్మా --- సృష్టి, స్థితి, లయములందు నాలుగేసి విభుతులతో నొప్పువాడు; (నాలుగు సృష్టి విభూతులు - బ్రహ్మ, దక్షుడు మున్నగు ప్రజాపతులు, కాళము, సర్వభూతములు; నాలుగు స్థితి విభూతులు - విష్ణువు, మనువు మొదలగువారు, కాళము, సర్వభూతములు; నాలుగు లయ విభూతులు - రుద్రుడు, కాలము, యముడు, సర్వభూతములు) ; నాలుగు విధములగు సాధనావస్థలకు (జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్థలకు) ప్రభువు.
140.చతుర్వ్యూహః --- నాలుగేసి వ్యూహములతో నొప్పువాడు (వ్యూహము = ఒక ప్రయోజనము కొరకు ఏర్పడిన ఆకారము) ; ప్రద్యుమ్న వ్యూహము - సృష్టి కార్యము నిర్వహించు ఐశ్వర్య, వీర్య సంపన్న స్వరూపము; అనిరుద్ధ వ్యూహము - స్థితికార్యము నిర్వహించు శక్తి, తేజో ప్రధాన స్వరూపము; సంకర్షణ వ్యూహము - లయ కార్యము నిర్వహించు జ్ఞాన బల గుణ ప్రధాన స్వరూపము; వాసుదేవ వ్యూహము - షడ్గుణ (జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజో) పరిపూర్ణ స్వరూపము, అనంత నిరవధిక శక్తి గుణ కాంతి సంపన్నుడు.
141.చతుర్దంష్ట్రః --- నాలుగు కోరపండ్లు కలవాడు (అభయ ప్రదాత శ్రీనృసింహస్వామిని స్మరించు మంగళ నామము).
142.చతుర్భుజః --- నాలుగు బాహువులతో నొప్పువాడు; శంఖ చక్ర గదా పద్మ ధారి.
శ్లోకం 16సవరించు
143.భ్రాజిష్ణుః --- స్వయంప్రకాశ స్వరూపుడు; తేజోమయుడు; (సాధన చేయు, శరణాగతులైన) భక్తులకు కనిపించువాడు.
144.భోజనం --- నోటితో గాని, జ్ఞానేంద్రియములతోగాని స్వీకరించు విషయములు (అన్నము, శబ్దము, స్పర్శ, గంధము వంటివి) అన్నియును భగవత్స్వరూపములే. ఇంద్రియముల ద్వారా గ్రహించు విషయముల రూపమునను, ఇతర పూజాదిక కార్యముల ద్వారా లభించు ఫల రూపమునను భక్తులకు ఆనందానుభూతిని ప్రసాదించువాడు; సచ్చిదానంద స్వరూపుడు.
145.భోక్తా --- భుజించువాడు; భోజన రూపమగు ప్రకృతి లేక మాయను పురుష రూపమున అనుభవించువాడు; భక్తితో నొసగిన కానుకలు స్వీకరించి సంతుష్టుడయ్యేవాడు; యజ్ఞములో అర్పించినదానిని గ్రహించువాడు.
146.సహిష్ణుః --- సహించి, క్షమించి, అనుగ్రహించు కరుణామయుడు; ఓర్పు కలిగి భరించు సర్వ సాక్షి, సహన మూర్తి; దుష్టులను సంహరించువాడు.
147.జగదాదిజః --- జగములన్నింటికంటే ముందుగా నున్నవాడు.
148.అనఘః --- పాపరహితుడు; కల్మషము లేనివాడు.
149.విజయః --- జయించుటయే స్వభావ స్వరూపముగా గలవాడు; బ్రహ్మ రుద్రాదుల విజయములకు కూడా కారణమైనవాడు; ప్రకృతిని జయించినవాడు; పాండవులలో అర్జునుడు.
150.జేతా --- జయించువాడు; అంతా ఆయన ఇచ్ఛానుసారమే జరుగును.
151.విశ్వయోనిః --- విశ్వమునకు జన్మ స్థానము, కారణము; విశ్వమే కారణముగా గలవాడు.
152.పునర్వసుః --- తన సృష్టి యందంతట సకల దైవములందును అంతరాత్మయై మరల మరల విలసిల్లువాడు; ప్రళయానంతరము మరల సృష్టి కావించువాడు.
శ్లోకం 17సవరించు
153.ఉపేంద్రః --- ఇంద్రునిపై ఇంద్రుడు (ఇంద్రునకు అధిపతి) ; ఇంద్రునకు తమ్ముడై (వామనుడై) అవతరించినవాడు; ఇంద్రియములకు అగోచరుడు.
154.వామనః --- పొట్టివానిగా అవతరించిన వాడు; చక్కనైన, కనులకింపైన, చూడ చిన్నదైన రూపము గలవాడు; ఇంద్ర రక్షణకు వామనావతారము దాల్చినవాడు.
155.ప్రాంశుః --- ఎంతో ఎత్తైన, ఉన్నతమైన, విస్తారమైన దేహముగలవాడు; త్రివిక్రముడై ముల్లోకములు ఆక్రమించినవాడు.
156.అమోఘః --- మహదాశయముతో విశేష పరిణామములు గల పనులు చేసెడివాడు; శ్రీహరి ప్రతి కార్యము విశేషించి కారణ యుక్తము, ఏదియును వ్యర్ధము కాదు, ప్రతి పనికిని పరమార్ధము ఉంది.
157.శుచిః --- పరమ పావన మూర్తి, ఏ విధమైన దోష మాలిన్యములు అంటనివాడు; ప్రత్యుపకారమేమియును కోరని పరిశుద్ధుడు; భక్తులను పవిత్రులుగా చేయువాడు.
158.ఊర్జితః --- అనంత శక్తి సామర్థ్య సంపన్నుడు; బలి చక్రవర్తిని పాతాళమునకు త్రొక్కిన మహాబలవంతుడు; ఐశ్వర్యము, శక్తి సంపన్నత, నిర్మలత్వము గలవన్నియును భగవద్విభూతులు (తేజోంశ సంభూతములు).
159.అతీంద్రః --- ఇంద్రునికంటె అధిపుడు; మనసు కంటే శ్రేష్ఠుడు.
160.సంగ్రహః --- ప్రళయ కాలమున సమస్తమును తనయందు చేర్చుకొనువాడు; సమస్తమును కలిపి తన అధీనములో నుంచుకొన్నవాడు; సులభముగా, కేవలము భక్తి వల్లనే పొందనగువాడు (అందుబాటులో ఉండేవాడు)
161.సర్గః --- తనను తానే సృష్టించుకొని, తననుండి సమస్తమును సృజించినవాడు; భక్తులననుగ్రహీంచుటకు తనను తానే సృష్టించుకొనువాడు (అవతరించువాడు).
162.ధృతాత్మా --- సకల జీవాత్మలకును ఆధారమైనవాడు (అన్ని ఆత్మలను ధరించువాడు) ; షడ్భావ వికారములు లేనివాడు.
163.నియమః --- శాసన కర్త; నియమములనేర్పఱచి, నియంత్రించి, నడపువాడు; భక్తుల శత్రువులను నిగ్రహించువాడు.
164.యమః --- పరిపాలించువాడు. సమస్తమును (ప్రకృతి శక్తులను) వశము చేసుకొన్నవాడు; జీవుల హృదయములందు అంతర్యామియై నడిపించువాడు.
శ్లోకం 18సవరించు
165.వేద్యః --- తెలిసికొనబడువాడు; తెలిసికొన దగినవాడు (మోక్షగాములకు).
166.వైద్యః --- విద్య లన్నియును తెలిసినవాడు, సర్వజ్ఞుడు; జనన మరణ చక్రమునుండి తన భక్తులను ముక్తులోనరింప నెరిగినవాడు; భవరోగ బంధన విమోచకమగు ఔషధ విద్యయందు ప్రవీణుడు.
167.సదాయోగీ --- భక్తులపట్ల ఎల్లపుడు జాగరూకుడై అందుబాటులోనుండెడివాడు; సర్వవ్యాపియై విశ్వమును అవిచ్ఛిన్నముగా నిలుపువాడు; సదా ధర్మమార్గానువర్తి యైనవాడు; యోగచింతనలో నిమగ్నుడైన సచ్చిదానంద పూర్ణ బ్రహ్మము; ఎల్లపుడు సమత్వ భావన కలిగినవాడు.
168.వీరహా --- బలవంతులగు దుష్టులను నాశనము చేయువాడు.
169.మాధవః --- (73, 169, 741 నామములు) మా ధవః -శ్రీమహాలక్ష్మి (మా) కి భర్త ; మధువిద్య (మౌనము, ధ్యానము, యోగము) ద్వారా తెలిసికొనబడువాడు; సకల విద్యా జ్ఞానములకు ప్రభువు; పరమాత్మను గూర్చిన జ్ఞానము ప్రసాదించువాడు; మధు (యాదవ) వంశమున పుట్టినవాడు; తనకు వేరు ప్రభువు లేనివాడు (అందరకు ఆయనే ప్రభువు) ; మౌనముగానుండి, సాక్షియై నిలచువాడు; బ్రహ్మ విద్యను ప్రసాదించువాడు.
170.మధుః --- భక్తులకు తేనెవలె, అమృతమువలె అత్యంత ప్రియమైనవాడు; మంగళకరమగు జ్ఞానమయుడు.
171.అతీంద్రియః --- ఇంద్రియములకు అందనివాడు (ఇంద్రియముల ద్వారా తెలియరానివాడు).
172.మహామాయః --- అధిగమింపజాలని మాయామయుడు
173.మహోత్సాహః --- గొప్ప ఉత్సాహముతో కార్యాచరణ కావించువాడు; అంతులేని సహనముతో జగత్తును భరించువాడు.
174.మహాబలః --- అనంతమగు, అద్భుతమగు బలము కలవాడు; బలవంతులకంటె బలవంతుడు; అందరికిని (భక్తులకు) వివిధ బలములను ప్రసాదించువాడు (జీవనాధారము).
శ్లోకం 19సవరించు
175.మహాబుద్ధిః --- అనంతమగు బుద్ధి (జ్ఞానము, విచక్షణ, గ్రహణము) కలవాడు; అన్ని ప్రాణులలోను బుద్ధికి కారణమైనవాడు.
176.మహావీర్యః --- సకల సృజనాత్మక దివ్య శక్తులకును ఆఆరము; అచంచల మూర్తి; సృష్టిలోని చేతనత్వమంతా భగవంతుని అంశయే.
177.మహాశక్తిః --- సృష్ట్యాది సకల కార్యములకును ఆరణమగు శక్తిగలవాడు; క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తుల సంగమమైన అనంత శక్తి సంపన్నుడు; అన్ని శక్తులకు, అందరిలోని శక్తులకు మూలము. మహిమాన్విత శక్తిపరుడైన భగవానుడు. భగవానుని యందలి ఇచ్చాశక్తిచే సృష్టి ఊహించబడెను. ఆ పరమాత్మ యందలి జ్ఞానశక్తిచే సృష్టిక్రమము నిర్వహించబడెను. ఆ పావనాత్ముని యందలి క్రియాశక్తిచే క్రియారూపము దాల్చెను. ఈవిధంగా తనలోని శక్తిత్రయ ప్రభావముచే భగవానుడు సృష్టికార్యమును నిర్వహించెను. అందుచేత అతను మహాశక్తి అని పిలువబడెను.
178.మహాద్యుతిః --- అసమానమగు దివ్యమైన కాంతితో విరాజిల్లువాడు, తేజోమయుడు; సృష్టిలోని కాంతి అంతయు భగవంతుని ప్రకాశము వలననే కలుగుచున్నది.
179.అనిర్దేశ్యవపుః --- వర్ణించుటకు వీలు కానట్టి, ఊహింపనలవి కానట్టి దివ్య మంగళ మూర్తి.
180.శ్రీమాన్ --- (22, 180, 222 నామములు) దివ్యాభరణ శోభితుడు; సౌందర్యమూర్తి; సుందరాంగుడు; లక్ష్మీ వల్లభుడు; సకలైశ్వర్యయుతుడు.
181.అమేయాత్మా --- తెలియరాని స్వరూపము గలవాడు; ఊహింపరాని తత్వమూర్తి; దివ్య గాంభీర గుణ సంపన్నుడు.
182.మహాద్రిధృత్ --- / మహాద్రిధృక్ --- గొప్ప కొండలను ధరించినవాడు; క్షీరసాగర మథనమున శ్రీకూర్మమూర్తియై మందర గిరిని, చిన్నికృష్ణునిగా గోవర్ధన గిరిని ఎత్తినవాడు.
శ్లోకం 20సవరించు
183.మహేష్వాసః --- తిరుగులేని, గొప్ప బాణములు ప్రయోగించువాడు; బ్రహ్మాండమగు ధనుస్సును ధరించినవాడు; గొప్ప విలుకాడు.
184.మహీభర్తా --- భూభారమును వహించినవాడు - ఆదికూర్మమై భూమిని భరించియుండు కూర్మావతార మూర్తి, పాతాళాంతర్గతయైన భూదేవిని ఉద్ధరించిన భూవరాహమూర్తి.
185.శ్రీనివాసః --- సిరికి నిలయమైనవాడు, శ్రీమహాలక్ష్మికి తన హృదయమే నివాస స్థానముగా నున్నవాడు.
186.సతాంగతిః --- సత్పురుషులకు, ముముక్షువులకు పరమగతియైనవాడు.
187.అనిరుద్ధః --- ఎవరివల్లను, ఎన్నడైనను నిరోధింపబడనివాడు; అపరిమిత చేష్టామూర్తి.
188.సురానందః --- దేవతలకు ఆనందము ప్రసాదించు దేవదేవుడు.
189.గోవిందః --- దేవతలచే ప్రస్తుతింపబడు దేవదేవుడు; మహార్ణవమునుండి భూమిని ఉద్ధరించిన శ్రీవరాహమూర్తి; గోవులను కాచేటి గోపాలుడు; వేదములనొసగిన, వేదముల ద్వారా పొందదగినవాడు, వేదవేద్యుడు.
190.గోవిదాం పతిః --- వేదార్ధములనెఱిగిన జ్ఞానులకు రక్షకుడు.
శ్లోకం 21సవరించు
191.మరీచిః --- కాంతి, కిరణము, తేజోమయుడు; తేజోవంతులలో దివ్యతేజోమూర్తి.
192.దమనః --- సంసార భారమును తొలగించి, బంధ విముక్తినొసగువాడు; అధర్మమార్గమున చరించువారిని శిక్షించువాడు; తన దివ్య తేజస్సుచే సమస్త ప్రాణుల తాపములను హరించువాడు.
193.హంసః --- భక్తులకు సంసార భయమును పోగొట్టువాడు; హంసవంటి గుణములు గలవాడు, హంసావతారమును ధరించినవాడు; సోహం అని తెలిపిన పరబ్రహ్మము; అన్ని శరీరములందలి అంతర్యామి.
194.సుపర్ణః --- చక్కనైన రెక్కలు గలవాడు (గరుత్మంతుడు, హంస) ; జ్ఞానము, కర్మ అను అందమైన రెక్కలనధిరోహింపజేసి సంసార సాగరమును తరింపజేయువాడు.
195.భుజగోత్తమః --- ఆదిశేషునకు ప్రభువు, శేషశాయి; సర్పములలో ఉత్తముడు (అనంతుడు, వాసుకి) ; వ్యాపనము, చలనము కలిగినవానిలో ఉత్తముడు (సర్వవ్యాపి).
196.హిరణ్యనాభః --- బంగారమువంటి, కళ్యాణప్రథము, మనోహరమునగు నాభియందు చతుర్ముఖ బ్రహ్మకు ఆధారమైనవాడు; బ్రహ్మను కన్న తండ్రి.
197.సుతపాః --- అత్యుత్తమ జ్ఞానమునకు ఆలవాలము; మూర్తీభవించిన తపము; బదరికాశ్రమమున నరనారాయణ రూపమున గొప్ప తపసు నాచరించినవాడు.
198.పద్మనాభః --- బొడ్డు తామరపూవు గలవాడు (బ్రహ్మకు జన్మస్థానము) ; అందరి హృదయ కమలములందు వసించువాడు; జ్ఞానమునకు నిలయము; బహు మనోహరుడు.
199.ప్రజాపతిః --- సకలజీవులకును ప్రభువు; బ్రహ్మాదులకు ప్రభువు.
శ్లోకం 22సవరించు
200.అమృత్యుః --- మరణము గాని, నాసనము గాని లేనివాడు.
201.సర్వదృక్ --- విశ్వ దర్శియై మహాజ్ఞానముతో జీవులు చేయు సర్వ కర్మలు చూచుచుండువాడు.
202.సింహః ---సింహము; నరసింహావతారము; పాపములను నశింపజేయువాడు.
203.సంధాతా --- జీవులను వారి కర్మఫలములకు ముడివేయు (అనుసంధానించు) వాడు; నిత్యము ఆశ్రితులను చేరదీయువాడు.
204.సంధిమాన్ --- భక్తులందు ఐక్యమై యుండువాడు; తాను స్వయముగా జీవరూపుడై కర్మఫలములను అనుభవించువాడు.
205.స్థిరః --- భక్తుల పట్ల బాంధవ్యము నిలకడగా గలాడు; నిశ్చలుడు, నిర్వికారుడు, నిత్యుడు.
206.అజః --- పుట్టుకలేనివాడు (స్తంభమునుండి అవతరించిన శ్రీనారసింహమూర్తి) ; అడ్డంకులను తొలగించువాడు; భక్తుల హృదయములందు చరించువాడు; భక్తుల మనములోని అజ్ఞానము హరించువాడు; సకల శబ్దములకును మూలము ('అ'కారము)
207.దుర్మర్షణః --- ఎదురులేనివాడు, అడ్డులేనివాడు; అసురులకు భరింపశక్యముగాని వాడు.
208.శాస్తా --- బోధించువాడు, జగద్గురువు; శాసించువాడు, భక్తుల మార్గము నవరోధించువారిని శిక్షించువాడు.
209.విశ్రుతాత్మా --- జగమంతయు విస్తృతముగా ఎవరి అద్భుత లీలా మహాత్మ్యములను గానము చేయునో ఆ దేవదేవుడు; సత్యము, జ్ఞానము, పరబ్రహ్మము - ఇత్యాది విశిష్ట నామములచే స్తుతింపబడు అనంతగుణ సంపన్నుడు; వివిధ స్వరూపములుగా కీర్తింపబడు సహస్రమూర్తి; విశేష, షడ్గుణ్య పరిపూర్ణ, పరమాత్మ.
210.సురారిహా --- దేవతల శతృవులను హరించువాడు.
211.గురుర్గురుతమః --- గురువులకు గురువు; గురువులందు సర్వశ్రేష్ఠుడు;
గురుః --- సర్వ విద్యలూ నేర్పు భగవానుడు;
గురుతమః --- ఆచార్యులకు పరమాచార్యుడు. (శంకరాచార్యులు 'గురుః', 'గురుతమః' అను రెండు నామములుగా పరిగణించిరి. పరాశర భట్టు 'గురుతమ గురువు' అనే ఒకేనామముగా పరిగణించిరి.
212.ధామ --- పరమపదము, అత్యుత్తమ నివాస స్థానము; సకల జీవులు చేరవలసిన పరమోత్కృష్ట స్థానము; ప్రళయమున చరాచరాధార భూతుడు; మార్గదర్శి; పరంజ్యోతి, దివ్య ప్రకాశము; సకల కామితార్ధములకును నిలయము.
213.సత్యః --- మంచి చేయునది; మేలు చేయువాడు.సత్యస్వరూపుడు.
214.సత్యపరాక్రమః --- నిజమైన, అనన్యమైన, తిరుగులేని పరాక్రమము కలవాడు; సత్ప్రవర్తనకు అండగా నిలుచు పరాక్రమము గలవాడు.
215.నిమిషః --- యోగనిద్రలో నున్నవాడు; తన భక్తుల శత్రువులపై కటాక్షవీక్షణలు పడనీయనివాడు (భక్తుల శతృవులయందు దయచూపనివాడు)
216.అనిమిషః --- ఎల్లపుడు కనులు తెరచియుండువాడు; భక్తుల రక్షణలో సదా మెలకువగా నుండువాడు.
217.స్రగ్వీ --- వైజయంతీ మాలను ధరించినవాడు; సూర్య చంద్రాది సమస్తలోకమును మాలగా ధరించినవాడు.
218.వాచస్పతిః --- వాక్కునకు ప్రభువు; గురువులకు గురువు, విద్యలకు విద్య; వేదములకు మూలము.
219.ఉదారధీః --- ఉదారమగు (కరుణాపూరితమగు) బుద్ధి (గుణము) కలిగినవాడు.
వాచస్పతి ఉదారధీః --- పరమశ్రేష్టమగు దివ్యజ్ఞానము. (శంకరాచార్యులు ఒకే నామముగా పరిగణించారు.)
శ్లోకం 24సవరించు
220.అగ్రణీః --- ముందుండి గమ్యస్థానమునకు దారిచూపువాడు, భక్తులకు ఉత్తమగతికి మార్గము చూపువాడు, మార్గదర్శి.
221.గ్రామణిః --- సకల సముదాయములకు (సామాన్యజీవులకు, దేవతలకు, ముముక్షువులకు) నాయకుడు; అందరికిని మోక్షమార్గము చూపు పెద్దదిక్కు; సత్యసూరులకు నాధుడు.
222.శ్రీమాన్ --- (22, 180, 222వ నామములు) శ్రీ అనగా కాంతి, తేజస్సు, వైభవము, సంపద; సకల సంపదలు మూర్తీభవించిన మూర్తి, సిరిగలవాడు; సమస్త వైభవము గలవాడు, శ్రీ, ధృతి, స్మృతి, కీర్తి గలవాడు; ప్రకాశించువాడు, తేజోమూర్తి; శ్రీమహాలక్ష్మీపతి; వక్షస్థలమున శ్రీదేవిని నిలుపుకొన్నవాడు; సకల శక్తిమంతుడు. 'శ్రీ' అనగా లక్ష్మీదేవి. సదా లక్ష్మీదేవితో కూడి యుండువాడు - విష్ణుమూర్తి. ఆదిదేవుని వక్షస్థలమున లక్ష్మీదేవి సదా వసించుచుండెను. లక్ష్మీదేవి ఐశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మీదేవిని తన వక్షస్థలమున ధరియించిన ఆదిదేవుడు. 'వక్షస్థలము' హృదయమును సూచించుటచే హృదయములో కల్యాణ సంపద కలిగియున్నవాడని భావము.
223.న్యాయః --- భక్తులకు తగురీతిలో (మోక్ష) ఫలము ప్రసాదించువాడు; పరబ్రహ్మజ్ఞానమునకు దారిచూపు తర్ము, యుక్తి; విశ్వమందు అంతటిని సక్రమముగా నియమముగా నడుపు శక్తి.
224.నేతా --- భక్తుల కోరికలను తీర్చువాడు; విశ్వమునందన్ని వ్యవహారములను నిర్వహించు అధికారి; భక్తులను తన నేతృత్వములో సన్మార్గ మోక్షమార్గములకు చేర్చువాడు.
225.సమీరణః --- అద్భుతమైన, మనోహరమైన కార్యములను నిర్వర్తించువాడు; ప్రాణమునకు కావలసిన వాయువు తానే అయి ఉన్నవాడు; సకల జీవుల శ్వాసను, తదితర చైతన్యమును నడపువాడు.
226.సహస్రమూర్ధా --- వేయి (లెక్క పెట్టలేనన్ని) శిరసులు గలవాడు;అంతటను ఉండువాడు.
227.విశ్వాత్మా --- విశ్వమునకే ఆత్మ; సకల భూతములకును అంతస్థితుడైన ఆద్యుడు.
228.సహస్రాక్షః --- వేయి (లెక్క పెట్టలేనన్ని) కన్నులు గలవాడు; అంతటిని చూచుచుండువాడు.
229.సహస్రపాత్ --- వేయి (లెక్క పెట్టలేనన్ని) పాదములు గలవాడు; అన్ని చోట్ల చరించువాడు.
శ్లోకం 25సవరించు
230.ఆవర్తనః --- సంసార చక్రమును పరిభ్రమింపజేయువాడు.
231.నివృత్తాత్మా --- (231, 454, 604, 780 నామములు) అన్నింటికంటె మహోన్నతమగు పరమపద తత్వమూర్తి; సంసార చక్రమును త్రిప్పువాడైనను కోర్కెలకు అతీతుడైనవాడు, మాయాతీతుడు; నివృత్తి ధర్మమును పాటించువారికి ఆత్మస్వరూపుడు; సంసార బంధములకు అతీతుడు; నిత్యవిభూతి యనెడు స్వరూపము గలవాడు.
232.సంవృతః --- కప్పబడియుండువాడు (తెలియజాలనివాడు) ; తమోగుణముచే మూఢులగువారికి కన్పించనివాడు; అజ్ఞానులైన మానవుల దృష్టికి మృగ్యుడై యున్నవాడు.
233.సంప్రమర్దనః --- చీకటిని, అజ్ఞానమును, మాయను పారద్రోలువాడు; (రుద్రుడు, యముడు వంటి రూపములలో) దండించువాడు; దుష్టులను మర్దించువాడు (హింసించు వాడు).
234.అహఃసంవర్తకః --- సూర్యుని రూపముననుండి దినములను (కాల చక్రమును) చక్కగా ప్రవర్తింపజేయువాడు.
235.వహ్నిః --- సమస్తమును వహించువాడు (భరించువాడు) ; దేవతలకు హవిస్సునందించు అగ్నిహోత్రుడు.
236.అనిలః --- (236, 818 నామములు) వాయువు; ప్రాణమునకు ఆధారమైన ఊపిరి; ప్రేరణ లేకుండానే (వేరెవరు చెప్పకుండానే) భక్తుల కోర్కెలు తీర్చువాడు; ఆది లేనివాడు (తానే స్వయముగా ఆది.) ; సంగమము (బంధము) లేకుండా, మంచి చెడులకు అతీతమైనవాడు; కరిగిపోనివాడు; సర్వజ్ఞుడు; భక్తులకు సులభముగా అందువాడు; స్థిరమైన నివాసము (నిలయము) లేనివాడు; ఇల (భూమి) ఆధారము అవుసరము లేనివాడు; అన్నిచోట్ల ఉండువాడు (ఎక్కడో దాగని వాడు) ; సదా జాగరూకుడైనవాడు.
237.ధరణీధరః --- భూమిని ధరించువాడు (భరించువాడు, పోషించువాడు).
శ్లోకం 26సవరించు
238.సుప్రసాదః --- అనంతమైన దయగలవాడు; అనుగ్రహ స్వరూపుడు; శుభకరమగు ఫలములను ప్రసాదించువాడు.
239.ప్రసన్నాత్మా --- సర్వకాల సర్వావస్థలయందును ప్రసన్నమైన, ప్రశాంతమైన మనసు గలవాడు; రాగాదులచే ప్రభావితము కానివాడు.
240.విశ్వసృట్, విశ్వసృడ్ --- విశ్వమును సృజించినవాడు;
విశ్వధృగ్ --- విశ్వమును తన అధీనములో ధరించి, బాగోగులు గమనించువాడు.
(పాఠాంతరములు) విశ్వసృగ్, విశ్వసృష్ట్
241.విశ్వభుగ్విభుః --- 'విశ్వ భుగ్ విభుః' అంతటను వ్యాపించి అన్నింటిని రక్షించువాడు.
శంకరాచార్యులు రెండు వేరువేరు నామములుగా వ్యాఖ్యానించిరి.
విశ్వభుగ్ --- జీవరూపమున విశ్వమును అనుభవించువాడు, భక్షించువాడు; అన్ని అనుభూతులను తనయందు లీనము చేసికొనును; అన్ని దిశలందును విస్తరించి విశ్వమును ఏర్పరచాడు
విభుః --- హిరణ్య గర్భుడై, అనేక రూపములు ధరించి, విశ్వమంతయును నిండి వెలుగుచున్న పరమేశ్వరుడు; సర్వము తానె యైనవాడు; అన్ని చోట్ల అన్నింటిని నింపువాడు; విశ్వమునకు ప్రభువు.
242.సత్కర్తా --- సజ్జనులను, పుణ్యవర్తనులను, ధర్మాత్ములను ఆదరించువాడు, సత్కరించువాడు.
243.సత్కృతః --- పూజనీయులచేత కూడా పూజింపబడువాడు; లోకైక పూజ్యుడు.
244.సాధుః --- (భక్తుల క్షేమమునకు అవుసరమైన పనిని) సాధించువాడు; సాధువర్తనుడు, సదాచార సంపన్నుడు.
245.జహ్నుః --- గుహ్యమైనవాడు, కానరానివాడు (మూఢులను విడనాడువాడు) ; ప్రళయకాలమున సమస్తమును లయము చేయువాడు; దోషులకు దూరముగానుండువాడు.
246.నారాయణః --- సకలాత్మలకు ఆధారమైనవాడు, జీవసముదాయములకు ఆశ్రయుడు; జగత్తంతయును (లోపల, వెలుపల) వ్యాపించియున్నవాడు; జలములకు (నారములకు) ఆధారము, జలములే నివాసము అయినవాడు; ప్రళయకాలమున జీవులకు నిలయమగువాడు.
247.నరః --- నాశనము (తుది) లేనివాడు; నడపించువాడు, నాయకుడు; నిత్యమగు చేతనాచేతనములకు విభూతిగా గలవాడు; జీవులను కర్మానుసారము ఉత్తమగతికి నడపువాడు..
శ్లోకం 27సవరించు
248.అసంఖ్యేయః --- లెక్కకు అందనన్ని, అనంతములైన గుణ, స్వరూప, నామములు కలవాడు.
249.అప్రమేయాత్మా --- కొలుచుటకు, పోల్చుటకు శక్యము కాని స్వరూపాదులు కలవాడు; ప్రత్యక్షముగాగాని, పరోక్షముగా గాని తెలిసికొన శక్యము కాని, ఎట్టి ప్రమాణములచేతను నిర్వచించుటకు వీలుగాని దివ్యాత్మ స్వరూపుడు; ఏ విధమైన జ్ఞానము చేతను పూర్తిగా అర్ధము కానివాడు.
250.విశిష్టః --- అతిశయించి యున్న వాడు; అన్నింటినీ మించువాడు, అందరికంటే అధికుడు; ఎవరిపైనా ఆధారపడనివాడు.
251.శిష్టకృత్ --- తన భక్తులను సదాచార సంపన్నులుగాను, ఉన్నతులుగాను చేయువాడు; శాసనము చేయువాడు.
252.శుచిః --- (157, 252 నామములు) పవిత్రమైనవాడు; పవిత్రము చేయువాడు.
253.సిద్ధార్థః --- సకలార్ధములు సిద్ధించినవాడు, సంపూర్ణుడు, నిత్యపూర్ణుడు.
254.సిద్ధసంకల్పః --- సిద్ధించిన సంకల్పము కలవాడు, అన్నికోరికలు నెరవేరినవాడు.
255.సిద్ధిదః --- భక్తులకు సిద్ధులను ప్రసాదించువాడు.
256.సిద్ధిసాధనః --- సిద్ధిని పొందుటకు సాధనమైనవాడు.
శ్లోకం 28సవరించు
257.వృషాహీ --- అనేక వృషాహములు (ధర్మ దినములు) ద్వారా సేవింపబడువాడు; ఇతనిని పందే మొదటి రోజు సకల శ్రేయస్సులకు ప్రారంభ దినములాగా ధర్మరూపముగా నుండును; ధర్మ స్వరూపుడై ప్రకాశించువాడు; తన భక్తులను ధర్మపరాయణులుగా చేసి పగటివలె వెలిగించువాడు; వృషాహ యజ్ఞమునకు దేవత; అగ్నివలె తేజోమయుడు, అన్ని తేజములకు ఆధారమైనవాడు. (దినమే సుదినము, సీతారామ స్మరణే పావనము, అక్కరతోడ భద్రాచలమునను చక్కని సీతారాముల జూచిన ఆ దినమే సుదినము)
258.వృషభః --- భక్తులపై కామితార్ధములు వర్షించు కరుణామూర్తి; అమృతమును వర్షించి సంసార తాపమును ఉపశమింపజేయువాడు; ధర్మమూర్తియై వెలుగొందువాడు.
259.విష్ణుః --- (2, 259, 663 నామములు) అంతటను వ్యాప్తిని పొంది భక్తులను ఎల్లెడల బ్రోచువాడు; కొండలంత వరములు గూపెడి కోనేటి రాయడు.
260.వృషపర్వా --- తనను చేరుకొనుటకై ధర్మము అను మెట్లదారిని ప్రసాదించినవాడు.
261.వృషోదరః --- ధర్మమును ఉదరమున ధరించినవాడు; ప్రళయ (వర్ష) కాళమున సమస్తమును ఉదరమున భద్రపరచువాడు; యజ్ఞయాగాదులలో అర్పించిన ఉపచారములను గ్రహించు ఉదరము కలిగినవాడు; ధర్మ నిర్వర్తకులగు బ్రహ్మాదులు ఆయన ఉదరమునుండి జన్మించిరి; ఉదరమున అగ్నిని ధరించినవాడు; భక్తులను కడుపులో పెట్టుకొని కాచువాడు.
262.వర్ధనః --- వర్ధిల్ల జేయువాడు;వృద్ధి పరంపరలు కలిగించువాడు; ఆశ్రితుల శ్రేయస్సును వృద్ధినొందించువాడు.
263.వర్ధమానః --- వర్ధిల్ల జేయుటయే గాక, అన్ని రూపములు తానై స్వయముగా వృద్ధి పొందువాడు.
264.వివిక్తః --- విలక్షణమైనవాడు, ప్రత్యేకమైనవాడు; లోకోత్తర చరిత్రుడగుటచే ఏకాంతి అయినవాడు; వేరెవరితోను, వేనితోను పోలిక గాని, బంధము గాని లేని నిర్లిప్తుడు.
265.శ్రుతిసాగరః --- వేదములకు సాగరము వంటివాడు; వేదములకు మూలము, వేద జ్ఞానమునకు పరమార్ధము ఆయనే.
శ్లోకం 29సవరించు
266.సుభుజః --- అందమైన భుజములు గలవాడు; జగద్రక్షకుడు, భక్త వరదుడు. (ఇందరికి నభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి)
267.దుర్ధరః --- ఎవరిచేతను ఆపబడజాలని భుజబలము కలవాడు (ఎదురు లేనివాడు) ; తెలిసికొనుటకు అందనివాడు (తెలియరాని వాడు) ; మనసులో నిలుపుకొనుటకు కష్టమైనవాడు (నిలువరాని వాడు) ; మరి దేనిచేతను ధరింపజాలనివాడు (భరింపరానివాడు)
268.వాగ్మీ --- మధురమైన, ప్రియమైన, స్తుతింపదగిన వాక్కుగలవాడు; శక్తిపూరితమైన వాక్కు గలవాడు; వేదములు ఆయన వాక్కునుండి ఉద్భవించెను.
269.మహేంద్రః --- మహత్తరమగు, అనన్యమగు ఈశ్వర్యము గలవాడు, సిరిగలవాడు; ఇంద్రునకును, దేవతలకును దేవుడు; అన్ని వెలుగులకు మూలము.
270.వసుదః --- సంపదల నిచ్చువాడు; భక్తుల అవసరములకు సకాలములో షడ్గుణైశ్వర్య సంపదలనే ధనము నిచ్చువాడు.
271.వసుః --- తాను ఇచ్చు ధనము కూడా తానే ఐనవాడు; జ్ఞానులైనవారు కాంక్షించు సంపద వాసుదేవుడే (ముంగిట నల్లదివో మూలనున్న ధనము).
272.నైకరూపః --- అనేక రూపములతో వెలయు విశ్వరూపుడు; ఒక రూపము అనికాక అనేక అవతారములు గలవాడు; (అన్ని రూపములు నీ రూపమైనవాడు, ఆది మధ్యాంతములు లేక అలరువాడు).
273.బృహద్రూపః --- మహాద్భుతమైన పెద్ద రూపము గలవాడు; వరాహ, నారసింహ, త్రివిక్రమ వంటి బ్రహ్మాండ స్వరూపములు గలవాడు.
274.శిపివిష్టః --- కిరణముల స్వరూపమున అంతటా వ్యాపించియున్నవాడు; యజ్ఞపశువునందు ఆవహించియున్నవాడు.
275.ప్రకాశనః --- తన విశ్వ రూపమును దర్శించు భాగ్యము భక్తులకు ప్రసాదించువాడు; సమస్తమును ప్రకాశింప జేయువాడు.
శ్లోకం 30
276.ఓజస్తేజోద్యుతిధరః --- పరిపూర్ణమగు ఓజస్సు (బలము), తేజస్సు (శతృవులను ఓడించు శక్తి), ద్యుతి (కీర్తి, కాంతి) కలిగినవాడు
277.ప్రకాశాత్మా --- ప్రకాశవంతమగు స్వరూపము గలవాడు; (మూర్ఖులు కూడా అంగీకరించేటట్లుగా, గొప్పగా) ప్రకాశించేవాడు.
278.ప్రతాపనః --- సూర్యాగ్నుల రూపమున వెలుతురును, జీవులలో ఉష్ణమును కలిగించి కాపాడువాడు; తన ఉగ్రరూపమున జగత్తును తపింపజేయువాడు; ప్రళయాగ్నియై జగత్తును లయము చేయువాడు.
279.ఋద్ధః --- అన్ని ఉత్తమ గుణములు సమృద్ధిగా కలిగిన పరిపూర్ణుడు.
280.స్పష్టాక్షరః --- స్పష్టమైన వేదాక్షరములు గలవాడు, అనగా వేదము లోని అక్షరముల ద్వారా స్పష్టమైనవాడు; దివ్యమగు ప్రణవ శబ్దము ద్వారా తెలియబడువాడు; విశ్వమును కలిపి పట్టియుంచువాడు.
281.మంత్రః --- తన నామమును మననము చేయువారిని రక్షించువాడు; వేద స్వరూపుడు, మంత్ర మూర్తి.
282.చంద్రాంశుః --- చంద్రుని కిరణములవలె (వెన్నెల వలె) చల్లగానుండి, ఆహ్లాదమును కలిగించి, సంసార తాపమును శమింపజేయువాడు; సస్యములను పోషించువాడు.
283.భాస్కరద్యుతిః --- సూర్యుని వంటి తేజస్సు గలవాడు; శత్రుదుర్నిరీక్ష్య పరాక్రమశీలి; సూర్యునికి కాంతిని ప్రసాదించువాడు.
శ్లోకం 31సవరించు
284.అమృతాంశూద్భవః --- అమృత కిరణ్మయుడగు చంద్రుని జననమునకు కారణము, చంద్రుని తన మనస్సునుండి పుట్టించినవాడు; జలములను వ్యాపింపజేసి జీవులను సృష్టించువాడు.
285.భానుః --- ప్రకాశించువాడు, కిరణ్మయుడు, సూర్యుడు; సూర్యునకు కూడా వెలుగును ప్రసాదించువాడు.
286.శశబిందుః --- దుర్మార్గులను విడనాడువాడు, శిక్షించువాడు; చంద్రుడు (కుందేలు వంటి మచ్చ గలవాడు) ; నక్షత్రముల, గ్రహముల గతులను నియంత్రించువాడు.
287.సురేశ్వరః --- దేవతలకు ప్రభువు; సన్మార్గమున నడచువారికి అండ.
