వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.14
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
పుట:Aananda-Mathamu.pdf/141
104
109477
569124
355951
2026-08-07T14:36:29Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
569124
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|136|ఆనందమఠము|}}</noinclude>బులలోని యిండ్లు పాడుపడి పశుపక్షులకు విశ్రామభూమియై ప్రేతభీతికిఁ గారణమాయెను. పంటభూములను సాగుబడి చేయువారు లేక, బీడుపడి గడ్డి పెరిఁగి యుండెను. దేశమంతయు కాననమున లేఁ గన్పట్టెను. ఎచ్చట శ్యామలకోమలమగు సస్య రాశి ప్రకాశించుచుండునో; ఎచ్చట అసంఖ్యాకములగు పశుపక్షులు మేయుచుండునో; ఎయ్యది గ్రామమందుండు యువకయువతులు గుంపు చేరి యామోద ప్రమోదంబులఁ జేయుచుండిన యుద్యానభూములుగా నుండునో; అవియన్నియు ఘోరతరమైన వనంబగుచు వచ్చెను. ఒక యేఁడు కడచెను; రెండేండ్లు చెల్లెను, మూఁడేండ్లాయెను. కాననము మఱింత వృద్ధియగుచు వచ్చెను. ఏస్థలము మనుష్యుని సుఖంబున కాటపట్టై యుండెనో యది నరమాంస లోలుపమైన వ్యాఘ్రాదులకు వాస స్థలమాయెను. ఎచ్చట సుందరీమణులు గుంపు చేరి యలకాంకిత చరణంబులయందలి గజ్జెలు, పిల్లాండ్లు, గొలుసులు, మెట్టులు ఈ మొదలగు నాభరణములు ఘల్లు ఘల్లున శబ్దము చేయఁగా నెచ్చెలులతో సరససల్లాపము లాడుచు పకపక నవ్వుచుఁ బోవుచుండిరో యాస్థలములయందు భల్లూకములు బిలంబులను ద్రవ్వికొని పిల్లలను కని లాలన పాలన చేయ నారంభించెను. ఎచ్చట పిన్నవాండ్రు పిన్న వయసున సంధ్యాకాల మల్లికా కుసుమమువలె ఉత్ఫుల్లహృదయులై యాటపాటలఁ బొద్దు పుచ్చుచు సంచరించుచుండిరో యాస్థలములయందు మత్తగజంబులు చెట్ల కొమ్మలను లాగుచుఁ దిరుగుచుండెను. ఎచ్చట దుర్గోత్సవములు జరుగుచుండెనో యచ్చట సృగాలావాస<noinclude><references/></noinclude>
nkgpvizobt1uzg1fi6xnf5gs6nt13hd
569125
569124
2026-08-07T14:38:37Z
రవిచంద్ర
146
569125
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|136|ఆనందమఠము|}}</noinclude>బులలోని యిండ్లు పాడుపడి పశుపక్షులకు విశ్రామభూమియై ప్రేతభీతికిఁ గారణమాయెను. పంటభూములను సాగుబడి చేయువారు లేక, బీడుపడి గడ్డి పెరిఁగి యుండెను. దేశమంతయు కాననమువలెఁ గన్పట్టెను. ఎచ్చట శ్యామలకోమలమగు సస్య రాశి ప్రకాశించుచుండునో; ఎచ్చట అసంఖ్యాకములగు పశుపక్షులు మేయుచుండునో; ఎయ్యది గ్రామమందుండు యువకయువతులు గుంపు చేరి యామోద ప్రమోదంబులఁ జేయుచుండిన యుద్యానభూములుగా నుండునో; అవియన్నియు ఘోరతరమైన వనంబగుచు వచ్చెను. ఒక యేఁడు కడచెను; రెండేండ్లు చెల్లెను, మూఁడేండ్లాయెను. కాననము మఱింత వృద్ధియగుచు వచ్చెను. ఏస్థలము మనుష్యుని సుఖంబున కాటపట్టై యుండెనో యది నరమాంస లోలుపమైన వ్యాఘ్రాదులకు వాస స్థలమాయెను. ఎచ్చట సుందరీమణులు గుంపు చేరి యలకాంకిత చరణంబులయందలి గజ్జెలు, పిల్లాండ్లు, గొలుసులు, మెట్టులు ఈ మొదలగు నాభరణములు ఘల్లు ఘల్లున శబ్దము చేయఁగా నెచ్చెలులతో సరససల్లాపము లాడుచు పకపక నవ్వుచుఁ బోవుచుండిరో యాస్థలములయందు భల్లూకములు బిలంబులను ద్రవ్వికొని పిల్లలను కని లాలన పాలన చేయ నారంభించెను. ఎచ్చట పిన్నవాండ్రు పిన్న వయసున సంధ్యాకాల మల్లికా కుసుమమువలె ఉత్ఫుల్లహృదయులై యాటపాటలఁ బొద్దు పుచ్చుచు సంచరించుచుండిరో యాస్థలములయందు మత్తగజంబులు చెట్ల కొమ్మలను లాగుచుఁ దిరుగుచుండెను. ఎచ్చట దుర్గోత్సవములు జరుగుచుండెనో యచ్చట సృగాలావాస<noinclude><references/></noinclude>
qvrsw86zwengpoc5jhvk37gfld6ni5d
పుట:Aananda-Mathamu.pdf/142
104
109478
569126
355952
2026-08-07T14:41:03Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
569126
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||ఇరువదియాఱవ ప్రకరణము|137}}</noinclude>మయ్యెను. నాట్య మందిరములందు విషసర్పములు పగటియందే కప్పలను వెదకుచుండెను. పంటపండునుగాని, తినుటకు జనులు లేరు. ధాన్యము పండినను ధనము లేదు. కొనువారే లేరు. జమీందారులు కప్పముల నిచ్చుటకు శక్తి లేనివారైరి. వారికి రైతు లియ్యవలసిన పన్ను నియ్యరు. రాజు జమీందార్లను జప్తు చేసినందుచే హృతసర్వస్వులై దరిద్రులగుచు వచ్చిరి. భూమాత సుప్రసూతియాయెను. అయినను సొమ్ము పుట్టదు. ఎవ్వరింటియందును ఒక కాసైనను లేదు. ఎవని చేతికి దొరకిన దానిని వాఁడే తినుచుండెను. దోపిళ్లు, దొంగతనములు ప్రబలమాయెను. సాధుశీలుఁడు భీతిచే నిల్లు విడిచి కదలక తలదాచుకొని యుండెను.
ఇచట సంతాన సంప్రదాయస్థులు నిత్యమును చందన పుష్ప తులసీదళములచే విష్ణుపాదపద్మంబులను పూజ చేయుచు నెవరి యింటియందైనను తుపాకి పిస్తోలు లుండినచో వానిని దీసికొని వచ్చుచు నుండిరి.
భవానందుఁడు, ‘భ్రాతృలారా! ఇండ్లయందు పద్మరాగ వజ్ర వైఢూర్య ప్రవాళాదు లుండినను వానిని తాఁకక, విరిగిపోయిన తుపాకిగా నుండినను వానినిమాత్రము తీసికొనిరం’ డని చెప్పుచుండెను.
సంతాన సేనాధిపతులు ఒక్కొక గ్రామంబునకును దమ యనుచరులను బంప నారంభించిరి. అనుచరులు గ్రామంబులకుల బోయి యెచ్చట హిందూజనులను జూచినను వారినిఁ గూర్చి విష్ణుపూజ చేయుదురా? యని యడుగుదురు. ఇట్లు చెప్పుచు ఇరువది ముప్పదుగురు గుంపుగాఁ జేరి ముసల్ మానుల<noinclude><references/></noinclude>
soe5zisnl78syc3bq8fjsghxrlshb54
పుట:Aananda-Mathamu.pdf/143
104
109479
569127
355953
2026-08-07T14:43:38Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
569127
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|138|ఆనందమఠము|}}</noinclude>గ్రామములపైఁబడి వారిండ్లను కాల్చుచుండిరి. ముసల్ మానులు ప్రాణరక్షణయందు వ్యస్తులై యున్నప్పుడు వారి సర్వస్వమును సంతానులు దోఁచుకొనిపోయి దానిని క్రొత్తఁగా వచ్చిన విష్ణుభక్తులకు పంచి యిత్తురు. కొల్లలో దొరకిన భాగముతో గ్రామనివాసులు తృప్తులు కాఁగనే వారినిఁ బిలిచికొని వచ్చి విగ్రహముల పాదస్పర్శ చేయించి వారిని సంతానులుగఁ జేయుదురు. జనులు సంతానత్వమునందు విలక్షణమైన లాభము కలదని భావించిరి. విశేషముగా తురకల రాజ్యమందు సరిగాని యనాయకత్వమును గాంచి, యందఱును వారియందు విరక్తులైరి. హిందూధర్మము లోపముగా నుండిన కారణముచే ననేక హిందువులు హిందూమతమును స్థాపించుటకు ప్రబలమగు నాతురము గలవారైరి కావున, సంతానులసంఖ్యవృద్ధియైనది. దినదినము నూర్ల కొలఁదిజనులు చేరుచుండిరి. అందఱును భవానందజీవానందుల పాదములపైఁబడి వారి యాజ్ఞ ప్రకారము దండులోఁ జేరి తురకలను శాసింపఁబోవుచుండిరి. సర్కారునౌకర్లను ఎచ్చటఁ జూచినను పట్టి కొట్టుచుండిరి. కొందఱను జంపుటయుఁ గలదు. సర్కారు ధన మెచ్చటనుండినను కొల్లగొట్టి యింటికిఁ దెచ్చుకొందురు. తురకల గ్రామము
కనఁబడినచో కాల్చి బూడిద చేయక వదలరు.
అప్పుడు నగరంబున మహారాజునకు హెచ్చరిక గలిగెను. సంతానులను శాసించుట కతఁడు సైన్యములను బంప నారంభించెను. అయినను, అదివఱుకే సంతానులు బలవంతులై శస్త్ర ధారులై మహాపరాక్రమశాలులై యుండిరి. వారిదర్పమునకు తురకల సైన్యము నిలుపక పోయెను. ఒక వేళ ముందు<noinclude><references/></noinclude>
l8adas0b3opa0vnzybuvk1a4gn1etco
పుట:Aananda-Mathamu.pdf/144
104
109480
569128
355954
2026-08-07T14:46:51Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
569128
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||ఇరువదియాఱవ ప్రకరణము|139}}</noinclude>నకువచ్చి నిలిచినను, సంతాను లగుటచే వారు తురకలను ఛిన్నభిన్నము చేసి హరిధ్వని చేయుచుండిరి. సంతానుల బలమును యవనసైనికులు పాఱఁ ద్రోలినను, అప్పుడే యెక్కడ నుండియో వేఱొక సంతానులగుంపు వచ్చి తురకల తలలను నరికి పాఱవైచి “హరి హరీ” యని వెడలిపోవుదురు. రాజైన అసదుల్ జమానునకు మిక్కిలి కష్టము సంభవించెను. వాఁడు అనేకములైన ఫిరంగులు మందు గుండ్లు ఏనుఁగులు గుఱ్ఱములు ఇంకను కావలసినవానిని బంపెను. అందువలనఁగూడా సంతానుల “జయజగదీశ హరే” యను నినాదము నివారణము కాలేదు. అసదుల్ జమానుఁడు తాను రాజ్యచ్యుతుఁ డగుదుననియే నిశ్చయించెను.
అపు డతఁడు దుఃఖితుఁడై యాంగ్లేయులకు జాబు వ్రాసెను. ఎట్లన: —— ‘నే నిప్పుడు నేలపన్ను రూపాయలను వసూలు చేయుట కేమి చేసినను సాధ్యపడలేదు. ఇరసాలు పంపలేను; ఇప్పుడు మీరు రక్షించితి రేని పిదప వసూలు చేయవచ్చును; లేనియెడల మీరే వచ్చి వసూలు చేసికొనవలయును.’
ఆంగ్లేయులు మొదట కొన్ని చోట్లయందు తామే పన్నులు వసూలు చేసికొనుచుండిరి. అయిన, నిప్పుడు వారి ప్రయత్నము విఫల మగుచు వచ్చెను. ఈ సమయంబున ప్రధిత నామకుఁ డగు భారతవర్ష యింగ్లీషుకులోత్పన్నుఁ డైన ప్రాతస్సూర్యుఁడోయనునట్లు ప్రకాశించెడు వార౯ హేస్టింగ్సు భారతవర్ష గవర్నరు జనరలుగా నుండెను. అతఁడు కలకత్తాలో కూర్చుండి యొక యినుపగొలుసును ముందిడుకొని మనస్సునందీయొక్క గొలుసుతో నీససాగరద్వీపభారతభూమిని కట్టి<noinclude><references/></noinclude>
09ud8ohrdsp02mb7tihkvf51f2w9jw9
పుట:Aananda-Mathamu.pdf/145
104
109481
569129
355955
2026-08-07T14:49:21Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
569129
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|140|ఆనందమఠము|}}</noinclude>వేయుదు నని తలంచుకొనెను. ఒక్కనాఁడు జగదీశ్వరుఁడు సింహాసనాసీనుఁడై నిస్సందేహముగా “తథాస్తు” అనెను. అయినను, ఆ దినము దూరముగా నుండెను. సంతానులభీషణమగు హరిధ్వనికి వార౯ హేస్టింగ్సుకూడా కంపితుఁ డాయెను.
వార౯ హేస్టింగ్సు మొదట పౌజుదారి సైన్యమువలన సంతానుల రాజవిద్రోహము నణఁగింపఁ బ్రయత్న పడెను. అయినను, ఫౌజుదారి సిపాయీలవ్యవస్థ చాల చెడిపోయి యొకముసలిదాని నోటనుండి హరినామము వినినను భయపడి పాఱిపోవునట్టి స్థితిలో నుండెను. కావున వారన్ హేస్టింగ్సు నిరుపాయుఁడై దక్షుఁడగు కేఫ్ట౯ థామస్ అనునొక సైనికుని యధినాయకునిగాఁ జేసి కంపెనీసైన్యమును విద్రోహనివారణార్థమై వీరభూమి ప్రదేశంబున కంపెను.
కేష్ట౯ థామసు వీరభూమినిఁ జేరి, యచటరాజవిద్రోహ నివారణ విషయమై యత్యుత్తమములైన యేర్పాట్లు చేయ నారంభించెను. రాజు యొక్క సైన్యమును, జమీందారుల సైన్యముల నడగితీసికొని యుద్ధంబున సుశిక్షితులగు కంపెనీ సైన్యముతోఁ జేర్చి, వారిలో బలిష్ఠులైన దేశవిదేశ వీరులను వెదకి సైనికులను తయారుచేసెను. పిమ్మట, నాసైన్యమును గుంపులు గుంపులుగా విడఁదీసి, యాగుంపులకు తగినవారిని యధికారులనుగా నియమించెను. పదంపడి, వారికి దేశ దేశములను విభాగించియిచ్చి మీరు వేఁట కాండ్రవలె పొంచియుండి యెచ్చట విద్రోహులు చిక్కినను చీమలను నలుపునట్లు ధ్వంసము చేయవలయునని చెప్పిపంపెను. కంపెనిసైనికులలోఁ గొందఱు గంజాయి, కొందఱు రం (నిషాగలిగించు సారాయి) త్రాగి, తుపా<noinclude><references/></noinclude>
nomprorq7h8cyzmvjpc0ooujfsqcpel
పుట:Aananda-Mathamu.pdf/146
104
109482
569130
564611
2026-08-07T14:51:21Z
రవిచంద్ర
146
569130
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Rajasekhar1961" />{{rh||ఇరువ దేడవ ప్రకరణము|141}}</noinclude><section begin="146A" />కులను బారు చేసికొని సంతానుల వధకై వెడలిరి. అయినను, సంతానులసంఖ్య యెక్కువగా నుండి నదేగాక, వారు అజయ్యులై యుండిరి. కేష్ట౯ థామసుయొక్క సైనికులు, కోతకాలములో కొడవలికి దొరికిన పైరువలె కత్తరింపఁబడిరి. హరిహరిధ్వనిచే కేప్ట౯ థామసుయొక్క చెవులు చెవుడు వడెను. ఈవిధముగ 1776-వసంత్సరమునందు వీరభూమిలో సంతానులు ప్రసిద్ధి కెక్కిరి.
{{rule|6em}}
<section end="146A" />
<section begin="146B" />{{p|fs125|ac}}ఇరువదేడవ ప్రకరణము</p>
ఆకాలమున కంపెనీవారిచే పట్టుపనిచేయు కార్ఖానాలు స్థాపింపబడి యుండెను. శివగ్రామంబున నొకకొఠారుండెను. డనివర్తుదొర అనువాఁ డాకొఠారునకు ఫ్యాక్టరు (Factor) అనఁగా అధ్యక్షుఁడై యుండెను. కొఠారుల సంరక్షణ విషయమునందు తగిన యేర్పాట్లు కలిగియుండెను. డనివర్తుదొర యెట్లో తన ప్రాణరక్షణము చేసికొని వసించుచుండెను. అయినను, వాఁడు తనభార్యను బిడ్డలను కలకత్తాకుఁ బంపి యుండెను. ఇట్లుండినను వానికి సంతానుల యుపద్రవము తప్పలేదు. ఈసమయమున నాప్రదేశంబునకు నాలుగైదు పటాలములతోడ కేష్ట౯ థామసు విజయముచేసి యుండెను. కొత్తగాఁజేరిన మాలలు మొదలగు నీచజాతి సంతానులు కొందఱు పరధనాపహరణంబునందుత్సాహులై యుండిరి. కేష్ట౯ థామసుదొరవారు సైన్య
<section end="146B" /><noinclude><references/></noinclude>
590zskvciewqanjhaf8vxb0ueobawa4
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/539
104
154592
569107
448399
2026-08-07T12:00:08Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569107
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కడప జిల్లా||సంగ్రహ ఆంధ్ర}}</noinclude>
'''ప్రయాణ సౌకర్యములు :''' ఈ జిల్లాయందు, 1022 మైళ్ల పొడవుకల రోడ్లు గలవు. నెల్లూరు, చిత్తూరు, బెంగుళూరు, బళ్లారి, మదరాసు, కర్నూలు, కంబము, గిద్దలూరు, మదనపల్లె, కదిరి, అనంతపురము అను తావులకు ప్రధాన మార్గములు కలవు. మదరాసునుండి బొంబాయికి వెళ్ళుటకు వేయబడిన ఇనుపదారి ఈ మండలములో సుమారు 122 మైళ్ళ పొడవున కలదు. పెక్కు రైలు స్టేషనులు లేవు. తాలూకాలు రైలుబాటకు దూరముగా నున్నవి. మొత్తముమీద ఈ మండలమున ఇనుపదారి సౌకర్యము లేదనవచ్చును. బస్సు సౌకర్యములు బాగుగా నున్నవి.
'''వైద్యసహాయము :''' ప్రతి తాలూకాయందును దొరతనమువారి వైద్యశాలలు కలవు. 10 వైద్యశాలలు
స్థానిక పరిపాలనా శాఖకు చెందినవి. కడప పట్టణమున సర్వ పరికర సమృద్ధమగు ప్రభుత్వపు వైద్యశాల యొకటి కలదు.
'''సంతలు, ఉత్సవములు :''' పుష్పగిరి శంకర క్షేత్రమున చైత్ర బహుళ 13 మొ॥ వైశాఖ శుక్ల సప్తమి
వరకు ఉత్సవము జరుగును. రాయచోటియందు గంగమ్మ జాతరయు, జమ్ములమడుగు తాలూకాయందు వైశాఖ
పూర్ణిమకు ఏడు దినములు ముందునుండి ఉత్సవములును జరుగును.
'''విద్యాసంస్థలు:''' కడపలో గవర్నమెంటు అర్సు కళాశాల ఒకటి కలదు. బాలురకు 28 ఉన్నత పాఠశాలలును, బాలికలకు 3 ఉన్నత పాఠశాలలును కలవు. బోధనాభ్యసన పాఠశాలలు బాలురకు 2, బాలికలకు 2 కలవు. మాధ్యమిక పాఠశాలలు 3, ప్రాథమిక పాఠశాలలు 1061, బేసిక్ పాఠశాలలు 21, వయోజన పాఠశాలలు 48 కలవు. ఒక అంధ పాఠశాలయు కలదు.
{| class="wikitable"
|+ Caption text
|-
! విద్య !! పురుషులు !! స్త్రీలు
|-
| మాధ్యమిక విద్య || 6,703 || 1,385
|-
| హైయర్ సెకండరీ || 3,736 || 575
|-
| ఇంటర్మీడియేట్ || 530 || 77
|-
| పట్టభద్రులు || 1,392 || 214
|}
'''కుటీర పరిశ్రమలు :''' ఇచటి నూలు నేత పరిశ్రమ మాత్రము శేషించిన పరిశ్రమలన్నిటికంటె మిన్న యన వలయును. రంగుల పరిశ్రమ మిగుల స్వల్పము, పట్టు నేత పరిశ్రమ పులివెందుల తాలూకాలో కలదు. చెప్పులు కుట్టు పరిశ్రమ, కుండలను తయారుచేయు పరిశ్రమ అన్ని తాలూకాలందును కలవు. రాగి, ఇత్తడి, కంచు మొదలగు లోహపాత్రల పరిశ్రమ బద్వేలు తాలూకాలోను, ప్రొద్దుటూరులోను కలదు. బండ్లు పులివెందుల, కమలాపురము తాలూకాలలోను, బెల్లము రాయచోటి తాలూకాయందును తయారుచేయబడును.
'''గ్రామములు :''' ఈ మండలమున 909 గ్రామములున్నవి. ఇందు పట్టణములు తొమ్మిదికలవు. గృహములు 2,10,986 కలవు. ఇచటి జనసంఖ్య 11,61,731. ఇందు పురుషులు 5,95,060 మంది. స్త్రీలు 5,66,671 మంది.
ఈ జిల్లాలో వ్యవసాయము జీవనముగా గలవారును వారి పోషణముననుండు వారును 5,39,659 మంది.
ఇందు పురుషుల సంఖ్య 2,79,909; స్త్రీల సంఖ్య 2,59,750. చదువు వచ్చిన పురుషుల సంఖ్య 13,789; చదువగల స్త్రీల సంఖ్య 2,648.
'''భాషలు :''' తెలుగు మాతృభాషగా గలవారే ఈ మండలములో అధిక సంఖ్యలో నున్నారు. వీరి సంఖ్య 10,06,250. ఇందు పురుషుల సంఖ్య 5,14,922; స్త్రీల సంఖ్య 4,91,328. తెలుగు భాష తరువాత రెండవ స్థాన మాక్రమించునది హిందూస్థాని భాష, హిందూస్థాని మాటాడు వారు 1,26,983 మంది కలరు. ఇందు 65,871 మంది పురుషులును, 61,112 మంది స్త్రీలును ఉన్నారు. తరువాత కన్నడము, మరాటి, హిందీ, తమిళము, లంబాడి, ఎరుకల, మలయాళము, గుజరాతి, బెంగాలి, ఒరియా, ఇంగ్లీషు, పోర్చుగీసు, డచ్చి భాషలు మాటాడువారు ఉత్తరోత్తరము తక్కువ సంఖ్యలో నున్నారు.
'''మతములు :''' ఈ జిల్లాలో మతములను బట్టి జనసంఖ్య ఈ క్రింది విధముగా నున్నది :
{| class="wikitable"
|+ Caption text
|-
! శీర్షిక పాఠ్యం !! శీర్షిక పాఠ్యం
|-
| 1. హిందువులు || 9,50,047
|-
| 2. ముసల్మానులు || 1,55,408
|-
| 3. క్రైస్తవులు || 56,227
|-
| 4. జైనులు || 47
|-
| 5. సిక్కులు || 2
|-
| మొత్తము || 11,61,731
|}<noinclude><references/></noinclude>
62fwhgz8gnaufekxqrc4656lob8shq4
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/540
104
154593
569108
448400
2026-08-07T12:23:00Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569108
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||కడప జిల్లా}}</noinclude>
'''ఖనిజములు :''' కడప సమీపమున చెన్నూరు దగ్గర పినాకినీ నదీ తటమున గుఱ్ఱముపాడు అనుచోట వజ్రములు లభించును. నంద్యాలము పేట, ఎఱ్ఱగుంట్ల కోట, చిట్టివేలు, మడిచెరువు అను గ్రామముల ప్రాంతములందు ఇనుము లభించును. బద్వేలు గ్రామమునకు పడమటగా నుండు జంగమరాజుపల్లె పరిసరములందు సీసము, వెండి, రాగి, దొరుకు నందురు. కడప, కమలాపురము, ప్రొద్దుటూరు తాలూకాలలో నల్లని పరపురాళ్ళు విరివిగా లభించును. పులివెందుల, కడప తాలూకాలయందు రాతి నార దొరుకును. అచట సున్నపు రాయి విరివిగ దొరకును. ఎఱ్ఱగుంట్ల దగ్గర నిడుజువ్వి యను గ్రామము కలదు. అచట చాపరాయి పుష్కలముగ త్రవ్వబడి, నునుపు చేయబడి దేశాంతరములకు ఎగుమతి చేయబడుచున్నది.
చింతకుంట గుట్టలయందు నిగనిగ మెరయు రాళ్ళు కలవు. వీనిని పలుగురాళ్ళనియు, ముగ్గురాళ్ళనియు అందురు. పులివెందుల తాలూకా యందు బాణగుట్టయను స్థలమున నేటికిని సిద్ధులు సిద్ధపరచిన అనేక రసములు కుండలయందు నిక్షిప్తములై కలవు. అవి తెలిసికొనుటకు సాధ్యము గానీవయి యున్నవి. రససిద్ధుల కీ మండలము ఆశ్రయమని యందురు. సిద్ధవటము సిద్ధుల చరిత్రమునకు నిలయము, ఇప్పటికిని అనేక సిద్ద పురుషులు పర్వతములయందు గుహలలో నివసించుచున్నట్లు నిదర్శనములు గలవు. ఇప్పటికి బొంబాయి మొదలగు దూరదేశములనుండి ధనవంతులు ఈ మండలమునకు వచ్చి మేంగనీసు మొదలయినవి భూ గర్భము నుండి త్రవ్వించి వ్యాపారము సాగించుచున్నారు. బై రేట్సు అను పదార్థము, అల్యూమినియము అను పదార్థము, కావిరాయి, గోపీచందనపుసుద్ధ ఎక్కువగ పర్వత ప్రాంతములందు లభించును. ఇనుపరాయి పెక్కు స్థలములలో లభించుచున్నది. వ్యాపారము చేయువారు పర్వత ప్రాంతములను త్రవ్వి దానిని ఎగుమతి చేయుచున్నారు.
'''చరిత్ర :''' క్రీ. శ. నాలుగవ శతాబ్దినుండి కొంతవరకు ఈ మండల చరిత్ర తెలియవచ్చుచున్నది. మొదట పల్లవులనువారు కడప మండలము నాక్రమించి అయిదవశతాబ్ది వరకు పరిపాలించిరి. అయిదవ శతాబ్దియందు, కరికాల చోళ రాజులు పల్లవుల నోడించిరి. ఈ ప్రాంతము చోళుల పరిపాలనమున నాల్గు తరములు పాలింపబడినది.
ఆరవ శతాబ్ది యర్ధభాగమున ఆంధ్రచోళులు కడప, కర్నూలులను ఆక్రమించిరి. రాష్ట్రకూటులు 783-84
నుండి 814 వరకు రాజ్యము చేసిరి. తొమ్మిదవ శతాబ్ద యందు బాణులనువారు తెలుగు చోళరాజ్యమున నుండిరి. ఈ శతాబ్దమునందే వారు కడప మండలమున ప్రవేశించిరి. రాష్ట్రకూటులు 940-956 ప్రాంతమున రాజ్యము చేసిరి, మూడవ కృష్ణుడు మరణించిన తరువాత రాష్ట్ర కూటుల యధికారము క్షీణించినది. అప్పుడు వైదుంబులు ప్రబలిరి. 1070 నుండి 1118 వరకు కుళోత్తుంగుడు ఈ భాగము నాక్రమించి పరిపాలించెను. 1268 సం. న మూడవ రాజేంద్రుడు మరణించిన తర్వాత పాండ్యులు చోడ రాజ్యము నాక్రమించిరి.
కాకతి గణపతిరాజు కడపమండలమును స్వాధీనపరచుకొనేను. పదునాల్గవ శతాబ్ది ప్రారంభమున కడపమండల
మున రాయచోటిభాగము తప్ప, తక్కిన మండలమంతయు కాకతీయుల పరమునందే యుండెను. 1309 లో మహమ్మదీయులు దక్షిణదిక్కు నాక్రమించుటకై దండయాత్ర నారంభించిరి. పదునాల్గవ శతాబ్దినుండి పదునేడవ శతాబ్ది వరకు కడపమండలము విజయనగరరాజుల ఏలుబడిలో నుండినది. తరువాత కడపమండలము గోలకొండ కుతుబ్ షాహి సుల్తానులకు వశమయ్యెను. పిదప మొగలులు వచ్చిరి. ఔరంగజేబు కడపను పరిపాలింప ఏర్పాట్లుచేయ ప్రయత్నించి మహారాష్ట్రులతో యుద్ధ మేర్పడ, ఢిల్లీకి తిరిగి వెళ్ళెను (1652). తరువాత పాలెగాండ్రు విజృంభించిరి. పిదప కడపను నవాబు లేలిరీ. 1740 ప్రాంతమున
మహారాష్ట్రులు దాడివెడలిరి. 1759 లో బసాలత్ జంగ్ ఫ్రెంచి సేనలతోవచ్చి కడపలో ప్రవేశించెను. 1769 లో
నైజాముతో చేసికొన్న యొడంబడిక ననుసరించి కడప, కర్నూలులు హైదరాలీకి లోబడినవి. 1791 మొదలు
1794 వరకు కడపరాజ్యము కొన్నాళ్ళు మహారాష్ట్రుల వశమునను, కొన్నాళ్లు టిప్పుసుల్తాన్ చేతులలోను,
కొన్నాళ్ళు నైజాం స్వాధీనములోను మారుచుండినది. 1795 లో నైజామునకు మహారాష్ట్రులకును యుద్ధము
జరిగెను. నైజాం ఫ్రెంచి రై మండ్సు సహాయునిగగొని సేనల సాహాయ్యముకొరకు అతనికి కడవప్రాంతము
నొసగెను. 1799 లో శ్రీరంగపట్టణము నైజామునకు<noinclude><references/></noinclude>
ll4lybbc45i0gch1d1cd6z4nyeoaxe0
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/541
104
154594
569110
448401
2026-08-07T12:34:00Z
A.Murali
3019
569110
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" />{{rh|కడప జిల్లా||సంగ్రహ ఆంధ్ర}}</noinclude>
లోబడు సమయమున ఆంగ్ల సైనికులు కీయవలసిన జీతములకు గాను కడప మండలము బ్రిటిష్ వారికి అర్పింపబడెను. (12-10-1800). ఇది మొదలు కడపమండలమునకు క్రొత్త శక మారంభమయ్యెను. బ్రిటిషు వారి తరువాత భారత జాతీయ ప్రభుత్వ భాగముగా ఆంధ్రరాష్ట్రములో నున్నది ఈ మండలము.
