వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.47.0-wmf.13 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk లక్ష్మీకల్యాణము 0 6395 568017 12974 2026-08-02T16:29:12Z ~2026-42720-13 7438 /* */ 568017 wikitext text/x-wiki {{Annamayya-box1-top|లక్ష్మీకల్యాణము (రాగం: ) (తాళం : )}} <poem> లక్ష్మీకల్యాణము లీలతో పాడెదమిదె నేము లక్ష్మీనారాయణులే లలనయు నీవును || చూపులు చూపులు మీకు సూసకమ్ బాసికము వూపచన్ను గుబ్బలివి పూజికుండలు తిపులమోవి తేనెలు తీరనిమధుపర్కము దాపుగ వెండ్లి యాడరయ్య తగుందగు మీకును || మాటలు మీకిద్దఇకి మంత్రములు మేటి తలంబ్రాలు మీలోమించు నవ్వులు గాటమైన పులకలు కప్పుర వసంతాలు నీటునం బెండ్లాడరయ్య నెరవేర మీకును || కౌగిలి కౌగిలి మీకు కందువపెండ్లి చవికె పాగిన కోరికలె పావకొరళ్లు ఆగిన శ్రీ వేంకటేశ అలమేలుమంగనీవు వింగక పెండ్లాడరయ్య వేడ్కాయ మాకును || </poem> {{Annamayya-box-bottom}} {{Annamayya-box2-top|lakShmIkalyANamu (Raagam: ) (Taalam: )}} <poem> lakShmIkalyANamu lalitOMbADimide nEmu lakShmInArAyaNulE lalanayu nIvunu || chUpulu chUpulu mIku sUsakam bAsikamu vUpachannu gubbalivi pUjikuMDalu tipulamOvi tEnelu tIranimadhuparkamu dApuga veMDli yADarayya taguMdagu mIkunu || mATalu mIkiddaRiki maMtramulu mETi talaMbrAlu mIlOmiMchu navvulu gATamaina pulakalu kappura vasaMtAlu nITunaM beMDlADarayya neravEra mIkunu || kougili kougili mIku kaMduvapeMDli chavike pAgina kOrikale pAvakoraLlu Agina SrI vEMkaTESa alamElumaMganIvu viMgaka peMDlADarayya vEDkAya mAkunu || </poem> {{Annamayya-box-bottom}} ===బయటి లింకులు=== ---- {{అన్నమయ్య పాటలు}} [[Category:అన్నమయ్య పాటలు ]] jaz0476k2wnur0yru5ao37e5e4yvv5p వాడుకరి చర్చ:Revi C. 3 14843 568002 567882 2026-08-02T14:31:52Z Pathoschild 319 global user pages ([[m:Synchbot|requested by Revi C.]]) 568002 wikitext text/x-wiki __NOINDEX__<div class="mw-content-ltr" lang="en" dir="ltr">[[File:Revi logo (pink).png|thumb|center|<span style="color:red">PLEASE DO NOT LEAVE MESSAGE HERE!</span>]] '''<span style="color:red"> BEFORE YOU BLOCK MY ACCOUNT: IF MY EDIT SUMMARY INCLUDE PREFIX </span>''(Script)''<span style="color:red">, DON'T BLOCK ME, JUST TELL ME TO SLOW DOWN AT COMMONS' TALK PAGE. IT IS AN AUTOMATED SCRIPT BEING USED ON COMMONS TO MOVE FILES.</span>''' Instead, please leave your message following site: <br /> [[File:Wikidata-logo-en.svg|45px|link=d:User talk:Revi C.]] [[d:User talk:Revi C.]] for Wikidata (Interwiki links) stuff <!--(I am {{int:Group-sysop}} there)--> <br /> [[File:Commons-logo.svg|45px|link=commons:User talk:Revi C.]] [[commons:User talk:Revi C.]] for renaming stuff or [[User:CommonsDelinker|CommonsDelinker]] action (I am {{int:Group-sysop}} there) <br /> [[File:Wikimedia Community Logo optimized.svg|45px|link=m:User talk:Revi C.]] [[meta:User talk:Revi C.]] for other stuff (User right notification, revert message, etc...) Messages left on this page may be reverted or moved without any response.</div> 5b8qtz4dnjnrhc9ts3mku14m3gujbq8 రచయిత:సామల రమేష్ బాబు 102 67949 568079 410994 2026-08-03T10:28:45Z Rajasekhar1961 50 /* సంపాదకీయాలు */ 568079 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = సామల |అసలుపేరు = రమేష్ బాబు |పేరు_మొదటి_అక్షరం = స |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = సామల రమేశ్ బాబు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[నడుస్తున్న చరిత్ర]] * [[అమ్మనుడి]] (2015 నుండి) ** [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/ఫలితాలు ప్రశ్నార్థకమే!]] ===సంపాదకీయాలు=== * [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/రెండు తెలుగు రాష్ట్రాలూ తమ భాషావిధానాన్ని ప్రకటించాలి!]] * [[అమ్మనుడి/సంపుటి 4/జూలై 2018/జనాభా లెక్కల్లో తెలుగువారికి అన్యాయం|జనాభా లెక్కల్లో తెలుగువారికి అన్యాయం]] - [[అమ్మనుడి]] (జూలై 2018) * [[అమ్మనుడి/సంపుటి 5/ఫిబ్రవరి 2020/ఉద్యమాలతోనే అమ్మనుడుల సాధికారిత|ఉద్యమాలతోనే అమ్మనుడుల సాధికారిత]] - [[అమ్మనుడి]] (ఫిబ్రవరి 2020) * [[అమ్మనుడి/సంపుటి 6/ఏప్రిల్-జూలై 2020/సుప్రీంకోర్టు సన్నిధిలో బోధనామాధ్యమ సమస్య|సుప్రీంకోర్టు సన్నిధిలో బోధనామాధ్యమ సమస్య]] - [[అమ్మనుడి]] (ఏప్రిల్-జూలై 2020) * [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జాతీయ విద్యావిధానం చూపు ఎటువైపుకు?|జాతీయ విద్యావిధానం చూపు ఎటువైపుకు?]] - [[అమ్మనుడి]] (సెప్టెంబరు 2020) * [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో సమస్య పరిష్కారమవుతుందా|సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో సమస్య పరిష్కారమవుతుందా]] - [[అమ్మనుడి]] (అక్టోబరు 2020) * [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/చిరస్మణీయుడు, తెలుగు భాషోద్యమకారుడు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు|చిరస్మణీయుడు, తెలుగు భాషోద్యమకారుడు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు]] - [[అమ్మనుడి]] (నవంబరు 2020) [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] 81jlqvein297eqq74li8ol09b4tpohm పుట:Aananda-Mathamu.pdf/107 104 109443 567989 355175 2026-08-02T14:05:53Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 567989 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" /></noinclude>{{p|fs125|ac}}ఇరువదియవ ప్రకరణము</p> {{p|fs100|ac}}శాంతి గురుదర్శనంబు చేయుట</p> మరునాఁడు ఆనందమఠంబున నేకాంతమగు గదియందుఁ గూర్చుండి భగ్నోత్సాహులైన సంతాన నాయకులు మువ్వురాలోచించు చుండిరి. జీవానందుఁడు సత్యానందునిఁ గాంచి ‘మహాస్వామీ? దైవము మనయం దేల యిట్లు అప్రసన్నుఁడాయెను? ఏదోషంబు వలన మనము మ్లేచ్ఛులచేఁ బరాభ వింపఁబడితిమి?’ అని యడిగెను. సత్యానంద —— దైవము ప్రసన్నము కాకపోలేదు. యుద్ధంబున జయాపజయంబులు రెండును గలవు. ఆ దినము మనము జయించితిమి. ఈదినము పరాజితులమైతిమి. తుదకు జయమే సిద్ధించును. ఎవఁ డిదివఱకును దయ చూపినాడో యాశంఖచక్ర గదాధారి యగు వనమాలియే రక్షించునని నాకు నిశ్చయముగా నమ్మకము గలదు. ఆతని పాదములను స్పృశించి మనమే వ్రతమును గ్రహించితిమో యావ్రతమునే సాధింప వలయును. విముఖల మైతిమేని యనంతనరక భోగంబుల ననుభవింతుము. మన భవిష్యన్మంగళవిచారంబునందు నాకేమియు సంశయము లేదు. అయినను, దైవానుగ్రహము లేక యేకార్యమును సిద్ధింపదు. దానికి పురుషకారమును గావలయును. మనము నిరస్త్రులమై యంటిమి. గుండు తుపాకి ఫిరంగీల యెదుట మన కొయ్యలు, బళ్లెము లేమి చేయ నోపును. కనుక, మనకు పురుష<noinclude><references/></noinclude> 0luhnfgnm4m85ffvbehk8usczeyvpe4 పుట:Aananda-Mathamu.pdf/108 104 109444 567991 355915 2026-08-02T14:08:49Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 567991 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||ఇరువదవ ప్రకరణము|103}}</noinclude>కార లాఘవంబున నీయపజయము సంభవించెను. ఇప్పుడు చేయవలసిన దేమనిన, మనము నట్టి యస్త్ర సాధనఁబులను చాలినంత సంపాదింపవలయును. జీవానంద —— అది బహు కఠిన వ్యాపారము. సత్యానంద —— కఠిన వ్యాపారమా? జీవానందా! నీవు సంతానుఁడవై యుండియు నిట్టి మాట చెప్పఁదగునా? మన కసాధ్యమైన కార్య మెద్ది కలదు? జీవానంద —— స్వామీ! వాని నెట్లు సాధింప నగునో సెలవొసంగుఁడు. సత్యానంద —— వాని సంగ్రహార్థమై నేఁటి రాత్రికి తీర్థయాత్ర వెడలెదను. నేను మరల వచ్చునంతవఱకును మీరు ఎక్కువ పనులకుఁ బోకుండుఁడు; సంతానులలో ఐకమత్యంబును గాపాడుకొని యుండుడు; మీరు వారికి గ్రాసపసనంబుల నిచ్చుచుండుటయేగాక, మాతృరణ జయార్థమై అర్థ భాండాగారంబును పూర్ణముగా వృద్ధిపఱిచియుంచి కొనుఁడు. ఈ భారము మీయిరువురపై నున్నది. భవానంద —— స్వామి! తీర్థయాత్ర చేసి వీనిని సంగ్రహంబు చేయుట యెట్లు? మందు, గుండు, తుపాకి, ఫిరంగి మొదలగువానిని విలువకుఁ గొని పంపుట చాల కష్టము. మఱియు ఇవన్నియు దొరకు టెక్కడ? విక్రయించు వారెవరు? తెచ్చువారెవరు? సత్యానంద ——వెల యిచ్చి కొనుటకు నాచేత కాదు. నేను పనివాండ్రను బంపెదను. ఇచ్చటనే వాని నన్నిటిని తయారు చేయవలయును.<noinclude><references/></noinclude> 8748oei0ohatbgts4ayxil70mcg19vy పుట:Aananda-Mathamu.pdf/109 104 109445 567992 355916 2026-08-02T14:11:04Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 567992 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|104|ఆనందమఠము|}}</noinclude>జీవానంద —— అదెట్లు? ఈ యానందమఠమందేనా? సత్యానంద —— దానిని మఱెచ్చట చేయవచ్చును? ఇందులకై నేను పెక్కు దినములనుండి చింతించుచున్నాఁడను. ఈశ్వరుఁడు దాని కిపుడు మార్గమును జూపి యున్నాడు. దేవుడు ప్రతికూలుఁడై యున్నాఁ డని మీరు చెప్పితిరి. అనుకూలుఁడయ్యే యున్నాఁ డని నానమ్మకము. భవానంద —— కార్యశాల నెచ్చట నుంచవలయును? సత్యానంద —— పదచిహ్న గ్రామంబున. జీవానంద —— అచ్చట నెట్లు జరుపనగును? సత్యానంద —— అట్లు కాకుండినచో నెందులకై మహేంద్ర సింహుడీమహా వ్రతమును గ్రహింపవలయును? భవానంద —— మహేంద్రసింహుడు వ్రతంబును గ్రహించినాఁడా! సత్యానంద —— వ్రతంబును గ్రహింప లేదు గ్రహించును. ఈ దినమురాత్రి యతనిని వ్రతదీక్షితునిఁగాఁ జేసెదను. జీవానంద —— మహేంద్రసింహుని వ్రతదీక్షితునిగాఁ జేయుట కెట్టి ప్రయత్నములు జరిగి యున్నవో నే నెఱుగను. అతని భార్య బిడ్డ యవస్థ ఏమిగా నున్నదో! వారి నెచట నుంచి యున్నాఁడో? నే నీదినము నదీ తీరమునం దొకశిశువును జూచితిని. దానిం గొనిపోయి నా చెల్లెలి చెంతఁ జేర్చి వచ్చినాఁడను. ఆ శిశుసమీపంబున నొకసుందరమైన యువతి చచ్చిపడియుండెను. ఆమెయే మహేంద్రుని భార్యగా నుండుననియు తలఁచితిని. సత్యానంద—— వారే మహేంద్రుని పెండ్లమునుబిడ్డయును<noinclude><references/></noinclude> f9wu7uolpfxzct3tqkd6eqvwaq0s1qx పుట:Aananda-Mathamu.pdf/110 104 109446 567994 355917 2026-08-02T14:13:44Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 567994 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||ఇరువదవ ప్రకరణము|105}}</noinclude>భవానందుఁ డాశ్చర్యానందపరవశుఁడై, ‘తాను ఔషధము నిచ్చి బ్రతికించిన స్త్రీ రత్నము మహేంద్రుని భార్యయైన కల్యాణియే’ యని నిశ్చయించెను. అయినను, ఆ సమయంబున నేమాటయుఁ జెప్పుట కవసరము లేదని మిన్న కుండెను. జీవానంద —— మహేంద్రుని భార్య యెట్లు చచ్చెను? సత్యానంద —— విషమును మ్రింగి చచ్చెను. జీవానంద —— విషము నేల మ్రింగెను? సత్యానంద —— భగవంతుఁ డామెస్వప్నంబున ప్రాణ త్యాగంబుఁ జేయుమని యాజ్ఞ నొసంగెను. భవానంద —— ఆ స్వప్నాదేశము సంతానుల కార్యోద్ధారముకొఱకేనా యేమి? సత్యానంద —— మహేంద్రసింహుఁ డిట్లనియే చెప్పెను. ఇపుడు సాయంకాలమైనది; నేను సాయంకృత్యములను దీర్చికొని వచ్చి నూతన సంతానులకు దీక్ష నొసంగెదను. భవానంద —— సంతాను లెందఱు? మహేంద్రసింహుఁడుగాక మఱెవ్వరైనను తమ నిజశిష్యులుగా వచ్చియున్నారా? సత్యానంద —— ఔను; మఱియొక క్రొత్తవాఁడు వచ్చియున్నాఁడు. వానిని నేనెపుడును జూచినది లేదు. నేఁడు వాఁడు వచ్చినాఁడు, వాడు స్వల్పవయస్సుగల యౌవనపురుషుఁడై యున్నాఁడు. వాని యాకారేంగితంబులను, మాటలను జూచి మిక్కిలి సంతోషము బొందినాఁడను వాఁడు బంగారుముద్దవలె నున్నాఁడు. వానిని సంతానుల కార్యమందు శిక్షితునిఁగాఁ జేయు భారము జీవానందునియందున్నది. ఏలనఁగా, జీవానందుఁడు జనుల<noinclude><references/></noinclude> g1tns5vgggi9zr501qcjg3alcansruz పుట:Aananda-Mathamu.pdf/111 104 109447 567996 355918 2026-08-02T14:15:21Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 567996 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|106|ఆనందమఠము|}}</noinclude>చిత్తాకర్షణ చేయుటయందు దక్షుఁడు. నేను పోయెదను; ఇంకొక మాట యున్నది, దానిని మనసుంచి వినుఁడు. అనఁగా, వారిర్వురును చేతులు జోడించుకొని ఆజ్ఞ పాలింపవలయు నని విన్నవించుకొనిరి. సత్యానంద —— మీ రిరువురేమైన యపరాధమును జేసి యుండినను, లేక, నేవచ్చునంతలోఁ జేసినను, నేవచ్చువఱకును దానికి ప్రాయశ్చిత్తము జరుపవలదు. నే వచ్చినపిదప, ప్రాయశ్చిత్తము జరపఁ దగినది. ఇట్లు చెప్పి సత్యానందుఁడు స్వస్థానంబునకుఁ జనెను. భవానందుఁడును జీవానందుఁడును పరస్పరము కన్ను లెగరవేసి తలలల్లాడించిరి. భవానంద —— నీమీఁది మాటయే కదా? జీవానఁద —— ఉండవచ్చును. చెల్లెలింటికి మహేంద్రుని బిడ్డను విడిచిరాఁ బోయి యుంటిని. భవానంద —— దానియందు దోష మేమి? అదేమి నిషిద్ధము కాదు; బ్రాహ్మణిని జూచివచ్చితివా యేమి? జీవానంద —— గురు దేవుఁడు దానినే మనస్సున నుంచుకొని చెప్పియుండవచ్చునని తోఁచుచున్నది.<noinclude><references/></noinclude> d6jassgmh9xfyp0ambtng4q3w2d733f పుట:Aananda-Mathamu.pdf/112 104 109448 568084 564546 2026-08-03T11:43:20Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 568084 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" /></noinclude> {{p|fs125|ac}}ఇరువదొకటవ ప్రకరణము</p> {{p|fs100|ac}}మహేంద్రునకు సత్యానందుఁడు హితోపదేశము చేయుట.</p> సత్యానందుఁడు సాయాహ్నికకృత్యమును దీర్చుకొని, మహేంద్రునిఁ బిలిచి ‘నీబిడ్డ జీవించి యున్న’దని పలికెను. మహేంద్ర —— ఎక్కడ మహాస్వామీ! సత్యానంద —— నీవు నన్ను “మహాస్వామి”యనెద వేల? మహేంద్ర —— మఠాధికారులను “మహాస్వామి” యని పిలువవలయునని యందఱును చెప్పెదరు. ‘నాబిడ్డ యెక్కడ, మహాస్వామీ!’ సత్యానంద —— ఆ సంగతిని తెలిసికొనుటకు ముందు నేనడుగు ప్రశ్నలకు బదులు చెప్పుము. నీవు సంతానుల ధర్మంబును గ్రహించెదవా? మహేంద్ర —— అటులనే గ్రహింపవలయునని నిశ్చయించుకొని యున్నాను. సత్యానంద —— అటులైనచో “బిడ్డ యెక్కడ” యని యడుగరాదు. మహేంద్ర —— ఏల మహాస్వామీ? సత్యానంద —— ఎవరు ఈ వ్రతమును గ్రహించెదరో వారు తమ యాలు బిడ్డలు స్వజనులు వీరెవ్వరిసంబంధము నుంచుకొనఁ గూడదు. ఆలుబిడ్డల ముఖమును జూచినచో ప్రాయశ్చిత్తము గలదు. ఎంతవఱకు సంతానుల కార్యము సిద్ధియగుట లేదో యంతవఱకు నీవు నీ బిడ్డను జూడరాదు, నీవుసంతానులధర్మ<noinclude><references/></noinclude> bv7ds61tandstpphmxw9r27jc11ennj పుట:Aananda-Mathamu.pdf/113 104 109449 568086 355920 2026-08-03T11:45:57Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 568086 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|108|ఆనందమఠము|}}</noinclude>మును గ్రహించుట నిశ్చయమగు నేని, బిడ్డ సమాచారమును దెలిసికొని యేమి చేయఁబోయెదవు! చూచినను ప్రకృతమున ప్రయోజనము లేదు. మహేంద్ర —— ప్రభో! ఇంతకఠినమగు నియమ మెందులకు? సత్యానంద —— సంతానుల కార్య మతికఠినమైనయది. ఎవరు సర్వత్యాగులో యట్టివారు తప్ప, మఱెవ్వరును ఉపయుక్తులు కారు. మాయారజ్జుచే నెవరిచిత్తము బద్ధమై యున్నదో అట్టి వారు దారమునకుఁ గట్టిన గాలిపటమువలెనే భూమిని విడిచి స్వర్గము నెక్కలేరు. మహేంద్ర —— మహాస్వామీ! నాకుఁ జక్కఁగా బోధపడ లేదు. ఎవరు దారసుతాదుల ముఖ దర్శనముఁ జేయుదురో యట్టివారు గురుతర మగు కార్యమున కధికారులు కారా? సత్యానంద —— పుత్త్ర కళత్రముల ముఖములఁ జూచిన మాత్రమున దైవసంబంధములయిన పనులను మఱచి పోదురు. సంతానుల నియమ మేమనఁగా, ఆవశ్యక మైనపుడు ప్రాణ త్యాగమునకును భయంపడ కూడదు. బిడ్డ ముఖము మనస్సునకు జ్ఞాపకము వచ్చినయెడల బిడ్డను విడిచి ప్రాణ త్యాగంబునకు సిద్ధుఁ డగుదువా? మహేంద్ర —— చూడకుండిన మాత్రముననే జ్ఞాపకము లేకుండునా? సత్యానంద —— మఱచుటకుఁ గానిచో నీవీ వ్రతమును గ్రహింప వలదు. మహేంద్ర —— సంతానులందఱును ఇట్లే పుత్త్ర కళత్రము<noinclude><references/></noinclude> t1wlmupg6ka78jc6fizxyyu98b9vdbe రచయిత:సన్నిధానం నరసింహశర్మ 102 119097 568001 430450 2026-08-02T14:22:34Z Rajasekhar1961 50 /* రచనలు */ 568001 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = సన్నిధానం |అసలుపేరు = నరసింహశర్మ |పేరు_మొదటి_అక్షరం = స |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = సన్నిధానం నరసింహశర్మ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/కడుపుతీపు]] * [[అమ్మనుడి/సంపుటి 4/జూలై 2018/దీక్షాదక్షతలు గల పనిరాక్షసుడు - వడ్లమూడి గోపాలకృష్ణయ్య | దీక్షాదక్షతలు గల పనిరాక్షసుడు - వడ్లమూడి గోపాలకృష్ణయ్య ]] - [[అమ్మనుడి]] (జూలై 2018) * [[అమ్మనుడి/సంపుటి 5/మే 2019/నౌజన్యధన్యుడు, సాహిత్య సంపన్నుడు విఠాల వాసుదేవ దీక్షితులు | నౌజన్యధన్యుడు, సాహిత్య సంపన్నుడు విఠాల వాసుదేవ దీక్షితులు]] - [[అమ్మనుడి]] (మే 2019) * [[అమ్మనుడి/సంపుటి 5/జూన్ 2019/నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం స్పూర్తి ఇప్పటికి అవసరమే!]] - [[అమ్మనుడి]] (జూన్ 2019) * [[అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/ఆగిన తెలుగు వెలుగు చిరస్మరణీయసేవలు | ఆగిన తెలుగు వెలుగు చిరస్మరణీయసేవలు]] - [[అమ్మనుడి]] (ఏప్రిల్ 2021) [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] lwn31dz0q5pp6rm7sgs0ux1uun2jrup పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/487 104 154538 567962 448343 2026-08-02T12:02:19Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 567962 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఐర్లండు (భూగోళము)||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> {{Css image crop |Image = Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf |Page = 487 |bSize = 600 |cWidth = 333 |cHeight = 414 |oTop = 205 |oLeft = 135 |Location = center |Description = }} గుల ఎత్తు మించియుండవు. ఇచ్చటి మధ్యమైదానము బురద నేలతో దగ్గరగా ముడివడి యుండును; కానీ తక్కిన మైదానభాగముల మధ్య పల్లముగా నున్న గట్టినేల చీలికలు వ్యాపించి యున్నవి. ఇచ్చట ఎక్కువ ఫీట్ (కుళ్ళిన వ్రేళ్ళు. మొ.) సరఫరా అగును. సముద్రతీరము నందలి అన్ని భాగములకు నదులు ప్రవహించుచు, మధ్య మైదానము నందలి ఎక్కువ నీటిపారుదలకు ఆధారములుగా నున్నవి. ఇచ్చటి ముఖ్యమైన నదులన్నియు పర్వతములలో పుట్టినవి. ఐర్లండులోని పెద్దనదిగా 'షానన్ ను పేర్కొననగును.ఇది 200 మైళ్ళ పొడవుకలిగి ఉన్నది. మధ్య మైదానము నందలి పశ్చిమ భాగము మీదుగా, ఉత్తరమునుండి దక్షిణ ముఖముగా ఇది ప్రవహించుచున్నది. సున్నపు రాయి కరుగుటచే ఏర్పడిన విశాలమైన లోతులేని అనేక సరస్సుల మీదుగా ఈ నదీ ప్రవహించుచున్నది. ఐర్లండులోని ముఖ్యమైన నదులు, లాగూన్, బోయిన్, లిప్ఫే, స్లేన్సీ యైయున్నవి. ఇవి తూర్పు సముద్ర తీరమునకు ఎక్కువ నీటిపారుదలు చేకూర్చుచు, ప్రవహించుచున్నవి. ఐర్లండులో లెక్క లేనన్ని సరస్సులు కలవు. ఐర్లండునందలి శీతోష్ణస్థితి, ఆర్ద్రతకు, సమభావముగల శీతోష్ణస్థితికి ప్రసిద్ధి. ఈశాన్య భాగమునందు తప్ప, తక్కిన స్థలములలో శీతకాలపు ఉష్ణోగ్రత 40° ఫా. కంటే తగ్గదు. జూలై నెలలో సరాసరి ఉష్ణోగ్రత ఎల్లప్పుడు 60° ఫా.కు తక్కువ ఉండును. వానలు కలిగించు పడమటి గాలుల యొక్క ప్రభావమునకు ఐర్లండు, పూర్తిగ లోనగును. తుపాను గాలులు తరుచు ప్రబలముగా కలుగుచుండును. వర్షపాతము చాల హెచ్చుగా నుండును. అయినను మొత్తము దేశము నందు సమముగా కురియును. పశ్చిమమునందలి పర్వతములలో 80' పైనను, మధ్యమైదానమునందు 30" నుంచి 40" వరకు వర్షము కురియును. ఐర్లండు యొక్క శీతోష్ణస్థితి వ్యవసాయ కార్యక్రమములపై ఎక్కువ ప్రభావమును చూపు చున్నది. ఇచ్చటి శీతకాలపు ఉష్ణోగ్రత, సంవత్సర మంతయు పచ్చగడ్డి పెరుగుటకు అనుకూలముగా నున్నది. అందుకే, పశువు లను పెంచుటకు పెక్కు ప్రదేశములలో శాశ్వతములైన పచ్చగడ్డి మైదానములు కలవు. ఇచ్చటి ముఖ్యమైన వంట ఓట్సు. పశువులను, గొట్టెలను, మాంసమునకై పెంచుదురు. ఉత్తర ఐర్లండునందు ఫ్లాక్సు (ఎల్లగినె) వ్యవసాయము భారీగా సాగుచున్నది. పైన చెప్పబడిన వంటలే గాక, పర్వతభాగమునందలి రాళ్ళ చేలలో బార్లీ, బంగాళాదుంపలు, కోసుకూర<noinclude><references/></noinclude> 9wzv570lfbvu9d1qgqm66ie8ky1ebn5 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/488 104 154539 567965 563662 2026-08-02T12:12:42Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 567965 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨|| ఐస్‌లాండు}}</noinclude><section begin="488A" />(క్యాబేజి), గడ్డి మొదలగునవి పెంచుచున్నారు. దక్షిణమునను, ఐర్లండు మధ్యప్రదేశమునందును పాలు, పెరుగు చేయు పరిశ్రమ ముఖ్యవృత్తి. పుష్కలముగా లభించు పాలనుండి వెన్న, జున్ను తయారుచేయుదురు. మీగడ తీసిన పాలు పోసి పందులను పెంచి, వాటినుండి మాంసమును ఉత్పత్తిచేయుదురు. ఐరిష్ స్వతంత్ర రాష్ట్రములోకన్న. ఉత్తర ఐర్లండులో పరిశ్రమలు ఎక్కువగా అభివృద్ధి చెందియున్నవి. ఇచ్చటి ముఖ్యపరిశ్రమలు, నౌకానిర్మాణము, లినేను ఉత్పత్తియును నై యున్నవి. బెల్ఫాస్టు నౌకానిర్మాణ కేంద్రము. లంకా షైర్ నుంచి బొగ్గు, ఇనుము వీరికి లభ్యమగును. బెల్ఫాస్టునకు పశ్చిమమందలి పల్లపు నేలలు లినెన్ పరిశ్రమకు ముఖ్య కేంద్రములు గ్రామప్రదేశములలోని గృహములలో మామూలుగ ఉపయోగించు వంటచెరకు పీట్ (కుళ్ళిన వ్రేళ్ళు. మొక్కలు మొ. జీర్ణకములు). షాన్ యందలి విద్యుచ్ఛక్తి కట్టడము ఐరిష్ స్వతంత్ర రాష్ట్రమునందలి పరిశ్రమలకు విద్యుచ్ఛక్తిని సరఫరా చేయును. కార్కు యందలి ఫోర్టు పరిశ్రమ చాల ముఖ్యమైనది. ఇచ్చట లేసు అల్లుట, కుట్టుపనులు మొదలగునవి గృహపరిశ్రమలు. ఐర్లండులో బొగ్గు, బాక్సైట్ గనులు గలవు. బాక్సైటును కరిగించుటకు స్కాట్లండుకు ఎగుమతి చేయుదురు. ఇచ్చటి జనాభాలో 76% మందికి ఇంగ్లీషు రెండవ భాషగా తెలియును. మిగిలినవారు ఐరిష్ భాషయే మాట్లాడుదురు. 1951 లో ఐర్లండులో 29,60,593 మంది జనాభా కలదు. జనాభా అన్ని ప్రదేశములందు సమముగా వ్యాపించియున్నది. పశ్చిను ప్రదేశములందు మాత్రము జనాభా చాల తక్కువగా నున్నది. డబ్లిన్, బెల్ఫాస్టు, కారన్, లండన్ డెరీ మొదలగు చోట్ల 50,000 కు ఎక్కువ జనాభా కలదు. ఉత్తర ఐర్లండునందు 90% జనులు ఆంగ్ల భాష మాట్లాడుదుగు. తక్కిన 10% ఐరిష్ భాష మాట్లాడుదురు. ఐరిష్, స్వతంత్ర దేశము నందు జనులు పూర్తిగా ఐరిష్ తత్వము కలవారు. ఐర్లండు నంతయు అనేక కాలువలు, నీటిమార్గములు చీల్చుచుండును. అది ఒక వల అల్లినట్లు కనుపించును. ఐరిష్ స్వతంత్ర దేశమునందు డబ్లిన్ రైలుమార్గముల కేంద్రము. ఉత్తర ఐర్లండునందు కెల్ఫాస్టు అట్టి రైల్వే కేంద్రము. డబ్లిన్, బెల్ఫాస్టుల మధ్యను, వాటినుండి లండనువరకును, నిత్యము విమానములు నడపబడుచున్నవి. ఉత్తర ఐర్లండు, లినెన్, ఓడలు, పాడి వస్తువులు, కోడిగ్రుడ్లు, పశువులు, గొజ్జెలు, బంగాళాదుంపలు, మొద లగునవి ఎగుమతి చేయును. ఐరిష్ స్వతంత్రరాష్ట్రము వ్యవసాయ సంబంధమైన వస్తువులు ఎగుమతి చేయును. ఇవి రెండును బొగ్గు, ధాన్యము, జొన్న, ఎరువులు, టీ, చక్కెర, ఇనుము మొదలగు ఉష్ణదేశ వస్తువులను దిగుమతి చేసికొనును. ఐర్లండునందలి సముద్రపు చేపల పరిశ్రమ ఆదేశమునకు ఒక విలువయైన జాతీయ నిధిగా నున్నది. {{right|కె. వి. రె.}} <section end="488A" /> <section begin="488B" />'''ఐస్‌లాండు:''' ఐస్‌లాండు ఉత్తర అట్లాంటిక్ సముద్రములోని ఒక ద్వీపము. ఇది గ్రీన్ లాండుకు 200 మైళ్ళు తూర్పునను, స్కాట్లండుకు 540 మైళ్ళు పశ్చిమోత్తరమునను ఉన్నది. దీని విస్తీర్ణము 39,709చ మైళ్ళు, నిడివి 298 మైళ్ళు, వెడల్పు 194 మైళ్ళు. జనసంఖ్య 1,51,300. తీర రేఖ యొక్క పొడుగు 3,730 మైళ్ళు, దీనిలోని ¼ భాగము పశ్చిమోత్తర ద్వీపకల్పమునకు సంబంధించినదే. ఐస్ లాండు అగ్ని పర్వతమయమైన పీఠభూమి. అసాధారణ శీతోష్ణస్థితి యుండుటవలన ఈ దీవిలోని మధ్య పీఠభూమి నివాసయోగ్యమైనది కాదు, ఇక్కడి నేలలో నూటికి పదమూడు వంతుల భాగము మంచుగడ్డలతో నిండియుండును. వాతావరణములో తేమ ఎక్కువగా నుండుట, విశేషముగా వర్షములు కురియుట, ఇక్కడ మంచు విస్తారముగా నుండుటకు ప్రబల కారణములు.మంచుగడ్డలు ఎక్కువగా నుండుటవలన ఇక్కడ చిన్న నదులు అసంఖ్యాకములుగా కాననగును. ఈ ద్వీపములోని మంచుగడ్డలు ధ్రువమండలములోని మంచుగడ్డలను పోలియుండును. ఇచ్చట అనేక సరస్సు లున్నవి. వానిలో 'తింవల్ల వాతు' మరియు 'తోరిస్ వాతు' కడు పెద్దవి. ఇవి ఒక్కొక్కటి 27 చ. మైళ్ళను ఆక్రమించుకొని యున్నవి. ఐస్‌లాండులో దాదాపు 127 అగ్ని పర్వతము లున్నవి. ఈ అగ్ని పర్వతములు వెలిగ్రక్కు లావ్యాద్రవము దాదాపు <section end="488B" /><noinclude><references/></noinclude> ai8ktjzi4nej12zeg19kh59bcgj7uos పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/489 104 154540 568003 448345 2026-08-02T14:49:48Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 568003 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఐస్ లాండు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> 4,650చ. మైళ్ళ నేలలో ప్రవహించుచుండును. ఈ లావా ద్రవమేగాక అగ్నిపర్వతములు పగిలిన పిమ్మట వాయు మండలములో విస్తరించేడు బూడిద గూడ చాల ప్రమాదకరమైనది. ఈ బూడిద పచ్చని శాద్వలము లను పాడు చేయుచుండును. ఇక్కడి గొజ్జెలు, ఇతర పశువులు వచ్చి గడ్డి లభింపక పోవుటవలన విరివిగా మృత్యువు వాతపడుచుండును.ఈ ద్వీపములోని అగ్ని పర్వతములను మూడు రకములుగా విభజింపవచ్చును. అవి : (1) వెసువియస్ వంటి చిన్న అగ్ని పర్వతములు, (2) గోపుర శిఖరములను పోలిన అగ్ని పర్వతములు, (3) బిలములు గల్గిన అగ్ని పర్వతములు. అగ్ని పర్వతము తెల్లప్పుడు పగులుచుండవు. ఇవి ఎక్కువగానున్న జిల్లాలలో మాత్రము భూకంపములు అమితముగా సంభవించుచుండును. గంధపు పొంగులు, తుకతుక యుడుకు బురద సరస్సులు ఫేక్సాఫ్ లాయ్ (Faxuflai) కు ఉత్తరముగానున్న 'స్నా 'ఫేలోనిస్' ద్వీపకల్పములలో కనబడును. ఐస్లాండు శీతోష్ణస్థితి సముద్ర శీతోష్ణస్థితిని బోలియుండును. తీర ప్రదేశమునందలియు ద్వీపాంతర్భాగము లోని శీతోష్ణస్థితియు ఇంచుమించుగ సమానముగనుండును. ఇచ్చట చలికాలములో తుపాను లెక్కువగ వచ్చుచుండును. తూర్పుతీరములలో పొగమంచు విశేషముగనుండును. ఉద్భిజ్జ జాతి, జంతుసమూహము ఇట్టి శీతోష్ణస్థితివలన అధికముగా ప్రభావితము లగుచుండును. ఈ ద్వీపమంతటను వృక్షము లొకేరకముగ పెరుగుచుండును. ఇక్కడి మైదానములలో పెరిగిన గడ్డియే పశువుల కాహారము. ఈ ద్వీపములోని ఉష్ణ ప్రాంతములలో కొండరావి చెట్లు దట్టముగ పెరిగియుండును. సామాన్యముగ ఇక్కడి చెట్లు కడు చిన్నవి. వీనియెత్తు 3 నుండి 10 అడుగులకు మించదు. కొన్నిచోట్ల మాత్ర మివి 3 నుండి 20 అడుగులవర కుండును. 'క్రోబెరీస్' 'బిల్ బెరీస్' ఇచ్చట లభించు ఫలజాతులు. తెలుపు, నీలి వన్నెగల గుంటనక్కలు ఇచ్చటి దేశీయ జంతువులు. ధ్రువ ప్రాంతములనుండి ఎలుగుబంటులు {{Css image crop |Image = Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf |Page = 489 |bSize = 600 |cWidth = 524 |cHeight = 375 |oTop = 369 |oLeft = 45 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> kk7l4kzo8vue0qbljnx035tr8oo6y8n పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/490 104 154541 568004 448346 2026-08-02T15:08:34Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 568004 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||ఐస్ లాండు}}</noinclude> అప్పుడప్పుడు ఇచ్చటికి వచ్చుచుండును. 1771 లో 'రెయిన్ డీర్' ఈ ప్రాంతమున ప్రవేశించినది. ఇచట ఎన్నో రకములయిన పక్షులు, ఈలవేసెడు హంసలు, వన్నెవన్నెల బాతులు కన్పించుచుండును. జల జంతువులలో తిమింగలములు మున్నగునవి ఇచ్చట విస్తారముగ కానబడును. గండుమీల వ్యాపారము ఇచ్చటి పరిశ్రమలలో ముఖ్యమైనది అయియున్నది. ఐస్ లాండు నివాసులు స్కాండినేవియన్ జాతికి చెందిన వారైనను వారిలో పురాతన ఐరిష్ జాతి లక్షములు మిశ్రితములై కన్పట్టును. ఐస్ లాండుపై విదేశీయుల దాడులు అనేక పర్యాయములు జరిగినవి. ఈ ద్వీపముపై క్రీ. శ. 900-930 వరకు నార్వే నివాసులు దాడి జరిపిరి. అప్పటినుండి ఈ దీవి విదేశీయ పరిపాలనమునం దుండుచు వచ్చినది. 1280 లో ఈ ద్వీపము 'డెన్మార్కు' చేజిక్కినది. ఇంగ్లీషు, గ్యాస్కన్, అల్జీరియన్ ఓడ దొంగలు ఈ ద్వీపముపై దాడిచేసి ప్రజలలో అశాంతిని, భయాందోళనములను కల్గించిరి. 18వ శతాబ్దము ఐస్లాండు చరిత్రలో అంధకార ఘట్టము. ఈ కాలముననే ఐస్ లాండులో క్షామము, మశూచికము, ఇతర భయంకర వ్యాధులు వ్యాపించినవి. 1874 లో ఐస్ లాండు ప్రజలు ప్రఖ్యాత రాజకీయవేత్తయు, విద్వాంసుడును అగు జాన్ సిగడ సన్ నాయకత్వమున తమ రాజ్యాంగ నిర్మాణము చేసికొనిరి. 1918 లో ఈ ద్వీపము సర్వస్వతంత్ర దేశముగా ప్రకటింప బడినది. కాని అప్పటివరకు దీనికి ఏలికమాత్రము డెన్మార్కు రాజే. 1939 లో జరిగిన ద్వితీయ ప్రపంచ మహాయుద్ధ సమయమున ఐస్లాండు డెన్మార్కు నుండి విడిపోయినది 1940 ఏప్రెల్ నెలలో బ్రిటను ఈ ద్వీపమును ఆక్రమించినది 1942 లో అమెరికా ఈ ద్వీప సంరక్షణ బాధ్యతను స్వీకరించినది. యుద్ధాంతమువరకే తమ సైన్యములు ఐస్ లాండులో నుండు ననియు, తాము ఐస్లాండు యొక్క ఆంతరంగిక వ్యవహారములలో జోక్యము కలిగించుకో మనియు ఇంగ్లాండు, అమెరికా దేశములు వాగ్దానము చేసినవి. 1944 మే 20-23 లలో ఈ ద్వీపము స్వతంత్రముగా నుండవలయునా లేక డెన్మార్కు ఆధీనములో నుండవలయునా అను విషయముపై ప్లెబిసైటు తీసుకోబడెను. తత్ఫలితముగా ఐస్లాండు ప్రజలలో నూటికి 85 మంది సంపూర్ణ ప్రజా ప్రభుత్వమునకై తమ అంగీకారమును వెలిబుచ్చిరి. జూన్ 1944 లో ఐస్ లాండు సంపూర్ణ స్వతంత్ర రాజ్యముగా ప్రకటింపబడినది. ఐస్ లాండుచరిత్ర అత్యంత ఆకర్షణీయమైనది, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడి సాంఘిక, ఆర్థిక', 'రాజ కీయ, సాంస్కృతిక జీవనము రూపుదిద్దుకొన్నది ఇక్కడి ప్రజలు విదేశపు దాడులనే కాక ప్రకృతిసంబంధమైన దుర్ఘటనలను గూడ మొదటినుండి ఎదుర్కొనికి. క్రీ.శ. 1402 నుండి ఈ ద్వీపము భయంకర వ్యాధులకును, కాళ మృత్యువునకును (Black Death) గురియైనది, ఐస్ లాండు ప్రజల జీవితము వారి వాఙ్మయములో చక్కగా చిత్రింపబడినది. వారి జీవితములో నిమ్నోన్నతములు హెచ్చు. సామాజిక భేదము లుండెడివి. బానిసలు, స్వేచ్ఛాజీవులు ఉండెడివారు. ఐనను వారు కాలమున కనుగుణముగ తమ్ముతాము మలచుకొని అభ్యుదయమార్గమున పయనించిరి. నిన్న మొన్నటివరకు ఐస్ లాండు ప్రజలు గుఱ్ఱములపైననే ప్రయాణములు జరిపెడివారు. కాని 19 వ ళతాబ్దపు చివరి భాగములో వారు బండ్లు పోవుటకు వీలుగా చక్కని దారులు వేసిరి. పెక్కు వంతెనలు నిర్మించిరి. 1913 లో మొదటిసారిగా మోటారులు ప్రవేశ పెట్టబడినవి. అవి నేడు విరివిగా ఉపయోగింప బడుచున్నవి. ఐనసు ఈనాడు గూడ సామాన్యప్రజల ప్రయాణసాధనము రెండుచక్రాలబండియే. ఇచ్చట రైళ్ళు లేకున్నను 'లీత్, హల్, కోపన్ హెగన్, బర్గన్, హాంబర్గుల మధ్య ఓడల ద్వార టపాలు పంపిణీ జరుగుచున్నది. ఐస్లాండు ప్రజలు ఆరోగ్యముపై అధిక శ్రద్ధ చూపుదురు. ఈ ద్వీపములో ప్రతిజిల్లా కొక డాక్టరు కలడు. ఆరోగ్యముపై ననేగాక అక్షరాస్యత పైనగూడ ఐస్ లాండు ప్రజలకు అభినివేశముకలదు. 1949 సంవత్సరపు జనాభా లెక్కల ననుసరించి ఐస్ లాండులో ప్రతి పౌరుడు అక్షరాస్యుడే. 10 నుండి 14 సంవత్సరములకు లోపుగానున్న పిల్లలకు నిర్బంధ విద్య బోధింపబడుచుండెడిది. ఒకే ఉపాధ్యాయుడు రెండు, మూడు పాఠశాలలలో పని చేయుచుండెడివాడు. యువజనులకొరకు సాంకేతిక పాఠశాలలు స్థాపింపబడినవి. ఉన్నతవిద్య కూడ ఇక్కడ ప్రవేశ<noinclude><references/></noinclude> 1mmb9d7yg44m6fylua1xhnwqt5oqewu పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/491 104 154542 568006 448348 2026-08-02T15:29:47Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 568006 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఐస్ లాండు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> పెట్టబడినది. 'రేక్ జాపిక్' (ఐస్లాండ్ ముఖ్యపట్టణము) విశ్వవిద్యాలయము 1911 లో స్థాపింపబడినది. దీనిలో న్యాయ, నీతి, వేదాంత, వైద్య శాస్త్రములు బోధింపబడును. 1818 లో 'జాతీయ గ్రంథాలయము' స్థాపింప బడెను. 'మాగ్నస్ స్టీఫెన్ సన్ ' నడిపిన హేతువాదోద్యమము ఈ దేశపు ప్రజల విద్యాస్థాయికి మెరుగులు దిద్దినది. ఐస్ లాండు జనబాహుళ్యము కలిగిన ద్వీపము కాదు. 1939 లో ప్రతి చదరపు మైలునకు ముగ్గురు మాత్రమే యుండెడివారు. 'ఫాక్సాఫ్ లాయ్' (Faxafloi) ఉత్తరపు భాగములో నున్న రెక్జావిక్ తప్ప ఇక్కడ పెద్ద నగర ములు లేవు. 19 వ శతాబ్ది చివరి భాగములో ఇక్కడి ప్రజ లనేకులు అమెరికాకు వలసపోయిరి. ఐస్ లాండ్ ప్రజలలో అనేకులు పశువుల మేపుకొనుచు జీవింతురు. గొజ్జెలు కాయుట, పక్షులను వేటాడుట, కసవును కోసి ఎండ వేయుట, పండ్ల నేరుట మున్నగునవి వారి ముఖ్యవృత్తులు. శీతకాలములో ఇక్కడి ప్రజలు పనిముట్లను తయారుచేసికొందురు. కొందరు వస్త్రములు నేయుదురు. చేపలు ఆహారమునకే కాక వ్యాపారమునకు కూడ ప్రధాన సాధనములు. చేపలు ఇచ్చటినుండి ఇతర దేశములకు ఎగుమతి చేయబడును. ఇతర దేశములనుండి అనేక వస్తువులు ఇచటికి దిగుమతి చేయబడును. వంట చెరకు, యంత్రసామగ్రి, మోటారు కార్లు, లోహములు మరియు నేత వస్త్రములు ప్రధానముగా దిగుమతి యగును. ఐనను ఐస్లాండు యొక్క విదేశ వ్యాపారము అనేక ఇతర దేశములకన్న గొప్పది యని చెప్పవచ్చును. జాతీయబ్యాంకు ద్వారా ఇచ్చట వ్యాపారము జరుగు చుండును. 1939 లో రెండవ ప్రపంచయుద్ధ మారంభమైన తర్వాత ఇక్కడి విదేశ వాణిజ్యము బ్రిటను, అమెరికాల వరకు మాత్రమే పరిమితమైపోయినది. వాణిజ్యాభివృద్ధికి నౌకావ్యాపార మత్యంతావశ్యకము అగుటవలన వందలకొలది దీపగృహములు తీరప్రాంతముల నెలకొల్పబడినవి. 1917 లో 'రెక్ జావిక్' లో నిస్తంత్రీ వార్తా పద్దతి (వైర్ లెస్ టెలిగ్రాఫ్) స్థాపింపబడినది. ఐస్లాండు ప్రజలు ఆర్థికముగా ఇతర దేశములకు లోబడియున్నను రాజకీయముగా మాత్రము వారు సంపూర్ణ స్వాతంత్య్రము నభిలషించుచున్నారు.తమ దేశము డెన్మార్కు అధీనములో నుండుట వారి కిష్టము లేకుండెను. తత్ఫలితముగా వారు డెన్మార్కుతో గల రాజకీయ సంబంధములను తెగతెంపులు చేసికొనిరి. అప్పటినుండి సుస్థిర ప్రభుత్వ స్థాపనకై 'ఆల్ తిన్గ్' అను సంస్థ పనిచేయసాగినది. ఐస్ లాండు ప్రజాసత్తాక రాజ్యము. దీని పార్లమెంటు రెండు సభలుగా విభజింపబడినది. ఒకటి 'ఎఫ్రి డీల్డ్', 'రెండవది 'నెడ్రిడిల్డ్ '. 'రెక్ జావిక్' రాజధానినగరము. దేశము 16 జిల్లాలుగా విభజింపబడినది. ప్రతి జిల్లాకొక మేజిస్ట్రేటు ఉండును. ప్రత్యేక న్యాయసభ యొకటి కలదు. లోయర్ కోర్టులు మేజిస్ట్రేటు ఆధ్వర్యవములోను, సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ఆధిపత్యములోను నడుపబడును. ఐస్లాండుకు ప్రత్యేక ప్రభుత్వముతోపాటు ప్రత్యేక మతము గూడ కలదు. 'ఇవాంజిలికల్ లూథరన్ చర్చి' ఐస్ లాండు యొక్క ముఖ్య మత సంస్థ. ఇది 'రెక్ జావిక్ 'పట్టణమున క్రైస్తవ గురుస్థానముగా ఏర్పాటు చేయ బడినది. ఐస్ లాండు సాహిత్యచరిత్ర ముఖ్యమైనది. పూర్వ దశలో ఇక్కడి కవులు మహాకావ్యములు, వంశాను చరితములు, గీతములు రచించుచుండెడివారు. ఐస్లాండు నార్వేతో కలిసిపోయిన తర్వాత కథాత్మక గీతములు రచింపబడినవి. ఈ గీతములు విశేషముగా ప్రణయ కథాత్మకములు, ఐస్ లాండ్ సాహిత్యములో 'సాగాస్' గీత ములు ముఖ్యస్థానము నాక్రమించుచున్నవి. ఇవి సర్వత్ర పొడుకొనుటకు వ్రాయబడిన వీరగాథలు. ఇట్టి కృతులు వలన ఐస్ లాండ్ సాహిత్యచరిత్ర శోభాయమాన మైనది.'సాగాస్' అనగా మహారాజులు లేక సామాన్య మానవుల జీవిత చరిత్రలు. 'కింగ్ లీయర్', 'శకుంతల' మున్నగు అంతర్జాతీయ ప్రసిద్ధినొందిన నాటకము లను గూడ ఐస్ లాండు కవులు తమ భాషలోనికి అనువదించిరి. 'అరేబియన్ నైట్స్', 'బైబిలు' ‘కొత్త నిబంధన' (New Testament) గూడ అనువాదము లైనవి. ఐన్ లాండ్ సాహిత్యచరిత్రలో 'టార్ ఫీల్ దార్ హోమ్' గణనీయ యైన రచయిత్రి. ఐస్లాండ్ భౌగోళికముగా ఇతర దేశములకు విడివడి యున్నది. ఐనను ఇచ్చట నివసించెడు సాహసశీలురు,<noinclude><references/></noinclude> qtivwiriyvvrul410yvx5covryf132c పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/492 104 154543 568010 563667 2026-08-02T15:46:54Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 568010 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము – ౨||ఒరియా భాషా సారస్వతములు}}</noinclude><section begin="492A" />విజ్ఞాననిరతులైన ప్రజలు మానవచరిత్రకు తాము సైతము ఒక స్వర్ణపుటను సంతరించిరి. {{right|వి. దే.