288.ఔషధం --- భవరోగమును, భయంకరమగు జనన మరణ జరావ్యాధి పూరితమగు సంసారమను వ్యాధిని నయముచేయు దివ్యమగు నివారణ. (పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటిరాయడా! చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా, రోగాలడచి రక్షంచే దివ్యౌషధమా!)
289.జగతస్సేతుః --- మంచి, చెడుల మధ్య అడ్డుగా నిలచినవాడు; సంసారసాగరమును దాటుటకు ఉపయోగపడు వంతెన; చలించుచున్నవానిని అదుపులోనుంచువాడు; ప్రపంచమునకు, జీవునకు వంతెన వంటివాడు..
290.సత్యధర్మపరాక్రమః --- సదా నిజమైన ధర్మగుణము, పరాక్రమము కలిగినవాడు.
శ్లోకం 32సవరించు
291.భూతభవ్యభవన్నాథః --- మూడు కాలములకును (గడచినది, జరుగుచున్నది, రాబోవునది) అధిపతి; మూడు కాలములందును అందరికి అన్నింటికి అధిపతి.
292.పవనః --- వాయువు, ప్రాణము; సంచరించేవాడు, సర్వత్ర వ్యాపించియుండువాడు.
293.పావనః --- అంతటినీ పవిత్రము చేయువాడు.
294.అనలః --- తృప్తిలేని (తరగని) దయ గలిగినవాడు (దాశరథీ! కరుణా పయోనిధీ!) ; అగ్ని; పాప వినాశకుడు.
295.కామహా --- కోరికలను (భక్తులకు తగని కామములను) నాశనము చేయవాడు.
296.కామకృత్ --- భక్తుల అభీష్టములను నెరవేర్చువాడు; కోర దగినవానిని సృష్టించువాడు; భక్తులకు తగిన మోక్షమును ప్రసాదించువాడు.
297.కాంతః --- అతి మనోహరుడు, సమ్మోహన రూపుడు, ఆత్మ బంధువు (నల్లనివాడు, పద్మ నయనమ్ములవాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడు, సుధా రసమ్ము పై జల్లువాడు - నీదు పలుకె పలుకురా! నీదు కులుకె కులుకురా! నీదు తళుకె తళుకురా! నిజమైన త్యాగరాజనుత! ఎందు కౌగిలింతురా? నిన్నెంతని వర్ణింతురా!)
298.కామః --- ప్రేమ స్వరూపుడు, కోరుకొన దగినవాడు, మన్మధుడు; ధర్మార్ధకామమోక్షములను అభిలషించువారిచే కోరబడువాడు.
299.కామప్రదః --- కోరినవి ఇచ్చేవాడు (కొండలంత వరములు గూపెడు కోనేటిరాయడు).
300.ప్రభుః --- (35, 300 నామములు) అందరికంటె అధికుడు; అందరిని అధిగమించువాడు; అందరి మనస్సులను తనవైపు లాగుకొను అధిష్ఠాత; ఘటనాఘటన సమర్ధుడు; దేవాధిదేవుడు.
శ్లోకం 33సవరించు
301.యుగాదికృత్ --- యుగమును ఆరంభించువాడు; యుగములను సృష్టించి యుగారంభమున సృష్టికార్యము చేయువాడు; వటపత్రశాయి.
302.యుగావర్తః --- యుగములను ప్రవర్తింపజేయువాడు, కాల చక్రమును నడుపువాడు; కాల స్వరూపుడు.
303.నైకమాయః --- అనేకములైన అద్భుతములకు ఆలవాలమైనవాడు; ఎన్నోవిధములైన మాయా స్వరూపములను ధరించువాడు.
304.మహాశనః --- విపరీతమైన ఆకలి గలవాడు, కల్పాంతమున సమస్తమును భక్షించువాడు; ప్రళయకాలమున అంతటిని తనయందు లయమొనర్చుకొనువాడు; గొప్పగా వ్యాపించినవాడు.
305.అదృశ్యః --- కానరానివాడు; ఇంద్రియ, మనోబుద్ధులకు కనరాని, ఊహింప శక్యము గాని చరిత్ర గలవాడు (ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా? ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా?).
306.వ్యక్తరూపః--- స్పష్టమైన రూపము కలవాడు, భక్తులకు దర్శనమొసగువాడు; స్వయంప్రకాశకుడు, అవతార మూర్తి, ప్రత్యక్షదైవము; యోగముచే కనుపించు రూపము కలవాడు.
అవ్యక్తరూపః --- తెలియరానివాడు.
307.సహస్రజిత్ --- వేలాది యుగములను జయించువాడు; వేలాది రాక్షసులను జయించువాడు (రామేణాభిహతా నిశాచర చమూ రామాయ తస్మై నమః)
308.అనంతజిత్ --- అంతులేని విజయములు కలిగినవాడు; అవధులు లేకుండా ప్రకాశించేవాడు; తన అనంత మహిమలను ఇతరులెరుగజాల నట్టివాడు.
301) యుగావర్త: - యుగములను త్రిప్పువాడు.
302) నైకమాయ: - తన మాయాశక్తిచే అనేక రూపములను ధరించి, ప్రదర్శించువాడు.
303) మహాశన: - సర్వమును కబళించువాడు.
304) అదృశ్య: - దృశ్యము కానివాడు.
30వ్యక్తరూప: - భక్తుల హృదయములలో వ్యక్తరూపుడై భాసిల్లువాడు.
306) సహస్రజిత్ - వేలకొలది రాక్షసులను సంగ్రామమున జయించువాడు.
307) అనంతజిత్ - అనూహ్యమైన శక్తి సామర్ద్యములు కలవాడై, రణరంగమున ఎదిరించువారిని జయించు శక్తి కలవాడు.
308) ఇష్ట: - ప్రియమైనవాడు.
309) అవిశిష్ట: - సర్వాంతర్యామియైనవాడు.
310) శిష్టేష్ట: - బుధజనులైన సాధుమహాత్ములకు ఇష్టుడైనవాడు.
311) శిఖండీ - శిరమున నెమలిపింఛమును ధరించినవాడు.
312) నహుష: - తన మాయచేత జీవులను సంసారమునందు బంధించువాడు.
313) వృష: - ధర్మస్వరూపుడైనవాడు.
314) క్రోధహా - సాధకులలోని క్రోధమును నశింపచేయువాడు.
315) క్రోధ కృత్కర్తా - క్రోధాత్ములగువారిని నిర్మూలించువాడు.
316) విశ్వబాహు: - బాహువులు విశ్వమంతట కలవాడు.
317) మహీధర: - భూమిని ధరించినవాడు.
318) అచ్యుత: - ఎట్టి వికారములకు లోనుగానివాడు. ( ఎటువంటి మార్పు పొందనివాడు.)
319) ప్రధిత: - ప్రఖ్యాతి నొందినవాడు.
320) ప్రాణ: - అంతటా చైతన్య స్వరూపమై నిండి, ప్రాణులను కదిలించు ప్రాణస్వరూపుడు.
321) ప్రాణద: - ప్రాణ బలము ననుగ్రహించువాడు.
322) వాసవానుజ: - ఇంద్రునకు తమ్ముడు.
323) అపాంనిధి: - సాగరమువలె అనంతుడైనవాడు.
324) అధిష్టానం - సర్వమునకు ఆధారమైనవాడు.
325) అప్రమత్త: - ఏమరు పాటు లేనివాడు.
326) ప్రతిష్ఠిత: - తన మహిమయందే నిలిచియుండువాడు.
327) స్కంద: - అమృత రూపమున స్రవించువాడు.
328) స్కందధర: - ధర్మమార్గమున నిలుపువాడు.
329) ధుర్య: - సర్వ జీవుల ఉత్పత్తి మొదలగు భారములను మోయువాడు.
330) వరద: - వరముల నొసగువాడు.
331) వాయువాహన: - సప్త వాయువులను బ్రహ్మాండమంతటను ప్రవర్తింపచేయువాడు.
332) వాసుదేవ: - అంతటను నిండియున్నవాడు.
333) బృహద్భాను: - ప్రకాశవంతమగు కిరణతేజముచే విశ్వమును ప్రకాశింపచేయువాడు.
334) ఆదిదేవ: - సృష్టి కార్యమును ప్రారంభించినవాడు.
335) పురంధర: - రాక్షసుల పురములను నశింపచేసినవాడు.
336) అశోక: - శోకము లేనివాడు.
337) తారణ: - సంసార సాగరమును దాటించువాడు.
338) తార: - గర్భ, జన్మ, జరా, మృత్యురూపమైన భయమునుండి తరింపజేయువాడు.
339) శూర: - పరాక్రమము గలవాడు.
340) శౌరి: - బలవత్తరములైన ఇంద్రియ మనోబుద్ధులను అణిచినవాడు.
341) జనేశ్వర: - జనులకు ప్రభువు.
342) అనుకూల: - సర్వులకు అనుకూలుడైనవాడు.
343) శతావర్త: - ధర్మ రక్షణార్థము అనేక పర్యాయములు ఆవిర్భవించినవాడు.
344) పద్మీ - పద్మమును చేతియందు ధరించినవాడు.
345) పద్మనిభేక్షణ: - పద్మమువంటి నేత్రములు కలవాడు.
346) పద్మనాభ: - పద్మము నాభియందుండువాడు.
347) అరవిందాక్ష: - కమలరేకులవంటి కన్నులు గలవాడు.
348) పద్మగర్భ: - పద్మగర్భమున నివసించువాడు.
349) శరీరభృత్ - ప్రాణుల శరీరములను పోషించువాడు.
350) మహార్ది: - మహావిభూతులు కలవాడు.
351) బుద్ధ: - ప్రపంచాకారముతో భాసించువాడు.
352) వృద్ధాత్మా - సృష్టికి పూర్వమే ఉన్నవాడు.
353) మహాక్ష: - గొప్ప నేత్రములు గలవాడు.
354) గరుడధ్వజ: - తన పతాకమునందు గరుడ చిహ్నము కలవాడు.
355) అతుల: - సాటిలేనివాడు.
356) శరభ: - శరీరములందు ప్రత్యగాత్మగా ప్రకాశించువాడు.
357) భీమ: - భీకరమైన శక్తి సంపన్నుడు.
358) సమయజ్ఞ: - సర్వులను సమభావముతో దర్శించుటయే తన పూజగా భావించువాడు.
359) హవిర్హరి: - యజ్ఞములలో హవిర్భాగమును గ్రహించువాడు.
360) సర్వలక్షణ లక్షణ్య: - సర్వప్రమాణములచే సిద్ధించు జ్ఞానముచేత నిర్ణయింపబడినవాడు.
361) లక్ష్మీవాన్ - సదా లక్ష్మీదేవి తన వక్షస్థలమందు కలిగినవాడు.
362) సమితింజయ: - యుద్ధమున జయించినవాడు.
363) విక్షర: - నాశములేనివాడు.
364) రోహిత: - మత్స్యరూపమును ధరించినవాడు.
365) మార్గ: - భక్తులు తరించుటకు మార్గము తాను అయినవాడు.
366) హేతు: - సృష్టికి కారణము అయినవాడు.
367) దామోదర: - దమాది సాధనలచేత ఉదారమైన బుద్ధిద్వారా పొందబడువాడు.
368) సహ: - సహనశీలుడు.
369) మహీధర: - భూమిని ధరించినవాడు.
370) మహాభాగ: - భాగ్యవంతుడు.
371) వేగవాన్ - అమితమైన వేగము కలవాడు.
372) అమితాశన: - అపరిమితమైన ఆకలి గలవాడు.
373) ఉద్బవ: - ప్రపంచసృష్టికి ఉపాదానమైనవాడు.
374) క్షోభణ: - సృష్టికాలమందు కల్లోలము కల్గించువాడు.
375) దేవ: - క్రీడించువాడు.
376) శ్రీ గర్భ: - సకల ఐశ్వర్యములు తనయందే గలవాడు.
377) పరమేశ్వర: - ఉత్కృష్ట మైనవాడు.
378) కరణమ్ - జగదుత్పత్తికి సాధనము అయినవాడు.
379) కారణమ్ - జగత్తునకు కారణమైనవాడు.
380) కర్తా - సమస్త కార్యములకు కర్తయైనవాడు.
381) వికర్తా - విచిత్రమైన ప్రపంచమును రచించినవాడు.
382) గహన: - గ్రహించ శక్యముగానివాడు.
383) గుహ: - వ్యక్తము కానివాడు. కప్పబడినవాడు.
384) వ్యవసాయ: - మానవాళి అభ్యున్నతికి తానే కృషిచేయువాడు.
385) వ్యవస్థాన: - సర్వవ్యవహారములను యధావిధిగ నడుపువాడు.
386) సంస్థాన: - జీవులకు గమ్యస్థానమైనవాడు.
387) స్థానద: - వారివారి కర్మానుసారముగా స్థానముల నందించువాడు.
388) ధ్రువ: - అవినాశియై, స్థిరమైనవాడు.
389) పరర్థి: - ఉత్కృష్టమైన వైభవముకలవాడు.
390) పరమస్పష్ట: - మిక్కిలి స్పష్టముగా తెలియువాడు.
391) తుష్ట: - సంతృప్తుడు.
392) పుష్ట: - పరిపూర్ణుడు
393) శుభేక్షణ: - శుభప్రధమైన దృష్టిగలవాడు.
394) రామ: - నిత్యానంద చైతన్యములో సదా రమించువాడు.
395) విరామ: - సకలజీవులకు విశ్రాంతి స్థానమైనవాడు.
396) విరత: - విషయ వాంఛలు లేనివాడు.
397) మార్గ: - మోక్షమునకు మార్గము తానైనవాడు.
398) నేయ: - ఆత్మజ్ఞానము ద్వారా జీవులను నడిపించువాడు.
399) నయ: - జీవులను నడిపించి పరమపదస్థితికి గొనిపోవువాడు.
400) అనయ: - తనను నడుపువాడు మరొకడు లేనివాడు.
401) వీర: - పరాక్రమశాలియైనవాడు.
402) శక్తిమతాం శ్రేష్ఠ: - శక్తిమంతులలో శ్రేష్ఠుడైన భగవానుడు.
403) ధర్మ: - ధర్మ స్వరూపుడు.
404) ధర్మ విదుత్తమ: - ధర్మము నెఱింగినవారిలో శ్రేష్ఠుడు.
405) వైకుంఠ: - సృష్ట్యారంభమున పంచమహాభూతములను సమ్మేళనము చేసినవాడు.
406) పురుష: - ఈ సర్వముకంటే పూర్వమునుండువాడు.
407) ప్రాణ: - ప్రాణరూపమున చేష్ట కల్గించువాడు.
408) ప్రాణద: - ప్రాణమును ప్రసాదించువాడు. ప్రాణము లిచ్చువాడు.
409) ప్రణవ: - ఓంకార స్వరూపుడు.
410) పృథు: - ప్రపంచరూపమున విస్తరించినవాడు.
411) హిరణ్యగర్భ: - బ్రహ్మదేవుని పుట్టుకకు కారణమైనవాడు.
412) శత్రుఘ్న: - శత్రువులను సంహరించువాడు.
413) వ్యాప్త: - సర్వత్ర వ్యాపించియున్నవాడు.
414) వాయు: - వాయురూపమున యుండి సకలమును పోషించువాడు.
415) అథోక్షజ: - స్వరూపస్థితి నుండి ఎన్నడును జాఱనివాడు.
416) ఋతు: - కాలరూపమై తెలియబడు ఋతువులై భాసించువాడు.
417) సుదర్శన: - భక్తులకు మనోహరమగు దర్శనము నొసంగువాడు.
418) కాల: - శతృవులను మృత్యురూపమున త్రోయువాడు.
419) పరమేష్ఠీ - హృదయగుహలో తన మహిమచే ప్రకాశించువాడు.
420) పరిగ్రహ: - గ్రహించువాడు.
421) ఉగ్ర: - ఉగ్రరూపధారి
422) సంవత్సర: - సర్వజీవులకు వాసమైనవాడు.
423) దక్ష: - సమస్త కర్మలను శీఘ్రముగా సమర్థతతో నిర్వర్తించువాడు.
424) విశ్రామ: - జీవులకు పరమ విశ్రాంతి స్థానము అయినవాడు.
425) విశ్వదక్షిణ: - అశ్వమేధయాగములో విశ్వమునే దక్షిణగా ఇచ్చినవాడు.
426) విస్తార: - సమస్త లోకములు తనయందే విస్తరించి ఉన్నవాడు.
427) స్థావర: స్థాణు: - కదులుట మెదలుట లేనివాడు.
428) ప్రమాణం - సకలమునకు ప్రమాణమైనవాడు.
429) బీజమవ్యయం - క్షయము కాని బీజము.
430) అర్థ: - అందరిచే కోరబడినవాడు.
431) అనర్థ: - తాను ఏదియును కోరనివాడు.
432) మహాకోశ: - అన్నమయాది పంచకోశములచే ఆవరించినవాడు.
433) మహాభాగ: - ఆనంద స్వరూపమైన భోగము కలవాడు.
434) మహాధన: - గొప్ప ఐశ్వర్యము కలవాడు.
435) అనిర్విణ్ణ: - వేదన లేనివాడు.
436) స్థవిష్ఠ: - విరాడ్రూపమై భాసించువాడు.
437) అభూ: - పుట్టుక లేనివాడు.
438) ధర్మయూప: - ధర్మము లన్నియు తనయందే ఉన్నవాడు.
439) మహామఖ: - యజ్ఞస్వరూపుడు.
440) నక్షత్రనేమి: - జ్యోతిష చక్రమును ప్రవర్తింపచేయువాడు.
441) నక్షత్రీ - చంద్ర రూపమున భాసించువాడు.
442) క్షమ: - సహనశీలుడు.
443) క్షామ: - సర్వము నశించినను తాను క్షయ మెరుగక మిగిలియుండువాడు.
444) సమీహన: - సర్వ భూతహితమును కోరువాడు.
445) యజ్ఞ: - యజ్ఞ స్వరూపుడు.
446) ఇజ్య: - యజ్ఞములచే ఆరాధించుబడువాడు.
447) మహేజ్య: - గొప్పగా పూజింపదగినవాడు.
448) క్రతు: - యజ్ఞముగా నున్నవాడు.
449) సత్రమ్ - సజ్జనులను రక్షించువాడు.
450) సతాంగతి: - సజ్జనులకు పరమాశ్రయ స్థానమైనవాడు.
451) సర్వదర్శీ - సకలమును దర్శించువాడు.
452) విముక్తాత్మా - స్వరూపత: ముక్తి నొందినవాడు.
453) సర్వజ్ఞ: - సర్వము తెలిసినవాడు.
454) జ్ఞానముత్తమమ్ - ఉత్తమమైన జ్ఞానము కలవాడు భగవానుడు.
455) సువ్రత: - చక్కని వ్రతదీక్ష కలవాడు.
456) సుముఖ: - ప్రసన్న వదనుడు.
457) సూక్ష్మ: - సర్వవ్యాపి.
458) సుఘోష: - చక్కటి ధ్వని గలవాడు.
459) సుఖద: - సుఖమును అనుగ్రహించువాడు.
460) సుహృత్ - ఏ విధమైన ప్రతిఫలము నాశించకనే సుహృద్భావముతో ఉపకారము చేయువాడు.
461) మనోహర: - మనస్సులను హరించువాడు.
462) జితక్రోధ: - క్రోధమును జయించినవాడు.
463) వీరబాహు: - పరాక్రమముగల బాహువులు కలవాడు.
464) విదారణ: - దుష్టులను చీల్చి చెండాడువాడు.
465) స్వాపన: - తన మాయచేత ప్రాణులను ఆత్మజ్ఞాన రహితులుగాజేసి నిద్రపుచ్చువాడు.
466) స్వవశ: - సర్వ స్వతంత్రమైనవాడు.
467) వ్యాపీ - సర్వత్ర వ్యాపించియున్నవాడు.
468) నైకాత్మా - అనేక రూపములలో విరాజిల్లువాడు.
469) నైక కర్మకృత్ - సృష్టి, స్థితి, లయము మున్నగు అనేక కార్యములు చేయువాడు.
470) వత్సర: - సర్వులకు వాసమైనవాడు.
471) వత్సల: - భక్తులపై అపరిమిత వాత్సల్యము కలవాడు.
472) వత్సీ - తండ్రి వంటివాడు.
473) రత్నగర్భ: - సాగరము వలె తన గర్భమున రత్నములు గలవాడు.
474) ధనేశ్వర: - ధనములకు ప్రభువు.
475) ధర్మగుప్ - ధర్మమును రక్షించువాడు.
476) ధర్మకృత్ - ధర్మము నాచరించువాడు.
477) ధర్మీ - ధర్మమునకు ఆధారమైనవాడు.
478) సత్ - మూడు కాలములలో పరిణామ రహితుడై, నిత్యుడై ఉన్నవాడు.
479) అసత్ - పరిణామయుతమైన జగద్రూపమున గోచరించువాడు.
480) క్షర: - వ్యయమగు విశ్వరూపమున తెలియబడువాడు.
481) అక్షర: - క్షరమగు ప్రపంచమున అవినాశియై భాసిల్లువాడు.
482) అవిజ్ఞాతా - తెలుసుకొనువాని కంటెను విలక్షణమైనవాడు.
483) సహస్రాంశు: - అనంత కిరణములు గలవాడు.
484) విధాతా - సర్వమునకు ఆధారమైనవాడు.
485) కృతలక్షణ: - వేదశాస్త్రములను వెలువరించినవాడు.
486) గభస్తినేమి: - మయూఖ చక్రమునకు కేంద్రమైనవాడు.
487) సత్వస్థ: - అందరిలో నుండువాడు.
488) సింహ: - సింహమువలె పరాక్రమశాలియైనవాడు.
489) భూతమహేశ్వర: - సర్వ భూతములకు ప్రభువైనవాడు.
490) ఆదిదేవ: - తొలి దేవుడు.
491) మహాదేవ: - గొప్ప దేవుడు.
492) దేవేశ: - దేవదేవుడు.
493) దేవభృద్గురు: - దేవతల ప్రభువైన మహేంద్రునకు జ్ఞానోపదేశము చేసినవాడు.
494) ఉత్తర: - అందరికంటెను అధికుడై, ఉత్తముడైనవాడు.
495) గోపతి: - గోవులను పాలించువాడు.
496) గోప్తా - సర్వులను సంరక్షించువాడు.
497) జ్ఞానగమ్య: - జ్ఞానము చేతనే తెలియబడినవాడు.
498) పురాతన: - సృష్టికి పూర్వమే వున్నవాడు.
499) శరీరభూతభృత్ - శరీరముల నుత్పన్నము చేయు పంచభూతములను పోషించువాడు.
500) భోక్తా - అనుభవించువాడు.
501) కపీంద్ర: - వానరులకు ప్రభువైనవాడు.
502) భూరిదక్షిణ: - యజ్ఞ సమయములలో విశేషముగా దక్షిణ లిచ్చువాడు.
503) సోమప: - యజ్ఞముల యందు యజింపబడిన దేవతలరూపముతో సోమరసమును పానము చేయువాడు.
504) అమృతప: - ఆత్మానందరసమును అనుభవించువాడు.
505) సోమ: - చంద్రరూపమున ఓషధులను పోషించువాడు.
506) పురుజిత్: - ఒక్కడై అనేకమందిని ఎదురించి, జయించగల్గినవాడు.
507) పురుసత్తమ: - ఉత్తములలో ఉత్తముడైనవాడు.
508) వినయ: - దుష్టులను దండించి, వినయము కల్గించువాడు.
509) జయ: - సర్వులను జయించి వశపరుచుకొనువాడు.
510) సత్యసంధ: - సత్యసంకల్పములు, సత్యవాక్కులు గలవాడు.
511) దాశార్హ: - దశార్హుడనువాని వంశమున పుట్టినవాడు.
512) సాత్వతాంపతి: - యదుకులమునకు ప్రభువు.
513) జీవ: - జీవుడు.
514) వినయితా సాక్షీ - భక్తుల యందలి వినయమును గాంచువాడు.
515) ముకుంద: - ముక్తి నొసగువాడు.
516) అమిత విక్రమ: - అమితమైన పరాక్రామము గలవాడు.
517) అంభోనిధి: - దేవతలు, మనుష్యులు, పితరులు, అసురులు ఈ నాలుగు వర్గములు అంభశబ్ధార్థములు, అంభస్సులు తనయందే ఇమిడి యున్నవాడు.
518) అనంతాత్మా - అనంతమైన ఆత్మస్వరూపుడు.
519) మహోదధిశయ: - వైకుంఠమునందు క్షీరసాగరమున శేషతల్పముపై శయనించువాడు.
520) అంతక: - ప్రళయకాలమున సర్వమును అంతము చేయువాడు.
521) అజ: - పుట్టుకలేనివాడు.
522) మహార్హ: - విశేష పూజకు అర్హుడైనవాడు.
523) స్వాభావ్య: - నిరంతరము స్వరూపజ్ఞానముతో విరాజిల్లువాడు.
524) జితమిత్ర: - శత్రువులను జయించినవాడు.
525) ప్రమోదన: - సదా ఆనందమునందుండువాడు.
526) ఆనంద: - ఆనందమే తన స్వరూపముగా గలవాడు.
527) నందన: - సర్వులకు ఆనందము నొసగువాడు.
528) నంద: - విషయ సంబంధమైన సుఖమునకు దూరుడు.
529) సత్యధర్మా - సత్య, ధర్మ స్వరూపుడు.
530) త్రివిక్రమ: - మూడడుగులచే ముల్లోకములు వ్యాపించినవాడు.
531) మహర్షి: కపిలాచార్య: - వేదవిదుడైన కపిలమునిగా అవతరించినవాడు.
532) కృతజ్ఞ: - సృష్టి, సృష్టికర్త రెండును తానైనవాడు.
533) మేదినీపతి: - భూదేవికి భర్తయైనవాడు.
534) త్రిపద: - మూడు పాదములతో సమస్తము కొలిచినవాడు. వామనుడని భావము.
535) త్రిదశాధ్యక్ష: - జీవులనుభవించు జాగ్రుత, స్వప్న, సుషుప్త్య వస్థలకు సాక్షియైనవాడు.
536) మహాశృంగ: - ప్రళయకాల సాగరములోని నావను గొప్పదియైన తన కొమ్మున బంధించి సత్యవ్రతుని ఆయన అనుచరులైన ఋషులను ప్రళయము నుండి రక్షించినవాడు.
537) కృతాంతకృత్ - మృత్యువుని ఖండించినవాడు.
538) మహావరాహ: - మహిమగల వరాహమూర్తి.
539) గోవింద: - గోవులకు ఆనందాన్నిచ్చువాడు. భూమికి ఆధారభూతమైనవాడు.
540) సుషేణ: - శోభనమైన సేన గలవాడు.
541) కనకాంగదీ - సువర్ణమయములైన భుజకీర్తులు కలవాడు.
542) గుహ్య: - హృదయగుహలో దర్శించదగినవాడు.
543) గభీర: - జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము మొదలగువానిచే గంభీరముగా నుండువాడు.
544) గహన: - సులభముగా గ్రహించుటకు వీలుకానివాడు.
545) గుప్త: - నిగూఢమైన ఉనికి గలవాడు.
546) చక్రగదాధర: - సుదర్శనమను చక్రమును, కౌమోదకీ యను గదను ధరించినవాడు.
547) వేధా: - సృష్టి చేయువాడు.
548) స్వాంగ: - సృష్టి కార్యమును నిర్వహించుటకు అవసరమగు సాధన సామాగ్రి కూడా తానే అయినవాడు.
549) అజిత: - ఎవనికి తలవొగ్గనివాడై జయింపవీలుకానివాడు.
550) కృష్ణ: - నీలమేఘ శ్యాముడు.
551) దృఢ: - చలించని స్వభావము కలవాడు.
552) సంకర్షణోచ్యుత: - విశ్వమంతయు ప్రళయకాలములో కదిలిపోయినను తానూ ఏ విధమైన పరిణామము చెందనివాడు.
553) వరుణ: - తన కిరణములను ఉపసంహరించుకొను సాయంకాల సూర్యుడు.
554) వారుణ: - వరుణుని కుమారులైన వశిష్ఠుడు, అగస్త్యులుగా వ్యక్తమైనవాడు.
555) వృక్ష: - భక్తులకు అనుగ్రహఛాయ నందించువాడు.
556) పుష్కరాక్ష: - ఆకాశమంతయు వ్యాపించినవాడు.
557) మహామనా: - గొప్ప మనస్సు కలవాడు.
558) భగవాన్ - భగమను ఆరు లక్షణములు సమగ్రముగా యున్నవాడు.
559) భగహా - ప్రళయ సమయమున తన విభూతులను పోగొట్టువాడు.
560) ఆనందీ - ఆనందము నొసంగువాడు.
561) వనమాలీ - వైజయంతి అను వనమాలను ధరించినవాడు.
562) హలాయుధ: - నాగలి ఆయుధముగా కలవాడు.
563) ఆదిత్య: - అదితి యొక్క కుమారుడు. వామనుడు.
564) జ్యోతిరాదిత్య: - సూర్యునియందు తేజోరూపమై భాసిల్లువాడు.
565) సహిష్ణు: - ద్వంద్వములను సహించువాడు.
566) గతిసత్తమ: - సర్వులకు గతియై ఉన్నవాడు.
567) సుధన్వా - శార్ఙమను (శారంగ ధనువు) గొప్ప ధనువును ధరించినవాడు.
568) ఖండ పరశు: - శత్రువులను ఖండించునట్టి గొడ్డలిని ధరించినవాడు.
569) దారుణ: - దుష్టులైన వారికి భయమును కలిగించువాడు.
570) ద్రవిణప్రద: - భక్తులకు కావలిసిన సంపదలను ఇచ్చువాడు.
571) దివ: సృక్ - దివిని అంటియున్నవాడు.
572) సర్వదృగ్య్వాస: - సమస్తమైన జ్ఞానములను వ్యాపింపచేయు వ్యాసుడు.
573) వాచస్పతి రయోనిజ: - విద్యలకు పతి, మాతృగర్భమున జన్మించనివాడు.
574) త్రిసామా - మూడు సామ మంత్రములచే స్తుతించబడువాడు.
575) సామగ: - సామగానము చేయు ఉద్గాత కూడ తానే అయినవాడు.
576) సామ - సామవేదము తానైనవాడు.
577) నిర్వాణమ్ - సమస్త దు:ఖ విలక్షణమైన పరమానంద స్వరూపుడు.
578) భేషజం - భవరోగమును నివారించు దివ్యౌషధము తానైనవాడు.
579) భిషక్ - భవరోగమును నిర్మూలించు వైద్యుడు.
580) సంన్యాసకృత్ - సన్యాస వ్యవస్థను ఏర్పరచినవాడు.
581) శమ: - శాంత స్వరూపమైనవాడు.
582) శాంత: - శాంతి స్వరూపుడు.
583) నిష్ఠా - ప్రళయ కాలమున సర్వజీవులకు లయస్థానమైనవాడు.
584) శాంతి: - శాంతి స్వరూపుడు.
585) పరాయణమ్ - పరమోత్కృష్ట స్థానము.
586) శుభాంగ: - మనోహరమైన రూపము గలవాడు.
587) శాంతిద: - శాంతిని ప్రసాదించువాడు.
588) స్రష్టా - సృష్ట్యారంభమున జీవులందరిని ఉత్పత్తి చేసినవాడు.
589) కుముద: - కు అనగా భూమి, ముద అనగా సంతోషము. భూమి యందు సంతోషించువాడు.
590) కువలేశయ: - భూమిని చుట్టియున్న సముద్రమునందు శయనించువాడు.
591) గోహిత: - భూమికి హితము చేయువాడు.
592) గోపతి: - భూదేవికి భర్తయైనవాడు.
593) గోప్తా - జగత్తును రక్షించువాడు.
594) వృషభాక్ష: - ధర్మదృష్టి కలవాడు.
595) వృషప్రియ: - ధర్మమే ప్రియముగా గలవాడు.
596) అనివర్తీ - ధర్మ మార్గమున ఎన్నడూ వెనుకకు మఱలని వాడు.
597) నివృత్తాత్మా - నియమింపబడిన మనసు గలవాడు.
598) సంక్షేప్తా - జగత్తును ప్రళయకాలమున సూక్షము గావించువాడు.
599) క్షేమకృత్ - క్షేమమును గూర్చువాడు.
600) శివ: - తనను స్మరించు వారలను పవిత్రము చేయువాడు.
601) శ్రీవత్సవక్షా - శ్రీ వత్సమనెడి చిహ్నమును వక్షస్థలమున ధరించినవాడు.
602) శ్రీ వాస: - వక్షస్థలమున లక్ష్మీదేవికి వాసమైనవాడు.
603) శ్రీపతి: - లక్ష్మీదేవికి భర్తయైనవాడు.
604) శ్రీమతాంవరా: - శ్రీమంతులైన వారిలో శ్రేష్ఠుడు.
605) శ్రీ ద: - భక్తులకు సిరిని గ్రహించువాడు.
606) శ్రీ శ: - శ్రీ దేవికి నాథుడైనవాడు.
607) శ్రీనివాస: - ఆధ్యాత్మిక ఐశ్వర్యవంతులైనవారి హృదయముల యందు వసించువాడు.
608) శ్రీ నిధి: - ఐశ్వర్య నిధి.
609) శ్రీ విభావన: - సిరులను పంచువాడు.
610) శ్రీ ధర: - శ్రీదేవిని వక్షస్థలమున ధరించినవాడు.
611) శ్రీ కర: - శుభముల నొసగువాడు.
612) శ్రేయ: - మోక్ష స్వరూపుడు.
613) శ్రీమాన్ - సర్వ విధములైన ఐశ్వర్యములు గలవాడు.
614) లోకత్రయాశ్రయ: - ముల్లోకములకు ఆశ్రయమైనవాడు.
615) స్వక్ష: - చక్కని కన్నులు కలవాడు.
616) స్వంగ: - చక్కని అంగములు కలవాడు.
617) శతానంద: - అసంఖ్యాకమైన ఉపాధుల ద్వారా ఆనందించువాడు.
618) నంది: - పరమానంద స్వరూపుడు.
619) జ్యోతిర్గణేశ్వర: - జ్యోతిర్గణములకు ప్రభువు.
620) విజితాత్మ - మనస్సును జయించువాడు.
621) విధేయాత్మా - సదా భక్తులకు విధేయుడు.
622) సత్కీర్తి: - సత్యమైన యశస్సు గలవాడు.
623) ఛిన్నసంశయ: - సంశయములు లేనివాడు.
624) ఉదీర్ణ: - సర్వ జీవుల కంటెను ఉత్క్రష్టుడు.
625) సర్వతశ్చక్షు: - అంతటను నేత్రములు గలవాడు.
626) అనీశ: - తనకు ప్రభువు గాని, నియామకుడు గాని లేనివాడు.
627) శాశ్వతస్థిర: - శాశ్వతుడు స్థిరుడు.
628) భూశయ: - భూమిపై శయనించువాడు.
629) భూషణ: - తానే ఆభరణము, అలంకారము అయినవాడు.
630) భూతి: - సర్వ ఐశ్వర్యములకు నిలయమైనవాడు.
631) విశోక: - శోకము లేనివాడు.
632) శోకనాశన: - భక్తుల శోకములను నశింపచేయువాడు.
633) అర్చిష్మాన్ - తేజోరూపుడు.
634) అర్చిత: - సమస్త లోకములచే పూజింపబడువాడు.
635) కుంభ: - సర్వము తనయందుండువాడు.
636) విశుద్ధాత్మా - పరిశుద్ధమైన ఆత్మ స్వరూపుడు.
637) విశోధనః - తనను స్మరించు వారి పాపములను నశింపచేయువాడు
638) అనిరుద్ధః - శత్రువులచే అడ్డగింపబడనివాడు.
639) అప్రతిరథ: - తన నెదుర్కొను ప్రతిపక్షము లేని పరాక్రమవంతుడు.
640) ప్రద్యుమ్న: - విశేష ధనము కలవాడు.
641) అమిత విక్రమ: - విశేష పరాక్రమము గలవాడు.
642) కాలనేమినిహా - కాలనేమి యను రాక్షసుని వధించినవాడు.
643) వీర: - వీరత్వము గలవాడు.
644) శౌరి: - శూరుడను వాడి వంశమున పుట్టినవాడు.
645) శూరజనేస్వర: - శూరులలో శ్రేష్ఠుడు.
646) త్రిలోకాత్మా - త్రిలోకములకు ఆత్మయైనవాడు.
647) త్రిలోకేశ: - మూడు లోకములకు ప్రభువు.
648) కేశవ: - పొడవైన కేశములు గలవాడు.
649) కేశిహా: - కేశి యనుడి రాక్షసుని చంపినవాడు.
650) హరి: - అజ్ఞాన జనిత సంసార దు:ఖమును సమూలముగా అంతమొందించువాడు.
651) కామదేవ: - చతుర్విధ పురుషార్థములను కోరువారిచే పూజింపబడువాడు.
652) కామపాల: - భక్తులు తననుండి పొందిన పురుషార్థములను చక్కగా ఉపయోగపడునట్లు చూచువాడు.
653) కామీ - సకల కోరికలు సిద్ధించినవాడు.
654) కాంత: - రమణీయ రూపధారియైన వాడు.
655) కృతాగమ: - శ్రుతి, స్తృతి ఇత్యాది శాస్త్రములు రచించినవాడు.
656) అనిర్దేశ్యవపు: - నిర్దేశించి, నిర్వచించుటకు వీలుకానివాడు.
657) విష్ణు: - భూమ్యాకాశాలను వ్యాపించినవాడు.
658) వీర: - వీ ధాతువుచే సూచించు కర్మలచే నిండియున్నవాడు.
659) అనంత: - సర్వత్రా, సర్వకాలములందు ఉండువాడు.
660) ధనంజయ: - ధనమును జయించినవాడు.
661) బ్రహ్మణ్య: - బ్రహ్మను అభిమానించువాడు.
662) బ్రహ్మకృత్ - తపస్సు మొదలైనవిగా తెలియజేయుబడిన బ్రహ్మకు తానే కర్త అయినవాడు.
663) బ్రహ్మా - బ్రహ్మదేవుని రూపమున తానే సృష్టి చేయువాడు.
664) బ్రహ్మ - బ్రహ్మ అనగా పెద్దదని అర్థము.
665) బ్రహ్మవివర్థన: - తపస్సు మొదలైనవానిని వృద్ధి నొందించువాడు.
666) బ్రహ్మవిత్ - బ్రహ్మమును చక్కగా తెలిసినవాడు.
667) బ్రాహ్మణ: - వేదజ్ఞానమును ప్రబోధము చేయువాడు.
668) బ్రహ్మీ - తపస్యాది బ్రహ్మము తనకు అంగములై భాసించువాడు.
669) బ్రహ్మజ్ఞ: - వేదములే తన స్వరూపమని తెలిసికొనిన వాడు.
670) బ్రాహ్మణప్రియ: - బ్రహ్మజ్ఞానులైన వారిని ప్రేమించువాడు.
671) మహాక్రమ: - గొప్ప పద్ధతి గలవాడు.
672) మహాకర్మా - గొప్ప కర్మను ఆచరించువాడు.
673) మహాతేజా: - గొప్ప తేజస్సు గలవాడు.
674) మహోరగ: - గొప్ప సర్ప స్వరూపుడు.
675) మహాక్రతు: - గొప్ప యజ్ఞ స్వరూపుడు.
676) మహాయజ్వా - విశ్వ శ్రేయమునకై అనేక యజ్ఞములు నిర్వహించినవాడు.