కడపజిల్లాలోని తొమ్మిది తాలూకాలు మూడు డివిజనులక్రింద విభజింపబడినవి. ప్రస్తుత కాలమున ఆంధ్ర
ప్రదేశ ప్రభుత్వము వారి ఆదేశానుసారము డివిజనులు.అందలి తాలూకాలు ఈ క్రింది విధముగా నుండును,
(23-5-1958)_
1. కడప డివిజన్- ఇందలి తాలుకాలు కడప, రాయచోటి, కమలాపురం అనునవి. ప్రధాన నగరము - కడప,
2. రాజంపేట డివిజన్ - ఇందలి తాలూకాలు రాజంపేట, సిద్ధవటము, బద్వేలు అనునవి. ప్రధాన నగరము - రాజంపేట.
3. జమ్ములమడుగు డివిజన్- ఇందలి తాలూకాలు జమ్ములమడుగు, ప్రొద్దుటూరు, పులివెందులు అనునవి.
ప్రధాన నగరము - జమ్ముల మడుగు.
'''1. కడప తాలూకా :''' ఈ తాలూకా విస్తీర్ణము 510 చ. మై. ఇందు 109 గ్రామములు కలవు. జనాభా
1,47,389. ఇందు పురుషుల సంఖ్య 75,326, స్త్రీల సంఖ్య 72,063. కడప పట్టణము జిల్లాకును, తాలూకాకును ముఖ్యస్థానము. ఇచ్చట మ్యునిసిపాలిటీ గలదు. పట్టణ జనసంఖ్య 37,438 (1951). 1570 సంవత్సరమున దీనిని నేక్ నామాబాదు అను పేరున నేక్ నాం ఖాన్ అను నతడు కట్టించెను, కొందరు దీనిని దయ యను వర్థ మిచ్చు "కృప” యను శబ్దముచే పిలుతురు. దీని కాధారము - ప్రాత కడప యనునది "కృప" యను పేరున క్రీ. పూ. రెండు శతాబ్దముల క్రిందట నుండినదని యందురు. 1890 లో ఈ పట్టణమునకు నీటి సదుపాయ మేర్పరచబడినది. 1902 లో కొళాయిలు ప్రారంభము చేయబడినవి.
హైస్కూళ్ళు, క్రైస్తవ మిషనరీలు నిర్వహించు సూళ్ళు కలవు. 1821 లో కడప కంటోన్మెంటు సైనిక స్థల
మయ్యెము, 1868 వరకు ఈ సేనానివాస ముండినది. ఆటు
480
సంగ్రహ ఆంధ్ర
తరువాత కంటోన్మెంటు బళ్ళారికి మార్చబడినది. కడప
నుంచి వ్యాపార స్థలము. చెన్నూరు, వల్లూరు, పుష్ప
గిరి, పెండ్లిమట్టి, చిన్న దాసరిపల్లె. చింతకొమ్మదిన్నె,
ఖాజీపేట, సుంకేసుల నంది మండలము పేర్కొనదగినవి.
ఇందు పురుషుల సంఖ్య 62,394, స్త్రీల సంఖ్య 59,883.
2. రాయచోటి తాలూకా : విస్తీర్ణము 1108 చ. మై.
ఇందు 119 గ్రామములు కలవు. జనాభా 1,90,172. ఇందు
పురుషుల సంఖ్య 98,499; స్త్రీల సంఖ్య 91,738, రాయ
చోటి పట్టణ జనసంఖ్య 10,655. (1951) రాయచోటికి
ప్రాచీన నామము “రాచవీటి." ఈ తాలూకాలో చుండు
పల్లె, లక్క రెడ్డిపల్లె, గాలివీడు, నూలివీడు, సానిపాయ,
వీరబల్లి, పంగిమళ్ళ, గడికోట, మట్ల, చిన్నమం డెము
పేర్కొనదగిన గ్రామములు.
3. కమలాపురము తాలూకా : విస్తీర్ణము 308 చ.మై,
85 గ్రామములు కలవు. జనాభా 75,588. ఇందు పురుషులు
సంఖ్య 38,670; స్త్రీల సంఖ్య 36,919. ఇందు పాలగిరి,
ఉప్పులూరు, అనిమెల, నిడుజువ్వి, ఎఱ్ఱగుంట్ల చేరినవి.
I
4. రాజంపేట తాలూకా : విస్తీర్ణము 1088 చ.మై.
128 గ్రామములుకలవు. జనాభా 1,85,942. ఇందు పురుషుల
సంఖ్య 95,607; లసంఖ్య 90,335. పుల్లంపేట, చిట్వేలు,
పొ త్తపి, కోడూరు, సెట్టగుంట, నందలూరు, పెద్దజీరంపాడు,
పెనగలూరు, టంగుటూరు పేర్కొనదగిన గ్రామములు.
5. సిద్ధవటము తాలూకా : విస్తీర్ణము 806 చ.మై,
గ్రామములు 80 కలవు, జనాభా 75, 704. ఇందు పురుషులు
'
సంఖ్య 38,958; స్త్రీల సంఖ్య 38,751. ఈ తాలూకాలో
ఒంటిమిట్ట మాధవరము, కురుగుంట్లపల్లి, కోటపాడు,
గీబుళము, కొండూరు, విప్పిరాల, గంగవేలూరు, 'పేర్కొన
దగిన గ్రామములు.
6. బద్వేలు తాలూకా : విస్తీర్ణము 757 చ. మై. 141
గ్రామములు కలవు. జనాభా 1,08,711. ఇందు పురుషుల
సంఖ్య 55,159; స్త్రీల సంఖ్య 58,552. బద్వేలు పట్టణ
జనసంఖ్య 7,085. ఈ తాలూకాలో పోరుమామిళ్ళ,
శంఖవరము, కలవపాడు, కొత్తకోట, మున్నెల్లి, పలుగు
రాళ్ళపల్లె పేర్కొనదగిన గ్రామములు.
7. జమ్ములమడుగు తాలూకా : విస్తీర్ణము 818 చ.మై.
125 గ్రామములు కలవు. జనాభా 1,22,277. ఇందు<noinclude><references/></noinclude>
9ekg4kfgbtdmaci4uty6hzojp7kulh8
569113
569110
2026-08-07T13:07:48Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569113
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కడప జిల్లా||సంగ్రహ ఆంధ్ర}}</noinclude>
లోబడు సమయమున ఆంగ్ల సైనికులు కీయవలసిన జీతములకు గాను కడప మండలము బ్రిటిష్ వారికి అర్పింపబడెను. (12-10-1800). ఇది మొదలు కడపమండలమునకు క్రొత్త శక మారంభమయ్యెను. బ్రిటిషు వారి తరువాత భారత జాతీయ ప్రభుత్వ భాగముగా ఆంధ్రరాష్ట్రములో నున్నది ఈ మండలము.
కడపజిల్లాలోని తొమ్మిది తాలూకాలు మూడు డివిజనులక్రింద విభజింపబడినవి. ప్రస్తుత కాలమున ఆంధ్ర
ప్రదేశ ప్రభుత్వము వారి ఆదేశానుసారము డివిజనులు.అందలి తాలూకాలు ఈ క్రింది విధముగా నుండును,
(23-5-1958)_
1. కడప డివిజన్- ఇందలి తాలుకాలు కడప, రాయచోటి, కమలాపురం అనునవి. ప్రధాన నగరము - కడప,
2. రాజంపేట డివిజన్ - ఇందలి తాలూకాలు రాజంపేట, సిద్ధవటము, బద్వేలు అనునవి. ప్రధాన నగరము - రాజంపేట.
3. జమ్ములమడుగు డివిజన్- ఇందలి తాలూకాలు జమ్ములమడుగు, ప్రొద్దుటూరు, పులివెందులు అనునవి.
ప్రధాన నగరము - జమ్ముల మడుగు.
'''1. కడప తాలూకా :''' ఈ తాలూకా విస్తీర్ణము 510 చ. మై. ఇందు 109 గ్రామములు కలవు. జనాభా
1,47,389. ఇందు పురుషుల సంఖ్య 75,326, స్త్రీల సంఖ్య 72,063. కడప పట్టణము జిల్లాకును, తాలూకాకును ముఖ్యస్థానము. ఇచ్చట మ్యునిసిపాలిటీ గలదు. పట్టణ జనసంఖ్య 37,438 (1951). 1570 సంవత్సరమున దీనిని నేక్ నామాబాదు అను పేరున నేక్ నాం ఖాన్ అను నతడు కట్టించెను, కొందరు దీనిని దయ యను వర్థ మిచ్చు "కృప” యను శబ్దముచే పిలుతురు. దీని కాధారము - ప్రాత కడప యనునది "కృప" యను పేరున క్రీ. పూ. రెండు శతాబ్దముల క్రిందట నుండినదని యందురు. 1890 లో ఈ పట్టణము నకు నీటి సదుపాయ మేర్పరచబడినది. 1902 లో కొళాయిలు ప్రారంభము చేయబడినవి. హైస్కూళ్ళు, క్రైస్తవ మిషనరీలు నిర్వహించు సూళ్ళు కలవు. 1821 లో కడప కంటోన్మెంటు సైనిక స్థలమయ్యెము, 1868 వరకు ఈ సేనానివాస ముండినది. ఆటు తరువాత కంటోన్మెంటు బళ్ళారికి మార్చబడినది. కడప మంచి వ్యాపార స్థలము. చెన్నూరు, వల్లూరు, పుష్పగిరి, పెండ్లిమట్టి, చిన్న దాసరిపల్లె. చింత కొమ్మదిన్నె, ఖాజీపేట, సుంకేసుల నంది మండలము పేర్కొనదగినవి. ఇందు పురుషుల సంఖ్య 62,394, స్త్రీల సంఖ్య 59,883.
'''2. రాయచోటి తాలూకా :''' విస్తీర్ణము 1103 చ. మై. ఇందు 119 గ్రామములు కలవు. జనాభా 1,90,172. ఇందు పురుషుల సంఖ్య 98,433; స్త్రీల సంఖ్య 91,739, రాయచోటి పట్టణ జనసంఖ్య 10,655. (1951) రాయచోటికి ప్రాచీన నామము “రాచవీటి." ఈ తాలూకాలో చుండుపల్లె, లక్క రెడ్డిపల్లె, గాలివీడు, నూలివీడు, సానిపాయ, వీరబల్లి, పంగిమళ్ళ, గడికోట, మట్ల, చిన్నమండెము పేర్కొనదగిన గ్రామములు.
'''3. కమలాపురము తాలూకా :''' విస్తీర్ణము 303 చ.మై, 65 గ్రామములు కలవు. జనాభా 75,588. ఇందు పురుషులు సంఖ్య 38,670; స్త్రీల సంఖ్య 36,918. ఇందు పాలగిరి, ఉప్పులూరు, అనిమెల, నిడుజువ్వి, ఎఱ్ఱగుంట్ల చేరినవి.
'''4. రాజంపేట తాలూకా :''' విస్తీర్ణము 1038 చ.మై. 128 గ్రామములుకలవు. జనాభా 1,85,942. ఇందు పురుషుల సంఖ్య 95,607; స్త్రీలసంఖ్య 90,335. పుల్లంపేట, చిట్వేలు, పొత్తపి, కోడూరు, సెట్టగుంట, నందలూరు, పెద్దజీరంపాడు, పెనగలూరు, టంగుటూరు పేర్కొనదగిన గ్రామములు.
'''5. సిద్ధవటము తాలూకా :''' విస్తీర్ణము 606 చ.మై, గ్రామములు 80 కలవు, జనాభా 75,704. ఇందు పురుషులు సంఖ్య 38,953; స్త్రీల సంఖ్య 36,751. ఈ తాలూకాలో ఒంటిమిట్ట మాధవరము, కురుగుంట్లపల్లి, కోటపాడు, గీబుళము, కొండూరు, విప్పిరాల, గంగవేలూరు, 'పేర్కొనదగిన గ్రామములు.
'''6. బద్వేలు తాలూకా :''' విస్తీర్ణము 757 చ. మై. 141 గ్రామములు కలవు. జనాభా 1,08,711. ఇందు పురుషుల సంఖ్య 55,159; స్త్రీల సంఖ్య 53,552. బద్వేలు పట్టణ జనసంఖ్య 7,085. ఈ తాలూకాలో పోరుమామిళ్ళ, శంఖవరము, కలవపాడు, కొత్తకోట, మున్నెల్లి, పలుగు రాళ్ళపల్లె పేర్కొనదగిన గ్రామములు.
'''7. జమ్ములమడుగు తాలూకా :''' విస్తీర్ణము 613 చ.మై. 125 గ్రామములు కలవు. జనాభా 1,22,277. ఇందు<noinclude><references/></noinclude>
mauwwh0k5qxhz8hhsqsv1t58ym1uwcg
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/542
104
154595
569117
448402
2026-08-07T13:28:46Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569117
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము -౨||కన్నడదేశ చరిత్ర - I}}</noinclude>
భ్రాతృవినాశ హేతువగు యుద్ధము మొదలయ్యెను. ధ్రువుడు గెలుపొందెను. వాని కొడుకు మూడవ గోవిందుడు
క్రీ. శ. 793 ప్రాంతమున సింహాసన మధిష్ఠించెను. అతడు దక్షిణోత్తరదిక్కులలో దండయాత్రల సాగించెను. ఉత్తర దండయాత్రలో గుజరాతు ప్రభువగు ప్రతిహారినాగభట్టును, పాలవంశ్యుడగు ధర్మపాలుని జయించి, ఇంకను ఉత్తరముగా పోయి హిమాలయ శృంగముపై “విజయ చిహ్నము"ను వ్రాయించెను. దక్షిణమున తన ఆగర్భ శత్రువులగు పల్లవులను అనేక యుద్ధములలో జయించి కడకు మాల్టేడునందలి రాష్ట్రకూట రాజునకు కప్పము చెల్లించునట్లేర్పాటుచేసెను. మూడవ గోవిందుని పెద్ద తమ్ముడు కంబుడు 12 మంది రాకుమారులతో కలిసి కుట్రపన్ని తిరుగుబాటు చేసెను. గోవిందుడా కుట్రదారుల నణచి తమ్ముని మించి గంగమండలమునకు
ఆతనిని అధికారిగా నియమించెను. చాళుక్యుల పరనానంతరము గాంగులు క్రొత్త ప్రభుత్వముతో సఖ్యము
క్రొత్త ప్రభుత్వముతో సఖ్యము చేసికొనలేకపోయిరి. తత్ఫలితముగా అమోఘవర్ష నృపతుంగుడు తన కూతురును బుతుగునికిచ్చువరకు గాంగులకు రాష్ట్రకూటులతో యుద్ధము సాగుచునే యుండెను. ఈ వివాహముతో వారి సంబంధ బాంధవ్యములు బలపడెను. మరికొన్ని వైవాహిక సంబంధములు ప్రవర్తిల్లెను. మూడవ గోవిందుని అనంతరము అతని కొడుకు అమోఘవర్షుడు క్రీ. శ. 814 లో రాజాయెను. పినతండ్రియగు కర్కరాజును, అనుభవజ్ఞుడు మంత్రియునగు పాటలమల్లుడును అమోఘవర్షునకు పరిపాలనము నందు తోడ్పడుచుండిరి. ఆతని పాలనము మొదట కొంత కాలము కల్లోలభరితమైయున్నను మొత్తముమీద ప్రశాంతముగా నున్నదని చెప్పవచ్చును. అతడు కవులను, పండితులను పోషించెను. స్వయముగ పండితుడయి యుండెను. ఆతని సుదీర్ఘ పాలన కాలమున జన సేన, గుణభద్ర, శాక టాయన మహావీరాచార్యాదులు విలసిల్లిరి. అతడు తన
ప్రజలకు కలుగనున్న ఆపదను నివారించుటకై తన ఎడమ చేతివ్రేలు నరకి మహాలక్ష్మికి అర్పించెనని ప్రతీతి కలదు.
జైనమతమునందు తనకు గల అభిమానము వలన మొదటి అమోఘవర్షుడు అనేక పర్యాయములు రాజ్య
త్యాగ మొనర్చెను. అతని తరువాత అతని కొడుకగు రెండవ కృష్ణుడు రాజై క్రీ.శ. 878 నుండి 912 వరకు
పాలించెను. ఇతడు కన్యాకుబ్జనగర పాలకులైన ఘూర్జర ప్రతీహారులతో యుద్ధములు చేసెను. నాగభట్టు మనుమడగు ఒకటవ భోజుని ఓడించెను. మహారాజాధిరాజగు కర్క రాజాధిపత్యమున లాటమండలాధిపత్యమును వహించిన ప్రథమ గుజరాత్ శాఖయులగు రాష్ట్ర కూటులను సమూలముగ నాశన మొనరించెను. మూడవ గోవిందుడు లాటమండల మందలి ఒక భాగమునుండి వీరిని తొలగించి తన సోదరుడగు మూడవ ఇంద్రరాజును రాజప్రతినిధిగా నియమించెను. రెండవ కృష్ణుని పాలనా కాలములోనే వారు సంపూర్ణముగ తరిమి వేయబడిరి.వారి దేశము రాష్ట్రకూట రాజ్యమున నంతర్భాగముగ జేయబడెను.
'''ఆంధ్ర గుజరాతు దేశములు (క్రీ.శ. 880):''' ప్రాచీన కాలమునుండియు గుజరాతు (లాటదేశము) కర్ణాట
రాజ్యపాలకులు క్రిందనే యుండెను. తన దిగ్విజయయాత్రానంతరము (క్రీ.శ. 610–611) రెండవపులకేశి లాటమండలమునకు తన తమ్ముడగు ధరాశ్రయ జయసింహ వర్మను అధిపతిగా నియమించెను. రాష్ట్ర కూటవంతిదుర్గుడు రాజగు వరకును అతని వంశస్థులు అచ్చట పాలించిరి. 8వ శతాబ్ది మధ్యభాగమున లాటదేశ చాళుక్యశాఖకు చెందిన అవని జనాశ్రయ పులకేశినో, వాని కొడుకువో అప్పటి గుజరాతు రాష్ట్రకూట రాజగు మహారాజాధిరాజ కర్మ రాజు ఓడించి ఖేటకముతోడి లాట దేశమాక్రమించి యుండును' (క్రీ. శ.758). తన ఉత్తర దిగ్విజయయాత్రలో మూడవ గోవిందుడు లాటదేశమును జయించి తన సోదరుడు మూడవ
ఇంద్రుని "టాటేశ్వర మండలాధిపతి"గా నియమించేను. లాటమండలమందలి హర్షపుర ప్రాంతమునకు కర్ణాటక దేశపు మహాసామంత ప్రచండుడు రాజప్రతినిధిగా నుండెను. తరువాత కొంతకాలమునకు మూడవ ఇంద్రుడు రెండవ గుజరాతు శాఖను స్థాపించగా ఈ రాజ్యము ఆతని క్రిందికి పోయియుండును. వారు కర్ణాటకమునే మాతృభూమినిగా నెంచుచుండిరి. పారమారముంజుడు రాజగువరకు అనగా ప్రధాన రాష్ట్ర కూటశాఖ పతనమగువరకు ఇచే పాగెను. రాజ్యము రెండవతైలుని అధీనము కాగా అతడు ముంజుని
నిర్మూలించెను (క్రీ. శ. 973). అన్హిలవాడ చాళుక్యులకు<noinclude><references/></noinclude>
bjtld2tt193wqb9g407pdzl6udlli54
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/543
104
154596
569119
448403
2026-08-07T13:50:47Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569119
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కన్నడదేశ చరిత్ర - I|సంగ్రహ ఆంధ్ర}}</noinclude>
మూలపురుషుడగు మూలరాజు, రెండవ తైలుని ప్రతినిధి యగు బరప్పను చంపి, లాట దేశము నాక్రమించెను.
అప్పటినుండి 12వ శతాబ్దమున, ఉత్తరము నుండి మహమ్మదీయ దండయాత్రలు హిందూ సామ్రాజ్యములను
ముంచేత్తువరకు ప్రాచీన బాదామి చాళుక్యుల గుజరాతు శాఖీయులగు పారమారులకును, దేవగిరి యాదవుల కును లాటదేశము సామంతరాజ్యముగ నుండెను. ఇట్లు గుజరాతు నందు 5 శతాబ్దముల కాలము (7-12 క్రీ.శ. మధ్య) రాజకీయ భద్రతకును సాంస్కృతికోన్నతికిని కర్ణాట దేశము కారణమాయెను. అట్లే తూర్పు చాళుక్యవంశ
మును వేంగినాట నిలిపి శోషించుచున్న ఆంధ్రదేశమునకు అది పుష్టిని కలిగించెను.
రెండవకృష్ణుని యనంతరము ఆతని మనమడు మూడవ ఇంద్రుడు క్రీ. శ. 912 లో రాష్ట్రకూట సింహాసన మాక్రమించెను. ఈ వంశమున లబ్ధప్రతిష్ఠుడైన మరియొక రాజు మూడవకృష్ణుడు. ఇతడు క్రీ. శ. 939-940 లో సింహాసన మెక్కెను. ఇతడు ఉత్తరమునకు దండెత్తి మధ్యభారత మందలి మైహార సంస్థానమందలి జురా అనుచోట తన దండయాత్రల ప్రశస్తిని, బిరుదావళిని అచ్చపు కన్నడ లిపిలో వ్రాసి ప్రకటించుకొనెను. అది ఆతని ఉత్తర దిగ్విజయయాత్రకు ప్రబల నిదర్శనము. అతడు దక్షిణమున తక్కోలము యుద్ధమున రాజాదిత్యుని చంపి చోళదేశము (తొండై మండలము) నాక్రమించి అనేక సంవత్సరము లేలేను. ఆతని పాలనము రాజ్య విస్తృతియందును, కళాపోషణమునందును ప్రసిద్ధి వహించెను. ఆతని పాలనా కాలమున రాష్ట్రకూట రాజ్యము ఉత్తరమున చేది రాజ్యము (మధ్యభారతము) వరకును, పడమట ఖేటక మండలము (గుజరాతు) వరకును, దక్షిణమున తొండై మండలము (తంజావూరు) వరకును, తూర్పున వేంగి రాజ్యము (కృష్ణా గుంటూరు జిల్లాలు) వరకును వ్యాపించెను. అంతటి విశాల సామ్రాజ్యమును అతడు పాళియగాండ్ర యొక్కయు, ప్రతినిధుల యొక్కయు సహాయమున పాలించెను. తలకాడు గాంగులు అతని విశ్వాసపాత్రులైన సేవకులు. వారి రాజగు బుడుగునకు మూడవ కృష్ణుడు తన చెల్లెలు 'రేవక నిమ్మడి' నిచ్చెను. బుతుగుడు
తన భానకు ఉత్తర రక్షిణ దండయాత్రలలో సాయముచేసి ఘనమగు నిధులతో అతని బొక్కసమును నింపెను.
మూడవ కృష్ణుని మనుమడుగు రాచమల్లు కాలమున బాహుబలి యొక్క బృహద్విగ్రహమును శ్రావణ బెళ్లోలా
వద్ద చాముండరాయ పురాణకర్తయగు చాముండుడు ప్రతిష్ఠించెను.
'''కల్యాణిచాళుక్యుల ప్రాలనలో కర్ణాటక ప్రాబల్యము :''' పశ్చిమ చాళుక్యరాజ కుమారుడగు రెండవ తైలుడు
మూడవకృష్ణుని ప్రతినిధి. ఇతడు బిజాపూరును పాలించెడివాడు. మూడవకృష్ణుని తమ్ముడగు కక్కాలుని దుర్భల పాలనాకాలమున రెండవ తైలుడు స్వాతంత్య్రమును ప్రకటించెను. ఈతడు కక్కాలుని, పారమార ముంజుని, గాంగపొంచాలుని నాశనమొనరించి రాష్ట్రకూట రాజ్యము నాక్రమించెను. పారమారులు శియకహర్షుని ఆధిపత్యమున మాన్యఖేటముపై దండెత్తి కళ్కాలుని పూర్వపాలకుడగు కొట్టిగుని పాలనాకాలమున లాట మండలము నాక్రమించిరి. తుదకది రాష్ట్రకూటుల వశమయ్యెను. ఇట్లు 220 సంవత్సరములు వైభవోపేతముగ రాజ్యపాలనము కావించి రాష్ట్రకూటులు దక్కను కర్ణాటక రాజకీయ రంగము నుండి అంతర్ధాన మొందిరి.
క్రీ. శ. 10 వ శతాబ్దపు తుది భాగమున ప్రాత ప్రభుత్వములు మాయమయ్యెను. కర్ణాటక మండలి రాజకీయ
వ్యవస్థయందును, ఆర్థిక మత జీవితములందును, పునరుజ్జీవనము కలిగెను. వీలైనంతవరకు గెల్చిన మండలములలో పాళియగాండ్రను నియమించు పద్ధతి తొలగింపబడెను. పరిపాలనా సౌకర్యార్థము దేశవిభాగములు పునర్వ్యవస్థీకరింపబడెను. ఒక విభాగమునుండి మరియొక విభాగమునకు బదిలీ యొనర్పదగు పద్ధతిపై సామంతులను రాజు నియమించెను. రాణులకు, రాజకుమారులకు రాజకీయములలో అనుభవ పూర్వకమయిన శిక్షణము నిప్పించి రాజు వారిని ఒక్కొక్క ప్రాంతమున శాంతిభద్రతలను నెలకొల్పుటకై
అధికారులనుగా నియమించెను.
కల్యాణి చాళుక్యులకు ప్రబల శత్రువులు తంజావూరు చోళులు. వీరు పల్లవుల చోళికావిషయమును లేక తొండ
మండలమును 9 వ శతాబ్ది చివరిభాగమున ఆక్రమించిరి. చాళుక్యులు, చోళులు ఒకరితో నొకరు తరచుగ యుద్ధములు చేయుచు ఒకరి భూభాగములపై మరొకరు<noinclude><references/></noinclude>
m4a74b51cxvq150r8hr2kjkdy5tm6xj
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/544
104
154597
569139
448404
2026-08-07T15:58:26Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569139
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||కన్నడదేశ చరిత్ర - 1}}</noinclude>
దండెత్తుచుండిరి. క్రొత్తగా జయించిన రాజ్యమున శాంతిని నెలకొల్పుటకై, రెండవ జైలుడు, కల్లోలపరచు
చున్న కరహాట, కొంకణ, మాల్వప్రభృతి ప్రభుత్వములను అణచివైచెను. ఇతని కుమారుడు ఇరివబెడంగ సత్యాశ్రయుడు కొంకణదేశ ప్రభువగు అపరాదిత్యుని ఓడించెను. ఇతని పాలనమున చోళరాజగు రాజరాజుతొ అనేక యుద్ధములు జరిగెను. రాజరాజు నవలక్షా సంఖ్యాకమగు సైన్యముతో బిజాపూరు జిల్లా గోనూరువరకు సాగెను. చాళుక్య రాజ్యము యొక్క సరిహద్దును దాటకుండ సత్యాశ్రయుడు వేంగిరాజ సైన్యములకు నేతయై ఈతని నిరోధించెను. కల్యాణీ చాళుక్యుల కాలములో చాళుక్యులకును చోళులకును ఎడ తెగని వైరము సాగుచుండెను. ఇందు చోళులే కలహకారకులై ఎట్లైనను తమ శాత్రపచాళుక్య కుటుంబమున భేదములు కల్పింప ప్రయత్నించుచుండిరి. ఐదవ విక్రమాదిత్యుడు, రెండవ జయసింహుడు, మొదటి సోమేశ్వరుడు, చోళుల బలప్రవాహోద్ధతి సరికట్టవలసి వచ్చెను. చోళరాజు (రాజాధిరాజు) కోప్పం యుద్ధమున చంపబడెను. ఒకటవ సోమేశ్వరుని యనంతరము రాజైన రెండవ సోమేశ్వర భువనైకమల్లుడు తన సోదరుడగు విక్రమేంద్ర వర్మతో విరోధించి తన ఓటమిని ఒప్పుకొని రాజ్యమును పంచుకొనెను. ఆరవ త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు చోళచాళుక్య రాజకీయములలో పాల్గొనుటే కాక తూర్పున గుంటూరుజిల్లా వరకును, ఉత్తరమున నాగపూరు వరకును చాళుక్య రాజ్యమును వ్యాపింప చేసెను శాలివాహన శకమును త్రోసిరాజని చాళుక్య విక్రమశకమును ప్రారంభించిన దితడే. ఈ శకము ఒక వంద సంవత్సరములు కర్ణాటకమునందేకాక విక్రమాదిత్యుని ప్రాబల్యముకల ఇతర రాజ్యములందును వాడుకలో నుండెను. ఆరవ విక్రమాదిత్యుని సుదీర్ఘ పరిపాలనము
చోళులతోడను వేంగి చాళుక్యులతోడను యుద్ధములు చేయుటతోడనే గడచిపోయినది. ఈతని కాలమున పాళియ గాండ్రుగానున్న కాలచుర్యులు, హోయిసలులు, యాదవులు, కాకతీయులు, పరిసర రాజ్యములలో యుద్ధములు చేయుచు, స్థిరపడి కడకు కేంద్ర ప్రభుత్వము బలహీనమై పతనోన్ముఖమగుచున్న కాలమున స్వతంత్ర రాజ్యములనే స్థాపించుకొనిరి.