}} <section end="492A" /> <section begin="492B" />'''ఒరియా భాషా సారస్వతములు :''' 'ఓర్డియా' అను పదము సంస్కరించుట అను అర్థము నిచ్చు 'ఓడ్ర' అను సంస్కృతపదమును, 'ఓడ్' అను తమిళ ధాతువును స్ఫురణకు తెచ్చుచున్నది ప్రస్తుతము ఈ పదము ఒరియా భాషకును, ఒరియా సారస్వతమునకును గుర్తుగా వాడబడుచున్నది. ఈభాష 'ఉత్కల' లేక 'ఉర్ద' అను ప్రదేశమునందలి ప్రజల భాష యగుటచేత 'ఒరియా' భాష యని పిలువబడుచున్నది ఇండో-యూరపియన్ భాషా కుటుంబమునందు, ఇండో-ఆర్యను శాఖకు చెందిన బెంగాలీ, బీహారీ, అస్సామీ అను ప్రాగ్భాషలలో ఒరియా ఒకటిగా పరిగణింప బడుచున్నది. 'మాగధి' అను ప్రాకృతము నుండి ఒరియా భాషోత్పత్తి జరిగినది. వేయి సంవత్సరముల కాలములో ఇది ప్రస్తుత స్థితికి అభివృద్ధికాగలిగినది. ఒరియా భాషయొక్క ప్రప్రథమ చరిత్ర ఇంకను మరుగుపడియే యున్నది. భాషా దృష్టిలోను, తత్త్వదృష్టి తోను చూచినయెడల బౌధ్ గాన్ ఓదోహా (Boudh Gan O'Doha) అను మతసంబంధమైన గీతము, ఒరియా భాష యొక్క అత్యంత ప్రాచీన నిదర్శనముగా నున్నదను విషయమును నిర్ధారణము చేయుటకు పండితులు చాలా ప్రయత్నించిరి. ఈ భాషలో బౌద్ధ సంప్రదాయమునకు చెందిన పదము లుండుటచేత, ఈ భాష ప్రాచీన కాలమందలి దేశీయభాషలలో ఒకటిగా పేర్కొనబడు చున్నది. క్రీ.శ. 1051 నాటి ఉరజం (Urajam) శిలా శాసనమే ఒరియా భాషకు అత్యంత ఆదిమమైన ప్రమాణముగా సున్నది. క్రీ. శ. 1258 నాటి భువనేశ్వర మందలి సరసింఘ రాజు యొక్క ద్వైభాషిక శిలాశాసనమును, క్రీ. శ. 1384 నాటి ఒరిస్సాలోని నాల్గవ నరసింఘ దేవుని తామ్ర శాసనమును, ఈ భాష పొందిన క్రమాభివృద్ధిని నిర్ధారణము చేయుటలో మిక్కిలి అమూల్యములైన ఆధారములుగా నున్నవి. ఈ భాషా చరిత్ర యొక్క క్రమాభివృద్ధిని చక్కగా అర్థము చేసికొనుటకు, ప్రాచీన కాలమునందు భాషా ప్రయుక్త సిద్ధాంతముపై చేయబడిన రాజకీయ విభాగములను దృష్టియందుంచుకొనవలయును. 'ఓక్ డ్ర’ అను పేరును, ఇప్పుడు 'ఉత్కల' అని పిలువబడు 'ఉత్కల'యు, నిశ్చయముగా ద్రావిడ భాషనుండి జన్మించినవే. ఒరియా భాషకు వర్ణక్రమము ననుసరించియే ఉచ్చారణము కూడా ఉండును. ఒరియా భాషలోని ప్రతి పదమును అజంతముగానే ఉండుట చేత, ఈ భావ దక్షిణదేశమున తన ఇరుగు పొరుగు భాషయగు తెలుగును పోలి యున్నదని చెప్పవచ్చును. గ్త్రెర్ సన్ (Grierson) అభిప్రాయము ననుసరించి, ఈ భాషయందలి క్రియాపధ నిర్మాణ క్రమము సులభమైనదిగను, సంపూర్ణమైనదిగను ఉన్నది. మీరు అను అర్థమునిచ్చు 'తుం హె' అనునట్టియు, 'మేము' అను అర్థమునిచ్చు 'అం హె ' అనునట్టియు ప్రాచీన పాలిథాషా పదములు ఒరియా భాషలో ఇంకను చలామణి యగుచున్నవి. 'ఒస్ట్' మరియు 'స్ట్' అను ఇండో-యూరపియను భాషయందలి శత్రర్థక ప్రత్యయములు కొంచెముగ మారీ ఒరియా భాషయందు నిలిచియున్నవి. ఓడ్రభాషలో 'తత్సమ' 'తద్భవ' పదములున్నవి. అనేకమైన ద్రవిడ భాషా పదములు కూడా ఈ భాషలో కాన వచ్చుచున్నవి. 'ట, ఠ, డ, ఢ, ణ, ళ' అను మూర్ధన్య వర్ణములను ఉపయోగించుట ద్రవిశభాషా ప్రాభవము వల్లనే జరుగుచున్నదని చెప్పవచ్చును. అరబ్బీ, పర్షియను పదములకు గూడా ఈ భాషలో కొరతలేదు. నిర్వహణ, ఆర్థిక, వైద్య, శాఖలలో అనేక ఆంగ్లపదములు కూడా ఓడ్రభాషలో స్థిరపడిపోయినవి. చాలాకాలము క్రిందటనే ఓడ్ర భాష ఒక ప్రత్యేక రాష్ట్రమునకు చెందిన భాషగా వ్యవహారములోనికివచ్చెను. ఈ భాష స్వతంత్రభాషగా వేయిసంవత్సరముల క్రిందటనే వాడుకలోనికి వచ్చిన దనుట సత్యమే. తాళపత్రములపై వ్రాయబడిన పూరీజగన్నాథ దేవాలయ చరిత్రలును, ఇతరములైన ఆధారపత్రములును, పరిపాలకుల పరిపాలనకు సంబంధించిన లిఖితపత్రములును, ఈ ఒరియా భాష యొక్క మిక్కిలి ఆదిమమైన గద్యమునకు నిదర్శనములుగానున్నవి. ఓడ్రభాషా వర్ణ సమామ్నాయములో 49 అక్షరము లున్నవి. వీటిలో 13 అచ్చులు, 38 హల్లులు. అచ్చులు ప్రత్యేకముగా గాని, లేక హల్లులతో కలిసిగాని కనిపిం <section end="492B" /><noinclude><references/></noinclude> 2f2cuo4z35pudkdutwc26zds88eermy పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/493 104 154544 568013 448350 2026-08-02T16:06:21Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 568013 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఒరియా భాషా సారస్వతములు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> చును. సాధారణముగా హల్లులు అచ్చులసహాయము లేనిదే స్వతంత్రముగా ఉపయోగింపబడవు. ఒక్కొక్క ప్పుడు 2, 3 హల్లులును, ఒక అచ్చును కలిసి ఒక పరిపూర్ణమైన అక్షరముగా ఏర్పడుచుండును. సంస్కృత వ్యాకరణము నందలి లింగ నిర్ణయపద్ధతికి ఇందు తావులేదు. ఇందు లింగభేదము విశేషముగా, ఆయా వస్తువు యొక్క లింగ భేదమును బట్టియే యేర్పడును. ఓడ్ర భాషయందలి అనేక పదములకు, ప్రత్యక్షముగా గాని, పరోక్షముగా గాని సంస్కృతభాషయే మూలాధారమయి యున్నది. ఇందలి వ్యాకరణ లక్షణములుకూడ చాలాభాగము సంస్కృత వ్యాకరణ లక్షణమునే అనుసరించుచున్నవి. ప్రాచీన కాలములో సాంఘికముగా, రాజకీయముగా, వాణిజ్య రీత్యా, వివిధ దేశములతో నేర్పడిన అన్యోన్య సంబంధము వలన ఓడ భాషలో నూర్లకొలది, తెలుగు, తమిళము, అరబ్బీ, పార్సీ, ఉర్దు, ఇంగ్లీషు, ఫ్రెంచి మున్నగు వివిధ భాషావదములు కానవచ్చుచున్నవి. ఒరియా లిపి, 'కుటిల్, (Kutil) దేవనాగరి (Devanagari) లీపులద్వారా, బ్రాహ్మీలిపి జన్యమైన మాగధి లిపి నుండి పుట్టినది. వాడితేలిన ఇనుపగంటముతో తాళపత్రములపై వ్రాయుటచేత, అక్షరములు పైభాగమున గుండ్రముగా నుండెడివి. క్రీ. శ. పదమూడవ శతాబ్దము నాటికి ఓఢభాష స్వీయములైన లిపులను అభివృద్ధిచేసికొన గల్గినది. అక్షరములకు గుండ్రని తలకట్లు ఉండుటయే ఒరియా భాషకుగల ప్రత్యేకతయై యున్నది. ఒరియా భాష, ఆ భాషలో అతి విస్తారమగు మత విషయక ప్రాచీన పద్య వాఙ్మయము ఏర్పరచుటకు కొన్ని శతాబ్దులకు ముందే ఉత్పన్నమైనది. భారత దేశమునందలి అతి ప్రాచీనములైన భాషలలో ఒరియా భాష యొకటి. అది పుట్టి వేయిసంవత్సరముల కంటే ఎక్కువకాలము గతించినది. ఒరియా భాషాచరిత్ర చాలా భాగము నిగూఢ విషయములతోను, రాజకీయ సంక్షోభములతోను పరివృతమై యున్నట్లు కనిపించును. క్రీ. శ. పదమూడవ శతాబ్దికి చెందిన తామ్ర దానశాసనములయందలి విషయము శబ్దశాస్త్ర ప్రాముఖ్యము కలిగి ఆనాటి వాఙ్మయ సరణులకు ప్రతిబింబముగ నున్నది. క్రీ.శ. పదునొకండవ శతాబ్దికి చాల పూర్వమునందే పక్వస్థితికి రాలేకున్నను ఏదియో యొక ఒరియా కావ్యము పుట్టియుండెననుట సత్యము. ఆ కాలములో బహుజనులకు ప్రీతిపాత్రములయి యున్న కొన్ని పాటలు, పద్యములు, కోయిలలు (koiles) భౌతిశా (choutisa), కీర్తనలు మొదలయిన వాటినిబట్టి గాంగప్రభువుల కాలమునందే ఒరియా వాఙ్మయసంస్కృతి ప్రారంభమైయుండి యుండునని నిస్సందేహముగా మనము చెప్పవచ్చును. ఏ వాఙ్మయాభివృద్ధి యొక్క ప్రాథమికావస్థ యందైనను ఆ వాఙ్మయమునకు సంబంధించిన సామెతలు జనులు జిహ్వాగ్రగతము అయి యుండుట సహజము. వంగ దేశమునందును, అస్సామునందును ఇట్టి పెక్కు సామెతలు పెక్కురు జనులలో విశేషముగా వ్యాప్తిగాంచినవి. ఒరియా వాఙ్మయమునందును ఇట్టి సామెతలకు కొరతలేదు. విశేషమైన సంస్కృత భాషాప్రభావము కలిగిన ఒరియా భాషా వాఙ్మయముల యొక్క ఆరంభ కాలమును నిర్ణయించుట కీసామెతలు మిక్కిలి ఉపయోగ పడుచున్నవి. కేసరి వంశీయులును (క్రీ.శ. 520–1042), గాంగ ప్రభువులును (క్రీ.శ. 1042-1435) సూర్యవంశ్యులును (1435–1534) ఒరిస్సాను క్రమముగా పరిపాలించిరి. కపిలేంద్ర పురుషోత్తమదేవుల యొక్క అసాధారణములును, ప్రఖ్యాతములు నగు శూరకృత్యములును, దేశభక్తియు, ఏదోఒక రీతిగా ఆనాటి వాఙ్మయారంభము నందు ప్రతిబింబించి యున్నవి. బౌద్ధమత వ్యాప్తి, బ్రాహ్మణుల ప్రభావము, కంచిపై పురుషోత్తమ దేవుడొనర్చిన దండయాత్ర, పూరియందును, కోణార్కము నందును దేవాలయముల నిర్మాణము మున్నగు గొప్ప చారిత్రక సంఘటనలే ప్రబల కారణములయి తొలుదొల్త ఒరియా జాతీయ వాఙ్మయ నిర్మాణమునకు పునాదులుగా నేర్పడెను. క్రీ.శ. 10వ శతాబ్ది మొదలుకొని అర్వాచీన కాలమువరకు పెంపొందిన ఒరియా వాఙ్మయ చరిత్రము నందలి ముఖ్య విభాగములు ఇట్లున్నవి : (అ) క్రీ.శ. 1042 నుండి క్రీ.శ. 1435 వరకు నిర్మాణాత్మక యుగము (గాంగవంశ్యులు మొదలు సూర్య వంశ్యుల వరకు). ఇదియే ప్రథమ గేయ కావ్యయుగము,గద్యోదయ యుగము. (ఆ) 'పంచసఖ' (Panchasakha) యుగము, లేక వైష్ణవమత వాఙ్మయ యుగము లేక పురాణ వీరశావ్య<noinclude><references/></noinclude> n4fp2g5llt5c0du526v04wk51iv80df పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/494 104 154545 568016 448351 2026-08-02T16:22:27Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 568016 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||ఒరియా భాషా సారస్వతములు}}</noinclude> యుగము. (ప్రతాపరుద్రదేవుడు మొదలు దివ్యసింఘ దేవుని వరకు.) (ఇ) కావ్యయుగము లేక రీతి (Riti) యుగము. (ఈ) సంగీతయుగము లేక రాధానాథ పూర్వయుగము (క్రీ.శ. 1700-1850.) (ఉ) నవయుగము లేక రాధానాథ-మధుసూదన - ఫకీరు మోహన్ (క్రీ. శ. 1850-1920) ల యుగము. (ఊ) రాధానాథ - అనంతరయుగము లేక నవీన కవియుగము. ఇందు శ్రీ కాళిందీచరణ పాణిగ్రాహి-వైకుంఠ నాథ పట్టనాయక - ఆనంద శంకరరాయ మాయాధర మానసింఘ్ మున్నగువారి నాయకత్వమున నున్న హరిత సంఘము (Green Group క్రీ.శ. 1919-1935) మొదటిది. పండిత గోపబంధుదాసు, పండిత నీలకంఠదాసు, పండిత గోదావరీశ మిశ్రుడు, గోదావరిశ మహాపాత్రుడు, వాసుదేవ మహాపాత్రుడు, కృపాసింధు మిశ్రుడు మున్నగు వారి నాయకత్వముననున్న సత్యవాది సంఘము (Satya Vadi Group) రెండవది. (ఋ) రాధానాథునికి అవ్యవహితోత్తర కాలికులును, సమకాలికులునునైన కవులు (క్రీ.శ. 1900-1930). (ౠ) అత్యాధునిక కవులు, అతివాది కవులు - వారిలో పేర్కొనదగిన రచయిత సచ్చిదానంద రాఉతరాయ్ మొదలగువారు (క్రీ. శ. 1922 1955). ఒరియా వాఙ్మయములో ఏది అత్యంత ప్రాచీనమైన కావ్యము అను సంశముపై భేదాభిప్రాయము లున్నవి. కొందరు, మార్కండదాసు యొక్క కేశవ కోయిల్ (Kesav Koil) ప్రాథమిక రచన అనియు, మరికొందరు బఛాదాసు యొక్క కలసాచౌతిళా (Kalasa Choutisa) ప్రప్రథమ రచన అనియు అనుచున్నారు. మాదలా పొంజి అనునది అత్యంత ప్రాచీనమైన ఒరియా వచన రచనకు నిదర్శనము. అది పూరియందలి జగన్నాథాలయమునకు సంబంధించిన చరిత్రను తెలుపునట్టి యొక తాళ పత్ర గ్రంథము. మరికొన్ని ప్రాచీనములైన ఒరియా వచన కావ్యములును కలవు. వాటిలో ఓపాసు (oshas) అనగా స్త్రీల ఉత్సవములును, ఒరిస్సా యందలి కొన్ని రాజవంశముల చరిత్రయును వర్ణింపబడి యున్నవి. ఆదిమ పద్య కావ్య రచయితలు సాధారణ మానవునకు రుచించు నట్టియు సామాన్యమైనట్టియు రచనపైనను, ఛందస్సు పైనను తమ దృష్టిని కేంద్రీకరించిరి. ఓరియా వాఙ్మయమున నూరు వృత్తము లుండుట యొక విలక్షణము. సాధారణ వాఙ్మయములో అవలంబింపబడిన చౌతీశా అను వృత్తమునందు అధమపక్షము 34 పంక్తు లుండెడివి.. 'క' నుండి '' వరకుగల అక్షరములు క్రమముగా ప్రతి పంక్తికిని మొదటి అక్షరములుగా నుండవలెను. హాస్యరసపూరితముగను, ఆహ్లాదకరముగను శివపార్వతుల వివాహ-మును వర్ణించిన కలసా చౌతిశాయును, భక్తచరణదాసు రచించిన మన బోధ చౌతీశాయును, 19వ శతాబ్ది ప్రారంభము నందలి ఒరియా చౌతీశా వాఙ్మయమునకు ఉత్తమమైన మచ్చుతునకలు. ఒరియా యందలి కోయిల్ అను పదము కోయిల (కోకిల) అను పదమునకు ప్రతిరూపము. మార్కండేయదాసు వ్రాసిన 'కేశవకోయిల్' లేక ‘యశోచా కోయిల్ ’అనునది మరి యొక ఒరియావాఙ్మయ ప్రక్రియకు చెందినది. ఇది స్వగతవచోరూపము. మిక్కిలి వ్యాప్తిలోనుండి, పాఠశాలకు పోవు పిల్లలందరిచేత సాధారణముగా ఇది కంఠస్థము చేయబడుచున్నది. ‘యశోదాకోయిలి’లో యశోధ, తన బిడ్డడైన కృష్ణునితో తనకు కలిగిన ఎడబాటువలన జనించిన విషాద భావములను కోయిలలో చెప్పుకొను చున్నది. ఈ విధముగా కోయిల మానవుల కష్టముల యెడ సానుభూతి గలిగినదిగా ప్రతిపాదింపబడినది. జగన్నాథదాసు రచించిన అర్థకోయిల్ అనునది కేళ వకోయిల్ యొక్క ఆధ్యాత్మిక వ్యాఖ్యానమై యున్నది. బలరామదాసు వ్రాసిన 'కాంతకోయిల్' రావణుని చెరసాలయందున్న సీత యొక్క మనోవృత్తిని వివ రించుచున్నది. 'బరమాసికోయిలి'ని శంకరదాసు రచించెను. ఈ రచనలన్నియు కరుణరసముతోను మానవుని అంతర భావములతోను నిండియున్నవి. సరళ దాసు రచించిన మహాభారతము బ్రహ్మాండమైన వీరచరిత కావ్యము. ఇది అనేక పాత్రలతోను, కథలతోను, సాంఘిక జీవన వర్ణనలతోను, మతసంబంధమైన బోధనలతోను, 18 భాగములుగా రచింపబడిన కవి యొక్క స్వతంత్రసృష్టి. చండీపురాణము, బిలంకా రామాయణము అను మరి రెండు గ్రంథములను ఈకవి వ్రాసినాడు. ఈ కవి అభిప్రాయము ననుసరించి ఈ రచన లన్నియు, అతనికి భగవతియైన సరళాదేవి<noinclude><references/></noinclude> ksacwiw6w345pvmgjvc9gq8g4mx7i3h పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/495 104 154546 568085 448352 2026-08-03T11:45:47Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 568085 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఒరియా భాషా సారస్వతములు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> యొక్క కృపాఫలములు. బలరామదాసు మొదలయిన వారు ప్రాథమిక వీరచరిత కావ్యయుగమునకు చెందిన వారు. ఒరియా వాఙ్మయ ప్రారంభదశ, సంస్కృత పురాణములను భాషాంతరీకరణము చేయుటలోను, రామాయణ మహాభారతములను కథన మొనర్చుటలోను గడచిపోయినది. సరళ దాసు యొక్క 'భారతము' వంటి శాశ్వత జగన్నాథ దాసు యొక్క 'భాగవతము'ను, బలరామదాసు వ్రాసిన 'జగమోహన రామాయణ' మను ‘దాండీ రామాయణము' అనునవి 15 వ శతాబ్ది ఉత్తర భాగమునకు, 16 వశతాబ్దపు ప్రథమ భాగమునకు చెందిన ఆయా కవుల యొక్క మిక్కిలి స్వతంత్ర రచనలుగా భావింపబడుచున్నవి. ఈకాలపు సారస్వతము మత విషయకమైన మహాకావ్యములచే లక్షితమై యున్నది. ఇది కపిలేంద్ర దేవుని పరిపాలనా కాలమున ప్రారంభమైనది. సరళదాసు, జగన్నాథదాసు, బలరామదాసు, యశ్వంత దాను, అచ్యుతానందదాసు వంటి మహాత్ముల రచనలు ప్రాతిపదికగా గలిగిన, మతసంబంధమైన రచనోద్యమము ఆరంభ మయ్యెను. ఈ ఐదుగురు కవులును 'చైతన్యునికి'నీ 'వైష్ణవ మతము'నకును భక్తులు. వీరు పంచనఖులుగా గుర్తింపబడు చున్నారు. జగన్నాథస్వామివారి పేరణమువలననే బలరామదాసు, పూర్వోక్తమైన సుప్రసిద్ధ జగ మోహన రామాయణమును వ్రాసెను. వార్థక్యములో అతడు చైతన్యస్వామి ప్రభావమునకు లోనయ్యేను. గుప్తగీత, బ్రహ్మాండ భూగోళము, వట అవకాళము (Vata Avakash), భాగవతము అనునవి బలరామదాసు రచించిన ఇతర ప్రముఖ రచనలు. జగన్నాథ దాసు భాగవతమును తాళపత్రములపై వ్రాసెను. అదియొక శాశ్వత గ్రంథము, అందు తప్పక జరుగునట్టి జీవిత సత్యములు అసాధారణ శక్తితో ప్రతిపాదింపబడినవి. అందుచే నా గ్రంథము సార్వజనీనమై అన్ని తరగతులకు చెందిన జనులకును ఉపదేశకమై అసంఖ్యాకు లయిన జనుల ప్రవర్తనమును దిద్దగల్గెను. ఒరిస్సాలోని ప్రతి గృహములోను, ఈ గ్రంథము జాగ్రత్త చేయబడి, పూజింపబడి, ప్రతి వ్యక్తి చేతను సాయంకాలమందు పఠింపబడుచున్నది. అర్థకోయిలి, గుస్తభాగవతము, తులావీణ అను గ్రంథములు జగన్నాథదాసుయొక్క మరికొన్ని పేర్కొనదగిన రచనలు. వాటి యందు అనేక రహస్యానుష్ఠానము లును, వేదాంతాశయములును, మనోహరముగా ప్రతిపాదింపబడినవి. జగన్నాథుని పూజావిధానము, భువనేశ్వరారాధనము, ప్రతి రంగమందును బ్రాహ్మణుల ఆధిక్యము, చైతన్యుని ఆగమనము. ఇవన్నియు ఆనాటి సారస్వతోద్యమమునందు గొప్ప పాత్రను వహించినవి. ఈ కవులందరి యొక్కయు, మతసంబంధమైన పురాణముల యొక్కయు భాష సులభమును అర్థయుక్తమును అయియున్నది. సరళ దాసు, బలరామదాసు, జగన్నాథ దాసు-వీరందరును ప్రజాప్రీతికరమైన వాఙ్మయము యొక్క రచయితలుగా ప్రసిద్ధులైరి. ప్రసిద్ధ ఒరియా మహాకవులైన సరళదాస ఉపేంద్రభంజుల నడుమ అధమపథము 35 మంది కవులైనను, ఒరియా వాఙ్మయమునందు శాశ్వతమైన స్థానమును ఆక్రమించి యున్నారు. క్రీ. శ. 10 వ శతాబ్దినాటి బౌద్ధగానఓదోహా, మాదలా పాంజీ అనుకృతులును, మార్చండబాసు రచించిన కోయిలీలును, బఛాదాసు, సరళదాసు, అతనియొక్క సమకాలికులు కావ్యయుగ ప్రారంభమువరకును లేక ఓడ్ర వాఙ్మయమునకు చెందిన ఉపేంద్రభంజుని కాలము వరకును, క్రమక్రమాగతమైన ఒరియా భాషాభివృద్ధియందు మిక్కిలి ప్రముఖస్థానమును ఆక్రమించియుండిరి. '''కావ్యయుగముయొక్క పూర్వరంగము లేక మధ్య యుగముయొక్క ప్రారంభదశ (క్రీ.శ. 1750 వరకు) :''' 16వ శతాబ్ది ' మధ్యమున ఒరిస్సా మహమ్మదీయ పాలకులచే ముట్టడింపబడేను. రాజకీయరంగమున కల్లోలము లున్నను ఆర్థిక, సాంఘిక క్షేమయుగము అప్పుడే ప్రారంభమయినది. జమీందార్లు, రాజులు మొదలయిన ఒరిస్సాలోని వివిధ పదవులయందలి స్థానిక పరిపాలకులు, పాండిత్య ప్రియులగుటచేత, సంస్కృత భాషాధ్యయనమును, సంస్కృత కావ్యపఠనమును, సంస్కృతిని మిక్కిలి ఆదరించి పోషించిరి. కాళిదాస, శ్రీహర్షాది మహాకవుల యొక్క సంస్కృత కావ్యపఠనము, ఆనాటి ఒరియా సారస్వతరంగమున నూతనముగా అడుగు పెట్టిన ప్రవేశకుల హృదయములలో ఒక నూతన వైఖరిని నూతనసారస్వతాభిరుచిని ప్రవేశ పెట్టినది, 17 వ శతాబ్ది ఉత్తరభాగము<noinclude><references/></noinclude> 82xu0nnkn15mv9vr69j86lw9fb8rhf7 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/496 104 154547 568091 448353 2026-08-03T11:58:49Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 568091 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - .౨||ఒరియా భాషా సారస్వతములు}}</noinclude> నుండి 18వ శతాబ్ది అంతమువరకు ఒరియా వాఙ్మయములో, పూర్తిగా నూతనమైన రీతులు గోచరించును. దీన కృష్ణ దాసు వ్రాసిన రసకల్లోలము', భూపతి పండితుడు రచించిన 'ప్రేమపంచామృతము' వంటివి తప్ప, ఆకాలమునందలి మిగిలిన రచన లన్నియును, నిత్యమైన ప్రేమగీతమును, అతిరుచిరముగాను, ప్రావీణ్యము తోడను వర్ణింప దొడగెను. రాధాకృష్ణుల యొక్కయు, గోపాంగనల యొక్కయు, లేక ఆనాటి రాజుల యొక్కయు, రాణుల యొక్కయు ప్రణయమే శాబ్దిక వైచిత్రితో నిండియున్న ఆనాటి ముఖ్య రచనలకు ప్రాతిపదికములైనవి. 16 వ శతాబ్ది ఉత్తర భాగమునందును, 19 వ శ తాబ్దమునందును ఉపకావ్యములు విషయము, భాష, శైలి, వివరణము మొదలగు నన్ని విషయములందును ఒక భిన్నరూపమును ధరించెను. కావ్యయుగమునందు మార్గదర్శకులైన దీన కృష్ణదాన, ఉపేంద్రభంజ, అభిమన్యు సామంత సిన్హార, యదుమణి మహాపాత్ర, భక్త చరణదాస మొదలైనవారును, తదితరులనేకులును, అయ్యుగాదర్శభూతము అయిన కావ్యములు వ్రాసిరి. వైష్ణవమతము, భక్తి మొదలైనవి కావ్యవస్తువులుగా నుండు పద్ధతి పరిత్యజింపబడినది. ఒరియా కావ్య శిల్పమున కృతహస్తు డయిన ఉపేంద్రభంజ అను కవి వ్రాసిన, కోటి బ్రహ్మాండసుందరి' యను కావ్యములో ఒకే పంక్తిలో మూడు భిన్నఋతువులను వర్ణించుటలో అపరిమితమైన వైశిష్ట్యమును, ప్రావీణ్యమును ప్రదర్శింప బడినవి. ఈ కాలమునందే, వాఙ్మయమునకు మతముతోడి సంబంధము తగ్గిపోయెను. పరిపాలకుల ఆశ్రయములో, చారిత్రాత్మక గాథలపైనను, పౌరాణిక ప్రాతిపదికల ఫైనను, కల్పిత కథలపైనను ఆధారపడి గణుతికెక్కిన కావ్యములు వెలువడెను. ఈ యుగారంభమునందు దీన కృష్ణదాసు రసకల్లోల మను రాధాకృష్ణులు నాయికానాయకులుగా గల భక్తి కావ్యమును 34 అధ్యాయములలో రచించెను. ఈ గ్రంథము సంఖ్యాతీతు లయిన ఒరియా పాఠకులకు ప్రీతి పాత్ర మయ్యెను. ఉపేంద్రభంజకవికి సమకాలికుడును, 'ప్రేమపంచామృత' మను గ్రంథమునకు కర్తయు నయిన భూపతిపండితుడు, తన అభిరుచిలోను, శైలిలోను ఈ కాలమునకు చెందిన ఇతర కవులందరి కంటే ఖిన్నుడు. 'విశ్వనాథ ఖంటియా' యొక్క విచిత్ర రామాయణములో వీరకావ్య పునరుద్ధరణము లక్షితమగు చున్నది. సంస్కృత భాషలో గొప్ప వండికుడైన ఉపేంద్రభంజ అనునాతడు కావ్యయుగమునందు గొప్పి కవిగా పరిగణింపబడు చున్నాడు. చౌతిశా చౌనదిభూషణ మొదలగు 52 పద్య కావ్యములను ఆతడు రచించెను. అతడు రచించిన సుభద్రా పరిణయము, లావణ్యవతి, కోటి బ్రహ్మాండ సుందరి, అను గ్రంథములు ఒరియా వాఙ్మయమునకు భూషణములవంటివి. అతని 'చిత్రకావ్యము' పదములను, వర్ణములను కూర్చుటలోగల నేర్పును ప్రదర్శించునటువంటి మహత్తర గ్రంథము. ఉపేంద్రభంజ అనేక గ్రంథములు రచించినవాడును, కల్పిత కథారచయితలలో నగ్రగణ్యుడును, వాక్చాతుర్య వైభవమును, ప్రావీణ్యమును గలవాడునునై యున్నాడు. ఆతనికి పిమ్మట కావ్య రచనాపరులయిన కొందరు రచయితలు వెలువడిరి. కావ్యయుగమునకు చెందిన కవులలో 'అభిమన్యు సామంత సింహార' కవి విశిష్టతను గాంచెను. అట్టి విశిష్టతకు కారణ మాతడు రచించిన విదగ్దచింతామణివంటి విశ్రుతము లయిన ఉద్గ్రంథములే. ఆ గ్రంథరచనయందు ఉపేంద్రభంజ, సదానందక విసూర్యుల ప్రభావము సుస్పష్ట మగుచున్నది. ఇతడు బాల్యమునందే గ్రంథరచన మొనర్చి ప్రసిద్ధిచెందెను. ఒరియా వాఙ్మయమునందలి కావ్యయుగ చరిత్ర భక్త చరణదాసకవి నామమును పేర్కొనినగాని సంపూర్ణము కాదు. అతడు మధురామంగళ అను గ్రంథమును వ్రాసేను. ఆ రచన సర్వజన ప్రీతిపాత్రమైనది. అందుచేత ఆ గ్రంథము నుండి ప్రతి పాఠశాలయందలి విద్యార్థులును తప్పకుండ ఒకటి రెండు సర్గలను కంఠస్థము చేయు నాచారము గలదు. భక్తచరణదాసు ఒక వినూతన శైలిని సారస్వత రూపమున ప్రారంభించెను. ఎక్కువగా మతముతో సంబంధముగల అతని మధురామంగళ అను రచనయందు గోపికాకృష్ణుల సంబంధము వర్ణింపబడి యున్నది. పీతాంబరదాసు, రామదాసు, కృష్ణసింఘ, తేలేంగా గోపాల, రఘునాథభంజ, దాశరథిదాను, లోక నాథ దాసు, కృష్ణదాసు మున్నగు సుప్రసిద్ధ కవులును, తదితరులైన అనేకులును, ఈ యుగమునందలి రీతి కావ్యాభివృద్ధికి విశేషముగా తోడ్పడిరి. సమరతరంగ ఘను కావ్యమును<noinclude><references/></noinclude> jph42vtd2qu7j3lprsop23kl0illh0p వాడుకరి:-revi 2 156259 568005 452122 2026-08-02T15:08:46Z Pathoschild 319 global user pages ([[m:Synchbot|requested by Revi C.]]) 568005 wikitext text/x-wiki #REDIRECT [[User:Revi C.]] 88g0cv17whfgb1wkeh281mptujwtlut వాడుకరి చర్చ:-revi 3 156260 568009 452123 2026-08-02T15:44:26Z Pathoschild 319 global user pages ([[m:Synchbot|requested by Revi C.]]) 568009 wikitext text/x-wiki #REDIRECT [[User talk:Revi C.]] o9z79lcc9a9pfmqmrod5w3eyk4q9i0o పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/21 104 216423 568007 565353 2026-08-02T15:41:24Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568007 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>అతడు చెప్పినత్రోవ నాకార్యాఘటనంబు । జరుపవలె గాని తొందరపడుట తగదు॥ శాంతపడుమని రామచంద్రుండు లంకలో । నావిభీషణు దలచె నంతరంగమున॥ తనమదిని శ్రీరాముతలపు గొబ్బుననాటి । ఉలికిపాటున లేచి అలవిభీషణుడు॥ అనిలుండును నరుండు హరుడాదిగా గల్గు । మంత్రికోవిదులెల్ల మరి తన్ను గొల్వ॥</poem> {{p|ac|fwb}}విభీషణు డయోధ్యకు వచ్చుట</p> <poem>లంకాపురము దాటి లవణసముద్రము దాటి । ఆకాశమార్గమున నయ్యోధ్య కొచ్చె॥ వచ్చి శ్రీరాములకు వరుసతోడుత నూరు । సాష్టాంగదండములు సమకొల్పి యపుడు॥ సరస గూర్చున్నట్టి సౌమిత్రికిని మ్రొక్కి । బలురాఘవుని మహీపాలునిం బొగడె॥ శ్రీజానకీలోలశ్రితలోకపరిపాల | కరుణించు గుణశీల కరుణాలవాల॥ శరణు రవికులసోమ శరణు దనుజవిరామ । శరణు సన్నుతనామ శరణు రఘురామ॥ శరణు పరమానంద శరణు మూలముకుంద । శరణు పాపవినాశ శరణు లోకేశ॥ నాతపంబులు పండె నాకోరికలు నిండె । నీపదంబులు గంటి నేడు మాతండ్రి॥ బహుదినంబులకు నాపై జ్ఞాపకము వచ్చి । తలపు జేసితివి మాతండ్రి శ్రీరామ॥ నను దలంచను యెట్టిపని యేమిచందమో । కరుణతో శల విమ్ము కమలలోచనుడా॥ అని యిట్లు వినుతింప అపుడు రఘునాయకుడు । ఘనవిభీషణుని కౌఁగిలి నట్టె జేర్చె॥ మధురవాక్యంబులును మన్నించి తనవద్ద । నుచితాసనంబున నుండ నియమించి॥ భక్తపరాయణుడు పరమాత్ము డాతడు। తమతలవు యాతనికి క్రమముతో దెలిపె॥ మీయన్న రావణుడు నేను రణభూమిలో । భూమి నిర్భయముగా పోరాడలేద॥ అతనిబాణాతతుల మది గుందియుండంగం । మరి నీవు యాతనీమర్మకర్మములు॥ తెల్లంబుగా నీవు తెలుపగా దునిమితిని । రణరంగమున బట్టి రావణాసురుని॥ అన్న రావణుడని యభిమాన ముంచక । యతనిమర్మములెల్ల యేర్పరంచితివి॥ నీవంటి మిత్రుండు నీవంటిభక్తుండుఁ । గలడె లోకమునందు ఘనపుణ్యచరిత॥ ఓవిభీషణ నిన్ను నావగా జేసుకొని । సంగరాంబుధిమీద జాడ గంటినిగా॥</poem><noinclude><references/></noinclude> qropqetvxyobjn5y99r1qp62uoa44ij పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/22 104 216424 568024 565354 2026-08-02T21:27:25Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568024 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>నీమిత్రతను కార్య నెరవేరితిమి నాడు । గడచితిమి నాకార్యఘటన నీవలన॥ అంతకంటెను ప్రళయమై వార్తొకటి నేడు । సంభవించినది యావృత్తాంతమెల్ల॥ నీ కెరింగించుటకు నిన్ను రప్పించితిమి । విని నీవు దానిసాధనము యోచించు॥ నూరుశిరములును యిన్నూరుచేతులు గలిగి । పేరు శతకంఠుడట క్రూరుడట మిగుల॥ తాపసుల దేవతుల యేపు దొలగించునట । గోబ్రాహ్మణులను గగ్గోలు బెట్టునట॥ నిఖిలజీవక్షోభనిత్యంబు జేయునట । పాపసంచయములకు పరగబట్టునట॥ దేవతాస్త్రీల చర దెచ్చి తా నుంచెనట । గర్వాంధుడై కళ్ల గానకుండెనట॥ అతనిబాధల కోర్వ కరుదెంచి మునులెల్ల । వచ్చి నాతో జెప్పి వగచిరందరును॥ శరణు జొచ్చినమునుల కరుణించి దానవుని । హతమార్తునని వారి కభయంబు లిస్తి॥ మునుల వీడ్కొల్పి నేనును యేమి దోచకను । నీచే నెరుంగుటకు నిన్ను రావిస్తి॥ దానవునిసద్వర్తమానంబుయావత్తు । సాకల్యముగ జెప్పు నాకు దనుజేశ॥ అని రాము పలుకంగ హస్తములు జోడించి । వినుతించి శ్రీరామవిభుని కిట్లనియె॥ అమరేంద్రుచేతివజ్రాయుధముతోడను । పర్వతం బొక టెదుర్పడ నిలువగలద॥ కఠినవాలాభీలకంఠీరవముతోడ । యెన యిచ్చి పోరుటకు నేనుగకు వశమ॥ ప్రళయవాయువ కెదుట బలమెంత గలిగున్న । కొంచెపుమబ్బు మార్కొని నిలువగలది॥ భూరిప్రచండమౌ ఘోరానలముతోడ । నెరి శుష్కదహనంబు నిలువంగగలడ॥ వరములెన్నియు గొనినవా డెంతవాడైన । నీతోను నెదిరించి నిలువంగగలడ॥ పరమాత్మ నీఘోరబాణాగ్నిలోపలను । పొలచి పటుచూర్ణమై పోక నిలవగలడా॥ కాని దైత్యునిపరాక్రమము ధైర్యము జయము । ఘనసాహసము విక్రమము నెన్నగాను॥ బ్రహ్మదేవునికైన పాటి గాకుండును । పగవాని మీయదుట పొగడంగ దగదు॥</poem> {{p|ac|fwb}}విభీషణుడు శతకంఠునివృత్తాంతము జెప్పుట</p> <poem>అడిగినందుకు రాక్షసాధీశువృత్తాంత । మెరిగింతు మీకు నే నెరుగున్నరీతి॥</poem><noinclude><references/></noinclude> 2cp4x1tuq2p5ju8kmfn8sgjo2p41kw8 పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/23 104 216425 568025 565355 2026-08-02T21:47:40Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568025 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>క్రూరరాక్షసు డున్నవూరు ప్రతాపం । కాపురం బది యలకాపురము బోలి॥ నేటైన తొమ్మిదికోటలును గలిగుండు । జలపూర్ణమగునగడ్తలు తొమ్మి దుండు॥ బ్రహ్మరుద్రాదుల కభేద్యమై వర్తిల్లు । అదిగాక మంత్రికోవిదులు పదిమంది॥ స్థూలగళదుర్ముఖాసూర్పకర్ణగజాశ్వ । ముఖసింగళాక్షధూమ్రాక్షరక్తాక్ష॥ యోజనహస్తుండు యొగి దీర్ఘజిహ్వుండు । మొదలైనమంత్రులు పదిమంది గలరు॥ అందు నొక్కొక్కప్రధానికి యేనూరు । కోట్లదెత్యావళులు గొలిచియుండెదరు॥ కాలమృత్యువునైన కదలిపోనీవకుండ । బరిమార్పజాలుదురు భండనంబునను॥ ఘనభుజులు యొక్కపెట్టున కదలివచ్చిన । పదునాల్గులోకములు బరిమార్చగలరు॥ వారి కధిపతి యగుచు వరములన్నియు బడసి । హరిహరాదుల తృణీకరము జేయుచును॥ చండదోర్దండుడై శతముఖనాముడై । అభేద్యుడై య్యుండు నఖిలజగములకు॥ నేను మిమ్ముల గలసి నెరి రావణాదులను । దునిమించినా ననుచు దొడరి కోపమున॥ నను జంపవలెననుచు మనసు నుద్దేశించి । వైరంబుచే నుండు వాడు నామీద॥ ఎపుడు జనుదెంచునో యేత్రోవ వచ్చునో । యని దిశలపై జూతు నన్నివేళలను॥ మది గుండె బెగడుచును మార్కొనగజాలకను । తారకాచలగుహల దాగి నే నుందు॥ ఏవిధిని జూచినా రావణుకు వానికీ । మదిని దలపగ హస్తిమశకాంతరంబు॥ గాన శతకంఠుని గడతేర్పలే రెవరు । నీవు దునుమాడవలె దేవాధిదేవ॥ హనుమంతు మొదలైనవనచరానీకములు । రప్పించు వేగమున రవికులోత్తముడ॥ నిక్కముగ దానవుడు నీచేత గడతేరు । సమరయత్నము వేగ జరిగించు స్వామి॥ అని విభీషణు పలుకునపుడు శ్రీరాఘవులు । మరికొంత దలపోసె మరి యిట్లు బతికె॥ పూని దనుజుని దృంపపూనితిని నే నిపుడు । ఏవిధంబున గూల్తు నిలపైని వాని॥ ఈసైన్యముల నెల్ల నేరీతి నడిపింతు । నేవిధిని దాటింతు నీవార్ధులెల్ల॥ ఏలాగు రక్షింతు నెల్ల యోగీంద్రులను । ఇక దేవతాభయం బెట్లు వారింతు॥ అని యాత్మ దలపోసి యాలక్ష్మణు జూచి । మనము శంకింపంగ పని లేదు యికను॥</poem><noinclude><references/></noinclude> cngf3rjpvd3fu2kjkf5z6cdb4c0682u పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/24 104 216426 568029 565356 2026-08-02T22:42:22Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568029 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>అనుచు ధైర్యము దెచ్చుకొని రామచంద్రుండు । ఆంజనేయుని దలచె నాత్మలోపలను॥ తలచినంతటిలోన తలపు మదిలో నాటి । హనుమంతు గుణవంతు డధికబలవంతు॥ గంధమాదననగము కడువేగమున డిగ్గి । పరుగున శ్రీరామభద్రుదరి జేరి॥</poem> {{p|ac|fwb}}హనుమంతుడు రామునికడకు వచ్చుట</p> <poem>పరుగున శ్రీరామభద్రుసన్నిధి జేరి । పాదారవిందముల బడి మ్రొక్కి నిలచె॥ కరయుగంబులు మోడ్చి శిరముపై బెట్టుకొని । భజన చేయదొణంగె పవననందనుడు॥ ఆదినారాయణా ఆపన్నపోషణా । కౌసల్యనందనా కలుషసంహరణా॥ పరమాత్మ బ్రహ్మాదికరుణాపయోనిధీ । దానవసంహార దశరథకొమార॥ ఏమిపనికై నన్ను యిటు తలపుజేస్తిరో । శలవిమ్ము నా కిపుడు జానకీరమణ॥ కాలమృత్యువునైన కదసి ముక్కలు గోసి । చిడిముడిపాటుతో జిదిమి వేసెదను॥ ఏడువారాశులును యేకముగ దాటెదను । కోరి బ్రహ్మాండములు జూరలాడెదను॥ సకలబలముల నెల్ల సప్తసముద్రములన్ని । దాటింతు నాభుజాదర్పబలమునను॥ ధాతజంధ్యము బట్టి తగ దెంచివేతును । కులపర్వతములన్ని గూల్చివేయుడును॥ పని యేమి నను బిల్వ పరమాత్మ శలవిమ్ము । సలుపుదే కార్యంబు సందేహమేల॥ అనుచు హనుమంతుండు అసమానవిక్రముడు । పలుకు లవలోకించి పరమాత్ము డపుడు॥ ఆలింగనము జేసి అతని కుశలం బడిగి । మన్నించి వోయి హనుమంతుడా నీవు॥ పలుమారు నీపరాక్రమము నే నెరుగనా । నీవు జెప్పగవలదు నీప్రభావములు॥ ఆత్మబంధుడవు మా కన్నికార్యములందు । నీవు మాకార్యములు నిర్వాహకుడవు॥ అలసివచ్చితివి నీయలసటంతయు దీర । విడది కరిగి సుఖించు విఖ్యాతచరిత॥ అని చెప్పి బహురత్నకనకగృహములలోకి । హనుమదాహ్వయు ననిపె ఘనుడు శ్రీరాము॥ ఆవిభీషణు గాంచి హనుమంతుచే మనకు । సర్వకార్యము లిపుడు సమకూడవలెను॥ మనకు నాతనిసాటి మరియెవ్వరును గారు । కార్యనిర్వాహకుడు ఘనుడు హనుమంతు॥</poem><noinclude><references/></noinclude> 9w18cbjwpn746xno80e7gvl5x1rk7c9 పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/25 104 216427 568032 565357 2026-08-02T23:22:17Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568032 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>అనుచు నిష్టాలాపముల విభీషణు గూడి । ఆరాత్రి ప్రొద్దుచ్చియవనినాయకుడు॥ మరునాటియుదయమున మహిమతో సంధ్యాది । క్రియలు నిర్వర్తించి రయము మీరగను॥ గురుతు మీరగ నగ్నిహోత్రకృత్యము నెరపి । గురుపిత్రుపూజలు కొమరొప్పజేసి॥ ధరణీసురులకెల్ల తాంబూలములు నిచ్చి । ఆశీర్వదాక్షతలు అతిభక్తి గొనుచు॥ హితమంత్రి తనపురోహితబంధువు గొల్వ । ననుజుపరివేష్టితుం డగుచు శ్రీరాము॥ నవరత్నసింహాసనంబుపై గూర్చుండి । హనుమంతు బిలిపించి యతి గారవించి॥ తాను విభీషణుడు తగ ముగ్గురును గూడి । గతకార్యములు కొన్ని కలియబలుకుచును॥ రావణకుంభకర్ణాదిదానవమహ । భండనగతులన్ని పలుమారు దలచి॥ మారుతి గొనియాడి మరికొంత ప్రొద్దుచ్చి । శతకంఠుసంగతులు సాకల్యముగను॥ హనుమంతు కెరిగింపుమని విభీషణుతోడ । కనుసౌంజ్ఞ గావించె కమలలోచనుడు॥ శతకంఠుజన్మంబు అతనితపోమహిమ । బ్రహ్మచే వరములును బడయచందంబు॥ దేవతాముని బాధ గావించు చందంబు । అతనికోటలు పరిఘావిశేషములు॥ ద్వారరక్షక గొప్పదానవప్రముఖంబు । బలురాక్షసేంద్రుమంత్రులప్రభావములు॥ కరతలామలకముగ ఘనుడు తా నెరిగింప । విని పవననందనుడు వినువీథి ముట్టె॥ పెన్నిధానము గన్న పేదచందము బోలి । కుప్పిగంతులు వేసికొని యాడుకొనుచు॥ బలుడు శ్రీరాఘవునిపాదారవిందములఁ । బడి మ్రొక్కి పలుమారు బ్రస్తుతులు జేసె॥ అన్న రాఘవ నీమహాత్మ్యంబుచే బంట । నున్నవాడను దైత్యు నెన్న బనిలేదు॥ శతకంఠు డన నెంత గతజీవునిగ జేసి । పడవేతు మీయెదుట ఘడియలోపలను॥ అది యటన్న వినుండి యనలాక్షు డగుశివుని । శక్తి నాయందునను చెలగుచుండగను॥ పాయకను నాతండ్రి వాయుదేవునివల్ల । జవసత్వబలములును చాలగా గలవు॥ అసురు డన నెంత మీయాజ్ఞ నాతల నుంచి । వాని నిముషములోన ప్రాణములు గొందు॥ శరనిధులు దాటుటకు శక్తి చాలదటంచు । తడవగా నేమిటికి దనుజసంహరుడ॥</poem><noinclude><references/></noinclude> 5t4unfs03ojoi1hxlvz1h9777k1pmto పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/26 104 216428 568033 565358 2026-08-03T00:05:13Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568033 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>వాలంబుపై సేన వొక్కనిమిషములోన । దాటింతు వారధులు తప్పకుండగను॥ నిజము నామాటలు నీపాదములు సాక్షి । యిక మీరు మది సంశయింప బని లేదు॥ నారూపమంతయును మీరు కన్నుల జూచి । నమ్ము డటుమీదైన నారాయణుండ॥ నారాయణుడ మిమ్ము నమ్మజాలకముందు । కపిరాజు సుగ్రీవు తపసనందనుడు॥ దాఖలా జూచుకోదలచి మీతో నతడు । విన్నపము గావింపవే వేగ తమరు॥ సప్తపాతాళము లొక్కసరసగా దునిమితిరి । దుందుభికళేబరము దూల మీటితిరి॥ ఘనశరంబున వాలి దునుమాడగలవంచు । నటమీద మిమ్ములను నాశ్రయించెనుగా॥ ఘనుడ మీవంటివారిని నమ్మగా లేక । దాఖలా జూచుకొనె తపననందనుడు॥ రూపబలవిక్రమము యేపంత గనుగొనగ । నను నమ్ముటకు మీకు మన సెట్లు గలుగు॥ అగపరతు నాయందు తగినరూపంబు రా । శలవొసగుమని రామచంద్రుతో ననియె॥ రామచంద్రుం డంత ప్రేమతో శల వొసగి । అంజనీతనయుడిని అతిగారవించె॥ మనసేకముగ జేర్చి అనలనేత్రుని గూర్చి । బలుతపం బొనరించె పవననందనుడు॥ ఘటికాదశక మొక్కకరణి శంభో యనుచు । ప్రార్ధనలు గావించె పవననందనుడు॥ తనపుత్రునిపైని దయ బుట్టి శంభుండు । ప్రత్యక్షమై నిలచె భళిభళీ యనుచు॥ ప్రమథగణములతోడ ప్రత్యక్షమై నిలచె । పవనునందనునెదుట పార్వతీశ్వరుడు॥ ప్రత్యక్షమై యున్న పార్వతీవిభు గాంచి । ప్రస్తుతులు గావించె పపననందనుడు॥ శ్రీరాముకార్యంబు జయము గావించుటకు । నేనె చాలుదు ననుచు నిర్వహించితిని॥ విలయకాలమునాటివిశ్వరూపము నాకు । తక్షణంబున మీరు దయసేయవలెను॥ అని పవనజుడు బలుక నారీతి వర మిచ్చి । జనియె కరకంఠుండు తనగిరీంద్రమునకు॥</poem> {{p|ac|fwb}}హనుమంతుడు విశ్వరూపము జూపుట</p> <poem>వర మిట్లు గొని శుభాకరు డగుచు హనుమంతు । వచ్చి నిలచెను వేగ వసుధీశునెదుట॥ తనదీర్ఘవాలంబు నినరథంబున కొక్క । కేతనంబుగ బెంచె ఖ్యాతి మీరగను॥</poem><noinclude><references/></noinclude> e5i76y9giylw2a1l8z0poq7vqq42n0j పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/27 104 216429 568036 565359 2026-08-03T02:23:31Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568036 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>తనమోము సత్యలోకనివాసుడగు బ్రహ్మ । దరిజేరి ముద్దాడుకరణి నుండెనుగా॥ తనదుపటుదీర్ఘదోర్దండప్రభావంబు । దిగ్గజంబులకెల్ల మ్రొగ్గతిలజేయు॥ తనమహాకాయంబు ధరణి యాకాశంబు । బ్రహ్మాండములు నిండి పరితపించెనుగ॥ తనమహాప్రఖ్యాతి దనరు ముల్లోకములు । తనభారమునకు భూతలమెల్ల వణకె॥ మొలపూసలుగను చుక్కలు చుట్టు నిలువగ । నిలచె హనుమంతుండు నింగిపొడవునను॥ పెరిగె లోకములెల్ల విరిగె భీతి గొనంగ | ప్రళయకాలమురుద్రుపగిది బోలుచును॥ మరియు పక్షములందు మాధవుడు ముఖమందు । అనలదేవుడు శిరము నమరనాయకుడు॥ చెక్కులను అశ్వినులు చరణూరుమధ్యమున । సర్వనివింపులు సాధ్యకిన్నరులు॥ గరుడగంధర్వులును ఘనసిద్ధగణములును । గనుపించి రొక్కపెట్టున నుజ్వలముగ॥ అతియపారావారవిస్తారగంభీర । దివ్యదేహుం డిట్లు తేజరిల్లెనుగ॥ ఆమహామహురూప మపుడు జూడగ లేక । యెల్లజగములు చాలతల్లడిల్లిరిగ॥ మది వికలపడుచు సుమంతాదిమంత్రులును । నిలువు నీరై పోయి నిర్ఘాంతులైరి॥ తక్కియుండిన దొరలు తలవెత్తగా వెరచి । కంపమును బొందుచును కడుభీతి పడిరి॥ భరతశత్రుఘ్నులు బలులక్ష్మణుఁడును । యుగ్రరూపము జూడనోపలేరైరి॥ రాఘవేంద్రుం డతనిరౌద్రరూపము జూచి । ఆశ్చర్యహృదయుడై ఆత్మ నిట్లనియె॥ ఇతనిసహాయమున శతముఖుని బరిమార్చి । జయము నొందుదు నింక సంశయము లేదు॥ సంశయంబులు బాసె శతకంఠు దునుముటకు । తపనునందనుమహాధైర్యంబువలన॥ ఆకపీంద్రుని జూచి హనుమ దా నీరూపు । గని చూడ నెవ్వరికి దగ శక్యమగునా॥ నీమహోన్నతరూపు నేను జూడగ లేను । మరియవరు నిల గలరు మర్కటేశ్వరుడు॥ నీది పుట్టినరూపు నిజముగా గైకొనుము । కార్యనిర్వాహకము కలదు నీవలన॥ ఇంతవాడ వటంచు నెరుగ నెప్పుడు మదిని । కంటి నిప్పుడు నీదుఘనపరాక్రమము॥ అని రామచంద్రుండు నతనితో బలుకంగ । తనదు యెప్పటిరూపు దాల్చె హనుమంతు॥</poem><noinclude><references/></noinclude> 8zkx7flv7sd6pov6sevfeafc2sz6bu3 పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/28 104 216430 568037 565360 2026-08-03T03:57:38Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568037 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>తనదుయెప్పటిరూపు దాల్చి శ్రీరాములకు । దండప్రణామంబు నిండార జేసె॥ జనులంత తను బొగడ హనుమంతు గుణవంతు । ఆవిభీషణుచెంత నపుడు గూర్చుండె॥ మానవాధీశుండు మరి మరియు హనుమంతు । మహిమ దెలుపుచునుండె మరి యంతలోన॥ పవనజుడు తనను మునుపటివలెను మ్రింగునో । యనుచు హస్తాద్రికి నినుడు గ్రుంకెనుగా॥ మరికొంతసేపటికి మానవాధీశుండు । కొలువు చాలించి దిగ్గున లేచి యపుడు॥ అలరు సంధ్యానుష్ట ఆహ్నికంబులు దీర్చి । అనిలజువిభీషణుల నపుడు గూడుకొని॥ తాను సహోదరత్రయముగా నవ్వేళ । పఙ్క్తిని పంచభక్ష్యాన్నములు మెసగి॥ అతిగౌరవంబుతో నందరు కర్పూర । తాంబూలములు జేసి తదనంతరమున॥ సత్కరుణతో విభీషణునిసరగున జూచి । నీవు యీకార్యంబు నెర వేర్చవలెను॥ పని బూని చతురంగబలసమేతుండవై । మార్తాండువలె నీవు మరి వేగ రమ్ము॥ నీవు రావలెనంచు నిర్నయించియు తాను । దివ్యాంబరంబులను దెప్పించి యిచ్చె॥ మహనీయతడకనకమణిభూషణంబులును । సమ్మదమ్మున నిచ్చి పొమ్మనుచు బలికె॥ శలవు గైకొని విభీషణుడు లంకాపురం । బునకు యతిత్వరగతిని జనియె నవ్వేళ॥ హనుమంతు గని మానవాధీశు డావేళ । మేల్మి తనకంఠమున మెరయుచున్నట్టి॥ దివ్యమణిహారంబు దీసి కపినాయకుని । గళమునందును వైచె కరుణ రంజిలగ॥ నీవు సౌమిత్రియును నేర్పుతో కిష్కింధ । కరిగి యీచందంబు క్రమముగా జెప్పి॥ అఖిలవానరసమేతంబుగా సుగ్రీవు । నిటకు దోడ్కొనిరండు యిపుడు జనుదెంచి॥ ఆమాటలకు మోదమంది లక్ష్మణమూర్తి । అన్నపాదంబులకు నతిభక్తి మ్రొక్కి॥ శలవు గైకొని హనుమసహితుడై కిష్కింధ । కరిగి సమస్తరాజ్యము లన్ని గడచె॥ తక్కినభరతశత్రుఘ్నులబొడ గాంచి । మీ రిద్దరును వేగ వీరాత్ము లగుచు॥ కాంభోజమళయాళకర్నాటకోసల । కుకురకేయూరాదికురుదేశములును॥ అంగవంగకళింగయవనాదిచప్పన్న । దేశాధిపతుల కీతెర గెల్ల జెప్పి॥</poem><noinclude><references/></noinclude> 8xovd75k3t0tgthx2u2jp40txr1p7z8 పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/29 104 216431 568038 565361 2026-08-03T04:16:26Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568038 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>వారిబలములతోడ వారి దోడ్కొని వేగ । రమ్మనుచు శలవిచ్చె రవికులాధిపుడు॥ అన్నకు బ్రణమిల్లి ఆభరతశత్రుఘ్ను । లెల్లరాజుల బిల్వ నేగి రావేళ॥ అంతఃపురము కేగి అపుడు శ్రీరాఘవులు । హంసతూలికతల్పమందు వేడుకను॥ తత్ప్రకారములు సీతకు దెలియజెప్పుచును । నయ మొప్ప నారాత్రి నాల్గుయామములు॥ సీతాసమేతుడై శ్రీరాము నిద్రించె । అతిచీకటులు బర్వె నంతరిక్షమున॥ కలువలు వికసించె కమలము ల్ముకుళించె । జారచోరాదులకు సంతోషమయ్యె॥ వెలసె చుక్కలు మింట బలుక్రూరజంతువులు । భూత భేతాళములు భూమిపై వెలసె॥ మరికొంతసేపటికి మలయగాడుపు వీచె । కొమరు మీరంగ వేకువచుక్క బొడచె॥ కోడిపుంజులు గూసె కుక్కురోకో యంచు । కావుకావని గూసె కాకసంఘములు॥ బరువడిని మేతలకు పక్షిగణములు చెదరె ॥ తపనుడును దూరె తూరుపు తెల్లవారె॥ అంతకంటెముందు ఆరాఘవుడు లేచి । కూర్మి వెలయగ నుదయకృత్యములు దీర్చి॥ గురుమంత్రులకు మొక్కి కోటిబ్రాహ్మణులకును । వెలయంగ కర్పూరవిడియంబు లిచ్చె॥ భూషణాంబరము లింపొందుగా ధరియించి । మంత్రివర్గము గొలువ మనుజనాయకుడు॥ రత్నాలగద్దెపై రాణింప గూర్చుండి । దనుజబలములు గొలువ దగవిభీషణుడు॥ సకలవానరసైన్యచయముతో సుగ్రీవు | ధీరబలములు గొలువ దేశాధిపతులు॥ ఎప్పు డరుడెంతురో యెపుడు గనుగొందునో । యెపుడు శతముఖు బట్టి యేపుమాపుదునొ॥ అని పలువిధంబులను గొని నిరీక్షింపుచును । దీక్ష గైకొనియుండె దేవదేవుండు॥ తనగురువశిష్ఠు చెప్పినరీతివాక్యములు । వినుచు పేరోలాగమున నుండి రంత॥</poem> {{p|ac|fwb}}విభీషణుడు సైన్యములతో నయోధ్య కరుగుట</p> <poem>అలవిభీషణుడు లంకాపురంబున కేగి । తనబంధుమంత్రులను తగబిలిచి యపుడు॥ ఇచటివృత్తాంతంబు యింపుగా వారితో । నెరిగించి మరియు తా ని ట్లనుచు బలికె॥ ఈసమయమున మనము యినకులాధీశునకు । దోడుగ యుద్ధముకు దోపగావలెను॥</poem><noinclude><references/></noinclude> 6tannn32oiue6p07prhwekoulnsjtfc పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/30 104 216432 568039 565362 2026-08-03T04:38:47Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568039 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>ద్వాదశాక్షోహిణీదనుజబలములతోడ । మీరు పన్నిద్దరును ధీరతను వెలయ॥ మంత్రికోవిదులార మానసము దీపింప । ధంధణలు వెలయంగ దర్లు డీవేళ॥ దారపుత్రభ్రాంతి దనరియుండినవారు । రాదగదు నావెంట రాకుండ నిలుడీ॥ తనయాయుధంబులే తనప్రాణముగ జూచి । నడువజొచ్చినవారు నడువంగవలెను॥ బ్రతుకుపై యాసలు బడియున్నవారెల్ల । భండనంబునకు రాకుండుటే మంచి॥ వచ్చి మరి పోవుట వలదు యపకీ ర్తిదియు । మొదటనే రాకుండు టదియ మహమంచి॥ అని విభీషణు డపుడు తనమంత్రులతో బలుక । మహిమ దీపింపంగ మంత్రు లిట్లనిరి॥ తగున విభీషణా తమ రిట్లు బలుకంగ । మానసము భుజబలిమి మమ్ము నెరుగుదురు॥ జంఝానిలము నైన సమయింపజేసెదము । మృత్యుదేవత నైన మ్రింగివచ్చెదము॥ ఆదిశేషువుకోర లటు బెరికివేసెదము । నేల నింగియు బట్టి ధూళి జేయుదుము॥ అసమానబలశాలులము మాకు నెదు రెవరు । దాటుదుమె మీయాజ్ఞ దానవేంద్రుండ॥ అని వారు యుద్ధప్రయత్నసన్నాహులై । డంబుగా ఘోరకాండంబు లేర్చుచును॥ ముసలములు ప్రాసములు ముద మొప్ప బట్టుకొని । వడివడిని పయనమై గడుముదంబునను॥ కరిరథభటతురగకరవాలములుతోడ । పోరి వచ్చెద మనుచు పొంగుచుండిరిగ॥ భేరీమృదంగగంభీరభాంకారములు । జగతీతలంబంత చెలగియుండగను॥ తమతమధీరతలు తగ చాల జూపుచును । నీలుడును హరుడును నెరయ సంపాతి॥ వజ్రజిహ్వుండును వరశూలముఖుడును । కపిలకేశుండును కపిలవక్త్రుండు॥ మొదలుగా గలయట్టి పదియిద్దరును మంత్రి । వరులాయుధములతో వరుసతోడుతను॥ ద్వాదశాక్షోహిణీదనుజబలములతోడ । వచ్చి నిలచిరి దనుజువల్లభునియెదుట॥ వారినందరి జూచి ధీరుడు విభీషణుడు । మరి దయారస మొప్ప మన్నించి చాల॥ మన్నించి ధనకనకమణిభూషణంబులు । దానవులందరికి తగినట్టు లిచ్చె॥ అంతఃపురము కేగి ఆలోన తనతల్లి । కైకసికిని మ్రొక్కి ఘనుడు దనుజుండు॥</poem><noinclude><references/></noinclude> 8u5xr0ybcxwvurjrzw92nsyioftzg7z పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/31 104 216433 568040 565363 2026-08-03T04:57:32Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568040 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>రణప్రయాణం బెల్ల వినుపింప కైకేసి । కొడుకు నక్కున జేర్చి కొమ్మ తా ననియె॥ శ్రీరాముకార్యంబు జయము బొందగ జేసి । విజయుండవై నీవు వేగరా కొమరా॥ కడుజయము లొదవంగ కాంత తా పలుమారు । దీవించి యక్షతలు దేవి తా నిచ్చె॥ దీవనాక్షత లంది ధీరు డచ్చట వెడలి । పరమపతివ్రత సరమ తనదేవి॥ గని యుద్ధగమనంబు కాంతకును జెప్పంగ । విని సరమమహదేవి విభుని కయ్యెడను॥ వేవేగ దూర్వాక్షతావీడియము లిచ్చి । కదనమందున జయము గలిగి రమ్మనుచు॥ విజయులై తా మిటకు వేగమే రమ్మనుచు । దండప్రణామములు తాను గావించె॥ సతిని వీడ్కొని రత్నసహితమౌ షోడశ । చక్రశోభిత మగుచు చెలువొందు రథము॥ అలకుబేరరథంబునను తాను గూర్చుండి । వందిమాగధులు కైవారంబు సేయ॥ పణవఢక్కావాద్యధ్వనులు చెలగగ వెడలె । లంకాపురంబు నిశ్శంకతో నపుడు॥ పదియు రెండక్షోణిబలము లొప్పుగ నడువ । దినదినక్రమము నాదేశములు నడచె॥ మహదరణ్యంబులు మరి తటాకంబులు । పర్వతంబులు గడచె ప్రౌఢి మీరగను॥ నదులు నిధులును గడచి నగరభూములు గడచి । దరి జేరి సాకేతపురిప్రాంతమునకు॥ తనరాక రామచంద్రుని కెరింగించుమని । తనప్రధానుల బంపె ఘనవిభీషణుడు॥ దనుజవల్లభునాజ్ఞ గొని మంత్రిపుంగవుడు । జానకీనాయకుని జేరంగ నరిగె॥ గద్దెపై గూర్చున్న కమలనాభుని గాంచి । సాష్టాంగదండములు సమకొల్పి యపుడు॥ కరుణాపయోనిధి కౌసల్యనందనుడ । కాకుత్స్థకులవంశ కమలాయతాక్ష॥ భవదాజ్ఞ దప్పకను బలుడు విభీషణుడు । చతురంగబలము యుద్ధతి వెంట గొల్వ॥ ద్వాదశాక్షోహిణీదనుజబలములు గొల్వ । వచ్చి నిల్చె నయోధ్యపశ్చమంబునను॥ అనుచు దైత్యుడు దెలుప నంభోజనాభుడు । కనకమణిహారంబు కంఠంబుపై వేసి॥ అతనికుశలం బడిగి ఆదరించెనుగ॥ బలము లుండుట కొక్కబాహ్యస్తలము చెప్పి । నిఖిలబలములయందు నియమింపజేసె॥ ఘనవిభీషణు కొక్కకనకగృహ మేర్పరచి । అతని నుండగజేసె నవనినాయకుడు॥</poem><noinclude><references/></noinclude> oqt2sz31fp8zz74of9yjjmyj5dehulk 568041 568040 2026-08-03T04:58:28Z దేవీప్రసాదశాస్త్రి 4290 568041 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>రణప్రయాణం బెల్ల వినుపింప కైకేసి । కొడుకు నక్కున జేర్చి కొమ్మ తా ననియె॥ శ్రీరాముకార్యంబు జయము బొందగ జేసి । విజయుండవై నీవు వేగరా కొమరా॥ కడుజయము లొదవంగ కాంత తా పలుమారు । దీవించి యక్షతలు దేవి తా నిచ్చె॥ దీవనాక్షత లంది ధీరు డచ్చట వెడలి । పరమపతివ్రత సరమ తనదేవి॥ గని యుద్ధగమనంబు కాంతకును జెప్పంగ । విని సరమమహదేవి విభుని కయ్యెడను॥ వేవేగ దూర్వాక్షతావీడియము లిచ్చి । కదనమందున జయము గలిగి రమ్మనుచు॥ విజయులై తా మిటకు వేగమే రమ్మనుచు । దండప్రణామములు తాను గావించె॥ సతిని వీడ్కొని రత్నసహితమౌ షోడశ । చక్రశోభిత మగుచు చెలువొందు రథము॥ అలకుబేరరథంబునను తాను గూర్చుండి । వందిమాగధులు కైవారంబు సేయ॥ పణవఢక్కావాద్యధ్వనులు చెలగగ వెడలె । లంకాపురంబు నిశ్శంకతో నపుడు॥ పదియు రెండక్షోణిబలము లొప్పుగ నడువ । దినదినక్రమము నాదేశములు నడచె॥ మహదరణ్యంబులు మరి తటాకంబులు । పర్వతంబులు గడచె ప్రౌఢి మీరగను॥ నదులు నిధులును గడచి నగరభూములు గడచి । దరి జేరి సాకేతపురిప్రాంతమునకు॥ తనరాక రామచంద్రుని కెరింగించుమని । తనప్రధానుల బంపె ఘనవిభీషణుడు॥ దనుజవల్లభునాజ్ఞ గొని మంత్రిపుంగవుడు । జానకీనాయకుని జేరంగ నరిగె॥ గద్దెపై గూర్చున్న కమలనాభుని గాంచి । సాష్టాంగదండములు సమకొల్పి యపుడు॥ కరుణాపయోనిధి కౌసల్యనందనుడ । కాకుత్స్థకులవంశ కమలాయతాక్ష॥ భవదాజ్ఞ దప్పకను బలుడు విభీషణుడు । చతురంగబలము యుద్ధతి వెంట గొల్వ॥ ద్వాదశాక్షోహిణీదనుజబలములు గొల్వ । వచ్చి నిల్చె నయోధ్యపశ్చమంబునను॥ అనుచు దైత్యుడు దెలుప నంభోజనాభుండు । కనకమణిహారంబు కంఠంబుపై వేసి॥ అతనికుశలం బడిగి ఆదరించెనుగ॥ బలము లుండుట కొక్కబాహ్యస్తలము చెప్పి । నిఖిలబలములయందు నియమింపజేసె॥ ఘనవిభీషణు కొక్కకనకగృహ మేర్పరచి । అతని నుండగజేసె నవనినాయకుడు॥</poem><noinclude><references/></noinclude> rtf2et86hikhscghf62m85zqgas4ny7 సూచిక:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu 106 217212 567972 567796 2026-08-02T13:23:56Z Rajasekhar1961 50 567972 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[ఆత్మకథ]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ|మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ]] |అనువాదకులు=[[రచయిత:వేలూరి శివరామ శాస్త్రి]] |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=[[రచయిత:కాశీనాథుని నాగేశ్వరరావు]] |చిరునామా= |సంవత్సరం=1931 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=djvu |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 1="ముఖచిత్రం" 2="ప్రవి" 3to6="విసూ" 7to8="సూచన" 9=1 20=- 21=half-title 22=- 23=1 35=17 /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} 0jrrglji3vi2qnpbuerzz2645khtc3s పుట:Matrumurthi padya sathakam.pdf/29 104 217321 567960 567820 2026-08-02T12:01:14Z VISWALYRICS 7377 567960 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="VISWALYRICS" /></noinclude>{{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>అవని సంపదైననధికారమైనను పూజ్యమైన ప్రభుని రాజ్యమైన అమ్మతనము కన్ననత్యుత్తమము కాదు మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=81}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>అమ్మ మనసు విరిచి యమ్మనే మరిచిన పుత్రుడధముడగును పుడమి పైన అధముడైన గాని ప్రధముడందువు వాని మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=82}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>ఆపదెంతయైననవసరమేదైన అమ్మ నీవెయున్న నభయమగును అట్టియాత్మ శక్తియమ్మకే సాధ్యము మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=83}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>పుడమి భాషలన్ని వడకట్టి వెదకిన జనని పదముకెపుడు సమము లేదు అమ్మయనెడి మాట అమృతతుల్యమగును మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=84}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>అవనియందునీవె యనురాగదేవత అలుపెరుగనియోర్పువమ్మ నీవు నీదు ప్రేమ దొరుకు నీవద్ద మాత్రమే మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=85}}<noinclude>{{rule}} {{rh|మాతృమూర్తి శతకం|28|గొట్టాపు శ్రీనివాసరావు}}</noinclude> c03ayzldx4zgu0lj2j3wgk3u17l0e86 567961 567960 2026-08-02T12:01:32Z VISWALYRICS 7377 /* అచ్చుదిద్దారు */ 567961 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="VISWALYRICS" /></noinclude>{{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>అవని సంపదైననధికారమైనను పూజ్యమైన ప్రభుని రాజ్యమైన అమ్మతనము కన్ననత్యుత్తమము కాదు మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=81}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>అమ్మ మనసు విరిచి యమ్మనే మరిచిన పుత్రుడధముడగును పుడమి పైన అధముడైన గాని ప్రధముడందువు వాని మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=82}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>ఆపదెంతయైననవసరమేదైన అమ్మ నీవెయున్న నభయమగును అట్టియాత్మ శక్తియమ్మకే సాధ్యము మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=83}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>పుడమి భాషలన్ని వడకట్టి వెదకిన జనని పదముకెపుడు సమము లేదు అమ్మయనెడి మాట అమృతతుల్యమగును మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=84}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>అవనియందునీవె యనురాగదేవత అలుపెరుగనియోర్పువమ్మ నీవు నీదు ప్రేమ దొరుకు నీవద్ద మాత్రమే మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=85}}<noinclude>{{rule}} {{rh|మాతృమూర్తి శతకం|28|గొట్టాపు శ్రీనివాసరావు}}</noinclude> 0fn31zd4b82mjsxji4aedlgcw52tj6u పుట:Matrumurthi padya sathakam.pdf/30 104 217322 567963 567821 2026-08-02T12:05:12Z VISWALYRICS 7377 /* అచ్చుదిద్దారు */ 567963 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="VISWALYRICS" /></noinclude>{{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>వెతికి వెతికి కంటి ప్రేమ జాడ కొరకు ఆర్తి తోడ తిరిగి యవనియంత తెలుసుకొంటినిపుడు తల్లియే ప్రేమని మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=86}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>భక్తి ధార వోసి భగవంతుని కొలిచి పూజ చేసి నేని పుణ్యమేది అమ్మ పాద పూజ యందు ముక్తి దొరకు మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=86}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>పూజలెన్నొ చేసి పుణ్యమున్ బొందినా దానధర్మములిడు దాతకైన నీదు సేవ యిచ్చు నిజమైన ముక్తిని మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=88}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>ఆదిశక్తి పోయెనాత్రిమూర్తులు పుట్ట తల్లి కోరునట్టి తనయు బ్రతుకు త్యాగమంటె నీవె తల్లి జగతియందు మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=89}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>అమ్మలేదు కనుక హరుడు భిక్షమడిగె గజపుతోలు తొడిగె గరళకంఠ కన్న తల్లియున్న కడగండ్లు ముట్టునా? మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=90}}<noinclude>{{rule}} {{rh|మాతృమూర్తి శతకం|29|గొట్టాపు శ్రీనివాసరావు}}</noinclude> sofypa9mfmbjap97ohbu9fzj1ltqg5g పుట:Matrumurthi padya sathakam.pdf/31 104 217323 567964 567823 2026-08-02T12:11:41Z VISWALYRICS 7377 /* అచ్చుదిద్దారు */ 567964 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="VISWALYRICS" /></noinclude>{{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>హరునిబోలి యమ్మ యాహారమిచ్చును హరిని బోలి యమ్మ సిరులు గూర్చు నలువ వోలె యమ్మ నాకుజన్మంబిచ్చె మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=91}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>దైవసేవ చేయ దైవమిలను లేడు తల్లి నీదు సేవ దైవసేవ నీదు సేవయిచ్చు నిజమైన మోక్షము మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=92}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>మాతృమూర్తి చాలు మాణిక్యమెందుకు అమ్మ నీవె చాలునాస్తులేల కన్నతల్లి సేవ కానుకౌ ధరణిని మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=93}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>అమ్మసేవ చేయు హస్తము హస్తము అమ్మపైన కల్గిననుగు ననుగు తల్లిగూర్చి చేయు తర్కము తర్కము మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=94}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>మ్రొక్కి లాభమేమి ముక్కోటి సురులకు మోక్ష సిద్ధి కొరకు దీక్షలేల అమ్మ నీదు సేవ యందించు మోక్షమున్ మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=95}}<noinclude>{{rule}} {{rh|మాతృమూర్తి శతకం|30|గొట్టాపు శ్రీనివాసరావు}}</noinclude> 0mm8ndzvn78snr3hq5xlv6375rfqt6p పుట:Matrumurthi padya sathakam.pdf/32 104 217324 567966 567824 2026-08-02T12:15:05Z VISWALYRICS 7377 /* అచ్చుదిద్దారు */ 567966 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="VISWALYRICS" /></noinclude>{{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>ఆపదైన చోట యమ్మా, తనయులున్న మాతృమూర్తి సుతుని మనికి గోరు త్యాగరూపినీవు తల్లి ధరణియందు మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=96}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>వేయి మార్లు కాశి వెళ్లి వచ్చిన నేమి వసుధ చుట్టు తిరిగి వచ్చెనేని అమ్మ కిడిన జోత కవనిని సమమేది? మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=97}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>మాతృసేవ జేసి మాతౄణముందీర్చి మహిని మెలగవలయు మాన్యమతిని ఇట్టి బుద్ధినిచ్చి యింపార మది బ్రోచె మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=98}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>తాటిచెట్టు వోలె తనువెంతయెదిగినన్ పరులసేవ కొరకు పాటుపడెడి బుద్ధి నాకు కలిగే భూమియంతను బూచు మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=99}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>పంచదార కన్న పట్టుతేనెయకన్న తేటతెలుగుకన్న తీపి కన్న నీదు పాదపద్మనిధియగు మధురంబు మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=100}}<noinclude>{{rule}} {{rh|మాతృమూర్తి శతకం|31|గొట్టాపు శ్రీనివాసరావు}}</noinclude> bwzml0jaytlqfagxv3x3smvfd3wjesd పుట:Matrumurthi padya sathakam.pdf/33 104 217325 567967 567825 2026-08-02T12:26:00Z VISWALYRICS 7377 /* అచ్చుదిద్దారు */ 567967 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="VISWALYRICS" /></noinclude>{{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>సురుల గణము కన్న సురరాజు కన్నను సృష్టికర్త కన్న సృష్టి కన్న జన్మనిచ్చు నట్టి జనని నీవె ఘనము మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=101}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>తల్లి నన్ను పెంచె దయతోడ ప్రేమగా ఉల్లమందునుండు తల్లి యట్టి తల్లిపైన పద్యమల్లుట కష్టమా? మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=102}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>ఇంటిలోని చాకిరెంత యున్ననుగాని కంటి నిండ కునుకు కానకుండ కంటి రెప్పలవలె కాంచి పెంచితివీవు మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=103}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>సురులు పొందలేరు సుకవియందుకొనడు వీరుడెంతయైన వీలుపడదు అమ్మ గొప్ప తనములార్యులకిల లేవు మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=104}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>ఈశ్వరుండు తపమునెవ్వరి కోసము ఆస్తి కొరకు గాదె యమ్మ కొరకు ధన్యతనొనగూర్చు తల్లి జపము సుమ్మి మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=105}}<noinclude>{{rule}} {{rh|మాతృమూర్తి శతకం|32|గొట్టాపు శ్రీనివాసరావు}}</noinclude> p6mc83i25hehw8ms280hps99e4smh8g పుట:Matrumurthi padya sathakam.pdf/34 104 217326 567968 567826 2026-08-02T12:29:01Z VISWALYRICS 7377 /* అచ్చుదిద్దారు */ 567968 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="VISWALYRICS" /></noinclude>{{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>అమ్మఘనతనెరిగి యాలకాపరి కూడ మోహినియయెనంట మోజు కలిగి నీదు వెతలు తెలిసి నీరజాక్షుడదిరె మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=106}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>ఎవరు నచ్చకున్న నెవరు నొచ్చుకొనిన తల్లి నీదు ప్రేమ తనయుడేను ఈశ్వరీచ్ఛ నొందు నేకదంతుడె సుమ్మి మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=107}} {{Telugu poem|type=ఆ.వె.|lines=<poem>ఆకలయిన వేళ యాహారమడిగిన పస్తులుండి యిచ్చి పాయసమ్ము కుడిపి నావు నీవు - కడుపార నాకును మరువలేను నిన్ను మాతృమూర్తి</poem>|ref=108}}<noinclude>{{rule}} {{rh|మాతృమూర్తి శతకం|33|గొట్టాపు శ్రీనివాసరావు}}</noinclude> 94puygbudjgjm5zmwe2rwqkgp1o7c8f పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/9 104 217415 568052 567720 2026-08-03T06:53:49Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 568052 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{rh|సంపాదక హృదయం సంపుటి:1 అమ్మనుడి మార్చి 2015}} {{p|fs150|ac}}రెండు తెలుగు రాష్ట్రాలూ తమ భాషావిధానాన్ని ప్రకటించాలి</p> ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రెండు రాష్ట్రాలైంది. ఏడాది కావస్తున్నా రెండు ప్రభుత్వాల అధినేతలూ తమ విద్యావిధానం ఏమిటో, భాషా విధానం ఏమిటో ప్రకటించలేదు. ఎన్నికల ప్రచార సమయంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాము అధికారంలోకి వస్తే ఒకటో తరగతి నుంచే ఇంగ్లీషు మీడియంలో చదువులు చెబుతామని అన్నారు. కానీ దాన్ని ఆధారం చేసుకొని అయినా ఇంతవరకు తమ విద్యావిధానాన్ని ఆయన ప్రభుత్వం ప్రకటించలేదు. ఇటు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ అంశాన్ని దాటవేస్తున్నారే తప్ప, ఎక్కడా స్పష్టంగా తమ భాషా విధానం ఏమిటో చెప్పలేదు. తెలుగు భాషోద్యమకారులు 2012లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా పెద్దఎత్తున ఉద్యమించి తెలుగుభాషా మంత్రిత్వశాఖను సాధించారన్న అంశాన్నే ఆంధ్రప్రభుత్వం మరచిపోయింది. సమైక్యరాష్ట్రంలో జీ.వో.నెం.909/31.12.2013న జారీ అయిన సంగతిని విస్మరించి తమ మొదటి బడ్జెట్ లో గతంలో వున్న యువజనాభ్యుదయం, పర్యాటకం, సాంస్కృతిక మంత్రిత్వశాఖ పేరిటనే కేటాయింపు ప్రకటించారు. ఆ శాఖలోనుంచి సాంస్కృతిక శాఖను విడదీసి భాష, సాంస్కృతిక మంత్రిత్వశాఖగా ఏర్పాటుచేశారన్న స్పృహే వారికి లేకుండాపోయింది. విచిత్రమేమిటంటే వారి ప్రభుత్వంలో భాషాసాంస్కృతిక శాఖకు ప్రత్యేకంగా మంత్రి వున్నారు! కాని బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదు! ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ భాషాసాంస్కృతిక మంత్రిత్వశాఖలున్నాయి. కాని, వారికి భాషావిధానమంటూ ఒకటి లేకపోవటం విచిత్రం. ఆ శాఖ ఏ విధానం ప్రకారం పనిచేస్తుందో అసలు ఆ శాఖ వున్నందుకు ఉపయోగం ఏమిటో అర్థంకాదు. ఈనాడు (ఫిబ్రవరి 21న) మళ్ళీ అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. యునెస్కో డైరెక్టర్ జనరల్ ఈ సందర్భంగా యిచ్చిన సందేశంలో మాతృభాషలతోనే ముందడుగు వేయాలని, గణితంతో సహా అన్ని పాఠ్యాంశాలు మాతృభాషలో నేర్పితేనే విద్యార్థులకు సరియైన జ్ఞానం అందించినట్లవుతుందని చెప్పారు. మాతృభాషలో విద్యాబోధన అన్నది ప్రాథమిక మానవహక్కు అని, అన్నిరకాల నిరంతర అభివృద్ధికి సరియైన, బలమైన శక్తి మాతృభాషేనని, యునెస్కో ప్రకటించింది. ఇలా 15 యేళ్ళుగా యునెస్కో మొత్తుకుంటూనే వుంది. మన రాష్ట్రప్రభుత్వాలు ఆర్భాటంగా ఉత్సవాలు జరిపి, వాగ్దానాలు కుమ్మరిస్తాయే తప్ప ఏదీ ఆచరణలోకి రాదు. మన పొరుగు రాష్ట్రప్రభుత్వాలకు భాషావిధానంలో స్పష్టత వుంది. అందువల్లనే కర్నాటక, తమిళనాడువంటి రాష్ట్రాలు ప్రగతిపథంలో వున్నాయి. ఇది తెలిసి కూడా మన ప్రభుత్వాలు దారికి రాకపోవడం వారి ప్రజాస్వామ్య వ్యతిరేకధోరణికి అద్దం పడుతున్నది. మనవి రెండూ తెలుగురాష్ట్రాలే. తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డానికి కారణం ఆంధ్ర, తెలంగాణలలో వెల్లువెత్తిన భాషాభిమానమే. తెలుగువారంతా ఒకే రాష్ట్రంలో వుండాలన్న తాపత్రయమే. ఎందరో<noinclude><references/> {{rule}} {{rh|తెలుగుజాతి పత్రిక అమ్మనుడి | మార్చి 2015|9}}</noinclude> d2kcf75g0dm1mrfitfcottp1b5wu724 పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/10 104 217417 568053 567722 2026-08-03T06:56:22Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 568053 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>ఎన్నో త్యాగాలు చేసినమీదట ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. కానీ ఈ 60 ఏళ్ళలో మన పాలకుల స్వార్థరాజకీయాల వల్ల విభజన జరిగి ఇప్పుడు రెండు రాష్ట్రాలయ్యాయి. సమైక్య రాష్ట్రంలో భాష విషయంలో ఎంత నిర్లక్ష్యం చేశామో, ఇప్పుడు కూడా అదే వైఖరి రాజకీయనాయకుల్లో కనిపిస్తున్నది. ఈ ధోరణి కొన్నేళ్ల తర్వాత ఈ రెండు రాష్ట్రాల విచ్ఛిత్తికి కూడా దారితీస్తే ఆశ్చర్యపోనక్కరలేదు. 60 యేళ్ళ క్రితం సంయుక్త మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పర్చుకోవాలనే ఉద్యమం చేశారు. పైకి భాషారాష్ట్ర వాదాన్ని ముందుకు తెచ్చినా, దాని వెనుక వున్న అసలు విషయం నాటి రాజకీయనాయకుల రాజ్యకాంక్షే. అందువల్లనే ఆంధ్రరాష్ట్రం ఏర్పడగా తక్కిన మద్రాసు రాష్ట్రంలో మిగిలిపోయిన నలభైశాతం మందికి పైగా వున్న స్థానిక తెలుగువారు నష్టపోయారు. అక్కడ తమిళ రాజకీయం ఊపందుకుంది. అక్కడి తెలుగు రాజకీయనాయకులు పదవీకాంక్షతో తమిళీకరణ చెందారు. అందువల్లనే నాటికీ, నేటికీ తమిళనాట రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో వున్న అధికార, ప్రతిపక్షాలవారు తమిళం మాట్లాడే తెలుగుబిడ్డలే ! ఇప్పుడు అక్కడ తెలుగు మూలాలున్న యువతలో క్రమంగా స్వభాషాభిమానం, ఆత్మాభిమానం చిగురులు తొడుగుతున్నాయి. తెలుగు అక్షరానికి దగ్గర కావాలన్న తపన పెరుగుతున్నది. ఇది రాజకీయకోణాన్ని సంతరించుకొని రానున్న పది పదిహేనేళ్ళలో కొత్త మార్పులకు దారితీయనున్నది. ఈ మా మాటలు అతిశయోక్తులుగాను, తొందరపాటుగాను పలువురు అనుకోవచ్చు గాక. కానీ ఇది వాస్తవం. అణచివేత - ముఖ్యంగా భాషా సాంస్కృతిక అణచివేత ఆత్మగౌరవాన్ని రెచ్చగొడుతుంది. ఒకప్పుడు ఆ రాష్ట్రంలో ద్రవిడోద్యమం తమిళ భాషోద్యమంగా రూపుదిద్దుకొని రాజకీయాలను శాసించింది. మరొక రూపంలో ఇవే పరిస్థితులు ఆంధ్ర, తెలంగాణల్లో ఏర్పడకుండా వుండాలంటే, సాంస్కృతికత, సామాజికత అంశాలుగా ఉద్యమాలు బలం పుంజుకోకుండా వుండాలంటే మన ప్రభుత్వాలు ప్రజలందరి శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలి. అందుకూ వారు మాతృభాషనే నమ్ముకోవాలి. తెలిసి తెలిసీ పరాయీకరణ చెందడానికి ఏ సమాజమూ ఒప్పుకోదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాషాసాంస్కృతిక వివక్ష అంశాన్ని కూడా ముఖ్యమైన అంశంగా ముందుకు తెచ్చారు. నిజానికి భాషా వివక్ష మన సమాజంలో తొలినుండీ వ్రేళ్లూనుకున్నదే. కులవ్యవస్థ, చదువులు కొన్నివర్గాలకే పరిమితం కావటం, అందరికీ సమానంగా విద్యాసాంస్కృతిక అవకాశాలు లేకపోవటం ఈ వివక్షకు దారితీసింది. మాట్లాడేభాషకు, పుస్తకాల్లో భాషకూ సంబంధం లేకుండాపోయింది. సామాన్య ప్రజల్లో వాడుకలో వున్న ఎన్నో మాటలు మన నిఘంటువుల కెక్కలేదు. అప్పుడు సంస్కృతం, ఇప్పుడు ఇంగ్లీషు తోడు లేనిదే విద్యావంతులు నాలుగు మాటలు వ్రాయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదంతా మన పాలకులకు సరియైన భాషావిధానం లేకపోయినందునే. శాస్త్రసాంకేతిక అంశాలతో సహా అనేక అవసరాలకు తెలుగును పనికిరానిదిగా ముద్ర వేశారు. ఇప్పుడైనా వాస్తవాన్ని గమనించి తెలుగు మూలాలపై ఆధారపడి తెలుగు నుడిని ఆధునికంగా పెంచుకోకపోతే ఇంకా మిగిలివున్న తెలుగు కూడా పరాయీకరణ చెందుతుంది. ఈ ప్రమాదం రెండు రాష్ట్రాల్లోనూ పొంచివుంది. ఇప్పటికైనా రెండు ప్రభుత్వాలూ మేల్కొనాలి. తమ సమాజాల్లో ఉన్న వైవిధ్యాన్ని కాపాడుతూనే, ప్రజల ఉమ్మడి భాషను పాలనాభాషగా, బోధనాభాషగా పెంపుచెయ్యాలి. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు ప్రాధికారసంస్థల్ని ఏర్పాటుచేసి భాషాభివృద్ధికి పరస్పరం సహకరించుకొంటూ ముందుకు సాగితేనే, రెండు తెలుగురాష్ట్రాలూ బలమైనవిగా ఎదుగుతాయి. అన్ని రంగాల్లోనూ ఇచ్చిపుచ్చుకొనే ధోరణితోనే అభివృద్ధిని సాధించగలం. ఇది భాషారంగంతోనే మొదలు కావాలి. {{rh|21-2-2015||సామల రమేష్ బాబు}} {{larger|ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా తెలుగువారంతా ఒక్కటే}}<noinclude><references/> {{rule}} {{rh|తెలుగుజాతి పత్రిక అమ్మనుడి| మార్చి 2015|10}}</noinclude> n2lgqufgcry71buw6bt2kh8ob4snbfh 568080 568053 2026-08-03T10:30:10Z Rajasekhar1961 50 568080 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>ఎన్నో త్యాగాలు చేసినమీదట ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. కానీ ఈ 60 ఏళ్ళలో మన పాలకుల స్వార్థరాజకీయాల వల్ల విభజన జరిగి ఇప్పుడు రెండు రాష్ట్రాలయ్యాయి. సమైక్య రాష్ట్రంలో భాష విషయంలో ఎంత నిర్లక్ష్యం చేశామో, ఇప్పుడు కూడా అదే వైఖరి రాజకీయనాయకుల్లో కనిపిస్తున్నది. ఈ ధోరణి కొన్నేళ్ల తర్వాత ఈ రెండు రాష్ట్రాల విచ్ఛిత్తికి కూడా దారితీస్తే ఆశ్చర్యపోనక్కరలేదు. 60 యేళ్ళ క్రితం సంయుక్త మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పర్చుకోవాలనే ఉద్యమం చేశారు. పైకి భాషారాష్ట్ర వాదాన్ని ముందుకు తెచ్చినా, దాని వెనుక వున్న అసలు విషయం నాటి రాజకీయనాయకుల రాజ్యకాంక్షే. అందువల్లనే ఆంధ్రరాష్ట్రం ఏర్పడగా తక్కిన మద్రాసు రాష్ట్రంలో మిగిలిపోయిన నలభైశాతం మందికి పైగా వున్న స్థానిక తెలుగువారు నష్టపోయారు. అక్కడ తమిళ రాజకీయం ఊపందుకుంది. అక్కడి తెలుగు రాజకీయనాయకులు పదవీకాంక్షతో తమిళీకరణ చెందారు. అందువల్లనే నాటికీ, నేటికీ తమిళనాట రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో వున్న అధికార, ప్రతిపక్షాలవారు తమిళం మాట్లాడే తెలుగుబిడ్డలే ! ఇప్పుడు అక్కడ తెలుగు మూలాలున్న యువతలో క్రమంగా స్వభాషాభిమానం, ఆత్మాభిమానం చిగురులు తొడుగుతున్నాయి. తెలుగు అక్షరానికి దగ్గర కావాలన్న తపన పెరుగుతున్నది. ఇది రాజకీయకోణాన్ని సంతరించుకొని రానున్న పది పదిహేనేళ్ళలో కొత్త మార్పులకు దారితీయనున్నది. ఈ మా మాటలు అతిశయోక్తులుగాను, తొందరపాటుగాను పలువురు అనుకోవచ్చు గాక. కానీ ఇది వాస్తవం. అణచివేత - ముఖ్యంగా భాషా సాంస్కృతిక అణచివేత ఆత్మగౌరవాన్ని రెచ్చగొడుతుంది. ఒకప్పుడు ఆ రాష్ట్రంలో ద్రవిడోద్యమం తమిళ భాషోద్యమంగా రూపుదిద్దుకొని రాజకీయాలను శాసించింది. మరొక రూపంలో ఇవే పరిస్థితులు ఆంధ్ర, తెలంగాణల్లో ఏర్పడకుండా వుండాలంటే, సాంస్కృతికత, సామాజికత అంశాలుగా ఉద్యమాలు బలం పుంజుకోకుండా వుండాలంటే మన ప్రభుత్వాలు ప్రజలందరి శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలి. అందుకూ వారు మాతృభాషనే నమ్ముకోవాలి. తెలిసి తెలిసీ పరాయీకరణ చెందడానికి ఏ సమాజమూ ఒప్పుకోదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాషాసాంస్కృతిక వివక్ష అంశాన్ని కూడా ముఖ్యమైన అంశంగా ముందుకు తెచ్చారు. నిజానికి భాషా వివక్ష మన సమాజంలో తొలినుండీ వ్రేళ్లూనుకున్నదే. కులవ్యవస్థ, చదువులు కొన్నివర్గాలకే పరిమితం కావటం, అందరికీ సమానంగా విద్యాసాంస్కృతిక అవకాశాలు లేకపోవటం ఈ వివక్షకు దారితీసింది. మాట్లాడేభాషకు, పుస్తకాల్లో భాషకూ సంబంధం లేకుండాపోయింది. సామాన్య ప్రజల్లో వాడుకలో వున్న ఎన్నో మాటలు మన నిఘంటువుల కెక్కలేదు. అప్పుడు సంస్కృతం, ఇప్పుడు ఇంగ్లీషు తోడు లేనిదే విద్యావంతులు నాలుగు మాటలు వ్రాయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదంతా మన పాలకులకు సరియైన భాషావిధానం లేకపోయినందునే. శాస్త్రసాంకేతిక అంశాలతో సహా అనేక అవసరాలకు తెలుగును పనికిరానిదిగా ముద్ర వేశారు. ఇప్పుడైనా వాస్తవాన్ని గమనించి తెలుగు మూలాలపై ఆధారపడి తెలుగు నుడిని ఆధునికంగా పెంచుకోకపోతే ఇంకా మిగిలివున్న తెలుగు కూడా పరాయీకరణ చెందుతుంది. ఈ ప్రమాదం రెండు రాష్ట్రాల్లోనూ పొంచివుంది. ఇప్పటికైనా రెండు ప్రభుత్వాలూ మేల్కొనాలి. తమ సమాజాల్లో ఉన్న వైవిధ్యాన్ని కాపాడుతూనే, ప్రజల ఉమ్మడి భాషను పాలనాభాషగా, బోధనాభాషగా పెంపుచెయ్యాలి. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు ప్రాధికారసంస్థల్ని ఏర్పాటుచేసి భాషాభివృద్ధికి పరస్పరం సహకరించుకొంటూ ముందుకు సాగితేనే, రెండు తెలుగురాష్ట్రాలూ బలమైనవిగా ఎదుగుతాయి. అన్ని రంగాల్లోనూ ఇచ్చిపుచ్చుకొనే ధోరణితోనే అభివృద్ధిని సాధించగలం. ఇది భాషారంగంతోనే మొదలు కావాలి. {{rh|21-2-2015||సామల రమేష్ బాబు}} {{larger|{{c|'''ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా తెలుగువారంతా ఒక్కటే'''}}}}<noinclude><references/> {{rule}} {{rh|తెలుగుజాతి పత్రిక అమ్మనుడి| మార్చి 2015|10}}</noinclude> psvpgs6iyyok6tx6gw64dtcutk7sej6 పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.4 (1918).pdf/42 104 217450 568064 567782 2026-08-03T08:19:52Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 568064 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>పురా రు. నేడు దేశభాషా పరిశ్రమ మికరవిద్యా వ్యాసంగముల కభ్యంతరమగునని వారి నైచ్ఛికముజేసి గ్రంథకర్తలకు పోయుచున్న పోతపాలుకూడ నెగజేపీ వేసిన్నారు. ఇక నెవ్వరికోసరము దేశవిద్యల నభ్యసించుట! ఎవ్వరికోసరము గ్రంథములు వ్రాయుట! విశ్వవిద్యాలయమునకు దేశవిద్యలు తనకుమాలినధర్మములై తోచినవి. ముఖ్యభాషలు వాపక్షములై పోయినవి. శాస్త్రములు పరభాషామూలముగా నుపదేశింపబడుచున్నవి. గమ్యస్థానమైన శాస్త్రజ్ఞానము మార్గయాసముచే దుస్సాధ్యనుగుచున్నది. పరభాషలు పరభాషలే. అస్వాధీనయకు పరభాషను స్వాధీనముగు జేసికొనుటలో స్వాధీనయగు స్వభాషయసాధ్యమగుచున్నది. దేశమందు వ్యుత్పత్తి బొత్తుగా అడుగంటినది. విద్య జీవనాధార పరిమితమై తేలినది. సహృదయుల యవస్థ యిటుడుగా, సర్వజన సామాన్య మునకు విద్య కేవలము శశవిషాణమై యున్నది. స్వభాషలో సులభ సాధ్యములగు గ్రంథములు లేవు. పురాణములు గీర్వాణభూ యిష్టములు! ప్రబంధము లినుపగుగ్గిళ్ళు. పూర్వకవివిరచితములైన నాటకసారస్వతము లేనేలేదు. ఇప్పటికవులు వ్రాసిన నాటకములు కథలును గూడ పేలవములు. బాలబోధలుగూడ విదేశభావ ప్రతిపాదకములును విదేశభాషా పరిజ్ఞాన సాధ్యములు ను. రాజవిద్యలగత్యములుగాక, రాజభాష లామూలాగ్రముగా నభ్యసింప నవకాశములేని స్త్రీలవిద్య వృథా కాలయాపనమైనది. బాలుర యావస్మేధాశక్తియును పొగ మూటకట్టుటవలె పరభాషా సంప్రదాయ సంగ్రహణమందు వినియోగమగుచున్నది. అన్ని విధముల నాంధ్రదేశమందు బుట్టి యాంధ్రభాష స్వభాషయగుట శాపవశమైనట్టు గాన్పట్టుచున్నది. ఇట్లుండ థనికులందును, బుద్ధిమంతులందును ఆంగ్లేయభాష విశ్వభాషయై దేశభాషలనాదరణీయములుగ నున్నవి. రాజకీయదీర్ఘ సూత్రములంబన్ను దేశాభిమానులు కొందరు ఇంగ్లీషు విశ్వభాష గాకూడదనియును, తత్సానే దేశభాషలలో ముఖ్యమైన హిందీభాష విశ్వభాషయైనచో, బ్రజలకందరకును స్వభాషా భేదములవలన గలిగిన యభిప్రాయభేదములు నశించి యైకమత్యము హెచ్చి దేశక్షేమ హేతువగునని హిందీభాష యాయాదేశభాషలకు మారుగా పిల్లలకు జెప్పించవలెనని సహస్రముఖములు ఘోషించుచున్నారు. ఈయుపాయ ముపదేశించుటకు సయుక్తికముగానే యున్నది. కాని యాచరించుటకు దుస్సాధ్యమును, సాధ్యమైనచో దేశభాషల కరిష్ట హేతువును, పాఠశాలలలో దేశభాషలు నేర్పుదమంటిమేని గ్రంధసామగ్రి లేదు. గ్రంధములు వ్రాయువారు లేరు. వ్రాసినవి చదువువారు లేదు. ఆమారునీసాభేదముల కుపచరించునట్లు వ్రాయుటకు గ్రంథకర్తలు ప్రయత్నింపకున్నారు. స్త్రీలకు గృహకృత్యమునుండి తీరుబాటైనప్పుడు సత్కాలక్షేపము జేయింతురన్న దగిన గ్రంథములులేవు. మంచి నాటకములాడించి మనస్సుల నలరించి రసరిమగ్నలజేసి నీతియు దైవభక్తియు ప్రతిపాదింతుమన్న గ్రంథములులేవు. మఱోక్కటి, ఇంగ్లీషు వచ్చియురానట్లు నేర్చికొని పరీక్షలను కృతార్థులైన భారతీయ మహాపండితులు దేశభాషల దిరస్కరించి తమ్మాలముగా ప్రసంగించుటయే యకార్యకరణ మనుకొనుచుండగా వారు గ్రంధములవ్రాసి లోకోద్ధారకముజేయుటెక్కడ? ఇట్టి యవస్థలో మన యాంధ్రసారస్వత సభ యుదయిచింది. దేశభాష నభివృద్ధి జేసి సారస్వతము వివిధజన సమాదరణీయ ముగను స్వతంత్రముగను, విపులముగను సర్వశాస్త్ర ప్రతిపాదకముగను, లోకోద్ధారకముగనుజేయు నుపాయంబుల సభా ముఖంనజర్చించి ప్రచురించుట మనకు ముఖ్యకత౯వ్యాంశమై యున్నది. ఈ మహాకార్యమునకు బైనచెప్పిన వానివంటి యవరోధములనేకములు గలవు. వానిని నివారించి గ్రంథకత౯లకభయమిచ్చి సారస్వతాభిమానులకు పూర్వ రాజుల నడవడి ననుసరించి భావి గ్రంథకత౯లకు మార్గదర్శకముగా గ్రంథములు వ్రాయించి ధనికులు సాహాయ్యముంబడసి యుత్తమ గ్రంథములకు బారితోషికంబుల నిప్పించి గ్రంథాలయముల స్థాపించి, యసద్గ్రంథములకు నిరాకరించి, వాని ప్రాచుర్యము నిరోధించి సద్గ్రంధములను యూనివర్సిటీ, గవర్నమెంటువారల సహాయ్యముంజేకొని విద్యాలయంబులం జదివించి, పత్రికలను నెలకొల్పి, యచ్చటచ్చట నాటకశాలలు, అచ్చటచ్చట శాస్త్రోపన్యాసములు, అచ్చటచ్చట గ్రంథవిమర్శకసభలు, అచ్చటచ్చట బరీక్షలు, అచ్చటచ్చట శాస్త్ర చర్చలు, అచ్చటచ్చట బూర్వ సంప్రదాయ సూచకములగు ప్రదర్శనములు, జరిత్రాంశా న్వేషక సంఘములు, భాషాసంస్కార సంఘములు — నేర్పరచి సారస్వతమూలమున దేశోద్ధారమొనర్చుట మన కార్యక్రమము. ఇదంతయు నొక్కసభలో గాని యొక్కతరమందుగాని నెరవేర్చగలమని భ్రాంతి నొందవలదు. కాని యయ్యది మన గమ్యస్థానమని దృష్టి పధమున నిడికొని దానింజేరు నుపాయముల నారసి మనలో నెవ్వరెవ్వరేయేపనులకు జాలుదురో వారి వారిచే నాయా కార్యములను సమగ్రముగ నెరవేర్పించుట మనయాశయమై యుండదగును. ఇట్టి వ్రతమునందు మనలోని మేథావంతులును, ధనవంతులును దేదీకదీక్షను వహించి తమ లోకోపకారధురీణత వలన దేశమంతటికి<noinclude><references/></noinclude> b5jwamiabbprx8fp6ti5pf4tj4o3kr0 పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/23 104 217467 567978 567854 2026-08-02T13:36:57Z Rajasekhar1961 50 567978 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{rh|ప్రకృతి || డా॥ కొప్పుల హేమాద్రి}} {{p|fs150|ac}}సమన్యాయం!</p> {{di|ప్ర}}కృతిమాతా పాహిమాం! మా జాతికి మీరే న్యాయం చెయ్యాలి. నాయనా నారికేళా? నా వల్ల నీకేమన్యాయం జరిగింది? ఎవరికేది చేసినా (ప్రకృతి) ధర్మాన్ననుసరించే కదా చేస్తాను? అహహ... అది కాదు మాతా! నేను విన్నవించేది “సమన్యాయం” గురించి. కాస్త వివరంగా చెబుతావా నాయనా? అటులనే తల్లీ! వృక్ష సంతతికే చెందిన మేము సముద్రతీర ప్రాంతాలలోనే ఎందుకు జీవించాలి? మిగత చెట్లలాగే కొండలమీద పెరిగే అర్హత మాకు లేదా? కొండమీద్ది కాదండి బాబొ- సముద్రం ప్రకృతి ధర్మమంటే నీకు అర్థమైనట్లు లేదు నారికేళా! కాడి పెట్టండి - అందుకే అన్ని నీళ్లండి. ఆయ్! నీకిప్పుడు ఎంత చెప్పినా ఆకాశాన్ని తాకుతున్న నీ తలకెక్కదు. ఇంతకు ముందు కూడా నీ జాతివారు నాతో ఇలాగే మొర పెట్టుకున్నారు! నేను సర్ది చెప్ప బోయాను. ససేమిరా ఒప్పుకోలేదు! దానితో "స్వయంగా అనుభవిస్తేగాని తలకెక్కదని వాళ్ళకి మచ్చుకి ఒక కొండమీద నివసించే యేర్పాటు చేశాను. ఆ తరువాత ఏమయ్యిందో నీ మూడు కళ్ళకు గోచరమయ్యేలా చేస్తాను తిలకించు" అంటుండగానే ప్రదర్శన మొదలైపోయింది. ఒక అంకం సారాంశం ఓ కొండ. ఆ కొండ మీద కొబ్బరిచెట్లతోసహా రకరకాల వృక్షజాతులు ఉన్నాయి. ఋతు ధర్మాల ననుసరించి అన్నిచెట్లూ పూలు పూచాయి. కాయలు కాచాయి. పండిపోయిన కొన్ని జాతుల ఫలాలు | రాలిపోయాయి. కొన్ని ఎగిరిపోయాయి. తల్లి చెట్ల సమీపంలోనే రాలిన గింజలు వర్షాకాలంలో అక్కడే మొలకెత్తాయి. మరికొన్ని తమ తమ భౌతిక స్వరూపానికీ, నిర్మాణ పద్ధతికీ అనుగుణంగా దూరప్రాంతాలకు చేరుకుని వీలు కుదిరిన చోట్ల మొలకెత్తి స్థిరపడ్డాయి. రెండో అంకంలో దృశ్యమాల ఇలా ఉంది. వరుసగా కొన్నేళ్ళ పాటు వర్షాలు పడకపోవడంతో ఆ కొండ మీద పెరుగుతున్న అన్ని జాతుల చెట్లు- గడ్డీ గాదంతో సహా చచ్చిపోయాయి. కార్చిచ్చు వ్యాపించి కాలి బూడిదైపోయాయి. బండరాళ్ళు బయట పడ్డాయి. కొంత కాలం గడిచిన తరువాత కనబడిన దృశ్యంలో కొండమీద పూర్వపు వృక్షవైభవం జాడలేదు. గాలికెగిరివచ్చిన విత్తులూ, పక్షులూ తదితర అడవిమృగాల ద్వారా వచ్చి పడిన గింజలూ మొలకెత్తడంతో గడ్డి మొక్కలూ, తీగలూ, ఏవేవో జాతుల చెట్లూ పెరిగాయి. మరి కొబ్బరిచెట్ల సంగతో? అప్పటి వాతావరణం అనుకూలించక పోవడంతో కొండమీద కొబ్బరిచెట్లన్నీ నశించిపోయాయి. కాకపోతే, గతంలో ఆ కొండ నుండి ప్రవహించిన వాగుల్లో తేలుకుంటూ పోయి సముద్రతీరానికి చేరిన కొబ్బరిబోండాలు ఆ ప్రాంతంలో మొలకెత్తి ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందాయి. ఈ దృశ్యాలను తిలకించిన నారికేళుడికి జ్ఞానోదయమయ్యింది. తమవంటి వృక్షాలు తీర ప్రాంతాలకు పరిమితం కావడమే "సమ '''మరికొంత వివరణ:''' ప్రకృతికి సంబంధించినంత వరకు "సమ న్యాయం” అంటే యేమిటో మరింత చెప్పాల్సి ఉంది. మనం ఒక గొయ్యి తవ్వి, దాని మానాన దాన్ని వదిలేస్తే- కొంత కాలానికి అది మానవ ప్రమేయం లేకపోయినా పూడ్చుకుపోతుంది. అంతేకాదు, ఆ పక్కనే కుప్పలా పోసిన మట్టి కూడ కొంచెం కొంచెంగా తరిగిపోయి అక్కడున్న నేల మట్టానికి సమమైపోతుంది. '''మరొక్క సంగతి.''' ఖాళీగా ఉన్న ఓ గదిలో ఒక దూదిపింజను ఉంచి, “ఫుల్ స్పీడ్”లో పంఖా వేసి, గదికి తాళం పెట్టి, కొన్ని గంటల తరువాత తెరిచి చూస్తే- దూదిపింజ ఆ గదిలో ఏదో ఒక మూలకు చేరి ఉంటుంది. ఇలా ఎన్నిసార్లు చేసినా ఎన్ని దూదిపింజలు వేసినా అవన్నీ ఆ మూలకే చేరుకుంటాయి. ఐతే, ఆ గది తలుపులు తెరచి ఉంచినా, లేక మరే మార్పు చేసినా ఆ దూదిపింజలు మరో చోటును వెతుక్కుని అక్కడ స్థిరపడతాయి. పర్యావరణశాస్త్ర పరిభాషలో పైన ఉటంకించిన మార్పుల క్రమాన్ని "ప్రకృతిసిద్ధమైన వ్యవస్థాపన" (ఇకసిస్) అంటారు. ఈ ప్రక్రియ ద్వారా వచ్చిన పరివర్తన యొక్క అంతిమ ఫలితమే పర్యావరణ పరాకాష్ఠ (క్లైమాటిక్ క్లైమాక్స్). ఆ స్థితినే జీవావరణ సమతుల్యత (ఇకలాజికల్ ఈక్విలిబ్రియం) అంటారు. మానవజాతి పరిణామక్రమాన్ని పర్యావరణ సిద్ధాంత చట్రంలో బిగించి చూస్తే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఘటనా ప్రకృతిసిద్ధమే అనిన్నూ, "క్లైమాటిక్ క్లైమాక్స్"ను చేరడానికీ, తద్వారా "ఇకలాజికల్ ఈక్విలిబ్రియం”ను సాధించడానికే అనిన్నూ మనకు అవగతమవుతుంది. ఈ కథలాంటి వ్యాసం ద్వారా నేను ప్రతిపాదించ దలచుకున్నది ఇదే ! ఫోన్: 09848296865 ఇదే మాదిరిగా మీరూ శాస్త్రీయ అంశాలను పత్రికకు రాయవచ్చు. సం॥ 23<noinclude><references/> న్యాయం' అని బోధపడింది. | తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015</noinclude> jm46hauzqe82gnou3zusw4pmglfefxa 567979 567978 2026-08-02T13:41:09Z Rajasekhar1961 50 567979 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{rh|ప్రకృతి || డా॥ కొప్పుల హేమాద్రి}} {{p|fs150|ac}}సమన్యాయం!</p> {{di|ప్ర}}కృతిమాతా పాహిమాం! మా జాతికి మీరే న్యాయం చెయ్యాలి. నాయనా నారికేళా? నా వల్ల నీకేమన్యాయం జరిగింది? ఎవరికేది చేసినా (ప్రకృతి) ధర్మాన్ననుసరించే కదా చేస్తాను? అహహ... అది కాదు మాతా! నేను విన్నవించేది “సమన్యాయం” గురించి. కాస్త వివరంగా చెబుతావా నాయనా? అటులనే తల్లీ! వృక్ష సంతతికే చెందిన మేము సముద్రతీర ప్రాంతాలలోనే ఎందుకు జీవించాలి? మిగత చెట్లలాగే కొండలమీద పెరిగే అర్హత మాకు లేదా? ప్రకృతి ధర్మమంటే నీకు అర్థమైనట్లు లేదు నారికేళా! కాడి పెట్టండి - అందుకే అన్ని నీళ్లండి. ఆయ్! నీకిప్పుడు ఎంత చెప్పినా ఆకాశాన్ని తాకుతున్న నీ తలకెక్కదు. ఇంతకు ముందు కూడా నీ జాతివారు నాతో ఇలాగే మొర పెట్టుకున్నారు! నేను సర్ది చెప్ప బోయాను. ససేమిరా ఒప్పుకోలేదు! దానితో "స్వయంగా అనుభవిస్తేగాని తలకెక్కదని వాళ్ళకి మచ్చుకి ఒక కొండమీద నివసించే యేర్పాటు చేశాను. ఆ తరువాత ఏమయ్యిందో నీ మూడు కళ్ళకు గోచరమయ్యేలా చేస్తాను తిలకించు" అంటుండగానే ప్రదర్శన మొదలైపోయింది. '''ఒకటో అంకం సారాంశం:''' ఓ కొండ. ఆ కొండ మీద కొబ్బరిచెట్లతోసహా రకరకాల వృక్షజాతులు ఉన్నాయి. ఋతు ధర్మాల ననుసరించి అన్నిచెట్లూ పూలు పూచాయి. కాయలు కాచాయి. పండిపోయిన కొన్ని జాతుల ఫలాలు రాలిపోయాయి. కొన్ని ఎగిరిపోయాయి. తల్లి చెట్ల సమీపంలోనే రాలిన గింజలు వర్షాకాలంలో అక్కడే మొలకెత్తాయి. మరికొన్ని తమ తమ భౌతిక స్వరూపానికీ, నిర్మాణ పద్ధతికీ అనుగుణంగా దూరప్రాంతాలకు చేరుకుని వీలు కుదిరిన చోట్ల మొలకెత్తి స్థిరపడ్డాయి. '''రెండో అంకంలో ''' దృశ్యమాల ఇలా ఉంది. వరుసగా కొన్నేళ్ళ పాటు వర్షాలు పడకపోవడంతో ఆ కొండ మీద పెరుగుతున్న అన్ని జాతుల చెట్లు-గడ్డీ గాదంతో సహా చచ్చిపోయాయి. కార్చిచ్చు వ్యాపించి కాలి బూడిదైపోయాయి. బండరాళ్ళు బయట పడ్డాయి. కొంత కాలం గడిచిన తరువాత కనబడిన దృశ్యంలో కొండమీద పూర్వపు వృక్షవైభవం జాడలేదు. గాలికెగిరివచ్చిన విత్తులూ, పక్షులూ తదితర అడవిమృగాల ద్వారా వచ్చి పడిన గింజలూ మొలకెత్తడంతో గడ్డి మొక్కలూ, తీగలూ, ఏవేవో జాతుల చెట్లూ పెరిగాయి. మరి కొబ్బరిచెట్ల సంగతో? అప్పటి వాతావరణం అనుకూలించక పోవడంతో కొండమీద కొబ్బరిచెట్లన్నీ నశించిపోయాయి. కాకపోతే, గతంలో ఆ కొండ నుండి ప్రవహించిన వాగుల్లో తేలుకుంటూ పోయి సముద్రతీరానికి చేరిన కొబ్బరిబోండాలు ఆ ప్రాంతంలో మొలకెత్తి ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందాయి. ఈ దృశ్యాలను తిలకించిన నారికేళుడికి జ్ఞానోదయమయ్యింది. తమవంటి వృక్షాలు తీర ప్రాంతాలకు పరిమితం కావడమే "సమ '''మరికొంత వివరణ:''' ప్రకృతికి సంబంధించినంత వరకు "సమ న్యాయం” అంటే యేమిటో మరింత చెప్పాల్సి ఉంది. మనం ఒక గొయ్యి తవ్వి, దాని మానాన దాన్ని వదిలేస్తే- కొంత కాలానికి అది మానవ ప్రమేయం లేకపోయినా పూడ్చుకుపోతుంది. అంతేకాదు, ఆ పక్కనే కుప్పలా పోసిన మట్టి కూడ కొంచెం కొంచెంగా తరిగిపోయి అక్కడున్న నేల మట్టానికి సమమైపోతుంది. '''మరొక్క సంగతి.''' ఖాళీగా ఉన్న ఓ గదిలో ఒక దూదిపింజను ఉంచి, “ఫుల్ స్పీడ్”లో పంఖా వేసి, గదికి తాళం పెట్టి, కొన్ని గంటల తరువాత తెరిచి చూస్తే- దూదిపింజ ఆ గదిలో ఏదో ఒక మూలకు చేరి ఉంటుంది. ఇలా ఎన్నిసార్లు చేసినా ఎన్ని దూదిపింజలు వేసినా అవన్నీ ఆ మూలకే చేరుకుంటాయి. ఐతే, ఆ గది తలుపులు తెరచి ఉంచినా, లేక మరే మార్పు చేసినా ఆ దూదిపింజలు మరో చోటును వెతుక్కుని అక్కడ స్థిరపడతాయి. పర్యావరణశాస్త్ర పరిభాషలో పైన ఉటంకించిన మార్పుల క్రమాన్ని "ప్రకృతిసిద్ధమైన వ్యవస్థాపన" (ఇకసిస్) అంటారు. ఈ ప్రక్రియ ద్వారా వచ్చిన పరివర్తన యొక్క అంతిమ ఫలితమే పర్యావరణ పరాకాష్ఠ (క్లైమాటిక్ క్లైమాక్స్). ఆ స్థితినే జీవావరణ సమతుల్యత (ఇకలాజికల్ ఈక్విలిబ్రియం) అంటారు. మానవజాతి పరిణామక్రమాన్ని పర్యావరణ సిద్ధాంత చట్రంలో బిగించి చూస్తే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఘటనా ప్రకృతిసిద్ధమే అనిన్నూ, "క్లైమాటిక్ క్లైమాక్స్"ను చేరడానికీ, తద్వారా "ఇకలాజికల్ ఈక్విలిబ్రియం”ను సాధించడానికే అనిన్నూ మనకు అవగతమవుతుంది. ఈ కథలాంటి వ్యాసం ద్వారా నేను ప్రతిపాదించ దలచుకున్నది ఇదే ! ఫోన్: 09848296865 ఇదే మాదిరిగా మీరూ శాస్త్రీయ అంశాలను పత్రికకు రాయవచ్చు. సం॥ 23<noinclude><references/> న్యాయం' అని బోధపడింది. | తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015</noinclude> 2skracz5zmejsvvxtv67pne3c339yea 567980 567979 2026-08-02T13:43:01Z Rajasekhar1961 50 567980 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{rh|ప్రకృతి || డా॥ కొప్పుల హేమాద్రి}} {{p|fs150|ac}}సమన్యాయం!</p> {{di|ప్ర}}కృతిమాతా పాహిమాం! మా జాతికి మీరే న్యాయం చెయ్యాలి. నాయనా నారికేళా? నా వల్ల నీకేమన్యాయం జరిగింది? ఎవరికేది చేసినా (ప్రకృతి) ధర్మాన్ననుసరించే కదా చేస్తాను? అహహ... అది కాదు మాతా! నేను విన్నవించేది “సమన్యాయం” గురించి. కాస్త వివరంగా చెబుతావా నాయనా? అటులనే తల్లీ! వృక్ష సంతతికే చెందిన మేము సముద్రతీర ప్రాంతాలలోనే ఎందుకు జీవించాలి? మిగత చెట్లలాగే కొండలమీద పెరిగే అర్హత మాకు లేదా? ప్రకృతి ధర్మమంటే నీకు అర్థమైనట్లు లేదు నారికేళా! కాడి పెట్టండి - అందుకే అన్ని నీళ్లండి. ఆయ్! నీకిప్పుడు ఎంత చెప్పినా ఆకాశాన్ని తాకుతున్న నీ తలకెక్కదు. ఇంతకు ముందు కూడా నీ జాతివారు నాతో ఇలాగే మొర పెట్టుకున్నారు! నేను సర్ది చెప్ప బోయాను. ససేమిరా ఒప్పుకోలేదు! దానితో "స్వయంగా అనుభవిస్తేగాని తలకెక్కదని వాళ్ళకి మచ్చుకి ఒక కొండమీద నివసించే యేర్పాటు చేశాను. ఆ తరువాత ఏమయ్యిందో నీ మూడు కళ్ళకు గోచరమయ్యేలా చేస్తాను తిలకించు" అంటుండగానే ప్రదర్శన మొదలైపోయింది. '''ఒకటో అంకం సారాంశం:''' ఓ కొండ. ఆ కొండ మీద కొబ్బరిచెట్లతోసహా రకరకాల వృక్షజాతులు ఉన్నాయి. ఋతు ధర్మాల ననుసరించి అన్నిచెట్లూ పూలు పూచాయి. కాయలు కాచాయి. పండిపోయిన కొన్ని జాతుల ఫలాలు రాలిపోయాయి. కొన్ని ఎగిరిపోయాయి. తల్లి చెట్ల సమీపంలోనే రాలిన గింజలు వర్షాకాలంలో అక్కడే మొలకెత్తాయి. మరికొన్ని తమ తమ భౌతిక స్వరూపానికీ, నిర్మాణ పద్ధతికీ అనుగుణంగా దూరప్రాంతాలకు చేరుకుని వీలు కుదిరిన చోట్ల మొలకెత్తి స్థిరపడ్డాయి. '''రెండో అంకంలో ''' దృశ్యమాల ఇలా ఉంది. వరుసగా కొన్నేళ్ళ పాటు వర్షాలు పడకపోవడంతో ఆ కొండ మీద పెరుగుతున్న అన్ని జాతుల చెట్లు-గడ్డీ గాదంతో సహా చచ్చిపోయాయి. కార్చిచ్చు వ్యాపించి కాలి బూడిదైపోయాయి. బండరాళ్ళు బయట పడ్డాయి. కొంత కాలం గడిచిన తరువాత కనబడిన దృశ్యంలో కొండమీద పూర్వపు వృక్షవైభవం జాడలేదు. గాలికెగిరివచ్చిన విత్తులూ, పక్షులూ తదితర అడవిమృగాల ద్వారా వచ్చి పడిన గింజలూ మొలకెత్తడంతో గడ్డి మొక్కలూ, తీగలూ, ఏవేవో జాతుల చెట్లూ పెరిగాయి. మరి కొబ్బరిచెట్ల సంగతో? అప్పటి వాతావరణం అనుకూలించక పోవడంతో కొండమీద కొబ్బరిచెట్లన్నీ నశించిపోయాయి. కాకపోతే, గతంలో ఆ కొండ నుండి ప్రవహించిన వాగుల్లో తేలుకుంటూ పోయి సముద్రతీరానికి చేరిన కొబ్బరిబోండాలు ఆ ప్రాంతంలో మొలకెత్తి ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందాయి. ఈ దృశ్యాలను తిలకించిన నారికేళుడికి జ్ఞానోదయమయ్యింది. తమవంటి వృక్షాలు తీర ప్రాంతాలకు పరిమితం కావడమే "సమ న్యాయం' అని బోధపడింది. '''మరికొంత వివరణ:''' ప్రకృతికి సంబంధించినంత వరకు "సమ న్యాయం” అంటే యేమిటో మరింత చెప్పాల్సి ఉంది. మనం ఒక గొయ్యి తవ్వి, దాని మానాన దాన్ని వదిలేస్తే- కొంత కాలానికి అది మానవ ప్రమేయం లేకపోయినా పూడ్చుకుపోతుంది. అంతేకాదు, ఆ పక్కనే కుప్పలా పోసిన మట్టి కూడ కొంచెం కొంచెంగా తరిగిపోయి అక్కడున్న నేల మట్టానికి సమమైపోతుంది. '''మరొక్క సంగతి.''' ఖాళీగా ఉన్న ఓ గదిలో ఒక దూదిపింజను ఉంచి, “ఫుల్ స్పీడ్”లో పంఖా వేసి, గదికి తాళం పెట్టి, కొన్ని గంటల తరువాత తెరిచి చూస్తే- దూదిపింజ ఆ గదిలో ఏదో ఒక మూలకు చేరి ఉంటుంది. ఇలా ఎన్నిసార్లు చేసినా ఎన్ని దూదిపింజలు వేసినా అవన్నీ ఆ మూలకే చేరుకుంటాయి. ఐతే, ఆ గది తలుపులు తెరచి ఉంచినా, లేక మరే మార్పు చేసినా ఆ దూదిపింజలు మరో చోటును వెతుక్కుని అక్కడ స్థిరపడతాయి. పర్యావరణశాస్త్ర పరిభాషలో పైన ఉటంకించిన మార్పుల క్రమాన్ని "ప్రకృతిసిద్ధమైన వ్యవస్థాపన" (ఇకసిస్) అంటారు. ఈ ప్రక్రియ ద్వారా వచ్చిన పరివర్తన యొక్క అంతిమ ఫలితమే పర్యావరణ పరాకాష్ఠ (క్లైమాటిక్ క్లైమాక్స్). ఆ స్థితినే జీవావరణ సమతుల్యత (ఇకలాజికల్ ఈక్విలిబ్రియం) అంటారు. మానవజాతి పరిణామక్రమాన్ని పర్యావరణ సిద్ధాంత చట్రంలో బిగించి చూస్తే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఘటనా ప్రకృతిసిద్ధమే అనిన్నూ, "క్లైమాటిక్ క్లైమాక్స్"ను చేరడానికీ, తద్వారా "ఇకలాజికల్ ఈక్విలిబ్రియం”ను సాధించడానికే అనిన్నూ మనకు అవగతమవుతుంది. ఈ కథలాంటి వ్యాసం ద్వారా నేను ప్రతిపాదించ దలచుకున్నది ఇదే ! ఫోన్: 09848296865 ఇదే మాదిరిగా మీరూ శాస్త్రీయ అంశాలను పత్రికకు రాయవచ్చు. సం॥ 23<noinclude><references/> {{rh|తెలుగుజాతి పత్రిక అమ్మనుడి ||మార్చి 2015}}</noinclude> 1hbnv75xavb1wq0xop3spmoyvrtitld పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/40 104 217470 568063 567856 2026-08-03T07:42:31Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 568063 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude> 64 సం॥ క్రితం సంగీత విద్వత్సభ ప్రారంభించి సంక్రాంతి సంగీతోత్సవం నిర్వహిస్తూ వచ్చాడు. ఇదికాకుండా 53 సం॥ క్రితం సంగీతానికి ఒక డాక్యుమెంటేషన్ ఏర్పరుస్తూ, రేపటి సంగీత చరిత్రకు ఆధారాలు తయారు చేశారు. పుస్తక రచన కాకుండా ప్రతినెలా పత్రిక తేవాలని - జర్నలిస్టుగా, సంపాదకుడుగా మారిపోయాడు. ఇపుడు 'గానకళ' అర్ధశతాబ్దం దాటిన వ్యవస్థగా తయారైంది. ఈ పత్రిక సేవ ఎలా ఉంటుంది? ఉదాహరణకు 2014 నవంబరు సంచిక చూడండి - అది ద్వారం వెంకటస్వామినాయుడు సంస్కరణ సంచికగా శ్రీరంగం నారాయణబాబు, శ్రీపాద పినాకపాణి, ఎన్.సి. హెచ్ కృష్ణమాచార్యులు, ద్వారం భావన్నారాయణరావు, రజని, నూకల, ఆరుద్ర, ఇలపావులూరి కామేశ్వరరావు, నండూరి రామమోహనరావు, గుంటూరు శేషేంద్రశర్మ, సూరిబాబు, కొమండూరి శేషాద్రి, మునుగంటి శ్రీరామమూర్తి గార్ల వ్యాసాలతో అలరారుతోంది. 2014 డిసెంబరు సంచిక నేదునూరి కృష్ణమూర్తి మృతి సందర్భంగా వారి ప్రత్యేక సంచికగా వెలువడింది. ఇప్పుడు జనవరి సంచిక శ్రీరామమూర్తిగారి మీదనే తయారైంది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఆవంత్స సోమసుందర్ వంటి పెద్దల పేర్లతోపాటు సుమారు నలభై మందికి పైగా సంపాదక, సారధ్య వర్గాలతో ఈ పత్రికను పర్యవేక్షిస్తున్నారు. సంగీత సభల సమాచారం, ఫోటోలతోపాటు చక్కని వ్యాసాలు ప్రచురిస్తోంది ఈ పత్రిక. మృదంగం, వీణ, తాళం బొమ్మలతో గానకళ లోగో సంగీత భరితంగా కనబడుతుంది. నిజానికి ఈ పత్రిక నిర్వహణకు చాలా కష్టాలు పడ్డారు. ఒకవైపు ఆర్ధికవనరులను చేకూర్చుకుంటూ, మరోవైపు సంగీత సమాచారం క్రోడీకరించడం, ఇంకోవైపు కాకినాడ నుంచి పత్రికను ప్రచురించడం! విజయవాడ నుంచి, హైదరాబాదు నుంచి పత్రికను ప్రచురించడం సులువు. కాకినాడలో అన్ని సౌలభ్యాలు వుండవు. అయినా క్రమంతప్పకుండా పత్రికను కొనసాగిస్తూ వస్తున్నారు. పంచరంగుల అట్టతో, దాదాపు ప్రకటనలు లేకుండా ప్రతినెలా 36 పేజీల పత్రికను ఒంటిచేత్తో నెగ్గుకు రావడం ఆషామాషీ కాదు. ఈ సమస్యలన్నీ ఒకఎత్తు! సంగీత కళాకారుల అహంకారాలు భరించడం మరో ఎత్తు. సంగీత విద్వాంసుల రాజకీయాలు వారి విద్వత్తును మించి ఉంటాయి. కనుక ఈ సంబంధమైన వత్తిడిని కూడా ఈ పత్రిక నిర్వహణలో నిరంతరం చవిచూడాల్సి ఉంటుంది. గానకళలో ప్రచురింపబడే ఫోటోలు కళాకారులకు ఇష్టం. అయితే మాలాంటి వారికి వారు ప్రతినెలా 'నా జీవనయానం' పేరున స్వగత విషయాలు 135 మాసాలుగా రాస్తున్న శీర్షిక ఆసక్తి కల్గిస్తుంది. ఈ "నా జీవనయానం' త్వరలో పుస్తకంగా వస్తోందని శ్రీరామమూర్తి కుమారుడు, ప్రస్తుతం గానకళ సంపాదకుడు వెంకట్రావు చెబుతున్నారు. అలాగే ఇటీవల సంవత్సరాలలో మీడియా మెరుపులు పేరున సంగీతానికి సంబంధించిన మీడియా కబుర్లు శ్రీరామమూర్తి రాసేవారు. ఈ రెండు శీర్షికలు ఒకేచోట ఉండేవి. శ్రీరామమూర్తిగారు అదృశ్యమైనా వారి కుమారులు వెంకట్రావు తప్పక 'గానకళను మరింత మెరుగ్గా నిర్వహిస్తారని నాకు నమ్మకముంది. ఈ పత్రిక నిర్వహణలో చాలామంది సంగీత విద్వాంసులున్నారు. అయితే పత్రికల నిర్వహణ తెలిసిన వారి లేని లోటు స్పష్టంగా కనబడుతోంది. ఈ పరిమితి ఒక్క గానకళకే కాదు - తెలుగు విద్యార్థి, గ్రంథాలయసర్వస్వం వంటి పత్రికలలో కూడా కనబడుతుంది. మొత్తం పత్రికలో వాడే భాష, శైలి ఒకే రకంగా ఉండాలి. పేజీలను, అంశాలను మరింత అర్థవంతంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. అలాగే పత్రిక నెట్లో లభ్యం కావాలి. ప్రస్తుతం కర్ణాటక సంగీతం ద్వారా తెలుగు ప్రపంచ వ్యాప్తంగా ఉంది. వారందరికీ గానకళ చేరాలి. మునుగంటి శ్రీరామమూర్తి గారి దృష్టి విశాలమైంది. పట్టుబట్టి సంగీతం-టెక్నాలజీ' అంశానికి సంబంధించి సాంకేతిక విజ్ఞానం సంగీతాన్ని ఎటువంటి మార్పులకు గురి చేసింది అనే విషయాలను వారి సభలో నాతో మాట్లాడించారు. ఉదయరాగం, సంధ్యారాగం - వంటి విభజన ఎ.సి. ఆడిటోరియం సౌలభ్యం వచ్చిన తర్వాత చెల్లుబాటు అవుతుందా? - వంటి సాంకేతిక విభజన పరమైన పార్శ్వాలు చర్చించే వారికి ఉండనే ఉంటాయి, పాతికేళ్ళక్రితం గోవాలో నేను ఉద్యోగం చేస్తున్నపుడు బొంబాయి ఎడిషన్ 'ది టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రిక ధ్యాన్ నాద్ కర్ణి సంగీత సమీక్షలు, విశ్లేషణలు తరచు ప్రచురించేది. సాంకేతిక సంబంధమైనవి. ఈనేపధ్యంతో తప్పక ప్రసంగించాలి అని సంగీత అస్వాదన సంబంధమైన అంశాలతోపాటు ఆయన రేకత్తించే కోరినపుడు నేను 'సంగీతానికి శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతోపాటు' అనే విషయం గురించి వారి సభలో మాట్లాడాను. ఆ విషయాలను 'మిసిమి’ కళారూపం - సైన్స్' అనే పుస్తకంలో చేర్చాను కూడా! పత్రికలో వ్యాసంగా ప్రచురించాను. అవ్యాసాన్ని పిమ్మట అత్యున్నత బెంగుళూరు నాగరత్నమ్మగారు తన జీవితాన్ని ధారపోసి త్యాగరాజు స్వామి కీర్తనలను మనకు పంచారు. ఇలా ఎంతోమంది తమదైన కృషిని కర్ణాటక సంగీతానికి చేశారు. అటువంటి తరహా సేవను మునుగంటి గారు 'గానకళ' పత్రిక ద్వారా చేశారన్నది వాస్తవం! {{right|రచయిత ఫోన్ : 9440732392}} {{right|హైదరాబాదులో ‘అమ్మనుడి' మాసపత్రిక లభించేచోటు నవోదయ బుక్ హౌస్, ఆర్యసమాజ్ భవనం ఎదురుగా, కాచిగుడా. ఫోన్ : 040-24652387}}<noinclude><references/> తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015</noinclude> smccpiyp73evwdipi6wmiy6214skg1r సూచిక చర్చ:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu 107 217509 567969 2026-08-02T13:15:23Z శ్రీరామమూర్తి 1517 [[WP:AES|←]]Created page with 'ఈ పుస్తకములో 13, 14, 15, 16 పేజీలు లేవు. గమనించగలరు. --~~~~' 567969 wikitext text/x-wiki ఈ పుస్తకములో 13, 14, 15, 16 పేజీలు లేవు. గమనించగలరు. --[[వాడుకరి:శ్రీరామమూర్తి|శ్రీరామమూర్తి]] ([[వాడుకరి చర్చ:శ్రీరామమూర్తి|చర్చ]]) 13:15, 2 ఆగస్టు 2026 (UTC) mddx1go99kvu2izpfavcsqvq7soyk6r పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/5 104 217510 567970 2026-08-02T13:21:08Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '<poem> {{p|fs125|ac}}లోపలి పుటలలో....</p> [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/సమన్యాయం!|ప్రకృతి: సమన్యాయం]]... 23' 567970 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude><poem> {{p|fs125|ac}}లోపలి పుటలలో....</p> [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/సమన్యాయం!|ప్రకృతి: సమన్యాయం]]... 23<noinclude><references/></noinclude> orlutb6eyg7htwwyblaxl5ruw0ve9y0 567971 567970 2026-08-02T13:22:02Z Rajasekhar1961 50 567971 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude><poem> {{p|fs125|ac}}లోపలి పుటలలో....</p> [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/సమన్యాయం!|ప్రకృతి: సమన్యాయం]]... 23 </poem><noinclude><references/></noinclude> 3k7d8ejtqefeysh2h4asj2okejfvr78 567995 567971 2026-08-02T14:14:09Z Rajasekhar1961 50 567995 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude><poem> {{p|fs125|ac}}లోపలి పుటలలో....</p> [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/సమన్యాయం!|ప్రకృతి: సమన్యాయం]]... 23 [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/కడుపుతీపు|చదివితీరవలసిన పొత్తం: కడుపుతీపు]]... 37 </poem><noinclude><references/></noinclude> 04su6zdg0tfwpmekc1lz57zo30i2rad 568046 567995 2026-08-03T06:34:41Z Rajasekhar1961 50 568046 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude><poem> {{p|fs125|ac}}లోపలి పుటలలో....</p> [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/సమన్యాయం!|ప్రకృతి: సమన్యాయం]]... 23 [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/కడుపుతీపు|చదివితీరవలసిన పొత్తం: కడుపుతీపు]]... 37 [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/గానకళ|స్ఫూర్తిప్రదాత: గానకళ]]... 39 </poem><noinclude><references/></noinclude> 8bemlmybmjfdexovojsvnhsfvyp7wnb 568048 568046 2026-08-03T06:38:30Z Rajasekhar1961 50 568048 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude><poem> {{p|fs125|ac}}లోపలి పుటలలో....</p> [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/సమన్యాయం!|ప్రకృతి: సమన్యాయం]]... 23 [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/కడుపుతీపు|చదివితీరవలసిన పొత్తం: కడుపుతీపు]]... 37 [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/'గానకళ' మునుగంటి శ్రీరామమూర్తి|స్ఫూర్తిప్రదాత: గానకళ]]... 39 </poem><noinclude><references/></noinclude> cnzht78rj6w2xqt5kh3igog5etydjkb 568050 568048 2026-08-03T06:48:29Z Rajasekhar1961 50 568050 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude><poem> {{p|fs125|ac}}లోపలి పుటలలో....</p> [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/రెండు తెలుగు రాష్ట్రాలూ తమ భాషావిధానాన్ని ప్రకటించాలి!|సంపాదక హృదయం: రెండు రాష్ట్రాలూ తమ భాషావిధానాన్ని]]... 9 [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/సమన్యాయం!|ప్రకృతి: సమన్యాయం]]... 23 [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/కడుపుతీపు|చదివితీరవలసిన పొత్తం: కడుపుతీపు]]... 37 [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/'గానకళ' మునుగంటి శ్రీరామమూర్తి|స్ఫూర్తిప్రదాత: గానకళ]]... 39 </poem><noinclude><references/></noinclude> 4z5v16o877mk495xllf7rbuwby3wkst 568089 568050 2026-08-03T11:57:07Z Rajasekhar1961 50 568089 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude><poem> {{p|fs125|ac}}లోపలి పుటలలో....</p> [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/రెండు తెలుగు రాష్ట్రాలూ తమ భాషావిధానాన్ని ప్రకటించాలి!|సంపాదక హృదయం: రెండు రాష్ట్రాలూ తమ భాషావిధానాన్ని]]... 9 [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/సమన్యాయం!|ప్రకృతి: సమన్యాయం]]... 23 [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/కడుపుతీపు|చదివితీరవలసిన పొత్తం: కడుపుతీపు]]... 37 [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/'గానకళ' మునుగంటి శ్రీరామమూర్తి|స్ఫూర్తిప్రదాత: గానకళ]]... 39 [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/తాపీ ధర్మారావు స్మారక ప్రసంగం|పురస్కారం: తాపీ…స్మారక ప్రసంగం]]... 50 </poem><noinclude><references/></noinclude> 8wdxa8qliv2wsu2i8pg3jcbxxykw6oy పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/79 104 217511 567973 2026-08-02T13:26:33Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 567973 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|69}}</noinclude>గ్గురు తీసికొను లంచములలో, సగభాగము నాగేశరావుగారి కిచ్చేటట్లున్ను వారి తీర్పులమీద వచ్చు అప్పీళ్లను యీయన ఖాయపరుచునట్లును యేర్పాటుండెనని గొప్పపుకారు, జిల్లా యంతయు బయలుదేరినది. దీనిలో యెంతవరకు సత్యముకలదో నాకు తెలియదుగాని, మిక్కిలి తెలివిగలవాడును, పట్టుదలగలవాడును, నాకు 1895 వ సంవత్సరమునుండి ముఖ్య స్నేహితుడునగు భట్రాజు వేంకటరాయుడుగారు, బాల రామయ్యఅను భూమి ఖామందుతరఫున ప్లీడరుగానుండి, తన క్లయింటుమీద, బందరుమేజిస్ట్రీటు వెంకటరమణయ్యగారును యీ డిప్యూటికలెక్టరు పండిత నాగేశరరావుగారు జరుపుచున్న దౌర్జన్యమును సహించలేక, సబుకోర్టులో నే నున్ను కొండా వెంకటప్పయ్యగారున్ను ఉండగా వచ్చి, మమ్ములను డిప్యూటి కలెక్టరుగారివద్దకు తీసికొనివెళ్ళి సదరు బాల రామయ్యను అక్రమముగా అరెస్టుచేయకూడదని పిటీషను పెట్టించినాడు. దానిలో దురుద్దేశముతోను, కార్పణ్యముతోను, అవనిగడ్డ మేజిస్ట్రీటుకు ప్రాపకుడవై యిట్టిపని జరిగించితివని ఆ పిటీషనులో స్పష్టముగ వ్రాసితిమి. కాని ఆ పిటీషనుమీద పార్టీదస్కతు పుచ్చుకొనలేదు. బాల రామయ్యవలన అఫిడవిట్టున్ను పుచ్చుకొనలేదు. బహుతొందరగా నాగేశ్వరావుగారి యింటికి వెళ్ళి ఆయనచేతి కే యిచ్చినాము. ఆ పిటీషను చేతికీయగానే, అది చదువుకొని, గడగడ వణకి, తరువాత ఆర్డరు వేసెదననియు, బాల రామయ్య, అవనిగడ్డ మేజిస్ట్రేటువద్దకు<noinclude><references/></noinclude> k27wbld2e5xof956icp07pa33jss7fh అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/సమన్యాయం! 0 217512 567974 2026-08-02T13:26:39Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015]] | రచయిత = | అనువాదం= | విభాగము = సమన్యాయం! | ముందరి = [[..//]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Ammanudi juy 2018.pdf" from=23 to=25 /> వర్గం:క్రియేటివ్...' 567974 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015]] | రచయిత = | అనువాదం= | విభాగము = సమన్యాయం! | ముందరి = [[..//]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Ammanudi juy 2018.pdf" from=23 to=25 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] 527ub4wr4fewxr3dmac6jqjlt61cz5x 567975 567974 2026-08-02T13:27:43Z Rajasekhar1961 50 567975 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015]] | రచయిత = | అనువాదం= | విభాగము = సమన్యాయం! | ముందరి = [[..//]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf" from=23 to=25 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] baiyhqm7yp254li0s6577xhg8ycdr0k 567976 567975 2026-08-02T13:28:45Z Rajasekhar1961 50 567976 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015]] | రచయిత = కొప్పుల హేమాద్రి | అనువాదం= | విభాగము = సమన్యాయం! | ముందరి = [[..//]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf" from=23 to=25 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] 64owxkopzigfb7n8cygxscvehc1mrej 567985 567976 2026-08-02T13:51:59Z Rajasekhar1961 50 567985 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015]] | రచయిత = కొప్పుల హేమాద్రి | అనువాదం= | విభాగము = సమన్యాయం! | ముందరి = [[..//]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf" from=23 to=23 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] 57bgqdmqj36h8ncikvsugsx803of3u9 పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/80 104 217513 567977 2026-08-02T13:35:32Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 567977 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|70|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>ఒక నిర్దిష్టమైన తేదీలోగా హాజరయ్యేవరకు, పూచీఖత్తు తనకు యిచ్చి తీరవలెనని చెప్పినారు. అయిదారు దినములు గడచిన తరువాత, దిరిశివల్లి బాచిలో, తాను వాదిగానున్నను నేను ప్రతివాదుల తరఫున పనిచేయుచుండుటచే నా మీద యీర్ష్యవహించిన పబ్లీకు ప్రాసిక్యూటరు శి. రంగాచార్లుగారి సహాయముతో మద్రాసులోనున్న పి. శివస్వామయ్యరుగారికివ్రాసి సలహా తెచ్చుకొని, నాకును, వెంకటప్పయ్యగారికిని, బాల రామయ్యకును, పీనల్ కోడ్డు 228 శెక్షనుక్రింద నేరముమోపి, యేల మమ్మును క్రిమినల్‌కోర్టులో ప్రాసిక్యూటుచేయకూడదో సముజాయిషీ యీయవలసినదని నాగేశ్వరావుగారు నోటీసులను జారీచేయించిరి. ఈ సంగతులన్నియు, మాకు ముందే చూచాయగా తెలిసి, బాలరామయ్యచేత ప్రమాణపత్రమును తీసికొని క్లబ్బులోనే, మెంబరుగు వేమూరి సుబ్బారావుపంతులుగారు, ఆనరెరీ మేజిస్ట్రీటుగా నుండుటచే, ఆయనయెదుట ధృవపరపించి, చర్యలోదిగితిమి. మేము హైకోర్టువరకుపోయి తుదకు 1905 సంవత్సరము సెప్టెంబరు మాసములో మేము నిర్దోషులమని యెంచబడి, నాగేశరావుగారికి చీవాట్లు సంభవించినవి. ఈ కేజు మద్రాసు లా రిపోర్టులో కొద్దిగాపడెను. (29 మద్రాసు 110 పేజి.) అయినను మెయిలుపత్రికలో విపులముగా కోర్టులో జరిగినవిషయము అచ్చు వేయబడినది గనుక యీ గ్రంథములో చివరను దానిని ముద్రింపించితిని. 1905 వ సంవత్సరములో బందరు సబుకోర్టు యేలూ<noinclude><references/></noinclude> qmlvamptrcwgf1wuowt8pcfq5m9nqam పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/81 104 217514 567981 2026-08-02T13:44:33Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 567981 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|71}}</noinclude>రుకు మార్చబడినది. అప్పుడు రెంటాల వేంకటసుబ్బారావుగారు నన్ను మద్రాసులోనే ప్రాక్టీసు చేయవలసినదని చెప్పగా ఒప్పుకొంటినిగాని, యింటికివచ్చి పుస్తకములు ప్యాకేజిచేయుచుండగా మా గుమస్తాభాగవతుల పిచ్చయ్యగారు, నాకు క్లయంట్లువలన, వారిలో ముఖ్యముగా మీర్జాపురం జమీందారువలన రావలసిన బాకీలు వసూలు కానందున వెళ్లుటకు వీలులేదని నా ప్రయాణము నప్పటికి మానిపించినారు. నా క్లయంటైన మీర్జాపురం జమీందారుగారికి నిడదవోలు రిశీవరుయొద్దనుండి రావలసిన సుమారు ముప్పదిమూడువేల రూపాయిల చెక్కుకు అప్లి కేషన్ పెట్టితిని. అది నా పేర ఆర్డరైనదిగాని, యింతలో బందరు సబుకోర్టు యేలూరుకు ట్రాన్‌సుఫరు అగుటవలన అక్కడిప్లీడరు మోచర్ల రామచంద్రరావుగారికి తాజా వకాలతునామా యిచ్చి సొమ్మురాబట్టమని జమీందారుగారికి నేనే వ్రాసినాను. తరువాత నేను నా మేనమామ కొమారుడు పాలపర్తి శివరావుగారి గృహప్రవేశోత్సవమునకు వెళ్లగా యేలూరు సబుకోర్టు శిరస్తాదారగు కస్తూరి కృష్ణానందంగారు, నా పేరు చెక్కు వ్రాసి శిద్ధముగా నున్నదనియు, నన్ను తీసికొని పోవలసినదనియు చెప్పగా, ఆ చెక్కును పుచ్చుకొని, బందరు ట్రెజరీలో మార్చి యెనిమిదివేల రూపాయిలు మాత్రము నా ఖాతాబాకీ క్రింద యుంచితి ననిన్ని, తక్కినది పంపివేసితిననిన్ని, వారింకను కొంతపంపమంటె మరినాలుగువేల రూపాయిలు మాత్రము పంపెద<noinclude><references/></noinclude> kfez5vglx2ptvvp6dkw783vo1di02t9 రచయిత:కొప్పుల హేమాద్రి 102 217515 567982 2026-08-02T13:47:41Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{రచయిత |ఇంటిపేరు = కొప్పుల |అసలుపేరు = హేమాద్రి |పేరు_మొదటి_అక్షరం = హ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = కొప్పుల హేమాద్రి |వికీవ్యాఖ్య_లంకె = |కామన...' 567982 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = కొప్పుల |అసలుపేరు = హేమాద్రి |పేరు_మొదటి_అక్షరం = హ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = కొప్పుల హేమాద్రి |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[సమన్యాయం]] (2015) 413qjjj3mbyj64z95hplut4je0sl9nb 567983 567982 2026-08-02T13:48:24Z Rajasekhar1961 50 /* రచనలు */ 567983 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = కొప్పుల |అసలుపేరు = హేమాద్రి |పేరు_మొదటి_అక్షరం = హ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = కొప్పుల హేమాద్రి |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/సమన్యాయం!]] (2015) mzv6kzlhel370cdrkdt8vtf2ktw2wou 567984 567983 2026-08-02T13:49:05Z Rajasekhar1961 50 567984 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = కొప్పుల |అసలుపేరు = హేమాద్రి |పేరు_మొదటి_అక్షరం = హ |పుట్టిన_యేడు = 1938 |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = కొప్పుల హేమాద్రి |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/సమన్యాయం!]] (2015) hrizwsfq37x932lppmzr2jd3vp81ofy పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/82 104 217516 567986 2026-08-02T13:53:39Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 567986 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|72|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>ననిన్ని జమీందారుగారికి వ్రాసితిని. నే నదివరకు నూజివీడు వెళ్ళి యావత్తులెక్క తేల్చుకొని ఆరువేలరూపాయిలకు లెక్కజమాఖర్చు, నా దస్కతుతో వారి కిచ్చియుంటిని. అటులైనను, దానిలో రెండువేలరూపాయిలు బాకీ కనపరచినట్లు వారు జవాబువ్రాయగా, నేను వ్రాసియిచ్చిన లెక్క జాబితాలో కొన్ని అంకెలుదిద్ది ఫోర్జరీచేసి యుండవలెననియు, అసలు కాపీని చూపించినయెడల నిజము తేలుననియు స్పష్టముగా వ్రాసివేసినాను. ఇంతటితో యీ విషయముముగిసినది. దీని దరిమిలాను కూడా, జమీందారుగారి తరఫున వ్యాజ్యములలో పనిచేయుచునే యుంటిని. ఇట్లుండగా, అకస్మాత్తుగా 1907 సం॥ మెయి నెలలో నేను నందిగామజిల్లా కాన్ఫరెన్సుకు ప్రెసిడెంటుగా వెళ్లుటకు ప్రయాణమగుచుండగా, ఆదివారము పగలు 9 గంటలకు పండిత నాగేశరావుగారు నా ఆఫీసులోని కొన్ని కాగితములకు సెర్చివారంటు పంపినారు. నా మీదను మీర్జాపురం జమీందారుగారు, తన సెక్రటరీ పార్ధసారధిచేత, యీ డిప్యూటీకలెక్టరుగారియొద్ద సొమ్ముహరించిన నేరమునకు క్రిమినల్ కంప్లెయింటు దాఖలు చేయించెనట! నేను నాప్రయాణమును ఆపక నా గుమాస్తా భాగవతుల పిచ్చయ్యగారిని నా స్నేహితులైన భట్రాజు వేంకటరాయుడుగారిని, సామ్యుయల్ గారిని నా ఆఫీసులో నుంచి, నేను జట్కామీద, పెడనకువెళ్ళి, అక్కడకు నూతనముగా వేయుచుండిన రైలుబండిలో బెజవాడకు వెళ్ళి<noinclude><references/></noinclude> 6wbz191ldaiur36qux5b7ee331sa2jb పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/37 104 217517 567987 2026-08-02T14:02:02Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చదివితీరవలసిన పొత్తం - - సన్నిధానం నరసింహశర్మ కడుపు తీపు చదువతగిన పుస్తకాలు ఎన్నో వుంటాయి... కానీ చదివి తీరవలసిన పుస్తకాలు కొన్నే వుంటాయి. చదివితీరవలసిన వాటిలో వర్తమానకాల...' 567987 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>చదివితీరవలసిన పొత్తం - - సన్నిధానం నరసింహశర్మ కడుపు తీపు చదువతగిన పుస్తకాలు ఎన్నో వుంటాయి... కానీ చదివి తీరవలసిన పుస్తకాలు కొన్నే వుంటాయి. చదివితీరవలసిన వాటిలో వర్తమానకాలానివీ వుంటాయి. అటువంటివాటిలో - ముఖ్యంగా ఖండ కాన్యాలలో వేటూరి ప్రభాకరశాస్త్రి 'కదుపుతీపి' ఒకటి. తెలుగు సాహిత్యానికి వేయేళ్ళ సేవ చేసిన ప్రక్రియ పద్యకవితా ప్రక్రియ. అన్ని ప్రక్రియల ఫలాలూ అనుభవైకవేద్యాలుగా చేసుకుంటే తెలుగు సాహిత్య వృక్ష శాఖలన్నీ తెలుస్తాయి. 2015 ఫిబ్రవరి 7వ తేదీకి ఓ ప్రత్యేకత వుంది. అది భాషా సాహిత్యాల పరిశోధకుడు, ప్రజావాఙ్మయానికి కొంత సేవ చేసిన వేటూరి ప్రభాకరశాస్త్రి గారి 127వ జయంతి రోజు. అరవై రెండు సంవత్సరాలే జీవించిన ఆయన అనేక రచనలతోపాటు 'తెలుగు మెఱుగులు' పొత్తమును తెలుగు సరస్వతి కలంకారం చేశారు. "ఒడిదొడుకులు లేని తేట తెలుగు కవితా రచన చేసినవారిగా, అచ్చుయంత్రముల వెలుగు నెఱుగక మట్టి బ్రుంగిన తాటి యాకులను బట్టుకుని కన్నులు చిల్లులుచేసికొనెడి నిరంతర (సాహితీ) వ్యవసాయము చేసినవారిగా వేటూరివారిని 'ఆంధ్ర రచయితలు' ప్రామాణిక గ్రంథంలో మధునాపంతులవారు శ్లాఘించారు. *భాషాపరిశోధకులు, విమర్శకులు కవులుగా నగుట అరుదు. ఆ యదృష్టము ఒక్క ప్రభాకరశాస్త్రిగారికి పట్టినది' అనేది కూడా సత్యనారాయణ శాస్త్రిగారి సత్యవాక్యము. స్థలమై, శ్రీకాకుళాభి ధానమ్మున బే ర్వేలసిన పురమంధ్రావని వెలనాటన్ గృష్ణపెంపు వెలసిన చోటన్ - అనేది మొదటి పద్యం కొన్ని శాసనాల్లో ఆంధ్రకు ఆంధ్ర అనే వుంది. ఆంధ్రదేశంలో నెలనాట కృష్ణానది వెలసిన చోట, ఆంధ్రవిష్యస్థలమైన శ్రీపురం శ్రీకాకుళం అని వుంది కదా అని శ్రవణ సుభగంగా ప్రారంభం. ఆ ఊళ్ళో ఒక ఓవర్సీర్ కుటుంబం వుంది. వయసులో ఉన్నవాడు. తమిళుడు, ఆయన ఇల్లాలు, నలుగురైదుగురు బిడ్డలు. అందపు గందులు, ఆ కుటుంబంలో సర్వ సౌఖ్యాలూ వున్నాయి. చక్కని సంస్కృతి కల కుటుంబం పిల్లాడు ఆ తల్లిపాలు త్రాగడం సహజంగా ఒక్క పద్యంలో ఆయన కేవలం కవేకాదు, ప్రత్యేకించి చెప్పుకోదగ్గ సవర్ణదీర్ఘసంధి రహిత మహాకవి కూడా. ఈ విషయాన్ని ఖండితంగా చెప్పడానికి ఆయన రాసిన నాలుగు ఖండకావ్యాల్లో 'కడుపుతీపు' 'కపోతకథ' సాక్ష్యాలు పల్కుతాయి. అందులో 'కదుపుతీపు' చదవితీరవలసిన కావ్యంగా భావించాలి. ఇప్పటికి తొంభైసంవత్సరాల క్రితం అంటే 1925లో చెన్నపురిలో ఆంధ్ర పత్రికా ముద్రాలయం వారు అచ్చొత్తించిన ఖండకావ్యం కడుపుతీపు. ఇది అచ్చమైన తెలుగుదనం కల శీర్షిక. టేపటివేళ, మాపటివేళ, చీకటివేళ, ముగింపు అనే నాలుగు శీర్షికల్లో కైత బిగింపు సొంపులుంటాయి. కథ చెప్పినట్లు సాగుతాయి పద్యాలు కలదెగద యంధ్రవిష్ణు "గొబ్బున వచ్చి యొక్కలను గుడ్చుచు నీడ్చుచు త్రైక మారుచే బ్రబ్బి మరొక్క సన్ దడవి పట్టుచు రెండును బాలవంకలై యుబ్బి స్రవింపగా జననియుం దల మూర్కొన పొట్టనిండగా జుబ్బనజూఱలాడెడు నినుంగు గనుంగొన వేడుకయ్యెడున్" అని చెప్పారు. తల్లీబిడ్డల ప్రేమపాళ్ళు సహజక్రియలూ గల ఈపద్యంలోని భావదృశ్య శిల్పం భావించి మనంకూడా బిడ్డలుగా మారుతామనిపిస్తుంది. ఈసందర్భంలో - బెద్దలకి పాలెక్కడిస్తే సవసౌందర్యం తగ్గిపోతుందనుకునే తల్లుల భావాలపై వేటూరివారు ఒక వేటువేస్తారు తెలుగుదనం నిండుగాగల ఓ పద్యంలో "కుచసంపన్నత కూలిపోవుననియా ట్రౌబ్బారు మైసారు విం ఈ చమత్కారములంతరించునని యో ప్రవ్యంబులేకుండ గు బ్బ చనుల్ దిబ్బలుగా నొనర్చుకొని ద(డబ్బా పాలచే నిప్పు పు చయంబుం బరిమార్చు మాతలటె మాతల్! కాలదూతల్గదా! కదుపుతీపు కధలో కవి వేటూరి జోక్యం కల్పించుకుని చెప్పిన పద్యంలోని భావం సువ్యక్తమే. పదలాలిత్యం, తర్కశుద్ధి, శబ్ద స్థైర్యం, అలంకార విశేషం ఇలాంటి వెన్నో వుండి గుజ్జుంలా సాగాలి పద్యం అనే లక్షణాలన్నీ సలక్షణంగా ఈ ఒక్కపద్యంలోనే కాదు అన్ని పద్యాలలో ఉండడం ఈ కావ్యవిశేషం. ఎంతటి సుహాకవి పద్యరచనలోనైనా ఎక్కడో అక్కడ పదులు నదులు Loose Compostion కలయికలుండవచ్చేమోగాని, వేటూరి పద్య<noinclude><references/> తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015</noinclude> ayisl8dyv79rawiwmzkhiqp9iydvo5a 567990 567987 2026-08-02T14:07:18Z Rajasekhar1961 50 567990 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>చదివితీరవలసిన పొత్తం - - సన్నిధానం నరసింహశర్మ కడుపు తీపు చదువతగిన పుస్తకాలు ఎన్నో వుంటాయి... కానీ చదివి తీరవలసిన పుస్తకాలు కొన్నే వుంటాయి. చదివితీరవలసిన వాటిలో వర్తమానకాలానివీ వుంటాయి. అటువంటివాటిలో - ముఖ్యంగా ఖండ కాన్యాలలో వేటూరి ప్రభాకరశాస్త్రి 'కదుపుతీపి' ఒకటి. తెలుగు సాహిత్యానికి వేయేళ్ళ సేవ చేసిన ప్రక్రియ పద్యకవితా ప్రక్రియ. అన్ని ప్రక్రియల ఫలాలూ అనుభవైకవేద్యాలుగా చేసుకుంటే తెలుగు సాహిత్య వృక్ష శాఖలన్నీ తెలుస్తాయి. 2015 ఫిబ్రవరి 7వ తేదీకి ఓ ప్రత్యేకత వుంది. అది భాషా సాహిత్యాల పరిశోధకుడు, ప్రజావాఙ్మయానికి కొంత సేవ చేసిన వేటూరి ప్రభాకరశాస్త్రి గారి 127వ జయంతి రోజు. అరవై రెండు సంవత్సరాలే జీవించిన ఆయన అనేక రచనలతోపాటు 'తెలుగు మెఱుగులు' పొత్తమును తెలుగు సరస్వతి కలంకారం చేశారు. "ఒడిదొడుకులు లేని తేట తెలుగు కవితా రచన చేసినవారిగా, అచ్చుయంత్రముల వెలుగు నెఱుగక మట్టి బ్రుంగిన తాటి యాకులను బట్టుకుని కన్నులు చిల్లులుచేసికొనెడి నిరంతర (సాహితీ) వ్యవసాయము చేసినవారిగా వేటూరివారిని 'ఆంధ్ర రచయితలు' ప్రామాణిక గ్రంథంలో మధునాపంతులవారు శ్లాఘించారు. ’భాషాపరిశోధకులు, విమర్శకులు కవులుగా నగుట అరుదు. ఆ యదృష్టము ఒక్క ప్రభాకరశాస్త్రిగారికి పట్టినది' అనేది కూడా సత్యనారాయణ శాస్త్రిగారి సత్యవాక్యము. ఆయన కేవలం కవేకాదు, ప్రత్యేకించి చెప్పుకోదగ్గ సవర్ణదీర్ఘసంధి రహిత మహాకవి కూడా. ఈ విషయాన్ని ఖండితంగా చెప్పడానికి ఆయన రాసిన నాలుగు ఖండకావ్యాల్లో 'కడుపుతీపు' 'కపోతకథ' సాక్ష్యాలు పల్కుతాయి. అందులో 'కదుపుతీపు' చదవితీరవలసిన కావ్యంగా భావించాలి. ఇప్పటికి తొంభైసంవత్సరాల క్రితం అంటే 1925లో చెన్నపురిలో ఆంధ్ర పత్రికా ముద్రాలయం వారు అచ్చొత్తించిన ఖండకావ్యం కడుపుతీపు. ఇది అచ్చమైన తెలుగుదనం కల శీర్షిక. టేపటివేళ, మాపటివేళ, చీకటివేళ, ముగింపు అనే నాలుగు శీర్షికల్లో కైత బిగింపు సొంపులుంటాయి. కథ చెప్పినట్లు సాగుతాయి పద్యాలు కలదెగద యంధ్రవిష్ణు స్థలమై, శ్రీకాకుళాభి ధానమ్మున బే ర్వేలసిన పురమంధ్రావని వెలనాటన్ గృష్ణపెంపు వెలసిన చోటన్ - అనేది మొదటి పద్యం కొన్ని శాసనాల్లో ఆంధ్రకు ఆంధ్ర అనే వుంది. ఆంధ్రదేశంలో నెలనాట కృష్ణానది వెలసిన చోట, ఆంధ్రవిష్యస్థలమైన శ్రీపురం శ్రీకాకుళం అని వుంది కదా అని శ్రవణ సుభగంగా ప్రారంభం. ఆ ఊళ్ళో ఒక ఓవర్సీర్ కుటుంబం వుంది. వయసులో ఉన్నవాడు. తమిళుడు, ఆయన ఇల్లాలు, నలుగురైదుగురు బిడ్డలు. అందపు గందులు, ఆ కుటుంబంలో సర్వ సౌఖ్యాలూ వున్నాయి. చక్కని సంస్కృతి కల కుటుంబం పిల్లాడు ఆ తల్లిపాలు త్రాగడం సహజంగా ఒక్క పద్యంలో "గొబ్బున వచ్చి యొక్కలను గుడ్చుచు నీడ్చుచు త్రైక మారుచే బ్రబ్బి మరొక్క సన్ దడవి పట్టుచు రెండును బాలవంకలై యుబ్బి స్రవింపగా జననియుం దల మూర్కొన పొట్టనిండగా జుబ్బనజూఱలాడెడు నినుంగు గనుంగొన వేడుకయ్యెడున్" అని చెప్పారు. తల్లీబిడ్డల ప్రేమపాళ్ళు సహజక్రియలూ గల ఈపద్యంలోని భావదృశ్య శిల్పం భావించి మనంకూడా బిడ్డలుగా మారుతామనిపిస్తుంది. ఈసందర్భంలో - బెద్దలకి పాలెక్కడిస్తే సవసౌందర్యం తగ్గిపోతుందనుకునే తల్లుల భావాలపై వేటూరివారు ఒక వేటువేస్తారు తెలుగుదనం నిండుగాగల ఓ పద్యంలో "కుచసంపన్నత కూలిపోవుననియా ట్రౌబ్బారు మైసారు విం ఈ చమత్కారములంతరించునని యో ప్రవ్యంబులేకుండ గు బ్బ చనుల్ దిబ్బలుగా నొనర్చుకొని ద(డబ్బా పాలచే నిప్పు పు చయంబుం బరిమార్చు మాతలటె మాతల్! కాలదూతల్గదా! కదుపుతీపు కధలో కవి వేటూరి జోక్యం కల్పించుకుని చెప్పిన పద్యంలోని భావం సువ్యక్తమే. పదలాలిత్యం, తర్కశుద్ధి, శబ్ద స్థైర్యం, అలంకార విశేషం ఇలాంటి వెన్నో వుండి గుజ్జుంలా సాగాలి పద్యం అనే లక్షణాలన్నీ సలక్షణంగా ఈ ఒక్కపద్యంలోనే కాదు అన్ని పద్యాలలో ఉండడం ఈ కావ్యవిశేషం. ఎంతటి సుహాకవి పద్యరచనలోనైనా ఎక్కడో అక్కడ పదులు నదులు Loose Compostion కలయికలుండవచ్చేమోగాని, వేటూరి పద్య<noinclude><references/> తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015</noinclude> httyy8q1c7k5con7wqc774hggwbyfy5 568042 567990 2026-08-03T06:09:05Z Rajasekhar1961 50 568042 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{rh|చదివితీరవలసిన పొత్తం || సన్నిధానం నరసింహశర్మ}} {{p|fs150|ac}}కడుపు తీపు</p> {{di|చ}}దువతగిన పుస్తకాలు ఎన్నో వుంటాయి... కానీ చదివితీరవలసిన పుస్తకాలు కొన్నే వుంటాయి. చదివితీరవలసిన వాటిలో వర్తమానకాలానివీ వుంటాయి. అటువంటివాటిలో - ముఖ్యంగా ఖండకావ్యాలలో వేటూరి ప్రభాకరశాస్త్రి 'కడుపుతీపి' ఒకటి. తెలుగు సాహిత్యానికి వేయేళ్ళ సేవ చేసిన ప్రక్రియ పద్యకవితా ప్రక్రియ. అన్ని ప్రక్రియల ఫలాలూ అనుభవైకవేద్యాలుగా చేసుకుంటే తెలుగు సాహిత్య వృక్ష శాఖలన్నీ తెలుస్తాయి. 2015 ఫిబ్రవరి 7వ తేదీకి ఓ ప్రత్యేకత వుంది. అది భాషా సాహిత్యాల పరిశోధకుడు, ప్రజావాఙ్మయానికి కొంత సేవ చేసిన వేటూరి ప్రభాకరశాస్త్రి గారి 127వ జయంతి రోజు. అరవై రెండు సంవత్సరాలే జీవించిన ఆయన అనేక రచనలతోపాటు 'తెలుగు మెఱుగులు' పొత్తమును తెలుగు సరస్వతి కలంకారం చేశారు. "ఒడిదొడుకులు లేని తేట తెలుగు కవితా రచన చేసినవారిగా, అచ్చుయంత్రముల వెలుగు నెఱుగక మట్టి బ్రుంగిన తాటి యాకులను బట్టుకుని కన్నులు చిల్లులుచేసికొనెడి నిరంతర (సాహితీ) వ్యవసాయము చేసినవారిగా వేటూరివారిని 'ఆంధ్ర రచయితలు' ప్రామాణిక గ్రంథంలో మధునాపంతులవారు శ్లాఘించారు. ’భాషాపరిశోధకులు, విమర్శకులు కవులుగా నగుట అరుదు. ఆ యదృష్టము ఒక్క ప్రభాకరశాస్త్రిగారికి పట్టినది' అనేది కూడా సత్యనారాయణ శాస్త్రిగారి సత్యవాక్యము. ఆయన కేవలం కవేకాదు, ప్రత్యేకించి చెప్పుకోదగ్గ సవర్ణదీర్ఘసంధి రహిత మహాకవి కూడా. ఈ విషయాన్ని ఖండితంగా చెప్పడానికి ఆయన రాసిన నాలుగు ఖండకావ్యాల్లో 'కడుపుతీపు' 'కపోతకథ' సాక్ష్యాలు పల్కుతాయి. అందులో 'కడుపుతీపు' చదవితీరవలసిన కావ్యంగా భావించాలి. ఇప్పటికి తొంభైసంవత్సరాల క్రితం అంటే 1925లో చెన్నపురిలో ఆంధ్రపత్రికా ముద్రాలయం వారు అచ్చొత్తించిన ఖండకావ్యం కడుపుతీపు. ఇది అచ్చమైన తెలుగుదనం కల శీర్షిక. టేపటివేళ, మాపటివేళ, చీకటివేళ, ముగింపు అనే నాలుగు శీర్షికల్లో కైత బిగింపు సొంపులుంటాయి. <poem>కథ చెప్పినట్లు సాగుతాయి పద్యాలు కలదెగద యంధ్రవిష్ణు స్థలమై, శ్రీకాకుళాభి ధానమ్మున బే ర్వేలసిన పురమంధ్రావని వెలనాటన్ గృష్ణపెంపు వెలసిన చోటన్ - అనేది మొదటి పద్యం కొన్ని శాసనాల్లో ఆంధ్రకు ఆంధ్ర అనే వుంది. ఆంధ్రదేశంలో నెలనాట కృష్ణానది వెలసిన చోట,</poem> ఆంధ్రవిష్యస్థలమైన శ్రీపురం శ్రీకాకుళం అని వుంది కదా అని శ్రవణ సుభగంగా ప్రారంభం. ఆ ఊళ్ళో ఒక ఓవర్‌సీర్ కుటుంబం వుంది. వయసులో ఉన్నవాడు. తమిళుడు, ఆయన ఇల్లాలు, నలుగురైదుగురు బిడ్డలు. అందపు గందులు, ఆ కుటుంబంలో సర్వ సౌఖ్యాలూ వున్నాయి. చక్కని సంస్కృతి కల కుటుంబం పిల్లాడు ఆ తల్లిపాలు త్రాగడం సహజంగా ఒక్క పద్యంలో <poem>"గొబ్బున వచ్చి యొక్కలను గుడ్చుచు నీడ్చుచు ఱైక మారుచే, బ్రబ్బి మరొక్క సన్ దడవి పట్టుచు రెండును బాలవంకలై యుబ్బి స్రవింపగా జననియుం దల మూర్కొన పొట్టనిండగా జుబ్బనజూఱలాడెడు నినుంగు గనుంగొన వేడుకయ్యెడున్"</poem> అని చెప్పారు. తల్లీబిడ్డల ప్రేమపాళ్ళు సహజక్రియలూ గల ఈపద్యంలోని భావదృశ్య శిల్పం భావించి మనంకూడా బిడ్డలుగా మారుతామనిపిస్తుంది. ఈసందర్భంలో - బెద్దలకి పాలెక్కడిస్తే స్తనసౌందర్యం తగ్గిపోతుందనుకునే తల్లుల భావాలపై వేటూరివారు ఒక వేటువేస్తారు తెలుగుదనం నిండుగాగల ఓ పద్యంలో <poem>"కుచసంపన్నత కూలిపోవుననియో క్రొవ్వారు మైసౌరు విం త చమత్కారములంతరించునని యో స్తన్యంబులేకుండ గు బ్బ చనుల్ దిబ్బలుగా నొనర్చుకొని ద(డ)బ్బా పాలచే నిప్డు పు త్త్ర చయంబుం బరిమార్చు మాతలటె మాతల్! కాలదూతల్‌గదా!</poem> కదుపుతీపు కధలో కవి వేటూరి జోక్యం కల్పించుకుని చెప్పిన పద్యంలోని భావం సువ్యక్తమే. పదలాలిత్యం, తర్కశుద్ధి, శబ్ద స్థైర్యం, అలంకార విశేషం ఇలాంటి వెన్నో వుండి గుఱ్ఱంలా సాగాలి పద్యం అనే లక్షణాలన్నీ సలక్షణంగా ఈ ఒక్కపద్యంలోనే కాదు అన్ని పద్యాలలో ఉండడం ఈ కావ్యవిశేషం. ఎంతటి మహాకవి పద్యరచనలోనైనా ఎక్కడో అక్కడ పదులు వదులు Loose Compostion కలయికలుండవచ్చేమోగాని, వేటూరి పద్య<noinclude><references/> {{rh|తెలుగుజాతి పత్రిక| అమ్మనుడి |మార్చి 2015}}</noinclude> 727dy3vpyi4gfw9lv0o64789q0qy6vi పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/83 104 217518 567988 2026-08-02T14:04:00Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 567988 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|73}}</noinclude>తిని. ఆ వెనుకటిదినమే లాలాలజపతిరాయిగారి అక్రమపు అరెస్టునుగురించి జరిగిన మీటింగులో మాట్లాడియున్నాను. విక్టోరియా మిమోరియల్ హాలు యొక్క నిబంధన విషయమై పురాణం వెంకటప్పయ్యగారి చర్యను ఖండించుచు మీటింగులు చేయుచుంటిని. ఎల్లేపద్ది జానకిరామయ్యగారు, ఒక వితంతువు ఆస్తిని, ఆమె ప్లీడరుగానుండి, అన్యాయముగా తానుకొని ఆమెను దత్తుచేసికొనకుండా ఆంక్షలో నుంచగా ఆ యాంక్షను నిర్లక్ష్యము చేసి ఆమెకు దత్తతచేయించితిని. వెంకటప్పయ్యగారి తండ్రి ఒకసభాపతిగా నుండి మమ్ము నాంక్షచేయించినందుకు నేను పబ్లీకు మీటింగులుచేసి ఆ యాంక్షను నిర్మూలన మొనరించితిని. ఈ బృందమువారి సలహాపైని, నా విరోధియగు నాగేశ్వరావుగారి యెదుట ఆ స్వరాజ్యాందోళన దినములలో చార్జియిచ్చిన యెడల ఆయన నాకు తప్పక కఠినశిక్ష వేయుననియు అప్పీలులో తెల్లదొర ఖాయముచేయక మానడనియు వీరందరు గూడుపుఠాణిచేసి యీ చర్య నా మీద జరిపినారని నేను గట్టిగ నమ్ముచున్నాను. నేను నందిగామ నుండి వచ్చినతరువాత నా కేజు వాయిదా దినముననే యీ నాగేశ్వరావుగారి ప్రాపకుడుగు పార్సెన్సుగారు వెళ్ళిపోయి మారిసుదొరగారు డిస్ట్రిక్టు మేజిస్ట్రీటుగా వచ్చినందున, ఆయన యెదుట కేజు ట్రాన్సుఫరు చేయవలసినదని పిటీషను పెట్టితిని. అదివరకు మా కిద్దరుకు జరిగిన ప్రొసీడింగ్సు చూపగానే ఆయన కేజును తక్షణము నా కోరికపయిననే బెజవాడ సబు<noinclude><references/></noinclude> e3sdplobyyot8fsbkvv11vu4mb7lc03 పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/84 104 217519 567993 2026-08-02T14:12:39Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 567993 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|74|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>కలెక్టరు బర్కిట్టుగారివద్దకు ట్రాన్సుఫరు చేసినారు. 1907 వ సంవత్సరము జూలైనుండి డిశెంబరు ఆఖరువరకు ప్రతినెల మొదటివారమున నా వీలుకొరకు కేజును కోర్టువారు తీసికొనుచుండిరి. ప్రతివాయిదాకు చెన్న పట్టణమునుండి టంగుటూరి ప్రకాశంగారిని, బందరునుండి వేమవరపు రామదాసుగారిని తెప్పించుకొనుచుంటిని. కంప్లెయినెంటు రాజుగారు చెన్న పట్టణమునుండి దినమునకు రు 250 లు యిచ్చి గవర్నమెంటు ప్లీడరు పవలుదొరగారిని రు 75 లు యిచ్చి వెనుకటి క్రిమినల్ కేజులో నా తరపునయున్న డాక్టరుస్వామినాధంగారిని తెప్పించుకొనుచుండిరి. ఆ కాలములో ఒకసంవత్సరమునుండి నాకు డొక్కలో శూలనొప్పి ప్రవేశించినది. నా మీద చార్జినిలిపి నా యుత్తరసాక్ష్యము తీసికొని నా మీద చార్జీని కొట్టివేసి నేను నిరపరాధినని బర్కెటుగారు ఒకదీర్ఘమైన తీర్పుయిచ్చినారు. ఈ కేజులో మా జమీందారుగారికి పదిహేడువేల రూపాయిలు ఖర్చు అయినదట ! దీనిఫలితమును బట్టియే యీయన నా మీద హైకోర్టులో పెట్టిన పిటీషన్ క్కూడ రద్దు అయినది. బర్కిటుదొరగారు డిసెంబరు శలవులలో తీర్పుచెప్పెదమనియు, నేను పూచీకత్తుమీద నున్నను యిక రా నక్కర లేదనియు చెప్పుటచేత నేను, ప్రకాశంగారు, రామదాసుగారు కలసి సూరతు కాంగ్రెసుకు వెళ్లినాము. తిరిగి వచ్చేటప్పుడు నాసికాత్రయంబకములకు వెళ్లితిమి. అదివరకు 1905,<noinclude><references/></noinclude> gfvyltms9ammaa6bbbba4olmtge7nwi అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/కడుపుతీపు 0 217520 567997 2026-08-02T14:20:24Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015]] | రచయిత | అనువాదం= | విభాగము = కడపుతీపు | ముందరి = [[..//]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf" from=37 to=37 /> వర్గం:క్రి...' 567997 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015]] | రచయిత | అనువాదం= | విభాగము = కడపుతీపు | ముందరి = [[..//]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf" from=37 to=37 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] g8skw8fvt4spesnexfb59d0r6nuybdm 567998 567997 2026-08-02T14:21:19Z Rajasekhar1961 50 567998 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015]] | రచయిత = | అనువాదం= | విభాగము = కడుపుతీపు | ముందరి = [[..//]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf" from=37 to=37 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] nymo0lc0gcil0dif8to2oid1q1ut5bz 568000 567998 2026-08-02T14:21:44Z Rajasekhar1961 50 568000 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015]] | రచయిత = సన్నిధానం నరసింహశర్మ | అనువాదం= | విభాగము = కడుపుతీపు | ముందరి = [[..//]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf" from=37 to=37 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] 78csmpsw4ffqjgk5bvl86se1domvkxu 568044 568000 2026-08-03T06:22:45Z Rajasekhar1961 50 568044 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015]] | రచయిత = సన్నిధానం నరసింహశర్మ | అనువాదం= | విభాగము = కడుపుతీపు | ముందరి = [[..//]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf" from=37 to=38 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] s5tp1svfe0o0t2id5ikfo46qdvgeci7 పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/85 104 217521 567999 2026-08-02T14:21:36Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 567999 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|75}}</noinclude>1906 సంవత్సరములలో కాశీ, కలకత్తా కాంగ్రెసులకు పోయి, అయోధ్య మొదలగు పుణ్యస్థలములను చూచివచ్చితిని. మీర్జాపురం జమీందారుగారు నామీద నింకను కార్పణ్యము వహించి రు 12000లును పై వ్యవహారములో నాయొద్ద తన సొమ్ము వడ్డీతో నిలవయున్నదని దావా వేసెను. నేను కూడా నామీద తాను తప్పుడుచార్జి యిచ్చినందుకు రు 10000 లకు దావా తెచ్చితిని. ఈ రెండు దావాలును చాలకాలము బందరు జిల్లాకోర్టులో పెండింగులో నుండి తుదకు యేలూరుకు ట్రాన్‌సుఫరు చేయబడినవి. అక్కడ నాతరపున పెద్దాడ సాంబశివరావుగారును, రాజాగారితరపున మోచర్ల రామచంద్రర్రావుగారును వకాలతులు తీసికొన్నారు. రాజాగారు చనిపోవుటచే కొమాళ్లు మైనర్లు గాన, యెస్టేటు కోర్టు ఆఫ్ వార్డ్సు చేతిలోనికి వచ్చినది. అప్పుడు కలెక్టరు బ్రెయిడువుడ్డుగారు నన్ను పిలిపించి రాజీగా ఫైసలు చేసికొమ్మని చెప్పగా, ఆయనకు పూర్వపు క్రిమినల్ కోర్టు జడ్జిమెంటు చూపించి, విషయములన్నియు తెలియచేసి, ఉభయుల ప్లీడర్లు ఖాయపరచిన అక్కౌంటు ప్రకారము సొమ్ము యీయవలసినదనియు, నాకు అయిన ఖర్చులు డామేజస్సు తన తీర్పుకు వదలివేయవలసినదనియు చెప్పినారు. నేను ఒప్పుకున్న మీదట నాదగ్గరయున్న రాజాగారి యెనిమిదివేల మొత్తములో నా కీయవలసిన దంతయు పోగా, నేను రు 700 లు మాత్రము తిరిగి వాపసుచేయ వలసివచ్చినది.<noinclude><references/></noinclude> nd8yw2cmez2ufm7il7onwj1mrta8o7s పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/86 104 217522 568008 2026-08-02T15:42:15Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568008 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|76|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>ఈ పండిత నాగేశరావుగారు యిప్పటికిని బందరులో పెన్షను పుచ్చుకొనుచూ జీవించియేయున్నారు. నా కీయన విూద కోపమేమియు లేక, త్రోవలో కనుపడినపుడు పలుకరించుచుందును. ఈయనమీద బాలరామయ్య వేసిన డామేజస్సు వ్యాజ్యములో నేను తప్ప మరియెవ్వరును ప్లీడరుగా నుండక, నిరాకరించుటచేత మా స్నేహితుడు వెంకటరాయుడుగారు యేకారణముచేత నైతేనేమి తన పట్టుదల వీడి, యెవరి ఖర్చులు వారు భరించి, వ్యాజ్యము యెత్తివేసికొనేటట్టు తనకుసు నాకును క్లయంటైన బాలరామయ్యచేత ఒప్పించినాడు. ఈ నాగేశరావుగారితో తప్ప యీ ముప్పది సంవత్సరములలో కోర్టులలో యెంత నిర్భయముగ వాగ్వాదము జరుపుచుండినను యే డిప్యూటి కలెక్టరు, కలెక్టరు, జిల్లాజడ్జి, సబుజడ్జి, మునసబుతోగాని నేను జగడము పెట్టుకొనలేదు. నాలో యెంత రాజసతామసగుణములున్నను, అధికారులయెదుట మర్యాద తప్పి యెన్నడు ప్రవర్తించలేదు. వారందరు నాయందు భక్తి, భయము, విశ్వాసము, గౌరవము నుంచేవారు. మాలో లోపము లేనివారు యెవరునులేరు గనుక యెంత వాగ్వాదములు జరుగుచున్నను, అన్యోన్యహృదయములు నిర్మలముతో కూడుకొన్నపుడు యెట్టి చిక్కు సంభవించలేదు. ఈయుద్యోగస్థులలో కొంతమంది లంచగొండ్లున్నపుడు వా రిండ్లకువెళ్లి రహస్యముగా యిది తగదనియు, జనులు విడ్డూరముగా చెప్పుకొనుటకు అవకాశమీయవలదనియు మందలించుచుంటిని.<noinclude><references/></noinclude> lttdhyz1tzgeqqxgckwo94jgkf5yh6p పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/87 104 217523 568011 2026-08-02T15:50:30Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568011 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|77}}</noinclude>నే నెవరికిని వంగి వంగి సలాములు చేసి యెరుగను. నేను గవర్నమెంటు వారిచ్చు బిరుదులను, గౌరవపదములను కోరకపోగా, వారి పరిపాలనతో సంబంధించిన మున్సిఫల్, లోకల్ బోర్డులలో ప్రజల తరఫున యెన్ను కొనబడుటకుకూడ నిరాకరించి, వానితోకూడ యెట్టి సంబంధము పెట్టుకొనలేదు. ఈ ప్లీడరీవృత్తిని 1920 వ సంవత్సరములో గాంధిమహాత్ముడు బందరువచ్చి చేసిన ప్రోత్సాహమువలన నాస్వలాభము మానుకొని, ఆయన కిష్టములేకపోయినను, ధర్మాదాయ దేవాదాయ సంరక్షణకొరకు, నేటివరకును, యీవృత్తిని వదలక, కోర్టులలో ఉచితముగా పని చేసిపెట్టుటకు వెళ్లుచున్నాను. ఈయుద్యమ చరిత్రను యిటుతరువాత వచ్చు ఆధ్యాయములో విపులముగ వ్రాయుచున్నాను. {{rule|2cm}} {{c|<big>అధ్యాయము 7 </big>}} {{rule|1cm}} {{c|దేవాదాయధర్మాదాయరక్షణ.}} {{c|(1913-1931.)}} ఆ 1911 వ సంవత్సరములో మద్రాసుకు మాపెద్దపిల్లవానిని చెన్న పట్టణము ప్రెసిడెన్సి కాలేజిలో చేరుటకు ఒక్కడినే పంపినప్పుడు నాస్నేహితులు కొందరు మద్రాసులోనే ప్రాక్టీసు మొదలుపెట్టుట మంచిదని సలహా నొసంగిరి. కాని,<noinclude><references/></noinclude> gstdnereevtn3mvegt0st7q3a6gww7d పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/88 104 217524 568012 2026-08-02T15:58:40Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568012 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|78|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>నేను ద్రవ్యమును ఎక్కువగ సంపాదించకపోవుటచే నేను పట్టణములో అనవసరచిక్కులకు లోబడుదు నేమో యని నా స్నేహితుడైన వేమవరపు రామదాసుపంతులుగారిని వెళ్లమని పురికొల్పి పంపితిని. నేను వెళ్లినయెడల తాను బందరులోనే నిలచిపోదునని ఆయన చెప్పగా ఆయన నాకంటె చాలా చిన్న వాడును, తెలివైనవాడును, ఆస్తిపరుడును అగుటబట్టి నేను ఆయనకు అప్పీళ్లు పంపుచుండవచ్చుననియు ఆయన హైకోర్టు జడ్జీ కావచ్చుననియు యెంచి, నాప్రయాణమును విరమించుకొంటిని. ఆయన చెన్నపట్టణము వెళ్లినందుకు యెట్టి పశ్చాత్తాపము పొందనక్కరలేకుండ యిండ్లు, భూములు గాక రొఖ్ఖఆస్తిని రెండులక్షల రూపాయీల పైగా సంపాదించుకొని తన కుటుంబముతో సుఖముగా చెన్నపట్టణములో కాలము గడపుచున్నారు. ఈయన హైకోర్టు జడ్జీ కాకపోవుటకు రాజకీయాందోళనములో తగుల్కొనుటయే ముఖ్యకారణము. ఇప్పుడు సహకారోద్యమములో చాలా కష్టపడి పనిచేయుచున్నారు. ఈయన మంచివక్తయు, లేఖరియునగుట బట్టి ప్రజోపయోగకరమైన యుద్యమము లన్నిటిలో పాల్గొనుటకు సమర్థుడుగ నుండి తనశక్తివంచన లేకుండ పాటుపడు చున్నారు. ఈయన చెన్నపట్టణము వెళ్లేటప్పుడు కృష్ణా కలెక్టరుగారి సాంక్షను నిమిత్తము యిందుపల్లి దేవస్థానమును గురించి పిటిషను పెట్టియున్నారు. సాంక్షను యీయబడినతరువాత<noinclude><references/></noinclude> elv2qaedait7bcyq9t2vmlq5nl818r0 పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/89 104 217525 568014 2026-08-02T16:06:22Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568014 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|79}}</noinclude>నేను బందరు సబుకోర్టులో O. S. 12 of 13 గా సబుజడ్జి త్యాగరాజయ్యరుగారి వద్ద ప్లయింటు దాఖలు చేసినాను. ఇదియే నాప్రథమస్కీము వ్యాజ్యము. దీనిని కొంతపట్టుదలతో నేను నడపితిని. నిత్యనైవేద్యధూపదీపారాధనలకని యీనాము స్టేటుమెంటులలో అర్చకులు వ్రాసికొన్న మాటలకు అర్థము చేయవలసివచ్చినది. సబుజడ్జీగారు పూర్ణముగా విచారించి యీనాములు స్వామివారికే యీయబడినవనియు, వానివిూద వచ్చు అయివజు స్వామివారికి కావలసిన కార్యముల కన్నిటికిని వినియోగించవలెననియు, అయివజునంతయు అర్చకులే తినకూడదనియు, దానిలో తగుమాత్రము వారిజీవనోపాధికి ఖర్చు చేయవలెననియు, యీఅర్చకులే మేనేజర్లుగా నుండుటకంటె వేరుగ ట్రస్టీలు యేర్పడుట మంచిదనియు తీర్పు చేసిరి. ఈతీర్పుమీద హైకోర్టుకు అప్పీలుచేయగా త్యాగరాజయ్యరుగారి తీర్పు మెచ్చుకొనుచు ముఖ్యన్యాయాధిపతి యగు ట్రాటరుగారు దానిని ఖాయపరచిరి. రెండవన్యాయాధిపతి కే. శ్రీనివాసయ్యంగారు కూడ ఆమోదించిరి. (31 మ. లా. జ. 202 పేజి) ఈ తీర్పు ఆధారముగా చేసికొని కె. కృష్ణమాచార్యులవారియొద్ద పెద ముత్తేవి దేవాలయమునకు స్కీము వ్యాజ్యమువేసితిని. (O. S. 7 of 1915) ఇదికూడా హైకోర్టు వరకువెళ్లి స్కీము యేర్పరచబడినది. క్రమక్రమముగా 1925 సంవత్సరమువరకు జిల్లాలో నుండే పెద్దదేవాలయము లన్నిటికి ఆయాగ్రామస్థులు వచ్చి నాచేత ననేకవ్యా<noinclude><references/></noinclude> atl2bd6dajup23jp8h4tfcomp3xxhxe పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/90 104 217526 568015 2026-08-02T16:14:37Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568015 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|80|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>జ్యములు వేయించి స్కీముల నేర్పాటు చేయించుకొనుచుండిరి. ఇట్టి వ్యాజ్యములు గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలలో హెచ్చినవిగాని, యీపనికి ఉచితముగా ప్లీడర్లు తోడ్పడినగాని గ్రామస్థులకు ఉత్సాహము పుట్టదనియు, పని బాగుగా సాగ నేరదనియు నేను కనుగొంటిని. ఒక్కకృష్ణాజిల్లాలోనే అనేకదేవాలయములకు స్కీముల నేర్పాటు చేయవలసి వచ్చినది. నేను మామూలు ప్రాక్టీసు చేసికొన్నంతకాలము యీదేవస్థాన సంరక్షణకు తగినంత కృషిచేయజాలనని తోచినది. ధర్మరక్షకసభను చెన్నపట్టణములో సర్ సుబ్రహ్మణ్యయ్యరుగారు స్థాపించినట్లే స్థాపించవలెనని ప్రయత్నించితినిగాని, నాకు యే ప్లీడరును తోడ్పడకపోయెను. ఇంతలో గాంధిమహాత్ముడు బందరు వచ్చి కోర్టులను బహిష్కరించవలయునని న్యాయవాదులకు బోధించగా వేమూరి రామచంద్రరావుగా రొక్కరుమాత్రము తనప్లీడరీ వృత్తిని మానివేసిరి. ఇంటివద్ద పంచాయితీకోర్టు పెట్టుకొని కొద్దిగా సంపాదించుకొనేవారు. నేను మొదటినుంచి రాజకీయవిషయములలో పాల్గొనుచున్నను, మహాత్ముని విధానమునం దంతగా నమ్మకము కుదరలేదు. అయినను రాజకీయస్వాతంత్ర్యమునకు కాకపోయినను, ఆత్మస్వాతంత్ర్యమునకైనను అది మార్గము చూపుచున్నదని యెంచి, ద్రవ్యార్జనను విరమించి, కోర్టులలో ఉచితముగ దేవాదాయధర్మాదాయ సంరక్షణకు పనిచేయనిశ్చయించి ప్రయివేటు పార్టీలతరఫున కేజులు పట్టనని<noinclude><references/></noinclude> c1pktcb7o6bgtff9ah9knb95sxiiwlb పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/50 104 217527 568018 2026-08-02T17:04:47Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'శ్రీ జి.శ్రీరామమూర్తి గారికి తాపీ ధర్మారావు పురస్కారం హైదరాబాదులో 2015 జనవరి 17 శనివారం సా॥ గం. 5 లకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కాలేజిలో జరిగింది. డా॥...' 568018 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>శ్రీ జి.శ్రీరామమూర్తి గారికి తాపీ ధర్మారావు పురస్కారం హైదరాబాదులో 2015 జనవరి 17 శనివారం సా॥ గం. 5 లకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కాలేజిలో జరిగింది. డా॥ సామల రమేష్ బాబు అధ్యక్షత వహించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ. రామలింగేశ్వరరావు ముఖ్య అతిథిగా, ప్రెస్ అకాడెమి పూర్వాధ్యక్షులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగా, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు శ్రీ జయధీర్ తిరుమలరావు ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. తాపీ ధర్మారావుగారి సహచరులు శ్రీ పరుచూరి హనుమంతరావు, శ్రీ నర్రా కోటయ్య గార్లు, తాపీ గారి మనుమరాలు శ్రీమతి సుజాతాషా, తాపీ వారి మనుమడు, సినీ దర్శకుడు కీ.శే. తాపీ చాణక్య కొడుకు డాక్టర్ తాపీ ధర్మారావు (అమెరికా) ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు శ్రీ జి.శ్రీరామమూర్తి గారికి తాపీ ధర్మారావు పురస్కారాన్ని యిచ్చి సత్కరించారు. ఆ సందర్భంగా ఆయన తాపీ ధర్మారావు స్మారక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం పూర్తి పాఠాన్ని ఈ దిగువ యిస్తున్నాం. ప్రకృతిధర్మశోధకుడు.... స్వేచ్ఛాసమాజ దార్శనికుడు ఆకాశమంత వెలుగు తాపీ ధర్మారావు దేవుడు, పాపపుణ్యాలు, ఇహపరాలు, వ్రతాలు, పూజలు, ముడుపులు వగైరా ఆధ్యాత్మిక దళారీ పన్నాగాలతో నిమిత్తం లేనిది మానవజీవితం అని స్పష్టం చేసి అష్టాంగమార్గ శాస్త్రీయ నిస్వార్ధ నిరపకార జీవనవిధానాన్ని చాటిన గౌతమబుద్ధుడు మానవాళికంతటికీ చిరస్మరణీయుడు. ఆది మార్క్స్. ఎల్లవేళలా అనుసరణీయుడు. అలాగే మహాత్మా జ్యోతీరావు ఫూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్, పెరియార్ రామస్వామి మానవుల మధ్య అసమానతలకు, మెజారిటీ ప్రజల బాధలకు కారణం సమాజం అవలంబిస్తున్న అమానవీయ పద్ధతులలోనే ఉన్నదని, సర్వమానవ సమానత్వ సాధనకు వాటిపై రాజీలేని శ్రీరామమూర్తి గారిని సత్కరించి, తాపీధర్మారావుగారి పురస్కార ప్రదానం చేసిన పోరాటమే శరణ్యమని చాటిన మహానుభావులు వీరంతా. వారందరి హేతునేత్రాన్నీ మరింత సునిశితం చేశారు తాపీ. మానవ సమాజ మూలంలో ఇమిడి ఉన్న స్త్రీ పురుష సమానత్వ సూత్రాన్ని కనుగొని కనువిప్పు కలిగించిన అరుదైన ఆలోచనాపరుడు తాపీ ధర్మారావు. అందుకే యావత్తు భారతావని మాత్రమే కాదు స్త్రీ పురుష ప్రపంచమంతా గర్వించదగిన మహోదయుడాయన. ఆయనను కేవలం గిడుగు శిష్యుడుగానో, బూతుబొమ్మల పరిశోధకుడుగానో ఎవరైనా పరిమితం చేయదలిస్తే అది మానవాళి ప్రగతి పట్ల మహాపచారమే అవుతుంది. ధర్మారావుగారిపై మంచి పరిశోధన జరిపి ఆయన కృషికి సంబంధించిన అనర్ఘరత్నాల వంటి సత్యాలను వెలికితీసి అందించారు ప్రముఖ చారు. ఒకనాడు ధర్మారావును చూసి అభ్యుదయ రచయిత ఏటుకూరి ప్రసాద్. తాపీ పాత పాళీ 'విలాసార్జునము' (నాటకం) గ్రంధానికి రాసిన ముందు మాటలో "నిజమే, గిడుగు శిష్యుడైన తరువాత మారందెవరు" అని ఆయన అన్నారు. అయితే తాను బడిలో గిడుగు శిష్యుడుగా ఉన్నప్పుడే ఆయనను ఎదిరించి గెలిచిన సంద ర్భాన్ని తాపీవారే ఆత్మకథ 'రాలూ రప్పలూ' లో వివరిం ముఖాన బొట్టు లేదేం? అని గిడుగు అడిగారు. ఆ ప్రశ్నకు ధర్మారావు ఆశ్చర్యపోయారు. ఏం చెప్పాలో తోచలేదు. చివరకు తాను బ్రాహ్మణుడ్ని కానని (నాన్-బ్రాహ్మిణ్) జవాబు చెప్పారు. అయితే బొట్టు అక్కర్లేదా! అని గద్దించి ధర్మారావు ముఖం<noinclude><references/> తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015</noinclude> 7zpyfjfn9edebd6aw9gacmqsqisasi8 568019 568018 2026-08-02T17:23:03Z Rajasekhar1961 50 568019 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>శ్రీ జి.శ్రీరామమూర్తి గారికి తాపీ ధర్మారావు పురస్కారం హైదరాబాదులో 2015 జనవరి 17 శనివారం సా॥ గం. 5 లకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కాలేజిలో జరిగింది. డా॥ సామల రమేష్ బాబు అధ్యక్షత వహించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ. రామలింగేశ్వరరావు ముఖ్య అతిథిగా, ప్రెస్ అకాడెమి పూర్వాధ్యక్షులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగా, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు శ్రీ జయధీర్ తిరుమలరావు ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. తాపీ ధర్మారావుగారి సహచరులు శ్రీ పరుచూరి హనుమంతరావు, శ్రీ నర్రా కోటయ్య గార్లు, తాపీ గారి మనుమరాలు శ్రీమతి సుజాతాషా, తాపీ వారి మనుమడు, సినీ దర్శకుడు కీ.శే. తాపీ చాణక్య కొడుకు డాక్టర్ తాపీ ధర్మారావు (అమెరికా) ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు శ్రీ జి.శ్రీరామమూర్తి గారికి తాపీ ధర్మారావు పురస్కారాన్ని యిచ్చి సత్కరించారు. ఆ సందర్భంగా ఆయన తాపీ ధర్మారావు స్మారక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం పూర్తి పాఠాన్ని ఈ దిగువ యిస్తున్నాం. ప్రకృతిధర్మశోధకుడు.... స్వేచ్ఛాసమాజ దార్శనికుడు ఆకాశమంత వెలుగు తాపీ ధర్మారావు దేవుడు, పాపపుణ్యాలు, ఇహపరాలు, వ్రతాలు, పూజలు, ముడుపులు వగైరా ఆధ్యాత్మిక దళారీ పన్నాగాలతో నిమిత్తం లేనిది మానవజీవితం అని స్పష్టం చేసి అష్టాంగమార్గ శాస్త్రీయ నిస్వార్ధ నిరపకార జీవనవిధానాన్ని చాటిన గౌతమబుద్ధుడు మానవాళికంతటికీ చిరస్మరణీయుడు. ఆది మార్క్స్. ఎల్లవేళలా అనుసరణీయుడు. అలాగే మహాత్మా జ్యోతీరావు ఫూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్, పెరియార్ రామస్వామి మానవుల మధ్య అసమానతలకు, మెజారిటీ ప్రజల బాధలకు కారణం సమాజం అవలంబిస్తున్న అమానవీయ పద్ధతులలోనే ఉన్నదని, సర్వమానవ సమానత్వ సాధనకు వాటిపై రాజీలేని శ్రీరామమూర్తి గారిని సత్కరించి, తాపీధర్మారావుగారి పురస్కార ప్రదానం చేసిన పోరాటమే శరణ్యమని చాటిన మహానుభావులు వీరంతా. వారందరి హేతునేత్రాన్నీ మరింత సునిశితం చేశారు తాపీ. మానవ సమాజ మూలంలో ఇమిడి ఉన్న స్త్రీ పురుష సమానత్వ సూత్రాన్ని కనుగొని కనువిప్పు కలిగించిన అరుదైన ఆలోచనాపరుడు తాపీ ధర్మారావు. అందుకే యావత్తు భారతావని మాత్రమే కాదు స్త్రీ పురుష ప్రపంచమంతా గర్వించదగిన మహోదయుడాయన. ఆయనను కేవలం గిడుగు శిష్యుడుగానో, బూతుబొమ్మల పరిశోధకుడుగానో ఎవరైనా పరిమితం చేయదలిస్తే అది మానవాళి ప్రగతి పట్ల మహాపచారమే అవుతుంది. ధర్మారావుగారిపై మంచి పరిశోధన జరిపి ఆయన కృషికి సంబంధించిన అనర్ఘరత్నాల వంటి సత్యాలను వెలికితీసి అందించారు ప్రముఖ అభ్యుదయ రచయిత ఏటుకూరి ప్రసాద్. తాపీ పాత పాళీ 'విలాసార్జునము' (నాటకం) గ్రంధానికి రాసిన ముందు మాటలో "నిజమే, గిడుగు శిష్యుడైన తరువాత మారందెవరు" అని ఆయన అన్నారు. అయితే తాను బడిలో గిడుగు శిష్యుడుగా ఉన్నప్పుడే ఆయనను ఎదిరించి గెలిచిన సంద ర్భాన్ని తాపీవారే ఆత్మకథ 'రాలూ రప్పలూ' లో వివరించారు. ఒకనాడు ధర్మారావును చూసి ముఖాన బొట్టు లేదేం? అని గిడుగు అడిగారు. ఆ ప్రశ్నకు ధర్మారావు ఆశ్చర్యపోయారు. ఏం చెప్పాలో తోచలేదు. చివరకు తాను బ్రాహ్మణుడ్ని కానని (నాన్-బ్రాహ్మిణ్) జవాబు చెప్పారు. అయితే బొట్టు అక్కర్లేదా! అని గద్దించి ధర్మారావు ముఖం<noinclude><references/> తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015</noinclude> t0tn3tsui1prcn3cb7y2o4aucs54lb9 568081 568019 2026-08-03T11:00:03Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 568081 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{p|fs150|ac}}శ్రీ జి.