677) మహాయజ్ఞ: - గొప్ప యజ్ఞ స్వరూపుడు.
678) మహాహవి: - యజ్ఞమునందలి హోమసాధనములు, హోమద్రవ్యములు అన్నిటి స్వరూపుడు.
679) స్తవ్య: - సర్వులచే స్తుతించబడువాడు.
680) స్తవప్రియ: - స్తోత్రములయందు ప్రీతి కలవాడు.
681) స్తోత్రం - స్తోత్రము కూడా తానే అయినవాడు.
682) స్తుతి: - స్తవనక్రియ కూడా తానే అయినవాడు.
683) స్తోతా - స్తుతించు ప్రాణి కూడా తానే అయినవాడు.
684) రణప్రియ: - యుద్ధమునందు ప్రీతి కలవాడు.
685) పూర్ణ: - సర్వము తనయందే గలవాడు.
686) పూరయితా - తన నాశ్రయించిన భక్తులను శుభములతో నింపువాడు.
687) పుణ్య: - పుణ్య స్వరూపుడు.
688) పుణ్యకీర్తి: - పవిత్రమైన కీర్తి గలవాడు.
689) అనామయ: - ఏవిధమైన భౌతిక, మానసిక వ్యాధులు దరిచేరనివాడు.
690) మనోజవ: - మనసు వలె అమిత వేగము కలవాడు.
691) తీర్థకర: - సకల విద్యలను రచించినవాడు.
692) వసురేతా: - బంగారము వంటి వీర్యము గలవాడు.
693) వసుప్రద: - ధనమును ఇచ్చువాడు.
694) వసుప్రద: - మోక్షప్రదాత
695) వాసుదేవ: - వాసుదేవునకు కుమారుడు.
696) వసు: - సర్వులకు శరణ్యమైనవాడు.
697) వసుమనా: - సర్వత్ర సమమగు మనస్సు గలవాడు.
698) హవి: - తానే హవిస్వరూపుడైనవాడు.
699) సద్గతి: - సజ్జనులకు పరమగతియైన వాడు.
700) సత్కృతి: - జగత్కళ్యాణమైన ఉత్తమ కార్యము.
701) సత్తా - సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైన అనుభవ స్వరూపము.
702) సద్భూతి: - పరమోత్కృష్టమైన మేధా స్వరూపుడు.
703) సత్పరాయణ: - సజ్జనులకు పరమగతి అయినవాడు.
704) శూరసేన: - శూరత్వము గల సైనికులు గలవాడు.
705) యదుశ్రేష్ఠ: - యాదవులలో గొప్పవాడు.
706) సన్నివాస: - సజ్జనులకు నిలయమైనవాడు.
707) సుయామున: - యమునా తీర వాసులగు గోపకులచే పరివేష్ఠింప బడినవాడు.
708) భూతవాస: - సర్వ భూతములకు నిలయమైనవాడు.
709) వాసుదేవ: - తన మాయాశక్తిచే సర్వము ఆవరించియున్నవాడు. వసుదేవుని కుమారుడు.
710) సర్వాసు నిలయ: - సమస్త జీవులకు, ప్రాణులకు నిలయమైనవాడు.
711) అనల: - అపరిమిత శక్తి, సంపద గలవాడు.
712) దర్పహా - దుష్టచిత్తుల గర్వమణుచు వాడు.
713) దర్పద: - ధర్మమార్గమున చరించువారికి దర్పము నొసంగువాడు.
714) దృప్త: - సదా ఆత్మానందామృత రసపాన చిత్తుడు.
715) దుర్థర: - ధ్యానించుటకు, బంధించుటకు సులభసాధ్యము కానివాడు.
716) అపరాజిత: - అపజయము పొందనివాడు.
717) విశ్వమూర్తి: - విశ్వమే తన మూర్తిగా గలవాడు.
718) మహామూర్తి: - గొప్ప మూర్తి గలవాడు.
719) దీప్తమూర్తి: - సంపూర్ణ జ్ఞానముతో ప్రకాశించువాడు.
720) అమూర్తివాన్ - కర్మాధీనమైన దేహమే లేనివాడు.
721) అనేకమూర్తి: - అనేక మూర్తులు ధరించినవాడు.
722) అవ్యక్త: - అగోచరుడు.
723) శతమూర్తి: - అనేక మూర్తులు ధరించినవాడు.
724) శతానన: - అనంత ముఖములు గలవాడు.
725) ఏక: - ఒక్కడే అయినవాడు.
726) నైక: - అనేక రూపములు గలవాడు.
727) సవ: - సోమయాగ రూపమున ఉండువాడు. ఏకముగా, అనేకముగా తానే యుండుటచేత తాను పూర్ణరూపుడు.
728) క: - సుఖ స్వరూపుడు.
729) కిమ్ - అతడెవరు? అని విచారణ చేయదగినవాడు.
730) యత్ - దేనినుండి సర్వభూతములు ఆవిర్భవించుచున్నవో ఆ బ్రహ్మము.
731) తత్ - ఏది అయితే వ్యాపించిఉన్నదో అది అయినవాడు.
732) పదం-అనుత్తమం - ముముక్షువులు కోరు ఉత్తమస్థితి తాను అయినవాడు.
733) లోకబంధు: - లోకమునకు బంధువైనవాడు.
734) లోకనాధ: - లోకములకు ప్రభువు
735) మాధవ: - మౌన, ధ్యాన, యోగాదుల వలన గ్రహించుటకు శక్యమైనవాడు.
736) భక్తవత్సల: - భక్తుల యందు వాత్సల్యము గలవాడు.
737) సువర్ణవర్ణ: - బంగారు వంటి వర్ణము గలవాడు.
738) హేమాంగ: - బంగారు వన్నెగల అవయువములు గలవాడు.
739) వరంగ: - గొప్పవైన అవయువములు గలవాడు.
740) చందనాంగదీ - ఆహ్లాదకరమైన చందనముతోను కేయూరములతోను అలంకృతమైనవాడు.
741) వీరహా - వీరులను వధించినవాడు.
742) విషమ: - సాటిలేనివాడు.
743) శూన్య: - శూన్యము తానైనవాడు.
744) ఘృతాశీ: - సమస్త కోరికలనుండి విడువడినవాడు.
745) అచల: - కదలిక లేనివాడు.
746) చల: - కదులువాడు.
747) అమానీ - నిగర్వి, నిరహంకారుడు.
748) మానద: - భక్తులకు గౌరవము ఇచ్చువాడు.
749) మాన్య: - పూజింపదగిన వాడైన భగవానుడు.
750) లోకస్వామీ - పదునాలుగు భువనములకు ప్రభువు.
751) త్రిలోకథృక్ - ముల్లోకములకు ఆధారమైన భగవానుడు.
752) సుమేధా: - చక్కని ప్రజ్ఞ గలవాడు.
753) మేధజ: - యజ్ఞము నుండి ఆవిర్భవించినవాడు.
754) ధన్య: - కృతార్థుడైనట్టివాడు.
755) సత్యమేధ: - సత్య జ్ఞానము కలవాడు.
756) ధరాధర: - భూమిని ధరించి యున్నవాడు.
757) తేజోవృష: - సూర్యతేజముతో నీటిని వర్షించువాడు.
758) ద్యుతిధర: - కాంతివంతమైన శరీరమును ధరించినవాడు.
759) సర్వ శస్త్ర భృతాంవర: - శస్త్రములను ధరించినవారిలో శ్రేష్ఠుడైనవాడు.
760) ప్రగ్రహ: - ఇంద్రియములనెడి అశ్వములను తన అనుగ్రహము అనెడి పగ్గముతో కట్టివేయువాడు.
761) నిగ్రహ: - సమస్తమును నిగ్రహించువాడు.
762) వ్యగ్ర: - భక్తులను తృప్తి పరుచుటలో సదా నిమగ్నమై ఉండువాడు.
763) నైకశృంగ: - అనేక కొమ్ములు గలవాడు, భగవానుడు.
764) గదాగ్రజ: - గదుడను వానికి అన్న.
765) చతుర్మూర్తి: - నాలుగు రూపములు గలవాడు.
766) చతుర్బాహు: - నాలుగు బాహువులు గలవాడు.
767) చతుర్వ్యూహ: - శరీర, వేద, ఛందో మహద్రూపుడైన పురుషుడు. ఈ నలుగురు పురుషులు వ్యూహములుగా కలవాడు.
768) చతుర్గతి: - నాలుగు విధములైన వారికి ఆశ్రయ స్థానము.
769) చతురాత్మా - చతురమనగా సామర్ధ్యము.
770) చతుర్భావ: - చతుర్విద పురుషార్థములకు మూలమైనవాడు.
771) చతుర్వేదవిత్ - నాలుగు వేదములను తెలిసినవాడు.
772) ఏకపాత్ - జగత్తంతయు ఒక పాదముగా గలవాడు.
773) సమావర్త: - సంసార చక్రమును సమర్థతతో త్రిప్పువాడు.
774) అనివృత్తాత్మా - అంతయు తానైయున్నందున దేనినుండియు విడివడినవాడు.
775) దుర్జయ: - జయింప శక్యము గానివాడు.
776) దురతిక్రమ: - అతిక్రమింపరాని విధమును సాసించువాడు.
777) దుర్లభ: - తేలికగా లభించనివాడు.
778) దుర్గమ: - మిక్కిలి కష్టముతో మాత్రమే పొందబడినవాడు.
779) దుర్గ: - సులభముగా లభించనివాడు.
780) దురావాస: - యోగులకు కూడా మనస్సున నిలుపుకొనుటకు కష్టతరమైనవాడు.
781) దురారిహా: - దుర్మార్గులను వధించువాడు.
782) శుభాంగ: - దివ్యములైన, సుందరములైన అవయువములు గలవాడు.
783) లోకసారంగ: - లోకములోని సారమును గ్రహించువాడు.
784) సుతంతు: - జగద్రూపమున అందమైన తంతువువలె విస్తరించినవాడు.
785) తంతువర్థన: - వృద్ధి పరచువాడు, నాశనము చేయువాడు.
786) ఇంద్రకర్మా - ఇంద్రుని కర్మవంటి శుభప్రధమైన కర్మ నాచరించువాడు.
787) మహాకర్మా - గొప్ప కార్యములు చేయువాడు.
788) కృతకర్మా - ఆచరించదగిన కార్యములన్నియు ఆచరించినవాడు.
789) కృతాగమ: - వేదముల నందించువాడు.
790) ఉద్భవ: - ఉత్క్రష్టమైన జన్మ గలవాడు.
791) సుందర: - మిక్కిలి సౌందర్యవంతుడు.
792) సుంద: - కరుణా స్వరూపుడు.
793) రత్నగర్భ: - రత్నమువలె సుందరమైన నాభి గలవాడు.
794) సులోచన: - అందమైన నేత్రములు కలిగిన భగవానుడు.
795) అర్క: - శ్రేష్టులైన బ్రహ్మాదుల చేతను అర్చించబడువాడు.
796) వాజసన: - అర్థించు వారలకు ఆహారము నొసంగువాడని భావము.
797) శృంగీ - శృంగము గలవాడు.
798) జయంత: - సర్వ విధములైన విజయములకు ఆధారభూతుడు.
799) సర్వవిజ్జయీ - సర్వవిద్ అనగా సర్వము తెలిసినవాడు.
800) సువర్ణబిందు: - బంగారము వంటి అవయువములు గలవాడు.
801) అక్షోభ్య: - క్షోభ తెలియనివాడు.
802) సర్వవాగీశ్వరేశ్వర: - వాక్పతులైన బ్రహ్మాదులకు కూడ ప్రభువైన భగవానుడు.
803) మహాహ్రద: - గొప్ప జలాశయము.
804) మహాగర్త : - అగాధమైన లోయ వంటివాడు.
805) మహాభూత: - పంచభూతములకు అతీతమైనవాడు.
806) మహానిధి: - సమస్త భూతములు తనయందు ఉన్నవాడు.
807) కుముద: - కు అనగా భూమి . అట్టి భూమి యొక్క భారమును తొలగించి మోదమును కూర్చువాడు.
808) కుందర: - భూమిని చీల్చుకుపోయినవాడు.
809) కుంద: - భూమిని దానమిచ్చినవాడు.
810) పర్జన్య: - మేఘము వర్షించి భూమిని చల్లబరుచునట్లు జీవుల తాపత్రయములను తొలగించి,వారి మనస్సులను శాంతింపచేయువాడు భగవానుడు.
811) పావన: - పవిత్రీకరించువాడు.
812) అనిల: - ప్రేరణ చేయువాడు, సదా జాగరూకుడు.
813) అమృతాశ: - అమృతము నొసంగువాడు.
814) అమృతవపు: - అమృతస్వరూపుడు శాశ్వతుడు.
815) సర్వజ్ఞ: - సర్వము తెలిసినవాడు.
816) సర్వతోముఖ: - ఏకకాలమున సర్వమును వీక్షించగలవాడు.
817) సులభ: - భక్తితో తనను స్మరించువారికి సులభముగా లభ్యమగువాడు.
818) సువ్రత: - మంచి వ్రతము గలవాడు.
819) సిద్ధ: - సత్వస్వరూపుడై, పూర్ణరూపుడై భగవానుడు సిద్ధ: అని తెలియబడువాడు.
820) శత్రుజిత్ - శత్రువులను జయించువాడు.
821) శత్రుతాపన: - దేవతల విరోదులైన వారిని,సజ్జనులకు విరోధులైన వారిని తపింప చేయువాడు.
822) న్యగ్రోధ: - సర్వ భూతములను తన మాయచే ఆవరించి ఉన్నవాడు.
823) ఉదుంబర: - అన్నముచేత విశ్వమును పోషించువాడు.
824) అశ్వత్ధ: - అశాశ్వతమైన సంసార వృక్ష స్వరూపుడు.
825) చాణూరాంధ్ర నిషూదన: - చాణూరుడను మల్లయోధుని వధించినవాడు.
826) సహస్రార్చి: - అనంతకిరణములు కలవాడు.
827) సప్తజిహ్వ: - ఏడు నాలుకలుగల అగ్నిస్వరూపుడు.
828) సప్తైథా: - ఏడు దీప్తులు కలవాడు.
829) సప్తవాహన: -ఏడు గుఱ్ఱములు వాహనములుగా కలవాడు.
830) అమూర్తి: - రూపము లేనివాడు.
831) అనఘ: - పాపరహితుడు.
832) అచింత్య: - చింతించుటకు వీలుకానివాడు.
833) భయకృత్ - దుర్జనులకు భీతిని కలిగించువాడు.
834) భయనాశన: - భయమును నశింపచేయువాడు.
835) అణు: - సూక్షాతి సూక్షమైనవాడు.
836) బృహుత్ - మిక్కిలి పెద్దది అయిన బ్రహ్మము స్వరూపము.
837) కృశ: - సన్ననివాడై, అస్థూలమైనవాడు.
838) స్థూల: - స్థూల స్వరూపము కలిగియున్నవాడు.
839) గుణభృత్ - సత్వరజోస్తమో గుణములకు ఆధారమైనవాడు.
840) నిర్గుణ: - గుణములు తనలో లేనివాడు.
841) మహాన్ - దేశకాలాదుల నధిగమించి యున్నవాడు.
842) అధృత: - సర్వము తానే ధరించియుండి, తనను ధరించునది మరియొకటి లేనివాడు.
843) స్వధృత: - తనకు తానే ఆధారమైనవాడైన భగవానుడు.
844) స్వాస్య: - విశ్వశ్రేయమునకై వేదములను వెలువరించినవాడు.
845) ప్రాగ్వంశ: - ప్రాచీనమైన వంశము కలవాడు.
846) వంశవర్థన: - తన వంశమును వృద్ధినొందించువాడు.
847) భారభృత్ - భారమును మోయువాడు.
848) కథిత: - వేదములచేత సర్వోత్తముడుగా కీర్తించబడినవాడు.
849) యోగీ - ఆత్మజ్ఞానము నందే సదా ఓలలాడు వాడు.
850) యోగీశ: - యోగులకు ప్రభువు.
851) సర్వ కామద: - సకల కోరికలను తీర్చువాడు.
852) ఆశ్రమ: - జీవులకు విశ్రాంతి స్థానమైనవాడు.
853) శ్రమణ: - భక్తిహీనులను, వివేకరహితులను శ్రమ పెట్టువాడు.
854) క్షామ: - సర్వ జీవులను క్షీణింపజేయువాడు.
855) సుపర్ణ: - రమణీయ పత్రములు కలిగిన వృక్షము తానైనవాడు.
856) వాయువాహన: - వాయు చలనమునకు కారణభూతుడైనవాడు.
857) ధనుర్ధర: - ధనస్సును ధరించినవాడు.
858) ధనుర్వేద: - ధనుర్వేదము తెలిసినవాడు.
859) దండ: - దండించువాడు.
860) దమయితా - శిక్షించువాడు.
861) దమ: - శిక్షానుభవము ద్వారా ఏర్పడు పవిత్రత తానైనవాడు.
862) అపరాజిత: - పరాజయము తెలియనివాడు.
863) సర్వసహ: - సమస్త శత్రువులను సహించువాడు.
864) నియంతా - అందరినీ తమతమ కార్యములందు నియమించువాడు.
865) అనియమ: - నియమము లేనివాడు.
866) ఆయమ: - మృత్యుభీతి లేనివాడు.
867) సత్త్వావాన్ - సత్త్వము గలవాడు.
868) సాత్త్విక: - సత్త్వగుణ ప్రధానుడైనవాడు.
869) సత్య: - సత్పురుషుల విషయములో మంచిగా ప్రవర్తించువాడు.
870) సత్యధర్మ పరాయణ: - సత్య విషయమునందును, ధర్మ విషయమునందును దీక్షాపరుడైనవాడు.
871) అభిప్రాయ: - అభిలషించు వారిచేత అభిప్రాయపడువాడు.
872) ప్రియార్హ: - భక్తుల ప్రేమకు పాత్రుడైనవాడు.
873) అర్హ: - అర్పింపబడుటకు అర్హుడైనవాడు.
874) ప్రియకృత్ - తన నాశ్రయించినవారికి ప్రియము నొసగూర్చువాడు.
875) ప్రీతివర్ధన: - భక్తులలో భవవంతునిపై ప్రీతిని వృద్ధి చేయువాడు.
876) విహాయన గతి: - ఆకాశము ఆశ్రయముగ గలదియైన విష్ణుపదము తానైనవాడు.
877) జ్యోతి: - తన ప్రకాశము చేత సర్వమును ప్రకాశింపచేయువాడు.
878) సురుచి: - అందమైన ప్రకాశము గలవాడు.
879) హుతభుక్ - యజ్ఞములందు ఆవాహన చేయబడిన దేవతల రూపమున హవిస్సులను స్వీకరించువాడు.
880) విభు: - సర్వ లోకములకు ప్రభువైనవాడు.
881) రవి: - తన విభూతియైన సూర్యుని ద్వారా భూమినుండి సర్వరసములను గ్రహించువాడు.
882) విలోచన: - వివిధ రూపముల ద్వారా ప్రకాశించువాడు.
883) సూర్య: - ప్రాణులకు ప్రాణశక్తిని ప్రసాదించువాడు.
884) సవితా: - సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు.
885) రవిలోచన: - సూర్యుడు నేత్రములుగా కలవాడు.
886) అనంత: - అంతము లేనివాడు.
887) హుతభుక్ - హోమద్రవ్యము నారిగించువాడు.
888) భోక్తా - భోగ్యవస్తువైన ప్రకృతిని అనుభవించువాడు.
889) సుఖద: - భక్తులకు ఆత్మసుఖము నొసంగువాడు.
890) నైకజ: - అనేక రూపములలో అవతరించువాడు.
891) అగ్రజ: - సృష్ట్యారంభమునకు ముందే ఆవిర్భవించినవాడు.
892) అనిర్వణ్ణ: - నిరాశ నెరుగనివాడు.
893) సదామర్షీ - సజ్జనుల దోషములను క్షమించువాడు.
894) లోకాధిష్టానం - ప్రపంచమంతటికి ఆధారభూతుడు.
895) అధ్బుత: - ఆశ్చర్య స్వరూపుడు.
896) సనాత్ - ఆది లేనివాడు.
897) సనాతన సమ: - సృష్టికర్త యైన బ్రహ్మకు పూర్వము కూడా యున్నవాడు.
898) కపిల: - ఋషులలో కపిలుడు తానైనవాడు.
899) కపి: - సూర్యరూపుడు.
900) అవ్యయ: - ప్రళయకాలము నందు సమస్తము తనలో లీనమగుటకు విశ్రామ స్థానమైనవాడు.
901) స్వస్తిద: - సర్వశ్రేయములను చేకూర్చువాడు.
902) స్వస్తికృత్ - శుభమును కూర్చువాడు.
903) స్వస్తి - సర్వ మంగళ స్వరూపుడు.
904) స్వస్తిభుక్ - శుభమును అనుభవించువాడు.
905) స్వస్తిదక్షిణ: - స్మరణ మాత్రముననే సర్వ శుభములు సమకూర్చువాడు.
906) అరౌద్ర: - రౌద్రము లేనివాడు.
907) కుండలీ - మకర కుండలములు ధరించినవాడు.
908) చక్రీ - సుదర్శనమను చక్రమును ధరించినవాడు.
909) విక్రమీ - గొప్ప శూరుడైన భగవానుడు.
910) ఊర్జిత శాసన: - ఉల్లంఘించుటకు వీలులేని శాసనములు కలవాడు.
911) శబ్దాతిగ: - వాక్కుకు అందనివాడు.
912) శబ్దసహ: - సమస్త వేదములు తెలియబడినవాడు.
913) శిశిర: - శిశిర ఋతువువలె చల్లబరుచువాడు.
914) శర్వరీకర: - రాత్రిని కలుగజేయువాడు.
915) అక్రూర: - క్రూరత్వము లేనివాడు.
916) పేశల: - మనోవాక్కాయ కర్మలచే రమణీయముగ నుండువాడై పేశల: అని స్తుతించబడును.
917) దక్ష: - సమర్థుడైనవాడు.
918) దక్షిణ: - భక్తులను ఔదార్యముతో బ్రోచువాడు.
919) క్షమిణాం వర: - సహనశీలు లైన వారిలందరిలో శ్రేష్ఠుడు.
920) విద్వత్తమ: - సర్వజ్ఞత్తము కలిగియుండి, అందరిలో ఉత్తమమైనవాడు.
921) వీతభయ: - భయము లేనివాడు.
922) పుణ్యశ్రవణ కీర్తన: - తనను గూర్చి శ్రవణము గాని, కీర్తన గాని పుణ్యము కలుగజేయును.
923) ఉత్తారణ: - సంసార సముద్రమును దాటించువాడు.
924) దుష్కృతిహా - సాధకులలో యున్న చెడువాసనలను అంతరింప చేయువాడు.
925) ప్రాణ: - ప్రాణులకు పవిత్రతను చేకూర్చు పుణ్య స్వరూపుడు.
926) దుస్వప్న నాశన: - చెడు స్వప్నములను నాశనము చేయువాడు.
927) వీరహా - భక్తులు మనస్సులు వివిధ మార్గములలో ప్రయాణించకుండ క్రమము చేయువాడు.
928) రక్షణ: - రక్షించువాడైనందున భగవానుడు రక్షణ: అని స్తవనీయుడయ్యెను.
929) సంత: - పవిత్ర స్వరూపుడు.
930) జీవన: - సర్వ జీవులయందు ప్రాణశక్తి తానైనవాడు.
931) పర్యవస్థిత: - అన్నివైపుల అందరిలో వ్యాపించి యున్నవాడు.
932) అనంతరూప: - అనంతమైన రూపములు గలవాడు.
933) అనంత శ్రీ: - అంతము లేని శక్తివంతుడైనవాడు.
934) జితమన్యు: - క్రోధము ఎఱగని వాడు.
935) భయాపహ: - భయమును పోగొట్టువాడు.
936) చతురశ్ర: - జీవులకు కర్మఫలములను న్యాయముగా పంచువాడు.
937) గభీరాత్మా - గ్రహింప శక్యము గాని స్వరూపము గలవాడు.
938) విదిశ: - అధికారులైన వారికి ఫలము ననుగ్రహించుటలో ప్రత్యేకత కలిగియున్నవాడు.
939) వ్యాదిశ: - వారి వారి అర్హతలను గమనించి బ్రహ్మాదులను సైతము నియమించి, ఆజ్ఞాపించువాడు.
940) దిశ: - వేదముద్వారా మానవుల కర్మఫలములను తెలియజేయువాడు.
941) అనాది: - ఆదిలేనివాడు.
942) భూర్భువ: - సర్వభూతములకు ఆధారమైన భూమికి కూడా భూ: ఆధారమైనవాడు.
943) లక్ష్మీ: - లక్ష్మీ స్వరూపుడు.
944) సువీర: - అనేక విధములైన సుందర పోకడలు గలవాడు.
945) రుచిరాంగద: - మంగళమైన బాహువులు గలవాడు.
946) జనన: - సర్వ ప్రాణులను సృజించినవాడు.
947) జన జన్మాది: - జన్మించు ప్రాణుల జన్మకు ఆధారమైనవాడు.
948) భీమ: - అధర్మపరుల హృదయములో భీతిని కలిగించు భయరూపుడు.
949) భీమ పరాక్రమ: - విరోధులకు భయంకరమై గోచరించువాడు.
950) ఆధార నిలయ: - సృష్టికి ఆధారమైన పృధ్వి, జలము, తేజము, వాయువు, ఆకాశము అను పంచ మహాభూతములకు ఆధారమైనవాడు.
951) అధాతా - తానే ఆధారమైనవాడు.
952) పుష్టహాస: - మొగ్గ పువ్వుగా వికసించునట్లు ప్రపంచరూపమున వికసించువాడు.
953) ప్రజాగర: - సదా మేల్కొనియుండువాడు.
954) ఊర్ధ్వగ: - సర్వుల కన్నా పైనుండువాడు.
955) సత్పధాచార: - సత్పురుషుల మార్గములో చరించువాడు.
956) ప్రాణద: - ప్రాణ ప్రదాత యైనవాడు.
957) ప్రణవ: - ప్రణవ స్వరూపుడైనవాడు.
958) పణ: - సర్వ కార్యములను నిర్వహించువాడు.
959) ప్రమాణ: - స్వయముగానే జ్ఞానస్వరూపుడై యున్నవాడు.
960) ప్రాణ నిలయ: - సమస్త జీవుల అంతిమ విరామ స్థానమైనవాడు.
961) ప్రాణభృత్ - ప్రాణములను పోషించువాడు.
962) ప్రాణజీవన: - ప్రాణ వాయువుల ద్వారా ప్రాణులను జీవింపజేయువాడు.
963) తత్త్వం - సత్యస్వరూపమైనందున భగవానుడు తత్త్వం అని తెలియబడిన వాడు.
964) తత్త్వవిత్ - సత్యవిదుడైన భగవానుడు తత్త్వవిత్ అని స్తుతించబడువాడు.
965) ఏకాత్మా - ఏకమై, అద్వితీయమైన పరమాత్మ
966) జన్మమృత్యు జరాతిగ: - పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పుచెందుట, కృశించుట నశించుట వంటి వికారములకు లోనుగానివాడు.
967) భూర్భువ: స్వస్తరు: - భూ: భువ: స్వ: అను వ్యాహృతి రూపములు 3 గలవాడు.
968) తార: - సంసార సాగరమును దాటించువాడు.
969) సవితా - తండ్రి వంటివాడైన భగవానుడు.
970) ప్రపితామహః - బ్రహ్మదేవునికి కూడా తండ్రియైనవాడు.
971) యజ్ఞ: - యజ్ఞ స్వరూపుడు.
972) యజ్ఞపతి: - యజ్ఞము నందు అధిష్టాన దేవత తానైన భగవానుడు.
973) యజ్వా - యజ్ఞము నందు యజమాని.
974) యజ్ఞాంగ: - యజ్ఞము లోని అంగములన్నియు తానే అయినవాడు.
975) యజ్ఞవాహన: - ఫలహేతువులైన యజ్ఞములు వాహనములుగా కలవాడు.
976) యజ్ఞభృత్ - యజ్ఞములను సంరక్షించువాడు.
977) యజ్ఞకృత్ - యజ్ఞములను నిర్వహించువాడు.
978) యజ్ఞీ - యజ్ఞములందు ప్రధానముగా ఆరాధించుబడువాడు.
979) యజ్ఞభుక్ - యజ్ఞఫలమును అనుభవించువాడు.
980) యజ్ఞసాధన: - తనను పొందుటకు యజ్ఞములు సాధనములుగా గలవాడు.
981) యజ్ఞాంతకృత్ - యజ్ఞఫలము నిచ్చువాడు.
982) యజ్ఞగుహ్యమ్ - గోప్యమైన యజ్ఞము తానైనవాడు.
983) అన్నం - ఆహారము తానైనవాడు.
984) అన్నాద: - అన్నము భక్షించువాడు.
985) ఆత్మయోని: - తన ఆవిర్భావమునకు తానే కారణమైనవాడు.
986) స్వయంజాత: - మరొకరి ప్రమేయము లేకనే తనకు తానుగ ఆవిర్భవించువాడు.
987) వైఖాన: - ప్రాపంచిక దు:ఖమును నివారించువాడు.
988) సామగాయన: - సామగానము చేయువాడు.
989) దేవకీనందన: - దేవకీ పుత్రుడైన శ్రీ కృష్ణుడు.
990) స్రష్టా - సృష్టికర్త
991) క్షితీశ: - భూమికి నాధుడైనవాడు.
992) పాపనాశన: - పాపములను నశింపజేయువాడు.
993) శంఖభృత్ - పాంచజన్యమను శంఖమును ధరించినవాడు.
994) నందకీ - నందకమను ఖడ్గమును ధరించినవాడు.
995) చక్రీ - సుదర్శనమును చక్రమును ధరించినవాడు.
996) శారంగ ధన్వా - శారంగము అనెడి ధనుస్సు కలవాడు.
997) గదాధర: - కౌమోదకి యనెడి గదను ధరించినవాడు.
998) రథాంగపాణి: - చక్రము చేతియందు గలవాడు.
999) అక్షోభ్య: - కలవరము లేనివాడు.
1000) సర్వ ప్రహరణాయుధ: - సర్వవిధ ఆయుధములు కలవాడు.
[[వర్గం: స్తోత్రములు]]
k9d0uupl8xdfdyzl8nk8owhdrcvs6tj
రచయిత:బంకుపల్లె మల్లయ్యశాస్త్రి
102
38639
557965
249232
2026-06-04T15:40:57Z
Rajasekhar1961
50
/* రచనలు */
557965
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = బంకుపల్లె
|అసలుపేరు = మల్లయ్యశాస్త్రి
|పేరు_మొదటి_అక్షరం = బ
|పుట్టిన_యేడు = 1876
|గిట్టిన_యేడు = 1947
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = బంకుపల్లె మల్లయ్యశాస్త్రి
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
# చైతన్య చరిత్ర (యక్షగానము)
# కంసవధ (యక్షగానము)
# శ్రీకృష్ణజననము (యక్షగానము)
# రామకృష్ణపరమహంస చరిత్ర (యక్షగానము)
# భాగవతకలాపము
# కొండవీటి విజయము<ref>[http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data6/upload/0159/483&first=1&last=56&barcode=2020050016176| డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో కొండవీటి విజయము పుస్తకప్రతి]</ref> (పద్యకావ్యము)
# అస్పృశ్యత
# వివాహతత్వము (1933) {{small scan link|వివాహ తత్త్వము.pdf}}
# [[ఆంధ్ర వేదములు]] :
* [[ఆంధ్ర వేదములు : ఋగ్వేదము]] (1940) {{small scan link|Andhravedamulurigveda.pdf}}
** [[ఆంధ్ర వేదములు : కృష్ణయజుర్వేదము]] (1940) {{small scan link|Andhra-Vedhamulu-Krishnayajurvedamu.pdf}}
***[[ఆంధ్ర వేదములు : సామవేదము]] (1941) {{small scan link|Andhra-vedhamulu-samaveda.pdf}}
# శ్రీ సర్వదర్శన సిద్ధాంత సంగ్రహము
# విద్యారణ్యస్వామి విరచిత అనుభూతి ప్రకాశము
t9feopxrrrp6he8virr8prqebm63c14
రచయిత:ఓ. వై. శ్రీ. దొరసామయ్య
102
72866
558000
340727
2026-06-05T08:16:27Z
Rajasekhar1961
50
/* రచనలు */
558000
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు =
|అసలుపేరు = ఓ. వై. శ్రీ. దొరసామయ్య
|పేరు_మొదటి_అక్షరం = ద
|పుట్టిన_యేడు =
|గిట్టిన_యేడు =
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = ఓ. వై. శ్రీ. దొరసామయ్య
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
===రచనలు===
# [[కపాలకుండల|కపాలకుండలా]] (1908)
# [[హఠయోగ ప్రదీపిక]] (1924)
# [[ఏకమూలికా ప్రయోగ రత్నావళి]]
[[వర్గం:రచయితలు-ద]]
1gifc7pu6wp59qwdxq1gxnzrhkxucsb
పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/263
104
171200
557992
557944
2026-06-05T05:36:22Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
557992
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 244 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>గాని యేవిధమగు చాంచల్యము గాని లేవు. అది యొకదానివలన నొకప్పుడు పుట్టినది కాదు. భూతభవిష్యద్వర్తమానములయందు నొకటే విధముగ నుండునది. కర్మాభిమానమును వదలి జ్ఞానమును సంపాదించినచో నట్టిపురుషున కది దొరకును. భేదబుద్ధి యున్నంతకాలము దాని నెఱుంగుట యశక్యము.
{{Telugu poem|type= క|lines=<poem>హానాదానవిహీన, జ్ఞానాజ్ఞానాతిరిక్తసత్యానంద
జ్ఞానప్రధానతజ్ఞని, దానాధిష్ఠాన మానిధాన మదీనా.</poem>|ref=8}}
'''టీ'''. అదీనా = ధైర్యశాలివగునోయాంజనేయా, అనిధానము = బ్రహ్మరూపమైన యానిక్షేపము, హా...సుస్థానము — హాన = విడచుట గాని, ఆదాన = స్వీకరించుట గాని, విహీన = లేనిదియు, (ఆబ్రహ్మము సర్వప్రపంచమయము కావున పరిత్యజించుటకుఁ గాని యంగీకరించుటకుఁ గాని దానికంటె రెండవది యగు పదార్థమే లేదని భావము.) జ్ఞానాజ్ఞాన = జ్ఞానమునకంటెను అజ్ఞానమునకంటెను (ఇచ్చట జ్ఞానాజ్ఞానశబ్దములచే బ్రహ్మ ప్రతిబింబసహితములై వెలికివచ్చి విషయములఁ బ్రకాశింపఁజేయునట్టియు అట్లు చేయనట్టియు చిత్తవృత్తులు చెప్పఁబడె నని తెలిసికొనవలయును.) అతిరిక్త = వేఱైనట్టిదియు, సత్య = సర్వకాలములయందును సర్వదేశములయందు నొకటేరీతిగ నుండుట, ఆనంద = ఆనందము, జ్ఞాన = చైతన్యము, ప్రధాన = ముఖ్యముగాఁ గలదియు, తజ్జ = ఆమూలప్రకృతివలనఁ బుట్టిన అవ్యక్తమహదహంకారాది సర్వప్రపంచమునకును, నిదాన = మూలకారణమైన జ్ఞానశక్తికి, అధిస్థానము = ఆధారమైనదియునై యున్నది. (ఈ ప్రపంచమునందు నామరూపములకంటె నితర మగు పదార్థము లేదు కావునను, ఆనామరూపములకు తత్త్వవిషయకమైనజ్ఞానమునకంటె నితరమగుస్వరూపము లేకపోవుటచేతను, సర్వప్రపంచమునకును జ్ఞానమే మూలకారణమని చెప్పఁబడెను. త్రాటియందుఁ జూచు పాముయొక్క నామరూపములకు నప్పటి భ్రాంతిజ్ఞానమునకంటె భిన్నమగుస్వరూపము లేనట్లు బ్రహ్మయందు తోఁచుజగమునకుఁ గూడ జ్ఞానమునకంటె నన్యమగుస్వరూపము లేదని తెలిసికొనవలయును. భ్రాంతిజ్ఞానముకూడ జ్ఞానమే. భ్రాంతి యనునది మనోవికారము. కావున దానివలన జ్ఞానమునకు మార్పు గలుగదు.)
'''తా'''. ఓధైర్యశాలీ! ఆపరబ్రహ్మము సర్వమయ మగుటచే "ప్రపంచములో నీపదార్థము బ్రహ్మము కాదు, ఈపదార్థము బ్రహ్మము” అని తిరస్కారమునకుఁ గాని యంగీకారమునకుఁ గాని విషయ మగునది కాదు. లోకమున వ్యవహారమునందున్న జ్ఞానాజ్ఞానములకంటె నది వేఱు. నిత్యవిజ్ఞానస్వరూపుఁడగు నాబ్రహ్మముయొక్క ప్రకాశముచేఁ బ్రకాశించుచుఁ జిత్తవృత్తులు బాహ్యాంతరవిషయములఁ బ్రకాశింపఁజేయుచుండును. అప్పు డాచిత్తవృత్తులను మనము జ్ఞానము లనుచున్నాము.ఆచిత్తవృత్తులు జనింపనప్పుడు నిత్యవిజ్ఞానరూపుఁ డట్లే యున్నను విషయములు బ్రకాశించుట లే దని మనకు<noinclude><references/></noinclude>
g260irx0clmnz3gfswlu7sb1tosf93r
పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/264
104
171201
557968
483217
2026-06-04T16:24:24Z
Ramesam54
3001
/* అచ్చుదిద్దారు */
557968
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Ramesam54" />{{rh| |ద్వి తీ యా శ్వా స ము. |245 }}</noinclude><poem></poem>
{{float right| }}
దోఁచుమన్నది. ఆస్థితిని యజ్ఞాన మనుచున్నాము. ఇవి రెండును బ్రహ్మము కాదు.
ఆయన నిత్యవిజ్ఞానరూపుఁడు అనందరూపుఁడు సత్యస్వరూపుఁడు, ప్రకృతివలనఁబుట్టిన
దని చెప్పఁబడుచున్న ప్రపంచమునకు చిచ్ఛక్తియే మూలకారణము, సమస్త ప్రపంచ
మును భ్రాంతివలననే తోచుచున్నది కావున దానికి జ్ఞానమే స్వరూపము. ఎండమావుల
యందు తోఁచునీటికి భ్రాంతిజ్ఞానమునకంటె నితర మగుస్వరూపము లేదనుట ప్రత్యక్ష
సిద్ధమే కదా. ఇట్లు ప్రపంచమూలకారణ మని సిద్ధాంతమైన జ్ఞానశక్తికిఁగూడ నిత్య
విజ్ఞానస్వరూపుఁ డగుటచే నా బ్రహ్మమే యాధారభూతుఁడు.