'''కాలచుర్య యాదవ హోయసలుల స్వతంత్ర రాజ్య స్థాపనము :''' క్రీ.శ. 1163 ప్రాంతమున కాలచుర్య రొట్టెలునిచే చాళుక్య ప్రభుత్వము కూలద్రోయబడెను. ఇతని వంశమువారు 20 సం. లు సింహాసనము నాక్రమించిరి. తరువాత నాలుగవ వీర సోమేశ్వరశర్మ, కొలదికాలము పాటు చాళుక్య ప్రభుత్వమును పునరుద్ధరించెను. కాని ఆ వెంటనే హోయిసల, యాదవ, కాకతీయరాజ్యము లేర్పడెను. ఇట్లు 12వ శతాబ్ది చివరిభాగమున దక్కను కర్ణాటకములలో క్రొత్త రాజ్యములు తలలెత్తి నిరంతర యుద్ధములకు దారితీసెను,
కల్యాణీ చాళుక్యుల యుగము పునరుజ్జీవనమునకును, సంస్కరణమునకును ప్రసిద్ధమైనదనవచ్చును. వీరికి పూర్వ మందున్న రాష్ట్రకూటులు, గాంగులు జైనమతాను యాయులు. వీరుమాత్రము వైదిక పౌరాణిక మతసంప్రదాయానుయాయులై దానిని పునరుద్ధరించుటకై శిల్పమును, చిత్రకళను ప్రోత్సహించిరి. అసంఖ్యాకములయిన శివ కేశవాలయములను నిర్మించిరి. వాటి శిల్పపురీతి ప్రత్యేకమై, విశిష్టమైన చాళుక్యరీతియని భారతీయ శిల్ప రీతులలో ప్రసిద్ధి గాంచెను.
చాళుక్యులు గొప్ప భాషాపోషకులై విలసిల్లిరి. వారు కవులకు, పండితులకు భూరిదానములు చేసిరి. పంపకవి
చాళుక్య రెండవ అరికేసరి ఆస్థానకవి. పొన్నకవి రాష్ట్రకూట మూడవ కృష్ణుని ఆస్థానకవి. రన్న కవి రెండవ
రన్నకవి రైలుని ఆస్థానము నలంకరించెను. వాగవర్మ, దుర్గా సింహుడు, చంద్రరాజు మొదలగు కవులు రెండవ జయ సింహుని కాలమున వర్ధిల్లిరి. ఆరవ విక్రమాదిత్యుడు బిల్హణుడను కవిని, విజ్ఞానేశ్వరుడను స్మృతివ్యాఖ్యాతను పోషించెను. ఆతని తరువాత మూడవ సోమేశ్వరుడు ప్రఖ్యాత పండితుడై అభిలషి కార్థ చింతామణి అను విజ్ఞాన కోశమును రచించెను.
బసవేశ్వరుని ఆధిపత్యమున నెలకొల్పబడిన వీరశైవ మతమునకు కాలచుర్యులు పోషకులు. ఇది కర్ణాటక మందలి మత, శాత్త్విక వాఙ్మయమున ఒక క్రొత్త పంథ త్రొక్కినది. నూతనవచనశైలిలో గ్రంథరచనముచేసి, కులవర్ణ వివక్షత లేక సామాన్య ప్రజలకు అంద జేయుట, శివభక్తి ప్రచారము అనునవి ఈ పునరుజ్జీవనము యొక్క ముఖ్యలక్షణములు.<noinclude><references/></noinclude>
9nad3pet5mzlxg7rvp5zi8wwu0gd0l4
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/545
104
154598
569140
448405
2026-08-07T16:12:18Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569140
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కన్నడదేశ చరిత్ర - I||సంగ్రహ ఆంధ్ర}}</noinclude>
ఒకటవ చాళుక్య సోమేశ్వరుని యొక్కయు, ఆరవ విక్రమాదిత్యుని యొక్కయు కాలములలో ప్రబల సామంతు
లుగా నుండిన దేవగిరి యాదవులు క్రీ. శ. 1187-91 మధ్య ఖిల్లముని నాయకత్వమున కృష్ణకు ఉత్తరమున స్వతంత్రులైరి. హోయసలులు తుంగభద్రకు దక్షిణప్రాంతమును ఆక్రమించిరి. కృష్ణా తుంగభద్రలకు మధ్యభూభాగమును ఆక్రమించుటకై చాళుక్యులకు, యాదవులకు ఎడ తెగని యుద్ధములు జరుగుచునే యుండెను. ఇట్టి యుద్ధములలో నొకటగు సోర్ తూర్ యుద్ధమున హోయిసల రెండవ వీరథల్లాలుడు భిల్లముని పారద్రోలెను. హోయసల వంశములోనివాడగు సింహణుడు మిక్కిలి ప్రబలుడై హోయసల రాజ్యము దక్షిణమున షిమోగా జిల్లావరకు చొచ్చుకొనిపోవునట్లును, తూర్పున కాయస్థ చోళ సామంతులు లోబడునట్లును, గుజరాత్ రాజగు లావణ్య ప్రసాదు సంధి కొడబడునట్లును చేసెను (క్రీ.శ. 1231). ఈ వంశ
వైభవము కృష్ణుడు, మహాదేవుడు అనువారి పరిపాలనలో ఇతోధికముగా విలసిల్లెను.
'''మహమ్మదీయ దండయాత్రలు:''' మహాదేవుని పరిపాలనలొ శ్రీ మధ్వాచార్యులు ద్వైత భావముకల విష్ణుభక్తిని ప్రబోధించెను. దీనితో ప్రజలకు జీవితముపై గల దృక్పథము మారెను. అయనను, ఐహిక భోగపరాయణత్వము బలవత్తరము కాజొచ్చెను. రామచంద్రుని పరిపాలనా కాలమున అల్లాఉద్దీన్ ఖిల్జీ యొక్క సేనానియగు మాలిక్ కాఫర్ అనువాని దండయాత్రల ఫలితముగా రాజ్యము విచ్ఛిన్నమైపోయెను. ఇట్లే హోయిసలు కాకతీయ రాజ్యములును మహమ్మదీయ దండయాత్రలవలన ఛిన్నా భిన్నములై పోయెను.
దీనితో దక్షిణ హిందూస్థానమంతయు అల్లకల్లోలమై, అవ్యవస్థితముగ నుండెను.
విష్ణువర్ధనుడు, రెండవ వీరభల్లాలుడు, మూడవ భల్లాలుడు మొదలగువారి విజయపరంపరల మూలమునను, వైష్ణవమతాచార్యుడయిన శ్రీరామానుజస్వామి వారి ప్రచారము మూలమునను హోయసలవంళము
ప్రసిద్ధమయ్యేను. వీరికాలమున విశిష్టాద్వైతము కర్ణాట తమిళదేశములందు' ప్రచారము గాంచెను. బేలూరు
సమీపమున హలెబీడువద్దగల దేవాలయ శిల్పము హోయిసల శిల్పరీతి యనబరగేను. వైష్ణవకవి రుద్రభట్టు రెండవ వీరభల్లాలునకు ఆశ్రితుడు.
పైన పేర్కొనబడినట్లు యాదవులు హోయసలులతో తలపడి ఉత్తర మైసూరువరకు షిమోగావైపునకు చొచ్చు
కొనిపోగా హోయిసలులు మూడవ భల్లాలుని కాలమున తూర్పున అనంతపురమువరకు తమ రాజ్యపు సరిహద్దును నిలుపుకొనగలిగిరి. ఇట్లే ఓరుగల్లు కాకతీయులు యాదవులతోను, హోయిసలులతోను తరచుగ యుద్ధములు సాగించిరి. ఈ యుద్ధములు దక్కనులోని హిందూ ప్రభువుల సామర్థ్యమును కుంఠిత మొనర్చెను. కావుననే దండెత్తుచున్న మహమ్మదీయులకు దక్షిణాపథమంతయు ఒక్కసారిగా వశమయ్యెను.
'''విజయనగర సామ్రాజ్య స్థాపనము:''' మహమ్మదీయ అధికారులు ఢిల్లీలోని కేంద్రప్రభుత్వమును ధిక్కరించుటతో హిందూరాజ్య స్థాపనమునకు అనుకూల వాతావరణము ఏర్పడెను. సంగముని కొడుకు లిద్దరు హుక్క (హరిహర 1) రాయలు, బుక్కరాయలు I అనువారు కుమ్మటి దుర్గము యొక్క పాలకుడగు కంపిలి రాయని యెద్ద రాజోద్యోగులుగా నుండి కంపిలదేవుని పతనానంతరము రాజ్యమునకు స్వతంత్ర పాలకులమని ప్రకటించుకొనిరి. మొదట వీరి రాజ్యము కంపిలి రాజ్యమునకు పరిమితమయ్యు కాలక్రమమున 14 వ శతాబ్దమున దక్కనునందేర్పడిన మహమ్మదీయ రాజ్యములు తప్ప మూడు సముద్రముల మధ్యగత దేశమంతటను వ్యాపించెను. విజయనగర సామ్రాజ్యమును 300 సంవత్సరములు సంగమ వంశము, సాళువ వంశము, తుళువ వంశము, ఆరవీడు వంశము పరిపాలించెను. మొదటి వంశములోని రెండవ దేవరాయల (1426.1446) కాలమున ఈ రాజ్యము తెలుగు తమిళ దేశములలో విశేషముగా వ్యాపించెను. దాని వైభవము అత్యుత్తమస్థాయి నందుకొనెను. కృష్ణ దేవరాయల (1509 - 1530) అజేయమైన ప్రభుత్వము దక్షిణభారతమున గుర్తింపబడువరకు ఈ విజయపరంపర సాగుచునే యుండెను. కృష్ణదేవరాయల తమిళోత్కల దండయాత్రలను గూర్చి దేవాలయముల మూలమునను, దేవతల కిచ్చిన దానముల మూలమునను మనకు తెలియుచున్నది.<noinclude><references/></noinclude>
p67ga6fzkz916g9qybdn0zbrjihb77k
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/546
104
154599
569141
448406
2026-08-07T16:29:45Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569141
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨|కన్నడదేశ చరిత్ర - II}}</noinclude><section begin="546A" />మొదటి పంగము శైవమువైపు మొగ్గు చూపెను. సాళువ, తుళువ వంశములకు వైష్ణవమువైపే చూపు
ప్రసరించేను. మధ్వమతాచార్యులగు శ్రీ వ్యాసతీర్ణులు వీరనరసింహ, కృష్ణదేవరాయ, అచ్యుతదేవరాయ ప్రభు
పులకు రాజగురువైనట్లు తెలియుచున్నది.
వీరశైవయోగుల వచనములవలె వైష్ణవదాసుల గీతములును వాఙ్మయమున క్రొత్తపుంతలు త్రొక్కెను. బాదామి కల్యాణిచాళుక్యులవలెనే తుళువ వంశపు రాజులు కూడ పురాణ ప్రసిద్ధములయిన విఠల, కృష్ణ, రంగనాథ,
శేషశాయి ప్రభృతి విష్ణుదేవతారాధనము నుద్ధరించిరి. పురందరదాసు, కనకదాసు మొదలగువారు దాసకూట
మునకు చెందిన వైష్ణవస్వాములు. వీరు దేశీయ కర్ణాటక సంగీతమును పునరుద్ధరించి తమ ప్రతిభచే మెరుగులు దిద్దిరి.
రామరాయల ఆధిపత్యమున అత్యంతో దశ ననుభవించిన విజయనగర సామ్రాజ్యము కొలది కాలములోనే
దక్కను సుల్తానుల కలయికవలన దుర్బలమై రక్షసతంగడి యుద్ధమున (1565) ఛిన్నాభిన్నమైపోయెను. విజయనగరమున రాజ్యమేలుట అసాధ్యమని గ్రహించిన రామరాజు యొక్క సోదరుడగు తిరుమలరాయలు పెనుగొండకు మరలెను. ఈ వంశపు వారసులు మహమ్మదీయ దండ యాత్రా సంక్షోభమునుండి తెప్పరిలి చంద్రగిరినుండి పాలించిరి. ఇచ్చటినుండియే శ్రీరంగరాజు ఇంగ్లీషు వారికి మద్రాసు ప్రాంతమును దత్తము చేసెను (1639). ఈ శ్రీరంగరాయల మరణముతో విజయనగర సామ్రాజ్యము అస్తమించెను (1680).
తురుష్కుల దాడులనుండి దేశమును రక్షించుటకు శివాజీ ఆధిపత్యమున మహారాష్ట్ర రాజ్యము స్థాపింపబడెను.
ఇది ఉత్తర కర్ణాటకమునందలి అధిక భాగము నాక్రమించి యుండెను. వారితరువాత నేలిన బ్రాహ్మణ మంత్రులగు పీష్వాలు కర్ణాటక ప్రభువుల సైనికబలము నాధారముగా చేసికొని సామ్రాజ్యము వృద్ధిగావించిరి. కాని మొదట వ్యాపారస్థులుగా దేశమునందు ప్రవేశించి, పిదప రాజకీయములలో పాల్గొనిన పాశ్చాత్యుల మూలమున కడకు బ్రిటీషు పరిపాలనము మిగిలిన భారత దేశమందువలెనే కర్ణాటకమునందు కూడ స్థిరపడేను.
'''ఉపసంహారము :''' పరిపాలనా వ్యవస్థయందు రాజులు "త్రిభోహాథ్యంక కాసిద్ధి" ననుసరించి పాలించినట్లు వర్ణింపబడినది. అనగా వారు తమ రాజ్యాదాయమును విద్యావ్యాప్తికొరకును, దేవాలయము లందలి దేవతా పూజాభివృద్ధి కొరకును. ప్రజల సౌఖ్యసంపాదనము కొరకును వినియోగించిరి. ఆదాయములో ఆరవవంతును రాజులు సొంతమునకు ఉపయోగించుకొనేడివారు. గ్రామము బలవత్తరమైన ప్రాతిపదిక. అచటనే పరిపాలనావిధానము కేంద్రీకృతమైనది. కొన్ని గ్రామముల సముదాయము మహాగ్రామమని వ్యవహరింపబడెను. ఇట్లే విషయము, నాడు, మహానాడు, మండలము అను దేశవిభాగము లుండెను. నాడు, మహానాడు అమనవి రాష్ట్రకము, మహారాష్ట్రకము అని వ్యవహరింపబడుచుండెడివి. భారతీయ సంపదను సంరక్షించు వర్తకసంఘములే గ్రామ వ్యాపారమును నిర్వహించెడివి. ఇవియన్నియు బిజాపూరు జిల్లాలోని ఐహో లెనందున్న కేంద్ర వర్తక సంఘమునకు అనుబంధ సంఘములుగా నుండెను. ఆ కేంద్రసంఘమున
ఏనూరు సభ్యులు ఉండేడివారు. వారి శాసనము తెలుగు, తమిళనాడులందంతటను చెల్లుబడి యగుచుండెను. వర్తక కేంద్రమునకు నఖరము లేక నగరము అని పేరు. వారిచే నిర్మింపబడు ఆలయములకు నగరేశ్వరాలయము లని పేరు. ఉరోదేయుడను రాజప్రతినిధి కాక, మహాజనులను సభ్యులుకల గ్రామపాలక సంఘము లుండెడివి.
{{right|చి.దా.శా}}
<section end="546A" />
<section begin="546B" />'''కన్నడదేశ చరిత్ర - II :'''
'''మైసూరు ఒడయరులు:''' మైసూరునగరమునకు కొంచెము దూరములో "హదినాడు" అను గ్రామ ముండెను. ఆ గ్రామ ప్రభువునకు మెదడు చెడినందున దేశము వదలి పోయెను. ఈ రాజున కొక్క కుమారిత యుండెను. ఆ రాజకుమారిని పెండ్లియాడి ఆ రాజ్యమును కబళింపవలెనని కారుగహళ్ళి గ్రామ ప్రభువునకు సంకల్పము కలిగెను. కాని కారుగహళ్ళి ప్రభువు హీనజాతివాడగుటచే హదినాడు వారు తమ కన్యను అతనికిచ్చి పెండ్లి చేయుటకు సమ్మతింపకుండిరి. అయినను, కారుగహళ్ళి ప్రభువు బలవంతుడగుటచే విధిలేక ఆతని కోరికకు సమ్మతించిరి.
<section end="546B" /><noinclude><references/></noinclude>
otiy4stvgqx7y91m1hawuuqu7570vqy
569142
569141
2026-08-07T16:30:14Z
A.Murali
3019
569142
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||కన్నడదేశ చరిత్ర - II}}</noinclude><section begin="546A" />మొదటి పంగము శైవమువైపు మొగ్గు చూపెను. సాళువ, తుళువ వంశములకు వైష్ణవమువైపే చూపు
ప్రసరించేను. మధ్వమతాచార్యులగు శ్రీ వ్యాసతీర్ణులు వీరనరసింహ, కృష్ణదేవరాయ, అచ్యుతదేవరాయ ప్రభు
పులకు రాజగురువైనట్లు తెలియుచున్నది.
వీరశైవయోగుల వచనములవలె వైష్ణవదాసుల గీతములును వాఙ్మయమున క్రొత్తపుంతలు త్రొక్కెను. బాదామి కల్యాణిచాళుక్యులవలెనే తుళువ వంశపు రాజులు కూడ పురాణ ప్రసిద్ధములయిన విఠల, కృష్ణ, రంగనాథ,
శేషశాయి ప్రభృతి విష్ణుదేవతారాధనము నుద్ధరించిరి. పురందరదాసు, కనకదాసు మొదలగువారు దాసకూట
మునకు చెందిన వైష్ణవస్వాములు. వీరు దేశీయ కర్ణాటక సంగీతమును పునరుద్ధరించి తమ ప్రతిభచే మెరుగులు దిద్దిరి.
రామరాయల ఆధిపత్యమున అత్యంతో దశ ననుభవించిన విజయనగర సామ్రాజ్యము కొలది కాలములోనే
దక్కను సుల్తానుల కలయికవలన దుర్బలమై రక్షసతంగడి యుద్ధమున (1565) ఛిన్నాభిన్నమైపోయెను. విజయనగరమున రాజ్యమేలుట అసాధ్యమని గ్రహించిన రామరాజు యొక్క సోదరుడగు తిరుమలరాయలు పెనుగొండకు మరలెను. ఈ వంశపు వారసులు మహమ్మదీయ దండ యాత్రా సంక్షోభమునుండి తెప్పరిలి చంద్రగిరినుండి పాలించిరి. ఇచ్చటినుండియే శ్రీరంగరాజు ఇంగ్లీషు వారికి మద్రాసు ప్రాంతమును దత్తము చేసెను (1639). ఈ శ్రీరంగరాయల మరణముతో విజయనగర సామ్రాజ్యము అస్తమించెను (1680).
తురుష్కుల దాడులనుండి దేశమును రక్షించుటకు శివాజీ ఆధిపత్యమున మహారాష్ట్ర రాజ్యము స్థాపింపబడెను.
ఇది ఉత్తర కర్ణాటకమునందలి అధిక భాగము నాక్రమించి యుండెను. వారితరువాత నేలిన బ్రాహ్మణ మంత్రులగు పీష్వాలు కర్ణాటక ప్రభువుల సైనికబలము నాధారముగా చేసికొని సామ్రాజ్యము వృద్ధిగావించిరి. కాని మొదట వ్యాపారస్థులుగా దేశమునందు ప్రవేశించి, పిదప రాజకీయములలో పాల్గొనిన పాశ్చాత్యుల మూలమున కడకు బ్రిటీషు పరిపాలనము మిగిలిన భారత దేశమందువలెనే కర్ణాటకమునందు కూడ స్థిరపడేను.
'''ఉపసంహారము :''' పరిపాలనా వ్యవస్థయందు రాజులు "త్రిభోహాథ్యంక కాసిద్ధి" ననుసరించి పాలించినట్లు వర్ణింపబడినది. అనగా వారు తమ రాజ్యాదాయమును విద్యావ్యాప్తికొరకును, దేవాలయము లందలి దేవతా పూజాభివృద్ధి కొరకును. ప్రజల సౌఖ్యసంపాదనము కొరకును వినియోగించిరి. ఆదాయములో ఆరవవంతును రాజులు సొంతమునకు ఉపయోగించుకొనేడివారు. గ్రామము బలవత్తరమైన ప్రాతిపదిక. అచటనే పరిపాలనావిధానము కేంద్రీకృతమైనది. కొన్ని గ్రామముల సముదాయము మహాగ్రామమని వ్యవహరింపబడెను. ఇట్లే విషయము, నాడు, మహానాడు, మండలము అను దేశవిభాగము లుండెను. నాడు, మహానాడు అమనవి రాష్ట్రకము, మహారాష్ట్రకము అని వ్యవహరింపబడుచుండెడివి. భారతీయ సంపదను సంరక్షించు వర్తకసంఘములే గ్రామ వ్యాపారమును నిర్వహించెడివి. ఇవియన్నియు బిజాపూరు జిల్లాలోని ఐహో లెనందున్న కేంద్ర వర్తక సంఘమునకు అనుబంధ సంఘములుగా నుండెను. ఆ కేంద్రసంఘమున
ఏనూరు సభ్యులు ఉండేడివారు. వారి శాసనము తెలుగు, తమిళనాడులందంతటను చెల్లుబడి యగుచుండెను. వర్తక కేంద్రమునకు నఖరము లేక నగరము అని పేరు. వారిచే నిర్మింపబడు ఆలయములకు నగరేశ్వరాలయము లని పేరు. ఉరోదేయుడను రాజప్రతినిధి కాక, మహాజనులను సభ్యులుకల గ్రామపాలక సంఘము లుండెడివి.
{{right|చి.దా.శా}}
<section end="546A" />
<section begin="546B" />'''కన్నడదేశ చరిత్ర - II :'''
'''మైసూరు ఒడయరులు:''' మైసూరునగరమునకు కొంచెము దూరములో "హదినాడు" అను గ్రామ ముండెను. ఆ గ్రామ ప్రభువునకు మెదడు చెడినందున దేశము వదలి పోయెను. ఈ రాజున కొక్క కుమారిత యుండెను. ఆ రాజకుమారిని పెండ్లియాడి ఆ రాజ్యమును కబళింపవలెనని కారుగహళ్ళి గ్రామ ప్రభువునకు సంకల్పము కలిగెను. కాని కారుగహళ్ళి ప్రభువు హీనజాతివాడగుటచే హదినాడు వారు తమ కన్యను అతనికిచ్చి పెండ్లి చేయుటకు సమ్మతింపకుండిరి. అయినను, కారుగహళ్ళి ప్రభువు బలవంతుడగుటచే విధిలేక ఆతని కోరికకు సమ్మతించిరి.
<section end="546B" /><noinclude><references/></noinclude>
79c936r1q63jfr3u8vtfabtd1qrhw1s
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/547
104
154600
569148
448407
2026-08-07T16:45:39Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569148
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కన్నడదేశ చరిత్ర - II||సంగ్రహ ఆంధ్ర}}</noinclude>
{{Css image crop
|Image = Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf
|Page = 547
|bSize = 600
|cWidth = 242
|cHeight = 343
|oTop = 124
|oLeft = 43
|Location = center
|Description =
}}
ఇట్టి సమయమున విజయుడు, కృష్ణుడు అను ఇద్దరు సోదరులు హదినాడునం దుండుట తటస్థించెను. వీరిద్దరు యదు వంశజులు. ద్వారక నుండి బయలుదేరి, దక్షిణమున నొక రాజ్య మేర్పరుచుకొనవలయు నని సంచారము చేయుచు హదినాడు వచ్చియుండిరి. ఈ సోదరులు హదినాడువారు తమ రాజకుమారి వివాహ విషయములో పడుచున్న దుర్భర పరిస్థితిని గమనించిరి. అంత సోదరు లిద్దరు హదినాడువారికి ధైర్యము పురిగొల్పి, వారికి సాయము చేయుదుమని బాసట చేసిరి. వారు కారుగహళ్ళి ప్రభువుపై దండెత్తి, వానిని మడియించిరి. విషమసమయములో సహాయముచేసి తమ వంశ గౌరవమును కాపొడినందులకు రాజపుత్రిక కృతజ్ఞురాలై, సోదరులలో పెద్దవాడగు విజయుని వరించెను. హదినాడు, కారుగహళ్ళి అను రెండును విజయుని స్వాధీనమయ్యెను. అప్పుడతడు "ఒడయరు" అను బిరుదు వహించెను. విజయుడే మైసూరు
ఒడయరు రాజవంశమునకు మూలపురుషు డయ్యెను (క్రీ.శ.1399). ఈ మైసూరు రాజ్యము సహ్యపర్వతము
లకును, కావేరినదికిని మధ్యగల ఎత్తయిన పీఠభూమిలో వర్థిల్లినది.
ఈ ఒడయరు రాజవంశమునందు 25 గురు క్రీ.శ. 1309 మొదలుకొని 1956 వరకు, 557 సంవత్సరములు
కన్నడ దేశమునుపరిపాలించి కన్నడ రాజ్యవిస్తీర్ణమునకును, భాషా సాహిత్యముల యభివృద్ధికిని, ధర్మ ప్రతిస్థాపనమునకును ఇతోధికముగ కృషి సలిపిరి. ఈ రాజ్యము విజయనగర సమ్రాట్టులకు సామంతరాజ్యముగా నుండెను. ఈ ఓడయరులలో ఆరవవాడగు తిమ్మరాజ ఒడయరు II (1552-1571) విజయనగర సామ్రాజ్య పతనానంతరము (1565) స్వాతంత్య్రము ప్రకటించి పరిమితమయిన కన్నడ దేశమును పాలించసాగెను. ఈ రాజులలో తొమ్మిదవ వాడగు రాజ ఒడయరు (1578-1617), పన్నెండవ వాడగు కంఠీరవ నరసింహ ఒడయరు (1638-1659), పదు మూడవవాడగు దొడ్డ దేవరాజ ఒడయరు (1659-1672). పదునాల్గవవాడగు చిక్క దేవరాజ ఒడయరు (1672-1704) పేర్కొనదగినవారు. వీరు రణధీరులు, యశోవంతులు. కంఠీరవ నరసింహరాజ ఒడయరు తన పేరిట కంఠీరవ హొన్నులు, పణములు అను నాణెములను ముద్రింపించెను. మైసూరు రాజ్యసీమయందు హైదరాలివరకును ఈ నాణెములు చెలామణి యగుచుండెను, ఈ రాజే మైసూరు నందు నేటికిని జరుగుచుండు దసరా ఉత్సవములను నెలకోల్పినవాడు. చిక్క దేవరాజు తపాలా వసతులను
ఏర్పాటు చేసెను. నేల పన్నులను తగ్గించెను. దొడ్డదేవరాజు కాలములో మైసూరురాజ్యము తూర్పున సక్కెర పట్టణము మొదలుకొని సేలమువరకును, ఉత్తరమున చిక్క నాయకుని హళ్ళి మొదలుకొని ధారాపురము (కోయంబత్తూరు జిల్లా) వరకును వ్యాపించియుండెను. చిక్క దేవరాజు కాలములో దక్షిణమున పళని, అన్నామలలు మొదలుకొని ఉత్తరమున మిడగేశి వరకును, తూర్పున కర్ణాటక ఘరము మొదలుకొని పడమట కొడగు బాలముల సరిహద్దులవరకును వ్యాపించియుండెను.
పదునారవవాడగు దొడ్డ కృష్ణరాజ ఒడయరు 1 (1713-1731) రాజ్యమునకు వచ్చునప్పటికి మొగలాయి పాదు
షాలు దక్షిణ హిందూదేశము నాక్రమించి యుండిరి.
.<noinclude><references/></noinclude>
28lq19jmgld986v8xe9xtblfhgynqnq
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/548
104
154601
569207
448408
2026-08-08T10:26:54Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569207
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము -౨||కన్నడదేశ చరిత్ర - II}}</noinclude>
పాదుషా ప్రతినిధుల దృష్టులు భాగ్యవంతమయిన మైసూరు రాజ్యముపై ప్రసరించెను. ఆర్కాటు నవాబొక్కడు
ఏర్పడెను. మహారాష్ట్రులు బలవంతులుగా నుండిరి. మైసూరురాజులు పీరికందరకు తల యొగ్గవలసి వచ్చెను;
కప్పము లిచ్చి తప్పించుకొనవలసి వచ్చెను.
ఈ సమయముననే ఇంగ్లీషువారు, ఫ్రెంచివారు దేశీయ రాజుల కలహములలో జోక్యము కలిగించుకొని ఏదో
యొక రాజు పక్షము వహించి యుద్ధములు చేయసాగిరి. నిజాము ముజప్ఫరుజంగు, నాజరు జంగుల మూలమునను; చందాసాహేబు, అన్వారుద్దీనుల మూలమునను; ఫ్రెంచి వారికిని ఆంగ్లేయులకును యుద్ధము జరుగుచుండెను. మంత్రియగు సంజరాజు రెండుపక్షముల యెడను సమయానుకూలముగ కలుగ జేసికొని పనిచేయుచుండెను. సంజ రాజు సైన్యములో నుండిన హైదరాలి అను సిపాయి దేవనహళ్లి కోట ముట్టడి సందర్భమున మహాపరాక్రమము జూపి విజయము చేకూర్చెను. ఇతడు పెక్కు ప్రాంతములను జయించి, రాజమన్ననల నందుచు, క్రమక్రమముగా వృద్దిచెంది ఫౌజుదారు పదవిని పొందెను. ఈ విధముగా
హైదరాలి అనువాడు మైసూరు రాజ్యరంగమున ప్రవేశించెను.
అప్పటి మైసూరు ఒడయరులలో పందొమ్మిదవ వాడగు నంజరాజ ఒడయరు II (1766-1770) బాలుడగుటచే రాణివాసమువారు వ్యవహరింపుచుండిరి. వారు మంత్రియగు నంజరాజు యొక్క అహంభావపూరిత అధికారమును సహింవక, ఆ మంత్రిని తొలగించుటకై హైదరాలి సహాయ మర్థించిరి. వెంటనే హైదరాలీ మైసూరునకేగి మంత్రి సంజరాజు నోడించి తొలగించుటతో తృప్తిచెందక తానే ప్రభుత్వాధికారమును గైకొని చండశాసనుడై శ్రీరంగ పట్టణమును రాజధానిగ జేసికొని మైసూరు నేలసాగెను. హైదరాలి నంజరాజు ఒడయరు రాజు పేరిటనే ప్రభుత్వము చేయసాగెను.