శ్రీరామమూర్తి గారికి తాపీ ధర్మారావు పురస్కారం</p> హైదరాబాదులో 2015 జనవరి 17 శనివారం సా॥ గం. 5 లకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కాలేజిలో జరిగింది. డా॥ సామల రమేష్ బాబు అధ్యక్షత వహించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ. రామలింగేశ్వరరావు ముఖ్య అతిథిగా, ప్రెస్ అకాడెమి పూర్వాధ్యక్షులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగా, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు శ్రీ జయధీర్ తిరుమలరావు ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. తాపీ ధర్మారావుగారి సహచరులు శ్రీ పరుచూరి హనుమంతరావు, శ్రీ నర్రా కోటయ్య గార్లు, తాపీ గారి మనుమరాలు శ్రీమతి సుజాతా షా, తాపీ వారి మనుమడు, సినీ దర్శకుడు కీ.శే. తాపీ చాణక్య కొడుకు డాక్టర్ తాపీ ధర్మారావు (అమెరికా) ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు శ్రీ జి. శ్రీరామమూర్తి గారికి తాపీ ధర్మారావు పురస్కారాన్ని యిచ్చి సత్కరించారు. ఆ సందర్భంగా ఆయన తాపీ ధర్మారావు స్మారక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం పూర్తి పాఠాన్ని ఈ దిగువ యిస్తున్నాం. ప్రకృతిధర్మశోధకుడు.... స్వేచ్ఛాసమాజ దార్శనికుడు ఆకాశమంత వెలుగు తాపీ ధర్మారావు దేవుడు, పాపపుణ్యాలు, ఇహపరాలు, వ్రతాలు, పూజలు, ముడుపులు వగైరా ఆధ్యాత్మిక దళారీ పన్నాగాలతో నిమిత్తం లేనిది మానవజీవితం అని స్పష్టం చేసి అష్టాంగమార్గ శాస్త్రీయ నిస్వార్ధ నిరపకార జీవనవిధానాన్ని చాటిన గౌతమబుద్ధుడు మానవాళికంతటికీ చిరస్మరణీయుడు. ఆది మార్క్స్. ఎల్లవేళలా అనుసరణీయుడు. అలాగే మహాత్మా జ్యోతీరావు ఫూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్, పెరియార్ రామస్వామి మానవుల మధ్య అసమానతలకు, మెజారిటీ ప్రజల బాధలకు కారణం సమాజం అవలంబిస్తున్న అమానవీయ పద్ధతులలోనే ఉన్నదని, సర్వమానవ సమానత్వ సాధనకు వాటిపై రాజీలేని శ్రీరామమూర్తి గారిని సత్కరించి, తాపీధర్మారావుగారి పురస్కార ప్రదానం చేసిన పోరాటమే శరణ్యమని చాటిన మహానుభావులు వీరంతా. వారందరి హేతునేత్రాన్నీ మరింత సునిశితం చేశారు తాపీ. మానవ సమాజ మూలంలో ఇమిడి ఉన్న స్త్రీ పురుష సమానత్వ సూత్రాన్ని కనుగొని కనువిప్పు కలిగించిన అరుదైన ఆలోచనాపరుడు తాపీ ధర్మారావు. అందుకే యావత్తు భారతావని మాత్రమే కాదు స్త్రీ పురుష ప్రపంచమంతా గర్వించదగిన మహోదయుడాయన. ఆయనను కేవలం గిడుగు శిష్యుడుగానో, బూతుబొమ్మల పరిశోధకుడుగానో ఎవరైనా పరిమితం చేయదలిస్తే అది మానవాళి ప్రగతి పట్ల మహాపచారమే అవుతుంది. ధర్మారావుగారిపై మంచి పరిశోధన జరిపి ఆయన కృషికి సంబంధించిన అనర్ఘరత్నాల వంటి సత్యాలను వెలికితీసి అందించారు ప్రముఖ అభ్యుదయ రచయిత ఏటుకూరి ప్రసాద్. తాపీ పాత పాళీ 'విలాసార్జునము' (నాటకం) గ్రంధానికి రాసిన ముందు మాటలో "నిజమే, గిడుగు శిష్యుడైన తరువాత మారందెవరు" అని ఆయన అన్నారు. అయితే తాను బడిలో గిడుగు శిష్యుడుగా ఉన్నప్పుడే ఆయనను ఎదిరించి గెలిచిన సంద ర్భాన్ని తాపీవారే ఆత్మకథ 'రాలూ రప్పలూ' లో వివరించారు. ఒకనాడు ధర్మారావును చూసి ముఖాన బొట్టు లేదేం? అని గిడుగు అడిగారు. ఆ ప్రశ్నకు ధర్మారావు ఆశ్చర్యపోయారు. ఏం చెప్పాలో తోచలేదు. చివరకు తాను బ్రాహ్మణుడ్ని కానని (నాన్-బ్రాహ్మిణ్) జవాబు చెప్పారు. అయితే బొట్టు అక్కర్లేదా! అని గద్దించి ధర్మారావు ముఖం<noinclude><references/> తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015</noinclude> sqqel98kid3ox7i2rjl5k6xd0a8jazw 568083 568081 2026-08-03T11:39:44Z Rajasekhar1961 50 568083 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{p|fs150|ac}}శ్రీ జి.శ్రీరామమూర్తి గారికి తాపీ ధర్మారావు పురస్కారం</p> హైదరాబాదులో 2015 జనవరి 17 శనివారం సా॥ గం. 5 లకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కాలేజిలో జరిగింది. డా॥ సామల రమేష్ బాబు అధ్యక్షత వహించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ. రామలింగేశ్వరరావు ముఖ్య అతిథిగా, ప్రెస్ అకాడెమి పూర్వాధ్యక్షులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగా, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు శ్రీ జయధీర్ తిరుమలరావు ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. తాపీ ధర్మారావుగారి సహచరులు శ్రీ పరుచూరి హనుమంతరావు, శ్రీ నర్రా కోటయ్య గార్లు, తాపీ గారి మనుమరాలు శ్రీమతి సుజాతా షా, తాపీ వారి మనుమడు, సినీ దర్శకుడు కీ.శే. తాపీ చాణక్య కొడుకు డాక్టర్ తాపీ ధర్మారావు (అమెరికా) ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. ప్రముఖ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు శ్రీ జి. శ్రీరామమూర్తి గారికి తాపీ ధర్మారావు పురస్కారాన్ని యిచ్చి సత్కరించారు. ఆ సందర్భంగా ఆయన తాపీ ధర్మారావు స్మారక ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం పూర్తి పాఠాన్ని ఈ దిగువ యిస్తున్నాం. {{p|fs150|ac}}ప్రకృతిధర్మశోధకుడు.... స్వేచ్ఛాసమాజ దార్శనికుడు ఆకాశమంత వెలుగు తాపీ ధర్మారావు</p> దేవుడు, పాపపుణ్యాలు, ఇహపరాలు, వ్రతాలు, పూజలు, ముడుపులు వగైరా ఆధ్యాత్మిక దళారీ పన్నాగాలతో నిమిత్తం లేనిది మానవజీవితం అని స్పష్టం చేసి అష్టాంగమార్గ శాస్త్రీయ నిస్వార్ధ నిరపకార జీవనవిధానాన్ని చాటిన గౌతమబుద్ధుడు మానవాళికంతటికీ చిరస్మరణీయుడు. ఆది మార్క్స్. ఎల్లవేళలా అనుసరణీయుడు. అలాగే మహాత్మా జ్యోతీరావు ఫూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్, పెరియార్ రామస్వామి మానవుల మధ్య అసమానతలకు, మెజారిటీ ప్రజల బాధలకు కారణం సమాజం అవలంబిస్తున్న అమానవీయ పద్ధతులలోనే ఉన్నదని, సర్వమానవ సమానత్వ సాధనకు వాటిపై రాజీలేని పోరాటమే శరణ్యమని చాటిన మహానుభావులు వీరంతా. వారందరి హేతునేత్రాన్నీ మరింత సునిశితం చేశారు తాపీ. మానవ సమాజ మూలంలో ఇమిడి ఉన్న స్త్రీ పురుష సమానత్వ సూత్రాన్ని కనుగొని కనువిప్పు కలిగించిన అరుదైన ఆలోచనాపరుడు తాపీ ధర్మారావు. అందుకే యావత్తు భారతావని మాత్రమే కాదు స్త్రీ పురుష ప్రపంచమంతా గర్వించదగిన మహోదయుడాయన. ఆయనను కేవలం గిడుగు శిష్యుడుగానో, బూతుబొమ్మల పరిశోధకుడుగానో ఎవరైనా పరిమితం చేయదలిస్తే అది మానవాళి ప్రగతి పట్ల మహాపచారమే అవుతుంది. ధర్మారావుగారిపై మంచి పరిశోధన జరిపి ఆయన కృషికి సంబంధించిన అనర్ఘరత్నాల వంటి సత్యాలను వెలికితీసి అందించారు ప్రముఖ అభ్యుదయ రచయిత ఏటుకూరి ప్రసాద్. తాపీ పాత పాళీ 'విలాసార్జునము' (నాటకం) గ్రంధానికి రాసిన ముందు మాటలో "నిజమే, గిడుగు శిష్యుడైన తరువాత మారందెవరు" అని ఆయన అన్నారు. అయితే తాను బడిలో గిడుగు శిష్యుడుగా ఉన్నప్పుడే ఆయనను ఎదిరించి గెలిచిన సందర్భాన్ని తాపీవారే ఆత్మకథ 'రాలూ రప్పలూ' లో వివరించారు. ఒకనాడు ధర్మారావును చూసి ముఖాన బొట్టు లేదేం? అని గిడుగు అడిగారు. ఆ ప్రశ్నకు ధర్మారావు ఆశ్చర్యపోయారు. ఏం చెప్పాలో తోచలేదు. చివరకు తాను బ్రాహ్మణుడ్ని కానని (నాన్-బ్రాహ్మిణ్) జవాబు చెప్పారు. అయితే బొట్టు అక్కర్లేదా! అని గద్దించి ధర్మారావు ముఖం<noinclude><references/> {{rh|తెలుగుజాతి పత్రిక |అమ్మనుడి మార్చి 2015|50}}</noinclude> coqz7oa28tcvoumb4afb1vsomx420jm పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/51 104 217528 568020 2026-08-02T17:29:42Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తనకి కనపడకుండా ఉండే లాగ తన కుర్చీ తిప్పేసుకుని గొడుగు పాఠం చెప్పుకు పోయారు. అయినా ధర్మారావు గారు గిడుగు బొట్టు నియమానికి లొంగకుండా చరిత్ర పాఠ్యాంశులో అనితరమైన ప్రతిభతో అ...' 568020 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>తనకి కనపడకుండా ఉండే లాగ తన కుర్చీ తిప్పేసుకుని గొడుగు పాఠం చెప్పుకు పోయారు. అయినా ధర్మారావు గారు గిడుగు బొట్టు నియమానికి లొంగకుండా చరిత్ర పాఠ్యాంశులో అనితరమైన ప్రతిభతో అప్పటివరకు విముఖుడైన ఆయనను సుముఖం దర్మారావు సత్కర సభ చేసుకోగలిగారు. కాని బొట్టు ఎన్నడూ పెట్టుకోలేదు. ఈ ఒక్క ఘట్టమే చాలు ధర్మారావుగారి లోని హేతుదాహం గురువులోని సంప్రదాయం దృష్టిని కూడా ఎదిరించి ఎలా నిలిచి గెలిచిందో చెప్పడానికి. ధర్మారావుగారిది కేవలం మానవాభ్యుదయ దృష్టి, ప్రకృతి ధర్మశోధన తృష్ణ, హేతువు లోతులు చూపి అమానవీయతను పార ద్రోలాలన్న కాంక్షే. అందులో బ్రాహ్మణ బ్రాహ్మణేతర దృష్టికికాక మానవతా చైతన్యానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ఆచార్యులవారి దుర్బోధలతో పుచ్చిపోయి కుళ్ళిపోయిన అసమ, అమానుష సమాజం కృత్రిమ విలువల వలువలను నిలువునా ఊడ్చి నగ్నంగా నిలబెట్టడం ద్వారా పురుషాధిపత్య దుర్మార్గాన్ని చీల్చిచెండాడమే లక్ష్యంగా రచన చేశారు. సమాజ సమానత్వ సిద్ధాంతం పునాదిగా, ప్రకృతి ధర్మ భావన పతాకంగా "పెళ్ళి- దాని పుట్టు పూర్వోత్తరాలు", "జనుప కచ్చడాలు", "దేవాలయాలమీద బూతుబొమ్మ లెందుకు?” వంటి అపూర్వ సత్యశోధన రచనలు ఆయన బుర్రనుండి జాలువారాయి. సృజనకు జనహిత శోధనను జోడించి విలక్షణ, విశేష సాహిత్య సంపదను సృష్టించిన మహనీయుడు తాపీ. శ్రీకాకుళంలో మొదటి తరగతులు చదువుకుంటున్న రోజులలోనే నిర్హేతుకమైన, నిరర్ధకమైన ప్రగతి నిరోధకమైన సంప్రదాయ పద్ధతులను ఎదిరించి నిలిచే బుద్ధి ధర్మారావుగారిలో అంకురించింది. నూనె కావడి ఎదురురావడం అశుభమనే మూఢనమ్మకాన్ని ఆనాడే ఆయన ఎదిరించారు. పనికట్టుకుని, ఎదురుగా వస్తున్న నూనెకావడిని దాటి ముందుకు వెళ్లారు. వెనుదిరగకుండా, అదురు బెదురు లేకుండా దానికి ఎదురుగా సాగిపోయారు. అప్పుడాయనకు, ఒకనాడు పంచెకట్టుకొని బడికి వెళ్ళాలనిపించింది. ఒక పంచెను కుడిచేతివైపు గోచీ పెట్టి కట్టుకుని బడికి వెళ్ళారు. దానిని గమనించిన మాస్టారు అదేమిటి అందరూ ఎడమగోచీ పెడుతుంటే నువ్వు అలా కట్టావేమిటి అని అడిగారు. అందరూ నవ్వారు. ఎందులో తెలియక ధర్మారావు మొదట్లో బిత్తరపోయారు. తరువాత అర్ధమయింది. కోపం వచ్చింది. “ఏం, ఇలా కట్టుకోకూడదా?" అని మాస్టారుని ఎదురు ప్రశ్నించారు. నలుగురూ నవ్వుతారని మాస్టారు అన్నారు. బడికి వచ్చినప్పుడు దారిలో ఎవ్వరూ నవ్వలేదే అని ఎదురు వాదించారు తాపీ. అయితే అలాగే కడతావా అని అడగగా అలాగే కడతానని జవాబు ఇచ్చారు. పంచె కట్టినంతకాలం తాపీ అలాగే కుడివైపు గోచీనే పెట్టి కట్టారు. (ఆధారం - తాపీ ధర్మారావు జీవిత సంగ్రహం పేజీ 7-8) ఒకప్పటి ఉత్తరాంధ్ర, కళింగాంధ్ర పాలం పనుల స్త్రీల చీరకట్టుతో ఇతర కోస్తాంధ్ర మహిళల కట్టుకి మధ్య ఉండిన తేడా తెలిసిందే. ఒక కట్టుగొప్ప, ఇంకో కట్టు తీసికట్టు అనడంలోని అనౌచిత్యమే గమనించ దగినది. శ్రామిక స్త్రీల కాయకష్టానికి చీర అడ్డుకాకూడదన్న స్పృహను అర్ధం చేసుకోకుండా వారిది తలుపుల కట్ట అని అవహేళన చేసిన వారున్నారు. శరీరాన్ని కప్పుకోవడమే సప్రధారణ పరమోద్దేశం గాని ఏ తీరున కట్టారన్నది కాదు. పాశ్చాత్య ఆహార్యాన్ని అనుసరించిన మగవాడు స్త్రీని మాత్రం చాపచుట్టలోని మనిషిలా తెల్లతాను కట్టుకే పరిమితం చేయడానికి తాపత్రయ పడిన రోజులున్నాయి. ఇప్పుడామె జీన్స్ ధరిస్తే, ముడీదార్ వేస్తే స్త్రీల పాశ్చాత్య ఆధునిక వస్త్రధారణ వల్లనే రేప్ లు ముమ్మరిస్తున్నాయంటూ మృగాళ్ళు దుర్మార్గాన్ని పరోక్షంగా సమర్ధించే అత్యాచార్యులు సూటు బూటు వేసుకుంటూ అధికార శ్రేణుల్లో వెలిగి పోతున్నారు. "ఆ విధంగా చిన్నతనంలోనే అలవరచుకున్న సంస్కరణ భావాలకు తన 17వ ఏటనే తన కుటుంబంలోనే ఆదరణరూపమివ్వనారంభించారు. జీవిత సంగ్రహం పేజీ 12) తాపీ ధర్మారావుగారిలోని సంస్కరణాభిలాష, 'అలాగే ఎందుకు, ఇలా ఎందుకు కాకూడదు" అని నాణేనికి రెండోవైపును కూడా చూసి తెలుసుకునే తత్వం, గిడుగు శిష్యుడు కావడానికి ముందే ఆయనలో అంకురించిందని చెప్పడానికే ఇదంతా. గ్రాంధిక భాషా రచనలో విశేష ప్రతిభ చాటుకొని అనంతరం దాని నిరుపయోగితను, దానిలోని జన వ్యతిరేక లక్షణాన్ని తెలుసుకొని స్వచ్ఛమైన వాడుకభాషా రచనవైపు మళ్ళి, పాత పాళీ విడిచి కొత్తపాళీ చేపట్టడానికి దోహదం చేసిన మహోన్నతత్వం ధర్మారావు గారిలోని హేతుజిజ్ఞాస నుంచి ఉత్పన్నమైనదే కాని కేవలం గిడుగుపంతులుగారి శిష్యుడైనందువల్లనే సంక్రమించినదికాదు. అలాగని గిడుగు రామ్మూర్తిపంతులు గారు వ్యావహారిక తెలుగుభాషకు చేసిన గొప్ప కృషిని, సేవను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. గిడుగు గురించి తాపీ స్వయంగా చెప్పిన మాటలు ఇక్కడ ప్రస్తావించవలసి ఉన్నది. "గ్రాంధికాన్ని, గ్రాంధికవాదులను జలగడిగారు. పండితులకు పిడుగయ్యారు. వ్యావహారానికి ముఖ్య గురువయ్యారు”<noinclude><references/> | తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015</noinclude> c7g3p7exnl09e8d8kdocd4sly25nkyf 568087 568020 2026-08-03T11:54:20Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 568087 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>తనకి కనపడకుండా ఉండే లాగ తన కుర్చీ తిప్పేసుకుని గిడుగు పాఠం చెప్పుకు పోయారు. అయినా ధర్మారావు గారు గిడుగు బొట్టు నియమానికి లొంగకుండా చరిత్ర పాఠ్యాంశులో అనితరమైన ప్రతిభతో అప్పటివరకు విముఖుడైన ఆయనను సుముఖం చేసుకోగలిగారు. కాని బొట్టు ఎన్నడూ పెట్టుకోలేదు. ఈ ఒక్క ఘట్టమే చాలు ధర్మారావుగారి లోని హేతుదాహం గురువులోని సంప్రదాయం దృష్టిని కూడా ఎదిరించి ఎలా నిలిచి గెలిచిందో చెప్పడానికి. ధర్మారావుగారిది కేవలం మానవాభ్యుదయ దృష్టి, ప్రకృతి ధర్మశోధన తృష్ణ, హేతువు లోతులు చూపి అమానవీయతను పార ద్రోలాలన్న కాంక్షే. అందులో బ్రాహ్మణ - బ్రాహ్మణేతర దృష్టికికాక మానవతా చైతన్యానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ఆచార్యులవారి దుర్బోధలతో పుచ్చిపోయి కుళ్ళిపోయిన అసమ, అమానుష సమాజం కృత్రిమ విలువల వలువలను నిలువునా ఊడ్చి నగ్నంగా నిలబెట్టడం ద్వారా పురుషాధిపత్య దుర్మార్గాన్ని చీల్చిచెండాడమే లక్ష్యంగా రచన చేశారు. సమాజ సమానత్వ సిద్ధాంతం పునాదిగా, ప్రకృతి ధర్మ భావన పతాకంగా "పెళ్ళి- దాని పుట్టు పూర్వోత్తరాలు", "ఇనుప కచ్చడాలు", "దేవాలయాలమీద బూతుబొమ్మ లెందుకు?” వంటి అపూర్వ సత్యశోధన రచనలు ఆయన బుర్రనుండి జాలువారాయి. సృజనకు జనహిత శోధనను జోడించి విలక్షణ, విశేష సాహిత్య సంపదను సృష్టించిన మహనీయుడు తాపీ. శ్రీకాకుళంలో మొదటి తరగతులు చదువుకుంటున్న రోజులలోనే నిర్హేతుకమైన, నిరర్ధకమైన ప్రగతి నిరోధకమైన సంప్రదాయ పద్ధతులను ఎదిరించి నిలిచే బుద్ధి ధర్మారావుగారిలో అంకురించింది. నూనె కావడి ఎదురురావడం అశుభమనే మూఢనమ్మకాన్ని ఆనాడే ఆయన ఎదిరించారు. పనికట్టుకుని, ఎదురుగా వస్తున్న నూనెకావడిని దాటి ముందుకు వెళ్లారు. వెనుదిరగకుండా, అదురు బెదురు లేకుండా దానికి ఎదురుగా సాగిపోయారు. అప్పుడాయనకు, ఒకనాడు పంచెకట్టుకొని బడికి వెళ్ళాలనిపించింది. ఒక పంచెను కుడిచేతివైపు గోచీ పెట్టి కట్టుకుని బడికి వెళ్ళారు. దానిని గమనించిన మాస్టారు అదేమిటి అందరూ ఎడమగోచీ పెడుతుంటే నువ్వు అలా కట్టావేమిటి అని అడిగారు. అందరూ నవ్వారు. ఎందుకో తెలియక ధర్మారావు మొదట్లో బిత్తరపోయారు. తరువాత అర్ధమయింది. కోపం వచ్చింది. “ఏం, ఇలా కట్టుకోకూడదా?" అని మాస్టారుని ఎదురు ప్రశ్నించారు. నలుగురూ నవ్వుతారని మాస్టారు అన్నారు. బడికి వచ్చినప్పుడు దారిలో ఎవ్వరూ నవ్వలేదే అని ఎదురు వాదించారు తాపీ. అయితే అలాగే కడతావా అని అడగగా అలాగే కడతానని జవాబు ఇచ్చారు. పంచె కట్టినంతకాలం తాపీ అలాగే కుడివైపు గోచీనే పెట్టి కట్టారు. (ఆధారం - తాపీ ధర్మారావు జీవిత సంగ్రహం పేజీ 7-8) ఒకప్పటి ఉత్తరాంధ్ర, కళింగాంధ్ర పాలం పనుల స్త్రీల చీరకట్టుకి ఇతర కోస్తాంధ్ర మహిళల కట్టుకి మధ్య ఉండిన తేడా తెలిసిందే. ఒక కట్టుగొప్ప, ఇంకో కట్టు తీసికట్టు అనడంలోని అనౌచిత్యమే గమనించ దగినది. శ్రామిక స్త్రీల కాయకష్టానికి చీర అడ్డుకాకూడదన్న స్పృహను అర్ధం చేసుకోకుండా వారిది తలుపుల కట్ట అని అవహేళన చేసిన వారున్నారు. శరీరాన్ని కప్పుకోవడమే వస్త్రధారణ పరమోద్దేశం గాని ఏ తీరున కట్టారన్నది కాదు. పాశ్చాత్య ఆహార్యాన్ని అనుసరించిన మగవాడు స్త్రీని మాత్రం చాపచుట్టలోని మనిషిలా తెల్లతాను కట్టుకే పరిమితం చేయడానికి తాపత్రయ పడిన రోజులున్నాయి. ఇప్పుడామె జీన్స్ ధరిస్తే, చుడీదార్ వేస్తే స్త్రీల పాశ్చాత్య ఆధునిక వస్త్రధారణ వల్లనే రేప్ లు ముమ్మరిస్తున్నాయంటూ మృగాళ్ళు దుర్మార్గాన్ని పరోక్షంగా సమర్ధించే అత్యాచార్యులు సూటు బూటు వేసుకుంటూ అధికార శ్రేణుల్లో వెలిగి పోతున్నారు. "ఆ విధంగా చిన్నతనంలోనే అలవరచుకున్న సంస్కరణ భావాలకు తన 17వ ఏటనే తన కుటుంబంలోనే ఆచరణరూపమివ్వనారంభించారు. (జీవిత సంగ్రహం పేజీ 12) తాపీ ధర్మారావుగారిలోని సంస్కరణాభిలాష, 'అలాగే ఎందుకు, ఇలా ఎందుకు కాకూడదు" అని నాణేనికి రెండోవైపును కూడా చూసి తెలుసుకునే తత్వం, గిడుగు శిష్యుడు కావడానికి ముందే ఆయనలో అంకురించిందని చెప్పడానికే ఇదంతా. గ్రాంధిక భాషా రచనలో విశేష ప్రతిభ చాటుకొని అనంతరం దాని నిరుపయోగితను, దానిలోని జన వ్యతిరేక లక్షణాన్ని తెలుసుకొని స్వచ్ఛమైన వాడుకభాషా రచనవైపు మళ్ళి, పాత పాళీ విడిచి కొత్తపాళీ చేపట్టడానికి దోహదం చేసిన మహోన్నతత్వం ధర్మారావు గారిలోని హేతుజిజ్ఞాస నుంచి ఉత్పన్నమైనదే కాని కేవలం గిడుగుపంతులుగారి శిష్యుడైనందువల్లనే సంక్రమించినదికాదు. అలాగని గిడుగు రామ్మూర్తిపంతులు గారు వ్యావహారిక తెలుగుభాషకు చేసిన గొప్ప కృషిని, సేవను తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. గిడుగు గురించి తాపీ స్వయంగా చెప్పిన మాటలు ఇక్కడ ప్రస్తావించవలసి ఉన్నది. "గ్రాంధికాన్ని, గ్రాంధికవాదులను జలగడిగారు. పండితులకు పిడుగయ్యారు. వ్యావహారానికి ముఖ్య గురువయ్యారు”<noinclude><references/> {{rh| తెలుగుజాతి పత్రిక |అమ్మనుడి మార్చి 2015|51}}</noinclude> ikr27uvf2iiimvvfg2xxcyc1yvwnbek పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/52 104 217529 568021 2026-08-02T17:35:08Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అని గిడుగును తాపీ కొనియాడారు. (రాలు - రప్పలూ - పేజీ 56) తాపీ ధర్మారావు కూడా అసమాన భాషా సంస్కర్త. ప్రతిభను సొంతం చేసుకోవడంలో, సులభసాధ్యంకాని ప్రజ్ఞను పొదిలో అమ్ముగా ధరించడంలో ఆ...' 568021 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>అని గిడుగును తాపీ కొనియాడారు. (రాలు - రప్పలూ - పేజీ 56) తాపీ ధర్మారావు కూడా అసమాన భాషా సంస్కర్త. ప్రతిభను సొంతం చేసుకోవడంలో, సులభసాధ్యంకాని ప్రజ్ఞను పొదిలో అమ్ముగా ధరించడంలో ఆయన బ్రాహ్మణులతో పోటీపడి ముందు పీటీన నిలిచారు. అదే సమయంలో బ్రాహ్మణీయ మతం సమాజంపై రుద్దిన స్త్రీ పురుష అసమాన భావజాలాన్ని కూకటి వేళ్ళతో పెకలించడానికి నడుం కట్టి దానిని సాధించి చూపారు. ఆయన మూడవ క్లాసు చదువుతుండగా బడి నుంచి ఇంటికి దరాగా చేతులూపుకుంటూ వచ్చారట. అప్పుడాయన తండ్రి ఎదురై స్కూల్లో ఆయనకు ఏ ర్యాంకు వచ్చిందని వాకబు చేశారట. మొదటి, రెండవ ర్యాంకుల వారు బ్రాహ్మణులే అని తెలుసుకుని "చదువు బ్రాహ్మణులకేగాని మన పిల్లలకు అబ్బుతుందా” అని భార్యతో అన్నారట. ఆ మాట చెవిన పడిన క్షణం నుంచి పట్టుదలతో చదివి అన్ని సబ్జెక్టులలోను ఫస్ట్ మార్కు తెచ్చుకుని ధర్మారావు తన చాటుకున్నారు. మురుగుటంగరములు / ముత్యంపు సరులును / పురుషుని గైనేయ భూషణములె / అరనిమేషమునకు అన్నియు నశియించు / విద్యయొక్కటి ఎపుడు ఎడని తొడవు - అని తనను, తన వేషాన్ని గేలిచేస్తూ పద్యం చదివిన ఉపాధ్యాయుడికి తన ప్రతిభతో సమాధానం చెప్పారు. తాపీ సమకాలికులైన నార్ల వెంకటేశ్వరరావు వంటి వారు కూడా హేతువాదానికి, బ్రాహ్మణీయ (బ్రాహ్మణ వ్యతిరేకత కాదు) వ్యతిరేక భావజాలానికి పెద్ద పీట వేసి విశేష కృషి సాగించారు. అయితే ధర్మారావుగారు ఈ విషయంలో అత్యంత మౌలికమైన పునాది కృషి చేశారు. మానవసమాజ ఆవిర్భావదశలో, అనంతరం చాలాకాలం పాటు స్త్రీ పురుషుల మధ్య సాగిన సమతూక స్థితిని చాటడానికి ఆ తరువాత పురుష నిరంకుశత్వాన్ని స్థాపించడం కోసం పుట్టిన దుష్ట ఆచార సంప్రదాయాల వికృత రూపాన్ని ఎండగట్టడానికి సాగరమధనమంతటి శోధనను విజయవంతంగా నిర్వహించారు. సృష్టిలో సగమైన స్త్రీజాతి తరతరాలుగా అనుభవిస్తున్న పీడిన మూలాలను తవ్వి చూపించారు. పద్యరచనలో ఎంతో సారళ్యాన్ని ప్రతిభను కనపరచిన ధర్మారావు తరువాత కాలంలో నవనవ్య మానవీయ దృష్టితో అమోఘమైన పరిశోధనలు సాగించి సరళ సుందరమైన వాడుకభాషలో విశిష్ట రచనలు చేశారు. ఆయన సొంత చరిత్ర "రాలూ-రప్పలూ” ఇందుకు ప్రత్యేక ఉదాహరణ. "ఎంత ఆచార్యుడనండి, పురోహితుడవండి, ప్రేస్టు ఆనండి ఏమన్నాసరే ఈ వ్యక్తి అసాధ్యుడు. ఏకై వచ్చాడు సంఘంలోనికి. మేక కూర్చున్నాడు." ('పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు' పేజి 111). ఈ ఒక్క మచ్చు చాలు తాపీవారి సులభశైలికి. 'జనవాణి'లో తాను ప్రవేశపెట్టిన జనభాషను గురించి ధర్మారావుగారే 1969లో తెలుగు | తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015 | - అకాడెమీకిచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. "తక్కున పదాలతో బాక్యాలు రాసేవాణ్ణి. సుమారు మూడే పదాలుంటాయి వాక్యంలో. అందువల్ల వ్యావహారిక మనిపిస్తుంది. క్రియా పదాలను వ్యావహారికం చేయడమే వ్యావహారికం కాదు. అదో టెక్నిక్ కనిపెట్టాను. గ్రాంధిక భాషావాదులకు కూడా ఆ రోజుల్లో దాన్ని కాదనగల ధైర్యం ఉండేది డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు కాదు. నా శత్రువర్గం వాళ్ల విశిష్ట అతిథి పత్రికకు (ఆంధ్రప్రభ) సంపాదకుడుగా న్యాపతి నారాయణమూర్తి ఉండేవారు. అతడొచ్చి నా టెక్నిక్ని బాగా ప్రశంసించాడు". మూఢనమ్మకాలను స్వార్థపర వర్గాల పన్నాగాలను చీల్చిచెండాడి మానవీయ ప్రాంగణాన మంగళధ్వానంగా భాసించారు తాపీ. అందుకే ధర్మారావుగారిని కేవలం విమర్శకుడు, రచయిత, కవిగానేగాక మార్చ్ వంటి మహానుభావుల కోవలోని సామాజిక సత్యశోధకుడుగా పరిగణించవలసి ఉన్నది. ఇలా అంటే గాంధీ జయంతినాడు కోడికూర తిన్నావని బ్రాహ్మణీయ మీడియా ఎద్దేవా చేయగానే తొంభై శాతం జనం, ముఖ్యంగా శ్రామిక జనం ముఖ్య ఆహారమైన మాంసాన్ని ఏడాదిపాటు ముట్టకుండా చాంద్రాయణ వ్రతం వంటి శాకాహార దీక్ష పూనిన కమ్యూనిస్టు నాయకులు అభ్యంతరం చెప్పవచ్చు. బయటకు కనిపించని పిలకలు తలలో ధరించి లెఫ్టిస్టు మీడియాను ఏలుతున్న బ్రాహ్మణీయ సూరిస్టులకు రుచించకపోవచ్చు. ఎర్ర దళితగోవింద దాశరధుల తలకు ఎక్కకపోవచ్చు. కాని ఇది కాదనలేని వాస్తవం. నికార్సయిన నిజం. సామాజిక శోధనలో తానీ సూర్సును తలపించేవారే. స్త్రీ పురుష నిజస్థితిపై, వారిద్దరి సంబంధాల మూలాలపై గాఢమైన పరిశోధన చేసి ఆధ్యాత్మిక ఐతిహాసిక జీవనం ముసుగులో ఇప్పటికీ బలవంతంగా అమలుచేస్తున్న పెడతోవలపై, దోపిడి దారుల పై పిడుగులు కురిపించిన ధర్మారావు మానవీయమూర్తి, - "సరిసమానంగా ఉండే ఆడదానిని స్వాధీనం చేసుకొని బానిసగా చేశారు సుగవారు, ఆడదాని అధికారాన్ని అంతటినీ తనది చేసుకున్నారు. ఆడదానికి అధికారం ఉండకూడదని శాసనాలు చెక్కించాడు మగవాడు. ఆ దోషానికి ఫలితమా అన్నట్లు జరిగింది. ఆ మగవాడికి మగడుగా వచ్చాడు మన పురోహితుడు. టటి పనికిరాదు. నేను చెప్పినట్టంతా నువ్వు చేయాలి! లేకపోతే శపిస్తానవి గుడ్లురిమాడు. పనికిమాలిన కోతిలాగా అనుకరణ చేష్టలన్నిటినీ చేయించాడు. అప్పటకీ ఇప్పటికీ నేను అధికారిని అని డబ్బా వాయించాడు. కాదు అన్నవాడిని కడజాతి వాడన్నారు. అవును అన్నవాడిని అందలం ఎక్కించాడు". ("పెళ్లి - దాని పుట్టుపూర్వోత్తరాలు' పేజీ 100) తాపీ వారి ఈ శోధనను బట్టి బ్రాహ్మణీయ నిరంకుశత్వాన్ని ఎదిరించి వెలికి గురిఅయిన సామాజిక పోరాట యోధులే మన దళితులని అర్ధమవుతుంది. ధర్మారావుగారిది Anti - Priestism మూఢాచారాలు కర్మసిద్ధాంతయుతమైన ఆధ్యాత్మిక 52<noinclude><references/></noinclude> j2xfzwjas0fsy22ly7kisyotq8v6n3p పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/38 104 217530 568022 2026-08-02T18:15:11Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568022 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>మఱియు నలువండ్రు, ఏఁబండ్రు గల తరగతిలో సొరఠునుండి వచ్చు కుఱ్ఱులును ఎక్కుడుమంది ఉండువారు కారు. నాతెలివి తేటలవిషయమై నాకు తృప్తి ఉన్నటులు గుఱుతు చాలదు. బహుమతులుగాని, వేతనముగాని లభించినపుడు ఆశ్చర్యము కలిగెడిది. కాని ప్రవర్తనమును కడుమెలఁకువతో కాపాడుకొనుచుండువాఁడను. నలుసంత దొసఁగు కానిపించినను కన్నుల జొటజొట నీరు ఉరలెడిది. దండ్యుఁడ నయినపుడుగాని, 'వీఁడు దండ్యుఁడు' అని గురువు అనుకొనినపుడుగాని నాచింతకు మేరలేదు. నే నొకతూరి దెబ్బలు తిన్నట్లు ఉన్నది. కొట్టిరని నేనంతగా వగవలేదు. కాని కొట్టఁదగిన నేరము చేసితి నని అనుకొనిపోవుదురుగదా అని మిగుల వగచితిని.; వెక్కి వెక్కి ఏడిచితిని. ఈ ముచ్చట నేను ఒకటవ తరగతిలో ఉండఁగనో, రెండవతరగతిలో ఉండఁగనో, నేను ఏడవతరగతిలో ఉండఁగా ఇట్టిదే మఱియొకటి: అపుడు హెడ్మాస్టరు దొరాబ్జి ఎడుల్జీ గిమీ. అతఁడు శిష్యవత్సలుఁడు, నియమపాలకుఁడు, విధివర్తి, సుశిక్షకుఁడును. ఆయన పయితరగతులలోని బాలురకు శరీరవ్యాయామము, క్రికెట్ వ్యాయామము తప్పనిసరిగా చేసెను. నాకు రెండును గిట్టనివి. ఈనియమమునకు ముందు నేను క్రికెట్ గాని, ఫుట్ బాల్ గాని, మఱి యేదిగాని ఆడిన పాపమున పోలేదు. దానికి కారణము నేఁడు నాకు తప్పని తెలిసిన బిడియమే. శరీర వ్యాయామమునకు చదువుతో పొత్తు లేదని నాఁడు నాకు దురూహ. విద్యాప్రణాళికలో మనశ్శిక్షకు ఎంత తావు కలదో శరీరవ్యాయామమునకును అంతతావు ఉండవలయు నని నాకు నేడు తెలియును. వ్యాయామమును వీడినందువల్ల నాకు లోటు లేదని చెప్పఁగలను. ఏలన బయలున చాల దవ్వు నడచుట మంచిదని అచట నచట<noinclude><references/> {{c|20}}</noinclude> ipmuq7310yld7xo92zqah5hddeiaknk పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/39 104 217531 568023 2026-08-02T18:28:36Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568023 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>5 హైస్కూలులో</big>}}</noinclude>చదివి ఆసలహాను గమనించి నేఁటికిని నేను అలవాటులో ఉంచుకొనిన నడకను అలవఱిచికొంటిని. ఈవ్యాయామముచే నాకు తగురీతి శరీరపాటవము కలిగెను. మాతండ్రిగారికి పరిచర్య చేయవలయు నను మిక్కుటమగు అభిలాషయే శరీరవ్యాయామమునెడ అనిష్టమునకు కారణము. బడివదలఁగనే ఇంటికి పరువిడి మా తండ్రిని పరిచరించుచుండువాఁడను. వ్యాయామనియమము దీనికి అడ్డు తగిలెను. మాతండ్రిగారికి నేను పరిచర్య చేయవలయునుగాన నాకు ఈనియమము లేకుండఁ జేయుఁడని గిమీగారికి విన్నవించుకొంటిని. ఆయన నామాట వినలేదు. ఆరోజులలో శనివారమునాఁడు ప్రొద్దుటిపూఁట బడి, ఆశనివారపు సాయంకాలమున నాలుగుగంటలకు వ్యాయామమునకై ఇంటినుండి బడికి పోవలసివచ్చెను. నాకు గడియారము లేదు. మబ్బులు నన్ను మోసగించెను. నేను బడికి వెళ్లువఱకు అచట ఒకపిట్టయేని లేదు. మఱునాఁడు గిమీగారు హాజరుపట్టీ పరీక్షించుచు నన్నుఁజూచి నీ వేల నిన్న హాజరు కావైతి వని అడిగిరి. నేను జరిగినది చెప్పితిని. ఆయన నామాట నమ్మక అణాయో, రెండణాలో కాని (నా కిపుడు గుఱుతు లేదు) జరిమానా వేసెను. నేను అబద్ధాలకో రనిపించుకొంటిని. ఇది నాకు ఎంతో వింత కలిగించెను. నేను జూటాకోరును కానని ఎటులు సమర్థించుకొనఁగలను? ఉపాయాంతరము లేదు. మిగుల దుఃఖించితిని. సత్యమును నమ్ముకొన్నవాఁడు ఎల్లపుడును జాగ్రత్తగా ఉండవలెనని నేను గమనించితిని. బడిలో నేను అశ్రద్ధగా నుండుటకు ఇదియే ఆది; ఇదియే అంతమును. జరిమానావేసిన సొమ్ము తిరిగి యిచ్చునటులు చేసికొనఁగలిగితినని నాకు కొంత గుఱుతు.<noinclude><references/> {{c|21}}</noinclude> 78b71u4gbumgv1prevb90l4ll38ghn1 పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/40 104 217532 568026 2026-08-02T22:28:42Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568026 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude> 'బడి వదలఁగనే మావాఁడు నాకడ ఉండవలసియున్నాఁ'డని మానాయనగారి కోరికమీఁద తుదకు నాకు వ్యాయామమునుండి విడుదల కలిగినది. నేను వ్యాయామమును ఏమఱుటచే కొఱవడకున్నను మఱియొక ఏమఱికకు దండము లర్పించుకొనుచునే యున్నాను. 'దస్తూరి విద్యలో ఒకభాగము కాదు' అను ఈఉద్దేశము నాకు ఎపు డొదవెనో తెలియదు కాని, నే నీ ఉద్దేశమును ఇంగ్లాండు వెళ్లువఱకు నిలువఉందుకొంటిని. తరువాతఁ దరువాత, ముఖ్యముగా దక్షిణ-ఆఫ్రికాలో అచట పుట్టీ అచట విద్యావంతులైన సిన్నవారలయు, లాయరులయు చక్కని వ్రాతనుచూచి సిగ్గిల్లి నేను దానిని ఏమఱినందులకు పశ్చాత్తాపపడితిని. చెడుదస్తూరిని అసమగ్రమగువిద్యయొక్క చిహ్నముగా పరిగణింపవచ్చునని నే నరసితిని. పిదప నేను వ్రాయసమునకు పాటుపడితిని గాని తరుణము తప్పెను. నాబాల్యమునందలి లోపమును నే నెన్నఁటికిని దిద్దుకొనలేకపోతిని. నన్ను చూచి ప్రతిచిన్నవాఁడును, ప్రతిచిన్నదియు జాగ్రత్తపడుఁగాక ! మంచిదస్తూరి విద్యలో ఒక ముఖ్యాంశ మని గుర్తించుఁగాక ! అక్షరముల దిద్దించుటకుముందు బాలురకు చిత్రలేఖనము నేర్పుట యుక్తతర మని నాకు నేఁడు తోఁచుచున్నది. పూవులు, పిట్టలు మొదలగు వానిని పరికించి గీయునటులే అక్షరములనుగూడ పరికించి వ్రాయుట తగును. వస్తువులను చూచి వ్రాయుట నేర్చికొన్న పిదపనే వ్రాఁతనేర్చుట తగును. అపుడు ఒరవడి అందముగా నిలువఁబడును. నాఁటి బడిమాటలు చెప్పఁదగినవి రెండు కలవు. వివాహముచే నాకు ఒకయేఁడు విద్యానాశము వాటిల్లినది. దానిని కూడఁదీయుటకు ఉపాధ్యాయుఁడు పయితరగతిలోనికి దాఁటించెను. కష్టించి వ్యాసంగము చేయువారికి సాధారణముగా ఈవీలు ఉండెడిది. కాన నేను మూఁడవతరగతిలో ఆఱునెలలే ఉండి వేసఁగి సెలవులకు ముందు జరుగు<noinclude><references/> {{c|22}}</noinclude> kny1d6knu2g840u5flaizyupgl99j3n పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/41 104 217533 568027 2026-08-02T22:40:11Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568027 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>5 హైస్కూలులో</big>}}</noinclude>పరీక్షలు అగుపిదప నాలుగవ తరగతిలోనికి దాఁటింపఁబడితిని. నాలవతరగతి మొదలుకొని చాల పాఠములు ఇంగ్లీషుననే బోధింపఁబడుచుండెను. నాకు నడిసముద్రములో ఉన్నటు లుండెను. రేఖాగణితము (Geometry) నాకు క్రొత్త. దానిసంగతి బాగుగా నాకు తెలియదు. ఆంగ్లములో బోధించుటచే అది మఱికొంచెము రాయి ఆయెను. ఉపాధ్యాయుఁడు మంచి బోధకుఁడే కాని, నాకు మాత్రము తెలియకుండెను. పలుమాఱులు మనస్సు చెదరి రెండేండ్ల చదువు ఒక యేఁడు మ్రింగఁదలఁచుట పేరాసయని మరల మూఁడవతరగతిలో చేరఁదలంచితిని. ఇటులు చేయుట నాకే కాక నాగురువునకును తలవంపులమారిపని; ఏలన, నావ్యాసంగమును విశ్వసించికదా ఆయన నన్ను పైన వేసినాఁడు – అను ఈరెండుభయములును నన్ను ఆతరగతియందే ఉంచెను. ప్రబలముగా వ్యాసంగము చేసి యూక్ లిడ్‌లో 13 - వ ప్రాపొజిషన్ వఱకు రాఁగా, అటనుండి రేఖాగణితమునందలి సంపూర్ణ సౌలభ్యము గోచరించెను. తనంతట తాను తెలివి తేటలను, సరళ ప్రయోగమును ఉపయోగించి చూడఁదగిన విషయము ఏదియయినను రాకపోదు. నాఁడు మొదలుకొని ఎప్పటికిని నాకు రేఖాగణితము నెడ సౌలభ్యమును, అభిరుచియు కలిగెను. సంస్కృతము మఱీ కష్ట మనిపించెను. రేఖాగణితమున ధారణలో ఉంచుకొనఁదగిన దేదియు లేదు. ఇఁక సంస్కృతముననో, ప్రతిదియు కంఠపాఠముగా ఉంచుకొనవలెనని నా ఊహ. ఈ పాఠము కూడ నాలుగవతరగతినుండి ఆరంభింపఁబడును. ఆఱవ తరగతి లోనికి వచ్చుసరికి బెదరిపోతిని, సంస్కృతో పాధ్యాయుఁడు పాఠము ఎక్కువ ఇచ్చి అంతయు ఒకమాఱు నూఱిపోయు స్వభావము కలవాఁడు. సంస్కృతోపాధ్యాయులకును, ఫారసీకోపాధ్యాయులకును ఏదో స్పర్ధ<noinclude><references/></noinclude> cqiw083vc8iuindw4se5ijn5s7l2mwk 568028 568027 2026-08-02T22:40:50Z శ్రీరామమూర్తి 1517 568028 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>5 హైస్కూలులో</big>}}</noinclude>పరీక్షలు అగుపిదప నాలుగవ తరగతిలోనికి దాఁటింపఁబడితిని. నాలవతరగతి మొదలుకొని చాల పాఠములు ఇంగ్లీషుననే బోధింపఁబడుచుండెను. నాకు నడిసముద్రములో ఉన్నటు లుండెను. రేఖాగణితము (Geometry) నాకు క్రొత్త. దానిసంగతి బాగుగా నాకు తెలియదు. ఆంగ్లములో బోధించుటచే అది మఱికొంచెము రాయి ఆయెను. ఉపాధ్యాయుఁడు మంచి బోధకుఁడే కాని, నాకు మాత్రము తెలియకుండెను. పలుమాఱులు మనస్సు చెదరి రెండేండ్ల చదువు ఒక యేఁడు మ్రింగఁదలఁచుట పేరాసయని మరల మూఁడవతరగతిలో చేరఁదలంచితిని. ఇటులు చేయుట నాకే కాక నాగురువునకును తలవంపులమారిపని; ఏలన, నావ్యాసంగమును విశ్వసించికదా ఆయన నన్ను పైన వేసినాఁడు – అను ఈరెండుభయములును నన్ను ఆతరగతియందే ఉంచెను. ప్రబలముగా వ్యాసంగము చేసి యూక్ లిడ్‌లో 13 - వ ప్రాపొజిషన్ వఱకు రాఁగా, అటనుండి రేఖాగణితమునందలి సంపూర్ణ సౌలభ్యము గోచరించెను. తనంతట తాను తెలివి తేటలను, సరళ ప్రయోగమును ఉపయోగించి చూడఁదగిన విషయము ఏదియయినను రాకపోదు. నాఁడు మొదలుకొని ఎప్పటికిని నాకు రేఖాగణితము నెడ సౌలభ్యమును, అభిరుచియు కలిగెను. సంస్కృతము మఱీ కష్ట మనిపించెను. రేఖాగణితమున ధారణలో ఉంచుకొనఁదగిన దేదియు లేదు. ఇఁక సంస్కృతముననో, ప్రతిదియు కంఠపాఠముగా ఉంచుకొనవలెనని నా ఊహ. ఈ పాఠము కూడ నాలుగవతరగతినుండి ఆరంభింపఁబడును. ఆఱవ తరగతి లోనికి వచ్చుసరికి బెదరిపోతిని, సంస్కృతో పాధ్యాయుఁడు పాఠము ఎక్కువ ఇచ్చి అంతయు ఒకమాఱు నూఱిపోయు స్వభావము కలవాఁడు. సంస్కృతోపాధ్యాయులకును, ఫారసీకోపాధ్యాయులకును ఏదో స్పర్ధ<noinclude><references/> {{c|23}}</noinclude> 99qv7mrbiz90oip0vzga14lj9xdfl5x పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/42 104 217534 568030 2026-08-02T22:50:31Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568030 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>ఉండెడిది. ఫారసీ మౌల్వీ సౌమ్యుఁడు. ఫారసీ మిగుల తేలికయనియు, మౌల్వీ విద్యార్థులయెడ దయాదాక్షిణ్యములు కలవాఁడనియు బాలురు తమలోతాము అనుకొనుచుండెడివారు. ఈ తేలికతనము నన్ను బెల్లించెను. ఒకనాఁడు పోయి ఫారసీ తరగతిలో కూరుచుంటిని. అందులకు సంస్కృతోపాధ్యాయుఁడు దుఃఖించెను. అతఁడు నన్ను పిలిచి, 'ఓయీ, నీ వెవరి కుమారుఁడవు ? నీమతభాషను నీవు నేర్చికొనవా? నీకు తెలియనిచో నాకడకు ఏల రావు? నాశక్తికొలఁది విద్యార్థులకు సంస్కృతము బోధించు కోరిక నాకు కలదు. చదివినకొలఁది తన్మయముచేయు విషయములు మీకు కానిపించును. అధైర్యము వలదు. మరల వచ్చి నా క్లాసులో కూరుచుండు' అనెను, వారిదయచే నాకు సిగ్గు పుట్టెను. గురుప్రేమను తిరస్కరింపఁజాలకపోయితిని. నేఁడు నాయాత్మ కృష్ణశంకరపాండ్యాగారి ఉపకారమును స్మరించుచున్నది. ఆనాఁడు ఆ కొలఁది సంస్కృతము నేని నేను చదివియుండనిచో మనశాస్త్రములందు ఆనందింప శక్తుఁడఁ గాకపోవు వాఁడనే. నిజమునకు 'నేను సంస్కృతము ఎక్కువ చదువుకొన లేదే' అని నాకు విచారము కలదు. ఏలన ప్రతిహిందూబాలుఁడును, బాలికయు సంస్కృతము చక్కఁగా చదువుకొని తీరవలయునని ఇటీవల ఎఱిఁగికొంటిని. భరతవర్షమున ఉన్నత విద్యాప్రణాళికలో మాతృభాషయు, ఉపరి హిందీ సంస్కృత ఫారసీ అరబ్బీ ఇంగ్లీషు భాషలు పాఠ్యములుగా చేయఁదగినవని నా ఆశయము. ఈసంఖ్యకు భీతిల్లఁ బనిలేదు. మన విద్య యింతకంటె క్రమబద్ధమై ఉండి బాలురకు ఇతరభాషలో పాఠములు నేర్వవలసిన బరువు లేకుండినచో ఈభాషలన్నియు నేర్చికొనుట ఒకశ్రమ గాక మహోల్లాస మగునని నాకు గట్టి నమ్మకము.<noinclude><references/> {{c|24}}</noinclude> tsk3kv7gycawmb7d48s16l1ipjk1urx పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/43 104 217535 568031 2026-08-02T22:57:42Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568031 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>5 హైస్కూలులో</big>}}</noinclude>ఒక భాష శాస్త్రీయముగా అభ్యసించినచో మిగిలిన భాషలు సులభతరములు. అసలు హిందీ గుజరాతీ సంస్కృత భాషలు ఏకభాషయే అననగును. అట్లే ఫారసీ అరబ్బీ భాషలు ఏకభాష. ఫారసీ భాష ఆర్యభాష అయ్యును, అరబ్బీ భాష హీబ్రూకు చెందియున్నను, ఈ రెంటికిని ఒక దగ్గఱ చుట్టఱికము ఉన్నది. ఈ రెండును ఇస్లాము మతముతో వర్ధిల్లినవి. ఉరుదూభాషను వేఱుగా ఎన్నను. ఏలనఁగా, దాన హిందీ వ్యాకరణసమావేశమును, ఫారసీ అరబ్బీ పదములును గలవు. గుజరాతీలోఁగాని, హిందీలోఁగాని, బంగాళీలోఁగాని, మరాటీలోఁగాని మంచి ప్రవేశము ఉండవలయు నన్నచో సంస్కృత మెటులు రావలయునో, ఉరుదూలో పాండిత్యము సంపాదింపవలయుననిన అటులే ఫారసీ అరబ్బీలు రావలెను.