{{Telugu poem|type= క|lines=<poem> ప్రస్థానత్రయ వేద్యుఁడ, వస్థాత్రయసాక్షి సర్వవస్తుస్తోమాం
తస్థుం డస్థిరవిశ్వభ, వస్థిత్యంతాదిమూర్తి వాయుకుమారా.</poem>|ref=9}}
టీ. వాయుకుమారా = అంజనేయా, ప్రస్థా …ద్యుఁడున్ - ప్రస్థానత్రయ = ఉప
నిషద్గీతా బ్రహ్మసూత్రములవలన, వేద్యుఁడు = తెలియఁదగినవాఁడును, ఆవస్థాత్రయ
సాక్షి- అవస్థాత్రయ = జాగ్రత్స్వప్నసుషువ్యవస్థలకు, సాక్షి = సాక్షియును (ఆయవ
స్థలయందున్న విషయములఁ బ్రకాశింపఁజేయువాఁడును.) సర్వ .. స్థుండు - సర్వ = సమ
స్తమైన, పస్తు = నస్తువులయొక్క స్తోమ = సమూహముయొక్క, అంతస్థుండు లోపల
నున్న వాఁడును, అస్థి... మూర్తి - అస్థిర = (యథార్థమును విచారించిన) శూన్యమగు, విశ్వ=
ప్రపంచముయొక్క, భవ = ఉత్పత్తికిని, స్థితి = ఉనికికిని, అంత = నాశమునకును, ఆది
మూర్తి = కారణ మైనస్వరూపము గలవాఁడును. (ప్రక్క పద్యముతో సంబంధము.)
తా. వాయుపుత్రా! ఉపనిషత్తులు గీతలు బ్రహ్మసూత్రములు మఱియు నితరము
లగు శాస్త్రములునన్నియు నా బ్రహ్మమును గూర్చియే చెప్పును. జాగ్రత, స్వప్నము, సుషు
ప్తి యను మూఁడవస్థులును ఆపరబ్రహ్మముచేతనే (అనఁగా: నిత్యజ్ఞానముచేతనే) మనము
తెలిసికొనుచున్నాము. ఆమహాత్ముఁడే ప్రపంచమునందలి సర్వపదార్థములయందు సేక
రూపముతోనున్నాడు. యధార్థస్థితిలో శూన్యమైనను ఈ ప్రపంచము పుట్టినట్లును
నిలిచి యున్నట్లును నశించినట్లును తోఁచుటకు నాబ్రహ్మమే కారణము (అనఁగా
శూన్యమయ్యును సర్పము త్రాటియందు ఉత్పత్తి స్థితి వినాశములతోఁ దోఁచినట్లీ ప్రపం
చము బ్రహ్మమునందుఁ దోఁచుచున్నదనుట).
{{Telugu poem|type= పంచచామరము|lines=<poem>. ఇలాజలానలానిలాంబరేందుభానుమండలో
జ్జ్వలాఖిలావిలామలాత్మజాల కాంతరస్థచం
చలాచలావిలాసళూన్యసంతతాపరోక్షచి
త్కళాకలాపలాలిత ప్రకాశకుం డతం డగున్.</poem>|ref=10}}
టీక, అతండు = ఆయినఆబ్రహ్మము, ఇలా...కుఁడు - ఇలా = భూమియొక్కయు,
జల = ఉదకముయొక్కయు, అనల = అగ్నియొక్కయు, అనిల = వాయవుయొక్కయు,<noinclude><references/></noinclude>
hm7pyvoe3tsv4cpxfh7reiwc5wad21o
557997
557968
2026-06-05T07:33:01Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
557997
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ద్వి తీ యా శ్వా స ము. |245 }}</noinclude>దోఁచుచున్నది. ఆస్థితిని యజ్ఞాన మనుచున్నాము. ఇవి రెండును బ్రహ్మము కాదు. ఆయన నిత్యవిజ్ఞానరూపుఁడు అనందరూపుఁడు సత్యస్వరూపుఁడు. ప్రకృతివలనఁ బుట్టినదని చెప్పఁబడుచున్న ప్రపంచమునకు చిచ్ఛక్తియే మూలకారణము. సమస్తప్రపంచమును భ్రాంతివలననే తోచుచున్నది కావున దానికి జ్ఞానమే స్వరూపము. ఎండమావులయందు తోఁచునీటికి భ్రాంతిజ్ఞానమునకంటె నితర మగుస్వరూపము లేదనుట ప్రత్యక్షసిద్ధమే కదా. ఇట్లు ప్రపంచమూలకారణ మని సిద్ధాంతమైన జ్ఞానశక్తికిఁగూడ నిత్యవిజ్ఞానస్వరూపుఁ డగుటచే నా బ్రహ్మమే యాధారభూతుఁడు.
{{Telugu poem|type= క.|lines=<poem>ప్రస్థానత్రయ వేద్యుఁ డ, వస్థాత్రయసాక్షి సర్వవస్తుస్తోమాం
తస్థుం డస్థిరవిశ్వభ, వస్థిత్యంతాదిమూర్తి వాయుకుమారా.</poem>|ref=9}}
'''టీ'''. వాయుకుమారా = అంజనేయా, ప్రస్థా...ద్యుఁడున్ — ప్రస్థానత్రయ = ఉపనిషద్గీతాబ్రహ్మసూత్రములవలన, వేద్యుఁడు = తెలియఁదగినవాఁడును, అవస్థాత్రయసాక్షి — అవస్థాత్రయ = జాగ్రత్స్వప్నసుషువ్యవస్థలకు, సాక్షి = సాక్షియును (ఆయవస్థలయందున్న విషయములఁ బ్రకాశింపఁజేయువాఁడును.) సర్వ...స్థుండు — సర్వ = సమస్తమైన, వస్తు = వస్తువులయొక్క, స్తోమ = సమూహముయొక్క, అంతస్థుండు = లోపల నున్నవాఁడును, అస్థి...మూర్తి — అస్థిర = (యథార్థమును విచారించిన) శూన్యమగు, విశ్వ = ప్రపంచముయొక్క, భవ = ఉత్పత్తికిని, స్థితి = ఉనికికిని, అంత = నాశమునకును, ఆదిమూర్తి = కారణ మైనస్వరూపము గలవాఁడును. (ప్రక్కపద్యముతో సంబంధము.)
'''తా'''. వాయుపుత్రా! ఉపనిషత్తులు గీతలు బ్రహ్మసూత్రములు మఱియు నితరములగు శాస్త్రములు నన్నియు నా బ్రహ్మమును గూర్చియే చెప్పును. జాగ్రత, స్వప్నము, సుషుప్తి యను మూఁడవస్థలును ఆపరబ్రహ్మముచేతనే (అనఁగా: నిత్యజ్ఞానముచేతనే) మనము తెలిసికొనుచున్నాము. ఆమహాత్ముఁడే ప్రపంచమునందలి సర్వపదార్థములయందు నేకరూపముతో నున్నాఁడు. యధార్థస్థితిలో శూన్యమైనను ఈ ప్రపంచము పుట్టినట్లును నిలిచి యున్నట్లును నశించినట్లును తోఁచుటకు నాబ్రహ్మమే కారణము (అనఁగా శూన్యమయ్యును సర్పము త్రాటియందు ఉత్పత్తిస్థితివినాశములతోఁ దోఁచిన ట్లీప్రపంచము బ్రహ్మమునందుఁ దోఁచుచున్నదనుట).
{{Telugu poem|type=పంచచామరము.|lines=<poem>ఇలాజలానలానిలాంబరేందుభానుమండలో
జ్జ్వలాఖిలావిలామలాత్మజాలకాంతరస్థచం
చలాచలావిలాసశూన్యసంతతాపరోక్షచి
త్కళాకలాపలాలితప్రకాశకుం డతం డగున్.</poem>|ref=10}}
'''టీ'''. అతండు = ఆయన - ఆబ్రహ్మము, ఇలా...కుండు — ఇలా = భూమియొక్కయు,
జల = ఉదకముయొక్కయు, అనల = అగ్నియొక్కయు, అనిల = వాయవుయొక్కయు,<noinclude><references/></noinclude>
5khxn1mqnxmtu23t722rozz7rtpyc9w
పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/265
104
171202
557983
483218
2026-06-05T01:09:52Z
Ramesam54
3001
/* అచ్చుదిద్దారు */
557983
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Ramesam54" />{{rh| 246 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude><poem></poem>
{{float right| }}
అంబర = అకాశముయొక్కయు, ఇందు = చంద్రునియొక్క యు, భాను = సూరగ్యనియొక్క -
యు, మండల = మండలమనునట్టియు, ఉజ్జ్వల = ప్రకాశించుచున్న, అఖిల = సమస్తమైన,
ఆవిల = అపరిశుద్ధ (పొప) జీవులయొక్కయు, అమల = నిర్మలమైన (పరిశుద్ధ) జీవులయొక్క
యు, ఆత్మ = అంతర్యామియగునట్టియు (ఇచ్చట నంతర్యామియనఁగాః ప్రత్యగాత్మ. పైన
వ్రాయఁబడిన జీవపదమునకు జంతువని యర్థము. ఇదివజకు చెప్పఁబడిన పంచభూతము
లును చంద్ర సూర్యులును ఇప్పుడు చెప్పఁబడిన జీవుఁడును కలిసి యెనిమిదియు పరమేశ్వ
రుని మూర్తులు)జాలక = సోరణగండ్లయొక్క, అంతరస్థ = లోపలనున్నట్టియును, చంచల =
చలించునట్లు గానవచ్చునట్టియు, అచల = స్వభావముగా చంచలము కానట్టియు, అవిలా
స = ప్రకాశింపకుండుట యనుధర్మముతో, శూన్య = రహితమైన (అనఁగాః చిత్తవృత్తులు
జ్ఞానసహాయము చేతనే బాహ్యవస్తువులను ప్రకాశింపఁజేయుచున్నవి శావున అజ్ఞానము
ప్రతివానికిని స్పష్టముగ తెలియుచున్నదని భావము.) సంతత = సర్వవ్యాపకమైన,
అపరోక్షచిత్ = జ్ఞానమనెడు (అపరోక్షమనఁగా: ప్రత్యక్షము 'అహం
బ్రహ్మాస్మి అనుజ్ఞాన మపరోక్షజ్ఞానము.) కళా =కళలయొక్క లేక కాంతులయొక్క,
కలాప = సమూహము యొక్క (జ్ఞానమునందు భేదము లేకపోయినను చిత్తవృత్తుల భేద
ముననుసరించి మూఢులచే భేదములు కల్పింపఁబడుచున్నవి. బాహ్యవస్తువులఁ దెలిసికొ
సుసమయమునందువలెనే "అహంబ్రహస్మి" అని స్వస్వరూపము నెఱుంగునప్పుడుకూడ
భేదములు కల్పింపఁబడుచున్నవి. కావున “కలాకలాప” అని కవి ప్రయోగించియున్నాఁ
డు), లాలిత = మనోహరమైన, ప్రకాశకుఁడు = ప్రకాశమును కలిగించువాఁడు (అనఁగానే
కాంతసమూహమును ప్రకాశింపఁ జేయువాడు; "అహం బ్రహ్మస్మి" అని చిత్తవృత్తి
కలిగినప్పుడు సాధకునకు ’చిత్తవృత్తి బాహ్యవిస్తువులను ప్రకాశింపఁజేసినట్లు పర
బ్రహ్మమును ప్రకాశింపఁజేయువా? లేక అపరబ్రహ్మమే చిత్తవృత్తిని ప్రకాశింపఁజే
యునా! సర్వసాక్షి యగు పరబ్రహ్మమును చిత్తవృత్తి ప్రకాశింపఁజేయుట సంభవిం
పదు; ప్రకాశింపఁజేయదని చెప్పినయెడల “ఆహంబ్రహ్మాస్తే " అనుచిత్తవృత్తి జనిం
చుటకే వీలులేదు. కావున నిందలి నిశ్చయ మెట్లు? అని సంశయము కలుగును. చిత్త
వృత్తికి రెండవదానిని ప్రశింపఁజేయగల సామర్థ్యము నిచ్చినది కూడ పరబ్రహ్మప్ర
శమే. కావున “ పరబ్రహ్మము చిత్తవృత్తిని ప్రకాశింపఁజేయునేకాని చిత్తవృత్తి పర
బ్రహ్మమును ప్రకాశింపఁజేయనేరదు. అనుటయే సిద్ధాంత మునిభావము) అగును.
తా. పృధివ్యాపస్తేజోవాయ్వాకాశములు పుణ్యపాపమిశ్రకర్మవశగతులై దేవ
స్థావరమనుష్యదేహములం దున్న జీవులను సోరణగండ్లయం దాబ్రహ్మమేయున్నాఁడు,
“భూమియను మొదలగు వ్యవహారము లన్నియు పరబ్రహ్మకుఁ గల యా యా యుపాధు
లను బట్టి వచ్చినవే కాని వేఱుకాదు. మఱియు నాయన నిత్యప్రకాశస్వరూపుఁడై
యున్నను చిత్తవృత్తులయందుఁ బ్రతిఫలించి జ్ఞానమని సర్వలోక ప్రసిద్ధముగ వ్యవహ<noinclude><references/></noinclude>
n8iu03981fkq939vlvqxkpr5iotpiem
557998
557983
2026-06-05T07:52:24Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
557998
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 246 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>అంబర = అకాశముయొక్కయు, ఇందు = చంద్రునియొక్కయు, భాను = సూర్యునియొక్కయు, మండల = మండల మనునట్టియు, ఉజ్జ్వల = ప్రకాశించుచున్న, అఖిల = సమస్తమైన, అవిల = అపరిశుద్ధ(పాప)జీవులయొక్కయు, అమల = నిర్మలమైన (పరిశుద్ధ) జీవులయొక్కయు, ఆత్మ = అంతర్యామి యగునట్టియు (ఇచ్చట నంతర్యామి యనఁగా ప్రత్యగాత్మ. పైన వ్రాయఁబడిన జీవపదమునకు జంతువని యర్థము. ఇదివఱకు చెప్పఁబడిన పంచభూతములును చంద్రసూర్యులును ఇప్పుడు చెప్పఁబడిన జీవుఁడును కలిసి యెనిమిదియు పరమేశ్వరుని మూర్తులు), జాలక = సోరణగండ్లయొక్క, అంతరస్థ = లోపలనున్నట్టియును, చంచల = చలించునట్లు గానవచ్చునట్టియు, అచల = స్వభావముగా చంచలము కానట్టియు, అవిలాస = ప్రకాశింపకుండుట యనుధర్మముతో, శూన్య = రహితమైన (అనఁగా: చిత్తవృత్తులు జ్ఞానసహాయముచేతనే బాహ్యవస్తువులను ప్రకాశింపఁజేయుచున్నవి కావున అజ్ఞానము ప్రతివానికిని స్పష్టముగ తెలియుచున్నదని భావము.) సంతత = సర్వవ్యాపకమైన, అపరోక్షచిత్ = జ్ఞాన మనెడు (అపరోక్ష మనఁగా ప్రత్యక్షము 'అహం బ్రహ్మాస్మి ˈఅనుజ్ఞాన మపరోక్షజ్ఞానము.) కళా = కళలయొక్క లేక కాంతులయొక్క, కలాప = సమూహము యొక్క (జ్ఞానమునందు భేదము లేకపోయినను చిత్తవృత్తులభేదము ననుసరించి మూఢులచే భేదములు కల్పింపఁబడుచున్నవి. బాహ్యవస్తువులఁ దెలిసికొనుసమయమునందువలెనే "అహంబ్రహస్మి" అని స్వస్వరూపము నెఱుంగునప్పుడుకూడ భేదములు కల్పింపఁబడుచున్నవి. కావున “కలాకలాప” అని కవి ప్రయోగించియున్నాఁడు), లాలిత = మనోహరమైన, ప్రకాశకుఁడు = ప్రకాశమును కలిగించువాఁడు (అనఁగా నేకాంతసమూహమును ప్రకాశింపఁజేయువాడు; "అహం బ్రహ్మస్మి" అని చిత్తవృత్తి కలిగినప్పుడు సాధకునకు చిత్తవృత్తి బాహ్యవస్తువులను ప్రకాశింపఁజేసినట్లు పర
బ్రహ్మమును ప్రకాశింపఁజేయునా? లేక అపరబ్రహ్మమే చిత్తవృత్తిని ప్రకాశింపఁజేయునా! సర్వసాక్షి యగు పరబ్రహ్మమును చిత్తవృత్తి ప్రకాశింపఁజేయుట సంభవింపదు; ప్రకాశింపఁజేయదని చెప్పినయెడల “ఆహంబ్రహ్మాస్మి" అనుచిత్తవృత్తి జనించుటకే వీలులేదు. కావున నిందలి నిశ్చయ మెట్లు? అని సంశయము కలుగును. చిత్తవృత్తికి రెండవదానిని ప్రకాశింపఁజేయగల సామర్థ్యము నిచ్చినది కూడ పరబ్రహ్మప్రకాశమే. కావున “పరబ్రహ్మము చిత్తవృత్తిని ప్రకాశింపఁజేయునేకాని చిత్తవృత్తి పరబ్రహ్మమును ప్రకాశింపఁజేయనేరదు." అనుటయే సిద్ధాంతమని భావము.) అగును.
'''తా'''. పృధివ్యాపస్తేజోవాయ్వాకాశములు పుణ్యపాపమిశ్రకర్మవశగతులై దేవస్థావరమనుష్యదేహములం దున్నజీవులను సోరణగండ్లయం దాబ్రహ్మమే యున్నాఁడు. “భూమియను మొదలగు వ్యవహారము లన్నియు పరబ్రహ్మకుఁ గల యా యా యుపాధులను బట్టి వచ్చినవే కాని వేఱుకాదు. మఱియు నాయన నిత్యప్రకాశస్వరూపుఁడై యున్నను చిత్తవృత్తులయందుఁ బ్రతిఫలించి జ్ఞానమని సర్వలోక ప్రసిద్ధముగ వ్యవహ<noinclude><references/></noinclude>
npwtbm0qold51j5q8uijxkxuvrl7e66
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/546
104
212269
557984
557951
2026-06-05T03:46:27Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557984
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''152. వేంకటరాజన్న అవధాని '''</p>}}
{{right- ప్రమోద్ అవధాని
అప్పటి నిజాం రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం కరీంనగర్ జిల్లా మంథనిలో శ్రీ వేంకటరాజన్న అవధాని గారు తేది. 10.6.1909న శ్రీ కృష్ణయ్య అవధాని, శ్రీమతి సీతమ్మ దంపతులకు జన్మించారు.
శ్రీ అవధాని గారు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన సంస్థాన విలీనకరణ, స్వాతంత్య్ర పోరాటపు
ఉద్యమాలలో పాల్గొని, సత్యాగ్రహము చేసి నైజాం ప్రభుత్వము చేత అరెస్టుకాబడి, అప్పటి నిరంకుశ నిజాం పోలీసులచే చిత్రహింసలపాలైన వీరు, తమ జీవితంలో ఎంతో ధైర్యముగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా లెక్కచేయక అన్ని ఉద్యమాలలో ముందుండి, అప్పటి స్టేట్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొని, తమ సర్వస్వాన్ని దేశం కొరకు సమర్పించడానికి సిద్ధపడి పోరాటం సాగించినారు.
1946లో అప్పటి ప్రభుత్వం వీరిని అరెస్టు చేసి 6 నెలలు కరీంనగర్ జిల్లా జైలులో బంధించింది.
శ్రీ శ్రీ వేంకట రాజన్న అవధాని గారు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, కవి, పండితులు బహు భాషా కోవిదులు, సంఘ సంస్కర్త, అధివక్త (అడ్వకేట్) ఆయుర్వేద వైద్యులు. "వైద్యపర" బిరుదాంకితులు.
హైద్రాబాద్లో వథాలతో చదవడానికి నివాసముంటున్న సమయంలో శ్రీ కాళోజి నారాయణరావు, శ్రీ వెల్దుర్తి
మాణిక్యరావు గారలతో కలిసి ఆనాటి పరిస్థితులపై చర్చించుకొనేవారు. వారు ముగ్గురు "తెలంగాణా వైతాళికసమితి" పేరుతో ప్రసిద్ధులు.
కొంతకాలం వీరు శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారి సంపాదకత్వంలో వెలువడిన అప్పటి “గోలకొండ పత్రిక”కు
ఉప సంపాదకులుగా పని చేసినారు. తెలంగాణాలో కవులే లేరని, వీరికి కవిత్వమే రాదన్న ఒక అపవాదును సవాలుగా తీసుకొని ప్రతాపరెడ్డిగారు వెలువరించిన "గోలకొండ కవుల సంచిక"లో శ్రీ అవధానిగారి కవిత “మంథెనద్విజలు" అను శీర్షికతో ప్రచురింపబడుట అత్యంత విశేషం. శ్రీ అవధాని గారు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారికి సన్నిహితులు, సమకాలీకులు ప్రతాపరెడ్డి గారు వ్రాసిన "హిందువుల పండుగలు" అనే ఉద్గ్రంథానికి శ్రీ వేంకట రాజన్న అవధాని గారు 'పీఠిక ' వ్రాసినారు. ఈ పుస్తకం ఇటీవలనే
పునర్ముద్రించబడినది.
ఆనాటి “ఆంధ్రమహాసభ కార్యకలాపాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలో చాలా చురుకుగా పాల్గొని దానికి సారథ్యం
వహించి, ఎంతోమంది యువకులను తమ వాగ్ధాటితో ఉద్యమంవైపు ఆకర్షింపజేసి చైతన్యవంతులను చేసిన ఘనత శ్రీ అవధానిగారిదే. అందుకేకావచ్చు అప్పటి మన భారత ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారు మంథని ప్రసక్తి వచ్చినపుడు తరచు "There were times when we used to derive inspiration from shri Avadhani garu" అంటుండేవారు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |525| తేజోమూర్తులు}}</noinclude>
ncl47odsxdowg88svh5xhj33fd1frdr
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/547
104
212270
557985
553488
2026-06-05T03:55:38Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557985
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
ఓసారి శ్రీ పి.వి. గారు మంథనికి భారత ప్రభుత్వం విదేశాంగ శాఖామాత్యుల హోదాలో విచ్చేసినవుడు
స్వయంగా శ్రీ అవధానిగారి ఇంటికి వెళ్ళి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నపుడు వారు అన్న మాటలు
"Mr. Avadhani, T have only friends like you, T have no followers and group".
1945-46 సంవత్సరంలో అవధానిగారు కరీంనగర్ లో తమ న్యాయవాద వృత్తి కొనసాగించుచున్న సమయంలో
ఒకనాటి రాత్రి రజాకర్ ముష్కరులు వీరి ఇంటిమీద దాడి జరిపినపుడు, మొత్తం వారి కుటుంబ సభ్యులంతా కలిసి ఎంతో ధైర్యసాహసాలతో ఆ దాడిని ఎదుర్కొన్నారు. అవధాని గారు గ్రంథాలయోద్యమ నిర్మాతగా, సంఘసంస్కర్తగా అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని జిల్లాలోని అన్ని ముఖ్యమైన సంఘటనలలో ముందుండి పని చేసినారు.
స్వాతంత్య్రానంతరము శ్రీ అవధాని గారు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనువాద సంఘములో అనధికార
సభ్యులుగా 1967-70 కాలంలో పని చేసినారు. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశపు ఏడవ సంపుటములో శ్రీ అవధాని గారు వ్రాసిన వ్యాసము ద్వారా మంథని ప్రాచీన వైభవమును గూర్చిన అనేక చారిత్రక విషయాలు మనకు
తెలియుచున్నవి.
"Census of India 1971, Andhra Pradesh M special survey reports on selected towns- Manthani" అనే ప్రభుత్వ సమాచార శాఖ తరఫున ప్రచురింపబడిన గ్రంథంలో (8వ పేజి) నాటి గణాంక శాఖ డైరెక్టర్ శ్రీ వేదాంతం I.A.S. ఆఫీసర్ గారు, అవధాని గారి గురించి ఇలా వ్రాసారు.
"I visited the town twice before finalizing this monograph and I acknowledge with thanks the enlightened conversations I had with Shri Venkata Rajanna Avadhani, a scholar of infecluctual eminence an Advocate and freedom fighters" వ్రాస్తూ వారిని ఎంతగానో కొనియాడారు.
మరల వారే ఈ గ్రంథం యొక్క 164–165 పేజీలలో శ్రీ అవధాని గారు సాహిత్య, సాంఘిక రంగాలలో చేసిన
సేవలను ఉల్లేలిస్తూ
"In the year 1926, a Telugu Monthly manuscript Magazine (viz) Namely, 'Prabodha Chandrika' was started both in poetry and prose under the editor ship of Shri Avadhani, a local
Scholar. The Editor himself a Scholar, Advocate, Social worker and" vaidya vara".
Shri Venkata Rajanna Avadhani is also author of (1) "Agni Shabda Mahatyam.(2) జన్మరహస్యం "He possesses very intimate knowledge of Art, literature, History and grouth of Manthani Town" అని వీరి ప్రతిభా పాటవాలను
గురించి ఎంతగానో ప్రశంసించారు.
వీరు సంఘ సంస్కర్తగా అనాదిగా వచ్చుచున్న కొన్ని సాంఘిక మూఢాచారాలకు వ్యతిరేకంగా పోరాటము
సలుపుటయేగాక 4 రోజుల “ఉపనయన క్రతువును అనగా వడుగులను కుదించి ఒకరోజులో ముగించవచ్చని, తాము స్వయంగా తమ రెండవ కుమారుని ఉపనయనమును ఒకరోజులో నిర్వహించి ఈ ప్రాంతానికి మార్గదర్శులైనారు.
వీరు హరిజనోద్ధరణకు నడుము బిగించి ఒక హరిజన యువకుని తమవద్ద సహాయకునిగా నియోగించుకొన్నారు.
అతనే స్వాతంత్య్రానంతరము రాష్ట్ర శాసన సభ్యునిగా మేదారం రిజర్వుడు స్థానం నుండి ఎన్నికైనారు. ఇతను
మంథని గ్రామ నివాసియైన గడిపెల్లి రాములు M.L.A. గారు. ఆనాటి ఏ రాజకీయ సభలైనా, సాహితీ సభలైనా వీరు అధ్యక్షత వహించని సంఘటన ఈ ప్రాంతములో చాలా అరుదుగా ఉండేది.
అప్పటి కరీంనగర్ జిల్లా పరిషత్ ఆధ్వర్యాన జరిగిన ఒక సమావేశంలో ధారాళంగా సాగిన వీరి ఉపన్యాసము
బిని, ముగ్ధులై, కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు వీరి దగ్గరకు వచ్చి వీరిని వేదికపైననే అలింగనం చేసుకొని "తెలంగాణా ప్రాంతంలో కూడా ఇంత చక్కటి తెలుగులో మాట్లాడేవారు ఉన్నారని తెలిసి తాను ఆనంద పరవశుడనైతి"నని ఎంతగానో శాఘించారు.
మంథని M.LA గా పని చేసిన శ్రీ గులుకోట శ్రీరాములు గారి షష్ఠి పూర్తి సందర్భంగా ప్రచురింపబడిన
విశేష సంచికలో శ్రీ వేంకట రాజన్న గారి జీవిత సంగ్రహము ప్రచురింపబడినది. భారత స్వాతంత్య్ర 25వ వార్షికోత్సవాల సందర్భంగా 1972లో భారత ప్రభుత్వపు తరఫున<noinclude><references/>
{{rh|తెలంగాణ |526| తేజోమూర్తులు}}</noinclude>
rc6zyagielmi0qoqv4k1le0htqfi1fd
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/548
104
212271
557986
553489
2026-06-05T04:02:07Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557986
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
అవధానిగారి త్యాగాలకు సేవలకు గుర్తింపుగా తామ్రపత్రము రవీంద్రభారతిలో బహూకరింపబడినది. పరకాల గ్రామవాసులు, శ్రీ రేపాల నరసింహ రాములుగారు "కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్యోద్యమ చరిత్ర - సజీవకిరణాలు" అనే పుస్తకంలో శ్రీ అవధాని గారి జీవిత విశేషాలు, నాటి స్వాతంత్య్ర పోరాటంలో వారు నిర్వహించిన విశిష్ట పాత్రను గురించి ఫొటోలతోసహా ప్రచురించారు.
ఈ గ్రంథం పేజి 27లో ప్రచురింపబడిన గ్రూపు ఫొటోలో 1948 సంవత్సరపు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీయుతులు వేంకట రాజన్న అవధాని, కె.వి. నర్సింగ్గారావు, రఘునాథ్ రావ్క్చ, బాడ్ల భూపతి,
గులుకోట శ్రీరాములు, బి.వి. రాంరెడ్డి, కాసం శివరాజం గుప్త, పి.వి. నరసింహారావు, బి. వేంకటరామారావు,
బి. మురళీధర్ రావు గార్లను చూడవచ్చు. శ్రీ వి.వి. గారు అనేక సందర్భాలలో అవధాని గారిని తమ గురువులుగా భావించేవారు.
ప్రజాకవి, పద్మభూషణ్ శ్రీకాళోజి నారాయణ రావు గారికిని, వారి అన్నగారైన శ్రీ కాళోజీ రామేశ్వర రావు
గారికిని శ్రీ అవధానిగారు ఆప్తులు, మిత్రులు, శ్రీ కాళోజి గారి “నా గొడవ” 4వ సంచిక పరాభవ వర్షంను శ్రీ అవధాని గారు 1966 వరంగల్లో జరిగిన సభలో ఆవిష్కరించారు.
దాదాపు 60 సంవత్సరాల క్రితం మంథనిలో బాలికలకు 7వ తరగతి వరకే పాఠశాల విద్యావకాశాలు ఉండినవి. 10వ తరగతి చదవడానికి అవకాశాలే లేవు. ఆ సమయంలో ధైర్యముగా శ్రీ అవధానిగారు తమ రెండవ కుమార్తె శ్రీమతి ప్రేమలతాదేవికిని మరియు శ్రీ లోకీ లక్ష్మణ కర్మగారి కుమార్తె శ్రీమతి క్రాంతి కుమారికిని, అప్పటి
హైద్రాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారి వద్ద సహాయకులుగా మరియు సలహాదారుగా
పనిచేస్తున్న శ్రీ వరహాల భీమయ్యగారి చొరవతో ప్రభుత్వము నుండి ప్రత్యేక అనుమతి పొంది ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బాలికలకు ప్రవేశము కల్పించి, 10వ తరగతి వరకు విద్యాప్రకాశములను కల్పించినారు.
ఆడపిల్లలకు చదువు ఎందుకు? ఇంటిపని, వంటపని చూసుకుంటే చాలు. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసి ఉల్లేలాలా? అని అనుకొనే రోజుల్లో శ్రీ అవధానిగారి కృషి వలన అనేకమంది బాలికలకు తమ ఉన్నత విద్యాభ్యాసానికి మార్గదర్చుకులైనారు. స్త్రీ విద్యను ప్రోత్సహించినారు. తమ అందరు కుమార్తెలను డిగ్రీ వరకు చదివించిన ఘనత శ్రీ అవధాని గారికే దక్కుతుంది.
ఆ తరువాతి కాలంలో బాలికలకు పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి కావలసిన
స్థలాన్ని శ్రీరాజు వేంకట ముత్యంరావు గారి గదిని వారిచే మంథని ప్రజలకు దానమిప్పించిన ఘనత శ్రీ అవధాని గారి కుమార్తె శ్రీమతి ప్రేమలతాదేవి గారిదే అని తెలుపడం సమంజసంగా ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వ పురావస్తు, మ్యూజియంల శాఖకు సలహాదారులుగాను, పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క
ప్రాముఖ్యతను నాటి కాలంలో అమలులో ఉండిన వ్యవస్థకు అనుగుణంగా పంచాయితీ సమితుల సభ్యులకు తెలుపడానికి ప్రభుత్వము వారిపక్షాన ఉపన్యాసకులుగా కూడా పనిచేశారు.
శ్రీ అవధానిగారు తమ 87వ ఏట తేది 22.09.1995 నాడు మంథనిలోని వారి స్వగృహంలో తుది శ్వాస విడిచి
ఇహలోకయాత్ర చాలించినారు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |527| తేజోమూర్తులు}}</noinclude>
sam79duecrprglyzvxez28wywcdoo46
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/549
104
212272
557987
553490
2026-06-05T04:02:56Z
A.Murali
3019
557987
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>153
న ల్లగొండ జిల్లా సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమానికి,
సాహితీ ప్రచారానికి, సంఘ సంస్కరణకు శ్రీకారం
చుట్టిన షబ్నవీసు వెంకట రామ నరసింహారావు గారు తన
జీవితాన్ని సాహితీ సేవకు, సమాజ స్ఫూర్తిని అర్పించిన
మహానుభావులు.
వార్త లేనిచో లోకము అంధకార బంధురమవుతుందని
భావించి వార్తలను ప్రజలకు అందచేసే పత్రికలేని పక్షంలో
ప్రజలకు రక్షణ కరువవుతుందని పత్రిక అవసరాన్ని గుర్తించి
నల్లగొండ జిల్లాలో 24 ఆగష్టు 1922లో 'నీలగిరి' అను
పేర పత్రికను స్థాపించి ప్రజాసేవ చేసిన ధన్యుడు.
ఆనాడు నిజాం పాలనాకాలంలో నిర్భంధాన్ని
అధిగమించి ఉస్మానియా ముద్రణాలయం స్థాపించి దాని
ద్వారా 'సంస్కారిణి గ్రంథమాల' నెలకొల్పి దాని ద్వారా
ప్రతి నెల ఒక మంచి పుస్తకాన్ని అందించి ఎనలేని సాహితీ
సేవ చేశారు.
షబ్నవీసు వెంకట రామ నరసింహారావు గారు 1896
నవంబరు నెలలో షబ్నవీసు లక్ష్మీ నారాయణ రావు, రంగ
నాయకమ్మలకు జన్మించారు. లక్ష్మీ నారాయణరావు గారి
తండ్రి గోపాలరావు గారు నల్లగొండకు సమీపాన గల
మామిళ్ళగూడెం గ్రామాన్ని ముఖాగా సంపాదించారు. వీరు
ప్రతి సం॥ము హైదరాబాదు వెళ్ళి నిజాం ప్రధాని అయిన
నవాబు సాలార్జంగ్ బహదూరును వారి అనుచరులను
వెంకట రామ నరసింహారావు
- షబ్నవీసు ఇందిర
కలిసి వచ్చేవారు. లక్ష్మీ నారాయణ రావు గారు కొన్ని
సంవత్సరములు ప్రభుత్వ ఉద్యోగము చేసి కొన్ని గ్రామాల్లో
భూములు, వ్యవసాయం చేయిస్తూ మామిళ్ళగూడెంలో పెద్ద
బంగళా కట్టించిన సంపన్నులు. వీరి కుమారుడు వెంకట
రామ నరసింహారావు స్వయం కృషితో సంస్కృతాంధ్ర, పారసీ,
ఉర్దూ భాషలలో పాండిత్యం సంపాదించినారు.
పదహారవయేట పులిజాల తిరుమలరావు, రామ
చూడమ్మ గారి జ్యేష్ఠ కుమార్తె మరియు పులిజాల రంగారావు
గారి సోదరి రాధమ్మను వివాహం చేసుకొని ఆ తరువాత
ఆమె పేరును జానకీబాయిగా మార్చినారు. ఆమెకు ఆంధ్ర
భాషలో ప్రవేశం కలిగించి, గ్రంథావతరానికై నరసింహరావు
గారు చాలా కృషి చేశారు.
నల్లగొండలో ఆ రోజుల్లో మహబూబియా రీడింగు
రూము అనే పేరున అనే గ్రంథాలయం ఉండేది. 18 మార్చి
1918లో ఆనాటి అవ్వల్ తాలుకు దార్ ఆధ్వర్యంలో వెంకట
రామ నరసింహరావు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆంధ్ర
సరస్వతీ నిలయమనే పేరున ఒక గ్రంథాలయాన్ని స్థాపించి
నిర్వహించారు. ఈ గ్రంథాలయం ఆ తర్వాత జిల్లా
గ్రంథాలయ సంస్థలో విలీనం అయింది.
12 నవంబరు 1921 నాడు హైదరాబాదు నగరంలో
సంఘ సంస్కార సభ, మహిళా విశ్వవిద్యాలయ స్థాపకుడు
అయిన కార్వే పండితుని అధ్యక్షతన జరిగింది.
Thashah : తెలంగాణ (528 తేజోమూర్తులు ఉయబడుతు
తేజోమూర్తులు denied<noinclude><references/>
{{rh|తెలంగాణ |528| తేజోమూర్తులు}}</noinclude>
9fex0z19fphvz7lb5d2yjklrw91js2v
557993
557987
2026-06-05T06:22:53Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557993
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''153. వెంకట రామ నరసింహారావు '''</p>}}
{{right|- షబ్నవీసు ఇందిర}}
నల్లగొండ జిల్లా సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమానికి, సాహితీ ప్రచారానికి, సంఘ సంస్కరణకు శ్రీకారం
చుట్టిన షబ్నవీసు వెంకట రామ నరసింహారావు గారు తన జీవితాన్ని సాహితీ సేవకు, సమాజ స్ఫూర్తిని అర్పించిన మహానుభావులు.
వార్త లేనిచో లోకము అంధకార బంధురమవుతుందని భావించి వార్తలను ప్రజలకు అందచేసే పత్రికలేని పక్షంలో ప్రజలకు రక్షణ కరువవుతుందని పత్రిక అవసరాన్ని గుర్తించి నల్లగొండ జిల్లాలో 24 ఆగష్టు 1922లో 'నీలగిరి' అను పేర పత్రికను స్థాపించి ప్రజాసేవ చేసిన ధన్యుడు.
ఆనాడు నిజాం పాలనాకాలంలో నిర్భంధాన్ని అధిగమించి ఉస్మానియా ముద్రణాలయం స్థాపించి దాని ద్వారా 'సంస్కారిణి గ్రంథమాల' నెలకొల్పి దాని ద్వారా ప్రతి నెల ఒక మంచి పుస్తకాన్ని అందించి ఎనలేని సాహితీ
సేవ చేశారు.
షబ్నవీసు వెంకట రామ నరసింహారావు గారు 1896 నవంబరు నెలలో షబ్నవీసు లక్ష్మీ నారాయణ రావు, రంగ
నాయకమ్మలకు జన్మించారు. లక్ష్మీ నారాయణరావు గారి తండ్రి గోపాలరావు గారు నల్లగొండకు సమీపాన గల
మామిళ్ళగూడెం గ్రామాన్ని ముఖాగా సంపాదించారు. వీరు ప్రతి సం॥ము హైదరాబాదు వెళ్ళి నిజాం ప్రధాని అయిన నవాబు సాలార్జంగ్ బహదూరును వారి అనుచరులను కలిసి వచ్చేవారు. లక్ష్మీ నారాయణ రావు గారు కొన్ని సంవత్సరములు ప్రభుత్వ ఉద్యోగము చేసి కొన్ని గ్రామాల్లో భూములు, వ్యవసాయం చేయిస్తూ మామిళ్ళగూడెంలో పెద్ద బంగళా కట్టించిన సంపన్నులు. వీరి కుమారుడు వెంకట రామ నరసింహారావు స్వయం కృషితో సంస్కృతాంధ్ర, పారసీ, ఉర్దూ భాషలలో పాండిత్యం సంపాదించినారు.
పదహారవయేట పులిజాల తిరుమలరావు, రామ చూడమ్మ గారి జ్యేష్ఠ కుమార్తె మరియు పులిజాల రంగారావు
గారి సోదరి రాధమ్మను వివాహం చేసుకొని ఆ తరువాత ఆమె పేరును జానకీబాయిగా మార్చినారు. ఆమెకు ఆంధ్ర భాషలో ప్రవేశం కలిగించి, గ్రంథావతరానికై నరసింహరావు గారు చాలా కృషి చేశారు.