మైసూరు రాజరికములో హైదరాలిని ఎదిరించువారు లేరైరి. బల్లిదులైన మహారాష్ట్రులు క్రీ.శ. 1761 పాని
పట్టు యుద్ధమున పొందిన యపజయముతో కొంతకాలము వారి విజృంభణము మందగించెను. ఈ యదనున హైదరాలి మైసూరురాజ్యమును విస్తరింప జేయసాగెను. క్రీ.శ. 1763 లో మైసూరున కుత్తరముగనున్న బెన్నూరు రాజ్యము నాక్రమించెను. ఈ ముట్టడిలో లభించిన 12 కోట్ల రూపాయల ధనరాసులతో హైదరాలి తన కోశమును నింపెను. ఆర్కాటు రాజ్యమునకు చెందిన బారామహల్ మండలమును, నిజామునుండి కడప, బళ్ళారి మండలములను పలు యుద్ధములలో జయించి, ఉత్తరముగా ధార్వాడ వరకును మైసూరు రాజ్యమును పెంచుటతో దాదాపు కన్నడ ప్రజానీకము హైదరాలి పరిపాలనలోనికి వచ్చెను. ఆతని విజృంభణమున కోర్వక మహారాష్ట్రులు క్రీ. శ. 1765లొ దండెత్తి వచ్చిరి. హైదరాలి ఓడిపోయి వారికి చౌత్ పన్నును చెల్లించి సంధి కావించుకొనేను. పిమ్మట క్రీ. శ. 1766 లో హైదరాలి మంగుళూరు, కళ్ళికోట, మలబారు మండలముల నాక్రమించుటతో పశ్చిమసముద్రమువరకును కన్నడుల రాజ్యము విస్తరించెను. ఆ సంవత్సరమే యనగా 1766 లో మైసూరురాజు కృష్ణరాజ ఒడయరు II మరణించగా, హైదరాలీ రాజవంశమునకు చెందిన యొక బాలుని-సంజరాజ ఒడయరు అనువానిని. రాజుగ చేసి తాను దళవాయిగ (సర్వ సేనాని) నేర్పడి ప్రభుత్వాధి కారమును సంపూర్ణముగా హస్తగతము జేసికోనెను. హైదరాలి మహమ్మదీయుడైనను కన్నడులనే యున్నత
పదవులందు నియోగించి ప్రజారంజకముగ పరిపాలించెను. దక్షిణమున దిండిగల్లునుండి యుత్తరమున కృష్ణవరకును కన్నడ రాజ్య మాతని పాలనలో విస్తరించినది.
ఆర్కాటు రాజ్యమును తాకిన హైదరాలి విజృంభణమును ఆంగ్ల కంపెనీవారు తట్టుకొనలేక నిజాముతో
మరియు మహారాష్ట్రులతో త్రెపక్ష కూటమి (Triple coalition) నేర్పాటుచేసి హైదరాలితో (క్రీ. శ. 1766)
యుద్ధములకు దిగిరి. హైదరాలి చాకచక్యముగ నా త్రేపక్ష కూటమిని భగ్నము కావించెను. ధనమొసంగి
మహారాష్ట్రులను బంపివేసెను. కడప మండలము నొసంగెద నని నిజామును తన పక్షమునకే త్రిప్పుకొనెను.
హైదరాలి, నిజాముల సంయుక్త పైన్యమును ఇంగ్లీషు సేనాని కల్నల్ స్మిత్ 1767 లో తిరువన్నామలై కడ
నోడించుట జరిగినది. అంత భయముతో చలచిత్తుడగు నిజాము హైదరాలి పక్షమును విడనాడి, యుద్దము
నుండి విరమించి, తరువాత వాంగ్లేయులతో సంధి<noinclude><references/></noinclude>
2c0lsm1tntb8m6b78twr4mef8ikbqgs
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/549
104
154602
569210
448409
2026-08-08T10:56:55Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569210
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కన్నడదేశ చరిత్ర - II||సంగ్రహ ఆంధ్ర}}</noinclude>
చేసికొనెను. హైదరాలీ యొక్కడే కంపెనీ వారితో యుద్ధములను సాగించి సాహసముతో మద్రాసును సమీపించెను. మద్రాసు గవర్నరు భయపడి 1769 లో హైదరాలీతో సంధిచేసికొని యుద్ధము లాపు జేసెను. ఇరుపక్షములవా రాక్రమించిన భాగముల నిచ్చి పుచ్చుకొనుటకును, ఇకముందు పరస్పరము, సైన్య సహాయము చేసికొనుటకును ఆ సంధిలో నంగీకరింపబడెను.
క్రీ. శ. 1771 లో మహారాష్ట్రులు మరల హైదరాలి పైకి దండెత్తిరాగా మద్రాసుకంపెనీ సహాయము నాతడు
కోరెను. " కానీ విపత్కాలమున ఇంగ్లీషువారు తోడ్పడక కృతఘ్నులయిరి. మద్రాసు సంధి నిట్లు భగ్నము చేసిన వారి మిత్రద్రోహచర్య నెన్నడు హైదరాలి మరచిపోలేదు. మహారాష్ట్రుల కాతడు అధిక ధనమును చెల్లించుటయే గాక 'చౌతు' పన్ను బాకీక్రింద ధార్వాడ మండలమును వారి పరము చేసెను. పిమ్మట హైదరాలీ 1772 లో కొడగురాజ్యమును జయించేను. మహారాష్ట్రుల కొసంగిన మండలము నాతడు తిరిగి యాక్రమించగా నాతని పైకి రఘునాథరావు అను సేనాని పంపబడెను. పీష్వా పదవి నాక్రమించుటకై కుట్రలు చేయుచున్న రఘునాథరావు నకు హైదరాలి కొంత ధన మొసంగి మంచిమాటలు చెప్పి పంపివేసెను.
మిత్రద్రోహులైన ఇంగ్లీషువారిని సాధించుటకై హైదరాలి వారి విరోధులను ఫ్రెంచివారిని తనకొలుపులో
జేర్చుకొని వారిచే తన సైన్యమునకు తగు శిక్షణము నిప్పించుచుండెను. యూరపులో నా రెండుజాతుల వారు
పోరాటములకు దిగగా మద్రాసులోని ఆంగ్ల సైన్యములు హైదరాలి రాజ్యముద్వారా నడచి పశ్చిమతీరమందలి
ఫ్రెంచివారి స్థావరమగు 'మాహీ'ని ముట్టడించిరి. అనుమతి బొందక తన రాజ్యమున కాలిడిన ఇంగ్లీషు
వారిపై 1780 లో హైదరాలీ యుద్ధమును ప్రకటించెను.80,000 సైన్యముతో – ఇందు 400 మంది యూరపియను ఆఫీసర్లు గలరు - హైదరాలి ఇంగ్లీషువారి రాజ్యముపై బడెను. ఆర్కాటుసీమను కొల్లగొట్టుచు కల్నల్ 'బై లీ' అను ఆంగ్ల సేనానిని ఖైదుగ బట్టెను. 1780లొ ఆర్కాటుకోటనే పట్టుకొనెను. 'పోర్టునోవో' 'రేవు యుద్ధమున, 1781 లో 'సర్ ఐర్ కూటు' 'సేనాని హైదరాలీ సేనల నొకసారి యోడించెను. తరువాత
హైదరాలీ ఇంగ్లీషువారిని ఓడించి కడలూరు నాక్రమించెను. ఆతని కుమారుడు టిప్పుసుల్తాను కల్నల్ బైట్ వైట్ నోడించి ఖైదిగా గైకొనెను. ఇట్టి విజయ పరంపరల మధ్య, రెండవ మైసూరు యుద్ధము జరుగు
చుండగనే 80 సంవత్సరముల వయసున హైదరాలీ యాకస్మికముగ 1782 లో మరణించెను.
సిపాయిగ చేరి సుల్తానని పిలువబడిన హైదరాలీ గొప్ప యోధుడు. చదువను, వ్రాయను రాకపోయినను
ఆతడైదుభాషలను ధారాళముగ భాషించెడివాడు. ప్రభుత్వ నిర్వహణము నాతడే స్వయముగ జూచుకొనెడి
వాడు. ఆతడు ముస్లి మైనను కన్నడులనే యున్నతపదవులకు నియమించెను. పూర్ణయ్యయను బ్రాహ్మణు డాతని దివానుగ సేవించెను. హైదరాలీ తన యుద్యోగుల విశ్వాసమును బడసియుండెను. ఇంగ్లీషువారలను ముప్పుతిప్పలు పెట్టిన హైదరాలీ, నాటి భారత స్వాతంత్య్రదీక్షకు నిదర్శనము. హైదరాలీ గోరి శ్రీరంగపట్టణములో నిర్మించబడెను.
హైదరాలీ పిమ్మట, అతని కుమారుడు టిప్పుసుల్తాన్ మైసూరు పాలకుడయ్యెను (1782). ఇతని కాలమున
కూడ పూర్ణయ్య దివానుగా నుండెను. టిప్పు కంపెనీ వారితో బద్ధవైరమును పూని, వారినెట్లయిన నీ దేశము
నుండి తరిమివేయ యత్నించుచుండెను. ఇంగ్లీషువారును టిప్పుతో తమ బలమును తేల్చుకొన్ననే తాము నిలువ గలుగుదుమని భావించుచుండిరి. కంపెనీ మిత్రరాజ్యమగు తిరువాన్కూరును టిప్పు ముట్టడించివాడను కారణము చెప్పి, ఇంగ్లీషువారు టిప్పుపై 1790 లో మూడవ మైసూరు యుద్ధమును ప్రకటించిరి. వారీసారి మహారాష్ట్రులను, నిజామును గూడ తమతో కలుపుకొనిరి, గవర్నర్ జనరల్ లార్డ్ కారన్ వాలిస్ స్వయముగ సేనలు నడిపించి బెంగుళూరు నాక్రమించెను. పిమ్మట మూడు సైన్యములును జేరి శ్రీరంగపట్నమును ముట్టడించెను. టిప్పు నిలువ లేక 1792 లో 'శ్రీరంగపట్నము సంధి' గావించుకొనెను. దానిప్రకారము టిప్పు తన సగము రాజ్యమును విజేతలకు బంచియిచ్చి, ధనము నొసంగుటయేగాక, తన కుమారులను హామీగా కంపెనీవారికి వప్పగించేను.<noinclude><references/></noinclude>
0x6rum22cigqfchc21wh9lz50xbf7fa
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/550
104
154603
569213
448410
2026-08-08T11:28:39Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569213
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము -౨||కన్నడదేశ చరిత్ర - II}}</noinclude>
టిప్పుబల మట్లు క్రుంగిపోయినను, అతడు పట్టుదలను, ధైర్యమును విడనాడలేదు. ఆంగ్లేయులను సాధించుటకై, వారి ప్రబలశత్రువైన నెపోలియన్ బోనపార్టీతో మంతనములు సాగించెను. 1799 లో గవర్నర్ జనరల్ గా లార్డు వెస్లీ "నీ కొలువులో నున్న యూరపియసులను తొలగింపు" మని కోరగా, టిప్పు తిరస్కరించెను. అంత నాల్గవ మైసూరు యుద్ధ మారంభమయ్యెను. నిజాము సేనలను కలుపుకొని ఇంగ్లీషు సేనానియైన జనరల్ హారిస్ టిప్పును 'మాలవెల్లి' కడ నోడించెను. అంత టిప్పు శ్రీరంగపట్నమున నిలిచెను. 1799 మే నెల 4 వ తేదీన హారిస్ శ్రీరంగపట్నమును భేదించెను. టిప్పు ఘోరముగ పోరుచు వీరమరణము పొందెను.
టిప్పుసుల్తాన్ పరమత ద్వేషియై ప్రజలను హింసించిన మహాక్రూరుడని ఇంగ్లీషు వారుచిత్రించిరి. కాని వీరివ్రాతలు సత్యములు కావని తెలియవచ్చినది. తండ్రివలెనే, టిప్పు హిందువులను ఉన్నతపదవులయందు నిలిపి, కన్నడులను ప్రజారంజకముగనే ఏలెనను నిదర్శనములు గలవు. హైదరాలి నాటినుండి సేవించిన దివాను పూర్ణయ్య టిప్పు కాలమున ఆతని కుడిభుజముగ పనిచేసెను. టిప్పుసుల్తాన్ పారసీ, ఉర్దూ, కన్నడ భాషలందు వక్త. ప్రభుత్వ నిర్వహణమును ఆతడే స్వయముగ నిర్వహించెను. కన్నడుల, హిందూ దేవాలయముల కాతడు దానము లొసగెను. రైతులను సహృదయముతో జూచెను. విరోధులపై త్రాచుపగ వహించెను.
కన్నడుల మైసూరు రాజ్యమును కొంత ఇంగ్లీషు వారును, నిజామును పంచుకొనిరి. మిగిలిన మైసూరు
రాజ్యమునకు పూర్వపు హిందూ రాజవంశమునకు చెందిన ఇరువది రెండవ ఒడయరు అగు అయిదు వర్షముల వయస్సు గల కృష్ణరాజ ఒడయరు III (1796.1868)ను లార్డు వెలస్లీ రాజుగ ప్రకటించి, సైనిక సహకార విధానమునకు ఒప్పించి, బాల రాజు తల్లిని, దివాను పూర్ణయ్యమ సంరక్షకులుగ ఏర్పాటుచేసెను. నాటినుండి మైసూరు రాజ్యము కంపెనీవారి సామంత రాజ్య మయ్యెను. బెంగుళూరు ఆంగ్ల సైన్యమునకు స్థావరమయ్యెను.
టిప్పు పతనకాలమున జరిగిన రాజ్య పంపకమువలన, వివిధ రాజ్యములలో ప్రజలు వేరుచేయబడిరి. బొంబాయి, హైద్రాబాదు, మద్రాసు రాష్ట్రములలో కొందరు అల్ప సంఖ్యాకులుగ నుండవలసివచ్చెను.
మైసూరు రాజవంశములో 22వ వాడగు కృష్ణరాజ ఒడయరు III బాలు డగుటచే, దివాను పూర్ణయ్య 1811
వరకు మైసూరు ప్రభుత్వమును నడిపి, రెండు కోట్ల రూపాయల నిలువ ధనమును కృష్ణరాజ ఒడయరునకు
వప్పగించెను. ఆ రోజు మూడు సంవత్సరములలోనే బొక్కసమును శూన్యము గావించి, దుష్పరిపాలనమునకు
దిగెను. 1831 లో గవర్నర్ జనరల్ బెంటిక్ ఒడయరును తొలగించి, మైసూరు పాలనకై ఇంగ్లీషు కమీషనరును
నియమించెను. ఏబది సంవత్సరములు మైసూరు ఇంగ్లీషు వారి పరిపాలనములో నుండెను. క్రమముగ ఇంగ్లీషు
వారు ఆంగ్ల పద్ధతులను మైసూరులో ప్రవేశ పెట్టి అభివృద్ధికి తెచ్చిరి (1831-1881).
కృష్ణరాజ ఒడయరు III దత్తపుత్రుడైన శ్యామ రాజేంద్ర ఒడయరునకు మైసూరు రాజ్యము 1881 లో
తిరిగి ఇవ్వబడెను. నాటినుండియు మైసూరు సర్వవిధముల అభివృద్ధిచెంది, స్వదేశ సంస్థానములలో పేరున కెక్కెను. సుప్రసిద్ధులైన రంగాచార్యులు, శేషాద్రి అయ్యరు, మాధవరావు, విశ్వేశ్వరయ్య మొదలగు దివానుల పరిపాలనములో వ్యావసాయక, పారిశ్రామిక రంగములందు మైసూరు పురోగమించినది. 1916 లో మైసూరు విశ్వవిద్యాలయము స్థాపింపబడినది. కృష్ణరాజ సాగరమువంటి నీటి వసతులు నిర్మింపబడినవి. భద్రావతి ఐరన్ వర్క్స్, కోలారు బంగారు గనులు, ఇతర పరిశ్రమలును నెలకొనబడినవి.
1947 లో భారత దేశమునకు స్వరాజ్యసిద్ధి కలిగెను. బ్రిటిష్ వారు మూటముల్లె కట్టుకొని ఇంగ్లండునకు వెళ్ళి
పోయిరి. బ్రిటిష్ ప్రభుత్వ విమోచనానంతరము హిందూ స్థానములో నున్న పెక్కు దేశీయ రాష్ట్రములు స్వాతం
త్య్రము వహించుటకు ఉవ్విళ్ళూరుచుండెను. ఆ సమయమున భారత ప్రభుత్వపు ఉపప్రధానిగానున్న సర్దారు వల్లభ భాయి పటేల్ ఈ రాజన్యులనందరను వశపరచుకొని, ఈ దేశీయ రాజ్యములన్నియు భారత ప్రభుత్వములో విలీనమగునట్లుచేసి, తన రాజకీయ ధురంధరత్వమును, చాతుర్యమును ప్రకటించి కృతకృత్యుడయ్యెను. దేశీయ రాజులందరు 'రాజప్రముఖ్" నామముతో భారత ప్రభుత్వ<noinclude><references/></noinclude>
7cenl7quao5hk8gsb9cyfjado3ozlkf
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/551
104
154604
569215
568240
2026-08-08T11:48:32Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569215
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కన్నడ భాష|| సంగ్రహ ఆంధ్ర}}</noinclude><section begin="551A" />మునకు సామంతులైరి. మైసూరు మహారాజువంశములో 25 వ వాడగు శ్రీ జయచామరాజు ఒడయర్ మైసూరు
రాజ్యమున 'రాజప్రముఖుడు'గా పరిపాలన నిర్వహింప సాగెను (1950).
తరువాత హిందూదేశము ప్రజాసత్తాక రాజ్యముగ రూపొందెను. అప్పుడు రాష్ట్రముల పునర్నిర్మాణ పథకము
తయారయ్యేను. ఈ పథకము ననుసరించి రాచరికము లన్నియు నిర్మూలింపబడెను. స్వదేశ సంస్థానాధిపతులకు ముందొసంగబడిన 'రాజప్రముఖ' బిరుద పదవి, రాజ్య వారసత్వమును తీసివేయబడెను. హిందూ దేశమంతయు భాషామూలకముగను, భౌగోళిక దృష్టితోడను 14 రాష్ట్రములుగా విభజనమయ్యెను. (1956 నవంబరు 1వ తేదీ) రాష్ట్రాధిపతులు గవర్నరు లనబడిరి. అప్పుడు మైసూరు రాజ్యము కన్నడ రాజ్యముగ పరిణతి చెందెను.
ఈ నూతన వ్యవస్థప్రకారము కన్నడ రాజ్యములో బొంబాయి, మద్రాసు, హైద్రాబాదు రాష్ట్రములలో నున్న కన్నడ ప్రాంతములన్నియు మైసూరు రాష్ట్రములో చేర్చబడెను. విడివిడి రాష్ట్రములలో పలుకుబడి లేక
మ్రుగ్గుచున్న కన్నడిగులందరు ఏకరాష్ట్ర పాలనలోనికి రాగలిగిరి.
ఇండియన్ యూనియనులో రాష్ట్రముల పునర్నిర్మాణ ఫలితముగా ఏర్పడిన నూతన మైసూరు రాష్ట్రము యొక్క
వైశాల్యము 74,347 చ. మైళ్ళు. జనాభా 1,94,01,407. రాజ్యభాష కన్నడము. జనసాంద్రత చ. మైలుకు 308 మంది. రాజధాని బెంగుళూరు. రాష్ట్రాధిపతి గవర్నరు. పశ్చిమదిశయందు అరేబియా సముద్రమును ఆనుకొని గొప్ప సముద్రతీర ప్రాంతముగలదు. చందనము, ఇనుము, ఉక్కు, సిమెంటు, కాగితము, ఉన్ని, పట్టు, మొదలగు పారిశ్రామిక కర్మాగారములు కలవు. హిందూస్థాన్-ఎయిర్ క్రాఫ్ట్, హిందూస్థావ్ 'మెషిన్ టూల్స్, భారత్ఎలక్ట్రానిక్స్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్, గవర్నమెంటు సిల్కు వీవింగ్ ఫ్యాక్టరీ, మైసూరు ల్యాంప్
వర్క్స్ అమ ప్రతిస్థాపనలు కలవు. బంగారు గనులు గూడ కలవు.
ప్రస్తుతపు మైసూరు రాష్ట్రమున 4 డివిజనులు, 19 జిల్లాలు ఈ క్రిందివిధముగ మన్నవి :
1. మైసూరు డివిజన్ - మైసూరు, కూర్గు, మాండ్య, హసన్, దక్షిణ కెనరా, చికమాల్ ఘర్, షిమొగా
జిల్లాలు (7)
2. బెంగుళూరు డివిజన్ - బెంగుళూరు, తుంకూరు, కోలారు, చితల్ దుర్గ్, బళ్ళారి జిల్లాలు (5)
3. బెల్గాం డివిజన్ - బెల్గాం, ధార్వాడ, బిజాపూరు, ఉత్తర కెనరా జిల్లాలు (4)
4. గుల్బర్గా డివిజన్ - గుల్బర్గా, రాయచూరు, బీదర్ జిల్లాలు (3)
బెంగుళూరు (7,78,977), మైసూరు (2,44,323), కోలారు గోల్డ్ ఫీల్డ్స్ (1,59,084), హుబ్లి (1,29,603).
మంగుళూరు (1,17,083) అనునవి మొదటి తరగతి పట్టణములు.
మైసూరు మహారాజుల పాలనములో విద్యా, వైజ్ఞానిక రంగములలో ఎంతో అభివృద్ధి చెంది, మైసూరు రాష్ట్రము ప్రసిద్ధికెక్కి యున్నది.
{{right|డా.స.}}
<section end="551A" />
<section begin="551B" />'''కన్నడ భాష :'''
క్రీ. శ. ఆరంభమునకు ముందే కన్నడభాష ఉండి యుండెనని సాధించుట కాధారములు కలవు. తమిళ
గ్రంథస్థము అయిన ఆధారములు, ఈజిప్టుదేశమున ఉపలబ్ధమై, గ్రీకు భాషలో రచింపబడిన హాస్య ప్రధాన నాటకము ఈ విషయమును బలపరచుచున్నవి. శిలా లేఖనములు క్రీ. శ. ఐదవ శతాబ్దమునుండి ఉపలబ్ధము లగుచున్నవి. హల్మిడి యను స్థలమున దొరకిన కన్నడ శాసనము క్రీ. శ. ఐదవ శతాబ్దమున లిఖింపబడిన దని విద్వాంసులు తెలిపియున్నారు. ఆ శాసనమున నుపయోగింప బడిన కన్నడ భాషయందు సంస్కృత శబ్దములు నూటి కేబది చొప్పున కలవు.