<noinclude><references/> {{c|25}}</noinclude> jh573yl98040l7px8zg2teufnmb8e3p పుట:Kavyamanjari By Veturi Prabhakara Sastry.pdf/25 104 217536 568034 2026-08-03T02:21:13Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'S. చ. కడుపుతీపు పటివేళ కలదుగద యంధ్రవిష్ణు స్థలమై శ్రీకాకుళాభిధానమ్మునఁ బే ర్వేలసిన పుర మంధ్రావని వెలనాటన్ గృష్ణపెంపు వెలసినచోటన్. ఆయూర నొక్క యోవర్ సీయరు సకుటుంబముగ వసించ...' 568034 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>S. చ. కడుపుతీపు పటివేళ కలదుగద యంధ్రవిష్ణు స్థలమై శ్రీకాకుళాభిధానమ్మునఁ బే ర్వేలసిన పుర మంధ్రావని వెలనాటన్ గృష్ణపెంపు వెలసినచోటన్. ఆయూర నొక్క యోవర్ సీయరు సకుటుంబముగ వసించుచునుండుస్ ప్రాయంపువాఁడు మిళుఁ డాయన యిల్లాలు బిడ్డ లందపుఁ గందుల్ అరసి యెఱుంగ దిందనుక నత్తిలు నత్తలునీమతల్లి కాఁ పురమున కాపురమ్మునకె పోయేను బిడ్డలు నల్గు రైదుగుర్ వరుసఁగ నచ్చటే కలిగి వర్ధిలుచుండిరి సర్వసౌఖ్యముల్ దొరకొనఁ దత్కుటుంబము కు దుర్కొనే నక్కడఁ బెక్కునాళ్లుగన్, 6. సోమరితనమున కలసట A. కేమఱుపాటునకుఁ జోటు నీయక యా యిం టామె యిలు దీర్చుకొంచుం బ్రేమించున్ మగనిప్రాపు బిడ్డలప్రోఫున్. ఇంతలంతలు నగు నగు మోము నిసుఁగు లింట గోము లెసఁగ దోస పండ్లు వోలె దోఁగాడుచుందు రా నిండు గన్నఁ గనులపండు గన్న! 3 5 1 2<noinclude><references/></noinclude> mvtx1dmpljtj1nwb6dsoqakpzidexvi పుట:Kavyamanjari By Veturi Prabhakara Sastry.pdf/49 104 217537 568035 2026-08-03T02:22:09Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'విశ్వాసము వేటూరి ప్రభాకరశాస్త్రి 1926' 568035 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>విశ్వాసము వేటూరి ప్రభాకరశాస్త్రి 1926<noinclude><references/></noinclude> d8tcymg61g2jixvlnlepqon9mb3612r పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/38 104 217538 568043 2026-08-03T06:21:43Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రచనలో ముఖ్యంగా ఈ కడుపుతీపులో పద్యంలోనూ కనీసం ఒక్క పాదంలో నైనా ఉండకపోవడం అసాధారణం. సరే, కథా ప్రవేశం చేద్దాం. అది శ్రావణమాసం. బెజవాడ ఆనకట్ట కృష్ణమ్మ అరవై అడుగులకు దాటి రెండు...' 568043 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>రచనలో ముఖ్యంగా ఈ కడుపుతీపులో పద్యంలోనూ కనీసం ఒక్క పాదంలో నైనా ఉండకపోవడం అసాధారణం. సరే, కథా ప్రవేశం చేద్దాం. అది శ్రావణమాసం. బెజవాడ ఆనకట్ట కృష్ణమ్మ అరవై అడుగులకు దాటి రెండు ఒడ్డుల మధ్యనా నిండి, మిగిలినది సముద్రంలోకి వెళ్ళిపోతోంది. వరదలొచ్చాయి. పల్లెల అవస్థలు హెచ్చాయి. పశువుల్నీ ధనధాన్యాల్నీ కాపాడుకోవడం కష్టమైపోయింది. అంత వరదలోనూ కృష్ణలో ఆడువారు, స్నానమాడువారు, పుణ్యకాంతల పూజాపునస్కారాలు చేస్తూనేవున్నారు. సరే మన కథానాయిక అయిన ఇల్లాలు ఇంటాయనతో పిల్లలతో స్నానానికి వెళ్ళింది. భర్త - రేవుని భార్యకి చూపించాడు- భార్య పిల్లల్ని ఒక్కొక్కర్నే స్నానం చేయిస్తోంది, ఇంతలో ప్రవాహంలో తుమ్మముళ్ళ కొమ్మ ఆమెచేయి దగ్గరికి వచ్చేసింది. <poem>'పై కేగుదెంచు నంచుం గైకొని యాకొమ్మవిసరె గడగా బడగా నాకొమ్మ, యందు మిసమిస బ్రాకిన యట్లయ్యె అదియు బామో ఏమో'</poem> - ఎదో పాకినట్లయింది మాత్రమే. భక్తిలో దైవ భయభక్తులుంటాయి. అందులోనూ నోములూ వ్రతాలూ చేసే పాఠకాలం తల్లిగదా "మోపిదేవి సుబ్రహ్మణ్యమూర్తి, నీకు మొక్కు చెల్లిస్తాను, దర్శనానికి వస్తాను. పుట్టలో పాలుపోస్తా, నాపిల్లలకు పురుగు భయంలేకుండా రక్షించమంది. స్నానంచేసింది. బిడ్డలు కాళ్ళకు అడ్డాలు పడుతూండగా ఇంటికి వచ్చింది. భర్తవచ్చాడు. తరువాత తపాలా ఉత్తరం ఒకటి వచ్చింది. అది అధికారలేఖ భర్తకు మదరాసు బదిలీ, జీతం పెంపునకు చెందిన లేఖ. వారిద్దరికీ ఉన్నవూరు నుండి చెన్నపట్నం వెళ్ళడానికి ఇష్టం లేదు, తప్పదు. ఆలోచిస్తున్నారిద్దరూ. తరువాత రాత్రివేళ భోజనాలు చేశారంతా. ఇల్లాలు "వాన యీదురు గాలి వస్తోంది. ఆ మంచంమీద పిల్లల మధ్య మీరు పడుకోండి" అంది భర్తతో, పిల్లలు "అమ్మా నాన్న దగ్గర పడుకుంటే మాకు నిద్ర రాదు" అని నేలమీద తల్లి దగ్గరే పడుకుని పంతం నెగ్గించుకున్నారు. శ్రీకాకుళాధీశ్వరా! మా పిల్లల్ని జాగ్రత్తగా చూడమని ప్రార్ధించుకుంది. పడుకున్నారు. మధ్యలో పాలకు పిల్లాడేచ్చాడు. తల్లి మేలుకుని తలుపు తీసి బయట కాళ్ళు కడుక్కు వచ్చి, తలుపు వారగా వేసి, చేపు రాగా పాలివ్వడానికి కుమారుణ్ణి తీసుకుని కూర్చొంది. అప్పుడు ఘోరం జరిగింది. <poem>"తెల్లంద్రాచట (తెల్లత్రాచు) అప్పుడామె పయి కుద్రేకించి దూకెన్ బుసల్ చల్లెం పైబడగార్చె, అంత సుతరక్షా చింతయేదక్కత కెల్లం ద్రోపడ నాపె పాపశిర మట్టే పట్టె నిర్వీతులన్ (ఇరుచేతులా) 'పిల్లల్ పిల్లలు పిల్లలంచునఱచెన్, బీభత్స కంఠధ్వనిన్"</poem> తెల్లత్రాచును చేత్తో పట్టుకుని తన దగ్గరున్న పిల్లల్ని మంచం మీదకి చేర్చండి. మంచంమీదకి చేర్చండి అనగా, భర్త లేచి పిల్లల్ని మంచంమీదకు చేర్చాడు ఖంగారుగా. <poem>"అయ్యో బిడ్డల జేకొను డయ్యోబిడ్డల'ని యేడ్చు సంతే కానీ అయ్యమ్మ పాము బట్టితి చెయ్యిదిగో కరచునంచు జీర దయారే!</poem> ఆ విషపు తోకతో ఆమె రెండు చేతుల్ని చుట్టేసింది. ఈమె ఆ పాము ఎక్కడికి వెళ్ళి పిల్లల్ని ఏంచేస్తుందో అని దాన్ని పట్టుకునేవుంది. పాము తలతో కొట్టడం వల్ల చేతులనిండా రక్తం కారింది. వచ్చి చేరిన జనంలో ఒకరు ఉత్తరీయాన్ని పాము తల పై వేసి ఎలాగో చంపేశాడు. ఇల్లాలు గుడ్లు తేలేసింది. ఇంకా చనిపోవదు పిల్లాడు తల్లి శరీరంపై పడినా పాలు విషపుసాలయ్యాయి. ఇవ్వలేని ఆ సందర్భంలోనూ బాధపడింది. పసిబిడ్డల్ని ఉపేక్షించకుండా చూసుకుంటానని భర్తచే శపథం చేయించుకుని 'పసిబిడ్డలు పసిబిడ్డలగంటూనే ప్రాణం విడిచింది. కొడుకుగుఱ్ఱలకై జంకు గొంకు లేక పాసె దన ప్రాణముల దృణ ప్రాయముగను బూటకంబయ్య నిప్పుడీ బోటి వలస, ప్రాణమన్నింటి కంటే తీపనెడ్ పలుకు అన్నారు. కవి - ప్రాణం అన్నింటికంటే తీపే అయినా అంతకంటే కరువుతీసే తీవు - అని ఈకావ్యంద్వారా సందేశమిచ్చారు. వేటూరివారు. ఇది 105 పద్యాల ఖండకావ్యం, ప్రతీపద్యం చిక్కగా ఉండి అందులో తెలుగుదనం చక్కగా నిండిస్తూ కరుణరసస్ఫోకరంగా వ్రాశారు. అంతేకాదు దీనిలో సంస్కృతీ విశేషాలున్నాయి. ఆచారవ్యవహారా లున్నాయి. శ్రీకాకుళం నుండి తప్పనిసరి బదిలీ తెలిసినప్పుడు వ్యస్థాన ప్రేమాంశాలు, వాని అనుభూతులూ వున్నాయి. అంతేకాదు. ఇందులో ఆంధ్రుల గొప్పతనాలున్నాయి. చెన్నపురి వెడితే శ్రీకాకుళస్వామి దర్శనం, కృష్ణానదీస్నానం. ఇవేకాక "దొరకునో లేదో మధుర వర్తనము గల్గు తెల్గు గేస్తుల చెల్మితీరు మరల” అనుకొంటారు. ఎందుకంటే వారిది తమిళుల కుటుంబం, "ప్రశస్త వస్తు భరితమగు ఆంధ్రభూమిని" కాపురం మళ్లీ వస్తుందా అనుకుంటారు. కృష్ణాప్రాంతం ఊళ్ళ పొలాల ప్రకృతి మళ్ళీ దొరుకుతుందా అనుకుంటారు. "హృదయమిచ్చి ఆదరించుగృహస్థుల నడుమ కాపురం బొనర్పగలిగె కేలు మోడ్పు నీకు కృష్ణాతరంగిణీ తీరశోభితాంధ్ర దేశలక్ష్మి" అంటారు. ఆ దంపతులు. 'చక్కెర అక్కఱలేనివి చిక్కనిపాల్ గడ్డ పెరుగు ఉడ్డగు వేయున్ మిక్కిలి చవిగల కూరలు. చిక్కున్ కృష్ణాస్రవంతి చెంతల యూళ్ళన్' అంటారు వేటూరికవి, అంతేకాదు "ఆతిధ్యగౌరవంబును స్వాతంత్య్ర్య ప్రియత, స్వల్పసంతోషము, దుర్నీతినిహీనత, నైచ్యా పేతత్వము నాంధ్రులందు పేర్పడు గుణముల్" అని కూడా పాత్రలతో చెప్పిస్తారు వేటూరివారు. నిమ్నోన్నతాలు అనడానికి 'వైపువాటములు' అని అనిన తెలుగుకవి వేటూరి ప్రభాకరశాస్త్రిగారే. కడుపుతీపిలో ఉనికితీపి, బాసతీపి, బతుకుతీపి ఇన్ని - ఎన్నో ఉన్నాయంటే చదివితీరవలసిన పొత్తం కదా! (పొత్తాన్ని అందించిన శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయానికి ముప్పిడాలు) రచయిత ఫోన్ : 9292055531<noinclude><references/> | తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015 |</noinclude> ilv6s0wdcqgnv3k70mhyx6v5ctsutev 568045 568043 2026-08-03T06:30:49Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 568045 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>రచనలో ముఖ్యంగా ఈ కడుపుతీపులో పద్యంలోనూ కనీసం ఒక్క పాదంలో నైనా ఉండకపోవడం అసాధారణం. సరే, కథా ప్రవేశం చేద్దాం. అది శ్రావణమాసం. బెజవాడ ఆనకట్ట కృష్ణమ్మ అరవై అడుగులకు దాటి రెండు ఒడ్డుల మధ్యనా నిండి, మిగిలినది సముద్రంలోకి వెళ్ళిపోతోంది. వరదలొచ్చాయి. పల్లెల అవస్థలు హెచ్చాయి. పశువుల్నీ ధనధాన్యాల్నీ కాపాడుకోవడం కష్టమైపోయింది. అంత వరదలోనూ కృష్ణలో ఆడువారు, స్నానమాడువారు, పుణ్యకాంతల పూజాపునస్కారాలు చేస్తూనేవున్నారు. సరే మన కథానాయిక అయిన ఇల్లాలు ఇంటాయనతో పిల్లలతో స్నానానికి వెళ్ళింది. భర్త - రేవుని భార్యకి చూపించాడు- భార్య పిల్లల్ని ఒక్కొక్కర్నే స్నానం చేయిస్తోంది, ఇంతలో ప్రవాహంలో తుమ్మముళ్ళ కొమ్మ ఆమెచేయి దగ్గరికి వచ్చేసింది. <poem>'పై కేగుదెంచు నంచుం గైకొని యాకొమ్మవిసరె గడగా బడగా నాకొమ్మ, యందు మిసమిస బ్రాకిన యట్లయ్యె అదియు బామో ఏమో'</poem> - ఎదో పాకినట్లయింది మాత్రమే. భక్తిలో దైవ భయభక్తులుంటాయి. అందులోనూ నోములూ వ్రతాలూ చేసే పాఠకాలం తల్లిగదా "మోపిదేవి సుబ్రహ్మణ్యమూర్తి, నీకు మొక్కు చెల్లిస్తాను, దర్శనానికి వస్తాను. పుట్టలో పాలుపోస్తా, నాపిల్లలకు పురుగు భయంలేకుండా రక్షించమంది. స్నానంచేసింది. బిడ్డలు కాళ్ళకు అడ్డాలు పడుతూండగా ఇంటికి వచ్చింది. భర్తవచ్చాడు. తరువాత తపాలా ఉత్తరం ఒకటి వచ్చింది. అది అధికారలేఖ భర్తకు మదరాసు బదిలీ, జీతం పెంపునకు చెందిన లేఖ. వారిద్దరికీ ఉన్నవూరు నుండి చెన్నపట్నం వెళ్ళడానికి ఇష్టం లేదు, తప్పదు. ఆలోచిస్తున్నారిద్దరూ. తరువాత రాత్రివేళ భోజనాలు చేశారంతా. ఇల్లాలు "వాన యీదురు గాలి వస్తోంది. ఆ మంచంమీద పిల్లల మధ్య మీరు పడుకోండి" అంది భర్తతో, పిల్లలు "అమ్మా నాన్న దగ్గర పడుకుంటే మాకు నిద్ర రాదు" అని నేలమీద తల్లి దగ్గరే పడుకుని పంతం నెగ్గించుకున్నారు. శ్రీకాకుళాధీశ్వరా! మా పిల్లల్ని జాగ్రత్తగా చూడమని ప్రార్ధించుకుంది. పడుకున్నారు. మధ్యలో పాలకు పిల్లాడేచ్చాడు. తల్లి మేలుకుని తలుపు తీసి బయట కాళ్ళు కడుక్కు వచ్చి, తలుపు వారగా వేసి, చేపు రాగా పాలివ్వడానికి కుమారుణ్ణి తీసుకుని కూర్చొంది. అప్పుడు ఘోరం జరిగింది. <poem>"తెల్లంద్రాచట (తెల్లత్రాచు) అప్పుడామె పయి కుద్రేకించి దూకెన్ బుసల్ చల్లెం పైబడగార్చె, అంత సుతరక్షా చింతయేదక్కత కెల్లం ద్రోపడ నాపె పాపశిర మట్టే పట్టె నిర్వీతులన్ (ఇరుచేతులా) 'పిల్లల్ పిల్లలు పిల్లలంచునఱచెన్, బీభత్స కంఠధ్వనిన్"</poem> తెల్లత్రాచును చేత్తో పట్టుకుని తన దగ్గరున్న పిల్లల్ని మంచం మీదకి చేర్చండి. మంచంమీదకి చేర్చండి అనగా, భర్త లేచి పిల్లల్ని మంచంమీదకు చేర్చాడు ఖంగారుగా. <poem>"అయ్యో బిడ్డల జేకొను డయ్యోబిడ్డల'ని యేడ్చు సంతే కానీ అయ్యమ్మ పాము బట్టితి చెయ్యిదిగో కరచునంచు జీర దయారే!</poem> ఆ విషపు తోకతో ఆమె రెండు చేతుల్ని చుట్టేసింది. ఈమె ఆ పాము ఎక్కడికి వెళ్ళి పిల్లల్ని ఏంచేస్తుందో అని దాన్ని పట్టుకునేవుంది. పాము తలతో కొట్టడం వల్ల చేతులనిండా రక్తం కారింది. వచ్చి చేరిన జనంలో ఒకరు ఉత్తరీయాన్ని పాము తలపై వేసి ఎలాగో చంపేశాడు. ఇల్లాలు గుడ్లు తేలేసింది. ఇంకా చనిపోవదు పిల్లాడు తల్లి శరీరంపై పడినా పాలు విషపుసాలయ్యాయి. ఇవ్వలేని ఆ సందర్భంలోనూ బాధపడింది. పసిబిడ్డల్ని ఉపేక్షించకుండా చూసుకుంటానని భర్తచే శపథం చేయించుకుని 'పసిబిడ్డలు పసిబిడ్డలగంటూనే ప్రాణం విడిచింది. <poem>కొడుకుగుఱ్ఱలకై జంకు గొంకు లేక పాసె దన ప్రాణముల దృణ ప్రాయముగను బూటకంబయ్య నిప్పుడీ బోటి వలస, ప్రాణమన్నింటి కంటే తీపనెడి పలుకు అన్నారు. కవి -</poem> ప్రాణం అన్నింటికంటే తీపే అయినా అంతకంటే కరువుతీపే తీవు - అని ఈకావ్యంద్వారా సందేశమిచ్చారు. వేటూరివారు. ఇది 105 పద్యాల ఖండకావ్యం, ప్రతీపద్యం చిక్కగా ఉండి అందులో తెలుగుదనం చక్కగా నిండిస్తూ కరుణరసస్ఫోకరంగా వ్రాశారు. అంతేకాదు దీనిలో సంస్కృతీ విశేషాలున్నాయి. ఆచారవ్యవహారాలున్నాయి. శ్రీకాకుళం నుండి తప్పనిసరి బదిలీ తెలిసినప్పుడు స్వస్థాన ప్రేమాంశాలు, వాని అనుభూతులూ వున్నాయి. అంతేకాదు. ఇందులో ఆంధ్రుల గొప్పతనాలున్నాయి. చెన్నపురి వెడితే శ్రీకాకుళస్వామి దర్శనం, కృష్ణానదీస్నానం. ఇవేకాక "దొరకునో లేదో మధుర వర్తనము గల్గు తెల్గు గేస్తుల చెల్మితీరు మరల” అనుకొంటారు. ఎందుకంటే వారిది తమిళుల కుటుంబం, "ప్రశస్త వస్తు భరితమగు ఆంధ్రభూమిని" కాపురం మళ్లీ వస్తుందా అనుకుంటారు. కృష్ణాప్రాంతం ఊళ్ళ పొలాల ప్రకృతి మళ్ళీ దొరుకుతుందా అనుకుంటారు. <poem>"హృదయమిచ్చి ఆదరించుగృహస్థుల నడుమ కాపురం బొనర్పగలిగె కేలు మోడ్పు నీకు కృష్ణాతరంగిణీ తీరశోభితాంధ్ర దేశలక్ష్మి" అంటారు. ఆ దంపతులు. 'చక్కెర అక్కఱలేనివి చిక్కనిపాల్ గడ్డ పెరుగు ఉడ్డగు వేయున్ మిక్కిలి చవిగల కూరలు. చిక్కున్ కృష్ణాస్రవంతి చెంతల యూళ్ళన్' అంటారు వేటూరికవి, అంతేకాదు </poem> "ఆతిధ్యగౌరవంబును స్వాతంత్య్ర్య ప్రియత, స్వల్పసంతోషము, దుర్నీతినిహీనత, నైచ్యా పేతత్వము నాంధ్రులందు పేర్పడు గుణముల్" అని కూడా పాత్రలతో చెప్పిస్తారు వేటూరివారు. నిమ్నోన్నతాలు అనడానికి 'వైపువాటములు' అని అనిన తెలుగుకవి వేటూరి ప్రభాకరశాస్త్రిగారే. కడుపుతీపిలో ఉనికితీపి, బాసతీపి, బతుకుతీపి ఇన్ని - ఎన్నో ఉన్నాయంటే చదివితీరవలసిన పొత్తం కదా! (పొత్తాన్ని అందించిన శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయానికి ముప్పిడాలు) రచయిత ఫోన్ : 9292055531<noinclude><references/> {{rh|తెలుగుజాతి పత్రిక | అమ్మనుడి | మార్చి 2015}}</noinclude> dokqsf1suj62kjw0mtzllwz28blo7zc పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/39 104 217539 568047 2026-08-03T06:37:36Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'స్ఫూర్తి ప్రదాత - డా॥ నాగసూరి వేణుగోపాల్ తెలుగు సంగీత సేవను చరిత్ర కెక్కించిన 'గానకళ' మునుగంటి శ్రీరామమూర్తి "... 1962 వ సం|| జూన్ నెలలో 'గానకళ' ప్రారంభించాం సంగీతానికి ఆంధ్రప్రద...' 568047 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>స్ఫూర్తి ప్రదాత - డా॥ నాగసూరి వేణుగోపాల్ తెలుగు సంగీత సేవను చరిత్ర కెక్కించిన 'గానకళ' మునుగంటి శ్రీరామమూర్తి "... 1962 వ సం|| జూన్ నెలలో 'గానకళ' ప్రారంభించాం సంగీతానికి ఆంధ్రప్రదేశంలో ఒక పత్రిక ఉండాలనే భావన సాహసోపేతమైనదే! ఈనాడు మద్రాసు నుంచి ప్రచురితమవుతున్న సంగీత పత్రికలకు కొన్ని దశాబ్దాలకు ముందే నాకీ ఆలోచన కలగడం సాహసమే! పత్రిక ప్రచారం కోసం నాతోపాటు స్వర్గీయ మహేంద్రవాడ కామేశ్వరరావు అనేక పట్టణాలకు తిరిగి కష్టసుఖాలను పంచుకుంటూ పత్రికకు ఎనలేని సేవచేశారు. వారి సేవను నేను ఎప్పుడూ మరువలేను. కనీసం 15, 20 పట్టణాలలో ప్రముఖులను కలుసుకుంటూ, సభ్యులను చేర్పిస్తూ చాలా కృషి చేశాము. ఈ పర్యటన అనంతరం నా ఆరోగ్యం చెడింది. డబుల్ టైఫాయిడ్ బారిన పడ్డాను. 40 రోజులు రుగ్మతను అనుభవించాను. మామూలు స్థితికి రావడానికి వాడిన ఇంగ్లీషు మందుల ప్రభావం ఒక నెలపోయిన తర్వాత నాలో కన్పించింది. ఒళ్ళంతా తెల్లబడింది. - తలతో సహా. ఆస్థితి నుండి బయటపడటానికి నాకు సంవత్సరకాలం పట్టింది. దాని చికిత్సకు వాడని మందు లేదు, చేయని ప్రయోగం లేదు. ఆ 40 రోజులలో ఒక రోజున ఇంజక్షన్ తీసుకొన్నప్పుడు 20 నిమిషాలు నేను పైలోకానికి పోయాను. అంతా అయిపోయిందనే అనుకున్నారు. మొండిప్రాణం కనుకనో ఏమో తిరిగి నేల మీదకి దిగి వచ్చాను. ఈ అనుభవాలన్నీ సంగీత పత్రికను నిలబెట్టాలనే తపనతో ఉన్న చోటనే ఉండక, తిన్నచోట తినక అవిశ్రాంతంగా కష్టపడటం వల్ల వచ్చిన పర్యవసానమే. ఇలా తన సంగీత మాసపత్రిక 'గానకళ' కోసం పడిన యిడుముల కథను మునుగంటి శ్రీరామమూర్తి 2014 నవంబరు సంచిక 'నాజీవన యానం'లో విపులీకరించారు. నవంబరు సంచికలో. ఇప్పుడే ఎందుకు ఈ సంగతులు రాశారా? అనే సందేహం కలుగుతోంది. 1962 జూన్లో మునుగంటి శ్రీరామమూర్తిగారు సంగీతం కోసం 'గానకళ' అనే పత్రికను ప్రారంభించి - విజయవంతంగా నడుపుతూ ఈ జనవరి 12న తన తొంబైమూడవ ఏట కాలధర్మం చెందారు. అరశతాబ్ధం మించి సంగీతం కోసం ఒక మాసపత్రికను పెట్టి కొనసాగించడం నిజంగా సాహసమే. మునుగంటి వారితో ముఖాముఖి పరిచయం జరిగి ఒక దశాబ్దం దాటి ఉండవచ్చు! నేను తెలుగు 'స్పోకెన్ వర్డ్స్' విభాగం చూస్తున్న కాలంలో వారిని సంగీత సంబంధమైన అంశం గురించి ప్రసంగించడానికి కాకినాడ నుంచి ఆహ్వానించాను. భౌతికంగా కలవడం 2005లో కావచ్చు కానీ వారి జర్నలిజం మూర్తిమత్వం పరిచయమై మూడు దశాబ్దాలు దాటింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో కనబడిన పత్రికలలో గానకళ ఒకటి - సంగీతానికి ఒక మాసపత్రిక వస్తోందని తెగ సంతోషం కల్గింది. సంపాదకులు మునుగంటి శ్రీరామమూర్తిగారి మీద గౌరవం పెరిగింది. వారెవరో తెలియదు కానీ కృషి గొప్పదని భావించాను. వారి పత్రికను మూడునాలుగేళ్ళు చూసి వుంటాను. తిరుపతిలో ముఖాముఖి పరిచయమైనప్పటి నుంచి వారి సౌజన్యం ఎంతో అనురాగం ఏమిటో ప్రత్యక్షంగా, పరోక్షంగా చూడగలిగాను. మనిషి పొడుగు కాదు, కొంచెం సగటు ఎత్తుతోనే మూర్తి. దాదాపు తెల్లచొక్కాలోనే వారిని చూసినట్టు గుర్తు. మూర్తి కన్నా వారి మాట మరీ మృదువు. దయాపూరితం. హంగూ ఆర్భాటం లేవు. ఎప్పుడూ నాసలహాలు పత్రికకు అవసరమని కొరేవారు. వయోలిన్ అద్భుతం. ద్వారం వెంకటస్వామినాయుడు గారి 50వ వర్ధంతి కార్యక్రమాలు ఇటీవల చెన్నయ్లో నవంబరు 13,14,15 తేదీలలో జరిగాయి. చివరి రోజున (శనివారం కావడంతో) నేను తేనాంపేట 'తత్వలోక' ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మునుగంటి శ్రీరామమూర్తి గారిని కలవటం, వారు ద్వారం వారి గురించి సవివరంగా, గంభీరంగా ఆంగ్లంలో ప్రసంగించగా వినడం సాధ్యపడింది. లేకపోతే వారిని కలిసి ఉండేవాడిని కాదు. ఆ మధ్య వారి ఆరోగ్యం తీసిపోయి, తర్వాత కుదుటపడ్డారు. అలాంటి మునుగంటివారు ఈ జనవరి 12 న సాయంత్రం అకస్మాత్తుగా మరణించారు. నిజానికి అదే రోజున ఓ సినీ నిర్మాత - దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ గారు కనుమూయటంతో టీవీ చానళ్ళు ఆయన సినిమా పాటలు వాడుకోవడంలో తనమునకలుగా ఉన్నాయి. మరుసటిరోజు మదరాసులో ఈనాడు పత్రికలో చదివేదాకా నాకు తెలియదు. రెండు నెలల క్రితం కలిశాను, హాయిగా మాట్లాడారు - అంతలోనే పోయారని బాధ కల్గింది. శ్రీరామమూర్తిగారు 1925 మార్చి 25న కాకినాడలో జన్మించారు. తల్లిదండ్రులు సుభద్రమ్మ, మునుగంటి వెంకటరావు. తండ్రి గాయకులు. తాత శ్రీరాములుగారు త్యాగరాజస్వామి శిష్యపరంపరలు ఐదవతరానికి చెందినవారు. వీరి తాతగారు 115 సం॥లో క్రితం (లేదా ఇంకా ముందు) కాకినాడలో శ్రీరామ సమాజం ప్రారంభించారు. అలాగే ఉచిత సంగీత కళాశాలను శ్రీరామమూర్తి తాతగారు మొదలుపెట్టారు. అంతేకాకుండా వీరు గణపతి సంగీత ఉత్సవం పేరున 10 రోజులపాటు ఐదు హరికథలుండటం. శ్రీరామమూర్తిగారు ఈ నేపథ్యం నుంచి వచ్చారు.<noinclude><references/> | తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015</noinclude> 6ztch5rgsyzugusbk05yfq83mqh68u6 568062 568047 2026-08-03T07:35:14Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 568062 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{rh|స్ఫూర్తి ప్రదాత|| - డా॥ నాగసూరి వేణుగోపాల్}} {{p|fs125|ac}}తెలుగు సంగీత సేవను చరిత్ర కెక్కించిన</p> {{p|fs150|ac}}'గానకళ'<br>మునుగంటి శ్రీరామమూర్తి</p> {{larger|"... 1962}}వ సం॥ జూన్ నెలలో 'గానకళ' ప్రారంభించాం సంగీతానికి ఆంధ్రప్రదేశంలో ఒక పత్రిక ఉండాలనే భావన సాహసోపేతమైనదే! ఈనాడు మద్రాసు నుంచి ప్రచురితమవుతున్న సంగీత పత్రికలకు కొన్ని దశాబ్దాలకు ముందే నాకీ ఆలోచన కలగడం సాహసమే! పత్రిక ప్రచారం కోసం నాతోపాటు స్వర్గీయ మహేంద్రవాడ కామేశ్వరరావు అనేక పట్టణాలకు తిరిగి కష్టసుఖాలను పంచుకుంటూ పత్రికకు ఎనలేని సేవచేశారు. వారి సేవను నేను ఎప్పుడూ మరువలేను. కనీసం 15, 20 పట్టణాలలో ప్రముఖులను కలుసుకుంటూ, సభ్యులను చేర్పిస్తూ చాలా కృషి చేశాము. ఈ పర్యటన అనంతరం నా ఆరోగ్యం చెడింది. డబుల్ టైఫాయిడ్ బారిన పడ్డాను. 40 రోజులు రుగ్మతను అనుభవించాను. మామూలు స్థితికి రావడానికి వాడిన ఇంగ్లీషు మందుల ప్రభావం ఒక నెలపోయిన తర్వాత నాలో కన్పించింది. ఒళ్ళంతా తెల్లబడింది. - తలతో సహా. ఆస్థితి నుండి బయటపడటానికి నాకు సంవత్సరకాలం పట్టింది. దాని చికిత్సకు వాడని మందు లేదు, చేయని ప్రయోగం లేదు. ఆ 40 రోజులలో ఒక రోజున ఇంజక్షన్ తీసుకొన్నప్పుడు 20 నిమిషాలు నేను పైలోకానికి పోయాను. అంతా అయిపోయిందనే అనుకున్నారు. మొండిప్రాణం కనుకనో ఏమో తిరిగి నేల మీదకి దిగి వచ్చాను. ఈ అనుభవాలన్నీ సంగీత పత్రికను నిలబెట్టాలనే తపనతో ఉన్న చోటనే ఉండక, తిన్నచోట తినక అవిశ్రాంతంగా కష్టపడటం వల్ల వచ్చిన పర్యవసానమే. ఇలా తన సంగీత మాసపత్రిక 'గానకళ' కోసం పడిన యిడుముల కథను మునుగంటి శ్రీరామమూర్తి 2014 నవంబరు సంచిక 'నాజీవన యానం'లో విపులీకరించారు. నవంబరు సంచికలో. ఇప్పుడే ఎందుకు ఈ సంగతులు రాశారా? అనే సందేహం కలుగుతోంది. 1962 జూన్లో మునుగంటి శ్రీరామమూర్తిగారు సంగీతం కోసం 'గానకళ' అనే పత్రికను ప్రారంభించి - విజయవంతంగా నడుపుతూ ఈ జనవరి 12న తన తొంబైమూడవ ఏట కాలధర్మం చెందారు. అరశతాబ్ధం మించి సంగీతం కోసం ఒక మాసపత్రికను పెట్టి కొనసాగించడం నిజంగా సాహసమే. మునుగంటి వారితో ముఖాముఖి పరిచయం జరిగి ఒక దశాబ్దం దాటి ఉండవచ్చు! నేను తెలుగు 'స్పోకెన్ వర్డ్స్' విభాగం చూస్తున్న కాలంలో వారిని సంగీత సంబంధమైన అంశం గురించి ప్రసంగించడానికి కాకినాడ నుంచి ఆహ్వానించాను. భౌతికంగా కలవడం 2005లో కావచ్చు కానీ వారి జర్నలిజం మూర్తిమత్వం పరిచయమై మూడు దశాబ్దాలు దాటింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో కనబడిన పత్రికలలో గానకళ ఒకటి - సంగీతానికి ఒక మాసపత్రిక వస్తోందని తెగ సంతోషం కల్గింది. సంపాదకులు మునుగంటి శ్రీరామమూర్తిగారి మీద గౌరవం పెరిగింది. వారెవరో తెలియదు కానీ కృషి గొప్పదని భావించాను. వారి పత్రికను మూడునాలుగేళ్ళు చూసి వుంటాను. తిరుపతిలో ముఖాముఖి పరిచయమైనప్పటి నుంచి వారి సౌజన్యం ఎంతో అనురాగం ఏమిటో ప్రత్యక్షంగా, పరోక్షంగా చూడగలిగాను. మనిషి పొడుగు కాదు, కొంచెం సగటు ఎత్తుతోనే మూర్తి. దాదాపు తెల్లచొక్కాలోనే వారిని చూసినట్టు గుర్తు. మూర్తి కన్నా వారి మాట మరీ మృదువు. దయాపూరితం. హంగూ ఆర్భాటం లేవు. ఎప్పుడూ నాసలహాలు పత్రికకు అవసరమని కొరేవారు. వయోలిన్ అద్భుతం. ద్వారం వెంకటస్వామినాయుడు గారి 50వ వర్ధంతి కార్యక్రమాలు ఇటీవల చెన్నయ్లో నవంబరు 13,14,15 తేదీలలో జరిగాయి. చివరి రోజున (శనివారం కావడంతో) నేను తేనాంపేట 'తత్వలోక' ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మునుగంటి శ్రీరామమూర్తి గారిని కలవటం, వారు ద్వారం వారి గురించి సవివరంగా, గంభీరంగా ఆంగ్లంలో ప్రసంగించగా వినడం సాధ్యపడింది. లేకపోతే వారిని కలిసి ఉండేవాడిని కాదు. ఆ మధ్య వారి ఆరోగ్యం తీసిపోయి, తర్వాత కుదుటపడ్డారు. అలాంటి మునుగంటివారు ఈ జనవరి 12 న సాయంత్రం అకస్మాత్తుగా మరణించారు. నిజానికి అదే రోజున ఓ సినీ నిర్మాత - దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ గారు కనుమూయటంతో టీవీ చానళ్ళు ఆయన సినిమా పాటలు వాడుకోవడంలో తనమునకలుగా ఉన్నాయి. మరుసటిరోజు మదరాసులో ఈనాడు పత్రికలో చదివేదాకా నాకు తెలియదు. రెండు నెలల క్రితం కలిశాను, హాయిగా మాట్లాడారు - అంతలోనే పోయారని బాధ కల్గింది. శ్రీరామమూర్తిగారు 1925 మార్చి 25న కాకినాడలో జన్మించారు. తల్లిదండ్రులు సుభద్రమ్మ, మునుగంటి వెంకటరావు. తండ్రి గాయకులు. తాత శ్రీరాములుగారు త్యాగరాజస్వామి శిష్యపరంపరలు ఐదవతరానికి చెందినవారు. వీరి తాతగారు 115 సం॥లో క్రితం (లేదా ఇంకా ముందు) కాకినాడలో శ్రీరామ సమాజం ప్రారంభించారు. అలాగే ఉచిత సంగీత కళాశాలను శ్రీరామమూర్తి తాతగారు మొదలుపెట్టారు. అంతేకాకుండా వీరు గణపతి సంగీత ఉత్సవం పేరున 10 రోజులపాటు ఐదు హరికథలుండటం. శ్రీరామమూర్తిగారు ఈ నేపథ్యం నుంచి వచ్చారు.<noinclude><references/> | తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015</noinclude> hpedxhgjc5fi9z1z9l93xi0lvqrbnel అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/'గానకళ' మునుగంటి శ్రీరామమూర్తి 0 217540 568049 2026-08-03T06:39:45Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015]] | రచయిత = | అనువాదం= | విభాగము = 'గానకళ' మునుగంటి శ్రీరామమూర్తి | ముందరి = [[..//]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Ammanudi March 2015 - Samala Ramesh...' 568049 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015]] | రచయిత = | అనువాదం= | విభాగము = 'గానకళ' మునుగంటి శ్రీరామమూర్తి | ముందరి = [[..//]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf" from=39 to=40 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] 0rf83qucj0x5ulgvrfv6p7c1rrohlvx 568055 568049 2026-08-03T06:58:44Z Rajasekhar1961 50 568055 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015]] | రచయిత = నాగసూరి వేణుగోపాల్ | అనువాదం= | విభాగము = 'గానకళ' మునుగంటి శ్రీరామమూర్తి | ముందరి = [[..//]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf" from=39 to=40 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] eh8wqr1w0c7kf2op1qe785nq56bo4ix అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/రెండు తెలుగు రాష్ట్రాలూ తమ భాషావిధానాన్ని ప్రకటించాలి! 0 217541 568051 2026-08-03T06:49:48Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015]] | రచయిత = సామల రమేష్ బాబు | అనువాదం= | విభాగము = రెండు తెలుగు రాష్ట్రాలూ తమ భాషావిధానాన్ని ప్రకటించాలి! | ముందరి = [[..//]] | తదుపరి =[[..//]] |...' 568051 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015]] | రచయిత = సామల రమేష్ బాబు | అనువాదం= | విభాగము = రెండు తెలుగు రాష్ట్రాలూ తమ భాషావిధానాన్ని ప్రకటించాలి! | ముందరి = [[..//]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf" from=9 to=10 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] 2ln9hcuzk0qu2hoy31n4axwu712rik5 568054 568051 2026-08-03T06:56:59Z Rajasekhar1961 50 added [[Category:అమ్మనుడి పత్రిక సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]] 568054 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015]] | రచయిత = సామల రమేష్ బాబు | అనువాదం= | విభాగము = రెండు తెలుగు రాష్ట్రాలూ తమ భాషావిధానాన్ని ప్రకటించాలి! | ముందరి = [[..//]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf" from=9 to=10 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక సంపాదకీయాలు]] cl90001vfetmibyql1676e42uzzey6x రచయిత:నాగసూరి వేణుగోపాల్ 102 217542 568056 2026-08-03T07:21:50Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{రచయిత |ఇంటిపేరు = నాగసూరి |అసలుపేరు = వేణుగోపాల్ |పేరు_మొదటి_అక్షరం = వ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = నాగసూరి వేణుగోపాల్ |వికీవ్యాఖ్య_లంకె = |...' 568056 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = నాగసూరి |అసలుపేరు = వేణుగోపాల్ |పేరు_మొదటి_అక్షరం = వ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = నాగసూరి వేణుగోపాల్ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి]] (2015 నుండి) ** [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/ఫలితాలు ప్రశ్నార్థకమే!]] [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] mg08djr1086mdb3k48g05ohpoh9460t 568057 568056 2026-08-03T07:22:36Z Rajasekhar1961 50 /* రచనలు */ 568057 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = నాగసూరి |అసలుపేరు = వేణుగోపాల్ |పేరు_మొదటి_అక్షరం = వ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = నాగసూరి వేణుగోపాల్ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి]] (2015 నుండి) ** [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/'గానకళ' మునుగంటి శ్రీరామమూర్తి]] [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] 5b8f3ayyx1e6hiewogrddkr3gefic4c 568058 568057 2026-08-03T07:23:47Z Rajasekhar1961 50 568058 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = నాగసూరి |అసలుపేరు = వేణుగోపాల్ |పేరు_మొదటి_అక్షరం = వ |పుట్టిన_యేడు = 1961 |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = నాగసూరి వేణుగోపాల్ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి]] (2015 నుండి) ** [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/'గానకళ' మునుగంటి శ్రీరామమూర్తి]] [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] njgcschvb76ez1d84x30rh20dd6s6cy 568061 568058 2026-08-03T07:25:28Z Rajasekhar1961 50 568061 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = నాగసూరి |అసలుపేరు = వేణుగోపాల్ |పేరు_మొదటి_అక్షరం = వ |పుట్టిన_యేడు = 1961 |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ=Nagasuri Venugopal.jpg |వికీపీడియా_లంకె = నాగసూరి వేణుగోపాల్ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి]] (2015 నుండి) ** [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/'గానకళ' మునుగంటి శ్రీరామమూర్తి]] [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] dyuipexs3msrntukx1rndak93e70luw వర్గం:1961 జననాలు 14 217543 568059 2026-08-03T07:24:11Z Rajasekhar1961 50 ఖాళీ పేజీని సృష్టించారు 568059 wikitext text/x-wiki phoiac9h4m842xq45sp7s6u21eteeq1 568060 568059 2026-08-03T07:24:25Z Rajasekhar1961 50 added [[Category:1961]] using [[Help:Gadget-HotCat|HotCat]] 568060 wikitext text/x-wiki [[వర్గం:1961]] 89ap590puedlr921m5kcctqdj0wak0w పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.4 (1918).pdf/43 104 217544 568065 2026-08-03T08:25:22Z Brjswiki 6801 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ': మూడవ ఆంధ్ర సారస్వత మహాసభ ని స్వార్థపరత్వమును మాన్పి తమ యాశయమునకు లోకు లు సహకారులుగను ఉద్దీపకులుగను పాటుపడునట్లు చే యవలయును. ఈ మహావిధానమును నొక్కొక్కయు శము జర్చింతము. ఇప...' 568065 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Brjswiki" /></noinclude>: మూడవ ఆంధ్ర సారస్వత మహాసభ ని స్వార్థపరత్వమును మాన్పి తమ యాశయమునకు లోకు లు సహకారులుగను ఉద్దీపకులుగను పాటుపడునట్లు చే యవలయును. ఈ మహావిధానమును నొక్కొక్కయు శము జర్చింతము. ఇప్పటిస్థితిలో మనకావ్యము లెట్లు వ్రాయనగును? కవితకు బ్రధానోద్దేశ మేమి? ప్రకృతిలకుణము వణించి ప్రకృతితత్వమును బ్రతిసారించుట సుఖముఃఖములనిమ .త్తిఁ ప్రతిబోధించి జన్మసమర్ధించుట. ప్రభుసమ్మితసుహృ త్సమ్మిత, కాంతా సమ్మిత భేదములచే లోకమునకు హిత బోధనే యుట. చమత్కారకల్పనలచే హృదయము రంజించుట. మహాకవీశ్వరుల కీయంశములలో బూర్వా పూర్వము లుత్తరోత్తరములకన్న బలీయములు. మధ్య మాఛమకవులు తద్వ్యతి రేకముగా దలంతురు. కాని యెం దయినను పరమార్ధవిచారము విడిచి కేవలచమత్కార కధాకల్పనయే కవితకు ముఖ్యమైన యాశయమై యుండదు. స్వభావమం గున్నది యుండవలసినది వణి౯ంచుట కవికి ముఖ్యకత ద్యము. భగవదవతార పురుషులగు వేదవ్యాసులు, వాల్మీకి యును బ్రకృతిపురున తత్వములను సంబంధమును ఆ నేకవిధములైన యితిహాస ముల మూలముగా దమ మహాకావ్యములయందు బోధిం చి లోక ముద్ధరించినారు. షేక్స్పిజరు, వర్డ్సు వర్తు టెన్నిసము లోనగు నాంగ్లేయమహాకవులు జగత్తత్త్వము ను వర్ణించి, జగద్ధితముగా నీతిబోధించినారు. ఈగీటు రాతినిరాసి యాంధ్ర కవు లేందరు వన్నెకు వత్తురో మనము విచారి౦తము అందులకు పండి నిల్చిన కవిత్రయము వారును పోతనకవియును సర్వ జన సామాన్యము గా నాహ్లాదకరులయి విలసిల్లుచున్నారు చిత్రకవిత్వ, బంధకవిత్వాములన్ననో కవులు, తులు, చూచి సంతసింప సాధనములై జనసామాన్యముగ కవిత్వమనియే పరిగణింపబడకున్నవి. ముందు ఆంధ్ర భాషలో బయలుదేరనున్న కావ్యములు కవితాప్రధా నాశయములను నెరవేర్చునవిగా నుండుగాక. కవితకు ముఖ్యాంగము రసము . అట్టి రసపోషకములై, పాత్రే చిత్యము, మృదుమధుర శైలి, అర్థవైశద్యము, భావోచిత, సుప్రసిద్ధ శబ్దప్రయోగము, విభావాద్యౌచిత్ర్యము, అర్థ పోషణము, స్వభావోక్తి గలిగి కావ్యము లుండదగును. చిత్రకవిత్వము, క్లేవ, అనుప్రాసలు-మున్న గునవి త్యజించి కేవలము కావ్యప్రాణమగు రసమే ప్రధానము గా నుద్దీపింపవలెను. ఇప్పటిస్థితిలో మనఛందోనియమములు మహాకఠినములయి యున్నవి. అవియే అప్రసిద్ధ నిరర్ధక పదప్రయోగమునకు మిక్కుటమయిన కారణములై యున్నవి. వాని నిర్వహించు ప్రయత్నములో నర్ధభంగ విశాఖపట్నము. ము వాటిల్లుచున్నది. పద దాంపత్యము భంగమైనది. భాషా సంప్రదాయము చెడినది. కావున దన్నియకుము లే ప్రధానముగాగల వృత్తములలో వ్రాయ యత్నింపక సంస్కృతాంగ్లేయభాషలలో నట్లు సులభచ్ఛందోనియ మముల బెట్టికొని వ్రాయనగును. ఆంధ్రభాషాతత్వముం బట్టి పరిశీలింపగా శార్దూలాది వృత్తములు సంస్కృత శబ్దముల విశేషముగా వాడకుండ వ్రాయ నలవి గాదు. దీన దాన కవితోద్దిష్ట పరమార్ధము ములకు జాల భంగము కలుగును. ఆంధ్రభాష స్వభాష గాగలవా రందరు దగుమాత్రమయిన కష్టముపై వర్ధము జేసికొనునటుల కవితసెప్పుట ముఖ్యాశయమైనచో నట్టి నియమములు సంకెళ్ళవలె జుట్టుకొనును. అట్టి సంకెళ్ళ ద్రెంపగల మహనీయులు తెంచుదురు గాక. ప్రాయికముగా నెంత పరిశ్రమమయినను అర్థగౌరవమందు వినియోగపరచితి మేని రసావా ప్తియగునుగాని వృత్తినియమములతో బని యేమి. వృత్తములు సంస్కృతభాష కత్యంతో పయుక్త ములే. వానిం దెనుంగులోనికి దెచ్చికొని సంస్కృత మందులేని యతి ప్రాసాది నియమములం బెట్టుకొని, చాలక అనుప్రాసలం బెట్టి నెత్తి కోతలవాడు అమానుష క్రియల జేయ నుద్యమించినట్లు మనకవులు కవితం జెప్ప దొడంగి భాషకు వాఙ్మయమునకుంగూడ శాశ్వతానర్ధ హేతువులయి నారు. శైలివిషయమున మన కావ్యములు సంస్కృతమాతృ కలగు పూర్వకావ్యముల క్రిందను, తెలిసియు దెలియ కయు నాంగ్లేయమాతృకలగు నాధునిక కావ్యముల క్రిందను విభజింపవచ్చును. రెండిటియందును వ్యావ హారికాంధ్రము దయమాలి విడనాడబడి యున్నది. ఏదే మొదటికవులు దుర్విదగ్గులును, దంభత్వ విదూషితులును గాక, సర్వజనసామాన్యముగ సుబోధక మగు భావములు, భాషయు, శైలియు నవలంబించి వ్రాయువారు. క్రమక్రమముగ భాష సంస్కరింపబడి యధ౯ ము గంభీరమై, శైలి కఠినమై పరిణమించును. ఎప్పుడయినను రసవంతులుగు కవులు జనోపయోగము కొఱకే వ్రాయుచుందురు. కాళిదాసాది మహాకవులు మొదటివారయినను సరి, మధ్యకాలమువా రయినను సరి యర్థ వైశద్యము, మృదుమధుర సులభశైలి, భౌవోచిత శబ్దప్రయోగము, స్వభావోక్తి-కొరకే పాటుపడుదురు. ఆంగ్లేయకవులలో మహాకవులయిన చ్యాసెర్ (ఆదికవి) స్పెన్సెరు, మిల్టను, టెన్నిసను, లోనగు కొందరు పండిత పామర సామాన్యముగా ననుభవింపబడుచున్న మనలో నన్నయభట్ట తిక్కనాదుల శైలిని బట్టి చూడగా వా రాదికవులు కారేమోయని సీ సిద్ధాంతము వారు.