నల్లగొండలో ఆ రోజుల్లో మహబూబియా రీడింగు రూము అనే పేరున అనే గ్రంథాలయం ఉండేది. 18 మార్చి
1918లో ఆనాటి అవ్వల్ తాలుకు దార్ ఆధ్వర్యంలో వెంకట రామ నరసింహరావు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆంధ్ర సరస్వతీ నిలయమనే పేరున ఒక గ్రంథాలయాన్ని స్థాపించి నిర్వహించారు. ఈ గ్రంథాలయం ఆ తర్వాత జిల్లా గ్రంథాలయ సంస్థలో విలీనం అయింది.
12 నవంబరు 1921 నాడు హైదరాబాదు నగరంలో సంఘ సంస్కార సభ, మహిళా విశ్వవిద్యాలయ స్థాపకుడు
అయిన కార్వే పండితుని అధ్యక్షతన జరిగింది.<noinclude><references/>
{{rh|తెలంగాణ |528| తేజోమూర్తులు}}</noinclude>
lq930f5lbg1fqo2npmhdwvs6owrbpxd
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/550
104
212273
557994
553491
2026-06-05T06:31:00Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557994
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
అతని అధ్యక్ష ఉపన్యాసం మరారిలోను, ఇంగ్లీషులోను జరిగింది. తదనంతరం వక్తలందరు మరాఠి, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో అచ్చట ప్రవేశపెట్టిన తీర్మానాలపై ప్రసంగిస్తూ వచ్చారు. ఈ విషయం ఈ సమావేశానికి హాజరయిన తెలుగు ప్రముఖుల మనస్తాపానికి కారణమయింది. దానిలో నగరంలో సుప్రసిద్ధ న్యాయవాదిగా ఉన్న శ్రీ అలంపల్లి వెంకట రామారావు గారు ఒక తీర్మానంపై తెలుగులో ప్రసంగించడానికి ఉపక్రమించగానే సభికులు అరచి గోల చేసి ప్రసంగం కొనసాగనీయకుండా చేశారు. ఈ సంఘటన మాతృభాషకు జరిగిన అవమానంగా భావించి వెంటనే సభలోయున్న తెలుగువారు సభా కార్యక్రమాలు పూర్తికాక ముందే నిరసన తెలుపుతూ బయటకు వచ్చేసారు. ఈ సంఘటన ఆంధ్ర జనకేంద్ర సంఘ స్థాపనకు బీజం వేసింది. కొంతమంది ప్రముఖులు టేకుమాల రంగారావు, మాడపాటి హనుమంతరావు గారు, మిట్టూ లక్ష్మీ నరసయ్య గారు, ఆదిరాజు వీరభద్రరావు గారు, నడింపల్లి, జానకీరామయ్య గారు, బూర్గుల రామక్రిష్ణారావు గారు, ముందుముల నరసింగరావు గారు, బోయినపల్లి వెంకట రామారావు గారు, కొమ్మవరపు సుబ్బారావు గారు, బూర్గుల నరసింహారావు గారు, పండిట్ రామస్వామి నాయుడు గారు సమావేశమై ఆ రాత్రి ఆంధ్ర జన సంఘమును స్థాపించారు. సం॥ చందా ఒక రూపాయి నిచ్చువారు సభ్యులుగా తీర్మానించారు. నూరుగురు సభ్యులు గల ఆంధ్ర జన సంఘం మొదటి సమావేశం కొండా వెంకట రంగారెడ్డి అధ్యక్షతన రెడ్డి విద్యాలయం లో 1922 ఫిబ్రవరి 24న జరిగింది. మార్చి మరియు ఏప్రియల్ నెలలలో మరో రెండు సమావేశములు
జరిగాయి.
ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటానికి షబ్నవీసు వెంకట రామ నరసింహారావు గారు 24 ఆగష్టు
1922లో 'నీలగిరి' పత్రికను నల్లగొండలో ప్రారంభించారు. ఆంధ్ర జన కేంద్ర సంఘ ప్రథమ సమావేశము హైదరాబాదు లోని ట్రూపు బజారులో గల మాడపాటి హనుమంతరావు గారి ఇంట్లో 27 జూలై 1923న జరిగింది. ద్వితీయ సమావేశము 'నీలగిరి' పత్రికా సంపాదకులు షబ్నవీసు వేంకట రామ నరసింహారావు కార్యాలయ ఆవరణలో నల్లగొండ నందు 21 మార్చి 1924న జరిపినారు. ఈ సమావేశానికి రావు బహదూర్ వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. తెలంగాణా జిల్లాల నుండి 7 గురు ప్రతినిధులు, వివిధ జిల్లాల నుండి 50 మంది ప్రేక్షకులు హాజరయినారు.
ఈ సభలో చిత్రాడ జమిందారు, సాహిత్య పోషకుడు చెలికాని లచ్చారావు, శతక కవుల చరిత్ర గ్రంథకర్త,
సాహితీవేత్త వంగూరి సుబ్బారావుల మృతికి సంతావం ప్రకటించిరి. ఈ సభలో ప్రముఖులు కొన్ని ముఖ్యమైన
నిర్ణయాలు తీసుకొనుట జరిగినది. మొదటిది నిజాం రాష్ట్రంలో ఆంధ్రోద్యమ వ్యాప్తికి "నిజాం రాష్ట్రాంధ్రనిధి”ని
ఏర్పాటు చెయ్యాలని దానికి కొండా వెంకట రంగారెడ్డి వ్యవహారకర్తలుగా ఉండాలని నిర్ణయించినారు. రెండవది
వేతనముతో పూర్తికాలము పని చేయుటకు ప్రచారకుని నియమించాలని, మూడవది - "ఆంధ్ర పరిశోధక మండలి” అను పేరుతో స్థాపితమైన ఐమఱ్ఱజు వెంకట లక్ష్మణరావు మరణించిన తరువాత "లక్ష్మణ రాయ పరిశోధన మండలి"గా నామకరణము చేయబడిన పరిశోధన సంఘం ఆంధ్రజన సంఘము ఆఫీసులో పని చేయుచుండెను. దానిని కేంద్ర సంఘము యాజమాన్యము క్రింద వచ్చునట్లు నిర్ణయించినారు. నాలుగవ నిర్ణయము - హెచ్.ఎస్.ఎస్.సి. ఉస్మానియా విశ్వ విద్యాలయపు, మెట్రిక్, ఇంటర్మీడియట్, బి.ఓ. పరీక్ష లందు ఆంధ్ర భాషలలో ప్రథములుగా వచ్చిన వారికి బంగారు, వెండి పతకములతో సత్కరించాలని, ఐదవది -ఆంధ్ర వాఙ్మయం ప్రచారము చేయుటకు పరీక్షల నేర్పాటు చేయుటకు ఒక విధానము సిద్ధము చేయాలని నిర్ణయించినారు. ఆరవది - నిజాం రాష్ట్రంలో ఆంధ్ర స్థితులను తెలుపు లఘు పుస్తకమును వ్రాయించి, తగిన వెలకు విక్రయించాలని నిర్ణయించినారు.
నల్లగొండ నందు ఈ సమావేశము ముగింపున బహిరంగ సభను పింగళి వెంకట రామారెడ్డి అధ్యక్షతన
నిర్వహించారు. ఈ సభలో శేషాద్రిరావు వకీలు, మాల్వీ మన్సూర్ సాహెబ్, ఇంకొందరు నాయకులు ప్రసంగించారు. ప్రభుత్వం నందలి లామిరాల్ శాఖలో ఉద్యోగం చేయుచుండిన శ్రీ కూర్మారావు గారు కేంద్ర సంఘ సభ్యులకు ఆ రాత్రి విందును ఏర్పాటు చేసినారు. హైదరాబాద్ నుండి కాక తెలంగాణా జిల్లాల నుండి వెలువడిన తెలుగు పత్రికలు రెండు. ఇవి 1922లో ఆగష్టు నెలలో నాలుగు రోజుల<noinclude><references/>
{{rh|తెలంగాణ |529| తేజోమూర్తులు}}</noinclude>
p3ynrxvvtpsecso0tqyckut4a702mly
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/551
104
212274
557995
553492
2026-06-05T06:40:49Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557995
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
వ్యత్యాసంలో ప్రారంభమైనవి. 1922 ఆగష్టు 24న మొదలైన నీలగిరి పత్రిక మొట్టమొదటి పూర్తిస్థాయి రాజకీయ పత్రిక. ఆగష్టు 27న వరంగల్ జిల్లా మానుకోట, తాలుకా ఇనుగుర్తి నుండి "తెనుగు పత్రిక" ప్రచురింపబడింది. ఈ పత్రిక సంపాదకులు వొద్దిరాజు సీతారామచంద్రరావు, వొద్దిరాజు రాఘవ రంగారావు సోదరులు.
1925 వరకు నీలగిరి పత్రికను అత్యంత సమర్థతతో షబ్నవీసు వెంకట రామ నరసింహారావు గారు నడిపారు.
ఆనాటి ప్రముఖ నాయకులైన మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు గారు, పులిజాల రంగారావు గారు తదితరులు వివిధ విషయాలపై ఈ పత్రికలో ఎన్నో కవితలు, వ్యాసాలు రాసేవారు. ఆ రోజులలో గుడిపాటి వెంకటాచలం రాసిన ఒక సంచలనాత్మకమైన కథను పత్రికలు ప్రచురించడానికి నిరాకరించాయి. అప్పుడు షబ్నవీసు వారు నీలగిరి పత్రికలో ఆ కథను ప్రచురించి సంచలనం సృష్టించారు.
షబ్నవీసు వెంకట రామ నరసింహారావు గారు 'నీలగిరి' పత్రికతోపాటు "వీరేశలింగం కంఠాభరణ గ్రంథమాల" అని పేరు పెట్టారు. ఈ గ్రంథమాల పక్షాన దాదాపు పది పుస్తకాలను ప్రచురించారు. అందులో ఒకటి వెంకట
నరసింహారావు గారి తండ్రి ప్రేరణతో "మామిళ్ళ గూడెం మత్త, రామాశ్రీ ఆంజనేయ ధార్మిక దేవ" అనే మకుటంతో శేష భట్టారు రామానుజాచార్యులు రచించిన శతకం ప్రచురించారు. "సంస్కారిణి గ్రంథమాల" అనే సంస్థ ద్వారా నెలకో పుస్తకం అందించే కార్యక్రమంలో భాగంగా "బాలికా విలాపం" అను గ్రంథాన్ని 1921లో తొలి గ్రంథంగా రచించారు. ఈ గ్రంథంలో సమాజంలో ఉన్న దురాచారాలు, దర్నీతి ప్రజలందరికి తెలియచేసే ఉద్దేశంతో రచించారు. ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఈ “బాలికా విలాప” రచనను చేపట్టలేదని నరసింహారావు గారు తమ అవతారికలో పేర్కొన్నారు.
నీలగిరి పత్రికా ప్రచురణకు నరసింహారావు గారి భార్య జానకీబాయి గారి ప్రోత్సాహం ఎంతో ఉంది. కందుకూరి
వీరేశలింగం గారి స్ఫూర్తితో స్త్రీ విద్య, వితంతు వివాహం ప్రయత్నాల కృషి నరసింహారావు గారు,జానకీబాయిలు చేపట్టారు. జానకీబాయి వితంతు సోదరి పునర్వివాహానికై దంపతులిద్దరు ప్రయత్నిస్తున్న సందర్భంలో నరసింహారావు బాలికా విలాపం శ్రీ ద్వారా బాల్య వివాహ వ్యవస్థను అంతమొందించడానికి ఈ రచనను అందించారు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నలుగురు అక్కచెల్లెళ్ళు దీనగాథే ఈ 'బాలికా విలాపం'. పసి వయసులో పెళ్ళి జరిగి ఈ సోదరీమణులు ఆదరణ లేక, ఇతరుల సహాయంలేక, ఆత్మహత్యకు ప్రయత్నిస్తారు. ఆ గాథనే 'బాలికా విలాపం'గా రచించారు.
నరసింహారావు గారి భార్య జానకీబాయి జీవితాన్ని “ఉదయలక్ష్మీ" అను పేరుతో శేషాద్రి రమణ కవులు రచించిన
107 పద్యాలను కూడా ప్రచురించారు. షబ్నవీసు వెంకట రామ నరసింహారావు గారి భార్య జానకీబాయి నీలగిరి
పత్రికా ప్రచురణకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది. కానిపత్రిక ప్రారంభించిన రోజే ఆమె మరణించింది. ఆమె జ్ఞాపకార్ధం పత్రిక ముఖపత్రం మీద....
<poem>
"పూస ప్రాయము నందు యీ భూమిని విడిచి
స్వర్గగతమైన తన తల్లి షబ్నవీసు
జానకీబాయి స్మారక శాసనముగ
నీలగిరి పత్రికా పుత్రి నెగడుగాతో".</poem>
అనే పద్యాన్ని ప్రచురించేవారు. ఆమె జ్ఞాపకార్థం దేశాభివృద్ధి, భాషాభివృద్ధికాక ఆమె ఆత్మశాంతికై నీలగిరి
పత్రికను నడిపారు. జానకీబాయి భర్తకు అన్ని విషయాలలో సహకరిస్తూ ప్రోత్సాహనిచ్చి తోడు నీడగా నిలిచిన ఆదర్శ గృహిణి. స్త్రీకి విద్యలేని రోజుల్లో గ్రంథాలు చదివి ధర్మం, నీతిని గ్రహించిన సద్గుణశీలి. షబ్నవీసు వెంకట రామ నరసింహరావు మిత్రులైన శేషాద్రి రమణ కవులు జానకీబాయి మరణానికి తపించి తమ మిత్రుల ఆవేదన తమ ఆవేదనగా భావించి, తమను ఆదరించిన ఆమె జీవితాన్ని స్మృతి కావ్యరూపంగా 'ఉదయలక్ష్మి" పేర మలిచి ఆమె చరిత్రను లోకోత్తరం చేశారు. ఆమె కార్యాచరణను గూర్చి తెలుపుతూ....
<poem>
"సంఘ సంస్కరణమ్ము సలుప నెంచును గాని
విగ్రహారాధన విముఖగాదు.
విధలా జనోద్వాలూ విధనియ్యగాను గాని
ప్రౌఢ వివాహ తత్పరత లేదు.
స్త్రీ విద్యకై కృంగి చేయుచుందును గాని
స్త్రీ స్వతంత్రమున కాగింపబోదు.</poem><noinclude><references/>
{{rh|తెలంగాణ |530| తేజోమూర్తులు}}</noinclude>
m28ykrpip4c8ul797ogjhyyrzf4qcmx
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/552
104
212275
557996
553493
2026-06-05T06:47:19Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557996
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude><poem>
భర్త కేలూతతో పనులు తీర్చును గాని
స్వచ్ఛంద మతితోట సాగిరాదు
తల్లిగా తండ్రిగా పతి తలంచుగాని
శూన్య వాదంబునకు మదిచొచ్చనీదు
జానకీ బాయి నాజన్య నా హృదయంబు
లభయ వంశంబులకు కీర్తి నొసగసాగె </poem>
జానకీబాయి చివరి రోజులలో కూడా భర్త నిర్వహించిన కార్యక్రమాలకు బాసటగా నిలిచింది.
నీలగిరి పత్రికకు శ్రీ వెంకట రామ నరసింహారావే సంపాదకులు. నీలగిరి పత్రిక ప్రథమ సంపాదకీయంగా
జానకీబాయి మరణాన్ని గూర్చే రాయబడింది. దాదాపు అయిదు సం॥రాలు నీలగిరి పత్రికను నిర్వహించారు.
ఒద్దిరాజు సోదరులు ప్రారంభించిన వరంగల్లోని తెనుగు పత్రిక, నల్లగొండలోని నీలగిరి పత్రిక ఒకేసారి ప్రారంభ
మయి ఒకేసారి నిలిపివేయబడ్డాయి.
నీలగిరి పత్రికలో నిజాం దేశ వార్తలు, నీలగిరి గ్రంథాలయాలు, నవలా ప్రపంచం, తాళపత్ర గ్రంథాలు,
వృత్తాంతములు, పుక్కిటి పురాణాలు మొ॥లు శీర్షికలు ఉండేవి. షబ్నవీసు వెంకట రామ నరసింహారావు వ్రాసే
సంపాదకీయాలు, ఆనాటి రాజకీయ, సాంఘిక, సాహిత్య, సంగీత, శిల్ప కళలకు సంబంధించిన అనేక విషయాలపై ప్రముఖంగా ఉండేవి. ఈ నీలగిరి పత్రిక కొన్ని ప్రతులు నాంపల్లిలోని వేమన గ్రంథాలయంలో మాత్రమే నేటికీ చూడవచ్చు.
ఈ పత్రికలో బూర్గుల రామక్రిష్ణారావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, శేషభట్టరు
రామానుజాచార్యులు, శేషాద్రి రమణ కవులు, గవ్వా అమృతరెడ్డి సోదరులు మొ||వి. ఎందరివో రచనలు
ప్రచురించేవారు. శేషభట్టరు వెంకట రామానుజాచార్యులు రచించిన “ఆంధ్ర నామ సంగ్రహం" లకు పేరడీ పద్యాలు నీలగిరి పత్రికలో ప్రచురించబడ్డాయి. కె. రాములు "బుద్ధుని సందేశం" అనే పేరుతో ఒక శీర్షిక నిర్వహించేవారు. ఆంధ్ర ప్రాంతం నుండి తెలంగాణాలో అడుగుపెట్టిన శేషాద్రి రమణ కవులను శ్రీ వెంకట రామ నరసింహారావు గారు ఆదరించి నల్లగొండలో వీరి అవధానాన్ని ఏర్పాటు చేసి ఆర్ధికంగా తోడ్పాటును అందించారు. ఆ మైత్రి నరసింహారావు మరణం వరకు కొనసాగి నీలగిరి పత్రికలో అనేక వ్యాసాలను,
పద్యాలను రచించారు.
22 ఫిబ్రవరి 1925న ఆంధ్ర గ్రంథాలయ మొదటి మహాసభ మధిరలో జరిగినప్పుడు పింగళి వెంకట రామారెడ్డి
గారు అధ్యక్షత వహించారు. దానిలో నీలగిరి గ్రంథాలయం తరపున శ్రీ షబ్నవీసు వెంకటరామ నరసింహారావు కూడా పాల్గొన్నారు.
షబ్నవీసు వెంకట రామ నరసింహారావు గారు ఈ పత్రిక నిర్వహణ సందర్భంగానే అనారోగ్యంపాలై 18 అక్టోబరు 1929న మరణించారు. వీరి మరణం తెలంగాణా లో జరిగిన ఆంధ్రోద్యమానికి సాహితీ సాంస్కృతోద్యమాలకు
తీరని లోటు.
నల్లగొండలో ఆంధ్ర సారస్వత గ్రంథాలయ స్థాపకుడు, దురాచారాల నిర్మూలనకు ధర్మపత్ని సహకారం పొందినవాడు, భాషా, సంస్కృతి వ్యాప్తికి 'నీలగిరి' వార్తా పత్రిక నడిపినవాడు “షబ్నవీసు వెంకట రామ నరసింహారావు మన "తెలంగాణా తెలుగు తేజమే”.<noinclude><references/>
{{rh|తెలంగాణ |531| తేజోమూర్తులు}}</noinclude>
7231cjgpcju5ex12886ex1ibg2736ud
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/148
104
212593
557981
554816
2026-06-04T22:10:01Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
557981
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. వసుధాధిపనందన! పార్వతీ! దక్షిణాశన్ = దక్షిణపుదిక్కున; బ్రహ్మవిద్యానిధిసేవితంబున్ = బ్రహ్మవిద్య (వేదాంతవిద్య)యం దాఱితేఱిన పండితులచే సేవింపఁబడినది; నవహస్తమితంబు = తొమ్మిదిచేతులనిడివి కలది; అచ్ఛోన్ = అక్కడ; అలవోకయుంబలెన్ = అశ్రమముగ - స్వేచ్ఛగా; క్రుంకి = స్నానము చేసి; మాధవధ్యానము = శ్రీకృష్ణుని ధ్యానమును; అపవర్గదుర్గముల్ = ప్రవేశింపసాధ్యముకాని మోక్షములు; అబ్రములే! = వింతలు కావు; మోక్షములు సుగమములని భావము.
{{Telugu poem|type=క.|lines=<poem>చక్రస్తని! తజ్జలములఁ
జక్రాలంకృతశిలానిచయ ముదయించున్
శక్రముఖాఖిల<ref>క. మధు, చ. మఖ</ref>మఖభు
క్చక్రము గొనియాడు దత్ప్రశస్తగుణంబుల్.</poem>|ref=148}}
'''టీక'''. చక్రస్తని! = జక్కవలఁ బోలు చన్నులు కల పార్వతీ! చక్రాలంకృతశిలానిచయము = చక్రముల చిహ్నములు కల రాళ్లసమూహము; ఉదయించున్ = పుట్టును; శక్రచక్రము = ఇంద్రుఁడు మొదలుగాఁ గల దేవతలసమూహము; తత్ప్రశస్తగుణంబుల్ = చక్రతీర్థపుగొప్పగుణములను; కొనియాడున్.
{{Telugu poem|type=శా.|lines=<poem>ఆతీర్ధంబునకుం గృతాంతదిశ నాద్యం బార్తివైద్యంబు ల
క్ష్మీతీర్ధం బన నొక్కతీర్ధము ప్రకాశించున్ రమాదేవి వీ
తాతంకస్థితి నచ్చటం దపము సేయన్ నేర్చికా తొల్లి యా
దైతేయారిభుజాంతరాళమణిసౌధం బెక్కెఁ బెన్మక్కువన్.</poem>|ref=149}}
'''టీక'''. కృతాంతదిశన్ = దక్షిణదిక్కున; ఆద్యంబు = తరువాతిది; ఆర్తివైద్యంబు = మనోరోగమునకు మందైనది; రమాదేవి = లక్ష్మీదేవి; వీతాతంకస్థితిన్ = పోయిన సందేహము కలుగునట్లు - సందేహము పోవునట్లు; నేర్చికా = నేర్చియేకదా - నేర్చుకొనుటచేతనేగదా! పెన్మక్కువన్ = మిక్కిలిప్రేమతో; దైతేయా...సౌధంబు = రాక్షసవిరోధియగు విష్ణుని వక్షఃస్థలమను మణులు తాఁపిన మేడను; ఎక్కెన్. '''అలం'''. రూపకము.
{{Telugu poem|type=సీ.|lines=<poem><ref>చ. భూతా</ref>ధూతాఘమైన లక్ష్మీతీర్ధమునకు ద
క్షిణమున గౌమోదకియును బద్మ
మును శంఖమును జక్రమును నిజనామచి
హ్నములుగా వెలయుదీర్దములు పొలుచు
మెలఁత! యీనాల్గు లక్ష్మీతీర్ధ<ref>క. మున, చ. మును</ref>మునఁ గూడి
శక్తిపంచకనామసంప్రయుక్తిఁ
దళుకొత్తు వీనివిస్తారంబు షష్టిహ
స్తిప్రమా<ref>క. ణంబన, చ. ణంబున</ref>ణంబునఁ జులియుండుఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>బరమపావనంబు పాతకనిర్మూల
నైకకర్మకంబు లోకనుతము
తత్ప్రభావ మసురదమనున కీ యేను
ప్రాణధనము లగుచుఁ బ్రణుతి వడయు.</poem>|ref=150}}
'''టీక'''. ధూతాఘమైన = పాపములను నశింపఁజేయునట్టి; నిజనామచిహ్నములుగాన్ = తమపేళ్లతోఁ గూడినవిగా; వెలయు = ప్రకాశించు; పొలుచున్ = ఉండును; శక్తి...యుక్తిన్ = శక్తిపంచకము అనుపేరు కలిగి; తళుకొత్తున్ = సొగసుమీఱును; విస్తారంబు = నిడివి; షష్టి...ణంబునన్ = అఱువదిచేతులప్రమాణమున; పరమపావనంబు = మిక్కిలి పవిత్రమైనది; పాతకనిర్మూలనైకకర్మకంబు = పాపములను నశింపఁజేయు ప్రధానమగు పని కలది; లోకనుతము = లోకులచే కొనియాడఁబడునది; అసురదమనునకున్ = రాక్షసులను మర్దించు విష్ణువునకు; ఈయేను = లక్ష్మీ, కౌమోదకీ, పద్మ, శంఖ, చక్రతీర్థము లను ఐదుతీర్థములును; ప్రణుతి వడయున్ = కొనియాడఁబడును.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆమధువైరిదివ్యతనువై సకలోన్నతమూర్తియై దశ
వ్యామవిశాలమై పరమమై భువత్రితయాభిగమ్యమై</poem>|ref=}}<noinclude><references/></noinclude>
g2g5vazw2kkcjip6ultrjkxxdzq7jjl
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/149
104
212594
557989
554817
2026-06-05T05:17:51Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
557989
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>యీ మును విన్నతీర్థముల కెక్కువ చూపుచుఁ బౌండరీక మ
క్షామగుణాభిరామ మనఁగా వినఁగా గనఁగాఁ దగుం<ref>ట. మహిన్</ref>దగున్.</poem>|ref=151}}
'''టీక'''. ఆమధు...తనువై = ఆ విష్ణుని తీర్థస్వరూపమయి; సకలోన్నతమూర్తియై = అన్నింటను గొప్పస్వరూపము కలదై; దశవ్యామవిశాలమై = పదిబారలనిడివి కలదై; భువనత్రితయాభిగమ్యమై = మూఁడులోకములను పొందఁదగినదయి; ఈ మును విన్నతీర్థములకున్ = ముందు నీవు విన్న యీతీర్థములన్నింటికంటెను; ఎక్కువ = గొప్పతనమును; అక్షామగుణాభిరామము = తక్కువకాని గుణములచే ఇంపైనది.
{{Telugu poem|type=సీ.|lines=<poem>నిడువాలుఁగనుచూపు నిగిడినచో నెల్ల
<ref>చ. బేరెండ</ref>బీఱెండ రేయెండఁ బెండ్లియాడ
నిశ్శ్వాసపవనంబు నెలకొన్నచో నెల్లఁ
బ్రామిస్కు నెత్తావు లాముకవియఁ
బొక్కిటితమ్మిపుప్పొడి యొల్కుచో నెల్ల
బ్రహ్మాంకురంబులు పాదుకొనఁగ
నడుగు లేఁజిగురాకు లంటినచో నెల్ల
వివిధతీర్థశ్రేణి వెల్లి వొడువ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>బర్హమణిబంధ మా<ref>క. వేల్పు</ref>వెల్చు పచ్చవెదురు
గ్రచ్చకాయలతిత్తియుఁ గంబుశక్తి
గలిగి విహరించుఁ బౌండరీకంబునందు
నందులేఁబట్టి ప్రాలేయనగముపట్టి.</poem>|ref=152}}
'''టీక'''. నిడువాలుగనుచూపు = మిక్కిలి వాఁడియైన చూపు; నిగిడినచోన్ ఎల్లన్ = వ్యాపించిన ప్రతిస్థలమునందును; బీరెండ = తీక్ష్ణమగునెండ; రేయెండన్ = వెన్నెలను; పెండ్లియాడన్ = కలిసికొనఁగా; [విష్ణువు సూర్యచంద్రనేత్రుఁ డగుటవలన అతని చూడ్కులు ప్రసరించినచో ఎఱ్ఱటెండయు, వెన్నెలయు కలికొనినవని భావము.] నిశ్శ్వాసవవనంబు = నిట్టూర్పువాయువు; నెలకొన్నచోటు ఎల్లన్ = నిలిచిన - వ్యాపించిన ప్రదేశమంతయును; ప్రామిన్కునెత్తావులు = వేదవాసనలు; ఆముకవియన్ = ఎక్కువగా ఆచరించుకొనఁగా; [విష్ణువునకు వేదములే నిట్టూర్పువాయువు లగుటవలన వాని వాసన నలుగడలను వ్యాపించినదని భావము.] పొక్కిటి...చోటు ఎల్లన్ = బొడ్డుతామరయొక్క పుప్పొడి పడిన ప్రదేశ మంతయును; బ్రహ్మాంకురంబులు = బ్రహ్మలయొక్క మొలకలు - పెక్కుమంది పిల్లబ్రహ్మలను; వెల్లివొడువన్ = వ్యాపింపఁజేయఁగా. ['ప్రవహింపఁగా' అని శ.ర. అనుసరించి పూర్వటీక.]
[విష్ణువు నాభికమలమున బ్రహ్మ పుట్టెను; కావున నాభికమలపుపుప్పొడి విడిచినచోట్లకు పెక్కురుబ్రహ్మలసృష్టి జరుగుచున్నదని భావము.]
బర్హమణిబంధము = నెమిలిపురి యను మణులు తాపిన నగ; ఆవెల్చు = ఆలను త్రోలు; పచ్చవెదురు = ఆకుపచ్చని (పచ్చి) వెదురుకఱ్ఱ; కంబుశక్తి = శంఖరూపమగు ఆయుధవిశేషము; నందులేఁబట్టి = నందుని ముద్దుకుమారుఁడగు కృష్ణుఁడు; ప్రాలేయనగముపట్టి! = పార్వతీ!
{{Telugu poem|type=వ.|lines=<poem>అఖిలతీర్థరాజంబగు నమ్మహాతీర్థంబునకు జముదిక్కు<ref>చ. నాధికృతా</ref>న ధిక్కృతావిముక్తంబగు
ముక్తకేశితీర్థం బఖిలార్థప్రదంబై యుండు. మున్నట్లు వెన్నునివలనఁ <ref>క. దీర్థాపత్యం, చ. తీర్థాధిపత్యం</ref>దీర్థాధి
పత్యంబును, ముక్తిదాయిత్వంబును గాంచిన యమ్ముక్తకేశియు నచ్చోట నచ్చ
వెన్నెలఁ <ref>చ. దుచ్ఛంబు</ref>దొచ్ఛంబు చేసి యెసఁగునిసుకదిన్నెలపై నున్నయది యట్లగుటం జేసి.</poem>|ref=153}}
'''టీక'''. జముదిక్కునన్ = దక్షిణదిశను; ధిక్కృతావిముక్తంబు = (గొప్పదనమున) అవిముక్తక్షేత్రమును తిరస్కరించునది; అఖిలార్థప్రదంబై = కోరినకోరికల నన్నింటిని నెఱవేర్చునదయి; వెన్నునివలనన్ = విష్ణువువలన; తీర్థాధిపత్యంబును = తీర్థములకన్నింటికిని యాజమాన్యంబులు; ముక్తి<noinclude><references/></noinclude>
eb4uakj4we59ew70kubrqbht5i3k4ok
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/150
104
212595
558002
554818
2026-06-05T09:31:06Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
558002
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>దాయిత్వంబున = మోక్షము నొసంగుటకు; కాంచిన = పొందిన; అచ్చవెన్నెలన్ = పండువెన్నెలను; తొచ్చెంబు చేసి = తిరస్కరించి.
{{Telugu poem|type=క.|lines=<poem>పులినోపరితలగత నా, తలోదరిని శిథిలవసనధమ్మిల్ల మహో
జ్జ్వలభూషణభూషిత ని, శ్చలపదవీప్రద భజింపఁజను గుహజననీ!</poem>|ref=154}}
'''టీక'''. పులినోపరికలగతన్ = ఇరుకతిన్నెపయి నున్నదానిని; తలోదరిన్ = సూక్ష్మమధ్య యగుస్త్రీని; శిథిలవసనధమ్మిల్లన్ = వీడిపోయిన కేశబంధము, పోకముడియు కలదానిని; మహోజ్జ్వలభూషణభూషితన్ = మిక్కిలి ప్రకాశించు నగల నలంకరించుకొన్నదానిని; నిశ్చలపదవీప్రదన్ = మోక్షపదవి నిచ్చుదానిని - ముక్తకేశిని; గుహజననీ! = కుమారస్వామికి తల్లివగు పార్వతీ!
{{Telugu poem|type=శా.|lines=<poem>భక్తుం డెవ్వఁడు ముక్తకైశికఁ<ref>క. పయః, చ. బయః</ref>బయఃపానంబు గావించి ని
ర్ముక్తక్లేశకు ముక్తకేశికిఁ <ref>క. కిగరం</ref>గరంబుల్ మోడ్చి సత్యామన
స్ఫక్తుం గన్గొను, వాఁడు గన్నయదివోజన్మంబు <ref>క. మేఁ, ట. మై</ref>మైదాల్చియున్
ముక్తుం డాతఁడు భావికాలజననంబుల్ వానికిం బూజ్యముల్.</poem>|ref=155}}
'''టీక'''. ముక్తకేశికన్ = ముక్తకేశితీర్థమున, పయఃపానంబు గావించి = నీరు గ్రోలి; నిర్ముక్తక్లేశకున్ = క్లేశములను నశింపఁజేయునట్టిదానికి; కరంబుల్ మోడ్చి = చేతులు జోడించి - నమస్కరించి; సత్యామనస్సక్తున్ = సత్యభామకు ప్రియుఁడగు శ్రీకృష్ణుని, కన్గొనున్ = చూచునో; వాఁడు; కన్నయదివో = ఎత్తినదేకదా! మైదాల్చియున్ = శరీరమును ధరించియున్నను; ఆతఁడు ముక్తుండు = ఆతఁడు మోక్షమును పొందినవాఁడే యగును; వానికిన్ = అట్టివానికి, భావికాలజననంబుల్ = పునర్జన్మములు; పూజ్యముల్ = శూన్యములు - కలుగవని యర్థము.
{{Telugu poem|type=చ.|lines=<poem>హరి మును సంగమాహ్వయ<ref>చ. సమరాసుర</ref>మహాసురు నాసురవృత్తిఁ ద్రోచి వే
<ref>చ. రురువడి</ref>రురవడి వానిపై నడుగు లూఁదఁ దదంకము లెట్టిచోట గో
చరమగుచూడ్కి కాస్థలముసన్నిధి <ref>చ. సన్నిధి</ref>పెన్నిధి; వానిపేరిటం
బరఁ<ref>చ. గినతీ</ref>గెడు తీర్థ మొప్పుఁ గలభాషిణి! యీషణశోషణస్థితిన్.</poem>|ref=156}}
'''టీక'''. హరి = కృష్ణుఁడు; మును = పూర్వము; సంగమాహ్వయమహాసురున్ = సంగముఁడను పేరి గొప్ప రాక్షసుని; ఆసురవృత్తిన్ త్రోచి = క్రూరముగా పడద్రోసి; పేరురవడిన్ = మిక్కిలి వేగముగా; అడుగులు ఊఁద = పాదములను మోపగా; చూడ్కికిన్ = చూపునకు; తదంకములు = ఆపాదముల చిహ్నములు; ఎట్టిచోటన్ గోచరమగున్ = కనఁబడునో, ఆస్థలముసన్నిధి = ఆస్ధలముయొక్క సాన్నిధ్యమే; పెన్నిధి = పెద్దనిధియైనది; వానిపేరిటన్ పరఁగెడు = ఆ సంగమాసురునిపేరిట నున్న; ఈషణశోషణస్థితిన్ = దారేషణ, ధనేషణ, పుత్రేషణ యను మూఁడు ఈషణ(కోరిక)లను నశింపఁజేయునట్టిరీతిని; ఒప్పున్ = ప్రకాశించును.
{{Telugu poem|type=క.|lines=<poem>ప్లావితభూతల యగు పు
ష్పావతి యను నేఱు <ref>క. గలయ</ref>గలియఁ బావనమై యో
దేవీ! సంగమతీర్థం
బావిర్భూతాఖిలాద్భుతార్థత వెలయున్.</poem>|ref=157}}
'''టీక'''. ప్లావితభూతల = ఆవరింపఁబడిన భూప్రదేశము కలది - భూమియందు వ్యాపించినది; కలియన్ = తనతోఁ జేరఁగా; పావనమై = పవిత్రమై; ఆవి...ర్థతన్ = సమస్తములగు నద్భుతములను పుట్టించురీతిని; వెలయున్ = ప్రకాశించును.<noinclude><references/></noinclude>
k04fq4fouhwb890dk4sihexa6pgbu9y
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/150
104
213599
557954
557319
2026-06-04T13:09:19Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557954
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>సంబంధించిన కోర్సులు మన యూనివర్సిటీలలో వుంటే కదా, క్వాలిఫికేషన్ గలవాళ్ళు లభించడానికి. అలాంటి వాళ్ళు ప్రస్తుతం లభించడంలేదు. ఈ శర్మగారు ఉన్నవారు, ఇతరులకు ఆలాంటి "క్వాలిఫికేషన్”ను ఉత్పత్తి చేయగలరు. ఆ విషయంలో ఈనాడు మా రాష్ట్రంలో ఆయన చాలా గొప్పవారు. అయినా డిగ్రీ లన్నవి పాండిత్యానికి కొలమానాలటండీ! జ్వరాలకు గాని" అని అన్నారు.
ఇలా కృష్ణ గారు శర్మగారి ప్రతిభను గుర్తించి, యు.జి.సి. వారితో ప్రత్యేకంగా మాటలాడి ఆంధ్రవిశ్వకళాపరిషత్లో ఉద్యోగం ఇప్పించారు. మల్లంపల్లి వారు ఆంధ్ర విశ్వకళాపరిషత్ చరిత్ర శాఖలో అధ్యాపకులుగా పనిచేశారు. శర్మగారికి ఆంధ్ర విశ్వకళాపరిషత్ వారి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిభకు పట్టాభిషేకమంటే ఇదే.
భారత దేశం అన్నా, ఆంధ్రదేశం అన్నా, చరిత్ర అన్నా సంస్కృతి అన్నా మహాభక్తి, ఆయన దృష్టి చాలా విశాలమైంది. మనసా, వాచా, తన జీవిత గమనం లోనూ, పరిశోధన వ్యాసంగంలోనూ, పరమ మహేశ్వరులు శర్మగారు. ప్రతిభకు మారుపేరు మల్లంపల్లి సోమశేఖరశర్మగారు.
"ఆంధ్ర విశ్వకళాపరిషత్ స్వర్ణోత్సవ సారథి శ్రీ మేకా రంగయ్యప్పారాయ మహోదయ కృతి సమీక్ష" అనే వ్యాసంలో ఎమ్. ఆర్. అప్పారావుగారి రచనలను విశ్లేషించారు. అప్పారావుగారు. 1. రుబాయత్ 2. గ్రీకు రూపకాలు 3.
బ్రహర్షివేంకటరత్నం నాయుడు 4. సంస్కృతి, 5. ఆంధ్రజాతి, సంస్కృతి చరిత్ర 6. యాంటిగాని 7. భారతీయ చిత్ర కళ గ్రంథాలు వెలువరించారు. ఇందులో మొదటి ఐదు ప్రత్యేక గ్రంథాలుగా వచ్చాయి. తర్వాత "సాహితీ విపంచిక" పేరుతో ఒక సంపుటిగా ఆంధ్రవిశ్వకళా పరిషత్ వారు ప్రచురించారు. న్యూఢిల్లీ సాహిత్య అకాడమీ వారు "యాంటిగని" గ్రంథాన్ని ప్రచురించారు. గ్రీకు నాటకాల్లో "సోఫాక్లిజ్" రాసిన “యాంటిగని” చెప్పుకోదగ్గది. అప్పారావుగారి గ్రీకు రూపక పరిశోధనా కృషిని గుర్తించిన అకాడమీ, ఈ గ్రంథాన్ని అనువాదం చేయించింది. "యాంటిగని” నాటకమంతా భావోద్విగ్నమైన ఒక భయానక వాతావరణంలో నడిచే విషాదాంత నాటకం.