ప్రసిద్ధమగు పంచద్రావిడ భాషలలో తమిళము తరువాత కన్నడము భాషాప్రాధాన్యము వహించునని చరి
త్రజ్ఞులు, కన్నడము యొక్క ప్రాచీనతనుబట్టి, అభిప్రాయమును వ్యక్తపరచియున్నారు. ప్రాచీన కన్నడము నకును, తమిళ భాషకును సాదృశ్య మధికముగ నున్నది. కన్నడ భాషయందు పూర్వదహళ గన్నడ (పూర్వజాను కన్నడ), హళగన్నడ (జానుగన్నడ). పడుగన్నడ, హొసగన్నడ
<section end="551B" /><noinclude><references/></noinclude>
2l4ug8ejd5ylshoh2oeh39bdpuim42u
గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 4/సంచిక 6/శ్రీశబ్దానుశాస నాంధ్రభాషామందిరము,ఓరంగల్లు
0
203518
569123
528467
2026-08-07T14:09:19Z
Rajasekhar1961
50
569123
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 4/సంచిక 6|సంచిక 6]]
| రచయిత = హరి బాపయ్య
| అనువాదం=
| విభాగము = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 4/సంచిక 6/శ్రీశబ్దానుశాస నాంధ్రభాషామందిరము,ఓరంగల్లు|శ్రీశబ్దానుశాస నాంధ్రభాషామందిరము,ఓరంగల్లు]]
| ముందరి = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 4/సంచిక 6/ఐదవ కృష్ణామండల గ్రంథాలయ సభ|ఐదవ కృష్ణామండల గ్రంథాలయ సభ]]
| తదుపరి = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 4/సంచిక 6/శ్రీ జయలక్ష్మీసమాజము, చివ్వాడ, చిత్తూరుజిల్లా|శ్రీ జయలక్ష్మీసమాజము, చివ్వాడ, చిత్తూరుజిల్లా]]
| వివరములు =
|సంవత్సరం= 1920
}}
<pages index="Grandhalaya Sarvasvamu - Vol.4, No.6 (1920).pdf" from=14 to=17 fromsection="14B"/>
{{PD-India}}
[[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]]
do4sobdiwe7s8u669h5qa4wmkg8gi95
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/59
104
216461
569112
565391
2026-08-07T13:04:20Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569112
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>కాచు నిక్కం బతడు కరుణాసముద్రుండు । జగదభిరాముండు జానకీవరుడు॥
అని తల్లి బలుకంగనా మాటలేమియును । తనయాత్మ బట్టకను దనుజనాయకుడు॥
రోగి పథ్యాంతమున రుచిలేనిచందమున । తల్లిమాటలు యేమి తనకు సైపకను॥
అచట నిలువక లేచి అసురబలములు గొల్వఁ । యుగ్రుడై సమరప్రయత్నమున నుండె॥
అచట శ్రీరఘువరుం డఖిలబలములు గొల్వ । పూర్ణచంద్రునిపోల్కె పొలుపొందుచుండె॥
పొందు మీరగ వాయునందనునిశిరము । పై తేజరిల్లెను దశరథేశ్వరునిసుతుడు॥
హనుమంతు డంతంత నఖిలభూములు గడచి । చెలువుగా క్షీరాబ్ధిచెంత జేరెనుగ॥
అఖిలబలముల మేన నమర శైలమురీతి । నిలచె నాదుగ్ధాంబుధిచెంత నపుడు॥
తనకు నడ్డంబైన ఘనసముద్రము జూచి । బలముతో లంఘింప పని గాదు యనుచు॥</poem>
{{p|ac|fwb}}హనుమంతుడు సేనలను తోకమీదను పాలసంద్రమును దాటుట</p>
<poem>శరధిపై వాలంబు బరపి సకలబలంబు । దానిపై నడిపింపదలచి తా నపుడు॥
తనశిరముపై వెలుగు దశరథరాముని । జనకతనయను యిద్దరిని వధూవరుల॥
తగ రథముతో దించి తనభుజములం దున్న । భరతలక్ష్మణుల చేబట్టి దించెనుగ॥
శత్రుఘ్నకుశలవుల సరసతో సుగ్రీవ । అంగదాదులనెల్ల నవని దించెనుగ॥
తనదేహమున వెలయు ఘనబలంబులనెల్ల । పట్టి దించెను చాలభద్రంబుతోడ॥
అఖిలబలముల నెల్ల నబ్ధివడ్డున దించి। అఖిలేశునకు మ్రొక్క హనుమంతు డపుడు॥
కరయుగంబులు మోడ్చి కడుభక్తి నిలువంగ । గని జానకీవరుడు కరుణారసమున॥
పవనజా నీవంటిపరమబంధుడు నాకు । వెలయ లోకమునందు వెదకినా లేడు॥
ఏమి యిచ్చిన తీరు నింపార నీరుణము । దీవింతు వర్ధిల్లు దివ్యకీర్తులను॥
అనుచు పతి బలుకంగ నపుడు సీతాదేవి । హనుమంతు వీక్షించి అప్పు డిట్లనియె॥
అన్న పవనజ నీమహత్యంబు వర్ణింప । తరమె యెవ్వరికి నీధరణిలోపలను॥</poem><noinclude><references/></noinclude>
4qap2gg7clt8l7nzf6zzyi5b9n4hg95
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/60
104
216462
569175
565392
2026-08-07T21:27:58Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569175
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>ఆవేళ రావణుం డాశోకవనమందు । కఠినదైత్యస్త్రీల కాపు నా కుంచి॥
బాధ గావింపంగ పతిని బాసినయట్టి । దుఃఖంబుతో నేను దూలియుండగను॥
అట్టిసమయమున నీ వరుదెంచి శ్రీరాము । జయము నాతో జెప్పి జీవనము నిల్పి॥
రావణునిదరి కేగి రామచంద్రుడు నిన్ను । బరిమార్చుతా డనుచు ప్రజ్ఞ బలికితివి॥
మరల రఘువరునకు మార్గమంతయు జెప్పి । కడువేగ వారాశి గట్టించినావు॥
దశకంఠు మొదలైన దానవుల జంపించి । జనవరునిచే విభీషణు బ్రోవజేసి॥
నన్ను నావిభు గూర్చినావన్న నీవంటి । బరమబంధుడు మాకు ధరణిలో గలడ॥
అనుచు జానకి బలుక నావాయునందనుడు । కడుమోదమును బొంది ఘనుడు తా బలికె॥
అవివేకిమర్కటుండను నన్ను పలుమారు । వినుతి సేయగ దగున ఘనులు మీ రిట్లు॥
మీమహిమచేగదా మేలు బొందితి నేను । సర్వకార్యములందు జగతిలోపలను॥
మీయాజ్ఞ తల నుంచి మీయనుమతిని యెంత । పనియైన నే సాధ్యపరచజాలుదును॥
ఇపుడు మీశలవంది యెల్లసేనావళుల । వాలమున నడిపింతు వారధులు దాటి॥
చతురంబుధులు దాటి చెలగి వాలంబుపై । నడిపింతు బలుసేన గడిచిపోవుటకు॥
ఇందు కేమియు మీరు సందేహపడవద్దు । చూడు మాతల్లిరో చోద్యంబుగాను॥
అని పల్కి హనుమంతు డావధూవరులకు । బ్రణమిల్లి యాజ్ఞ గైకొని భక్తి నిలచె॥
అపుడు కపులెల్ల హాహాకారములు సేయ । చెలగి దేవతులు పువ్వులవాన గురియ॥
మిన్ను ముట్టంగ తనమేను నంతట బెంచి । బలువైన తనప్రభావంబు వెలయగను॥
భూరివాలము దుగ్ధవారాశిపై జూపి । అంతకంతకు లావు అధికమై చెలగె॥
పొడవు లక్షామడ నిడువు నూరామడ । పెంచి తనవాలంబు బీలంబు వెలయ॥
ఘనవాలమును బెంచి గద చేత బూని । కనకమేరువు బోలి ఘనుడు హనుమంతు॥
నింగిపొడవున నిలిచె నిఖిలబలములనెల్ల । కదలి నడువుడి యనుచు కడుఘోరమునను॥
పెద్దకేకలు వేయ ప్రియముతో శ్రీరాము । జానకీమొగము లక్ష్మణుమొగము జూచి॥
కనుగొంటిరా మీరు హనుమదాహ్వయుమహిమ । యెంతబలవంతుడో యీమహామహుడు॥</poem><noinclude><references/></noinclude>
ky478nnwip65o1hr0in2ehjpjyq3obs
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/61
104
216463
569180
565393
2026-08-07T22:45:14Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569180
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>ఈశ్వరసమానుండు యీపుణ్యచరితుండు । ఇతనిమహిమం బెరుగ నెవ్వారితరము॥
అనుచు పలుమారు నాతనిప్రభావం బెల్ల । వినుతి గావింపుచును విశ్వనాయకుడు॥
సతివధూమణి గూడి హితమతితో నడచె । వెనక భరతుండు లక్ష్మణుడు నడచిరిగ॥
ఆవెనుక శత్రుఘ్ను డావిజయుడును నడచె । నావెనుక సుగ్రీవు డంగదుడు నడచె॥
తరువాత జాంబవంతాదులును శేనయును । నయ మొప్ప నడిచి రానందములు వెలయ॥
జయజయధ్వనులతో చెలగుచును నడచి । సకలబలములు మిగుల సంతోషమునను॥
సకలసేనలు మహాసంతోషభరితులై । వాలంబుపై నడిచి వక్కపెట్టునను॥
జనుచు కొందరు గుబేలున సముద్రము కురికి । అరసి జలములు జల్లుకొనుచు కొందరును॥
గగనవీథికి గొంద రెగసి పక్షులరీతి । యెగిరివత్తురు కొంద రగచరావళులు॥
వాలంబు పైనుండి వారధికి లంఘించి । యీదులాడుచు వత్తు రెలమి కొందరును॥
కొంద రేగిరి పెక్కుచందముల వెలయుచు । హనుమంతు బొగడుచు నందు నాడుచును॥
కొంద రరిగిరి చాలకోలాహలంబుగా । శం కేమి లేక నిశ్శంక తోడుతను॥
ఆరీతిగా సేనలందరును నడువంగ । పరమహర్షము నొంది పద్మలోచనుడు॥
సీతాసతికి జూపె శ్రీరామచంద్రుండు । సాగరములో నున్న జలచరంబులను॥
కర్ణాటకంబులు రచ్చకంబులు చాల । జూపించె జానకీ చోద్య మొందగను॥
ఇట్లు జూపించుచును యెల్లసేనలు నడువ । శ్రీరామచంద్రుండు జగతిరక్షకుడు॥
క్షీరవారధివడ్డు జేరి నిల్వగ సకల । బలములన్నియు వడ్డుపై నిలచి రపుడు॥
సకలరాజేంద్రులును సకలరాక్షసబలము । గంధసింధురఘోటరథచక్రములను॥
అఖిలబలములు జేరె నాంజనేయులుదక్క । దేవతానీకములు దీవనలు జేయ॥
బలములన్నియు తోకపై దర్లిపోవంగ । నతిసంభ్రమము నొందె నంజనీసుతుడు॥
తాను యెప్పటిరీతి తనవాలమంతయును । క్రమ్మర దీసుకొని కడుసాహసమున॥
పరమహర్షమున నొకగిరిశృంగమున నిల్పి । రామరామా యనుచు రంజిల్లుకొనుచు॥</poem><noinclude><references/></noinclude>
1jbv2pis9gz77jd5x0461clb7ao47ud
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/62
104
216464
569181
565394
2026-08-08T03:45:29Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569181
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>మొగము మీదికి నెత్తి మోము తా బిగియించి । సరిపాదములు నిల్పి తరుచరవరుండు॥
బాహు లొయ్యన నూపి బలుకేక వడి వేసి । పర్వతము వణుకంగ పవనజుడు యెగసె॥
ఎగసి బలువడి దాటె నెలమితో క్షీరాబ్ధి । బలురెక్క లున్న సురపర్వతమురీతి॥
పాలసంద్రము దాటి పవనజుం డేతేర । ఎదురేగి వనచరులు యెల్లవేడుకను॥
తన కెదురుగను వచ్చు వనచరానీకముల । కౌంగిలిని బంధించె ఘనుడు హనుమంతు॥
శ్రీరామచంద్రులకు సీతకును బ్రణమిల్లి । బలునుతుల్ గావించి భక్తి వెలయగను॥
కరయుగంబులు మోడ్చి తరుచరుడు నిలువంగ । అత్యంతకృప జేసి యాదరించిరిగ॥
శ్రీరామచంద్రుండు సీతామహాదేవి । పలుమారు దీవించె పవననందనుని॥
అఖిలబలములు నెల్ల నలసటలు దీరంగ । నిఖిలేశు డచ్చోట నిలచె నవ్వేళ॥
ఆవే ళచట నిలచి ఆమరుచటిరోజు । నేతిసంద్రం బపుడు నేర్పుతో దాటె॥
అరయ మూడవనాడు పెరుగుసముద్రము దాటి । రెల్లసేనలు చాలయుల్లాసమునను॥
ఘనుడు నాల్గవనాడు కల్లుసముద్రము దాటి । క్రమముగా నపు డిట్లు కమలలోచనుడు॥
పవనజునివాలంబుపై నాల్గుసంద్రములు । యెలమి మీరగ నడచె ఇనకులేశ్వరుడు॥
అఖిలసైన్యములతో నచ్చోట నిలువంగ । పరగ తొల్లింటివలె పవననందనుడు॥
ఆమూడువారాసు లవలీలగను దాటి । జానకీరామునకు జేరి ప్రణమిల్లి॥
రథముతో జానకీరాములను ముందుగా । తనశిరము జేర్చుకొని తాను వేగమున॥
ఆరాముసోదరులు ఆపుత్రపౌత్రులును । తపనపుత్రుడు మొదలు కపిబలమునంత॥
తొల్లింటిరీతిగా నెల్లసేనల నపుడు । తనమేన దాల్చుకొని తరుచరోత్తముడు॥
మేరుశైలమురీతి మీరుచును ముందుగా । గనియె ప్రతాపలంకాపట్టణంబు॥</poem>
{{p|ac|fwb}}రాముడు ప్రతాపలంక బ్రవేశించుట</p>
<poem>శ్రీరామచంద్రుండు సీతామహాలక్ష్మి । అఖిలబలములు గనిరి అసురేశుపురము॥
గగనంబు పొడవుగా గలవు మేలిమిపసిడి । కోటలును తొమ్మిది నేటు మీరగను॥</poem><noinclude><references/></noinclude>
0d86ls9coi9kibmw54l1m41mirdfnou
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/63
104
216465
569182
565395
2026-08-08T04:15:28Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569182
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>ఘనముగ వెలయు ప్రాకారములు తొమ్మిది । జలపూర్ణముగ నగడ్తెలు తొమ్మి దుండు॥
భర్మనిర్మితమైన బలుగోపురంబులు। గజరథభటతురంగాందోళికములు॥
లంకాపురముకంటె లావణ్యమైన దీ । లంకాపురం బనుచు రామభూవరుడు॥
ఆశ్చర్యమానసుండై పురముద డాసి । వనచరేంద్రుని జూచి తను యిట్టు లనియె॥
అసురపట్నము చేరువయ్యె నీ విచ్చోట । నిలచి దించగవలెను బలములన్నియును॥
అని రాము బలుకంగ నడుగు దాటక నిలచి । పాహి నారాయణా పరమాత్మ యనుచు॥
రథముతో ముందుగా రామభూపాలూని । జనకపుత్రిని దించె ఘనభక్తి వెలయ॥
తనభుజములందున్న ఘనభుజులనందరిని । పట్టిదించెను చాలభద్రంబుగాను॥
కడువిశాలస్థలము గని దేహమందున్న । నిఖిలబలముల నెల్ల నియమించె నచట॥
ఘనుడు రాముకు ప్రదక్షిణపూర్వకంబుగా । ప్రణమిల్లి తా నిలిచె పవననందనుడు॥
సకలభూములయందు సకలదిక్కులయందు । వెలసె బలములు చాలవిఖ్యాతి మీర॥
సకలబలములు యిట్లు శతకంఠుపురి డాసి । భేరీమృదంగములు బోరు కలరంగ॥
ప్రణవఢక్కాశంఖబహుతూర్యనాదములు । ఒక్కరీతిని మ్రోసె నుజ్వలంబుగను॥
చదలు ముట్టగ పశిడిజండాలు యెత్తిరి । వేలాములోపలను వేలకొలదిగను॥
వనచరభల్లూకమనుజదానవబలము । తమకు దగుచోటులను తగనిలిపి రపుడు॥
అల విభీషణసుగ్రీవాంగదముఖ్యులు । రాము బరివేష్టించి ప్రేమ నుండిరిగ॥
సరసముగ లక్ష్మణభరతశత్రుఘ్నులు । కుశలవులు విజయుండు కొమరుమీరుచును॥
జానకీసహితుడౌ మానవనాయకుని । యెలమి బరివేష్టించి కొలచియుండిరిగ॥
అసురనాథునిపట్న మపుడు ముట్టడి వేయ । నాత్మలో నూహించె నరనాథు డపుడు॥
సుగ్రీవయంగదసుషేణజాంబవ । హనుమద్విభీషణులయనుమతంబునను॥
ఒకరినొకరిని బిలచి వరుసతో శలవిచ్చె । కరుణాసముద్రుండు ఘనుడు శ్రీరాము॥
దక్షిణద్వారమున దక్షిణేశునిరీతి । బలము లక్షలు గొల్వ బరిఢవిల్లగను॥</poem><noinclude><references/></noinclude>
abun8qrli074vqw2ox1f4uy4xlsdjey
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/64
104
216466
569183
565396
2026-08-08T04:44:46Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569183
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>పురముబైటకు నొక్కసురవైరి రాకుండ । చలముతోడుత నీవు నిలువుమా యనుచు॥
కంఠమాలిక యిచ్చి కడుగౌరవము జేసి । అంగదుని బనిపించె నారాము డపుడు॥
భల్లూకసేనయును పదివేలు గొలువంగ । నసురకోటుల నిండవలయు నుద్దతిని॥
పడమరవైపు భద్రంబుగా నుండుమని । జాంబవంతుని బంపె జానకీవరుడు॥
అగచరోత్తములు నూరర్భుదంబులు గొలువ । భయదరాక్షబంధము భీతి కొనగ॥
తూర్పుదిశ నుండుమని నేర్పుతో గోముఖ । పనసవృషభుల నంపె బలుడు శ్రీరాము॥
ఆమిగిలియున్నట్టి అఖిలబలములతోడ । కడువైరిబృందములు కలువరింపగను॥
ఉత్తరమువైపునా నుండుమని శలవిచ్చె । సుగ్రీవు నంపి బంపె సుజనరక్షకుడు॥
కడువిభీషణుపొందు గని కోటకొమ్మలను । నిలచియుండుమటంచు బలికె రాఘవుడు॥
పురి కొల్చి యల్ల వానరుల గావ ప్రధాన । చయముల నియమించె జానకీవరుడు॥
చెప్పన్నదేశాదిజననాయకుల బిలచి । బలము లల్పముచోట నిలుమంచు బలికె॥
ఆరాము శలవొంది అఖిలజనములు గదిలి । శలవుప్రకారంబు జెందియుండిరిగ॥
గొల్లుమని దానవునికోట ముట్టడి వేసి । లగ్గ కెక్కదొణంగె నగ్గజంబుగను॥
కోటకొమ్మలు బట్టి కూలంగ వేసిరి । ప్రాకారములు నేలపాలు జేసిరిగ॥
జలము లేమియు యగడ్తెలు లోన లేకుండ । పౌరుషవంతులై పారజల్లిరిగా॥
కోటతలుపులు బట్టి కూలంగదన్ని । పంటపైరుల నేలపాలు జేసిరిగ॥
కడుతటాకము లెల్ల ఖండితంబుగ జేసి । యెల్ల వృక్షావళులు పెల్లగించిరిగ॥
పరవీరగర్భములు పగులంగ నార్చిరి । లగ్గ కెక్కుచు చాలలావణ్యు లగుచు॥
ఆసమయమున రాము డావిభీషణు జూచి । అతనియనుమతముగా హనుమంతు బిలచి॥</poem>
{{p|ac|fwb}}ఆంజనేయుని రాయబారమునకు బంపుట</p>
<poem>పరమపావనపుణ్య లావణ్యగుణగణ్య । వాయునందన నీదువరకృపాంబుధిని॥
సేనలను మమ్ములను జేర్చినా విచ్చటికి । తగనిపనులన్ని దిగ్జయమాయె మాకు॥
నిటుమీదికార్యంబు లేరీతిగానైన । సాధ్య మొనరించెదను సందేహ మేల॥</poem><noinclude><references/></noinclude>
8cw9lygouzspo2wnxorpq5q2h5q0coi
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/65
104
216467
569184
565397
2026-08-08T06:05:49Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569184
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>శతకంఠుమనసులో చందంబుమనపైని । యేరీతి నున్నదో యెరుగరాదయ్య॥
తెలియకుండగ వారి బొలియింపగా రాదు । మనసులో సంగతి కనుగొనగవలయు॥
రాయభారము దెలిసి రావయ్య పోవయ్య । నీవల్ల కార్యములు నెరవేరవలెను॥
ఎల్లి పుష్యమియాత్ర కేగుటకు మంచిది । జయము చేకూడును సిద్ధముగ నమ్ము॥
జయముగా నీపేర చంద్రతారాబలము । గలిగియున్నది యివుడు కడువేగ జనుము॥
శతకంధరుని గాంచి అతనిమతము గ్రహించి । మనరాక యెరిగించి మార్గ మొనరించి॥
వనజసంభవు డిచ్చువరములకు తనమదిని । గర్వించవద్దనుచు ఖండితము చెపుమ॥
పోరి నాచే గూలిపోయి రావణకుంభ । కర్ణులవిధం బెల్ల గనియుండుమనుమి॥
జగతి పురుషులచేత చావు లేకుండంగ । తగవరము గొంటినని తా బలికితేను॥
జానకీదేవితో జనుదెంచినామన్న । వార్త దెలిసుండమనవయ్య కపినాథ॥
వెరవు మదిలో బుట్టి శరణు తా జొచ్చితే । రక్షింతుమని చెప్పు రాక్షసేశ్వరుని॥
శరణు జొచ్చినవెనుక ధరణీసురలకు బాధ। జేయుటకు సైపనని చెప్పు ముందుగను॥
జాగు సేయక వేగ జని వారిచందంబు । గని వేగ రమ్మనుచు ఘను డిట్లు పలికె॥
హనుమంతు బలవంతు నధికవిద్యావంతు । ధనవంతు గుణవంతు తగ నీతివంతు॥
ప్రణమిల్లి రామునకు బహువిధంబుల మ్రొక్కి । దీవనలు తా బొంది ధీరుడై యపుడు॥
అచ్చటను వీడుకొని అర్కపుత్రుని గాంచి । శ్రీరామచంద్రుండు శలవిచ్చుగతులు॥
సర్వ మతనికి జెప్పిన సకలబలముల చాల । జయజయధ్వని సేయ శలవు గైకొనుచు॥
ఘనత ప్రతాపలంకాపట్టణము జేరి । ఆకోటవైభవం బంత బొడగాంచె॥
ద్వారకావలి నున్న దనుజావళుల నెల్ల । బరికించి అందులోపల గానరాక॥
కోట లంగళ్లును కొమరొప్పగా విడిచి । తనమహోన్నతరూపు దా నపుడు దాల్చె॥
తనమహాకారంబు గని వెరచురాక్షసులఁ । జూచి నవ్వుచు మదిని చోద్య మందుచును॥
అరయవచ్చేవారలను హుంకరింపుచును । వీరులను గొందరిని వెరపించుకొనుచు॥</poem><noinclude><references/></noinclude>
4q7z8jyeoqlu3blnmn455fxc2osu845
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/66
104
216468
569185
565398
2026-08-08T06:23:11Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569185
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>చని పట్టణము జొచ్చి ఘనవైభవంబెల్ల । నావిలాసం బంత నాత్మ నూహించి॥
ఆమహోన్నతపదవి నాభోగభాగ్యంబు । లావైభవములన్ని అరసి శోధించి॥
దేవనాయకు బోలి ధీరుడై యీతండు । యీలాటిపట్నంబు నేలుకొనియుండె॥
కనుల జూచితి లంకఘనవిలాసములన్ని । అరయ నీపురి సహస్రాంశమును లేదు॥
ఇత డెంతధన్యుడో యిత డెంతపుణ్యుడో । కాకున్న యబ్బునే ఘనవైభవములు॥
కలిమి గలిగినకొద్ది గలుగవలెను గుణములు । వురు వడిగియుండెదరు యుత్తమోత్తములు॥
ఘనత గలిగినచోట వినయంబు భూషణము । అది తలంపకయున్న హాని వచ్చునుగ॥
కటకటా యీభాగ్యగరిమ చెడిపోవుటకు । నేల బుట్టెను దనుజు కీలాటిబుద్ధి॥
విభవ మెల్లన యనుభవించడాయెనుగదా । చెడుబుద్ధి దలుచుకొని బలుడు రక్కసుడు॥
దురితబుద్ధులు యేల దోచె నీదనుజునకు । అయ్యయో యనుచు తా నరుగుచుండగను॥
తనకుముందర మహాతనివి జెన్నెందుచును । గగనంబుపొడవునా ఘనత మీరుచును॥
సూరుశిరములును యిన్నూరుచేతులు గలిగి । ఘనముగా మిన్ను ముట్టినపొడవు గలిగి॥
గరుడకిన్నరయక్షగంధర్వకింపురుష । సురసిద్ధులను బారదరిమేటిజయము॥
ఘనతలాటంబు తా ఘటంబుగా మ్రొక్కి । గర్వాంధుడై కళ్ళ గానకుండగను॥
చెరలు బట్టెను దేవసతులు కన్నులు బాష్ప । కణము లొలుకగ నేమి కనికరము లేక॥
తగుపనులు జెప్పుచును తనప్రధానులు తాను । కొలువున్న శతముఖునిగురు తెల్ల గాంచి॥
అత్యద్భుతం బంది యతనిధైర్యస్థైర్య । ములు గాంచి హనుమంతు డెలమితోడుతను॥
అతిధైర్యగాంభీర్యుడై దనుజుదరి డాసి । అతనికి నెదురుగా హనుమదాహ్వయుడు॥
తివిరి తనవాలంబు దివి సోకగా జుట్టి । ఆదానవునికంటె నధికపొడవునను॥
కుదురుగా గూర్చుండి కోరి దనుజునివైపు । చూచిచూడనియట్లు చూచి తానుండె॥
భీకరాకారమున నాకసముపొడవున । దనుజునకు నెదురుగా తాను గూర్చుండె॥
అపుడు శతకంధరుడు ఆమహాత్ముని మహా । కారంబు వీక్షించి కడుభయం బొదవి॥</poem><noinclude><references/></noinclude>
pxnolg74almdy9qvt73qzvm9dvcvi3n
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/67
104
216469
569194
565399
2026-08-08T08:47:45Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569194
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>ఆశ్చర్యమును కోప మభిమానమును శౌర్య । మాత్మలో నూహించి యపు డిట్టులనియె॥
ఏమిరా వానరా యేలాగు వచ్చితివి । ప్రాకారములు దాటి భయ మేమి లేద॥
దాటివచ్చుట గాక తప్పకను నాయదుట । నిలచుటకు నీగుండె నిలచె నేరీతి॥
ఎవ్వడు నిను బంపె నేలాగు వచ్చితివి । యెవరు నీపేరు నీ వెవరిపుత్రుడవు॥
ఎవడు నీ కీరూపు యింపారగా నిచ్చె । నేమార్గమున నీవు యిటకు వచ్చితివి॥
ఇచ్చట దానవులు హింసింతు రిక నిన్ను । బాధ కోర్వగ లేవు పారిపోరోరి॥
ఎవ్వడు నిను బంపె నెవరి గొల్తువు నీవు । చెప్పరా నాతోను శీఘ్రంబుగాను॥
నే నిటు బిలచితే నీ వటు జూచేవు । గర్వమా నీ కింత గడుసుతనమటరా॥
కోతిముండాకొడక గురుతు తెలియక నీవు । వచ్చితివి నీకర్మవశము దప్పకను॥
ఇక నెందు బోయెదవు యేతెరవు నీ కికను । నీకు ది క్కెవ్వండు నిన్ను జంపెదను॥
పట్టి తెచ్చిన విని ప్రారబ్ధ మిచ్చటికి । కర్మవశమున నీవు గదలలే వికను॥
మదమత్సరముచేత మాటలాడెద వేమి । కళ్ళ గానక నోరి కపికులాధముడ॥
అని రాక్షసుడు బలుక నతిమహాశూరుడగు । మరునందనుడు శంక మది నేమి లేక॥
నీచరాక్షసువైపు చూచిచూడక మది ని । రాకరింపుచు బలికె భీకరంబుగను॥
ఓరి దనుజాధమా వోరి యధమాధమా । వినరోరి శ్రీరామవిభునిచందంబు॥
ఎరుగవా నీసహోదరుని రావణుశిరము । లవనిపై జడ గూల్చు నతులప్రతాపు॥
కుంభకర్ణుని బట్టి కూలనేసినయట్టి । మహనీయు నెరుంగవా మంకురాక్షసుడ॥
ఇంద్రజిత్తును బట్టి యిలను గూల్చినయట్టి । ఘనభుజు నెరుగవా కపటదానవుడ॥
ముందుగా శూర్పనఖ ముక్కుచెవులును గోసె । పరగ పుణ్యచరిత్రు నెరుగవా నీవు॥
ఘనవిభీషణకు లంకాపట్టణము గట్టి । యెలమి బొందిన రాము నెరుగవా నీవు॥</poem>
{{p|ac|fwb}}హనుమ తన్ను శతకంఠున కెరింగించుట</p>
<poem>ఖరదూషణాదిముష్కరరాక్షసులనెల్ల । బరిమార్చె నాసామి నెరుగవా నీవు॥
అట్టిమహనీయునకు నతిపుణ్యచరితునకు । బంటు నౌదును నేను పలుమాటలేల॥</poem><noinclude><references/></noinclude>
t3u1pexpi346m498flx4us5xhof5yw8
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/68
104
216470
569195
565400
2026-08-08T09:09:36Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569195
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>వాయుదేవుడు తండ్రి వర్ణింప నాతల్లి । అంజనీదేవిరా యవనిలోపలను॥
హనుమంతు నాపేరు యసురుడా విను నేను । శ్రీరాము గొల్తురా జయము పొందుటకు॥
లంక కరుగుచు నధికలాభవము దీపింప । కడలి దాటితి నొక్కకాల్వచందమున॥
వనమెల్ల పెరికి రావణకుమారుని యక్షు । నుక్కణగించితిని యొక్కనిముషమున॥
దశకంఠుపుర మెల్ల దగ్ధంబు జేసితిని । దివిజులందరు నన్ను దీవనలు సేయ॥
లంకిణిని బట్టుకొని లా వెల్ల దూలించి । నేల గలిపితి నొక్కనిముషమాత్రమున॥
తిరిగి సముద్రము దాటి తరుణి జానకి జయము । వెలయంగ శ్రీరామువిభున కెరిగిస్తి॥
ఇపుడు నీచందంబు యావత్తు దెలియంగ । జూచిపో వస్తిరా నీచదానవుడ॥
సేవలన్నిటిని నామేన ధరియించుకొని । వస్తి నిన్నటిరోజువరకు నిచ్చటికి॥
సాగరంబు నాల్గు సకలబలములనెల్ల । వాలమున దాటిస్తి వరుస మీరగను॥
శ్రీరామచంద్రుండు జానకీసహితుడై । జనుదెంచె నిను బట్టి దునుమాడుకొరకు॥
బరిమార్చు నిక నిన్ను మరి నీకు ది క్కెవడు । ఓరి దుర్మార్గుడా వోరి పాపాత్మా॥
నీకులము నీబలము నీవు నిర్మూలమై । కూలిపోయేయంత్యకాలంబు వచ్చె॥
బుర్రలోకపదిపదులు నర్రాడగలిగెనని । విర్రవీగకురోరి వెర్రిరాక్షసుడ॥
క్రొవ్వు మీరినగొఱ్ఱె కొండ దాగితే । కొదు వేమి వచ్చునా కొండ కేమైన॥
జగధీశురాముతో పగ నీవు జెందితే । హాని నీకే గాని అతని కేమౌను॥
ఎనుపోతు మదగజము నెదిరించినట్టుగా । శ్రీరాముతో నీవు పోరు కొలిపితివి॥</poem>
{{p|ac|fwb}}ఆంజనేయులు శతకంఠునికి నీతులు చెప్పుట</p>
<poem>నీదుకర్మవశంబు నీ కిట్టిదుర్బుద్ధి । గావించినదిరోరి కలుషదానవుడ॥
వెఱ్ఱిచేష్టలు మాని వినరోరి నామాట । చెడిపోయెదవురోరి బడగురక్కసుడ॥
సౌభాగ్యగరిమంబు నిండారగా నాదు । కనుల జూడగ చాలకనికరం బొదవె॥
కడుభాగ్య మది యేల చెడగొట్టుకుంటావు । ప్రాణభంగం బేల పరచుకుంటావు॥
వద్దు నామాట విను వైరంబు నీ కేల । నిఖిలేశు డతనెదుట నిలువ నీతరమ॥</poem><noinclude><references/></noinclude>
5u0fmvf3s4emve1cxlhl5ugjexmzeca
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/69
104
216471
569201
565401
2026-08-08T09:40:51Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569201
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>నీకోట లన నెంత నీపేట లన నెంత । నీమాట లన నెంత నీ వనగ నెంత॥
నిముషంబుపని గాదు నిఖిలవల్లభుడైన । శ్రీరామచంద్రునకు జగదీశునకును॥
నీవార లైనట్టిరావణాసురముఖ్య । వీరు లందరు గూలు టది యెరుగవటరా॥
కొలది యెరుగక మేను క్రొవ్వి శ్రీరాములతొ । కయ్యంబు కెదిరించి కాలు ద్రువ్వుదువు॥
పరమపాపాత్ముడవు దురితవర్తివి నీవు । నరవరునిచే నీకు మరణంబు నిజము॥
ఆదిదేవుడు దేవతారాఢ్యు డనఘాత్ము । శ్రీరాములకు నింద జేసెదవు నీవు॥
నిన్ను గనుగొనరాదు నిజముగా దోషంబు । వచ్చు నిను గనుగొన్న దుశ్చరిత్రుండ॥
నెరయ నీ కొకబుద్ధి నే నిపుడు జెప్పెదను । భావించి చూడరా పలువిధంబులను॥
నీవు యిక పోలేవు నిజముగా శ్రీరాము । గవిని నాలుగుకట్లు కట్టించినాడు॥
గట్టిగ నీనగరుచుట్టు ముట్టడి వేసి । యున్నాడు రౌద్రంబు లుప్పతిల్లుచును॥
నను బిలిచి నీయొక్కమనములో భావంబు । లేరీతి నున్నవో యెరిగిరమ్మనెను॥
ఆవెనుక కార్యంబు లన్ని చక్కగ జేతు । నని నాకు శల విచ్చె నారామవిభుడు॥
పురుషవర్గంబుచే మరణంబు లే దనుచు । కమలజునివరములకు గర్వించబోకు॥
సీతాసమేతుడై శ్రీరామచంద్రుండు । జనుదెంచు మాట నీమనము నెరిగుండు॥
నిన్ను వధించక గాని నిజముగా తనపురికి । వెళ్ళ డవస్యంబు వేయు నిం కేల॥
అమరభోగములన్ని అనుభవించుమటంచు । నీ కెరిగించుమనె లోకనాయకుడు॥
నీబంధుమిత్రులను నిజముగా రప్పించి । చాల యిష్టాగోష్టి సలుపు మీవేళ॥
ఆశ్రితుల కందరికి నతికరుణ రంజిల్ల । కలభాగ్యములతోడ నిలు జూరబెట్టి॥
పుత్రపౌత్రాదులకు భూషణావళులెల్ల । ముస్తాబు చేయించు మోదంబుగాను॥
షడ్రసోపేతాన్నసంభోక్తములు జేసి । సుఖియించుమా వెనుక సుఖ మెట్లు గలుగు॥
నీదుభార్యా పరమసాధు మానావతితో । నంత్యకాలపుభోగ మందు మీరాత్రి॥
దొడ్డయిల్లా లామెతో జెప్పి వైధవ్య । మొంది కలకాలంబు వర్ధిల్లుమనుచు॥
తల్లితో నీసుతునియిల్లడలు గావించు । నిల్లువాకలియాశ యావత్తు విడుమ॥</poem><noinclude><references/></noinclude>
clfay5n3sosndipdlur1s9jjo2glswh
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/70
104
216472
569209
565402
2026-08-08T10:42:17Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569209
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>బయలుదేరుము తిరిగి బ్రతికివచ్చేదేమి । లేదు కనికారంబు రాదు మాకికను॥
అని యెరింగించుమని ఘనరామచంద్రుండు । శలవుచొప్పున నేను జనుదెంచి తిటకు॥
కరుణాసముద్రుండు కనికరము రంజిల్ల । తిరుగ నన్నును బిలచి మరి జెప్పుమనెను॥
అన్నివిధముల నీకు తిన్నగా జెప్పుమనె । పరమపుణ్యాత్ముండు భక్తపాలకుడు॥
ఆదినారాయణుం డతనిశరణంటివా । వైభవోన్నతి బొంది వర్ధిల్లగలవు॥
ఇటుమీద మునిబాధ లేకాలముననైన । గావించితే నిన్ను కాచేది లేదు॥
అతను జెప్పినమాట లన్ని యివి సత్యంబు । ఆడితప్పనివాడు ఆమహారాజు॥
వచ్చితిని నీకు ఆవార్త లటు జెప్పితిని । యీతుచ్ఛరాక్షసుల నిక నమ్మబోకు॥
నరుడు గా డత డాదినారాయణస్వామి । కాచు నిక్కం బతడు కరుణించు నిన్ను॥
వైరంబు వర్జించు శ్రీరాముకడ జేరు । బ్రతుకు పూర్ణాయువను భద్రముగ నీవు॥
బ్రతుకుకై నీమదికి భ్రాంతి లేకుండినను । సంగరంబున కరుగు చావు సిద్ధంబు॥
పురుషులచే చావు బొందనని నీకుంటె | జానకి వచ్చినజాడ యెరిగుండు॥
వేళ్లతో నిన్ను నిర్మూలంబు జేయును । అది యెరిగి వర్తించు మసురపుంగవుడ॥
మహిలోను శ్రీరామమహిమప్రభావంబు । తెలియగవలెనంటె తెలియజెప్పితిని॥
స్థిరముగ నీతల్లి చిత్రగంధిని యడుగు । అమ్మహాదేవిచే నఖిలంబు దెలసి॥
జానకీదేవిచే సిద్ధంబు నీచావు । అని యనేకప్రకారముల హనుమంతు॥
తెలియజెప్పిన గాని తెలియకను వులికిపడి । ఉగ్రుడై ప్రళయకాలాగ్నిచందమున॥</poem>
{{p|ac|fwb}}శతకంఠుడు రాముని దూరుట</p>
<poem>చలమునను దనుజుండు చాలగా కోపించి । హనుమంతు జంపుటకు నాత్మ నూహించె॥
తగ దూత జంపుటకు ధర్మంబు గా దనుచు । మదిలోన కోపంబు మాని తా నపుడు॥
ఆస్థానమున దైత్యు లద్భుతంబును బొంది । వినుచుండ నిట్లనియె వికృతరాక్షసుడు॥
ఓరి మర్కట నీవు సారెసారెకు నాతొ । శ్రీరాములని చాల జెప్పేవు నీవు॥
మనుజకులాధముని మరిమరియు నాతోడ । వినతు లొనరించెదవు వెర్రితనమునను॥</poem><noinclude><references/></noinclude>
rf7itcvh487n63j7tu12hd6k14hw1x0
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/71
104
216473
569212
565403
2026-08-08T11:10:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569212
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>మనుజాధముడు హీనమానవుడు నాతోడ । బోర నెంతటివాడు పుడమిలోపలను॥
వాడు జేసినపనులు వొక్కడే నాభటుడు । శలవిస్తె చేసురాక్షణములోపలను॥
క్షుద్రమానవు నధికసుజ్ఞానవంతుడని । ప్రేలెదవు నాయెదుట ప్రల్లదనమునను॥
వానిసన్మార్గములు నే నెరుంగన నాకు । మబ్బు బెట్టుచు వానిమాట జెప్పెదవు॥
తాను పిన్నప్పు డేధర్మంబు దెలియకను । చెలగి తాటకి జంపి స్త్రీహత్య గొనెను॥
పరమదుర్మార్గుడై హరువిల్లు ఖండించి । ఇల మహాదేవునకు యెగ్గు జేసెనుగ॥
తనసతిని రావణదనుజుండు చెరగొన్న । నెరి వాలి జంపెను నిష్కారణముగ॥
హీనకులురా లనక నింగితం బెరుగక । శబరియెంగిలిపళ్లు చవిజూచి తినెను॥
మాయామృగం బగుచు మారీచు డేగగా । గని జాలగాలేక జనె వానివెంట॥
రణములోపల మూర్ఛ గొనినలక్ష్మణు జూచి । చింతించె తా నొక్కజనునిచందమున॥
అట్టిస్త్రీహంతకుం డట్టిస్వామిద్రోహి । అట్టియజ్ఞానుండు అఖిలేశుడటరా॥
చెప్ప నేమున్నది చెప్పెదవు నాయెదుట । సిగ్గుమాలిన వానిచేష్టలన్నియును॥
ఆదివిరాట్పురుషు డతడైతే నీలాటి । అల్పపనులకు నెట్లు ఆలాయపడెను॥
నీ కతడు దొర యనుచు నెరి వాని బొగడితివి । పొగడినంతట రాదు పూజ్య మెవ్వరికి॥
భయము నాకును దోప పలికితివి నీ విట్లు । పలికినందున భయము పడ నించుకైన॥
ఎల్లవారలు జూడ యిపుడు నిన్నును బట్టి । చంపింతు ప్రాణంబు దక్కించుకోర॥
నాభుజబలిమియును నను నీవు దెలియకను । బీరంబు లాడెదవు బెదిరింపదలచి॥
పేర్చి పైబడి బూని పెరికి నలుదిక్కులను । నడురేయి కార్చిచ్చు నటియింపనేర్తు॥
సమయింపగా వచ్చు జంఝానిలంబును । నెరి కదలకుండంగ నిలువనేర్తునుగ॥
అతిసాహసము మీరి అనుకూలశుభమంత్ర । సిద్ధిగా జపములును జేయనేర్తునుగ॥
కడువేడ్క రథములును కరితురంగాదులును । నడిపింపగా నేర్తు వడి యుద్ధమునను॥
ఇట్టిశక్తియు నాకు నిచ్చె వరములు బ్రహ్మ । యమునైన బరిమార్తు నెల్లప్రాభవము॥</poem><noinclude><references/></noinclude>
0glwh47ny2xn22sv6iuf1wwtzt7aq81
పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/172
104
217404
569122
568588
2026-08-07T14:05:29Z
Rajasekhar1961
50
569122
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" />{{rh|162|వల్లూరి సూర్యనారాయణరావు|}}</noinclude>హారమగు అమృతపదార్థము లుండగా, ఆహారమున కేల వెదుకుకొనవలెను?—ఈ శరీరము యెంతరోగ భూయిష్టమైనను, మనము చెప్పినట్లు నడుచుకొనగలదు. మన కాత్మబలము, స్థైర్యము, ఓర్పు, కలిగియున్నచో, దీని నెట్లు నడపవలె నన్న నట్లు నడచును. మన కెక్కడబడితే అక్కడ, బజారులలోను, బయట ప్రదేశములందును, మనకు ఆహారపదార్థములు, అతిస్వల్పఖరీదుకు గాని ఉచితముగా గాని దొరకును. చేతిలో రొక్కమే యుండనక్కరలేక పోవచ్చును, ఎవరిదొడ్లో వారు, కావలసినయాహారపదార్థములను, కట్టుకొనుటకు కావలసిన బట్టను, సంపాదించుకొనవచ్చును. తృప్తికలిగి, మహాత్మగాంధిగారు శలవిచ్చినట్లు, మరునాడు తిండికి నిల్వచేసికొనకూడదనియే సరియైన యాత్మస్వరాజ్యమని నాకు తోచుచున్నది. ఏ రోజునకారోజు ప్రతివాడును తనచేతులతో కష్టపడి కావలసిన అన్నవస్త్రముల రెంటిని సంపాదించుకొనుటయే స్వరాజ్యము.