<noinclude><references/></noinclude> 5oljgunp62f357zsvrkk5o5fej248iq 568068 568065 2026-08-03T09:30:46Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 568068 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>ని స్వార్థపరత్వమును మాన్పి తమ యాశయమునకు లోకులు సహకారులుగను ఉద్దీపకులుగను పాటుపడునట్లు చేయవలయును. ఈ మహావిధానమును నొక్కొక్కయంశము జర్చింతము. ఇప్పటిస్థితిలో మనకావ్యము లెట్లు వ్రాయనగును? కవితకు బ్రధానోద్దేశమేమి? ప్రకృతిలకుణము వణ౯ంచి ప్రకృతి తత్వమును బ్రతిసాదించుట సుఖదుఖముల నిష్పత్తిఁ ప్రతిబోధించి జన్మసమర్ధించుట. ప్రభుసమ్మితసుహృత్సమ్మిత, కాంతాసమ్మిత భేదములచే లోకమునకు హితబోధసేయుట. చమత్కారకల్పనలచే హృదయము రంజించుట. మహాకవీశ్వరుల కీయంశములలో బూర్వాపూర్వము లుత్తరోత్తరములకన్న బలీయములు. మధ్యమాఛమకవులు తద్వ్యతిరేకముగా దలంతురు. కాని యెందయినను పరమార్ధవిచారము విడిచి కేవలచమత్కార కధాకల్పనయే కవితకు ముఖ్యమైన యాశయమై యుండదు. స్వభావమం దున్నది యుండవలసినది వణి౯ంచుట కవికి ముఖ్యకత౯వ్యము. భగవదవతార పురుషులగు వేదవ్యాసులు, వాల్మీకియును బ్రకృతిపురుష తత్వములను సంబంధమును ఆనేకవిధములైన యితిహాసముల మూలముగా దమ మహాకావ్యములయందు బోధించి లోక ముద్ధరించినారు. షేక్స్పిజరు, వర్డ్సువర్తు టెన్నిసము లోనగు నాంగ్లేయమహాకవులు జగత్తత్త్వమును వర్ణించి, జగద్ధితముగా నీతిబోధించినారు. ఈగీటు రాతినిరాసి యాంధ్రకవులేందరు వన్నెకువత్తురో మనము విచారి౦తము గాక. అందులకు నిల్చిన కవిత్రయము వారును పోతనకవియును సర్వజన సామాన్యముగా నాహ్లాదకరులయి విలసిల్లుచున్నారు. చిత్రకవిత్వ, బంధ కవిత్వాదులన్ననో కవులు, పండితులు, చూచి సంతసింప సాధనములై జనసామాన్యముగ కవిత్వమనియే పరిగణింపబడకున్నవి. ముందు ఆంధ్రభాషలో బయలుదేరనున్న కావ్యములు కవితాప్రధానాశయములను నెరవేర్చునవిగా నుండుగాక. కవితకు ముఖ్యాంగము రసము . అట్టి రసపోషకములై, పాత్రే చిత్యము, మృదుమధుర శైలి, అర్థవైశద్యము, భావోచిత, సుప్రసిద్ధ శబ్దప్రయోగము, విభావాద్యౌచిత్ర్యము, అర్థ పోషణము, స్వభావోక్తి గలిగి కావ్యము లుండదగును. చిత్రకవిత్వము, క్లేవ, అనుప్రాసలు-మున్న గునవి త్యజించి కేవలము కావ్యప్రాణమగు రసమే ప్రధానము గా నుద్దీపింపవలెను. ఇప్పటిస్థితిలో మనఛందోనియమములు మహాకఠినములయి యున్నవి. అవియే అప్రసిద్ధ నిరర్ధక పదప్రయోగమునకు మిక్కుటమయిన కారణములై యున్నవి. వాని నిర్వహించు ప్రయత్నములో నర్ధభంగ విశాఖపట్నము. ము వాటిల్లుచున్నది. పద దాంపత్యము భంగమైనది. భాషా సంప్రదాయము చెడినది. కావున దన్నియకుము లే ప్రధానముగాగల వృత్తములలో వ్రాయ యత్నింపక సంస్కృతాంగ్లేయభాషలలో నట్లు సులభచ్ఛందోనియ మముల బెట్టికొని వ్రాయనగును. ఆంధ్రభాషాతత్వముం బట్టి పరిశీలింపగా శార్దూలాది వృత్తములు సంస్కృత శబ్దముల విశేషముగా వాడకుండ వ్రాయ నలవి గాదు. దీన దాన కవితోద్దిష్ట పరమార్ధము ములకు జాల భంగము కలుగును. ఆంధ్రభాష స్వభాష గాగలవా రందరు దగుమాత్రమయిన కష్టముపై వర్ధము జేసికొనునటుల కవితసెప్పుట ముఖ్యాశయమైనచో నట్టి నియమములు సంకెళ్ళవలె జుట్టుకొనును. అట్టి సంకెళ్ళ ద్రెంపగల మహనీయులు తెంచుదురు గాక. ప్రాయికముగా నెంత పరిశ్రమమయినను అర్థగౌరవమందు వినియోగపరచితి మేని రసావా ప్తియగునుగాని వృత్తినియమములతో బని యేమి. వృత్తములు సంస్కృతభాష కత్యంతో పయుక్త ములే. వానిం దెనుంగులోనికి దెచ్చికొని సంస్కృత మందులేని యతి ప్రాసాది నియమములం బెట్టుకొని, చాలక అనుప్రాసలం బెట్టి నెత్తి కోతలవాడు అమానుష క్రియల జేయ నుద్యమించినట్లు మనకవులు కవితం జెప్ప దొడంగి భాషకు వాఙ్మయమునకుంగూడ శాశ్వతానర్ధ హేతువులయి నారు. శైలివిషయమున మన కావ్యములు సంస్కృతమాతృ కలగు పూర్వకావ్యముల క్రిందను, తెలిసియు దెలియ కయు నాంగ్లేయమాతృకలగు నాధునిక కావ్యముల క్రిందను విభజింపవచ్చును. రెండిటియందును వ్యావ హారికాంధ్రము దయమాలి విడనాడబడి యున్నది. ఏదే మొదటికవులు దుర్విదగ్గులును, దంభత్వ విదూషితులును గాక, సర్వజనసామాన్యముగ సుబోధక మగు భావములు, భాషయు, శైలియు నవలంబించి వ్రాయువారు. క్రమక్రమముగ భాష సంస్కరింపబడి యధ౯ ము గంభీరమై, శైలి కఠినమై పరిణమించును. ఎప్పుడయినను రసవంతులుగు కవులు జనోపయోగము కొఱకే వ్రాయుచుందురు. కాళిదాసాది మహాకవులు మొదటివారయినను సరి, మధ్యకాలమువా రయినను సరి యర్థ వైశద్యము, మృదుమధుర సులభశైలి, భౌవోచిత శబ్దప్రయోగము, స్వభావోక్తి-కొరకే పాటుపడుదురు. ఆంగ్లేయకవులలో మహాకవులయిన చ్యాసెర్ (ఆదికవి) స్పెన్సెరు, మిల్టను, టెన్నిసను, లోనగు కొందరు పండిత పామర సామాన్యముగా ననుభవింపబడుచున్న మనలో నన్నయభట్ట తిక్కనాదుల శైలిని బట్టి చూడగా వా రాదికవులు కారేమోయని సీ సిద్ధాంతము వారు.<noinclude><references/></noinclude> i10mbh64pjxuu8z9mgcjv0a8x05i7cy 568082 568068 2026-08-03T11:20:07Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 568082 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ని స్వార్థపరత్వమును మాన్పి తమ యాశయమునకు లోకులు సహకారులుగను ఉద్దీపకులుగను పాటుపడునట్లు చేయవలయును. ఈ మహావిధానమును నొక్కొక్కయంశము జర్చింతము. ఇప్పటిస్థితిలో మనకావ్యము లెట్లు వ్రాయనగును? కవితకు బ్రధానోద్దేశమేమి? ప్రకృతిలకుణము వణ౯ంచి ప్రకృతి తత్వమును బ్రతిసాదించుట సుఖదుఖముల నిష్పత్తిఁ ప్రతిబోధించి జన్మసమర్ధించుట. ప్రభుసమ్మితసుహృత్సమ్మిత, కాంతాసమ్మిత భేదములచే లోకమునకు హితబోధసేయుట. చమత్కారకల్పనలచే హృదయము రంజించుట. మహాకవీశ్వరుల కీయంశములలో బూర్వాపూర్వము లుత్తరోత్తరములకన్న బలీయములు. మధ్యమాఛమకవులు తద్వ్యతిరేకముగా దలంతురు. కాని యెందయినను పరమార్ధవిచారము విడిచి కేవలచమత్కార కధాకల్పనయే కవితకు ముఖ్యమైన యాశయమై యుండదు. స్వభావమం దున్నది యుండవలసినది వణి౯ంచుట కవికి ముఖ్యకత౯వ్యము. భగవదవతార పురుషులగు వేదవ్యాసులు, వాల్మీకియును బ్రకృతిపురుష తత్వములను సంబంధమును ఆనేకవిధములైన యితిహాసముల మూలముగా దమ మహాకావ్యములయందు బోధించి లోక ముద్ధరించినారు. షేక్స్పిజరు, వర్డ్సువర్తు టెన్నిసము లోనగు నాంగ్లేయమహాకవులు జగత్తత్త్వమును వర్ణించి, జగద్ధితముగా నీతిబోధించినారు. ఈగీటు రాతినిరాసి యాంధ్రకవులేందరు వన్నెకువత్తురో మనము విచారి౦తము గాక. అందులకు నిల్చిన కవిత్రయము వారును పోతనకవియును సర్వజన సామాన్యముగా నాహ్లాదకరులయి విలసిల్లుచున్నారు. చిత్రకవిత్వ, బంధ కవిత్వాదులన్ననో కవులు, పండితులు, చూచి సంతసింప సాధనములై జనసామాన్యముగ కవిత్వమనియే పరిగణింపబడకున్నవి. ముందు ఆంధ్రభాషలో బయలుదేరనున్న కావ్యములు కవితాప్రధానాశయములను నెరవేర్చునవిగా నుండుగాక. కవితకు ముఖ్యాంగము రసము . అట్టి రసపోషకములై, పాత్ర చిత్యము, మృదుమధుర శైలి, అర్థవైశద్యము, భావోచిత, సుప్రసిద్ధ శబ్దప్రయోగము, విభావాద్యౌచిత్య్రము, అర్థ పోషణము, స్వభావోక్తి గలిగి కావ్యము లుండదగును. చిత్రకవిత్వము, శ్లేష, అనుప్రాసలు-మున్నగునవి త్యజించి కేవలము కావ్యప్రాణమగు రసమే ప్రథానముగా నుద్దీపింపవలెను. ఇప్పటిస్థితిలో మన ఛందోనియమములు మహాకఠినములయి యున్నవి. అవియే అప్రసిద్ధ నిరర్ధక పదప్రయోగమునకు మిక్కుటమయిన కారణములై యున్నవి. వాని నిర్వహించు ప్రయత్నములో నర్ధభంగము వాటిల్లుచున్నది. పదదాంపత్యము భంగమైనది. భాషా సంప్రదాయము చెడినది. కావున దన్నియమములే ప్రథానముగాగల వృత్తములలో వ్రాయ యత్నింపక సంస్కృతాంగ్లేయ భాషలలో నట్లు సులభచ్ఛందోనియమముల బెట్టికొని వ్రాయనగును. ఆంధ్రభాషాతత్వముం బట్టి పరిశీలింపగా శార్దూలాది వృత్తములు సంస్కృత శబ్దముల విశేషముగా వాడకుండ వ్రాయ నలవిగాదు. దీన దాన కవితోద్దిష్టపరమార్ధములకు జాల భంగము కలుగును. ఆంధ్రభాష స్వభాషగాగల వారందరు దగుమాత్రమయిన కష్టముపై నర్ధము జేసికొనునటుల కవితసెప్పుట ముఖ్యాశయమైనచో నట్టి నియమములు సంకెళ్ళవలె జుట్టుకొనును. అట్టి సంకెళ్ళ ద్రెంపగల మహనీయులు త్రెంచుదురుగాక. ప్రాయికముగా నెంత పరిశ్రమమయినను అర్థగౌరవమందు వినియోగపరచితిమేని రసావాప్తియగునుగాని వృత్తినియమములతో బనియేమి. వృత్తములు సంస్కృతభాష కత్యంతోపయుక్తములే. వానిం దెనుంగులోనికి దెచ్చికొని సంస్కృతమందులేని యతి ప్రాసాది నియమములం బెట్టుకొని, చాలక అనుప్రాసలం బెట్టి నెత్తి కోతలవాడు అమానుషక్రియల జేయ నుద్యమించినట్లు మనకవులు కవితం జెప్పదొడంగి భాషకు వాఙ్మయమునకుంగూడ శాశ్వతానర్ధహేతువులయినారు. శైలివిషయమున మన కావ్యములు సంస్కృతమాతృకలగు పూర్వకావ్యముల క్రిందను, తెలిసియు దెలియకయు నాగ్లేయమాతృ కలగు నాధునిక కావ్యముల క్రిందను విభజింపవచ్చును. రెండిటియందును వ్యావహారికాంధ్రము దయమాలి విడనాడబడి యున్నది. ఏదేశమందును మొదటికవులు దుర్విదగ్గులును, దంభత్వ విదూషితులునుగాక, సర్వజనసామాన్యముగ సుబోధకమగు భావములు, భాషయు, శైలియు నవలంబించి వ్రాయువారు. క్రమక్రమముగ భాష సంస్కరింపబడి యధ౯ము గంభీరమై, శైలి కఠినమై పరిణమించును. ఎప్పుడయినను రసవంతులుగు కవులు జనోపయోగము కొఱకే వ్రాయుచుందురు. కాళిదాసాది మహాకవులు మొదటివారయినను సరి, మధ్యకాలమువారయినను సరియర్థ వైశద్యము, మృదుమధుర సులభశైలి, భౌవోచిత శబ్దప్రయోగము, స్వభావోక్తి-కొరకే పాటుపడుదురు. ఆంగ్లేయకవులలో మహాకవులయిన చ్యాసెర్ (ఆదికవి) స్పెన్సెరు, మిల్టను, టెన్నిసను, లోనగు కొందరు పండిత పామర సామాన్యముగా ననుభవింపబడుచున్న వారు. మనలో నన్నయభట్ట తిక్కనాదుల శైలిని బట్టి చూడగా వారాదికవులు కారేమోయని సిద్ధాంతము<noinclude><references/></noinclude> c27p6pzwotp2qw1bx3ds9h3sapmvwnv పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/91 104 217545 568066 2026-08-03T09:20:18Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568066 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|81}}</noinclude>1921 సంవత్సరములో వార్తాపత్రికలలో ప్రచురించితిని. అప్పటినుండియు స్వరాజ్యవాదులు శాసననిర్మాణసభల నెట్లు బహిష్కరించక వానిలోకిపోయి వానిని భగ్నముచేయుట కెట్లు ప్రయత్నించిరో ఆవిధముగనే కోర్టులద్వారానే స్కీముల నేర్పాటుచేసి మనదేవాదాయధర్మాదాయములను మతవిద్య, జాతీయవిద్యల కుపయోగపడునట్లు చేయవలెననియు, కోర్టులకు వచ్చు పార్టీలను పంచాయతీసభలకు పంపుచుండవలెననియు నేను సంకల్పించితిని. అనేకమంది మేధావంతులున్న బందరు పట్టణములో కోర్టులలో నిలవయున్న వ్యాజ్యములను మధ్యవర్తులగుండా గ్రామస్థులు పరిష్కారము చేసికొందు రేమో యని ఒకపంచాయితీ కోర్టుబల్లను మా యింటిగోడకు రెండు సంవత్సరములు తగిలించి నేను నాదేవాదాయధర్మాదాయపని నిమిత్తము కోర్టునకు వెళ్లునప్పుడెల్లను పార్టీలను రమ్మనుమని బోధచేయుచుంటిని. ఒక్క కేజులో మాత్రము యీ రెండుసంవత్సరములలో నాకును, మరియిద్దరు హైకోర్టు వకీళ్ళకును ఉభయపార్టీలు పంచాయితీఖరారునామా వ్రాసియిచ్చిరి. మేము విచారించి, తీర్పుయిచ్చి ఉభయపార్టీలకు చదివి వినిపించిన తరువాత వారిలో కొంచముగా ఓడిపోయిన ఒక పార్టీ మమ్మును తీర్పు చెప్పక నిలుపుదల చేయవలెననియు, ఆర్బిట్రేషన్ వదులుకొంటిననియు మా ముగ్గురుమధ్య వర్తులపేరను రిజిస్టర్డు నోటీసుపంపించెను. తుదకు కోర్టులో మా తీర్పునుగురించి<noinclude><references/></noinclude> od4qrj95by18erg52pid0y9q1ix3md6 పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/92 104 217546 568067 2026-08-03T09:26:18Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568067 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|82|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>వ్యాజ్యముజరిగి మా సాక్ష్యముమీద డిక్రియయినది. ఈ పంచాయితీదార్లు పక్షపాతమువహించిరని, కోర్టులో వ్యాజ్యములు వేయుటయు, వారు తమ నడతనుగురించి కోర్టులో సాక్ష్యమిచ్చుటయు సంభవించుచుండుట తప్ప, యెట్టిలాభము కలుగలేదని యెంచి మా యింటికి కట్టుకొన్నబల్లను బ్రద్దలుగొట్టి తీసిపారవేసితిని. అహంకారపూరితులై, స్వార్ధపరులై, బక్క వాళ్ళను హైకోర్టువరకు యీ జూదములో లాగి అన్యాయముగ విత్తమార్జనచేయుటకు గ్రామపెద్దలే సిద్ధముగా నున్నపుడు వీరు పంచాయితీల తీర్మానములకు ఒప్పుకొందురను మాట ఒట్టి కల్లయని ధ్రువపడినది. కాబట్టి కోర్టులకుపోయి దేవాలయములు, సత్రములు మొదలగు పబ్లికుసంస్థాపన లయినను మంచిపునాదుల మీదనుంచుటకు ప్రయత్నించి, నేను బందరులో 1924 వ సంవత్సరము ఆఖరువరకు, దావాలువేసి రిశీవర్లనుగాని ట్రస్టీలనుగాని నియమింపజేసినవి కొన్నిటిని ఈ క్రింద పొందుపరచుచున్నాను.<noinclude><references/></noinclude> ps1r184sy0t5xjwvisihwov3b7xmyhs పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/97 104 217547 568069 2026-08-03T09:36:37Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568069 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|87}}</noinclude>కృష్ణాజిల్లాలోని దేవాలయములకేగాక, గుంటూరు, నెల్లూరు, గోదావరి జిల్లాలవారికి సలహా లనుదినమును యిచ్చుచు, వీరినిగురించి వ్యాసములు వార్తాపత్రికలకు వ్రాయుచు, కలెక్టర్లకు పెర్మిషన్ పిటీషనులు, ప్లయింటు కాపీలు ఆన్సర్లు వ్రాసిపెట్టుచుంటిని. నేను మచిలీపట్టణము కోర్టుల జూరిసుడిక్షనులోని కేజులను స్వయముగా నడుపుచు యితరకోర్టులలో యిట్టి కేజులలో ఉచితముగా నావలెనే పనిచేసిపెట్టమని ప్లీడర్లను ప్రార్థించినాను. గుంటూరులో గోవిందరాజుల శ్రీనివాసరావుగారిని, బాపట్లలో కొండా కోటయ్యగారిని, బెజవాడలో పెద్దిభొట్ల వీరయ్యగారిని, యేలూరులో వల్లూరి కోదండరామయ్యగారిని, నరసాపురములో వల్లూరి వెంకటరావుగారిని, రాజమహేంద్రవరములో వీరఘంట లక్ష్మీనృశింహ్వంగారిని, కాకినాడలో లక్కరాజు సుబ్బారావుగారిని నే నేర్పరుచుకొంటిని. కేజులలో, కోర్టువా రిచ్చు ఫీజులను వారే తీసికొనవచ్చుననియు, విచారణరోజులలో నేను రావలసియుంటె, వచ్చెదననియు వారికి వ్రాయుచుంటిని. గొప్ప దేవాలయములకుతప్ప తక్కినవాని కన్నిటికిని కలెక్టర్ల సాంక్షనులు తీసికొనుచుంటిని. నా పెద్దకొమారుడు కృష్ణమోహన్ యమ్. యె., బి. యల్. గారును, ఆయన మామగారు వేమవరపు రామదాసుగారును, చెన్నపట్టణములో ప్రాక్టీసు చేయుచుండుటచే, వారిసహాయము నాకు తరుచుగా అప్పీళ్లలో కావలసివచ్చుచుండెను. రామదాసుగారు మాటి<noinclude><references/></noinclude> 2yyk7gxsocdhh0nj745atbma40vomsj పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/98 104 217548 568070 2026-08-03T09:44:17Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568070 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|88|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>మాటికి గ్రామాంతరములకు కేజులమీదనే పోవుచుండుట చేత పార్టీలకు యిబ్బంది తటస్థపడుచుండుటవలన పి.ఆర్. గణపతయ్యరుగారిని మా పిల్లవానితో జత చేయవలసివచ్చెను. 1925 వ సంవత్సరములో దేవాలయపుబిల్లు ప్యాసైనది. అధిక జీతములు తీసికొను కమీషనర్లకు పై సూపర్విజన్ తప్ప యెట్టి యధికారమును చట్టమునుబట్టి లేకపోవుటచే, వారు దేవాలయపరిపాలనలో అసమర్థు లగుచున్నారు. ఇది సాకు చూచుకొని అర్చకులు, దేవాలయపుభూములు తమవే యనియు, లేక అవి తమ సర్వీసుమాన్యములనియు, వాదనచేసి భూములను స్వాధీనపడనీయకుండ నున్నారు. బోర్డువారు స్కీములను కాకితములమీద వ్రాసి, తమ రేర్పరచిన ట్రస్టీల కిచ్చి వారిని కోర్టులలో పెట్టుబడిపెట్టి అర్చకుల నుండి భూములను స్వాధీనపరుచుకొండని చెప్పుచున్నారు. వారి సాంక్షను యిస్తేనేగాని, నేను స్కీముదావాలు యీ యాక్టుక్రింద వేయకూడదు. తమకు అందువలన పరువునష్టమని తమరే స్కీములను ఫ్యాసు చేసి, ట్రస్టీలను కోర్టులో స్వాధీనమునిమిత్తము పిటీషన్ పెట్టమని చెప్పెదరు. అట్లు పిటీషను పెట్టగా, అర్చకులు భూములు తమవేయని నిర్థారణ చేయుటకు డిక్లరేటరీదావాలు యింజక్షనులు చేయుచుందురు. ఇప్పు డివి వందలకొలది రాజమండ్రి, యేలూరు, గుంటూరు జిల్లాకోర్టులలో పెండింగులో నున్నవి. వీరికిని, వీరి తాబేదార్లకును, యెస్టాబ్లిషుమెంటుకును, ప్రయాణపు ఖర్చులకును,<noinclude><references/></noinclude> ozkr5ppkqobpyqa9mxwe9g5kffr9xw8 పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/27 104 217549 568071 2026-08-03T09:46:28Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వారసత్వం డి.పి. అనూరాధ తొలి శతాబ్దాల్లో తెలుగువాడు ప్రపంచంలో అత్యంత సుందరమైన పురుష విగ్రహం అంటే ఇటలీలోని డేవిడ్న పేర్కొంటారు. మైఖేలాంజెలో చెక్కిన ఈ డేవిడ్ విగ్రహం ఫ్లో...' 568071 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />డి.పి. అనూరాధ</noinclude>వారసత్వం డి.పి. అనూరాధ తొలి శతాబ్దాల్లో తెలుగువాడు ప్రపంచంలో అత్యంత సుందరమైన పురుష విగ్రహం అంటే ఇటలీలోని డేవిడ్న పేర్కొంటారు. మైఖేలాంజెలో చెక్కిన ఈ డేవిడ్ విగ్రహం ఫ్లోరెన్స్లో ఉంది. అందమైన స్త్రీ అనగానే మొనాలిసా గుర్తుకువస్తుంది. లియోనార్డో డావిన్సీ చిత్రించిన ఈ పెయింటింగ్ ఇప్పటికీ కూడా ఎందరినో ఆకట్టుకుంటూనే ఉంటుంది. కానీ డేవిడ్ను మించిన శిల్పాలను మన తెలుగు వాళ్లు సృష్టించారు.. మొనాలిసా లాంటి చిత్తరువులు ఎన్నో అజంతా చీకటి గుహల్లో మగ్గిపోతున్నాయి.. ఇవన్నీ క్రీస్తు శకం తొలినాళ్లకు చెందినవి.. ఈనాటిలా ఆనాడు ఇంటర్నెట్ లేదు. పోనీ మైఖేలాంజెలో.. లియోనార్డో కాలాల్లోని గ్రంథాలు.. శాస్త్రాలు లేని సమయం అది.. మరి వాళ్లకు ప్రేరణ ఎక్కడిది? ఆనాటి సమాజమే వారి కళలకు.. ఊహలకు ఊపిరిపోసి ఉండాలి.. తమ చుట్టూ ఉన్న పౌరులే వారి కళ్లల్లో రూపుదిద్దుకుని ఉండాలి. మన పూర్వీకులు రాళ్లను శిల్పాలుగా మార్చారు. రాతి గోడల మీద చిత్రాలను వేశారు. ఇవి కేవలం శిల్పాలు కాదు, కేవలం చిత్రాలు కాదు.. కరకు రాతి గోడల మీద కవిత్వాలు.. కథలు అంతేకాదు ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాల ఆవిష్కరణే జరిగింది. మనసుపెట్టి చూడాలే కానీ ఆనాటి సమాజానికి సంబంధించి ఎన్నో కథలు చూపిస్తాయి. ఈ చిత్రాలు.. శిల్పాలు.. ఈ గ్రంథాల ద్వారా ఆనాటి మన తాతముత్తాతలని.. జేజమ్మలని పోల్చుకుందాం.. స్త్రీపురుషుల తారతమ్యం లేదు : శాతవాహనుల కాలంలో పర్వతాలను తొలిచి పెద్ద పెద్ద రాతి గుహలను బౌద్ధభిక్షువులు నిర్మించారు.. అటువంటి రాతి గుహల్లో ముఖ్యమైనవి మహారాష్ట్రలోని కార్లె గుహాలయాలు.. ఇక్కడి ప్రధాన చైత్యం భారతదేశంలోనే అతి పెద్దది. ఈ చైత్యం వెలుపల ఉన్నటువంటి స్త్రీపురుషుల నిలువెత్తు జంట శిల్పాలు కళ్లను కట్టిపడేస్తాయి. ఆనాటి స్త్రీపురుషులు చక్కటి శారీరక దారుఢ్యంతో ఉన్నట్టుగా అన్పిస్తుంది. ఆనాడు సమాజంలో స్త్రీపురుషుల మధ్య తారతమ్యాలు లేనట్టున్నాయి. పురుషులు భుజం మీద చేయివేస్తే.. స్త్రీ కూడా భుజం మీదే చేయివేసింది.. పురుషుడు నడుమ్మీద చేయివేస్తే.. స్త్రీ కూడా నడుమ్మీదే చేయివేసినట్టుగా ఈ శిల్పాలు కనువిందుచేస్తాయి.. ఇద్దరూ అన్నిట్లో సమఉజ్జీలుగా అన్పిస్తారు. పురుషుడి ముందు స్త్రీ అణిగిమణిగి ఉండాలనే భావం ఆనాటి సమాజంలో ఏర్పడినట్టులేదు.. ఇంకా ఇక అలంకరణ విషయానికొస్తే స్త్రీలు ఆనాడు పెద్ద పెద్ద పాపిటి బిళ్లలు.. చెవులకు జూకాలు.. కొన్ని చోట్ల రింగులు.. మెడలో హారం.. చేతికి గాజులు.. కాళ్లకు కడియాలు పెట్టుకునేవారని తెలుస్తోంది. పురుషులకు తలపాగా ఉంది, పంచెకట్టుకున్నారు. ముంజేతికి కంకణాలు ఉన్నాయి.. కొన్ని జంట శిల్పాలు ఉల్లాసంగా ఉంటే.. కొన్ని బుద్ధుడి ప్రార్ధనలో ఉన్నట్టు కన్పిస్తున్నాయి. 2వేల ఏళ్ల కంటే ఎక్కువ వయసు గల ఈ శిల్పాల్లో కొన్ని ఖండితమయ్యాయి. కార్లెలో ఏనుగుల శిల్పాలు కూడా ఆఫ్రికన్ ఏనుగుల్లా చాలా పెద్దగా అన్పిస్తున్నాయి. అమరావతి అద్భుతాలు : కార్లె తరవాత అమరావతి శిల్పాలు రూపుదిద్దుకున్నాయి. అయితే అమరావతిలో రాతిఫలకాలపై శిల్పాలను తొలిచారు.. కార్లెలో రాతి కొండలనే శిల్పాలుగా మలచారు. అమరావతి శిల్పంలో కూడా పురుషుల 27<noinclude><references/> తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015</noinclude> g5k3sy3joe1ypu70wqm50tsmqaoe90u పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/28 104 217550 568072 2026-08-03T09:51:22Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వేషధారణ కార్లె శిల్పాలతో సరితూగుతోంది. స్త్రీమూర్తుల విషయానికి వస్తే.. నాజూకుతనాన్ని పుచ్చు కున్నాయి. ప్రతి ఒక్కరి తలకట్టూ భిన్నంగా ఉంది. కొందరు కొప్పు కట్టుకొన్నారు. కొ...' 568072 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>వేషధారణ కార్లె శిల్పాలతో సరితూగుతోంది. స్త్రీమూర్తుల విషయానికి వస్తే.. నాజూకుతనాన్ని పుచ్చు కున్నాయి. ప్రతి ఒక్కరి తలకట్టూ భిన్నంగా ఉంది. కొందరు కొప్పు కట్టుకొన్నారు. కొందరు అలాగే విడిచిపెట్టారు. మరికొందరు మొఖంపైకి కొప్పువచ్చేలా అలంకరించుకొన్నారు.. కాళ్లు కడియాల సంఖ్య కార్లెతో పోలిస్తే పెరిగిపోయింది. అనాడు కూర్చోవడానికి రకరకాలు ఉన్నట్టుగా ఈ శిల్పాలను చూస్తే తెలుస్తోంది. అలాగే వీరు తమతోపాటు తమ జంతువులను కూడా అలంకరించారు. గుర్రాలను.. ఏనుగులను.. చక్కటి పూసల దండలతో అలంకరించే వారని అమరావతి రాతి ఫలకాలను విశ్లేషిస్తే అర్ధం అవుతోంది. మన పూర్వీకుల ఇళ్లు ఎలా ఉండేవి? ఆనాటి సమాజం ఎలా ఉండేది? ఈ వివరాలను అమరావతి స్థూపంలో దొరికిన ఈ శిల్పఫలకం అందిస్తోంది. ఈ శిల్పఫలకం కోల్ కత్తా లోని ఇండియన్ మ్యూజియంలో భద్రపరచారు. ఇందులో ఓ భార్యాభర్తా తమకు పుట్టిన కవల పిల్లల్ని గుర్రాల మీద వెళుతుంటే మరికొంత మంది ఏనుగుల మీద ఎక్కి ఎక్కడికో వెళుతున్నారు. ఇవన్నీ జాతక కథల ఆధారంగా రూపొందించిన శిల్పాలే. అజంతాచిత్రాలు ఇక అజంతా చిత్రాలలో మన వాళ్ల గురించి తెలుసుకుందాం. అజంతాలోని 9,10 గుహలు తొలినాటివి.. వీటిని శాతవాహనుల కాలంలో తొలిచారు. చిత్రాలను వేశారు, శిల్పాలు చెక్కారు.. ఈ గుహల పూర్ణకుంభాలు కూడా ఇక్కడ కన్పిస్తాయి.. గుహలోపల పెయింటింగ్లు కాలం పెట్టిన పరీక్షలో క్రమంగా ఓడిపోతున్నాయి.. ఇవి గుర్తించడానికి వీలు లేకుండా ఛిద్రమవుతున్నాయి. కానీ ఈ పెయింటింగ్ రెప్లికాలు పొత్తిళ్లలో పొదిగి పట్టుకుని ఉన్నారు. తమ పాపాయిలని వస్త్రాలలో బయట ఉన్న శిల్పాలతో అమరావతి శిల్పాన్ని పోల్చుకోవచ్చు. చుట్టగా, మిగిలిన వస్త్రం చేతుల మధ్యలోంచి కిందకు జారుతోంది. మరో చోట ఓ భార్య తన భర్త భోజనం చేస్తుంటే, ఎదురుగా కూర్చుని విసనకర్ర విసురుతోంది. ఇందులో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆనాటి ఇళ్లు కూడా ఈ శిల్పంలో కన్పిస్తున్నాయి. రెండూ గుడిసెల్లాగానే ఉన్నాయి. గడ్డితో కప్పువేశారు. ఒక కప్పేమో త్రిభుజాకారంలో ఉంటే, మరొకటి అర్ధచంద్రాకారంలో ఉంది. ఓ వ్యాపారి గుర్రం మీద ఎక్కడికో బయల్దేరి వెళుతున్నాడు. సాంచి ద్వారతోరణం : మధ్యప్రదేశ్లోని సాంచి స్థూపానికి ద్వారతోరణాలను శాతవాహన శిల్పులే నిర్మించారన్నది చరిత్ర తేల్చిన సత్యం. ఒక్కొక్క ద్వారం 34. అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ద్వారాల మీది శిల్పాలు కూడా ఆనాటి సమాజాన్ని విశదంగా కళ్లముందు ఉంచుతాయి. ఉత్తర ద్వారంలోని ఓ శిల్పఫలకాన్ని పరిశీలిద్దాం. తమ గుడిసె ముందు ఓ భార్యా భర్తా చలిమంట కాచుకుంటున్నారు. ఓ పిల్లాడు గుర్రానికి గడ్డి తినిపిస్తున్నారు. మరో ఇంటి ముందేమో భార్యాభర్తలిద్దరూ పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓ మహిళేమో నెత్తిమీద పళ్ల గంపను పెట్టుకుని బయల్దేరింది. ఇద్దరు వ్యాపారులు భరణాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. కొంతమంది హైదరాబాద్లోని స్టేట్ మ్యూజియంలో ఉన్నాయి. వీటిని చూసి ఆనాటి మన పూర్వీకులను పోల్చుకోవచ్చు. పురుషులందరూ తలపాగాలు పెట్టుకున్నారు. రాజులు కాకుండా సామాన్య పురుషులు పైన చొక్కాల్లాంటివి ధరించడం విశేషం. వీరు నడుము చుట్టూ కండువాలను కట్టుకున్నారు. రాజులు కంఠాభరణాలను వేసుకున్నారు. స్త్రీలేమో రకరకాల తలకట్టులు.. నగలు.. కంకణాలు.. కడియాలు.. చక్కటి అలంకరణకు ప్రసిద్ధిచెందిన వారిలో కన్పిస్తున్నారు. రాజులు కూర్చునే ఆసనాలు, రాణులు కూర్చునే ఆసనాల డిజైనింగ్ వేరుగా ఉంది. విసనకర్రల్లో కూడా విభిన్నత కన్పిస్తోంది. ఇలా ఈ శిల్పాలను.. చిత్రాలను విశ్లేషిస్తే మన పూర్వీకులది వ్యవసాయ ప్రధానమైన సమాజం, వర్తకానికి ప్రాధాన్యం ఇచ్చారు.. కళాకారులకూ కొదవలేదు. అన్ని వృత్తుల వాళ్లూ సామరస్యంగా సహజీవనం సాగిస్తున్నట్టు అర్థమవుతోంది. ఆనాటి మన తాత ముత్తాతల జీవన విధానం గురించి లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. రచయిత ఫోన్ : 09441829339<noinclude><references/> తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015</noinclude> j1e0nt9bo11654av99sc3itnxzd7ccc పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/99 104 217551 568073 2026-08-03T09:52:49Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568073 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|89}}</noinclude>సొమ్ముచాలక గవర్నమెంటువారివలన లక్షలకొలది ఋణముచేసి, దానిని వాపసు చేయవలసినదని కోరుచు తమకును, తమ కమిటీలకును సులభముగా కమీషన్ రాబట్టుకొనుటకై దేవాలయఆస్తిని అమ్మించుటకు అధికార మీయవలసినదని యిప్పు డొక సవరణబిల్లును శాసనసభలో తెప్పించుకొని యున్నారు. ఇది యీ రోజుననే ఆక్టుగా ప్యాసైనది. ఈ కారణముచే నాకు దేవాలయములనుగురించి కోర్టులకు తరుచుగా పోవుట తప్పినది. సత్రములకు, వనంతోటలకు, మామూలు స్కీము లేర్పాటుచేయుటకు కోర్టులకు పోక తప్పదు. ఈ యాక్టుకూలంకషముగ మార్చినగాని దేవాలయములు తప్పక దుస్థితిలోకి వచ్చును. ఇదివరకే ప్రజలలో దైవభక్తిలేక, గ్రామములు పంచమహాపాతకపట్టణములై సగుణోపాసనను నిరసించి, విద్యావిహీనులైన పూజాదులచే మేనేజి చేయబడు దేవాలయములును దర్శించక, శూన్యగృహములుగ చేయుచున్నారు. అర్చకులకుకూడ నోట మన్నుగొట్టి, పలుకుబడిరహితులే దేవాలయముల యీనాముల మీద వచ్చు అయివజును మ్రింగివేయుచు, దానివిషయ మయే గ్రామములో పార్టీలు యేర్పడుచున్నవి. దీనికితోడు చిల్లరఆఫీసర్లు స్వల్పజీతములకు బోర్డువారిక్రింద పనిచేయుచు, చేయి జాపి, ట్రస్టీలను పీడించుటకు తప్పక మొదలిడుదురు. వీనిని కోర్టుక్రింద చేర్చినయెడల ట్రస్టీలు, ఆనరెరీమెంబర్లు గల కమిటీల అదుపాజ్ఞలలోనుంటూ యీ కోర్టులకు వారి<noinclude><references/></noinclude> 3gwbfhzdcej3rrw3dl1ek4on0zf302n పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/100 104 217552 568074 2026-08-03T10:01:04Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568074 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|90|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>పిచ్చియార్డర్లమీద అప్పీలు చేసికొనుటకు తగిన యేర్పాటు లుండును. ప్రతి దేవాలయములోను దేవుని కల్యాణము మొదలగువానికి ఖర్చులు తగ్గించి, తగిన పండితుల నేర్పరచి, హైందవజ్ఞానవిజ్ఞానమును యీ దేవాలయములో ప్రజలలో వెదజల్లు చుండుటకు వీ లగును. ఈ దేవాలయపరిపాలనను దేశకాలానుసారముగ మార్చక, క్రమముగా అవి శిధిల మగునట్లు యీ బోర్డును, కమిటీలును చేయుచున్నారని వీరి నడతవలన సూచింపబడుచున్నది. ఈ కరువుకాలములోకూడ వీరి కింతంత జీతము లెందుకో, జీతములకు తగినపని వీ రేమిచేయ గలిగిరో దైవమునకే యెరుక. తమకు కమీషన్ యెంత సులభముగా వసూలుచేయవచ్చునా, గవర్నమెంటువద్ద అప్పు చేయకుండా, తమ జీతముల నెట్లు సంపాదించుకొనెదమా యను కోరికతప్ప వీరికి మరియొక యాలోచన యున్నట్లు కనుపడదు. {{rule|2cm}} {{c|అధ్యాయము - 8}} {{rule|1cm}} {{c|జాతీయ విద్యాసంస్థాపనల పోషణము}} బంగాళాదేశ విభజనవలన కలిగిన ప్రజాందోళన సమయములో 1905వ సంవత్సరములో కాశీకాంగ్రెసునకును 1906 లో కలకత్తాకాంగ్రెసుకును, 1907 లో సూరతుకాంగ్రెసు<noinclude><references/></noinclude> f4g18weids8ejj8j3okhc3ons3cvqef పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/101 104 217553 568075 2026-08-03T10:08:41Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568075 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|91}}</noinclude>కును వెళ్లియుంటిని. జాతీయపాఠశాలలను ప్రతిచోటను నెలకొల్పవలెనని కాంగ్రెసువారు తీర్మానము చేసిరి. బంగాళాదేశములోను, యిండియా యితరప్రాంతములలోను అట్టివి స్థాపించబడుచుండెను. మచిలీపట్టణములో మా కందరకును ముఖ్యస్నేహితుడును, మంచి ఆదర్శములుగల మేధావంతుడును, త్యాగమూర్తియు నగుకోపల్లె హనుమంతరావు యమ్. యే. బి. యల్. గారు తన గవర్నమెంటు ఉద్యోగమును, తరువాత తన ప్లీడరీవృత్తినికూడ వదులుకొని ఆంధ్రజాతీయకళాశాల స్థాపనకు దేశాటనము చేయమొదలిడిరి. ఆయనకు తోడు ఆయన ప్రాణమిత్రుడు భోగరాజు పట్టాభిశీతారామయ్య బి. యే. యం.బి.సి.యమ్. గారు ఉన్నపుడు కార్య మేల నెరవేరదు. నేనుకూడ ఉడతాభక్తితో నా ప్లీడరీవృత్తిలో సావకాశము చూచుకొని, ధనమునుగాని, భూమినిగాని కొంచము కొంచము సంపాదించగలిగితిని కాని మొత్తముమీద రాజధానిలో నుండుపెద్దమనుష్యు లందరి యొద్దకు బోయి ధనము సంపాదించుభారము హనుమంతరావుగారిమీదనే పడినది. పాఠశాలపరిపాలనలో పట్టాభిశీతారామయ్యగారు మిక్కిలి పాటుపడుటయేగాక, చాణుక్యునివంటి గడుసుపిండ మగుటచే హనుమంతరావుగారు 1922 సంవత్సరములో అకాలమృత్యువువాత బడినను యీరోజువరకు ఎన్ని కష్టపరంపరలు వచ్చినను దానిని నిర్వహించుకొని వచ్చెను. మీ రిద్దరు నాలుగులక్షల రూపాయీల ఆస్తిని సంపా<noinclude><references/></noinclude> gq747obty5a6loxqhtmzp5nu2gf96mv వేదిక:కాత్యాయనీ గ్రంథమాల 0 217554 568076 2026-08-03T10:14:29Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{portal header | title = కాత్యాయనీ గ్రంథమాల | class = | subclass1 = | reviewed = | shortcut = | notes = స్థాపించబడిన సాహిత్య సంస్థ }} ==ప్రచురణలు== # [[కలగూరగంప]] (1951) [[వర్గం:వేదికలు]]' 568076 wikitext text/x-wiki {{portal header | title = కాత్యాయనీ గ్రంథమాల | class = | subclass1 = | reviewed = | shortcut = | notes = స్థాపించబడిన సాహిత్య సంస్థ }} ==ప్రచురణలు== # [[కలగూరగంప]] (1951) [[వర్గం:వేదికలు]] g5y77qd92a3nbpx2wd10jtci0xjy1z4 568078 568076 2026-08-03T10:21:44Z Rajasekhar1961 50 568078 wikitext text/x-wiki {{portal header | title = కాత్యాయనీ గ్రంథమాల | class = | subclass1 = | reviewed = | shortcut = | notes = కాకినాడలో స్థాపించబడిన సాహిత్య సంస్థ }} ==ప్రచురణలు== # [[కలగూరగంప]] (1951) [[వర్గం:వేదికలు]] m7h83ks46dsf4reol2o94w0zadowrym పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/102 104 217555 568077 2026-08-03T10:18:00Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568077 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|92|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>దించగలిగిరి. ప్రాతిపదికలో మేము వెయ్యేసిరూపాయీలు వేసికొంటిమి. హనుమంతరావుగారు చనిపోయిన తరువాత ఆయన స్మారకనిధికి రూ 1116 లు యిచ్చితిని. మా పట్టాభిశీతారామయ్యగారు ఆనిధికి తా నొక్కడు నలువదివేలరూపాయీలు సంపాదించి స్తిరాస్తి కొన్నారు. పిచ్చి కుదిరినగాని, పెండ్లి కుదరదు. పెండ్లి కుదిరినగాని పిచ్చి కుదరదన్నట్లు కళాశాల నడపుచుండినగాని ధనము చేకూరదు; ధనమున్నగాని కళాశాలజనుల నాకర్షించునట్లు చేయలేము. మేము మొదట వేసికొన్న సొమ్మంతయు కళాశాలస్థాపనకే సరి పోదాయెను. తరువాత దాని పాలనలో కొంత ఋణము చేసినపుడు హనుమంతరావుగారు ఆనీబెజంటుదొరసానిగారి నుండి పదిహేనువేలరూపాయీలు తెచ్చినారు. తిరిగి ఋణమైనపుడు పట్టాభి శీతారామయ్యగారు మహాత్మ గాంధిగారిని, బజాజుగారిని పట్టుకొని తిలకుపండునుండి యిరువదియైదువేల రూపాయీలను తీసికొని రాగలిగెను. దీనికి కారణము ఆంధ్రదేశములో తిలకుపండు సంపాదనలో యితరజిల్లాలలోకంటె కృష్ణాజిల్లాయే అగ్రస్థానము వహించుట. ఆ ఫండుకు నేను రు 1600 లు యిచ్చి, నా క్లయంటైన గురజ కాపరస్తుడు ఉప్పలపాటి బ్రహ్మయ్యగారివలన మరియొక రు 1500 లు వేయించితిని. ఈ కళాశాలకు హనుమంతరావుగారు 1908 సంవత్సరము మొదలు 1922 సంవత్సరము పిబ్రేవరివరకు రాత్రింబగళ్లు కష్టపడి, తన ప్రాణములను సమ<noinclude><references/></noinclude> o5t0pjs2wtvz1wpc9onepsfabozjtce పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.4 (1918).pdf/44 104 217556 568088 2026-08-03T11:54:36Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 568088 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>జేయ బుద్ధిపుట్టును. ఆదికవులే ఆయిరేని వారి శైలియు భాషయు వ్యావహారికములే యనవలసియుండును. కాని వారినాటికే గ్రాంథికము వేఱు వ్యావహారికము వేఱుగా బరిణమించినది. రానురాను భాష వన్నెతేరి వ్యావహారికమునకు గ్రాంథికమునకును దూరము హెచ్చినది. శైలి బరువైనది. దాంభికము ప్రబలమైనది. అతిశయోక్తి నైజమైనది. నైజము పేలవమయినది. కల్పనలు కల్పితములయినవి. శబ్దాలంకారములు భాషాసంస్కరణముతో గ్రమక్రమముగా నైసర్గికములయినవి. భాషలోని యప్రసిద్ధపదములు పాండిత్య ప్రకటనము కొఱకు మిక్కుటముగా వినియోగములయినవి. అదే కారణముగా గీర్వాణప్రయోగములు, సంప్రదాయములు హెచ్చి స్వభాషనానుడి సతిక్రమించి కేవల పరభాషయై పోయినది. యతిప్రాసలు కఠిన నియమములు నిరర్థకపదముల కెంతో యెడమిచ్చినవి.. భావోచితశబ్ద ప్రయోగమునకు వ్యవహారము తార్కాణగదా. ఇట్లుండగా గ్రంధ శైలి వ్యావహారికాంధ్రమునకు గేవలము వ్యతిరేకమై కొన్ని యెడల హాస్యాస్పదమయినది. దీన దానరసము చెడినది. అర్ధము అనుప్రాసములులోనగు గారడీలకు బలియైనది. సామాన్యకవుల చేతులలో భాషసంస్కృతమునకు దూరమయి తెలుగునకు వ్యతిరేకమై పరిణమించినది. అచ్చ తెనుగువ్రాయుదుమని వూనుకొన్న కొందరు మహనీయులు వికృతములయిన ప్రయోగముల బ్రయోగించి తమ గ్రంధములు తమకేగాని యర్థముకానట్లు వ్రాసి బడవైచినారు. ఒక పద్యమునకు రెండు మూడథ౯లు గల కావ్యములు, తిన్నగా జదివిన నొక యధ౯ము, తలక్రిందు గా జదివిన మరియొక యగ్దము గల కావ్యములుగూడ బయలుదేరినవి. ప్రజలలో గవిత్వమునకు స్వతస్సిద్ధమయిన యాకలిగొన్నవారు ప్రధానములయిన భారతభాగవతాది గ్రంథముల జదుపుచు నర్థము దెలియక యూహించియు, నేర్చికొనియు, ముండ్లలోఁ బండ్లేరుకొనునట్లు శ్రమ పడుచున్నారు. ఇంతలో భాష దేశకాల పాత్రములకు లోనై మార జొచ్చినది. ఆమార్పులు లాక్షణికులు కొందరు గ్రంథములందు నంగీకరింపకున్నారు. మరికొందరు వ్యవహారమందును గ్రాంధిక ప్రయోగములందును దమపాండిత్యము కొలందిని జేయుచు స్వోత్కర్ష బ్రకటించుచున్నారు. మరికొందరు దేశాభిమానులు గౌర్నమెంటువారికి నివేదించి వారి సహాయ్యముచే వ్యావహారిక ప్రయోగములు గల గ్రంధములను బురదలో మట్టించినారు. ఇట్టివారు భాష యొక్క యుత్పత్తిని గాని, సంప్రదాయములను గాని యెరుగరని నాతలంపు. జీవభావ పుట్టినది పుట్టినట్లుండదు. అనేక కారణములకులోనై పదేపదే మారుచుండును. ప్రత్యయములు వేఱగుచుండును. ప్రయోగములు మొదట నొక యర్ధ మందును తరువాత లక్షణయా మరియొక యర్థమందును మారుచుండును. రూపములుకొన్ని పెరుగుచుండును. మరికొన్ని తగ్గుచుండును. మృతశరీరము పెరుగనట్లే మృతభాషయును పెరుగదు. మారదు. కాని భాష జీవించియున్నంతవరకు శారీరిక, రాజకీయ, దైవిక కారణములచే మార్పులొందుచుండగా గ్రంథములలో మాత్రము పూర్వప్రయోగములే సాధువులనియును ఆధునికములు వ్యావహారిక సమ్మతము అయినప్పటికి నసాధువులనియును గ్రాంధికరూపములను గట్టిగా బట్టుకొని యుండుట గడియారములంబట్టి గాని సూర్యుడు గగనమందు దిరుగగూడదని చెప్పిన మూఢులతో సుజ్జీవేయుటయే. వ్యావహారికేతరములైన ప్రయోగము లాధునికాంధ్రమునుండి విసర్జింపవలసినదియే. తదనుగుణములైన వాని సంగీకరింపకున్ని పూర్వపునాణెములే గాని యిప్పటి కొత్తబేడలు, రూపాయనోట్లు ఉపయోగిఁపనిని ప్రతిజ్ఞ జేయు జానపదుని మార్గము. ఈయంశమిఁతకన్న నియ్యెడ జర్చింపబనిలేదు. పర్యాయత్వేన దీనిని సవిస్తరముగా విమర్శింతుముగాక కాని యీసమయమందునే బ్రతిపాదింపదలచిన పరమార్ధమేమన:౼ ఆధునికాంధ్రవ్యాకరణ మొక్కటి వ్రాయించి వ్యావహారిక భాషాప్రయోగముల సాధుత్వాసాధుత్వములు నిర్ణయింప నాంధ్ర సారస్వత సభవారు పూనుకొనవలయునని. ఇందుమూలమున నుచితజ్ఞులుగాని గ్రంధకర్తలు పామరప్రయోగములను, గ్రావ్యములను వాడకుందురు. తర్వ్యాకరణచోదితములైన ప్రయోగములుగల యుద్గ్రంధము లంగీకరంపదగునా కాదా యని తరువాత విమర్శింపగలము. కావ్యోపయోగముగా నొక యలంకారశాస్త్రము దెలుగున వచనరూపముగా వ్రాయించి భావిగ్రంధకర్తలకు రసము, ఔచిత్యము, గుణము, దోషము, శైలి, నానుడి మొదలగు సంశముల నుపదేశింపగలుగుట యాంధ్రసారస్వత సభోద్దేశ్యములలో ముఖ్యమైనదని నామతము. ఇందువలననే బయిని వక్కాణించిన కార్యదోషములు తొలగి రసవంతములైన గ్రంథములు బయలుదేరుటకు సాధనముగల్పించిన వారమగుదుము. రసస్వరూపము సర్వదేశములకును, సర్వకాలములకును ఒక్కటియే గనుక నీయలంకార శాస్త్రగ్రంథమందు లక్షణములకు లక్ష్యములు, ఆంగ్లేయ సంస్కృతాంధ్ర గ్రంథములనుండి యెంచుట నాయభిప్రాయము. ఇట్టి యలంకారగ్రంథము లింగ్లీషుభాష ననేకములున్నవి. వానియాశయము సర్వజనసామాన్యముగా గావ్యలక్షణము లుపపాదించుట.<noinclude><references/></noinclude> 0k5iosbvptgu4sg7z6azifpautmyhuy అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/తాపీ ధర్మారావు స్మారక ప్రసంగం 0 217557 568090 2026-08-03T11:58:20Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015]] | రచయిత = | అనువాదం= | విభాగము = తాపీ ధర్మారావు స్మారక ప్రసంగం | ముందరి = [[..//]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Ammanudi March 2015 - Samala Rameshb...' 568090 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015]] | రచయిత = | అనువాదం= | విభాగము = తాపీ ధర్మారావు స్మారక ప్రసంగం | ముందరి = [[..//]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం= }} <pages index="Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf" from=50 to=51 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] 25tjgphadummams8dfbibzmra6y62p3