12వ శతాబ్దంలో పర్షియన్ భాషలో రుబాయిత్ వచ్చింది. ఈ గ్రంథం అనేక భాషల్లో అనువాదం అయింది. తెలుగులో దువ్వూరి రామిరెడ్డి, మొదలైన వారు అనువాదం చేశారు. అనువాదం మక్కీకి మక్కీలా కాకుండా మూల భావం చెడిపోకుండా చక్కగా అనువాదం చేశారు అప్పారావుగారు. వీరికి గల గ్రీకు సాహిత్య<noinclude><references/>
{{c|135}}</noinclude>
ahfaj3qo3xq0of75gmfg572gxojkcnc
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/151
104
213600
557955
557320
2026-06-04T13:29:46Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557955
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>వ్యాసంగానికీ, అవగాహనకూ, ప్రబల తార్కాణం “గ్రీకురూపకాలు". ఇందులో గ్రీకు నాటకోత్పత్తి చరిత్ర, నాటకరంగ వికాసంచోటు చేసుకున్నాయి. 27-10-1962లో కాకినాడలో నాయుడు గారి శతజయంత్యుత్సవ సభలు జరిగాయి. ఆ సభలో అప్పారావుగారు చేసిన ప్రసంగానికి గ్రంథరూపం "బ్రహ్మర్షి వెంకటరత్నం నాయుడు. నాయుడు గారిమీద అప్పారావుగారికి ఎనలేని గౌరవం. “సంస్కృతి”లో స్వరూప స్వభావాన్ని గూర్చి చక్కగా ఇందులో వివరించారు. "ఆంధ్రజాతి, సంస్కృతి చరిత్ర" తెలుగు జాతి సంస్కృతి, చరిత్ర గూర్చి విపులీకరించారు. ఈ గ్రంథలో ఆంధ్ర భాషా చరిత్ర, వాస్తు కళ, జాతీయోద్యమం, ఆంధ్రోద్యమం, మహిళాలోకం, సాహిత్యం, సంగీతం, నృత్యం, నాటకం, సినిమా, విగ్రహశిల్పం, చిత్రలేఖనం, చేతి పనులు, జానపద వినోదాలు, విశ్వ విద్యాలయాల పరిశోధనలు, అకాడమీలూ, పత్రికారంగం అనే శీర్షికలు చోటుచేసుకున్నాయి.
{{<big>'''"భారతీయ చిత్రకథ”'''</big>}}
ఇందులో భారతీయ చిత్రకళ గొప్పతనం గూర్చి విశదీకరించారు. రచన రమణీయంగా వుంది. ఈ గ్రంథాన్ని భారతీయ చిత్రకళా తత్త్వానికి ఒక సహృదయ హృదయభాష్యంగా తీర్చిదిద్దారు అప్పారావుగారు. ఆచార్య పేర్వారం జగన్నాథంగారి ఆహ్వానం మేరకు జోగారావుగారు వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ఆ సందర్భంగా "విద్యారణ్య మాహాత్మ్య భూమిక" వ్యాసం రాశారు. కాకతీయ విశ్వవిద్యాలయ ఆవరణానికి "విద్యారణ్యపురి” అని పేరు. ఆ విద్యారణ్యులు ఎవరు? ఆయన గొప్పతనం ఏమిటి? ఆయన రచనలు ఏమిటి? మొదలైన విషయాలు ఇందులో వున్నాయి.
విద్యారణ్యుడు తన జీవితాన్ని వేద విద్యకు అంకితం చేశాడు. వేదాలను చాలా లోతుగా అధ్యయనం చేశాడు. ప్రతి వేదానికి “మహాభాష్యం” రాశాడు. ప్రతిదానికి ఒక అద్భుతమైన "భూమిక" రాశాడు. దానినే "వేద భాష్య భూమిక" అని అంటారు ఈ "వేద భాష్య భూమిక"లో అనేక అంశాలు వున్నాయి. అందులో ముఖ్యమైనవి అనుబంధ చతుష్టయం. వేద ప్రామాణ్య నిరూపణం, మంత్రలక్షణం, అక్బారుషేయ సిద్ధాంతం, షడంగ విచారణ, గురుశిష్య సంప్రదాయం, ఊహాగాన విచారం, గాయత్రీ షట్కం, ఉపవేదాలు మొ॥| వైదిక వాఙ్మయ మంతటిని చక్కగా అవగాహన చేసుకొని, పరిపూర్ణంగా “మహాభాష్యం" రాసిన మహానీయుడు<noinclude><references/>
{{c|136}}</noinclude>
3kmrdmjltd386zo1nddjrfww6q6z2bw
557956
557955
2026-06-04T13:30:29Z
శ్రీరామమూర్తి
1517
557956
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>వ్యాసంగానికీ, అవగాహనకూ, ప్రబల తార్కాణం “గ్రీకురూపకాలు". ఇందులో గ్రీకు నాటకోత్పత్తి చరిత్ర, నాటకరంగ వికాసంచోటు చేసుకున్నాయి. 27-10-1962లో కాకినాడలో నాయుడు గారి శతజయంత్యుత్సవ సభలు జరిగాయి. ఆ సభలో అప్పారావుగారు చేసిన ప్రసంగానికి గ్రంథరూపం "బ్రహ్మర్షి వెంకటరత్నం నాయుడు. నాయుడు గారిమీద అప్పారావుగారికి ఎనలేని గౌరవం. “సంస్కృతి”లో స్వరూప స్వభావాన్ని గూర్చి చక్కగా ఇందులో వివరించారు. "ఆంధ్రజాతి, సంస్కృతి చరిత్ర" తెలుగు జాతి సంస్కృతి, చరిత్ర గూర్చి విపులీకరించారు. ఈ గ్రంథలో ఆంధ్ర భాషా చరిత్ర, వాస్తు కళ, జాతీయోద్యమం, ఆంధ్రోద్యమం, మహిళాలోకం, సాహిత్యం, సంగీతం, నృత్యం, నాటకం, సినిమా, విగ్రహశిల్పం, చిత్రలేఖనం, చేతి పనులు, జానపద వినోదాలు, విశ్వ విద్యాలయాల పరిశోధనలు, అకాడమీలూ, పత్రికారంగం అనే శీర్షికలు చోటుచేసుకున్నాయి.
<big>'''"భారతీయ చిత్రకళ”'''</big>
ఇందులో భారతీయ చిత్రకళ గొప్పతనం గూర్చి విశదీకరించారు. రచన రమణీయంగా వుంది. ఈ గ్రంథాన్ని భారతీయ చిత్రకళా తత్త్వానికి ఒక సహృదయ హృదయభాష్యంగా తీర్చిదిద్దారు అప్పారావుగారు. ఆచార్య పేర్వారం జగన్నాథంగారి ఆహ్వానం మేరకు జోగారావుగారు వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ఆ సందర్భంగా "విద్యారణ్య మాహాత్మ్య భూమిక" వ్యాసం రాశారు. కాకతీయ విశ్వవిద్యాలయ ఆవరణానికి "విద్యారణ్యపురి” అని పేరు. ఆ విద్యారణ్యులు ఎవరు? ఆయన గొప్పతనం ఏమిటి? ఆయన రచనలు ఏమిటి? మొదలైన విషయాలు ఇందులో వున్నాయి.
విద్యారణ్యుడు తన జీవితాన్ని వేద విద్యకు అంకితం చేశాడు. వేదాలను చాలా లోతుగా అధ్యయనం చేశాడు. ప్రతి వేదానికి “మహాభాష్యం” రాశాడు. ప్రతిదానికి ఒక అద్భుతమైన "భూమిక" రాశాడు. దానినే "వేద భాష్య భూమిక" అని అంటారు ఈ "వేద భాష్య భూమిక"లో అనేక అంశాలు వున్నాయి. అందులో ముఖ్యమైనవి అనుబంధ చతుష్టయం. వేద ప్రామాణ్య నిరూపణం, మంత్రలక్షణం, అక్బారుషేయ సిద్ధాంతం, షడంగ విచారణ, గురుశిష్య సంప్రదాయం, ఊహాగాన విచారం, గాయత్రీ షట్కం, ఉపవేదాలు మొ॥| వైదిక వాఙ్మయ మంతటిని చక్కగా అవగాహన చేసుకొని, పరిపూర్ణంగా “మహాభాష్యం" రాసిన మహానీయుడు<noinclude><references/>
{{c|136}}</noinclude>
5bmrk8r0iwifv8fowpfpjom1mi8w8sz
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/152
104
213601
557957
557321
2026-06-04T13:38:06Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557957
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>విద్యారణ్యుడు.
'''"జక్కన కవితా ప్రస్థానం"''' లో జక్కన కవితా వైభావాన్ని గూర్చి వివరించారు. శ్రీనాథునియుగకవుల్లో చెప్పుకోదగ్గ వాడు జక్కన. ఇతడు "విక్రమార్క చరిత్ర" రాశాడు. దీన్ని సిద్ధన మంత్రికి అంకితం ఇచ్చాడు. ఇతను కూడా కవే. ఈ వ్యాసంలో "విక్రమార్క చరిత్ర" గ్రంథంలోని కథా వస్తువు, పాత్ర చిత్రణ, రసపోషణ, శైలి, వర్ణనలు మొదలైన
అంశాల గూర్చి వివరించారు.
'''అ. కథా వస్తువు :'''
సంస్కృత విక్రమార్క చరిత్ర" దీనికి మూలంకాదు. ఇందులోని కొన్ని కథలకు మాత్రం మూలం. కొన్ని కథలకు జనశ్రుతి మూలం కావచ్చు. కొన్ని కవికల్పితాలు కావచ్చు. అవతారికలో కవి ఈ గ్రంథాన్ని అపూర్వ కథా బంధుర ప్రబంధం అనీ, నవ్య కథా కావ్యం అనీ అన్నాడు. ఇందులో 20 కథలు వున్నాయి. కథలన్నీ ఏకనాయకాశ్రయాలు. విక్రమార్కునికథను కావ్యంగా చేసిన గౌరవం జక్కనకే దక్కుతుంది.
'''ఆ. పాత్ర చిత్రణ :'''
ఇందులోని కథానాయకుడు ధీరోదాత్తుడు. లోకోత్తర చరితుడు. పాత్ర చిత్రణలో జక్కన కడు సమర్ధుడు.
'''ఇ. రస పోషణ :'''
ఇందులోని కథలు వివిధ రకాలైనప్పటికీ అవి నాయకాశ్రయాలు. నాయకుడు లోకోత్తరవీరుడు. వీరరసంపోషించబడింది.
'''ఈ. శైలి :'''
శ్రీనాథునికి సమకాలికుడు జక్కన. శ్రీవాథుని బాటలోనే నడిచాడు. ఇద్దరిలో ఎన్నో పోలికలు వున్నాయి.
'''ఉ. వర్ణనలు :'''
జక్కన వర్ణనలు సుదీర్ఘ సుందరాలు, భావబంధురాలు, మధుర శబ్ద చిత్ర చమత్కార మందిరాలు. వర్ణనలలో ఆరితేరిన వాడు జక్కన.<noinclude><references/>
{{c|137}}</noinclude>
k5fj5jlrrkv2wh9e2v22tyk5qheh88o
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/153
104
213602
557959
557322
2026-06-04T13:48:43Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557959
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>'''ఊ. ప్రత్యేక విశేషాలు :'''
జక్కన అలంకార ప్రియుడు. ఇందులో ఎన్నో రకాల అలంకారాలు వున్నాయి. చమత్కార చతురుడు.
కృతి పతి సిద్ధన మంత్రి, జక్కన గూర్చి ఇలా అన్నాడు.
<poem>
{{left margin|5em}}
“చక్కన నీ వైదుష్యము
చక్కన నీ కావ్యరచన చాతుర్యంబున్
చక్కన నీ వాగ్వైఖరి
చక్కన నీ వంశమహిమ జక్కన సుకవీ"
</poem>
'''"సూరన ప్రతిభ అర్వాచీన కవులపై అతని ప్రభావం"''' వ్యాసంలో సూరనపై ఇతర కవుల ప్రభావం గూర్చి వివరించారు. నన్నయ తర్వాత అంతటి ఉత్తమ జాతి కథకుడు, తిక్కన తర్వాత అంతటి ఉదాత్త కవితా శిల్పి, నాచన సోమనాథుని తర్వాత అంతటి నవీన గుణ సనాథుడు, శ్రీనాథుని తర్వాత అంతటి శృంగార రసజ్ఞుడు,
పింగళి సూరన అని జోగారావుగారు అన్నారు. ప్రబంధాల్లో శత శతాంశం సమగ్రమైన, ప్రత్యేకతకలది "కళా పూర్ణోదయం" కథ ప్రధానమైంది ఇది. ఇందులోని కథ కొత్తది. కల్పితమైంది. వీరి ప్రభావతీ ప్రద్యుమ్నం రాఘవ పాండవీయం, కూడా చెప్పుకోదగ్గ గ్రంథాలు, ఎన్ని ద్వ్యర్థికావ్యాలు వచ్చినా సూరన రాఘువ పాండవీయం ప్రధానమైంది. సూరన ప్రతిభా వైలక్షణ్యం అనాటి సామాన్య కవులకు అర్ధం కాలేదు. సమర్థులకు నచ్చలేదు. అందుకే "కళా పూర్ణోదయం" ఆక్షేపణకు గురి అయింది. రామరాజ భూషణుడు కళాపూర్ణోదయం ను దృష్టిలో పెట్టుకొని "కేవలకల్పనా కథలు కృత్రిమ రత్నములు” అని విమర్శించాడు. “ఏగతి రచించినను మెచ్చనివారు..." అని సూరన బాధపడ్డాడు.
ఆర్వాచీన కవులపై సూరన ప్రభావం చాలా స్పష్టంగా కన్పిస్తుంది. తెనాలి రామభద్రకవి, ఈదుల వల్లి భావనీకవి మొదలైనవారు సూరనను పూర్వ కవిస్తుతిలో చేర్చి ప్రశంసించారు.
సూరన విశిష్టమైన గుణాలు రెండు. ఒకటి అపూర్వ కథా కల్పనం, రెండు కథాశిల్పం. కథాకల్పనలో చరికొండ ధర్మన “చిత్ర భారతం”, తరిగొప్పుల మల్లన “చంద్రభాను చరిత్రం”, సురభి మాధవ రాయులు” “చంద్రికా పరిణయం” మొదలైన<noinclude><references/>
{{c|138}}</noinclude>
3mtmwhcd4iu8hste68gdjzaqohsv8az
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/154
104
213603
557962
557323
2026-06-04T15:20:12Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557962
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>వాటిని మంచి ఉదాహరణలుగా తీసుకోవచ్చు. ఆధునికులైన పురాణం పిచ్చయ్య ""విజయాశ్వచరిత్రం మొ॥ ఆకోవలోనివే.
కథా శిల్పంలో సూరన లా అనుసరించి విజయం సాధించిన వారు చాలా తక్కువ. అలాంటి వారిలో ముఖ్యులు "కుల యాశ్వచరిత్ర" కర్త నవరము చిననారాయణ రాజు. ఆధునికుల్లో “ప్రభాస శాప వియోచన" కర్త సెట్టి లక్ష్మీ
నరసింహం మొ॥. మధుర తంజావూరు నాయక రాజుల నాటి “ఆంధ్ర వాఙ్మయ చరిత్ర" లో నేలటూరి వెంకట రమణయ్యగారు, చిననారాయణ రాజును “నాయక యుగపు పింగళి సూరన్న" అని అన్నారు.
గోపాలుని సింగమకవి, "ప్రభావతీప్రద్యుమ్నం”ను యక్షగానంగా రాశాడు. ఇందులో సూరనకు కృతజ్ఞతలు చెప్పాడు కూడా. “కళా పూర్ణోదయం” పూర్వ భాగాన్ని అంటే చతుర్థాశ్వాసం వరకు గల కలభాషిణీ వృత్తాంతం ఈ శతాబ్ది ఆరంభంలో బెడుదూరి వాస్తవ్వులు కందాళ్ళ రామాచార్యులు, రంగాచార్యులు అవే సోదరులు యక్షగానంగా రాశారు. ఆధునికలు అనేకమంది కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నాం లను నవలిక గానూ, నాటకాలుగానూ రాశారు. నవలికలలో దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి "కలభాషిణి", "మధుర లాలస మొ॥ చెప్పుగోదగ్గవి. నాటకాల్లో శ్రీపాద కృష్ణమూర్తి, ఘట్టి లక్ష్మీ నరసింహ శాస్త్రి గారల "కళాపూర్ణోదయ నాటకాలు" గొప్పవి. తిరుపతి వెంకట కవులు, హోతావెంకట కృష్ణశాస్త్రి గారల "ప్రభావతీ ప్రద్యుమ్ననాటకకృతులు" ఈ కోవలోనివే.
ఇప్పటికీ “కళా పూర్ణోదయం”కథలోని కొన్ని సన్నివేశాలను తీసుకొని రేడియోనాటికలు, గేయనాటికలు రాస్తూనే వున్నారు. “కళా పూర్ణోదయం” ను ఇతర భాషల్లోకి కొంతమందిఅనువాదం చేశారు. రాజా విక్రమవర్మ ఒరియాభాషలోకి అనువదించారు. ఎరసూరి మల్లికార్జునరావు సంస్కృతీకరించారు. మారన ప్రతిభ ఆధునిక భావుకులను కూడా ఆకర్షించింది. కట్టమంచి రామలింగారెడ్డి, టేకుమళ్ళ అచ్యుతరావు, పింగళి లక్ష్మీకాంతం, దువ్వూరి వెంకట రమణ శాస్త్రి, మల్లాది సూర్యనారాయణ శాస్త్రి మొదలైనవారు. సూరన ప్రతిభా వైలక్షణ్యం గూర్చి మంచి వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాలు సూరన ప్రతిష్ఠకే కాదు తెలుగు సాహిత్య విమర్శ రంగానికే ఎత్తిన పతాకలు.
'''"ప్రక్రియా వైవిధ్యాన్ని పరిణత ప్రదర్శించిన దక్షిణాంధ్ర సాహిత్యం"''' వ్యాసంలో<noinclude><references/>
{{c|139}}</noinclude>
gyydr61pu4p2kk6q4l932ktr6m1a058
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/155
104
213604
557963
557324
2026-06-04T15:30:39Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557963
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>దక్షిణాంధ్ర సాహిత్యాన్ని గూర్చి విశ్లేషించారు. నన్నయ నాటి నుండి తెలుగు సాహిత్యం రాజులను ఆశ్రయించే వర్ధిల్లుచున్నది. ఈ యుగంలో ముఖ్యమైన కవులు తంజావూరు రఘునాథ నాయకుడు, విజయ రాఘవ నాయకుడు, శహాజీ, మైనూరు కంఠీరవరాజు, మధుర విజయరంగ చొక్కనాథుడు, పుదుక్కోటరాయరఘునాథ
తొండమాన్ మొ॥ దక్షిణాంధ్రయుగ వైశిష్ట్యం చాలా గొప్పది. ఈ యుగంలో పద్యం, గద్యం, ద్విపద, యక్షగానం మొదలైన ప్రక్రియలతో రచనలు వచ్చాయి. అంతేకాక విషయవైవిధ్యాన్ని, రచనా స్వాతంత్ర్యాన్ని, భావనా వైలక్ష్యాన్ని వీరు ప్రదర్శించారు. దక్షిణాంధ్ర కవులు భారత, భాగవత, రామాయణాదులు గాథల్ని అనేక ప్రక్రియలద్వారా చాలా చక్కగా చెప్పారు. ఈ కవులు స్థలమహాత్మ్యాలను రాశారు. రసపోషణలో శ్రీనాథుడు, తిమ్మన మొదలైన కవులను అనుసరించారు. ఈనాటి కవులు రాజవృత్తాలు, ప్రజాజీవిత ఉదంతాలను కావ్య వస్తువులుగా స్వీకరించారు. ఈ
కాలంలో వివిధ శాస్త్రాలకు సంబంధించిన గ్రంథాలు వెలువడ్డాయి.
దక్షిణాంధ్ర కవులు, అనుభవసిద్ధులైన రసికులు, వారి ప్రబంధాలు సంభోగ శృంగార ప్రధానాలు. పూర్వాంధ్ర కవుల శృంగారమాంగికం. దక్షిణాంధ్ర కవులది భావ ప్రధానం. పూర్వాంధ్ర కావ్యాలలో నాయకస్వీయ ఉపాధేయ. దక్షిణాంధ్ర
కావ్యాలలో పరకీయ. రాయలనాటి రసికత, నాయకరాజుల నాటికి దిగజారిపోయింది. ఈ కవుల గ్రంథాల్లో హాస్యం కూడా చోటుచేసుకుంది. సాహిత్యాన్ని ఎక్కువుగా ప్రజాసన్నిహితం చేసిన ఘనత దక్షిణాంధ్ర యుగకవులకు దక్కుతుంది. అయితే వీరు ప్రజలకు ఒక సందేశం ఇవ్వలేకపోయారు. “కళ కళ కొరకే” అన్నది ఆనాటి సారస్వత సారాంశం.
'''"ఆంధ్ర సారస్వత శాఖలో యక్షగాన ప్రత్యేకత"''' వ్యాసంలో యక్ష గానం వైశిష్ట్యాన్ని చెప్పారు. యస్వీజోగారావుగారు అనగానే అందరికి గుర్తుకు వచ్చేది ఆయన పరిశోధన గ్రంథం "యక్షగానం”. యక్షగానాల స్వరూప నిరూపణలో వీరి వాక్కు బ్రహ్మవాక్కు. యక్షగానంలోని మొత్తం సారాంశాన్ని ఈ గ్రంథంలో పొందుపరిచారు.
'''"దేవుని దస్తూరీ"''' వ్యాసంలో కళ అంటే ఏమిటి, 64 కళల గొప్పతనం గూర్చి, లలిత కళల విశిష్టత గూర్చి వివరించారు.
"నేదునూరి గంగాధరంగారి సెలయేరు" పీఠికలో జోగారావుగారు జానపద వాఙ్మయం యొక్క గొప్పతనం గూర్చి, గంగాధరంగారి సాహితీ సేవగూర్చి విపులంగా<noinclude><references/>
{{c|140}}</noinclude>
dpv7gddz86so14g143pfkjbpvfgd965
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/156
104
213605
557966
557325
2026-06-04T15:41:28Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557966
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>వివరించారు. జానపద వాఙ్మయం గూర్చి ఎందరో కృషిచేశారు. వారిలో అగ్రగణ్యులు గంగాధరం గారు. తన జీవితాన్ని జానపద వాఙ్మయానికి అంకితం చేసిన మహానుభావుడు. వీరి జానపద వాఙ్మయ కృషి అనన్య సామాన్యం. మానవ జాతి జీవితానికి వెన్నెముక జానపదం. జానపద పాటలను సేకరించడం కష్టం వాటిని వర్గీకరణచేయడం మరోకష్టం వాటిని వ్యక్తీకరణం చేయడం అంతకన్నా కష్టం. అన్నీ కష్టంతో కూడుకున్నవే. అయినా ఇష్టంతో చేశారు గంగాధరంగారు. అదే ఆయన ప్రత్యేకత.
"కవి సన్మానం" లో సన్మానం యొక్క గొప్పతనం గూర్చి వివరించారు. సన్మానం అంటే సభలు జరపడంకాదు. మన మనస్సుల్లో వారి గూర్చి మధుర స్మృతులు చిరస్థాయిగా నిల్చిపోయేట్లు స్మారక సంచికలు వేయాలి. శాశ్వత స్మృతి చిహ్నాలు నెలకొల్పాలి. అప్పుడే ఆకవికి మనం గొప్ప సన్మానం చేసిన వాళ్ళం అవుతాం.
సన్మానం అతడికి ఉత్సాహాన్ని ఇచ్చి మరింత ప్రయోజకుడిగా తీర్చిదిద్దడానికి పనికి వస్తుంది. వాల్మీకి గూర్చి అనేక వ్యాఖ్యానాలు, విమర్శలు వచ్చాయి. కాని స్మారక సంచికలు, శిలా విగ్రహ ప్రతిష్ఠలు ఎక్కువగా రాలేదని రావుగారు బాధపడ్డారు. షేక్స్పియర్ జననం 'స్ట్రేట్ ఫర్డ్ ఆన్ ఏవన్" ఊరు ఊరంతా కాశీలా, తిరుపతిలా ఆయన క్షేత్రమే. అయన ఇల్లు, అత్తవారి ఇల్లు, బడి, బడిలోఆయన కూర్చున్న కుర్చీ, బల్లా, ఆయన వాడుకున్న వస్తువులు, అన్నీ భద్రపరిచారు. అక్కడ పరమ రమణీయమైన నిరంతర స్రవంతిగా సాగిపోయే 'ఏవన్' నదీ తీరంలో ఎత్తుగా ఆయన
శిలా విగ్రహం వుంది. దాని క్రింద చుట్టూ ఆయన నాటక పాత్రలు నాల్గింటిని విగ్రహాలుగా చేసి అక్కడ ప్రతిష్ఠించారు. 1. ఫాల్స్టాప్ 2. లేడీ మెక్చెత్ 3. ప్రిన్స్ హాల్ 4. హేమ్లేట్. ఈ నాలుగూ షేక్స్పియర్ వాఙ్మయ వ్యక్తిత్వానికి సముచిత ప్రతీకలు. వరుసగా కామెడీకి, ట్రాజెడికి, చారిత్రతకు, తత్త్వదార్శినికతకు. అందుచేత కవి హృదయాన్ని అవగాహన చేసుకోవడం కూడా కవి సన్మానమే అవుతుంది. అక్కడ ఏనాటినుంచో నేటిదాక ఏటా షేక్స్పియర్ నాటక ప్రదర్శనోత్సవాలు నిర్వహిస్తూవుంటారు.
జోగారావుగారు షేక్స్పియర్ మీద వున్న భక్తితో అభిమానంతో తన ఏకైక కుమారుడికి షేక్స్పియర్ అని పేరు పెట్టారు. రష్యాలో భగవద్భక్తి లేదు. కాని కవిభక్తి గొప్పగా వుందని రావుగారు కొనియాడారు. రష్యాలో “పుష్కిన్" మహాకవి పద్యాలు<noinclude><references/>
{{c|141}}</noinclude>
cfp9vhpsizu0b3e3ys8aq6airo6e6zy
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/157
104
213606
557967
557326
2026-06-04T15:52:45Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557967
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>రాని వారు ఎవ్వరూ వుండరు.. పుష్కిన్ మహాకవి నివాస గ్రామం పేరు కూడా పుష్కినే. దేశమంతటా ఆయన విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఆ దేశంలో కవికి ఇచ్చిన గౌరవం అది. ఇంచుమించు పాశ్చాత్య దేశాలన్నిటా ఇలాగేవుంది. ఇవి చెప్పుడు మాటలుకావు. విని చెబుతున్న మాటలు కావు అని తెలియజేశారు.
మనదేశంలో కవుల పరిస్థితి, పాశ్చాత్య దేశాల్లో లాగలేదు. మహాకవి కాళిదాసుకి ఉజ్జయినిలో కార్తీక పౌర్ణమి నాడు మహోత్సవం జరుగుతుంది. అయితే మరి మన తెలుగు కవుల పరిస్థితి చెప్పనక్కరలేదు. రాజమండ్రిలో నన్నయ పీఠం, గుంటూరులో శ్రీవాథ పీఠం, ఒంగోలులో ఎర్రన పీఠం, వరంగల్లులో పోతన పీఠం ఇంకా కొన్ని చోట్ల వున్నాయి. చెప్పుకోదగ్గవి కాకపోయినా ఏదో కాస్తా మందకొడిగా పనులు జరుగుతున్నాయి. వీరేశలింగం, గురజాడ మొదలైన వారి విషయంలో అప్పుడప్పుడు అక్కడక్కడ మొక్కుబడి తీర్చుకున్నట్లు చిన్న చిన్నగా జయంతులు, వర్ధంతులూ
జరక్కపోలేదు. మొత్తం భారతదేశంలోనూ, ఆంధ్రదేశంలోనూ కవులకు జరగవలసిన గౌరవం జరగడంలేదని జోగారావుగారు బాధపడ్డారు.
'''8. శ్రీనాథశ్రీ :'''
ఇది 1989లో వచ్చింది. పేజీలు 72. శ్రీవాథ పీఠం, గుంటూరు వారు ప్రచురించారు. దీన్ని ప్రసాదరాయ కులపతి గారికి అంకితం ఇచ్చారు. ఇందులో ఏడు వ్యాసాలు వున్నాయి.. 1. శ్రీనాథ నమోవాకం ప్రశాస్మహే! 2) శ్రీనాధ
యుగలక్షణాలు 3) శ్రీనాధుని శాస్త్రజ్ఞత 4) శ్రీనాథుని అనుకరణములు 5) పల్నాటి వీరచరిత్ర - సామాజిక జీవిత చిత్రణం 6) క్రీడాభిరామం - వైశిష్ట్యం 7) కాశీ ఖండం - ప్రాశస్త్యం. ఈ వ్యాసాల్లో శ్రీనాథుని గొప్పతనం, అతని కావ్యాల విశిష్టతను కొనియాడారు రావుగారు.
'''"శ్రీనాధా! నమోవాకం ప్రశాస్మహే"''' లో ఐదుపద్యాలు, ఒక వచనం చోటు చేసుకుంది. "శ్రీనాథ యుగలక్షణము"లో హరిహరభేద భావన, భక్తి, తాత్త్వి క దృష్టి, ధర్మ ప్రభోదం సామాజిక దృష్టి, రసదృష్టి, హాస్య ప్రియత్వం, భాష, ఇతి వృత్తం, ప్రక్రియా వైవిధ్యం గూర్చి వివరంగా విపులీకరించారు.
ఈ యుగంలో వచ్చిన పురాణాలు, కథా కావ్యాలు, తత్త్వగ్రంథాలు, స్థల మహాత్మ్యాలు, ప్రబంధాలు, అనువాదాలు, ద్విపద కావ్యాలు, సంకీర్తన సాహిత్యం, ఆలంకార శాస్త్రగ్రంథాలు, శతకాలు, దండకాలు, ఉదాహరణ వాఙ్మయం, రగడలు,<noinclude><references/>
{{c|142}}</noinclude>
6u10l2ifl408gv29nv2rl74axmpcskp
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/158
104
213607
557972
557327
2026-06-04T17:52:44Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557972
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>యక్షగానాలు, మొదలైన ప్రక్రియలతో శ్రీనాథయుగం ఎంతగానో విశిష్టత పొందినదని జోగారావుగారు వివరించారు. ఆంధ్ర సాహిత్య రథాన్ని పురాణ మార్గం నుండి ప్రబంధమార్గం వైపు నడిపించిన మహారథికుడు శ్రీనాథుడని ప్రశంసించారు జోగారావుగారు. శ్రీనాధుని శాస్త్రజ్ఞత, అనుకరణలు కూడా చెప్పుకోదగ్గవి.
'''"పల్నాటి వీరచరిత్ర - సామాజిక జీవిత చిత్రణం"''' అనే వ్యాసంలో శ్రీనాథుని కాలం నాటి అనేక సామాజిక అంశాల్ని గూర్చి వివరించారు. సాహిత్యం సామాజిక ప్రతిబింబం. కవులు, రచయితలు, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొనే రచనలు చేస్తారు. తెలుగు సాహిత్యంలో ప్రాచీన సాహిత్యంలో సామాజిక అంశాలు లేవు అనేవారు కూడా వున్నారు. ఎక్కువ, తక్కువ అనే భేదాలు వుంటాయి తప్ప, అన్ని గ్రంథాల్లోనూ సామాజిక చిత్రీకరణ తప్పనిసరిగా వుంటుంది. శివకవుల యుగంలో సామాజిక విషయాలు ఎక్కువగాచోటు చేసుకున్నాయి. శ్రీనాథుని సాహిత్యంలో సామాజిక అంశాలు అధికం. ముఖ్యంగా "పల్నాటి వీరచరిత్ర", "క్రీడాభిరామం" గ్రంథాల్లో మరీ ఎక్కువ.
'''"పల్నాటి వీరచరిత్ర"''' విశ్వవ్యాప్తమయింది. చారిత్రక ప్రతిష్ఠ కలిగింది కూడా. అందుకే పల్నాటివీరచరిత్ర ఆంధ్రుల జాతీయ ఇతిహాసంగా రూపొందింది. ఆంధ్రుల జాతీయ జీవన విధానం ఈ గ్రంథంలో చోటుచేసుకుంది. తెలుగు సమాజమే "పల్నాటి వీరచరిత్ర". పల్నాటి వీరచరిత్రలోని సామాజిక విషయాల్ని జోగారావుగారు చాలా చక్కగా విశ్లేషించారు.
మలిదేవరాజు, బ్రహ్మనాయుడు యుద్ధానికి బయలుదేరిన సందర్భంలో వారి యుద్ధ సన్నాహం ఇలా వర్ణించారు. “భూమర పురోహితులు" జయముహూర్తం పెట్టగా రణభేరి ప్రయోగించి దండుబయలుదేరింది.
<poem>
{{left margin|5em}}
“గొల్లెనల్ గిట్టిన గొప్పలౌబండ్లు
బల్లాని పెట్టెలు పట్టె మంచములు
తరుచైన పీటలు తమ్మపడిగెలును
వింతమందనములు వెలయు గొడ్డులును
కాశ్మీర కస్తూరి గంధ కర్పూర
మాదిగా వాసనలమరు పెట్టెలును
బొక్కసంబుల బల్వ బోనగా వళ్ళు
</poem><noinclude><references/>
{{c|143}}</noinclude>
ftthmi8busqc0kmn4n87wiorbahq5mm
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/159
104
213608
557973
557328
2026-06-04T18:02:34Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557973
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem>
{{left margin|5em}}
జవ్వాజి పిట్టలు శారికాకీర
పంజరములు పట్టు పరిచారకులును
కోడెకాండ్ర దలించి కొట్టెడు నెడ్లు
వడివాగె తేజీలు పాలకీ జోళ్లు
అష్ట భాగ్యంబుల అంగళ్ళవారు
సందడిపడ దండు చయ్యనగదలె"
</poem>
యుద్ధ సందర్భంలో ఉపయోగించిన సంభారాలెలాంటివో మనకు అర్ధమవుతుంది. యుద్ధంలో వినియోగించిన వాద్య విశేషాలు ఇవి. డమాయీలు, మురజములు, భేరీలు, పోటుధారలు, కాహళావంకిణీ, కాలి కొమ్ములు, శంఖములు, సన్నాయి. మురళి, ముఖవీణ, నరగలు, తప్పెటలు, డోళ్లు, తమ్ముటలు, వీరణములు, రుంజలు, కనక తప్పెటలు, చేగంటలు, చిఱుగంటలు మొదలైనవి. ఆనాడు యుధ్ధ యాత్రలో కవులు కూడా పాల్గొన్నారు.
భట్టు రాయబార సందర్భంలో నలగామ రాజు కొలువు సింగారాన్ని ఎంతో వైభవోపేతంగా వర్ణించాడు. శ్రీనాథుడు.
<poem>
{{left margin|5em}}
"కస్తూరి చేతను కలయంగనలికి
ముత్యాల తోడుత ముగ్గులు వెట్టి
కర్పూర ముదకంబు కలిపి ముందటను
కలయంపి చల్లి నిష్కల్మష భంగి
శ్రీరాయ కథలను శ్రీకృష్ణ కథలు
పన్నుగా వ్రాసిన పటములదెచ్చి
కట్టిరిగోడలు కనుపడకుండ
మౌక్తిక మంజీర మంజుపుంజంబు
వ్రేలాడుచుండెడు వివిధ వర్ణముల
ఘనవి తానమ్ములు కట్టిరి మీద
నిలువుటద్దంబులు నిలిపిరి దిశల
అంతు పటములు విస్తరముగబరచి
వన్నెల పటములు వానిపై బరచి
పరిచిన వానిపై పంచ వర్ణములు
</poem><noinclude><references/>
{{c|144}}</noinclude>
3xmr82w8uke778lvs4lj2atjgvbglx8
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/160
104
213609
557974
557329
2026-06-04T18:13:07Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557974
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem>
{{left margin|5em}}
రత్నకంబళములు రంగుగా బరచి
కాంచన నవర్న ఖచతమై నట్టి
పీఠమొక్కటి దెచ్చి పెద్ద కొల్వనను
నిలిపిరిదక్కుల నిగ్గుల దేర"
</poem>
ఇలా విద్యలు, వినోదాలు వర్ణించబడ్డాయని జోగారావుగారు తెలియజేశారు. అంతే కాదు. సంగీత, నాట్యగోష్ఠిని శ్రీనాథుడు వర్ణించాడు.
భట్టు రాయభారం సందర్భంలో శ్రీనాథుని రాజనీతి, లోకజ్ఞతే కాక ఆకాలంలోని ప్రజాభిప్రాయాలు కూడా ప్రతిబింబిస్తాయి. బాల క్రీడా విశేషాలు గుమ్మడి కాయలు, పోకలాటలు, బంతులాట, గుంతమాపలు, బొంగరాలు మొదలైనవి ఎన్నో ఆకాలంలో వున్నట్లు రావుగారు తెలియజేశారు. కోమటి అన్నమ్మ బాలుని చీవాట్లు పెట్టే
సందర్భంలో ఆ తిట్లు ధోరణిలోని తెలుగు నుడికారం అంతా శ్రీనాథునిదే కాని అన్నమ్మది కాదని యస్వీగారు అన్నారు.
ఐతమ్మ సంతానంకోసం చేసిన విష్ణుకాంతనోము, సంధ్యా వృత్తి ఏకభాణం నోము మొదలైన నోములన్నీ ఆకాలంనాటి తెలుగు సమాజంలోని వ్రతాన్ని తెలియజేస్తాయి. ఇలా అనేక చారిత్రక, సామాజిక విషయాలు పల్నాటి చరిత్రలో వున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పల్నాటి చరిత్ర ఆంధ్రుల సాంఘిక చరిత్రగా మనం చెప్పవచ్చు. జోగారావుగారు. అనేక సామాజిక అంశాల్ని గూర్చి ఈ వ్యాసంలో వివరించారు. దీనివల్ల శ్రీనాథునికి గల సామాజిక దృక్పథం వెల్లడవుతుంది.
'''"క్రీడాభిరామం- వైశిష్ట్యం"''' వ్యాసంలో క్రీడాభిరామం కావ్య గొప్పతనం గూర్చి విశదీకరించారు రావుగారు. రావిపాటి త్రిపురాంతకుడు సంస్కృతంలో “ప్రేమాభిరామం” రాశాడు. దాన్ని ఆధారంగా చేసుకొని శ్రీనాథుడు "క్రీడాభిరామం"
రాశాడు. రావుగారు ఈ వ్యాసంలో నాటి పరిస్థితులు - నాగరికత, ఆచార వ్యవహారాలు, అభిరుచులు మొదలైన సామాజిక విశేషాలను విశ్లేషించారు.
'''"శ్రీనాధుని కాశీ ఖండం - సంగ్రహ సమీక్ష"''' అనే వ్యాసంలో కాశీఖండం విశిష్టత గూర్చి తెలియజేశారు. “బ్రాహ్మీదత్త వరప్రసాదుడై, కొండవీటి రెడ్డిరాజ్యమున కోటికి పడగెత్తిన పండిత పట్ట భద్రుడై విద్యాధికారి పదవి విశ్వతోముఖముగా నిర్వహించి, నైషధాది ప్రబంధములనేకము ప్రతిభా ప్రకర్షముగ సంతరించి, కర్ణాటక సమ్రాట్
సభామంటపమున భట్టిడిండిమనాథు భరతము పట్టించి కంచుఢంకా బజాయించి<noinclude><references/>
{{c|145}}</noinclude>
6e6xi471i1zodjvoqh3mjbn8e7n4orr
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/161
104
213610
557975
557330
2026-06-04T18:23:11Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557975
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>కనకాభిషేక సన్మానములు పొంది కవి సార్వభౌమబిరుద విభ్రాజిత్తుడై పరిణత ప్రజ్ఞుడై శ్రీనాథ మహాకవి మనీషా కూలంకషముగా రచించిన పరమ ప్రౌఢ కావ్య కళామండిత పురాణ ఖండము కాశీ ఖండము" అని జోగారావుగారు అన్నారు. “కాశీ ఖండమయః పిండం నైషథం విద్వదౌషధమ్" అని తెలుగు నాట ఒక ప్రసిద్ధమైన ఆభాణం వుంది.