{{c|సమాప్తము.}}
{{rule|4em}}<noinclude><references/></noinclude>
bul24vtb0vxg28if50a9f5vys4ovs6p
పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.1 (1920).pdf/10
104
217419
569115
567724
2026-08-07T13:16:17Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
569115
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude><section begin="10A" />దేశమం దుత్పత్తి యగుచున్నవి. ఇప్పటికంటెగూడ యెక్కువగఁ బూర్వకాలమం దపరూప పదార్ధము లనేకములు దొఱకుచుండినవి. రత్నములు, సుగంధ ద్రవ్యములు, సుకుమారులు, ధనికు లుపపయోగింపఁ దగిన బట్టలు, మున్నగువాటిని విదేశీయులు మనదేశమందుండియే తీసుకొనిపోవుచుండిరి. మనదేశపు కర్మకారుల నైపుణ్యమద్వితీయమై, విలువగల సామగ్రులసేకము లుత్పత్తి జేయుటయందు దోడ్పడుచుండెను. విస్తారము సంపదగల దగుటచేత, మనదేశమును యితరులు స్వర్ణభూమిగ భావించుచుండిరి. ఈయైశ్వర్యము మనకుఁ గొన్ని విషయముల లాభమును మఱికొన్నిఁటి యందు నష్టమును గలుగఁజేసినది. విదేశీములతోటి వ్యాపార మిందుమూలమున నభివృద్ధిఁ గాంచెను విదేశస్థులను బాబిలోనియా వారు, పారసీకులు, అరబ్బీలు, రోమకులు, ఇతర ఐరోపీయన్లు మొదలగువారు మనదేశమునకు వర్తకులుగ వచ్చుటయు, మనమితర దేశములకు వెళ్ళుటయు, యిందుచే పరులతోటి సాంగత్యము మనకు లభించుటయు వారి నాగరికత మన నాగరికతతో కొంతవఱకు మిళితమై మనయాచారవ్య వహారములలో మార్పులు గలుగుటయు మొదలగు ఫలములనేకములు గలిగినవి. ఇదిగాక విశేష దేహపరిశ్రమ యవసరము లేకయే మనకుఁ గావలసిన పదార్ధము లన్నియు మనకు దొరకుచుండినందున మనవారున్న దానితోఁ దృప్తి చెందుటయు, కొంచెము సోమరులుగ నుండుటయుగూడ సంభవించెను. పాశ్చాత్యదేశములలో బ్రజలు విస్తారముగ కష్టపడినగాని వారికి వలయు నాహారపదార్ధములు దొరకుట లేదు. గనుక వీటిని సులభముగ సంపాదించుట కొన్ని యుపాయముల కనుఁగొనుటకై వారు ప్రకృతిశాస్త్రములయందు విస్తారముగ కృషి చేయవలసి యున్నారు. ఇందుచే పాశ్చాత్య దేశములవలె మనదేశమందు ప్రకృతిశాస్త్రజ్ఞానమభివృద్ధిఁ గాంచలేదు. ఇహలోకమందు సౌఖ్యము సులభముగ లభించుచుండుటచే మనవారు పరలోక జ్ఞాన సంపాద నార్థమై వేదాంతాది ఆధ్యాత్మిక శాస్త్రములలో విచారములు సల్పుచుండిరి. దీని వలన కలిగిన లాభనష్టములు చదువరులే యూహించు కొనెదరు గాక. దేశము సంపదతోఁ దులతూగుచుండినందున దీనిని స్వాధీనము చేసుకొనవలయు ననెడి దురాశ పరులయందు జనించి మన స్వాతంత్య్రమునకు భంగము కలిగెను. దేశచరిత్ర యొక్క నిజతత్వముఁ దెలుసుకొనవలయునన్న దేశస్వభావ నిర్ణయమవసరమని యీయంశముల వలన స్పష్టమగుచున్నది.
{{right|౼ మామిడిపూడి వేంకటరంగయ్య, ఎం.ఏ}}
{{rule |6em }}
<section end="10A" />
<section begin="10B" />- విజ్ఞప్తి..
సీ॥ ఘనగుణాఢ్యాదులు ఉకబ్బముల్ వ్రాయుట, గ్రంథాలయంబుల * శతనఁ గాదె
కాళిదాసాది సత్కవులు పేర్గాంచుట, గ్రంథాలయంబుల శతనఁ గాదె
తొల్లి గైర్వాణి జగల్లాస్య మొనయుట, గ్రంథాలయంబుల కతనఁ గాదె
భారతమాత విశ్వఖ్యాతి గాంచుట, గ్రంథాలయంబుల కతనఁ గాదె
గీ॥ కాలవశమున నడుగంటె గ్రంథ మంది, రంబు లెల్లను భారత ప్రతిభవోలెఁ
గటకటా! పొరదేశక * జ్ఞానమే ప్రబోధకంబయె మనకు సత్పురుషులార! ॥
సీ॥ సృష్టికిఁ బ్రతిసృష్టిఁజేయఁజాలు రసాయ, నాదిక శా శాస్త్రంబు . లబ్బు
కడలికేనియు నాన కట్టఁ గట్టఁగఁ జూలు, శిల్పవిద్యలు వృద్ధిఁ జెందు టెట్లు
వాయునిమా నాది • వస్తువుల్ పచరించు, శాస్త్రవిజ్ఞాన మెంసంగు పెట్లు
ఆశ్రయంబునతీ . తానా గతంబుల, నెఱిఁగించు కృతులు లభించుటెట్లు
3
గీ కటకటా! యన్నియుంబోయెఁ గడకు నున్న, వాని నేనియుఁ జదివెడు వారు లేరు
విశ్వమెల్లను రక్షించు విద్యయొక్క, యాంగిలేయమె నుండి మహాత్ములార!
2o. 5.<section end="10B" /><noinclude><references/></noinclude>
9cdti2bxdmjs1l47sav39g5vxyu45g4
పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.1 (1920).pdf/11
104
217421
569192
567726
2026-08-08T07:55:29Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
569192
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude><section begin="11A" />ఆర్యుల ఉత్తరధృవ నివాసము
ల
సీ॥ పొట్టముల్ కట్టుట • పొంటె బేరులకు స,ర్పించు పొత్తములు లెక్కింపఁ గలమె
మేదర వెట్టెలలో దిక్కులేక చెదలచేఁ గృసించు గ్రంథమ్ము లెన్ని
ప్రకటింపఁ దనఖ్యాతి * భంగమౌనని యెంచు, చీనటుల పుస్తక సంఖ్య యెంత
అక్యులు గొంపోవు నప్పుడు సంద్రమ్ము,నక్ మునింగిన గ్రంథ నావ లెన్ని
గీ యవనరాజులు మునునగ్నియందు వేల్చు, గ్రంథ మందిరముల నెన్నఁ గాఁ దరంబె?
గతమునకు వగవంబని గాదు కాని, తలఁప జల జల రాలు కన్నుల జలంబు.
సీ। అర్పించుఁడయ్య మీయటకలమీఁద త,పం బొనర్చెడు పుస్తకంబు లెల్ల
ననవగతంబు గ్రంథాలయంబున కేగి, చదువుఁడి గ్రంధ గా జంబు లెల్ల
జదువుటయేఁ గాక చదువు నేగనిమూఢ, నరులకు బోధ యొనర్పుఁడయ్య
దాంభిక వ్యయము వృధాగఁ జేయక గ్రంథ, సంచయమ్మును సమార్జించుఁడయ్య
గీ॥ మీదు మీదు యధాశక్తి లేదు యనక, తృణమొ పణమొ యొసంగుచు . ఘనముగాను
శాశ్వతంబుగ నుండెడు • స్థాపనలను, జేసి యళమందుఁ డాంధ్రదేశీయులార!
సీఠి జాతీయ మనుమాట • సంస్మరించినఁ గర్ణములు “శివశివ”యంచు • మూసికొంద్రు
జాతీయ విద్యల సంగతి వచియింప, విద్యయే లేదని వెఱచుచుంద్రు
మనదు ధర్మములు మగ్మము లుపదేశింప, వినకయే పెడ చెవిఁ * బెట్టుచుంద్రు
జాతీయ విద్యల శక్తి యోజింపక, యర్ధము కాలము • వ్యర్ధ
గీ॥ రయ్యయో! యెట్టియజ్ఞాన మందుచుండె, శార్య సంతతి, వేగఁ బూ, ర్వాతిశయమః
పచ్చఁ జెప్పి సద్బోధ యొనర్ను మమ్మ, అనుపమ శ్రీ సమేత యో యాంధ్రమాత ? •
-జంధ్యాల వేంకట శివకవులు.
<section end="11A" />
<section begin="11B" />{{Center|{{p|fs150}}ఆర్యుల ఉత్తరధృవ నివాసము</p>}}
{{Center|{{p|fs125}}వేదప్రమాణసహితము</p>}}
{{Center|{{p|fs125}}శ్రీయుత లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు వ్రాసిన గ్రంథములోని సారాంశము</p>}}
{{Center|{{p|fs125}}ప్రథమాధ్యాయము</p>}}
మనదేశపు చరిత్రనైనను తెలిసికొనఁ గోరినయెడల మన కాధారములేమి? ఆయా దేశముల వారిచే వ్రాసి యుంపఁబడిన చరిత్ర గ్రంధములే ముఖ్యాధారములు. ఈగ్రంథములు మనకుఁ గొంతవఱకే సహాయముఁ జేయగలవు. కాని యంతకంటెను యింక పూర్వకాలపు చరిత్ర దెలిసికొనఁ గోరిన యెడల మనకీ గ్రంథము లేమియును తోడ్పడఁజాలవు. ఈ చరిత్ర గ్రంథముల మూలమున మనమెంత కాలము వఱకు తెలిసికొనగలమో ఆకాలమునకు “చారిత్రక యుగము” అని పేరు బెట్టుదము. ఈ చారిత్రక యుగమును దాటిపోయిన పిమ్మట, మనమీ ప్రపంచస్థితి నెట్లు తెలిసికొనగలము? అప్పటి ప్రజ లెట్లుండెడివారు? ఏవిధముగ వర్తింపుచుండెడివారు? వారియచార వ్యవహారము లెట్లుండెడివి? వీనినన్నింటిని దెలిసికొనుటకు మనకాధారము లేమైనకలవా? ఆయా దేశములవారనాది నుండియు బహుభక్తిశ్రద్ధలతో గౌరవింపుచు బూజింపుచు నుండిన మత గ్రంథములు కొంతవఱకు మనకుఁ దోడ్పడఁగలవు. వారియాచారములును,వారు చెప్పుకొనుచుండు పూర్వగాధలును (Mythologies) కొంతవఱకు మనకు త్రోవఁజూపును, ప్రపంచములో నుండు వివిధ భాషలను పరీక్షించి, చూచి, యొక భాషకును మఱి యొక భాషకును గల తార తమ్యములను, భేదము<section end="11B" /><noinclude><references/></noinclude>
hzgoan4tdpn8n5un8z5udlq40rjolrf
పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.1 (1920).pdf/14
104
217422
569214
567727
2026-08-08T11:45:21Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
569214
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ఈ మంచుయుగ మెన్ని సంవత్సరముల క్రిందట ప్రబలిలనది? ఉత్తరశిలాయుగ మెప్పుడు ప్రబలినది? ఈ కాలనిణ౯యముల వివయమయి యనేకు లనేకయభిప్రాయములను దెలిపియున్నారు. ఉత్తరశిలాయుగపు మట్టిపొరలలో నక్కడక్కడ దొరకిన ఫర్, ఓక్ మొదలగు చీకుడు కర్రలనుబట్టి కొందఱు యీ యుగము క్రీ.పూ. 5 వేల సంవత్సరముల క్రిందటఁ బ్రబలినట్లూహించిరి. ఇఁక పూర్వశిలాయుగ మెప్పుడు ప్రబలినదో విచారింపవలెను. అనగా మంచుయుగము గతించి తదనంతర యుగ మెప్పుడు ప్రారంభ మయినదో విచారింపవలెను.
మంచుయుగమునకు పూర్వము మనుష్యు లీభూగోళముపై ఉత్తర దేశములలో సంచరింపుచుండి, మంచుయుగము రాఁగనే,అతి చలిచేతను, అనేక వందలడుల యెత్తు వఱకును దేశమంతటను మంచుగడ్డలతో నిండియుండుట చేతను, నివాసయోగ్యము
కాని యా ఉత్తరభూములను వదలి, దక్షిణముగా భూమధ్య రేఖ వైపునకు వచ్చినట్లు తెల్లమగుచున్నది. మొదట నివాస యోగ్యముగ నుండి, పిమ్మట మంచు యుగము రాఁగనే దేశముపాడై ప్రజలు నివసించుటకు దుస్సాధ్యమయ్యెను. దేశమంతయు మంచుతోడ గప్పఁబడుటకు కారణమేమి? ఈ మంచు యుగము తటస్థించుటకు కారణమేమి? ఈ మంచుయుగము తటస్థించి నందువలన దేశము యొక్క రూపము, మారిపోవుటకు గల కారణమేమి ? ఈ విషయము లన్నిటిని ద్వితీయాధ్యాయములోఁ జర్చించెదము. ప్రస్తుతము మనము విచారించవలసిన యంశమేమనగా ? ఈ మంచుయుగ మెప్పుడంత మొందినది? ఈ మంచుయుగము తటస్థించుట వలన భూగోళము యొక్క పైభాగమంతయు మారిపోయిన దాని చెప్పియుంటిమి. విస్తారమయిన పర్వతములవంటి మంచుగడ్డల బరువుచేత నిదిపిఱకు ఎత్తుగనున్న భూభాగములు పల్లములైనవి. పల్లముగనున్న భూభాగము లెతైనవి. ఈ పెద్ద పెద్ద మంచుగడ్డలో పర్వత శిఖరములనుండి క్రింది లోయలలోనికి పర్వతపార్శ్వములు వెంబడి జారుటవలన పర్వతపార్శ్వములన్నియు కోతవడినవి. ఇట్లు కోతవడుట కెంత కాలము పట్టును? ఈ విధముగ కొండలలోయలలోఁ బడిన మంచుగడ్డలపై తిరిగి కాలక్రమమున వండుమట్టి మొదలైన మట్టిపొరలు పేరుకొనుట కెంతకాలము పట్టును? వీని సన్నింటిని విచారించి, లెక్కవేసి చూచి, యిదంతయు జరుగుటకు షుమారు 7, 8 వేల సంవత్సరములు పట్టునని ఆమెరికా దేశపు భూగర్భశాస్త్ర వేత్తలు నిర్ణయించిరి. స్విట్జర్లాండ్ దేశపు సరస్సులలోఁ బేరుకొనిన వండుమట్టి పొరలను బట్టి చూడఁగ పూర్వశిలా యుగమంత మొంది (అనగా మంచుయుగ మంతమొంది), ఉత్తరశిలాయుగము ప్రారంభమై షుమారు 7, 8 వేల సంవత్సరము లైనదని నిణ౯యించిరి. ఈ రెండంశము లొకేకాలమును సూచింపుచున్నవి.
కనుక పూర్వ మొకప్పుడు ఉత్తరధృవప్రాంత దేశమంతయు తృణకాష్ట జలసమృద్ధిగ నుండి ప్రజలు నివనించుటకు శీతోష్ణస్ధితి బహు అనుకూలముగ నుండి యుండుటవలన మనపూర్వు లాకాలములో నచ్చట నివనించియున్నట్లును, పిమ్మట కొంత కాలమునకు మంచుయుగము వచ్చి దేశమంతయు మంచుతో ఘనీభవించు కొనిపోగా వారచ్చట నివసించుట కనుకూలముగ లేనందున దక్షిణ దేశములకు వచ్చి చేరినట్లును భూగర్భశాస్త్ర భూనిక్షేప పరిశోధకశాస్త్ర సంబంధమైన నూతన పరిశోధనలవలన నిర్ధారణ చేయఁబడినది, అదిగాక మన పూర్వులొకప్పుడు ఉత్తరధృవప్రాంత దేశములలో నివసించినట్లు వేదములయందు స్పష్టముగఁ గానఁబడుచున్నది. కాని వేదభాష్యకారులకు యీ పైవిషయములు తెలియనందువలనను, యీ భూగోళముయొక్క శీతోష్ణాదిస్థితు లెప్పుడును యిప్పుడున్న విధముననేయుండి యున్నవని వారభిప్రాయ పడినందునను, వేదములలోని గొన్ని కొన్ని ఋక్కులకు అర్ధము తేట తెల్లముగ పైకిఁ గనఁబడుచున్నను వానిని విరిచి పెడఅర్ధములను లాగి యేదో విధముగ అతుకులు పెట్టిరి. ఈ విషయములనన్నిఁటీని ముందధ్యాయములలో విపులముగ చర్చించెదము.
{{right|౼ మానికొండ సత్యనారాయణశాస్త్రి, బి.ఏ.}}
{{rule |6em }}<noinclude><references/></noinclude>
emarwglfaennv6dn725s9649zy4dsij
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/72
104
217452
569120
567785
2026-08-07T13:55:56Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569120
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}11</p>
{{rh|<big>సీమకు ప్రయాణ సన్నాహము</big>||}}
{{Largeinitial|నే}}ను 1887 సంవత్సరమున మెట్రిక్యులేషన్ పరీక్ష ఇచ్చితిని. అపుడు అహమదాబాదు, బొంబాయియు పరీక్షాకేంద్రములు. దేశము దరిద్రమగుటచే కాఠియావాడువిద్యార్థులు దాపునఉన్నట్టియు, కొద్దిఖర్చుతో సరిపోవునట్టియు, అహమదాబాదు కేంద్రమునకే పోవ నభిలషింతురు. మా కుటుంబముయొక్క ఆర్థికస్థితికూడ అంతంతమాత్రముగా నుండుటచే నేనును ఆకేంద్రమునకే పోవలసివచ్చెను. రాజకోట నుండి అహమదాబాదునకు ఒంటరిగ పయనించుట నాకదియే మొదలు.
మెట్రిక్యులేషను అయిన పిదప కాలేజిలో చదువుమని మా పెద్దలు ప్రోత్సహించిరి. భావనగరమునను, బొంబాయిలోను కాలేజీలు కలవు. భావనగరమున ఖర్చు తగ్గును గాన అచటి శ్యామలదాసు కాలేజిలో జేరితిని. చేరితిఁగాని అక్కడ అంతయు అడవిగొడవ. ఉపాధ్యాయులు చెప్పునది నాకు తెలియలేదు. అది వారిలోటు కాదు. ఇంతియకాక అచటి అధ్యాపకులకు పెద్దపేరు. కాని నేను కసరుగాయను. మొదటి ఆఱునెలలు ముగియఁగనే ఇంటికి వెళ్లితిని.
'మావుజీ దవే' అనువారు మా కుటుంబమునకు పురాణమిత్రము. మాకు మంచిచెడుగులు చెప్పువారు. బ్రాహ్మణులు; విద్వాంసులు; వ్యవహారకుశలురు. మా తండ్రిగారు గతించిన పిదపఁగూడ మా కుటుంబ
కష్ట సుఖములను ఆరయుచుండెడివారు. నా సెలవుదినములలో వారు<noinclude><references/>
{{c|54}}</noinclude>
bxqql3pyyzanwibsb8kvyevk5pzb2la
పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.1 (1920).pdf/8
104
217971
569109
2026-08-07T12:33:07Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
569109
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>వాయవ్య భాగమందుండి మనదేశమును బ్రవేసించి, హిందూస్థానమును స్వాధీన పఱచుకొనిన అస్యదేశీయు లనేకులు దక్షిణ దేశపు పరిపాలకులు కాకపోవుటకును, బలవంతులనియు పౌరుషవంతులనియు ప్రఖ్యాతిఁ గాంచిన మహమ్మదీయుల మతము సహితము ఉత్తర యిండియాయందువలె దక్షిణ భాగమందు నాటుకొననందుకు కూడ నిదియే కారణమని జెప్పవచ్చును.
దక్షిణాపధ, దక్షిణ యిండియాలకు మధ్యనున్న కృష్ణా, తుంగభద్రా నదుల దాఁటుట సులభమగుటచే నీ రెండు ప్రదేశములలోని ప్రజలకు పరస్పర భేదము లనేకము లగుపడుట లేదు.
దక్షిణ భాగమును ప్రవేశించఁగోరు పరదేశస్థులకు మెట్టమార్గము కంటె సముద్రమాగ౯ మెక్కువ సుకరమైనది. ప్రాక్పశ్చిమ సముద్రతీరముల రెంటియందును పూర్వకాలమున నిప్పటికంటె రేవుపట్టణము లెక్కువగ నున్నట్టును, వీటిలోఁ గొన్ని కాల వశమునను సముద్ర స్వభావమందు కలిగిన కొన్ని మార్పుల వలనను క్షీణతఁ జెందినట్టును, దేశచరిత్ర వలనఁ దెలియు చున్నది. ఈ రేవుల నాధారఁము జేసికొని దక్షిణ యిండియాకు అన్యదేశీయు లెందఱో వచ్చి యుండవచ్చును కాని కారణాంతరముచేనట్లు జరుగలేదు. ప్రాచీన కాలమందు మనకు తూర్పుగ నుండు బర్మా మొదలగు దేశములలోనివారు నాగరికత
యందును నౌకాబలమందును మనకంటె యుత్కృష్టులు గాకపోవుటచే ఆవైపునుండి తూర్పుతీరపు రేవుల చేరువారెవరును లేరైరి. పశ్చిమదేశము లందలి పారశీకులు, అరబ్బీలు మొదలగువారు వ్యాపారమందు చాల ప్రసిద్ధి గాంచి మనదేశపు పశ్చిమ తీరమునకు వచ్చుచుండిరి గాని పొరుగూడ సముద్రతీరమును దాఁటి దేశము లోని మధ్యభాగమును చొరలేక పోయిరి. దీనికి గారణము పడమటి కనుమలు. ఇవి పశ్చిమ సముద్రమునకును దక్షిణాపధ దక్షిణ యిండియాలకును మధ్యనుండు యెత్తైన
కొండలు. వీటిని దాఁటినఁగాని నీప్రదేశముల లోపలి భాగమును జేరుటకు వీలులేదు. ఈ కొండలు సముద్రతీర సమీప మందుండుటచే, వాటికిని సముద్రమునకును మధ్య నుండు దేశము మిక్కిలి సంకుచితమై అన్యదేశీయు లనేకులు స్థిరనివాసము లేర్పఱచుకొనుటకుఁ గావలసిన వసతులులేక యున్నది. ఈ కనుమల ప్రాంతమందు కాపురముచేయువారు మిక్కిలి పౌరుషవంతులై, స్వతంత్ర రక్షణయందు కడుదీక్షాపరులై యున్నారు. శివాజీకాలము నుండి ప్రసిద్ధి గాంచిన మహారాష్ట్రు లిక్కడివారే. పర్వత ప్రదేశములనివసించు వారగుటచే వీరు సహజ శరీర పటుత్వముగలవారై పర్వత శిఖరములమీఁద దుర్గములగట్టుకొని, పరులెవ్వరు దేశములోనికిఁ జొరకుండునట్లు యుద్ధముఁ జేయుచుండిరి. ఈ కారణము చేత పశ్చిమ తీరమునకు విదేశీయులనేకులు వచ్చుచుండినను, వారు దక్షిణా పథమును గాని దక్షిణ యిండియాను గాని జయించజాలరైరి.
తూర్పు భాగమందుకూడ నిట్లే తూర్పు కనుమలను కొండలున్నవి. ఇవి సముద్రమునకుఁ గొంచెము దూరమందుఁడుటచే, వీటికిని సముద్రతీరమునకును మధ్యనుండు ప్రదేశము విశాలముగనున్నది. ఇందుచేతను, దీనియందు గోదావరి, కృష్ణా,కావేరి మొదలగు గొప్పనదులు ప్రవహించుచుండుట చేతను, దక్షిణ యిండియాలోని తూర్పుభాగము పశ్చిమ భాగముకంటె నెక్కువ సారవంతమై, యెక్కువ ప్రజాసంఖ్యను కలదై ఉత్తమ నాగరికత కనాదిగ నెలవైయున్నది. దేశము సుభిక్షముగా నున్నగాని ప్రజలభివృద్ధిఁ గాంచలేరు. గనుకనే, దక్షిణ దేశమందలి పాండ్య, చోళ, పల్లవ కాకతీయాది ప్రాచీన రాజ్యములన్నియు తూర్పు భాగమునబుట్టి, క్రమ క్రమముగ పశ్చిమ భాగమునకు వ్యాపించగలిగినవి. పశ్చిమ తీరమందలి రాజ్యము లెప్పుడు యింతటి ప్రాముఖ్యతను సంపాదించలేదు. మన నాగరికతా చిహ్నములయిన పుణ్యక్షేత్రములును బ్రశస్త దేవాలయములును తూర్పు భాగమందే యున్నవి. పడమటి కనుమలకును తూర్పుకనుమలకును గల భేదమే, తూర్పు పడమటి ప్రదేశ చరిత్రములలోని యీభేదములకు కారణమాయెను.