కాశీ ఖండం అయఃపిండమే నైషథం విద్వదౌషధమే.
ఈ వ్యాసంలో శ్రీనాథుని కవితా మాధుర్యాన్ని, శివ తత్త్వాన్ని, విశదీకరించారు. “కాశీ ఖండమున ఏ కావ్యాంగమును పట్టి చూచినను అందు శ్రీనాథుని పాండిత్యము, లోకజ్ఞత, ఈశ్వరార్చన కళాశీలత, రస పరిపక్వమైన హృదయ మాధుర్యము విస్పష్ట రేఖలతో మనకు దర్శనమిచ్చును. శ్రీనాథుడు ఎంత ఆంధ్రుడో అంత గీర్వాణుడు. ఎంత తెలుగు వాడో అంత భారతీయుడు. అందులకతని భీమఖండ, కాశీఖండ రచనలే తగిన తార్కాణాలు. మొదట రచించినది భీమఖండము. తదుపరి కాశీఖండము అది ఆంధ్రాది సంబంధి. ఇది ఆర్యావర్త సంబంధి" అని తెలియజేశారు జోగారావుగారు.
'''9. సాహిత్య భావలహరి :'''
<poem>
{{left margin|5em}}
"జాతీయా చార్యులు యస్వీ జోగారావుగారు
రచించిన 'సాహిత్య భావలహరి' ఒక ప్రామాణికమైన సాహిత్య
సిద్ధాంత సమాలోచన గ్రంథంగా ఎన్నదగింది. ఈ గ్రంథంలో
సమాలోచింపబడిన ప్రధానాంశాలు సాహిత్య స్వరూపం,
ఆలంకారికుల కావ్యసిద్ధాంతాలు, వివిధ విమర్శవా
దృక్పథాలు, రూపకాది ప్రక్రియా లక్షణాలు మొదలైనవి. ఈ
వ్యాసాలన్నీ ఆచార్య జోగారావుగారి స్వోపజ్ఞమైన వివేచనా
శక్తికి ప్రాచ్య పాశ్చాత్య లక్షణ పరిజ్ఞానానికి పతాకలై సహృదయ
హృదయంగమంగా ఉన్నాయి తెలుగ వారి సొత్తుగా
భద్రపరచుకొన్న యక్షగాన వాఙ్మయంమీద ఉత్తమ పరిశోధనా
గ్రంథాన్ని ప్రకటించిన రచయిత సాహిత్య తత్త్వ నిరూపకమైన
సాహిత్య శిక్షను కూడా వెలువరించి సాహితీ లోకానికి ఉ
పకారం గావించినారు. విశ్వవిద్యాలయ ఆచార్యులుగా విశిష్ట
బోధనానుభవం గడించడమే కాక పరిశోధకులుగా, కవి
</poem><noinclude><references/>
{{c|146}}</noinclude>
sreri14zpr7h21zal5lfdvksfjdiw62
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/162
104
213611
557976
557331
2026-06-04T18:35:08Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557976
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem>
{{left margin|5em}}
తిలకులుగా, విమర్శకవతంనులుగా యశస్సు నార్జించిన
ఆచార్య యస్వీ జోగారావుగారి శేముషికి ఈ గ్రంథం మరొక
నిదర్శనంగా చెప్పవలసి ఉంది".
{{'''-ఎం. కులశేఖరరావు'''}}
</poem>
ఈ గ్రంథం 1989లో వెలువడింది. తెలుగు అకాడమి ప్రచురించింది. పేజీలు 202. దీని సంపాదకులు ఆచార్య ఎమ్ కులశేఖర రావుగారు. ఇందులో 32 అంశాలు చోటు చేసుకున్నాయి. చివరలో అనుబంధం వుంది. అవి ఇవి. 1. దేవుని దస్తూరీ 2. కళ - సౌందర్యం - కవిత్వం 3. లలిత కళలు 4. సాహిత్య ప్రతిపత్తి - వైవిధ్య వైశిష్ట్యం 5. ప్రపంచ చరిత్రలో సాహిత్యం 6. సాహిత్యం - లోకవృత్తం 7. జాతీయ సమైక్యం 8. ప్రాచీన మహాకావ్యముల అధ్యయనం 9. విద్యార్థులు - సాహిత్యం 10. కావ్య ప్రయోజనదృష్టి, 11. ధ్వని సిద్ధాంతం 12. పాశ్చాత్య కవితా వాదములు, 13. సాహిత్యం - విమర్శ 14. సాహిత్య విమర్శ- సమస్యలు 15. సాహిత్యతత్త్వం- విమర్శకుడు 16. విమర్శన సూత్రములు, 17. సాహిత్య స్రష్ట - ద్రష్ట 18. సహృదయతత్వం- గుణదోష విచారం 19. ఉత్తమ విమర్శకుని లక్షణములు 20. ప్రధాన విమర్శ విధానములు 21. ఆర్వాచీన విమర్శ పద్ధతులు 22. వివరణాత్మక వాఖ్యానాత్మక, ప్రమాణాత్మక, నిర్ణయాత్మక విమర్శక విధానములు 23. ప్రాక్ర్పతీచీన వైమర్శిక దృక్పథములు 24. దశరూపకములు 25. సంస్కృత రూపకళ 26. సంస్కృత రూపక స్వరూప స్వభావములు 27. గ్రీకు భారతీయ రూపకములు 28. ట్రాజెడీ -1 29. ట్రాజెడీ - 2, 30. నవల - నవలిక, 31. కథానిక, 32. జీవిత చరిత్రలు చోటుచేసుకున్నాయి. అనుబంధంలో I. కవి - కవిత, II. కావ్యం, III. కావ్య హేతువులు, IV. చమత్కారం, v. కావ్య వస్తువు, VI. కావ్యప్రయోజనం, VII. వాగర్థాలు, VIII. గుణదోషాలు, IX. సహృదయుడు (రసజ్ఞడు), X. ప్రకీర్ణకం, XI. సంగీత సాహిత్యాలు వున్నాయి.
'''10. సాహిత్యవల్లి:'''
ఇది ఏప్రిల్ 1990లో వెలువడింది. ఇందులో 120 పేజీలు వున్నాయి. దీన్ని గానుపాటి పరబ్రహ్మ రావుగారికి అంకితం ఇచ్చారు. ఈ గ్రంథంలో 11 వ్యాసాలు వున్నాయి. దీన్ని భువన విజయ పబ్లికేషన్స్, విజయవాడ వారు ప్రచురించారు. 1. భారతీయ సంస్కృతి - విశ్వవిశాల దర్శనం 2. విమర్శ గ్రంథాలు - వ్యాస సంపుటాలు 3. ఆంధ్ర సాహిత్య సమాలోచనం 4. కావ్యం - కల్పనా శిల్పం, 5. విజయనగర<noinclude><references/>
{{c|147}}</noinclude>
9bzd4tmr9o7aso9vialamvsm8o2ryos
557977
557976
2026-06-04T18:35:42Z
శ్రీరామమూర్తి
1517
557977
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem>
{{left margin|5em}}
తిలకులుగా, విమర్శకవతంనులుగా యశస్సు నార్జించిన
ఆచార్య యస్వీ జోగారావుగారి శేముషికి ఈ గ్రంథం మరొక
నిదర్శనంగా చెప్పవలసి ఉంది".
{{right|'''-ఎం. కులశేఖరరావు'''}}
</poem>
ఈ గ్రంథం 1989లో వెలువడింది. తెలుగు అకాడమి ప్రచురించింది. పేజీలు 202. దీని సంపాదకులు ఆచార్య ఎమ్ కులశేఖర రావుగారు. ఇందులో 32 అంశాలు చోటు చేసుకున్నాయి. చివరలో అనుబంధం వుంది. అవి ఇవి. 1. దేవుని దస్తూరీ 2. కళ - సౌందర్యం - కవిత్వం 3. లలిత కళలు 4. సాహిత్య ప్రతిపత్తి - వైవిధ్య వైశిష్ట్యం 5. ప్రపంచ చరిత్రలో సాహిత్యం 6. సాహిత్యం - లోకవృత్తం 7. జాతీయ సమైక్యం 8. ప్రాచీన మహాకావ్యముల అధ్యయనం 9. విద్యార్థులు - సాహిత్యం 10. కావ్య ప్రయోజనదృష్టి, 11. ధ్వని సిద్ధాంతం 12. పాశ్చాత్య కవితా వాదములు, 13. సాహిత్యం - విమర్శ 14. సాహిత్య విమర్శ- సమస్యలు 15. సాహిత్యతత్త్వం- విమర్శకుడు 16. విమర్శన సూత్రములు, 17. సాహిత్య స్రష్ట - ద్రష్ట 18. సహృదయతత్వం- గుణదోష విచారం 19. ఉత్తమ విమర్శకుని లక్షణములు 20. ప్రధాన విమర్శ విధానములు 21. ఆర్వాచీన విమర్శ పద్ధతులు 22. వివరణాత్మక వాఖ్యానాత్మక, ప్రమాణాత్మక, నిర్ణయాత్మక విమర్శక విధానములు 23. ప్రాక్ర్పతీచీన వైమర్శిక దృక్పథములు 24. దశరూపకములు 25. సంస్కృత రూపకళ 26. సంస్కృత రూపక స్వరూప స్వభావములు 27. గ్రీకు భారతీయ రూపకములు 28. ట్రాజెడీ -1 29. ట్రాజెడీ - 2, 30. నవల - నవలిక, 31. కథానిక, 32. జీవిత చరిత్రలు చోటుచేసుకున్నాయి. అనుబంధంలో I. కవి - కవిత, II. కావ్యం, III. కావ్య హేతువులు, IV. చమత్కారం, v. కావ్య వస్తువు, VI. కావ్యప్రయోజనం, VII. వాగర్థాలు, VIII. గుణదోషాలు, IX. సహృదయుడు (రసజ్ఞడు), X. ప్రకీర్ణకం, XI. సంగీత సాహిత్యాలు వున్నాయి.
'''10. సాహిత్యవల్లి:'''
ఇది ఏప్రిల్ 1990లో వెలువడింది. ఇందులో 120 పేజీలు వున్నాయి. దీన్ని గానుపాటి పరబ్రహ్మ రావుగారికి అంకితం ఇచ్చారు. ఈ గ్రంథంలో 11 వ్యాసాలు వున్నాయి. దీన్ని భువన విజయ పబ్లికేషన్స్, విజయవాడ వారు ప్రచురించారు. 1. భారతీయ సంస్కృతి - విశ్వవిశాల దర్శనం 2. విమర్శ గ్రంథాలు - వ్యాస సంపుటాలు 3. ఆంధ్ర సాహిత్య సమాలోచనం 4. కావ్యం - కల్పనా శిల్పం, 5. విజయనగర<noinclude><references/>
{{c|147}}</noinclude>
mvbmm15cnd50zkgcs6cyv6ni5klxg3f
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/163
104
213612
557978
557332
2026-06-04T21:17:02Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557978
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>ప్రత్యూషం 6. నేటి సాహిత్య విమర్శ 7. వెంకట రామకృష్ణ కవులు అవధానాలు. 8. తుమ్మలవారి కవితాశయాలు, ఆదర్శాలు, 9. వేటూరి వారి శృంగార శ్రీనాథం 10. కన్యాశుల్కం పుట్టుక పూర్వరంగం. 11. బొడ్డు బాపి రాజు గారి ప్రకృతి ప్రణయ కవిత్వం. ఈ వ్యాసాల్లో విమర్శ దండిగా చోటు చేసుకుంది.
'''"భారతీయ సంస్కృతి - విశ్వవిశాల దర్శనం"'''లో భారతీయ సంస్కృతి ప్రాశస్త్యాన్ని గూర్చి కొనియాడారు రావుగారు. “ఒక జాతియొక్క తరతరాల వైజ్ఞానికమైన నైతికమైన సామాజికమైన నియతని గాని ప్రగతిని గాని నిరూపించునట్టి సమయముల సంప్రదాయముల సమాహార స్వరూపమే సంస్కృతి" అని జోగారావుగారు అన్నారు. మనసంస్కృతి సర్వస్వానికి మూలాలు వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, భారతం, భగవద్గీత, పురాణాలు, దర్శనాలు మొదలైనవి. ఇవే విశ్వవిశాలమైన మనసంస్కృతిలోని ఆంతర్యాన్ని తెలియజేస్తాయి. సంస్కృత వాఙ్మయంలో భారతీయ సంస్కృతి నిక్షేపమై వుందని చెప్పారు. భారతీయ సంస్కృతి సర్వమానవ జాతికి ఆదర్శమని కొనియాడారు.
'''"తెలుగు విమర్శ గ్రంథాలు - వ్యాస సంపుటాలు"''' వ్యాసంలో విమర్శ గ్రంథాల్ని, వ్యాస సంపుటాల్ని పరిశీలించారు. రావుగారు ముందుగా కవులచరిత్రకు సంబంధించిన గ్రంథాలను సమీక్షించారు. కందుకూరి - ఆంధ్రకవుల చరిత్ర, చాగంటి శేషయ్య - ఆంధ్ర కవి తరంగిణి (13 సంపుటాలు - 1947), నిడదవోలు వేంకటరావు - తెనుగు కవుల చరిత్ర (1956), వేదము వేంకట కృష్ణశర్మ - అఖండ దీపారాధన దాన శాసన వాఙ్మయ చరిత్ర, శిష్టాలక్ష్మీ కాంతంశాస్త్రి - విజయనగరాంధ్ర కవులు, మధునా పంతులు - ఆంధ్రరచయితలు (1950), ఊటుకూరి లక్ష్మీ కాంతమ్మ - ఆంధ్ర కవయిత్రులు (1953), అఖిల భారత కవయిత్రులు మొదలైన ప్రముఖులు రాసిన చరిత్రలను చక్కగా విశ్లేషించారు.
తర్వాత వాఙ్మయ చరిత్రలను సమాలోచన చేశారు. వంగూరి సుబ్బారావు - ఆంధ్ర వాఙ్మయ చరిత్ర, ఖండవల్లి లక్ష్మీరంజనం - ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహం (1955), దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్రము (1958), కూర్మావేణుగోపాల స్వామి - తెలుగు వాఙ్మయం- సంగ్రహచరిత్ర (1960), కురుగంటి, పిల్లల మర్రి - నవ్యాంధ్ర సాహిత్య వీథులు (నాలుగు భాగాలు), శిష్టా రామకృష్ణ శాస్త్రి - ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సర్వస్వం (1956 - మొదటి భాగం), ఆరుద్ర -<noinclude><references/>
{{c|148}}</noinclude>
81mouyqdbkn0c8wmtm3nvv1h328ruma
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/164
104
213613
557979
557333
2026-06-04T21:29:04Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557979
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>సమగ్రాంధ్ర సాహిత్యం (1965 ప్రారంభం - 12 సంపుటాలు) గిడుగు సీతాపతి - History of Telugu Literarure మొదలైన గ్రంథాల్ని గూర్చి వివేచనచేశారు.
ప్రత్యేకంగా వాఙ్మయంలోని కొన్ని అంశాల్ని గూర్చి రావుగారు పరిచయం చేశారు. నిడదవోలు వేంకటరావు - ఉదాహరణ వాజ్మయ చరిత్ర, వేదము వేంకటకృష్ణ శర్మ - శతకవాఙ్మయ సర్వస్వము, వంగూరి సుబ్బారావు - శతక కవుల చరిత్ర, గొబ్బూరి వేంకటానందరాఘవ రావు - ఆంధ్ర వచన రచనా పరిణామము, కోరాడ రామకృష్ణయ్య - దక్షిణ దేశ భాషా సారస్వతములు - దేశి, ఆర్వీ యస్ సుందరరం తెలుగు సాహిత్యంలో దేశికవిత, జి. నాగయ్య - తెలుగు కావ్యావతారికలు, కె.గోపాల కృష్ణారావు - తెలుగుపై ఉర్దూ పారశీకముల ప్రభావం, ముట్నూరి సంగమేశం - తెలుగు హాస్యం, మునిమాణిక్యం - మన హాస్యం, జి.వి.సుబ్రహ్మణ్యం - వీరరసం, రావూరి దొర స్వామి - తెలుగులో తిట్టు కవిత్వం, తూమాటి దొణప్ప - సంస్థానాలు - సాహిత్య సేవ మొదలైన గ్రంథాల్ని గురించి వివరించారు.
కొందరి కవుల గూర్చి వాళ్ళ కావ్యాలగూర్చి, కొన్ని గ్రంథాలు వెలువడ్డాయి. రావుగారు వాటిని పరిచయం చేశారు. విశ్వనాథ - నన్నయ ప్రసన్న కథా కవితార్ధయుక్తి, అల్లసాని వాని అల్లిక జిగిబిగి, శాకుంతలము యొక్క అభిజ్ఞానత,
కావ్య పరీమళము, భూపతి లక్ష్మీనారాయణ రావు - భారతము - తిక్కన రచన వేటూరి ప్రభాకరశాస్త్రి - అన్నమాచార్య చరిత్రము, శ్రీనాథుని గూర్చి, ఆయన కావ్యాలను గూర్చి రాసిన రచయితలను గూర్చి తిక్కన గూర్చి, ఆయన రచనలగూర్చి రాసిన రచయితలను గూర్చి, ఎంతో వివరంగా తెలియజేశారు.
శాస్త్ర విషయాలకు సంబంధించిన భాష, వ్యాకరణం, ఛందస్సు, విమర్శ మొదలైన వానిపై మంచి గ్రంథాలు, వెలువడ్డాయి. వాటిని విపులీకరించారు రావుగారు. గంటి జోగిసోమయాజి "ఆంధ్ర భాషా వికాసం", వజ్ఞల “ద్రావిడ భాషా పరిశీలనం", కోరాడ “భాషాచారిత్రక వ్యాసములు", బాలవ్యాకరణంపై వచ్చిన వ్యాఖ్యానాల గురించి వివరించారు.
ఈ వ్యాసంలో విమర్శ గ్రంథాలను గూర్చి వివేచన చేసిన తర్వాత వ్యాస సంపుటాలను గూర్చి విశ్లేషించారు. రావుగారు. పానుగంటి వారి “సాక్షి వ్యాసాలు", కొమర్రాజు వారి "లక్షణ రాయవ్యాసావళి", బండారు తమ్మయ “వ్యాసావళి",<noinclude><references/>
{{c|149}}</noinclude>
a6mftddxa5nl4jjz9efm27rxn5hnxsv
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/165
104
213614
557980
557334
2026-06-04T21:38:50Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557980
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>కట్టమంచి “పంచమి”, రాళ్ళ పల్లి అనంత కృష్ణశర్మ “సారస్వతాలోకం", “నాటకోపన్యాసములు”, నేలటూరి వేంకటరమణయ్య "వాఙ్మయ వ్యాస మంజరి", ఖండవల్లి లక్ష్మీరంజనం “లక్ష్మీరంజన వ్యాసావళి", దివాకర్ల వేంకటావధాని “కావ్యలహరి”, కాటూరి వేంకటేశ్వరరావు “సాహిత్య దర్శనం" (1967), దేవుపల్లి రామానుజరావు “సారస్వత నవనీతం", జి.వి. సుబ్రహ్మణ్యం "సారస్వత సౌరభం", ఆర్.యస్.సుదర్శనం “సాహిత్యంలో దృక్పథాలు”, సి. నారె “వ్యాసవాహిని”, మొదలైన వ్యాస సంపుటాలగూర్చి చక్కగా విశదీకరించారు. తర్వాత అన్యభాషా సాహిత్య
విషయాల్ని గూర్చి, సాహిత్య సిద్ధాంతల గూర్చి, సాహిత్యేతర విషయాల గూర్చి తెలియజేశారు.
వ్యాసం చివరలో వ్యాసరచయితకు వుండవలసిన ముఖ్య అంశాల్ని గూర్చి జోగారావుగారు వెల్లడించారు. "వ్యాస రచయితకు విషయఙ్ఞత ఊపిరి. వ్యాస సౌందర్యానికి చక్కని ప్రయోగోపసంహారాలు, వివరణ, విమర్శ, సముచిత నిర్ణయం అనేవి ఉచ్ఛ్వాసనిశ్వాసాలు. ఈ నాటి మన విమర్శకులంతా నిష్పాక్షింగా వుండి, అర్ధము కలిగి నిదానమవలంబించి, రచనలలో ఒకనియమానికి నిలబడి ఒక పద్ధతికి కట్టుబడి, వ్యాసం యొక్క సారస్వతపు వారసత్వం మీద చూపు నిలిపి, పరిక్రమిస్తే మన విమర్శలకు, వ్యాసాలకు, అవశ్యం మంచి భవిష్యత్తుంటుందని ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆశాలింగిత కంఠంతో ఘంటా పథంగా చెప్పవచ్చు" అని అన్నారు.
'''"ఆంధ్ర సాహిత్య సమాలోచనం"''' వ్యాసంలో రావుగారి విమర్శ వాడిగా వేడిగా జరిగింది. సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదవకుండా, అర్ధం చేసుకోకుండా, విమర్శ చేస్తున్న వారిని ఉతికారేశారు. జోగారావుగారు. ప్రాచీన సాహిత్యంలో ఏమీలేదు, అంతా ఆధునికంలో వుంది, అనేవారిని వెంటాడి వేటాడి చీల్చి చెండాడారు. వేయి సంవత్సరాల తెలుగు సాహిత్యం చాలా గొప్పదని కొనియాడారు. కొందరు ప్రజాసాహిత్యం ఆధునిక సాహిత్యంలో వుంది, ప్రాచీన సాహిత్యం ఏమీలేదంటారని, ఆ అభిప్రాయం శతశతాంశం తప్పు అని ఉదాహరణ పూర్వకంగా విపులీకరించారు.
నన్నయ, పోతన, భారత, భాగవతాలు జగద్ధితంగా రాశారంటే అది ప్రజాసాహిత్యం కాదా! తిక్కన "ఆంధ్రావళి మోదముంబొరయ” అని అన్నాడంటే అది ప్రజా సాహిత్యం కాదా! "విశ్వ శ్రేయః కావ్యం" అని ఏనాడో మన పెద్దలు అన్నారు. అది ప్రజాసాహిత్యం కదా! అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఈ వ్యాసంలో కొందరిని<noinclude><references/>
{{c|150}}</noinclude>
0z234jonqwgtlhg44fowb40kbcnyy29
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/166
104
213615
558001
557335
2026-06-05T09:27:55Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
558001
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>విమర్శించారు యస్వీ గారు. మన భావుకత, మన పఠనాశక్తి, మన అవగాహనశక్తి, సన్నగిల్లి పోతే నన్నయ ఏమిచేస్తాడు, తిక్కన ఏమి చేస్తాడు అని విమర్శలు గుప్పించారు.
సామ్యవాదం పేరు మీద చెలామణి అయినదంతా సాహిత్యం అని అనుకోవడానికి వీలు లేదని, వున్నది వున్నట్లు చెప్పారు. తెలుగు సాహిత్యంలో వున్నదంతా శృంగారమే, ఇతర రసాలు ఊసరవెల్లి రంగులే అనే వాదం వుంది. అది కూడా తప్పు అని వివరించారు. శృంగారం రసరాజం. ప్రపంచలో మహాకావ్యం ఏ భాషలో వచ్చినా, శృంగార స్పర్శ లేనిదే లేదని నొక్కి వక్కాణించారు జోగారావుగారు. భారత, భాగవత రామాయణాల్లో కావలసినంత సామాజిక సందేశం వుందని ఆగ్రంథాలను ప్రశంసించారు.
తెలుగు సాహిత్యంలో రస, ధ్వని సిద్ధాంతాలను కూడా కొట్టి పారేసే వారు వున్నారని రావుగారు ఆవేదన చెందుతారు. అంతే కాదు ఆ సిద్ధాంతాల గొప్పతనం గూర్చి వివరించారు. కొంతమంది ఆధునిక మహానుభావులు ఛందస్సును, అలంకారాలను, సమాసం, శబ్ద చిత్రం మొదలైన వాటిని గూర్చి నోటికి వచ్చినట్లు మాటలాడుతున్నారని అది తగదని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
"స్థలకాలాభావానికి కట్టుబడి వూరుకుంటున్నాను గాని అసలీ విషయం గురించి ఇంకా ఎంతైన వ్రాయవచ్చు. ఒక్కొక్క పాయింటు మీద ఒక్కొక్క వ్యాసం వ్రాయవచ్చు. గడువుంటే గ్రంథం వ్రాయవచ్చు. అవకాశం వుంటే తప్పక వ్రాసి
తీరుతాను. అసలిది కొన్ని అభాండాలను నిభాయించుకోడానికన్న మాటేకాని, ప్రాచీన సాహిత్యం గురించి వకాల్తా పుచ్చుకోడానికి గాదు. వర్తమాన సాహిత్యాన్ని ఆక్షేపించాడానికి కాదు. నాకు రెండూ రెండు కళ్లు. సాహిత్యమొక శైలూషివంటిది. అది యధావకాశంగా అనేక వాలకాలు వేస్తూవుంటుంది. వేస్తువుంటేనే దాని వైఖరి
నిత్యప్రత్యంగావుంటుంది. విభిన్నములైన అభిరుచులు గలవారి కందరికి అంతో యింతో సంతృప్తినిస్తూ వుంటుంది. అప్పుడే అది ప్రగతి శీలంగా వుంటుంది. అది యెన్ని వాలకాలు వేసినా దాని మౌలికమైన నామరూపాలను గ్రహించగలగడమే సిసలైన సహృదయతకు తార్కాణం. సహృదయతలో గల రహస్యము సర్వసత్పథ సామరస్యము. ఈ విడ్డూరములైన వితండవాదనల నతిక్రమించి సత్యసన్నిహితంగా ఏనాడు సహృదయులందరూ ఏకాభిప్రాయులవుతారో ఆనాడే మన సాహిత్యానికి<noinclude><references/>
{{c|151}}</noinclude>
kpe0vdzwh5z37434dnniqzoo7egf6d9
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/167
104
213616
558003
557336
2026-06-05T09:42:35Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
558003
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>మంచి రోజులు. ఆ సుముహూర్తం కోసం అస్మాదృశులందరూ ఎదురుచూస్తున్నారు. అహరహపరిశ్రమిస్తున్నారు." అని జోగారావుగారు నహృదయ పాఠకులకు తెలియజేశారు.
'''"కావ్యం-కల్పనా శిల్పం"''' వ్యానంలో కల్పనా శిల్పం గూర్చి రావుగారు వివరించారు. కావ్య భేదాల గూర్చి చెప్పారు. కవితాశిల్పం ఆకావ్యాన్ని ఒక కళాఖండంగా రాణింపచేస్తుందని అన్నారు. కావ్యంలో ఇతి వృత్తం, పాత్ర, రసం, శైలి వర్ణన, అలంకారం మొదలైన అంగాలు వుంటాయి. అందులో ఒకటి కల్పనా శిల్పం, ఒకొక్క దానికి ఒక్కొక్క శిల్ప మర్యాద వుంటుంది. "కల్పన” శబ్దం సంస్కృతం.
"కల్పనలో శిల్పమంటే కవి ఏదో కల్పన చేశాడంటే చేశాడని మొక్కుబడి తీర్చుకున్నట్లు చేయడం గాదు. ఆ కల్పనకు సందర్భ శుద్ధి ఉండాలి. విగ్రహ శిల్పంలో లాగా ప్రిపరేషన్ దెబ్బతినకూడదు. ప్రోపర్టీ చెక్కుచెదరకూడదు. ఉపరి చమత్కార గర్భితంగా వుండాలి. “రసీసారః చమత్కారం:” “నహిచమత్కార విరహితస్య కవేః కవిత్వం కావ్యస్యతా కావ్యతమ్" అని కదా అన్నారు పెద్దలు, అప్పుడే ఆ కల్పన కావ్యగర్భగుడిలోని అఖండా దీపకళిక అవుతుంది" అని అంటారు జోగారావుగారు.
“వర్ణనా నిపుణః కవిః" వర్ణన రాణించాలంటే కవిఏదైనా అలంకారాన్ని ఆశ్రయించాలి. లేదా ఒక అద్భుతమైన కల్పన చేయాలి. కల్పన అలంకార గర్భితంగా వుండాలి. ఉదాహరణకు రామరాజభూషణుడు "వసుచరిత్ర"లో ఒకచోట
చంద్రోదయాన్ని వర్ణించాడు.
<poem>
{{left margin|5em}}
"హరిదంభోరుహలోచన నల్గగనరంగా భోగరంగత్తమో
భరనేపథ్యము నొయ్య నొయ్య సడలింపన్, రాత్రి శైలూషికిన్ వరుసన్
మౌక్తిక పట్టమున్, నిటలమున్, వక్త్రంబునుందోచె నా
హరిణాంకాకృతి వొల్చెరేకయి, సగంబై, బింబమై తూర్పునన్"
{{right|(వసుచరిత్ర-4-17).}}
</poem>
చంద్రోదయ వర్ణన ఇక్కడ ప్రధాన విషయం. అయితే ఆనాడు వీధిలో ఆడబడే భామా కలాపంలోని భామ వేషం తెరవెళ్ళడం కాదు. తెర క్రమక్రమంగా ప్రక్కవాటంగా తెరచుకోవడం కాక, ఎగువనుండి దిగువకు తెరుచుకోవడం, క్రమక్రమంగా భామా వేషం యొక్క నుదురు, తర్వాత ఒక్క సారి ముఖమంతా కనిపించడం వర్ణించబడింది.
ఇక్కడ చంద్రోదయం ఆవిధంగానే రేకై, సగమై, బింబమై క్రమంగా ఆవిష్కృతమైంది.<noinclude><references/>
{{c|152}}</noinclude>
6bbg605e3w807mfo7d4xb3i10mjd9so
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/168
104
213617
558004
557337
2026-06-05T09:56:04Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
558004
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>అలా ఆవిష్కృతమైంది అని చెప్పడానికి గగనమనే నాటకం మీద, దిక్కులనే అంగనలు, చీకటి అనే తెరను చూస్తూ వుండగా భామ వేషం క్రమక్రమంగా ఏవిధంగా ఆవిష్కృతమైందో అలాగే చంద్రోదయం అయిందని కల్పన చేశాడు భట్టు మూర్తి. ఈ కల్పనలో కవియొక్క లోకఙ్ఞత తేటతెల్లమవుతుంది. అతని అలంకార ప్రావీణ్యంకూడా బయట పడుతుంది. ఆయన ఊహా ప్రకటిత మవుతుంది. ఆసలు విషయం ఏమంటే కల్పనకు ఊహే ప్రధానం. అందుకే "ఊహలేని వాణ్ని ఊళ్ళోంచి పొమ్మన్నారు” అనే సామెత కూడా వుంది. మంచి కల్పనా నైపుణ్యం వుంటే అది
మంచి కావ్యం అన్పించుకుంటుంది. అప్పుడే ఆ కవి కూడా గొప్పకవి అవుతాడు.
కల్పన అనేది వర్ణనకే పరిమితమైంది కాదు. వివిధరంగాల్లో ఏదైనా వుండవచ్చు. ఉదాహరణకు భట్టుమూర్తిరాసిన "వసుచరిత్ర"లో వస్తుసన్నివేశ గత మైంది చూడండి.
<poem>
{{left margin|5em}}
"ఇది సంధింపగవేళ యందు వసురాజేంద్రుడు నీ రంధ్రనీ
రదవారప్రతి సీర వెల్వడిన తారాభర్త లీలన్ లతా
చ్ఛదనంఛాదిక బాసి నిల్చె నెదుటన్ సారంగ రాగ భ్రమ
న్మద భృంగీరుతివందిమాగధ కథా మాధుర్యముందెల్పగన్"
{{right|(వసుచరిత్ర - 3-45)}}
</poem>
గిరిక, వసురాజు గూర్చి అన్ని విషయాలు తెలుసుకొని అనుకర్తయై అయోగవిప్రలంభంతో విలపిస్తూ వుంటుంది. ఆమె కోసమే వచ్చిన వసురాజు ఆ ప్రక్కనే ఒక పొదరింట్లో దాగివుంటాడు. వసురాజు నర్మసచివుడు ఒక మాయదారి
జడధారి రూపంలో నాయికా, నాయకులకు సమాధానం సంకల్పించి గిరిక వద్దకు వస్తాడు. గిరిక చెలికత్తెలు నిజంగా - యతే అనుకుంటారు. అందువల్ల తమ గిరికను విరహవేదన నుండి కాపాడవలసిందిగా కోరుతారు. వాడు నిజంగా యతి లాగే పోజు పెట్టి తన మంత్ర శక్తితో వసురాజును తెప్పిస్తానంటాడు. అదేవిధంగా ఏమీ తెలియనట్లు వసురాజు పొదరింటి నుండి బటయకు వస్తాడు. అప్పుడు వసురాజు గూర్చి భట్టుమూర్తి అద్భుతంగా కల్పన చేశాడు. ఆ కల్పననే కల్పనా శిల్పంగా మనం చెప్పవచ్చు.
వసురాజు ప్రవేశం ఎలా వుందంటే దట్టమైన మేఘాలనే తెరను తొలగించుకొన్న చంద్రుడు మాదిరిగా వున్నాడని కల్పన చేశాడు. ఇక్కడ వసురాజుకి వంది మాగధులు ఎక్కడవి. ఆ పొందరింటి పూదీగలను తీసుకురాగానే అంతవరకు వాటి<noinclude><references/>
{{c|153}}</noinclude>
5d5thnvj3olmlqzztzr3qk6vetqe3wv
558005
558004
2026-06-05T09:56:31Z
శ్రీరామమూర్తి
1517
558005
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>అలా ఆవిష్కృతమైంది అని చెప్పడానికి గగనమనే నాటకం మీద, దిక్కులనే అంగనలు, చీకటి అనే తెరను చూస్తూ వుండగా భామ వేషం క్రమక్రమంగా ఏవిధంగా ఆవిష్కృతమైందో అలాగే చంద్రోదయం అయిందని కల్పన చేశాడు భట్టు మూర్తి. ఈ కల్పనలో కవియొక్క లోకఙ్ఞత తేటతెల్లమవుతుంది. అతని అలంకార ప్రావీణ్యంకూడా బయట పడుతుంది. ఆయన ఊహా ప్రకటిత మవుతుంది. ఆసలు విషయం ఏమంటే కల్పనకు ఊహే ప్రధానం. అందుకే "ఊహలేని వాణ్ని ఊళ్ళోంచి పొమ్మన్నారు” అనే సామెత కూడా వుంది. మంచి కల్పనా నైపుణ్యం వుంటే అది
మంచి కావ్యం అన్పించుకుంటుంది. అప్పుడే ఆ కవి కూడా గొప్పకవి అవుతాడు.
కల్పన అనేది వర్ణనకే పరిమితమైంది కాదు. వివిధరంగాల్లో ఏదైనా వుండవచ్చు. ఉదాహరణకు భట్టుమూర్తిరాసిన "వసుచరిత్ర"లో వస్తుసన్నివేశ గత మైంది చూడండి.
<poem>
{{left margin|5em}}
"ఇది సంధింపగవేళ యందు వసురాజేంద్రుడు నీ రంధ్రనీ
రదవారప్రతి సీర వెల్వడిన తారాభర్త లీలన్ లతా
చ్ఛదనంఛాదిక బాసి నిల్చె నెదుటన్ సారంగ రాగ భ్రమ
న్మద భృంగీరుతివందిమాగధ కథా మాధుర్యముందెల్పగన్"
{{right|(వసుచరిత్ర - 3-45)}}
</poem>
గిరిక, వసురాజు గూర్చి అన్ని విషయాలు తెలుసుకొని అనుకర్తయై అయోగవిప్రలంభంతో విలపిస్తూ వుంటుంది. ఆమె కోసమే వచ్చిన వసురాజు ఆ ప్రక్కనే ఒక పొదరింట్లో దాగివుంటాడు. వసురాజు నర్మసచివుడు ఒక మాయదారి
జడధారి రూపంలో నాయికా, నాయకులకు సమాధానం సంకల్పించి గిరిక వద్దకు వస్తాడు. గిరిక చెలికత్తెలు నిజంగా - యతే అనుకుంటారు. అందువల్ల తమ గిరికను విరహవేదన నుండి కాపాడవలసిందిగా కోరుతారు. వాడు నిజంగా యతి లాగే పోజు పెట్టి తన మంత్ర శక్తితో వసురాజును తెప్పిస్తానంటాడు. అదేవిధంగా ఏమీ తెలియనట్లు వసురాజు పొదరింటి నుండి బటయకు వస్తాడు. అప్పుడు వసురాజు గూర్చి భట్టుమూర్తి అద్భుతంగా కల్పన చేశాడు. ఆ కల్పననే కల్పనా శిల్పంగా మనం చెప్పవచ్చు.
వసురాజు ప్రవేశం ఎలా వుందంటే దట్టమైన మేఘాలనే తెరను తొలగించుకొన్న చంద్రుడు మాదిరిగా వున్నాడని కల్పన చేశాడు. ఇక్కడ వసురాజుకి వంది మాగధులు ఎక్కడవి. ఆ పొందరింటి పూదీగలను తీసుకురాగానే అంతవరకు వాటి<noinclude><references/>
{{c|153}}</noinclude>
04c5jagydjymhwjeb1lxviwe1pbv1p3
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/169
104
213618
558006
557338
2026-06-05T10:07:14Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
558006
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>మీద విశ్రమించివున్న తుమ్మెదలన్నీ ఝుమ్మని అన్నాయి. అందులో మగతుమ్మెదలను వలచి Mating Signdlh చేస్తున్న ఆడతుమ్మెదల రొదలా వుంది. అదంతా ఇక్కడ వసురాజు రంగప్రవేశానికి వందిమాగధ కథా మాధుర్యం. ఇక్కడ మరో ప్రత్యేక విశేషం ఏమంటే అక్కడ ప్రయోగించబడ్డ సారంగ శబ్దం వల్ల మగ తుమ్మెద అనే మాటే కాకుండా పాతరోజుల్లో వందిమాగధులుకైవారగద్యలను సారంగ రాగంలో పఠించడం అనే సంప్రదాయంకూడా సూచితమౌతుంది. ఇలా వస్తు సన్నివేశంలో రామ రాజ భూషణుడు కల్పనా శిల్పాన్ని చక్కగా ప్రదర్శించడాన్ని
జోగారావుగారు కల్పనా శిల్పం గూర్చి అద్భుతంగా వివరించారు.
'''"విజయనగర ప్రత్యూషం - నాటి సాహిత్యం"''' వ్యాసంలో విజయనగర గొప్పతనం గూర్చి, నాటి సాహిత్య విశిష్టత గూర్చి రావుగారు విశదీకరించారు. రాయలయుగ గొప్పతనం గూర్చి వివరించారు. శ్రీకృష్ణ దేవరాయులు రాసిన ఆముక్త మాల్యద ప్రాశస్త్యాన్ని విపులీకరించారు. భువన విజయం గూర్చి, అష్ట దిగ్గజ కవులగూర్చి వాళ్ళ కావ్యాలగూర్చి, వాళ్ళ కవితా వైభవం గూర్చి విశదీకరించారు జోగారావు గారు.
'''"నేటి సాహిత్య విమర్శ తీరుతెన్నులు"''' లో సాహిత్య విమర్శను విశ్లేషించారు. విమర్శకు కొన్ని నియమాలు సూత్రాలు తప్పనిసరిగా వుండాలి. లేక ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు విమర్శచేస్తూ వుంటారు. ఆవిమర్శ మంచి పద్ధతికాదని
తెలియజేశారు. ప్రాచ్య ప్రాశ్చాత్య ప్రాచీన, నవీన సాహిత్య విమర్శ సిద్దాంతాలను గూర్చి వివరించారు. తెలుగు సాహిత్య విమర్శలో ముఖ్యంగా నవ్య సాహిత్య విమర్శ తీరుతెన్నులు ఏమీ బాగులేవని కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాన్ని వివరించారు రావుగారు. అందులో పక్ష పాతం, అజ్ఞానం చాలా చాలా స్పష్టంగా కన్పిస్తుందని వాపోయారు.
"కందుకూరి వీరేశలింగం అడుగు జాడలలో నడచిన గురజాడ, రాయప్రోలు, పానుగంటి, చిలకమర్తి, తిరుపతి వెంకటకవులు, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ కృష్ణ శాస్త్రి, చలం, తిలక్ ప్రభృతులు ఎందరో మహారచయితలు తమ రచనలద్వారా ఏది సాహిత్యమో, ఏది మహారచనో, దేనిని ఎలా విమర్శించాలో కూడా చెప్పిపోయారు. అయినా ఈ నవ భావుకులైన సాహిత్య వేత్తలలో విమర్శ జ్ఞానం తక్కువైపోయింది. పక్షపాతం ఎక్కువైపోయింది. వారిలో చాలామంది గ్రంథావిష్కరణ సభల్లో ప్రసంగించిన వారూ, ఆయా రచనలకు పీఠికలలో అభిప్రాయాలలో సంతరించినవారే<noinclude><references/>
{{c|154}}</noinclude>
r1yraelnkkmjk73jwaw8b7ogfd8hbr3
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/170
104
213619
558007
557339
2026-06-05T10:20:27Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
558007
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>అయినా, వాటి గురించి పత్రికల్లో ప్రత్యేకంగా వ్యాసాలు వ్రాస్తున్న వారే అయినా, అందులో చాలమంది పక్షపాత చూపుతోనే వ్రాస్తున్నారు. మరోలా వ్రాయడానికి తమకూ అవకాశం లేదన్నట్లు, వారికంతే తెలుసు, మన మింకేమీ చేయలేము".
మనముందు పెద్దలు వాళ్ళ రచనలతోనే కాకుండా వాళ్ళ విమర్శ ద్వారా సాహిత్యాన్ని సుసంపన్నంచేశారని రావుగారు అన్నారు. నడకుదిటి వీర్రాజు వంతులు, కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి, బండారు తమ్మయ, ఉమాకాన్త విద్యా శేఖరులు, కాశీభట్ట సుబ్బయ్య శాస్త్రి ప్రభృతులు చిత్తశుద్ధితో నిబద్ధతతో సంప్రదాయ, ఆధునిక విమర్శలను చేశారు.
రాయప్రోలు సుబ్బారావు గారు “రమ్యాలోకం”లో పరమ భావుకతా దృష్టిలో సరస నవీన విమర్శన పద్ధతికి రాచబాటలు వేశారు. విశ్వనాథ వారు ప్రత్యేకించి “కావ్యా నందం”, “కావ్యపరిమళం", "సాహిత్య సురభి" మొదలైన గ్రంథాలద్వారా, పీఠికలు ద్వారా, భారతీయాలంకారిక భావన అవగాహనకు బావుటాలు ఎగురవేశారు. అనంతకృష్ణ శర్మ గారు చతుర చమత్కార చారువు అయిన విమర్శ సాగించారు. ఎవ్వరితోనూ రాజీపడని తన నీతికి తన నిజాయితీకి కట్టుబడిన నిరంకుశ విమర్శకుడు నేలటూరి వేంకట రమణయ్యగారు. సత్యసన్ని హితులు. ఎవరినీ నొప్పించక నేర్పుగా నిజం చెప్పి ఒప్పించే మార్గం మల్లంపల్లి సోమశేఖరశర్మగారిది. పరిశోధనలోనూ, విమర్శ లోనూ, వేటూరి ప్రభాకర శాస్త్రిగారు చూపిన పద్ధతి చాలా గొప్పదని కొనియాడారు. సమాజ శ్రేయస్సే కావ్య ప్రయోజనం కావాలని నూతన విమర్శ మార్గానికి దారి చూపారు శ్రీశ్రీగారు. ఇలాంటి వారి విమర్శన మార్గాలు సమకాలికులకు,
అర్వాచీనులకు మార్గ దర్శకాలు అయ్యాయని జోగారావుగారు వివరించారు.
జోగారావుగారు ఈ వ్యాసంలో విమర్శ చేయడానికి ముఖ్యంగా మూడు ఆధారాలున్నాయని తెలియజేశారు. అవి ఇవి.
I. పాశ్చాత్య ప్రపంచం కన్ను తెరవని కాలంలో భరతుడు, భామహుడు, ఆనందవర్ధనుడు, అభినవ గుప్తుడు మొదలైనవారు సారస్వత మహాద్రష్టలు. దేశకాల భేదాతీతంగా విశ్వవ్యాప్తమైన సాహిత్యాత్మను సంభావించి రాసిన అలంకార శాస్త్రగ్రంథాలు ప్రమాణాలు.
II. పాశ్చాత్యదేశాల్లో అరిస్టాటిల్, లాంగినస్ క్వింటల్లన్ హేరేస్ తధాపి, I.A.Richards Aberenombie, కౌంత్బ్రూక్స్, వియ్సెట్ ప్రభృతులు రాసిన గ్రంథాలు<noinclude><references/>
{{c|155}}</noinclude>
2dshg19wqk9ervqqqxm4w4d20r1fuq1
సూచిక:1927 shhadchakravartulayindrajaalapukathalu Telugu PDF.pdf
106
213712
557969
557948
2026-06-04T16:40:08Z
Rajasekhar1961
50
557969
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=షడ్చక్రవర్తుల యింద్రజాలపు కథలు
|భాష=te
|సంపుటి=1
|రచయిత=[[ రచయిత:పోకల శేషాచలము నాయుడు]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=పోకల వెంకటనరసింహారావు నాయిని
|చిరునామా=చెన్నై
|సంవత్సరం=1927
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=2
|పురోగతి=X
|పుటలు=<pagelist 1="-" 2="పైఅట్ట" 3="ప్రవి" 4="విసూ" 5="రచయిత బొమ్మ" 6="1" 118="-" />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
8we22k6e64njms6j2c4mr9pzkpxxqum
సూచిక:వివాహ తత్త్వము.pdf
106
213714
557958
2026-06-04T13:47:34Z
Vandanapu Saidhiraj
7301
[[WP:AES|←]]Created page with ''
557958
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=వివాహ తత్త్వము
|భాష=te
|సంపుటి=1
|రచయిత=బంకుమల్లే మల్లయ్య శాస్త్రి
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=కా నాగేశ్వర్ రావు
|చిరునామా=
|సంవత్సరం=1931
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
1ue661eaw72qb0cy9un9q5lvcritzk7
557960
557958
2026-06-04T13:55:42Z
Vandanapu Saidhiraj
7301
557960
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=వివాహ తత్త్వము
|భాష=te
|సంపుటి=1
|రచయిత=బంకుమల్లే మల్లయ్య శాస్త్రి
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=కా నాగేశ్వర్ రావు
|చిరునామా=
|సంవత్సరం=1931
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist 1="పైఅట్ట" 2to9="పరిచ" 10="1" />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
12fe0hjbriw3k6mcnplocvjebh41ynk
557964
557960
2026-06-04T15:39:01Z
Rajasekhar1961
50
557964
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=వివాహ తత్త్వము
|భాష=te
|సంపుటి=1
|రచయిత=[[ రచయిత:బంకుపల్లె మల్లయ్యశాస్త్రి|బంకుపల్లె మల్లయ్య శాస్త్రి]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=కా నాగేశ్వర్ రావు
|చిరునామా=
|సంవత్సరం=1931
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist 1="పైఅట్ట" 2to9="పరిచ" 10="1" />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
nltjosxfg6wzduf02y4crj0juhurq64
557970
557964
2026-06-04T16:51:32Z
Rajasekhar1961
50
557970
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[వివాహతత్త్వము]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[ రచయిత:బంకుపల్లె మల్లయ్యశాస్త్రి|బంకుపల్లె మల్లయ్య శాస్త్రి]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=కా నాగేశ్వర్ రావు
|చిరునామా=
|సంవత్సరం=1931
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist 1="పైఅట్ట" 2to9="పరిచ" 10="1" />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
11n5oumolsuvrmk6mgpixjsqnjc6pzn
557971
557970
2026-06-04T16:55:06Z
Rajasekhar1961
50
557971
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[వివాహతత్త్వము]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[ రచయిత:బంకుపల్లె మల్లయ్యశాస్త్రి|బంకుపల్లె మల్లయ్య శాస్త్రి]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=[[రచయిత:కాశీనాథుని నాగేశ్వరరావు| కా. నాగేశ్వర్రావు]]
|చిరునామా=
|సంవత్సరం=1931
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist 1="పైఅట్ట" 2to9="పరిచ" 10="1" />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
3cms1zglx65b6h81oh3fxnmmesugsyr
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/62
104
213715
557982
2026-06-04T22:22:50Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557982
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|56|చారిత్రక విషయములు|}}</noinclude>4. నాల్గవశాఖయు, అయిదవశాఖయు గుజరాత్ దేశము నేలిన చాళుక్యులు, నాల్గవవంశమువారు 600 మొదలు 750 వఱకు నున్నత దశలో నున్నట్టు కానవచ్చుచున్నది.
5. అయిదవశాఖవారు సోళంకులు అను పేరిట "అన్హిల్ వాడ" పట్టణము రాజధానిగ 940 మొదలు 1143 వఱకు దొరతనముచేసిరి. కొందఱు చాళుక్యులు సోళంకులన్న పేరిట రాజపుత్రస్థానమందును, బుందేల్ ఖండమునందును చిన్నచిన్న సంస్థానములను సంపాదించుకొనిరి. చిన్నచిన్న సంస్థానికులుగా అఱవ దేశమునందును వ్యాపించినట్లు శాసనములవలన తెలియుచున్నది. కన్నడ దేశమునందుఁ గూడఁ దరువాతికాలమున నీ చాళుక్యులు చిన్న చిన్న జమీందారులుగ నున్నట్లు కానవచ్చుచున్నది.
ఇఁక వీరందఱి ఉత్పత్తిని గుఱించి విచారింపఁగా వీరందఱును దక్షిణదేశపువారే యనియు, వీరిలో నుండి కొందరు దక్షిణమునుండి యుత్తరమునకుఁ బోయిరేగాని, ఉత్తరమునుండి దక్షిణమునకు రాలేదనియు, వారి చరిత్రములును శాసనములును, స్పష్టముగా నుద్ఘోషించు చున్నవి. అది యెట్లో చూతము. మొదటివంశమువారగు వాతాపి చాళుక్యులు కన్నడదేశజు లని వేరుగ జెప్పనక్కరలేదు. వారి రాజధాని కన్నడదేశమునం దుండుటవలనను, వా రిచ్చిన కొన్నిశాసనములు కన్నడమునందుండుటవలనను, మిగిలినవి సంస్కృతమునందుమాత్రముండి ఇతరభాషలలో లేకపోవుటవలనను, వారికి మహారాష్ట్రదేశము మీద కొంతయధికారమున్నను అచ్చట వారిచ్చిన శాసనములు మహారాష్ట్రమునందు వ్రాయకపోఁగా, సంస్కృతశాసనములు గూడ వారు కన్నడాక్షరములో వ్రాయించుటవలనను వారి మాతృభాష కన్నడ మనుట కెంతమాత్రమును సందియములేదు, తా ముత్తరదేశమునుండి వచ్చితిమని వారెచ్చటను తమ శాసనములందు జెప్పుకొనియుండలేదు.
ఈ బాదామి చాళుక్యులు మహారాష్ట్రులని కొందఱు వ్రాసియున్నారు. మహారాష్ట్రులయినను, దాక్షిణాత్యులేగాన నావాదమునకు<noinclude><references/></noinclude>
f5aibmcgxyuuwj4r5kkih93izlujson
సూచిక:Ekamulika Prayoga Ratnavali.pdf
106
213716
557988
2026-06-05T05:16:57Z
Vandanapu Saidhiraj
7301
[[WP:AES|←]]Created page with ''
557988
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=ఏకమూలిక ప్రయోగ రత్నావళి
|భాష=te
|సంపుటి=1
|రచయిత=ఓమందురు వైద్యం శ్రీ దొరసామయ్య
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=చెన్నై
|సంవత్సరం=1909
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
6n390e5uqy3njqm82mp4mf5e3ribu73
557990
557988
2026-06-05T05:32:38Z
Vandanapu Saidhiraj
7301
557990
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=ఏకమూలిక ప్రయోగ రత్నావళి
|భాష=te
|సంపుటి=1
|రచయిత=ఓమందురు వైద్యం శ్రీ దొరసామయ్య
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=చెన్నై
|సంవత్సరం=1909
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist 1="-" 2="పైఅట్ట" 3="-" 4to11="విసూ" 12to22="పీఠిక" 15to18="జ్ఞాపిక" 19="ఔషదసేవనప్రమానము" 20to22="ఔషధమనము" 23="25" 197="-" />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
5zdz87pqres059bey8t7txrxnntlw1p
557991
557990
2026-06-05T05:33:57Z
Vandanapu Saidhiraj
7301
557991
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=ఏకమూలిక ప్రయోగ రత్నావళి
|భాష=te
|సంపుటి=1
|రచయిత=ఓమందురు వైద్యం శ్రీ దొరసామయ్య
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=చెన్నై
|సంవత్సరం=1909
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=2
|పురోగతి=X
|పుటలు=<pagelist 1="-" 2="పైఅట్ట" 3="-" 4to11="విసూ" 12to22="పీఠిక" 15to18="జ్ఞాపిక" 19="ఔషదసేవనప్రమానము" 20to22="ఔషధమనము" 23="25" 197="-" />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
qpwp52jzhz4hnldph7a5vnrzla897sl
557999
557991
2026-06-05T08:14:47Z
Rajasekhar1961
50
557999
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=ఏకమూలిక ప్రయోగ రత్నావళి
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:ఓ. వై. శ్రీ. దొరసామయ్య |ఓమందురు వైద్యం శ్రీ దొరసామయ్య]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=చెన్నై
|సంవత్సరం=1909
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=2
|పురోగతి=X
|పుటలు=<pagelist 1="-" 2="పైఅట్ట" 3="-" 4to11="విసూ" 12to22="పీఠిక" 15to18="జ్ఞాపిక" 19="ఔషదసేవనప్రమానము" 20to22="ఔషధమనము" 23="25" 197="-" />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
gpzyeus4jfsuu5cnu53n178lcan0trp
ఎంత బీదవాడే శివుడు
0
213717
558008
2026-06-05T11:02:00Z
రవిచంద్ర
146
సేకరించిన శివ భజన పాట
558008
wikitext
text/x-wiki
<poem>
ఎంత బీదవాడే శివుడు ఓ పార్వతి దేవి ఎంత బీదవాడే శివుడు
ఓ పార్వతి దేవి ఎంత బీదవాడే శివుడు
ఎంత బీదవాడే శివుడు గంతకోడె నెక్కినాడు
ఎంత బీదవాడే శివుడు గంతకోడె నెక్కినాడు
అంతరంగము నందునున్న ఇంతిని గూడుకున్న వాడు
ఎంత బీదవాడే శివుడు ఓ పార్వతి దేవి ఎంత బీదవాడే శివుడు
ఓ పార్వతి దేవి ఎంత బీదవాడే శివుడు
జిట్టెడంత అయిన గోచి పుట్టెడంత పులితోలు
జిట్టెడంత అయిన గోచి పుట్టెడంత పులితోలు
పొట్టగానక ఉన్న శివుడు పల్లెభిక్షమెత్తినాడు
ఎంత బీదవాడే శివుడు ఓ పార్వతి దేవి ఎంత బీదవాడే శివుడు
ఓ పార్వతి దేవి ఎంత బీదవాడే శివుడు
నయముగ నవరత్న పద్మ హారములు లేవా తనకు
నయముగ నవరత్న పద్మ హారములు లేవా తనకు
రాగిపోగులు చెవులకు జుట్టి నాగుపాముల దాల్చినాడు
ఎంత బీదవాడే శివుడు ఓ పార్వతి దేవి ఎంత బీదవాడే శివుడు
ఓ పార్వతి దేవి ఎంత బీదవాడే శివుడు
పొందుగ శిరమందున దాల్చేటందుకు తలపాగా లేదా
పొందుగ శిరమందున దాల్చేటందుకు తలపాగా లేదా
ఎండకోర్వక చిన్ని ముద్దుల చందమామను దాల్చినాడే
ఎంత బీదవాడే శివుడు ఓ పార్వతి దేవి ఎంత బీదవాడే శివుడు
ఓ పార్వతి దేవి ఎంత బీదవాడే శివుడు
ఇల్లు ఇడుపు లేదా తనకు ఎల్లకాలము ఏమారక
ఇల్లు ఇడుపు లేదా తనకు ఎల్లకాలము ఏమారక
కల్లకాదు కవి లింగయ్యా అల్లమప్రభుడన్నా మాట
ఎంత బీదవాడే శివుడు ఓ పార్వతి దేవి ఎంత బీదవాడే శివుడు
ఓ పార్వతి దేవి ఎంత బీదవాడే శివుడు
ఎంత బీదవాడే శివుడు గంతకోడె నెక్కినాడు
ఎంత బీదవాడే శివుడు గంతకోడె నెక్కినాడు
అంతరంగము నందునున్న ఇంతిని గూడుకున్న వాడు
ఎంత బీదవాడే శివుడు ఓ పార్వతి దేవి ఎంత బీదవాడే శివుడు
ఓ పార్వతి దేవి ఎంత బీదవాడే శివుడు
</poem>
76zrlzu5dtbojmwd9i37iqyy1dljx6h
పుట:Ekamulika Prayoga Ratnavali.pdf/2
104
213718
558009
2026-06-05T11:10:26Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధన్వన్తిర యెనుడి ఏకమూలికా ప్రయోగరత్నావళి. ఓ. వై. శ్రీ దొరసామయ్య చే రచియింపఁబడి, చెన్నపురి కపాలీముద్రాక్షరశాలయందును కలారత్నాకరముద్రాక్షరశాలయందును ముద్రింపఁబడి ప్రకటిం...'
558009
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>ధన్వన్తిర యెనుడి
ఏకమూలికా ప్రయోగరత్నావళి.
ఓ. వై. శ్రీ దొరసామయ్య చే
రచియింపఁబడి,
చెన్నపురి
కపాలీముద్రాక్షరశాలయందును
కలారత్నాకరముద్రాక్షరశాలయందును
ముద్రింపఁబడి ప్రకటింపఁబడియె.
1909.
కాపీ రైట్.<noinclude><references/></noinclude>
nlnlwjushi9sba678v99z4ml9ues1vj
పుట:Ekamulika Prayoga Ratnavali.pdf/4
104
213719
558010
2026-06-05T11:11:26Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'విషయము, రిక .... శ్రీ విషయసూచిక. .... శరీరపోషణప్రకరణము. శరీరపోషణపద్ధతి, ... నీళ్లు, భోజనము, ఆహారవస్తువులు నిద్ర, వాసస్థానము కస్త్రములు, వృత్తి మనస్సు, సంగము సంజ్ఞా ప్రకరణము, ఔషధ సేవ...'
558010
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>విషయము,
రిక
....
శ్రీ
విషయసూచిక.
....
శరీరపోషణప్రకరణము.
శరీరపోషణపద్ధతి,
...
నీళ్లు, భోజనము, ఆహారవస్తువులు
నిద్ర, వాసస్థానము
కస్త్రములు, వృత్తి
మనస్సు, సంగము
సంజ్ఞా ప్రకరణము,
ఔషధ సేవన
ప్రమాణము
రోగనివృత్తిక్రియలు.
ఔషధమానము
మణి, మంత్రము, ఔషధములు
...
104
పుట.
1
盔
ī
B
9
10
SI
... 12
12
... 14
దోష స్థానములు
కిదోష కాలము, నాడీ కారణము
డీవరీన్హౌస్థానములు, ఆరోగ్య నాణీగమనము, వురు
షులవాత నాడీ, స్త్రీలవాత నాడి, పురుషుల పిత్త
నాడి, స్త్రీలపి త్త నాడి
... 15
16
***
17
రుషుల శ్లేష్మ నాడి, స్త్రీల శ్లేష్మనాడి, నాడీ నిర్ణయము 18
* ష్టస్థానపరీక్ష.
రోగి శరీరస్థితి
19<noinclude><references/></noinclude>
je9ktgx6penyj45ohyww293rk9yy3ba
పుట:Ekamulika Prayoga Ratnavali.pdf/5
104
213720
558011
2026-06-05T11:11:38Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నానీ శాస్రాకాము రక్తహీన సము పూశిరక్తనానికా 8 స్వేదము, దుర్గంధ స్వేదము, కలబందకంపు స్థూలము. మేదోవృద్ధి కృశము, క్షీణము, తుష్క ము దుర్బలము డ్రాసు ప్తివాతము ఆర్థి,గ్రంధి, అస్థిప...'
558011
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>నానీ శాస్రాకాము
రక్తహీన సము
పూశిరక్తనానికా
8
స్వేదము, దుర్గంధ స్వేదము, కలబందకంపు
స్థూలము. మేదోవృద్ధి
కృశము, క్షీణము, తుష్క ము
దుర్బలము
డ్రాసు ప్తివాతము
ఆర్థి,గ్రంధి, అస్థిప్రము
వ్రణము, పుండ్లు
అగ్ని వ్రణము
విసరి, అన్ని అమ్మ
---
98
98
. 98
98
99
99
.
99
... 99
100
160
100
101
.. 101
102
102
విద్రథి, గద్ద, రక్తవి ప్రధి, నెత్తురుగడ్డ, మేహని ప్రధీ,
రాజవ్రణము, రాచకురుపు
రాజావ్రణము, రాచపుండు, రాచకురువు 10
స్తన విధి
సర్షపిడా
మళరోగము, పులిపిరికాయ
కుష్ఠము, పెద్దమెుప్పి ....
రాజికా, చెమటకాయ
108
...
104
4
104
104
. ఉదా
నాడీ వ్రణము, తంతువ్రణము, నారపుండు
నాడీ విధి
క్లీవదము, ఏనుఁగుకాలు, సాదార్భుదము, హస్తార్బుర
ము, పాదవల్మీకము<noinclude><references/></noinclude>
32syvkfheaaj6jfu3hvv8qsqn7ogfzm
పుట:Ekamulika Prayoga Ratnavali.pdf/6
104
213721
558012
2026-06-05T11:11:53Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఉత్కోరోగము, ఎంగిటి చిదుము, తామర, మేహపొడి 10 పాదథేనము, గుదికాళ్ల పగులు ముఖషికము, మొటిమ లాంకనము, ముచ్చ, వ్యంగము ఆజగల్లి, బొజ్జలు 108 ... 108 108 109 వంజ్ణస్థానవివ్రధి, ఒడి సేగడ్డ ఉపవంశము, లి...'
558012
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>ఉత్కోరోగము, ఎంగిటి చిదుము, తామర, మేహపొడి 10
పాదథేనము, గుదికాళ్ల పగులు
ముఖషికము, మొటిమ
లాంకనము, ముచ్చ, వ్యంగము
ఆజగల్లి, బొజ్జలు
108
... 108
108
109
వంజ్ణస్థానవివ్రధి, ఒడి సేగడ్డ
ఉపవంశము, లింగవ్రణము, మేహవ్రణము, గుహ్య
వ్రణము, ఆలజి వ్రణము, ఫిరంగిరోగము, ఓట్టవేరంగి
కొఱుకు
...
ఆష్టీలికా ఉపవంశము
మనపవంశము
వ్యావకోక దంశము
ఐద్యుషితో కదంశము
**
... luy
110
111
•
111
**
112
కందూళి,దద్దులు, పుండ్లు, బొబ్బలు, పామా, కర్జూ, కోపము 112
శీతపిత్తము, ఆభుసిత్తము, దద్రు రోగము, పురుగుకాటు 118
భగంధరము
బిల్వము, గోరుచుట్టు, అక్షతరోగము
అగ్ని రోహిణి, ప్లేగు
బెదారిక
కంఠగ్రంథి, గళగ్రంధి
..
118
... 114
114
... 115
115
..
116
116
117
117
.. 118
దండకూల, కంతిమాల
యోనారికా, స్ఫోటకము, పెద్ద అమ్మవారు, ముద్రణ:
యోసూరిగా, చిన్న మ్మ, తట్టమ్ము ..
స్తన్యర్యవ్రణము, గాయము, క్షతరోగము
స్తన్యకాలజి, పుట్టాయి అమ్మవారు
పరిభవాదము, పైత్యము, పిచ్చి, వెట్టీ, దురము
..<noinclude><references/></noinclude>
melbeuu4momwiloqrht6psx2gah9hlp
పుట:Ekamulika Prayoga Ratnavali.pdf/7
104
213722
558013
2026-06-05T11:12:07Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '12 కుండాలరోగము, చెవ్వగడ్డ, మచ్చలు స్తన విధి రద మోద్ఛకము క్రిమిరోగము చందము, గణరోగము 400 పాండు LOO F 137 187 ... 188 138 ... 188 189 కామిలా, పి త్తపాండు, పిత్త కామిలా, యికృతూదరము 139 నపుంసకత్వము ధ్వజభంగము...'
558013
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>12
కుండాలరోగము, చెవ్వగడ్డ, మచ్చలు
స్తన విధి
రద మోద్ఛకము
క్రిమిరోగము
చందము, గణరోగము
400
పాండు
LOO
F
137
187
... 188
138
... 188
189
కామిలా, పి త్తపాండు, పిత్త కామిలా, యికృతూదరము 139
నపుంసకత్వము
ధ్వజభంగము
శీఘ్రస్ఖలనము
స్వప్నస్ఖలనము
శిరోరోగము, తలనెప్పి, అర్ధభేదము
శిరస్తావము, శిపోశూల, కపాలశూల
రక్తశిరస్తారము
ఇంద్రలు ప్తము
ఖలతి
యూకారోగము, పేసు
ఇలితము
శిరోవ్రణము, చుండు, కరపాణి
కుండాల రోగము
కరపాణి
విష వజ్రము, కందూరి
ముఖపాకము, శ్లేష్మ జిహ్వ, ముఖదూషిక
ఆస్యపాకము, ముఖపాఠము, జిహ్వాలజి
జిహ్వారోగము
జిహ్వాల సము
140
***
140
... 141
141
142
143
148
143
144
...
144
144
145
...
145
188-145
146
146
146
146
147<noinclude><references/></noinclude>
r8u73eulr1gra0ulgdrop6vy7s8akgz
పుట:Ekamulika Prayoga Ratnavali.pdf/8
104
213723
558014
2026-06-05T11:12:20Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అధిజిహ్వ ఉపజిహ్వ 13 వాతజిహ్వ, జిహ్వాఖండము జిహ్వా స్తంభము, జిహ్వా స్తంభవాశము తాలుపాకము కచ్ఛపము, గవదబిళ్ల ... తెలుపటకము తాలుకోకు, గళావృతవాతము జండోషము ఓపార్భుదము దంతజేదము దంతళ...'
558014
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>అధిజిహ్వ
ఉపజిహ్వ
13
వాతజిహ్వ, జిహ్వాఖండము
జిహ్వా స్తంభము, జిహ్వా స్తంభవాశము
తాలుపాకము
కచ్ఛపము, గవదబిళ్ల ...
తెలుపటకము
తాలుకోకు, గళావృతవాతము
జండోషము
ఓపార్భుదము
దంతజేదము
దంతళూల
దంతచలనము, దంత ప్రలూ నము
దంతమా సరోగము, చిగుళ్ల మెప్పి
కంఠ పూయము
దంతవిద్రధి
దంత పుప్పుటడు
కర్ణపూయము
కర్ణళూల, చెవిపోటు
కర్ణ విద్రథి, కర్ణ తాపితము
కర్ణక్రిమి
కర్ణ నాదము
బాధిర్యము, చెవుడు
నేత్రరోగము
**
147
147
**
147
147
148
148
**
148
........
143
.
14S
140
149
149
*** 149
... 149
150
150
150
... 150
151
... 151
444
151
...
351
152
152
152
153<noinclude><references/></noinclude>
qczd6613b76eaj3xcbvejwcx3rxzie7
పుట:Ekamulika Prayoga Ratnavali.pdf/9
104
213724
558015
2026-06-05T11:12:42Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'భ్రువాట్" కము కృన్రోస్త్రీలనము ఆరున్న మేషము నీకతావ ర్తము క్లిష్టము కుకూణకము జలస్రావము రక్తస్రావము కఫస్రావము కుర్వణి . నేత్రాలజి పూయస్రావము శు క్తికము శుక్లర్మము, అధిమాం...'
558015
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>భ్రువాట్" కము
కృన్రోస్త్రీలనము
ఆరున్న మేషము
నీకతావ ర్తము
క్లిష్టము
కుకూణకము
జలస్రావము
రక్తస్రావము
కఫస్రావము
కుర్వణి .
నేత్రాలజి
పూయస్రావము
శు క్తికము
శుక్లర్మము, అధిమాంసజము
పిటకము, ఆజికా
లిమిరము, చత్వారి
14
158
158
154
154
345
154
154
154
CAN
155
155
155
155
155
156
156
... 156
156
...
150
157
157
158
158
158
... 158
....
159
159
నేత్రకాచము
లింగనాశము, అంధత్వము
నకులాంధము, పగలుచీకటి
నత్తాంధము, రేచీకటి, ఉష్ణవిదగ్ధము
ధూమము
అభిష్యందము, కన్నెప్పి, కండ్లకలక
నేత్రమండము
పుష్పము
కంచూరి
159<noinclude><references/></noinclude>
ay8cnz6vtjdjwjz0jekvojaucdrkspe
పుట:Ekamulika Prayoga Ratnavali.pdf/10
104
213725
558016
2026-06-05T11:12:59Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '15 విషలక్షణ ప్రకరణము. కృత్రిమవిషము, పెట్టుకుందు ఆకృత్రిమ విషము, స్థావరము, జంగమము, ఛాతుజము, ... 160 161 162 165 ... 167 167 ... 168 168 ........1125 ... 16 ... 170 శర్పకష్టము వృశ్చిక వంశము, మండ్రగబ్బ ఆధారిక, జెళ్లిపోతు శ...'
558016
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>15
విషలక్షణ ప్రకరణము.
కృత్రిమవిషము, పెట్టుకుందు
ఆకృత్రిమ విషము, స్థావరము, జంగమము, ఛాతుజము,
...
160
161
162
165
... 167
167
... 168
168
........1125
... 16
... 170
శర్పకష్టము
వృశ్చిక వంశము, మండ్రగబ్బ
ఆధారిక, జెళ్లిపోతు
శతపది, రోకటిబండ్లక
చాతా, సాలెపురుగు..
భ్రమరము, అడవియీగెలు, అడవితే నెట్ లు, క.దు
రీ7లు, అడవిచీమలు, కంబకి పురుగులు
సరట, తొండ, ఊసరవెల్లి
నలికండ్లపాము
గౌధారము
శునక దష్టము, వెట్టికుక్క
మూషకవిషము, ఎలుక
బుందూకము, కప్ప
నరవంతవిషము, నఖవిషము
గ్రహలక్షణప్రకరణము,
ద్వాదశగ్రహనామములు
ద్వాదశ గ్రహలక్షణము
బాలగ్రహనామములు...
బాలగ్రహలక్షణము
కుగ్రహములు
భగ్రహలక్షణము
170
170
... 172
... 178
... 178
... 176
.. 177
... 179
... 180
184
184<noinclude><references/></noinclude>
mmhtc92xtrvtrn4rblefmpk6h3twdan
పుట:Ekamulika Prayoga Ratnavali.pdf/11
104
213726
558017
2026-06-05T11:13:11Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మూలికాలక్షణము 16 చికిత్సాప్రకరణము, మూలికానిర్ణయము ఔషధ సేవన వేగము ఔషధ వేగము ఔషధస్పర్శ వేగము ఔషధ సేవన కాలదు. ద్రవ్యశుద్ధి విష ప్రతివిషములు ** *** 409 * ... . 186 ... 187 ... 188 189 2. ... 189 423 189 190 ... 193'
558017
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>మూలికాలక్షణము
16
చికిత్సాప్రకరణము,
మూలికానిర్ణయము
ఔషధ సేవన వేగము
ఔషధ వేగము
ఔషధస్పర్శ వేగము
ఔషధ సేవన కాలదు.
ద్రవ్యశుద్ధి
విష ప్రతివిషములు
**
***
409
*
...
. 186
... 187
... 188
189
2.
... 189
423
189
190
... 193<noinclude><references/></noinclude>
2kx3ixu3u6jj5yhp81aik0u9qj7wmfn
పుట:Ekamulika Prayoga Ratnavali.pdf/12
104
213727
558018
2026-06-05T11:17:13Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పీఠిక. శ్రీకరుడైన భగవంతుఁడు ప్రపంచమునందలి ప్రజలకును తక్కిన జంతు జాలమునకును బ్రయోజనకారి యగు నట్లుగా ఓషధులను సృష్టించి యున్నాడు. కావుననే " నాస్తిమూలమనౌషధమ్" అని యార్యులనె...'
558018
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>పీఠిక.
శ్రీకరుడైన భగవంతుఁడు ప్రపంచమునందలి ప్రజలకును తక్కిన జంతు జాలమునకును బ్రయోజనకారి యగు నట్లుగా ఓషధులను సృష్టించి యున్నాడు. కావుననే " నాస్తిమూలమనౌషధమ్" అని యార్యులనెదరు.
ఈ ఓషధులే జననమునకును కారణమై యున్నది. మరియు
వైద్యమునందు మూఁడు విధములైన పద్ధతులు కలవు. అనఁగా 1 దేవవైద్యము, 2 రాక్షస వైద్యము, 3 మనుష్యవైద్యము, అని త్రివిధములు. దేవవైద్యమునకు రస విష గంధకాదులు రోగా పహర ద్రవ్యములు, రాక్షస వైద్యమునకు శస్త్ర క్షారాగ్ని కర్మలు రోగపరిహారక క్రియలు. మనుష్య వైద్యమునకు కంద మూల ఫలాదులు
చికిత్సార్హములు. కనుక ఈ గ్రంధమునందు చెప్పఁబడు చికిత్స లన్నియును మూలికలతో సంబంధించినవిగా నుండును.<noinclude><references/></noinclude>
ghf9bnpynkwuv5f4y906har5bz45oky
558019
558018
2026-06-05T11:18:58Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దారు */
558019
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{p|fs150|ac}}పీఠిక.</p>
శ్రీకరుడైన భగవంతుఁడు ప్రపంచమునందలి ప్రజలకును తక్కిన జంతు జాలమునకును బ్రయోజనకారి యగు నట్లుగా ఓషధులను సృష్టించి యున్నాడు. కావుననే "నాస్తిమూలమనౌషధమ్" అని యార్యులనెదరు.
ఈ ఓషధులే జననమునకును కారణమై యున్నది. మరియు
వైద్యమునందు మూఁడు విధములైన పద్ధతులు కలవు. అనఁగా 1 దేవవైద్యము, 2 రాక్షస వైద్యము, 3 మనుష్యవైద్యము, అని త్రివిధములు. దేవవైద్యమునకు రస విష గంధకాదులు రోగా పహర ద్రవ్యములు, రాక్షస వైద్యమునకు శస్త్ర క్షారాగ్ని కర్మలు రోగపరిహారక క్రియలు. మనుష్య వైద్యమునకు కంద మూల ఫలాదులు
చికిత్సార్హములు. కనుక ఈ గ్రంధమునందు చెప్పఁబడు చికిత్స లన్నియును మూలికలతో సంబంధించినవిగా నుండును.<noinclude><references/></noinclude>
hfpo1hc4wy9m8fjr8bowxtsjetdc3hb
పుట:Ekamulika Prayoga Ratnavali.pdf/13
104
213728
558020
2026-06-05T11:22:02Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ' ఒక్కొక వ్యాధికి నొక్కొక మూలికయే చెప్పవలసి యుండియు రెండుకూడ కలిసియున్నదికదాయని యా క్షేపించు వారికి సమాధాన మేమనఁగా, ఔషధము రాజు అనియును, అనుపా నము మంత్రి అనియును, వైద్యశాస...'
558020
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />2</noinclude>
ఒక్కొక వ్యాధికి నొక్కొక మూలికయే చెప్పవలసి యుండియు రెండుకూడ కలిసియున్నదికదాయని యా క్షేపించు వారికి సమాధాన
మేమనఁగా, ఔషధము రాజు అనియును, అనుపా
నము మంత్రి అనియును, వైద్యశాస్త్ర వేత్తలు
చెప్పియుండుటం బట్టి అనుపానార్థమై చేర్పబడి యున్నదని గ్రహింప వలయును. మఱియు పురుషుఁడు ఔషధము అనియును, ప్రకృతి అను
పానమనియును అనుభవజ్ఞుల మతము.
ఈ గ్రంధమును డొక్కొక వ్యాధికిని ఒక్కొక మూలికయే చెప్పఁబడి యుండుటం బట్టి దీనికి "ఏక మూలికా ప్రయోగ రత్నావళి" యని పేరిడబడెను. ఈ గ్రంథమును పఠించువా రంద
అును మొదటనుండి క్రమముగాఁ జదివిన పిదప
ఔషధములను చేయుటకును సేవించుటకును బ్రయ
తింప వలయును. అట్లు పశింపక ఔషధములు
చేసినను సేవించినను దుర్గుణము మాత్రము కలు<noinclude><references/></noinclude>
e8az1n2mmohk15vckipok2hgwanok67
పుట:Ekamulika Prayoga Ratnavali.pdf/14
104
213729
558021
2026-06-05T11:22:28Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '3 అంజలి యోగంబు లన్నియును అనుభవ సిద్ధ ములైనవి. ప్రయ ప్రయాసము లుండవు. గోర ది మహాత్ముల కటాక్ష లబ్ధములై వహారహ స్యములై వైద్యజన జీవనములై వెలయు నీ యూషధములు సకలమైన వారికిని సులభలభ...'
558021
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>3
అంజలి యోగంబు లన్నియును అనుభవ సిద్ధ
ములైనవి. ప్రయ ప్రయాసము లుండవు. గోర
ది మహాత్ముల కటాక్ష లబ్ధములై వహారహ
స్యములై వైద్యజన జీవనములై వెలయు నీ
యూషధములు సకలమైన వారికిని సులభలభ్యం
ఒగునట్లు ప్రకటించినాఁడను.
విద్యానికి ఆపీసు, మద్రాస్.
విజయదశమి
1907.
ఓమందూరు, వైద్యం,
శ్రీ బొరసామయ్య,<noinclude><references/></noinclude>
i1hg79q3id2n4s1f58k1u3v5jvai4qd