మహారాష్ట్రుల స్వాతంత్య్రమును పడమటి కనుమలు రక్షించినట్లు హిందూస్థాన మందలి రాజపుత్రుల స్వరాజ్యమును యెడారులు కాపాడినవి. రాజపుత్ర స్థానములోని యారావలి పర్వతములకుఁ బశ్చిమమున సింధునదీ ప్రాంతము వఱకు యెడారిమయమగు ప్రదేశ మొకటి యున్నది. ఉత్తర యిండియాలోని పంజాబు రాష్ట్రమును జయించినవారు సూటిగ దక్షిణదిక్కున ప్రయాణముఁ'
జేసి యిప్పటిబొంబాయి రాష్ట్రమును ప్రవేసింపకయుండు<noinclude><references/></noinclude>
93qpnfgwidcg9mlquq32uqf1m6144ah
పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.1 (1920).pdf/9
104
217972
569111
2026-08-07T13:00:26Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
569111
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>నట్లు,యీయెడారి యడ్డగించుచున్నది. దీనియందిప్పుడు యోధపురము, బినీరు, జయసల్మీరు మొదలగు స్వదేశ సంస్థానము లున్నవి. మహమ్మదీయులు ఉత్తర యిండియాను జయించినప్పుడు వారియుపద్రవమునుండి తప్పించుకొనుటకై రాజపుత్రులీ యెడారిని బ్రవేశించి, యచ్చట పట్టణముల గట్టుకొని, స్వతంత్రరాజ్యముల స్థాపించుకొనిరి. అది మొదలు వీరిని వళ్ళపఱచు కొనుటకై తురకలనేక పర్యాయములు ప్రయత్నించిరి. కాని వీరి యుద్యమములు పూర్తిగ ఫలింపఁజాలినవి కావు. యెడాదిలో
గొప్ప సైన్యములు ప్రయాణము చేయుట సులభసాధ్యము కాకపోవుటయే దీనికి హేతువు.
పర్వతములు, నదులు, యెడారులు, అడవులు మొదలగునవి యీవిధముగ దేశమును విభజించి కొంత లాభమును మఱికొంత నష్టమును మనకు గలుగఁజేసినవి.
5. పూర్వకాలమందు వన్నెఁగాంచిన నాగరికత లన్నిఁటికిని గొప్పనదులు ప్రవహించు ప్రదేశములు జన్మస్థాపములుగ నుండెను, నైలునదీ తీరమందలి యీజిప్టు దేశమును, యూఫ్రటీసు, టైగ్రీసు నదులు ప్రవహించు బాబిలోనియా, ఆసిరియా, పారసీక సామ్రాజ్యములును, హొయాంగ్ హొ, యాంగ్సీకియాంగ్ నదుల తీరమందుండు చీనా దేశమును దీనికి నిదర్శనములుగ నున్నవి. మన దేశముకూడ నిట్టిదియనియే జెప్పవచ్చును. హిందూస్థానమందు సింధు, యమునా, గంగా, బ్రహ్మపుత్రాది నదులును, దక్షిణదేశమందు నర్మదా, తపతీ, మహానది, గోదావరి, కృష్ణా, కావేరీనదులును, ప్రవహించుచున్నవి. ప్రసిద్ధిఁ గాంచిన మౌర్య, ఆంధ్ర, గుప్త, శ్రీహర్ష, చోళ, విజయనగరాది సామ్రాజ్యముల కన్నిఁటికి యీ నదులే మూలాధారములై వాటియౌన్నత్యమును విస్తరింపఁజేసినవి. ప్రజల నైశ్వర్యవంతులఁ జేయుటయందును, తన్మూలమున ప్రభువుల శక్తి సంపన్నులఁ గావించుట యందును, నదులవలె నుపచరింపగలవి మరేమియులేవు. వీటి నన్నిఁటిలో ముఖ్యముగ గంగానది మనకు గావించిన యుపకార మింతింతియని జెప్పుటకు సాధ్యము కాదు. ఈ నది ప్రవహించు ప్రదేశమత్యంత సారవంతమై, ప్రజలకు నీటి లోపమును గలుగఁజేయక, సమస్తమైన పంటలకు నెలవై, కర్షకులకు వలయు నాహార పదార్థముల సులభముగను పరిమితముగ నుత్పత్తిఁ జేయించుచు, ప్రపంచములోని గణనీయములగు సుక్షేత్రములలో నొక్కటియై వెలయుచున్నది. దీనియందు, ముఖద్వారము మొదలు ప్రవాహసహాయమున ననేక వందల మైళ్ళవఱకు వర్తకపుటోడలు ప్రయాణముఁజేయట కవకాళమున్నది. ఇందుచేఁ బ్రజలకు జీవనోపాయము సులభముగ దొఱకుటయు, తన్మూలమున వారు విద్యాసంపన్నులై, నాగరికతాగ్రగణ్యు లగుటయు సంభవించు చున్నది. గంగానది తీరమందున్న పాటలీపుత్రమును రాజధానిగాఁ గలవారగుటచేతను, దాని ప్రాంతమందలి సారవంతమైన ప్రదేశముల స్వాధీనపఱచుకొనుట చేతను, మౌర్య చక్రవర్తులు మిగిలినవారికంటే ముందుగ మన దేశమున మొదటి సామ్రాజ్యమును స్థాపించఁగలిగిరి. స్థానేశ్వరము, ఇంద్రప్రస్థము, కన్యాకుబ్జము, ప్రయాగ, వారణాసి, పాటలీపుత్రము, కాళీఘట్టము మొదలగు ప్రఖ్యాత నగరములన్నియు గంగ యొక్క లేక దాని ప్రధాన యుపనదియగు యమున యొక్కయో తీరమందున్నవి. మన మతమునకును సారస్వతమునకును శాస్త్రములకును యిదియే జన్మస్థానము. ఈనదుల ప్రాధాన్యము చేతనే మన దేశపు చరిత్రయందు దక్షిణభాగముకన్న హిఁదూస్థాన మెక్కువ యాధిక్యతను బొందఁగలిగెను. తుదకు యిటీవల గూడ, ఆంగ్లేయులు దేశమునంతయు సులభముగ స్వాధీనపఱచుకొనుటకు గంగానది ప్రవహించు బంగాళా రాష్ట్రమును వారు మున్ముందుగ జయించుటయే కారణము. బ్రహ్మపుత్రానదిలో చాల భాగము మన దేశమున కావలగ హిమవత్పర్వతమున కుత్తరముగ నుండుటచేతను, సింధు నదీ ప్రాంతములోని ప్రదేశములు యెడారిమయములుగ నుండుటచేతను యివి ప్రవహించు భాగము గంగా, యమునా నదీ తీర దేశములంతటి ప్రాముఖ్యతను గాంచలేదు. ఇట్టిలోపములు గొన్ని కొన్ని నదులలో కనుపడినను మొత్తముమీఁద మనమైశ్వర్యమున కంతయు నదులే మూల కారణములని జెప్పవచ్చును.
6. ప్రాచీన కాలమునందుండి మన దేశము సుభిక్షమగు దేశములలో ముఖ్యమైనదిగా పరిగణించబడుచున్నది. నదులు, సారవంతమైన నేల, యుక్తమగు శీతోష్ణస్థితి, దట్టములైన ఆడవులు, సారముగల గనులు మొదలగు స్వభావ సిద్ధమైన సౌకర్యము లనేకము లుండుటవలన, సమస్త ధాన్యములు, పైరులు, లోహములు, కంప్యములు మన<noinclude><references/></noinclude>
62p0z26hvq85i1vsg06j6musp6qkfdw
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/69
104
217973
569114
2026-08-07T13:09:35Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569114
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>10 మతములలో స్వల్పప్రవేశము</big>}}</noinclude>ననియు, వేషమునుగూడ మార్పక తప్పక పోయెననియు, పిదప అతఁ డు హాటుతోకూడ సర్వము పాశ్చాత్యవేశేషముతో సంచరించుచుండెననియు ఊరును నాడును మ్రోఁగిపోయెను. ఈమాట వినఁగా నాకు
వ్యధకలిగెను. గోమాంసము తినుట, సారా త్రావుట, వేషము మార్చుట, వీనిని విధించు మతము మత మనిపించుకొన దని తలఁచితిని, ఈక్రొత్త క్రైస్తవుఁడు అప్పటికప్పుడే తనపెద్దల మతమును, వారి ఆచారములను వారి దేశమును నిందింప మొదలిడె ననియు వింటిని. ఇవి అన్నియు క్రైస్థవమతముపట్ల అరుచి పుట్టించెను.
ఈరీతిగా నాకు ఇతరమతములందు సమభావము కలిగె నన్నంతమాత్రమున నాకు ఈశ్వరునియందు గాఢమగు శ్రద్ధ ఉండె నన్న మాటకాదు. ఈసమయమున నాకు మాతండ్రిగారి గ్రంథసంచయమున ఉన్న మనుస్మృతి చూడ పొసఁగెను. అందలి సృష్టి మొదలగు విషయములు నాకు ఎక్కువగా శ్రద్ధ కలిగింపకపోవు టటుండ, కొంచెము నాస్తి కత కలిగించెను.
అపుడచట మాపితృన్యపుత్రుఁడు కలఁడు. అతఁడు గొప్ప మేధావి అని నాతలఁపు. అతనికి నాసందియము లెఱిఁగించితిని గాని ఆయన వానిని పోఁగొట్టలేదు. 'నీవు పెద్దవాఁడ వైనపుడు నీయంతట నీకే తెలియఁగలవు. నీవేమి? నీయీడునకు ఈపశ్న లేమి? ఇవి నీ యీడునకు తగవు' అని యీమాటలతో నన్ను పంపివేసెను. నేను ఊరకుంటిని గాని మనసులో తృప్తి లేదు. మనుస్మృతిలోేని భక్ష్యాభక్ష్య ప్రకరణము మొదలైనవి లోకాచారమునకు విరుద్ధముగా ఉన్నటులు కానిపించెను. దీనికిఁగూడ ఆయన అదియే సమాధానము<noinclude><references/>
{{c|51}}</noinclude>
rymh30cgghsxb6rp5bnvca16ckgwvtb
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/70
104
217974
569116
2026-08-07T13:20:20Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569116
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>చెప్పెను. తెలివియు, విద్యయు బాగుగా అభివృద్ధి చెందినపిదప నేను బాగుగా తెలిసికొనఁ గల నని నాలో నే ననుకొంటిని.
అపుడు మనుస్మృతి అహింసను బోధింపలేదు. నేను నామాంసభోజనకథను పైన చెప్పియుంటిని. మనుస్మృతి ఆ మాంసభోజనము పక్షమే అని తోచినది.
పాములు, నల్లులు మొదలయినవానిఁ జంపుటకూడ నీతివిహితమే అని అనుకొంటిని. ఆసమయమున అదియొక విధి యనుకొని నల్లులు మొదలగు వానిని చంపియున్నటులు గుఱుతు.
కాని ఒకవిషయము నాలో వేరుతన్నుకొనెను. అది యేదనఁగా, 'సృష్టికి నీతి మూలము, నీతికి సత్యము మూలాధారము' అనునది. కావున నాకు సత్యమే కావలసినది. దైనందినము సత్యము యొక్క మహిమ నాదృష్టిలో పెరుగుచున్నది; మరియు దానిని గుఱించి నాయొనర్చిన లక్షణమును విస్తారమగుచునే యున్నది.
మరియు ఒకగుజరాతీ నీతిపద్యమును నాహృదయమున అంకితమై పోయెను. అందలి 'అపకారికి ఉపకారము చేయుట' అనునది నాకు జీవనసూత్ర మాయెను. నేను అనేక ప్రయోగములు కూడ చేసి
చూచితి ననిన నాకు దానిపై నెంతగుఱియో తెలియఁగలదు. ఇచట ఆచమత్కారములగు పద్యముల నుదాహరింతును.
<poem>
{{left margin|5em}}
సీ. జలమును నీ కీయఁగలవాని కెందేని నొసఁగుమీ కడుపార నోగిరంబు
వందనంబును జేయువానికిఁ జేయుమీ భక్తిమై సాష్టాంగవందనంబు
దమ్మిడి నీకిచ్చు ధన్యాత్మునకు మాఱుగానిమ్ము మేల్మిబంగారుకాసు
కష్టంబులందు నక్కఱవచ్చువానికి నిమ్ము నీనెమ్మేనినేని కోసి
</poem><noinclude><references/>
{{c|52}}</noinclude>
3subz6fbbmjywf5zqi55mqqzmfz836v
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/71
104
217975
569118
2026-08-07T13:44:49Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569118
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>10 మతములలో స్వల్పప్రవేశము</big>}}</noinclude><poem>
{{left margin|5em}}
ఒకటి యొసఁగినఁ బదిరెట్టు లొసఁగవలయు
చెట్ట చేసిన మేలును జేయవలయు
ప్రాఁతకాలము నాఁటి యీ చేఁత లెల
ఆనుపూర్విగ సత్యరహస్య మరయ.<ref>పాణీ ఆపనె పాయ, భలుం భోజన తో డీజే,
ఆవీ నమావే శీశ, దండవత కోడే కీజే;
ఆపణ ఘానే బామ, కామ మహోలో మ: శరీఏ,
ఆప ఉగారే ప్రాణ తే తణా దుఃఖ మాం మరీఏ;
గుణ కే డేతో గుణదశ గణో, మన వాచా కర్తే కరీ,
అవగుణ కే డే జే గుణకరే, తే జిగమాం జీత్యో సహీ.</ref>
</poem><noinclude><references/>
{{c|53}}</noinclude>
j1eftgq5tltc772431mw11pbrapr7q7
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/73
104
217976
569121
2026-08-07T14:04:00Z
శ్రీరామమూర్తి
1517
/* సమస్యాత్మకం */
569121
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>11 సీమకు ప్రయాణ సన్నాహము</big>}}</noinclude>మా యింటికి వచ్చిరి. ఆయన మా అమ్మగారితోను, పెద్ద అన్నగారితోను సంభాషించుచు నా చదువునుగూర్చి ముచ్చటించిరి. నేను శ్యామలదాసు కాలేజిలో చదువుచుంటినని తెలిసికొని, “ఇపుడు కాలము తాఱుమాఱయినది. తగినవిద్య లేక మీలో నెవరును మీ తండ్రిగారి హోదా పొంద నాశింపఁజాలరు. ఈ కుర్రవాఁ డింకను చదువుకొనుచు ఉండుటవలన ఇతఁడు ఆ హోదాను నిలుపుకొనునట్లు చూడవలెను. ఇతఁ డింకను బి.ఏ. ప్యాసు అగుటకు నాలుగై దేండ్లు పట్టును. అంతవఱకు తంటాలు పడినను నెలకు ఏఁబది అఱువది రూపాయలు సంపాదింపఁగలుగునే కాని దివాను కాలేఁడు. ఇతఁడు నా కుమారునివలె లాయరు అగుటకు ఇంకను చాల కాలము పట్టును. నాఁటికి దివానుగిరికి ప్రయత్నించు లాయరులు పలువురు ఉందురు. మీ రితనిని ఇంగ్లండు పంపుట శ్రేయమని అభిప్రాయము. బారిస్టరగుట చులకన అని నా కొడుకు కేవలరాము చెప్పును, మూఁడేండ్లకు తిరిగి రావచ్చును. వ్యయమును నాలుగైదు వేలకు మించదు. ఇంగ్లాండునుండి బారిస్టరై తిరిగివచ్చిన ఆక్రొత్తయాతఁ డెంత దర్జాగా ఉన్నాఁడో చూడుఁడు! అతఁడు అడిగినఁ జాలు, దివానుగిరి యిత్తురు. ఈ సంవత్సరమే మోహన దాసును ఇంగ్లాండు పంపుట నాకు మిగుల అభిమతము.<noinclude><references/>
{{c|55}}</noinclude>
lyo1tq5mwbf43hfpy2avw2ot5x98djk
పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/121
104
217977
569131
2026-08-07T15:23:34Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569131
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|111}}</noinclude>{| class="wikitable" style="margin:auto;"
|-
| నర్పించి, కొవ్వూరుగ్రామములో యేబదివేల రూపాయీల స్థిరాస్థితో "ఆంధ్రగీర్వాణ విద్యాపీఠమను" నొక సంస్థాపనను నిర్మించిన వాడగు లేటు తల్లాప్రగడ సూర్యనారాయణరావు గారు ది 6 - 3 - 26 తారీఖున
శివసాన్నిధ్యమును చేరినారు. ఆయననామము ఆ చంద్రార్కముగ నుండునట్లు తోడ్పడుట నా విధాయక కృత్యమనియెంచి, నా స్వార్జితమగు తూర్పుగోదావరిజిల్లా రామచంద్రపురం తాలూకా ఆలమూరు కో ఆపరేటివ్ ల్యాండు మార్గేజి బ్యాంకులోనున్న నెం 31 to 42 నెంబర్లుగల పండ్రెండువేల రూపాయీల డిబెంచర్లను యీ క్రిందిషరతులతో యీ క్రింద వివరింపబోవు విషయములను నెరవేర్చుటకు||for 15 years, established a public charita-ble Educational Institution called Andhra Girvana Vidyapitham having immovable properties worth about Rs. 50000 and died on 6th March 1926. I feel it my bounden duty to perpetuate his name for ever in the Andhra Desa, as far as it lies in my power and I therefore hereby endow my twelve thousand rupees worth of Debentures Nos. 31 to 42 both inclusive, now in the Co-operative Land Mortgage Bank at Alamuru, Ramachandrapur Taluk, East Godavari District, as a public trust for the following objects, subject to the following conditions.|}<noinclude><references/></noinclude>
0vx5zwtdaps6qx7a4hyiq2g20w6xp1f
569132
569131
2026-08-07T15:24:11Z
శ్రీరామమూర్తి
1517
569132
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|111}}</noinclude>{| class="wikitable" style="margin:auto;"
|-
| నర్పించి, కొవ్వూరుగ్రామములో యేబదివేల రూపాయీల స్థిరాస్థితో "ఆంధ్రగీర్వాణ విద్యాపీఠమను" నొక సంస్థాపనను నిర్మించిన వాడగు లేటు తల్లాప్రగడ సూర్యనారాయణరావు గారు ది 6 - 3 - 26 తారీఖున
శివసాన్నిధ్యమును చేరినారు. ఆయననామము ఆ చంద్రార్కముగ నుండునట్లు తోడ్పడుట నా విధాయక కృత్యమనియెంచి, నా స్వార్జితమగు తూర్పుగోదావరిజిల్లా రామచంద్రపురం తాలూకా ఆలమూరు కో ఆపరేటివ్ ల్యాండు మార్గేజి బ్యాంకులోనున్న నెం 31 to 42 నెంబర్లుగల పండ్రెండువేల రూపాయీల డిబెంచర్లను యీ క్రిందిషరతులతో యీ క్రింద వివరింపబోవు విషయములను నెరవేర్చుటకు||for 15 years, established a public charita-ble Educational Institution called Andhra Girvana Vidyapitham having immovable properties worth about Rs. 50000 and died on 6th March 1926. I feel it my bounden duty to perpetuate his name for ever in the Andhra Desa, as far as it lies in my power and I therefore hereby endow my twelve thousand rupees worth of Debentures Nos. 31 to 42 both inclusive, now in the Co-operative Land Mortgage Bank at Alamuru, Ramachandrapur Taluk, East Godavari District, as a public trust for the following objects, subject to the following conditions.
|}<noinclude><references/></noinclude>
3xanmhj0vdfzjjnhm2qwrxnanixkkks
569133
569132
2026-08-07T15:25:56Z
శ్రీరామమూర్తి
1517
569133
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|111}}</noinclude>{| class="wikitable" style="margin:auto;"
|-
|+
|-
| నర్పించి, కొవ్వూరుగ్రామములో యేబదివేల రూపాయీల స్థిరాస్థితో "ఆంధ్రగీర్వాణ విద్యాపీఠమను" నొక సంస్థాపనను నిర్మించిన వాడగు లేటు తల్లాప్రగడ సూర్యనారాయణరావు గారు ది 6 - 3 - 26 తారీఖున
శివసాన్నిధ్యమును చేరినారు. ఆయననామము ఆ చంద్రార్కముగ నుండునట్లు తోడ్పడుట నా విధాయక కృత్యమనియెంచి, నా స్వార్జితమగు తూర్పుగోదావరిజిల్లా రామచంద్రపురం తాలూకా ఆలమూరు కో ఆపరేటివ్ ల్యాండు మార్గేజి బ్యాంకులోనున్న నెం 31 to 42 నెంబర్లుగల పండ్రెండువేల రూపాయీల డిబెంచర్లను యీ క్రిందిషరతులతో యీ క్రింద వివరింపబోవు విషయములను నెరవేర్చుటకు||for 15 years, established a public charita-ble Educational Institution called Andhra Girvana Vidyapitham having immovable properties worth about Rs. 50000 and died on 6th March 1926. I feel it my bounden duty to perpetuate his name for ever in the Andhra Desa, as far as it lies in my power and I therefore hereby endow my twelve thousand rupees worth of Debentures Nos. 31 to 42 both inclusive, now in the Co-operative Land Mortgage Bank at Alamuru, Ramachandrapur Taluk, East Godavari District, as a public trust for the following objects, subject to the following conditions.
|}<noinclude><references/></noinclude>
n3ncmv9bf37z5nk2gbs3w1w3k45ij9q
569134
569133
2026-08-07T15:29:05Z
శ్రీరామమూర్తి
1517
569134
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|111}}</noinclude>{| class="wikitable"
|+
|-
| నర్పించి, కొవ్వూరుగ్రామములో యేబదివేల రూపాయీల స్థిరాస్థితో "ఆంధ్రగీర్వాణ విద్యాపీఠమను" నొక సంస్థాపనను నిర్మించిన వాడగు లేటు తల్లాప్రగడ సూర్యనారాయణరావు గారు ది 6 - 3 - 26 తారీఖున
శివసాన్నిధ్యమును చేరినారు. ఆయననామము ఆ చంద్రార్కముగ నుండునట్లు తోడ్పడుట నా విధాయక కృత్యమనియెంచి, నా స్వార్జితమగు తూర్పుగోదావరిజిల్లా రామచంద్రపురం తాలూకా ఆలమూరు కో ఆపరేటివ్ ల్యాండు మార్గేజి బ్యాంకులోనున్న నెం 31 to 42 నెంబర్లుగల పండ్రెండువేల రూపాయీల డిబెంచర్లను యీ క్రిందిషరతులతో యీ క్రింద వివరింపబోవు విషయములను నెరవేర్చుటకు||for 15 years, established a public charita-ble Educational Institution called Andhra Girvana Vidyapitham having immovable properties worth about Rs. 50000 and died on 6th March 1926. I feel it my bounden duty to perpetuate his name for ever in the Andhra Desa, as far as it lies in my power and I therefore hereby endow my twelve thousand rupees worth of Debentures Nos. 31 to 42 both inclusive, now in the Co-operative Land Mortgage Bank at Alamuru, Ramachandrapur Taluk, East Godavari District, as a public trust for the following objects, subject to the following conditions.
|}<noinclude><references/></noinclude>
bj1dtgya9xrmb1rarlmeu4qwbcgncns
569135
569134
2026-08-07T15:31:22Z
శ్రీరామమూర్తి
1517
569135
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|111}}</noinclude>{| class="wikitable"
|+
|-
| నర్పించి, కొవ్వూరుగ్రామములో యేబదివేల రూపాయీల స్థిరాస్థితో "ఆంధ్రగీర్వాణ విద్యాపీఠమను" నొక సంస్థాపనను నిర్మించిన వాడగు లేటు తల్లాప్రగడ సూర్యనారాయణరావు గారు ది 6 - 3 - 26 తారీఖున
శివసాన్నిధ్యమును చేరినారు. ఆయననామము ఆ చంద్రార్కముగ నుండునట్లు తోడ్పడుట నా విధాయక కృత్యమనియెంచి, నా స్వార్జితమగు తూర్పుగోదావరిజిల్లా రామచంద్రపురం తాలూకా ఆలమూరు కో ఆపరేటివ్ ల్యాండు మార్గేజి బ్యాంకులోనున్న నెం 31 to 42 నెంబర్లుగల పండ్రెండువేల రూపాయీల డిబెంచర్లను యీ క్రిందిషరతులతో యీ క్రింద వివరింపబోవు విషయములను నెరవేర్చుటకు || for 15 years, established a public charita-ble Educational Institution called Andhra Girvana Vidyapitham having immovable properties worth about Rs. 50000 and died on 6th March 1926. I feel it my bounden duty to perpetuate his name for ever in the Andhra Desa, as far as it lies in my power and I therefore hereby endow my twelve thousand rupees worth of Debentures Nos. 31 to 42 both inclusive, now in the Co-operative Land Mortgage Bank at Alamuru, Ramachandrapur Taluk, East Godavari District, as a public trust for the following objects, subject to the following conditions.
|}<noinclude><references/></noinclude>
phecp0f7cwsliykvgpt8dyc2utgh0cw
569138
569135
2026-08-07T15:48:54Z
శ్రీరామమూర్తి
1517
569138
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|111}}</noinclude>
{| class="wikitable"
|+
|-
| నర్పించి, కొవ్వూరుగ్రామములో యేబదివేల రూపాయీల స్థిరాస్థితో "ఆంధ్రగీర్వాణ విద్యాపీఠమను" నొక సంస్థాపనను నిర్మించిన వాడగు లేటు తల్లాప్రగడ సూర్యనారాయణరావు గారు ది 6 - 3 - 26 తారీఖున
శివసాన్నిధ్యమును చేరినారు. ఆయననామము ఆ చంద్రార్కముగ నుండునట్లు తోడ్పడుట నా విధాయక కృత్యమనియెంచి, నా స్వార్జితమగు తూర్పుగోదావరిజిల్లా రామచంద్రపురం తాలూకా ఆలమూరు కో ఆపరేటివ్ ల్యాండు మార్గేజి బ్యాంకులోనున్న నెం 31 to 42 నెంబర్లుగల పండ్రెండువేల రూపాయీల డిబెంచర్లను యీ క్రిందిషరతులతో యీ క్రింద వివరింపబోవు విషయములను నెరవేర్చుటకు || for 15 years, established a public charita-ble Educational Institution called Andhra Girvana Vidyapitham having immovable properties worth about Rs. 50000 and died on 6th March 1926. I feel it my bounden duty to perpetuate his name for ever in the Andhra Desa, as far as it lies in my power and I therefore hereby endow my twelve thousand rupees worth of Debentures Nos. 31 to 42 both inclusive, now in the Co-operative Land Mortgage Bank at Alamuru, Ramachandrapur Taluk, East Godavari District, as a public trust for the following objects, subject to the following conditions.
|}<noinclude><references/></noinclude>
lkiqjvosjsrl354uajl4erpq0odeow2
పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/122
104
217978
569136
2026-08-07T15:44:45Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569136
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{| class="wikitable"
|+
|-
| కోవూరు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠ పాలకసంఘమువారిని ట్రస్టీలుగాయేర్పరచి యీడిక్లరేషన్ ఆఫు ట్రస్టుదస్తావేజును వ్రాయుచున్నాను. ||
|-
| 2. పైన ఉదహరించిన డిబెంచర్లమీద ప్రతి ఆరుమాసములకు వచ్చువడ్డీని మాత్రమే కోవూరు విద్యాపీఠ పాలకసంఘము ఖర్చు చేయుచుండవలెగాని, అసలు మొత్తము శాశ్వతమూలనిధిగా యెల్ల కాలముండవలెను.
ఈ డిబెంచర్ల గడువానంతరముకూడ వీనిమీదవచ్చువడ్డి తగ్గినను, హెచ్చినను కో ఆపరేటివు ల్యాండుమా ర్గేజిబ్యాంకులోనే యీ అసలు మొత్తము వేయుచుండవలెను. గాని భూములు, యిల్లు మొదలగు స్థిరాస్తులను
కొనకూడదు. || II. The above Debentures should be kept as a permanent fund and the interest alone thereon accruing every six months utilised from time to time. At the expiry of the 20 years period of deposit the corpus should be invested in the Cooperative Land Mortgage Banks alone. whatever be the rate of interest payable but not in the purchase of lands, houses or any other kind of immovable property.|}<noinclude><references/></noinclude>
bkgqdsl729wdbd4wx5hecon5q0k5e2n
569137
569136
2026-08-07T15:45:46Z
శ్రీరామమూర్తి
1517
569137
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|112|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>{| class="wikitable"
|+
|-
| కోవూరు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠ పాలకసంఘమువారిని ట్రస్టీలుగాయేర్పరచి యీడిక్లరేషన్ ఆఫు ట్రస్టుదస్తావేజును వ్రాయుచున్నాను. ||
|-
| 2. పైన ఉదహరించిన డిబెంచర్లమీద ప్రతి ఆరుమాసములకు వచ్చువడ్డీని మాత్రమే కోవూరు విద్యాపీఠ పాలకసంఘము ఖర్చు చేయుచుండవలెగాని, అసలు మొత్తము శాశ్వతమూలనిధిగా యెల్ల కాలముండవలెను.
ఈ డిబెంచర్ల గడువానంతరముకూడ వీనిమీదవచ్చువడ్డి తగ్గినను, హెచ్చినను కో ఆపరేటివు ల్యాండుమా ర్గేజిబ్యాంకులోనే యీ అసలు మొత్తము వేయుచుండవలెను. గాని భూములు, యిల్లు మొదలగు స్థిరాస్తులను
కొనకూడదు. || II. The above Debentures should be kept as a permanent fund and the interest alone thereon accruing every six months utilised from time to time. At the expiry of the 20 years period of deposit the corpus should be invested in the Cooperative Land Mortgage Banks alone. whatever be the rate of interest payable but not in the purchase of lands, houses or any other kind of immovable property.|}<noinclude><references/></noinclude>
j3tlqdb1x0cmmgeyiqmyn95apq75h5k
569166
569137
2026-08-07T19:00:50Z
శ్రీరామమూర్తి
1517
569166
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|112|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>{| class="wikitable"
|+
|-
| కోవూరు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠ పాలకసంఘమువారిని ట్రస్టీలుగాయేర్పరచి యీడిక్లరేషన్ ఆఫు ట్రస్టుదస్తావేజును వ్రాయుచున్నాను. ||
|-
| 2. పైన ఉదహరించిన డిబెంచర్లమీద ప్రతి ఆరుమాసములకు వచ్చువడ్డీని మాత్రమే కోవూరు విద్యాపీఠ పాలకసంఘము ఖర్చు చేయుచుండవలెగాని, అసలు మొత్తము శాశ్వతమూలనిధిగా యెల్ల కాలముండవలెను.
ఈ డిబెంచర్ల గడువానంతరముకూడ వీనిమీదవచ్చువడ్డి తగ్గినను, హెచ్చినను కో ఆపరేటివు ల్యాండుమా ర్గేజిబ్యాంకులోనే యీ అసలు మొత్తము వేయుచుండవలెను. గాని భూములు, యిల్లు మొదలగు స్థిరాస్తులను
కొనకూడదు. || II. The above Debentures should be kept as a permanent fund and the interest alone thereon accruing every six months utilised from time to time. At the expiry of the 20 years period of deposit the corpus should be invested in the Cooperative Land Mortgage Banks alone. whatever be the rate of interest payable but not in the purchase of lands, houses or any other kind of immovable property.
|}<noinclude><references/></noinclude>
rvp2oaxker0g8q5dvtrc8qwzy2qu45k
569173
569166
2026-08-07T21:10:11Z
శ్రీరామమూర్తి
1517
569173
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|112|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>{| class="wikitable"
|+
|-
| కోవూరు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠ పాలకసంఘమువారిని ట్రస్టీలుగాయేర్పరచి యీడిక్లరేషన్ ఆఫు ట్రస్టుదస్తావేజును వ్రాయుచున్నాను. ||
|-
| 2. పైన ఉదహరించిన డిబెంచర్లమీద ప్రతి ఆరుమాసములకు వచ్చువడ్డీని మాత్రమే కోవూరు విద్యాపీఠ పాలకసంఘము ఖర్చు చేయుచుండవలెగాని, అసలు మొత్తము శాశ్వతమూలనిధిగా యెల్ల కాలముండవలెను.
ఈ డిబెంచర్ల గడువానంతరముకూడ వీనిమీదవచ్చువడ్డి తగ్గినను, హెచ్చినను కో ఆపరేటివు ల్యాండుమార్గేజిబ్యాంకులోనే యీ అసలు మొత్తము వేయుచుండవలెను. గాని భూములు, యిల్లు మొదలగు స్థిరాస్తులను కొనకూడదు. || II. The above Debentures should be kept as a permanent fund and the interest alone thereon accruing every six months utilised from time to time. At the expiry of the 20 years period of deposit the corpus should be invested in the Cooperative Land Mortgage Banks alone. whatever be the rate of interest payable but not in the purchase of lands, houses or any other kind of immovable property.
|}<noinclude><references/></noinclude>
0kuq2az8zhg1euirz4ochp9gh6jx5bv
పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/123
104
217979
569143
2026-08-07T16:41:07Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '3. నేనున్ను, నా యిద్దరు కొమాళ్లు "కృష్ణమోహన్ M. A. B. L. Advocate మ ద్రాసున్ను, జగన్మోహన్ B. A L.E.E. Elec- Strical Engineer బొంబాయిన్ని కోవూరు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠ పాలక సంఘములో జీవితకాలపు మెంబర్లుగా నుం...'
569143
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|113}}</noinclude>3. నేనున్ను, నా యిద్దరు కొమాళ్లు
"కృష్ణమోహన్ M. A. B. L. Advocate
మ ద్రాసున్ను, జగన్మోహన్ B. A L.E.E. Elec-
Strical Engineer బొంబాయిన్ని కోవూరు
ఆంధ్రగీర్వాణ విద్యాపీఠ పాలక సంఘములో
జీవితకాలపు మెంబర్లుగా నుండవలెను. ఈ
ముగ్గురులో యెనరైనను అన్యగ్రామములలో
నున్న పుడు సదరు విద్యాపీఠ పాలక సంఘ కార్య
నిర్వాహక సంఘ సమావేశములలో పాల్గొని
వోట్లు వేయుటకును, ఉద్యోగీయులుగా నుం
డుటకును, వారి యిష్టమువచ్చినవారిని, మరి
యొక్కొక్కరిని రాజమహేంద్రవరము
కోవూరు గ్రామస్ధులలోనుండి మెంబరుగా నా
మినేటు చేసి, పాలక సంఘ సెక్రటరీకి ముందు
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri
III. Myself and my two sons Krishna
Mohan, M.A., B.L. Advocate, Madras and
Jagan Mohan, B. A. L. E. E., Electrical
Engineer, Bombay, should be permanent
members for their lives in the Govern-
ing body of the Vidyapitham and during
their absence from Kovvur, should have
each of them the power to nominate a
resident of Rajahmundry or Kovvur to
act in their stead both in the General
Body's and its executive committee's
meetings of the Vidyapitham for the
purpose of voting and also acting as
office bearers too, if necessary after
giving previous intimation to the
Secretary or the President of the General
Body.
స్వీయ చరి
(a
118<noinclude><references/></noinclude>
0mvef94zm2nuli9yqcytysaknu2ixoz
569145
569143
2026-08-07T16:43:05Z
శ్రీరామమూర్తి
1517
569145
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|113}}</noinclude>3. నేనున్ను, నా యిద్దరు కొమాళ్లు
"కృష్ణమోహన్ M. A. B. L. Advocate
మ ద్రాసున్ను, జగన్మోహన్ B. A L.E.E. Elec-
Strical Engineer బొంబాయిన్ని కోవూరు
ఆంధ్రగీర్వాణ విద్యాపీఠ పాలక సంఘములో
జీవితకాలపు మెంబర్లుగా నుండవలెను. ఈ
ముగ్గురులో యెనరైనను అన్యగ్రామములలో
నున్న పుడు సదరు విద్యాపీఠ పాలక సంఘ కార్య
నిర్వాహక సంఘ సమావేశములలో పాల్గొని
వోట్లు వేయుటకును, ఉద్యోగీయులుగా నుం
డుటకును, వారి యిష్టమువచ్చినవారిని, మరి
యొక్కొక్కరిని రాజమహేంద్రవరము
కోవూరు గ్రామస్ధులలోనుండి మెంబరుగా నా
మినేటు చేసి, పాలక సంఘ సెక్రటరీకి ముందు
CC-0. Jangamwadi Math Collection. Digitized by eGangotri
III. Myself and my two sons Krishna
Mohan, M.A., B.L. Advocate, Madras and
Jagan Mohan, B. A. L. E. E., Electrical
Engineer, Bombay, should be permanent
members for their lives in the Govern-
ing body of the Vidyapitham and during
their absence from Kovvur, should have
each of them the power to nominate a
resident of Rajahmundry or Kovvur to
act in their stead both in the General
Body's and its executive committee's
meetings of the Vidyapitham for the
purpose of voting and also acting as
office bearers too, if necessary after
giving previous intimation to the
Secretary or the President of the General
Body.<noinclude><references/></noinclude>
gj4b0do1z90cgiyjl2yy7nocslicasd
569171
569145
2026-08-07T21:01:38Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569171
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|113}}</noinclude>{| class="wikitable"
|+
|-
|
3. నేనున్ను, నా యిద్దరు కొమాళ్లు కృష్ణమోహన్ M. A. B. L. Advocate మద్రాసున్ను, జగన్మోహన్ B. A L.E.E. ElecStrical Engineer బొంబాయిన్ని కోవూరు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠపాలక సంఘములో
జీవితకాలపు మెంబర్లుగా నుండవలెను. ఈ ముగ్గురులో యెవరైనను అన్యగ్రామములలో నున్నపుడు సదరు విద్యాపీఠపాలకసంఘ కార్యనిర్వాహకసంఘ సమావేశములలో పాల్గొని వోట్లువేయుటకును, ఉద్యోగీయులుగా నుండుటకును, వారి యిష్టమువచ్చినవారిని, మరి యొక్కొక్కరిని రాజమహేంద్రవరము కోవూరు గ్రామస్ధులలోనుండి మెంబరుగా నామినేటుచేసి, పాలకసంఘ సెక్రటరీకి ముందు || III. Myself and my two sons Krishna Mohan, M.A., B.L. Advocate, Madras and Jagan Mohan, B. A. L. E. E., Electrical Engineer, Bombay, should be permanent members for their lives in the Governing body of the Vidyapitham and during their absence from Kovvur, should have each of them the power to nominate a resident of Rajahmundry or Kovvur to act in their stead both in the General
Body's and its executive committee's meetings of the Vidyapitham for the
purpose of voting and also acting as office bearers too, if necessary after
giving previous intimation to the Secretary or the President of the General
Body.
|}<noinclude><references/></noinclude>
pq3uywifpw56dkxrf1bg0f4ev4jjlrj
569172
569171
2026-08-07T21:02:20Z
శ్రీరామమూర్తి
1517
569172
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|113}}</noinclude>{| class="wikitable"
|+
|-
| 3. నేనున్ను, నా యిద్దరు కొమాళ్లు కృష్ణమోహన్ M. A. B. L. Advocate మద్రాసున్ను, జగన్మోహన్ B. A L.E.E. ElecStrical Engineer బొంబాయిన్ని కోవూరు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠపాలక సంఘములో జీవితకాలపు మెంబర్లుగా నుండవలెను. ఈ ముగ్గురులో యెవరైనను అన్యగ్రామములలో నున్నపుడు సదరు విద్యాపీఠపాలకసంఘ కార్యనిర్వాహకసంఘ సమావేశములలో పాల్గొని వోట్లువేయుటకును, ఉద్యోగీయులుగా నుండుటకును, వారి యిష్టమువచ్చినవారిని, మరి యొక్కొక్కరిని రాజమహేంద్రవరము కోవూరు గ్రామస్ధులలోనుండి మెంబరుగా నామినేటుచేసి, పాలకసంఘ సెక్రటరీకి ముందు || III. Myself and my two sons Krishna Mohan, M.A., B.L. Advocate, Madras and Jagan Mohan, B. A. L. E. E., Electrical Engineer, Bombay, should be permanent members for their lives in the Governing body of the Vidyapitham and during their absence from Kovvur, should have each of them the power to nominate a resident of Rajahmundry or Kovvur to act in their stead both in the General
Body's and its executive committee's meetings of the Vidyapitham for the
purpose of voting and also acting as office bearers too, if necessary after
giving previous intimation to the Secretary or the President of the General
Body.
|}<noinclude><references/></noinclude>
dog69sp47nktxxctseol0orb5mu19tr
569186
569172
2026-08-08T07:07:45Z
Rajasekhar1961
50
569186
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|113}}</noinclude>{| class="wikitable"
|+
|-
| 3. నేనున్ను, నా యిద్దరు కొమాళ్లు కృష్ణమోహన్ M. A. B. L. Advocate మద్రాసున్ను, జగన్మోహన్ B. A L.E.E. ElecStrical Engineer బొంబాయిన్ని కోవూరు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠపాలక సంఘములో జీవితకాలపు మెంబర్లుగా నుండవలెను. ఈ ముగ్గురులో యెవరైనను అన్యగ్రామములలో నున్నపుడు సదరు విద్యాపీఠపాలకసంఘ కార్యనిర్వాహకసంఘ సమావేశములలో పాల్గొని వోట్లువేయుటకును, ఉద్యోగీయులుగా నుండుటకును, వారి యిష్టమువచ్చినవారిని, మరి యొక్కొక్కరిని రాజమహేంద్రవరము కోవూరు గ్రామస్ధులలోనుండి మెంబరుగా నామినేటుచేసి, పాలకసంఘ సెక్రటరీకి ముందు || III. Myself and my two sons Krishna Mohan, M.A., B.L. Advocate, Madras and Jagan Mohan, B. A. L. E. E., Electrical Engineer, Bombay, should be permanent members for their lives in the Governing body of the Vidyapitham and during their absence from Kovvur, should have each of them the power to nominate a resident of Rajahmundry or Kovvur to act in their stead both in the General Body's and its executive committee's meetings of the Vidyapitham for the purpose of voting and also acting as office bearers too, if necessary after giving previous intimation to the Secretary or the President of the General Body.
|}<noinclude><references/></noinclude>
b9yx2fmoeexr892khiddyxvxpytmif2
పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/124
104
217980
569144
2026-08-07T16:42:25Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'గా తెలియచేసి, తగినయేర్పాట్లు చేసికొను టకు అధికారము కలిగియుందురు. 4. పైనఉదహరించిన ట్రస్టు ఫండుమీ G ద రాగలవడ్డీలోనుంచి నెలకు ఇరువది (రు 20) రూపాయల చొ॥ కొవ్వూరు ఆంధ్రగీర్వాణ జ్ఞ...'
569144
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|114|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>గా తెలియచేసి, తగినయేర్పాట్లు చేసికొను
టకు అధికారము కలిగియుందురు.
4. పైనఉదహరించిన ట్రస్టు ఫండుమీ
G
ద రాగలవడ్డీలోనుంచి నెలకు ఇరువది (రు 20)
రూపాయల చొ॥ కొవ్వూరు ఆంధ్రగీర్వాణ
జ్ఞో విద్యాపీఠమున కనుబంధముగా నెలకొల్పబడిన
శ్రీ వాడ్రేవు జోగాయమ్మ బహద్దరు జమీం
దారుగారి కళాశాలాధ్యక్షుని (principal)
గౌరవభృతి క్రింద నిచ్చుచుండవలెను. ఒక వేళ
యీ స్వల్ప మొత్తమును తన ఖర్చులకు స్వీక
గిరించుటకు ఆయన యిష్టపడని యెడల సదరు
ēకళాశాలలో పరిశోధనకును (research.)
అధ్యాపకమునకును (teaching) సమర్థుడగు
ఒక పండితుని జీతము క్రింద నీయవలయును.
IV. Out of the interest on the above
trust fund, a monthly sum of Twenty
Rupees should be paid as honorarium to
the Principal of Vadrevu Jogayamma
Bahadur zamindar garu's Kalasala
established as an adjunct to the Andhra
Girvana Vidyapitham at Kovvur and in
case of his non-acceptance, for any
reasons of his own, to such Pandi
therein as is found useful both for the
research work in the Vidyapitham, and
also for the teaching work in the Kala-
sala.<noinclude><references/></noinclude>
8d9pt9oa0qweyynj9w46mm3vjzh5b1p
569170
569144
2026-08-07T20:54:43Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569170
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|114|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>{| class="wikitable"
|+
|-
| గా తెలియచేసి, తగినయేర్పాట్లు చేసికొనుటకు అధికారము కలిగియుందురు. ||
|-
| 4. పైనఉదహరించిన ట్రస్టుఫండుమీద రాగలవడ్డీలోనుంచి నెలకు ఇరువది (రు 20) రూపాయల చొ॥ కొవ్వూరు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠమున కనుబంధముగా నెలకొల్పబడిన శ్రీ వాడ్రేవు జోగాయమ్మ బహద్దరు జమీందారుగారి కళాశాలాధ్యక్షుని (principal) గౌరవభృతిక్రింద నిచ్చుచుండవలెను. ఒకవేళ యీ స్వల్ప మొత్తమును తన ఖర్చులకు స్వీకరించుటకు ఆయన యిష్టపడని యెడల సదరు కళాశాలలో పరిశోధనకును (research.) అధ్యాపకమునకును (teaching) సమర్థుడగు ఒక పండితుని జీతముక్రింద నీయవలయును. || IV. Out of the interest on the above trust fund, a monthly sum of Twenty Rupees should be paid as honorarium to the Principal of Vadrevu Jogayamma Bahadur zamindar garu's Kalasala established as an adjunct to the Andhra Girvana Vidyapitham at Kovvur and in case of his non acceptance, for any reasons of his own, to such Pandi therein as is found useful both for the research work in the Vidyapitham, and also for the teaching work in the Kalasala.
|}<noinclude><references/></noinclude>
p1bwipowxfzqy83d9b508qoeulcuj2v
పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/125
104
217981
569146
2026-08-07T16:44:12Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '5. పై మొత్తము పోగా మిగిలిన ని ఆంధ్రభాషలో సులభశైలిని పండిత పామ కులకు బోధపడునట్లు చిన్న చిన్న గ్రంథములను యీ క్రింద నుదహరించిన విషయములలో విద్యాధికుల చేత కొద్ది పారితోషిక మిచ...'
569146
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|115}}</noinclude>5. పై మొత్తము పోగా మిగిలిన
ని ఆంధ్రభాషలో సులభశైలిని పండిత పామ
కులకు బోధపడునట్లు చిన్న చిన్న గ్రంథములను
యీ క్రింద నుదహరించిన విషయములలో
విద్యాధికుల చేత కొద్ది పారితోషిక మిచ్చిగాని,
ఉచితముగగాని, వ్రాయించి అచ్చొత్తించి ఆ)
ధ్ర దేశములోని ముఖ్యమైన గ్రంథాలయము
గ్రీకు ఉచితముగ పంచిపెట్టుటకును, వ్యక్తులకు
స్వల్ప ఖరీదుకు విక్రయించుటకును, విద్యాపీఠ
పాలక సంఘము వారు విని యోగించుచుండ
లెను.
(ఏ) వేదకాలము నాటినుండి హైం
డ్రైవుల ఆర్యమతములోని శ్రోతస్మార్త కర్మ
కాండల జ్ఞానకాండల పరిణామము, ప్రస్తు
V. The rest of the income should be
utilised in getting small books written
in easy colloquial Telugu on the follow-
ing subjects for the enlightenment of
the masses printed, and distributed
gratis among all the important libraries
in the Andhra Desa and also sold to
individuals for small prices.
(a) Critrical examination on ration-
alistic lines of thought of the various
religious and social movements in India
andof the various customs, beliefs and<noinclude><references/></noinclude>
i4hwl4m4muoiabgkfrdiy04mebmkxrk
569169
569146
2026-08-07T20:36:15Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569169
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|115}}</noinclude>{| class="wikitable"
|+
|-
| 5. పై మొత్తము పోగా మిగిలిన వడ్డీని ఆంధ్రభాషలో సులభశైలిని పండిత పామరులకు బోధపడునట్లు చిన్న చిన్నగ్రంథములను యీ క్రింద నుదహరించిన విషయములలో విద్యాధికులచేత కొద్దిపారితోషికమిచ్చిగాని,
ఉచితముగగాని, వ్రాయించి అచ్చొత్తించి ఆంధ్రదేశములోని ముఖ్యమైన గ్రంథాలయములకు ఉచితముగ పంచిపెట్టుటకును, వ్యక్తులకు స్వల్పఖరీదుకు విక్రయించుటకును, విద్యాపీఠ పాలకసంఘమువారు వినియోగించుచుండ వలెను. || V. The rest of the income should be utilised in getting small books written in easy colloquial Telugu on the following subjects for the enlightenment of the masses printed, and distributed gratis among all the important libraries in the Andhra Desa and also sold to individuals for small prices.
|-
| (ఏ) వేదకాలము నాటినుండి హైందవుల ఆర్యమతములోని శ్రౌతస్మార్త కర్మకాండల జ్ఞానకాండల పరిణామము, ప్రస్తు || (a) Critrical examination on rationalistic lines of thought of the various religious and social movements in India and of the various customs, beliefs and
|}<noinclude><references/></noinclude>
0ibblqeebebm8kftbeuqr1kj5xcxq81
పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/126
104
217982
569147
2026-08-07T16:45:38Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తము వారిలోనున్న సాంఘికాచారములు, విశ్వాసములు, సాంప్రదాయములు, పట్టిం క్షవులు, వర్ణములు, వివాహములు, స్త్రీలవిద్యా స్వాతంత్య్రములు, జ్యోతిషములు, మంత్ర తంత్రములు, దేవతలు, దయ్య...'
569147
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|116|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>తము వారిలోనున్న సాంఘికాచారములు,
విశ్వాసములు, సాంప్రదాయములు, పట్టిం
క్షవులు, వర్ణములు, వివాహములు, స్త్రీలవిద్యా
స్వాతంత్య్రములు, జ్యోతిషములు, మంత్ర
తంత్రములు, దేవతలు, దయ్యములు, వర్ణము
లు, లగ్నములు, శకునములు, గ్రహణములు,
మంచి చెడుదినములు, అశుచి, ప్రాయశ్చిత్త
ఆచారకాండలు, తద్దినములు, దృష్టిదోషు
వంక్తిదోష, అంటుదోష, వాయు దోషములు,
సాముద్రికము, రసవాదము మొదలగువానిని
@గురించి మూఢవిశ్వాసములను సప్రమాణ
కిముగ ఖండించి విమర్శించుట.
(బి) షోడశకర్మలను గురించి ఆంధ్ర
టీకా తాత్పర్యములతో గ్రంథములను వ్రా
sentiments prevalent among the common
people such as the present petrified caste
system, unnatural and artificial relations
between the sexes, dogmatic rituals,
creeds and ceremonies irrational con-
ventions based on creeds and colours
etc. opposed to be common sense and
reason, unnecessary rules of purity and
pollution,grotesque forms of idol worship
astrology, palmistry, alchemy manthra
thanthrams demonology, superna-
turalism etc., untouchability, unapproa-
chability, ancestor worship, good and
bad days for every daily act etc.
(b) A study of comparative mythology
sociology and ethics now in
among the various races of mankind<noinclude><references/></noinclude>
a8zbtg8vrkgxeiv5es7t65jmy0zh7a6
569167
569147
2026-08-07T20:25:36Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569167
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|116|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>{| class="wikitable"
|+
|-
| తము వారిలోనున్న సాంఘికాచారములు, విశ్వాసములు, సాంప్రదాయములు, పట్టింపులు, వర్ణములు, వివాహములు, స్త్రీలవిద్యా స్వాతంత్య్రములు, జ్యోతిషములు, మంత్రతంత్రములు, దేవతలు, దయ్యములు, వర్ణములు, లగ్నములు, శకునములు, గ్రహణములు, మంచి చెడుదినములు, అశుచి, ప్రాయశ్చిత్త
ఆచారకాండలు, తద్దినములు, దృష్టిదోష, నంక్తిదోష, అంటుదోష, వాయుదోషములు, సాముద్రికము, రసవాదము మొదలగువానిని గురించి మూఢవిశ్వాసములను సప్రమాణముగ ఖండించి విమర్శించుట. || sentiments prevalent among the common people such as the present petrified caste system, unnatural and artificial relations between the sexes, dogmatic rituals, creeds and ceremonies irrational conventions based on creeds and colours etc. opposed to be common sense and reason, unnecessary rules of purity and pollution, grotesque forms of idol worship astrology, palmistry, alchemy manthra thanthrams demonology, supernaturalism etc., untouchability, unapproachability, ancestor worship, good and bad days for every daily act etc.
|-
| (బి) షోడశకర్మలను గురించి ఆంధ్ర టీకా తాత్పర్యములతో గ్రంథములను వ్రా || (b) A study of comparative mythology sociology and ethics now in Vogue among the various races of mankind
|ˈ<noinclude><references/></noinclude>
e8bwwyd4ce91y8b3ugm2eycm5qtquhe
569168
569167
2026-08-07T20:27:04Z
శ్రీరామమూర్తి
1517
569168
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|116|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>{| class="wikitable"
|+
|-
| తము వారిలోనున్న సాంఘికాచారములు, విశ్వాసములు, సాంప్రదాయములు, పట్టింపులు, వర్ణములు, వివాహములు, స్త్రీలవిద్యా స్వాతంత్య్రములు, జ్యోతిషములు, మంత్రతంత్రములు, దేవతలు, దయ్యములు, వర్ణములు, లగ్నములు, శకునములు, గ్రహణములు, మంచి చెడుదినములు, అశుచి, ప్రాయశ్చిత్త ఆచారకాండలు, తద్దినములు, దృష్టిదోష, నంక్తిదోష, అంటుదోష, వాయుదోషములు, సాముద్రికము, రసవాదము మొదలగువానిని గురించి మూఢవిశ్వాసములను సప్రమాణముగ ఖండించి విమర్శించుట. || sentiments prevalent among the common people such as the present petrified caste system, unnatural and artificial relations between the sexes, dogmatic rituals, creeds and ceremonies irrational conventions based on creeds and colours etc. opposed to be common sense and reason, unnecessary rules of purity and pollution, grotesque forms of idol worship astrology, palmistry, alchemy manthra thanthrams demonology, supernaturalism etc., untouchability, unapproachability, ancestor worship, good and bad days for every daily act etc.
|-
| (బి) షోడశకర్మలను గురించి ఆంధ్ర టీకా తాత్పర్యములతో గ్రంథములను వ్రా || (b) A study of comparative mythology sociology and ethics now in Vogue among the various races of mankind
|ˈ<noinclude><references/></noinclude>
2n0b0toucxmouk4belh37rg39dpqgv9
569187
569168
2026-08-08T07:10:15Z
Rajasekhar1961
50
569187
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|116|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>{| class="wikitable"
|+
|-
| తము వారిలోనున్న సాంఘికాచారములు, విశ్వాసములు, సాంప్రదాయములు, పట్టింపులు, వర్ణములు, వివాహములు, స్త్రీలవిద్యా స్వాతంత్య్రములు, జ్యోతిషములు, మంత్రతంత్రములు, దేవతలు, దయ్యములు, వర్ణములు, లగ్నములు, శకునములు, గ్రహణములు, మంచి చెడుదినములు, అశుచి, ప్రాయశ్చిత్త ఆచారకాండలు, తద్దినములు, దృష్టిదోష, నంక్తిదోష, అంటుదోష, వాయుదోషములు, సాముద్రికము, రసవాదము మొదలగువానిని గురించి మూఢవిశ్వాసములను సప్రమాణముగ ఖండించి విమర్శించుట. || sentiments prevalent among the common people such as the present petrified caste system, unnatural and artificial relations between the sexes, dogmatic rituals, creeds and ceremonies irrational conventions based on creeds and colours etc. opposed to be common sense and reason, unnecessary rules of purity and pollution, grotesque forms of idol worship astrology, palmistry, alchemy manthra thanthrams demonology, supernaturalism etc., untouchability, unapproachability, ancestor worship, good and bad days for every daily act etc.
|-
| (బి) షోడశకర్మలను గురించి ఆంధ్ర టీకా తాత్పర్యములతో గ్రంథములను వ్రా || (b) A study of comparative mythology sociology and ethics now in Vogue among the various races of mankind
|}<noinclude><references/></noinclude>
rsudtlkf7kl2962irr1ftat42pl0glm
పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/127
104
217983
569149
2026-08-07T16:47:40Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ' యించి అనవసరమని తోచినకర్మకాండ విభాగములను సంకుచితపరచి వేదలక్షణ నేర్చుకొని తగువిమర్శనజ్ఞానమును తెలివియు గల పురోహితులను దేవాలయార్చకులను అన్ని వర్ణములలోను బయలు దేరునట్ల...'
569149
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|117}}</noinclude>
యించి అనవసరమని తోచినకర్మకాండ
విభాగములను సంకుచితపరచి వేదలక్షణ
నేర్చుకొని తగువిమర్శనజ్ఞానమును తెలివియు
గల పురోహితులను దేవాలయార్చకులను
అన్ని వర్ణములలోను బయలు దేరునట్లు చేయుట
ప్రపంచములో తక్కినజాతులు మతములు,
సాంఘికా చారములు, నీతి, వీనిపరిణామములు
మొదలగునవి తెలియజేయుట.
మొదలగు
వాని
(సి) ఆర్యమతమునుండి బయల్వెడ
లిన బౌద్ధ, జైన, బ్రహ్మసమాజ
ఆర్య సమాజమతములు
లోని సూత్రములను, తెలియజేసి విమర్శిం
చుట, ప్రపంచములో వ్యా ప్తినొందియున్న
యితర మతములతో ఆర్యమతమును పోల్చి
వానిని గురించి ప్రజలకు బోధించుట.
and of the evolution of modern Hindu,
customs. theological doctrines and
supernatural beliefs, dogmatic rituals
etc. and the turning out enlightened
priesthood in every caste and sect by
imparting a true and correct knowledge
of the karmakanda and the Gnanakanda.
(c) A critical examination of the
offshoots of Aryan religion such as
Jainism, Budhism Brahmo samaj Arya
samaj etc. and a comparative study of
the other important religious movements
in the world.<noinclude><references/></noinclude>
6c5bvy4n1i22nqrhb6yxgdwvn7g0aqi
569160
569149
2026-08-07T18:37:25Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569160
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|117}}</noinclude>{| class="wikitable"
|+
|-
| యించి అనవసరమని తోచినకర్మకాండ విభాగములను సంకుచితపరచి వేదలక్షణ నేర్చుకొని తగువిమర్శనజ్ఞానమును తెలివియు గల పురోహితులను దేవాలయార్చకులను అన్ని వర్ణములలోను బయలు దేరునట్లు చేయుట ప్రపంచములో తక్కినజాతుల మతములు, సాంఘికాచారములు, నీతి, వీనిపరిణామములు
మొదలగునవి తెలియజేయుట. || and of the evolution of modern Hindu, customs. theological doctrines and supernatural beliefs, dogmatic rituals etc. and the turning out enlightened priesthood in every caste and sect by imparting a true and correct knowledge of the karmakanda and the Gnanakanda.
|-
| (సి) ఆర్యమతమునుండి బయల్వెడలిన బౌద్ధ, జైన, బ్రహ్మసమాజ ఆర్యసమాజమతములు మొదలగు వానిలోని సూత్రములను, తెలియజేసి విమర్శించుట, ప్రపంచములో వ్యాప్తినొందియున్న యితరమతములతో ఆర్యమతమును పోల్చి వానిని గురించి ప్రజలకు బోధించుట. || (c) A critical examination of the offshoots of Aryan religion such as Jainism, Budhism Brahmo samaj Arya
samaj etc. and a comparative study of the other important religious movements in the world.
|}<noinclude><references/></noinclude>
841puqd7fj8gqh9fbpsdqw53xndhng5
569161
569160
2026-08-07T18:41:58Z
శ్రీరామమూర్తి
1517
569161
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|117}}</noinclude>{| class="wikitable"
|+
|-
| యించి అనవసరమని తోచినకర్మకాండ విభాగములను సంకుచితపరచి వేదలక్షణ నేర్చుకొని తగువిమర్శనజ్ఞానమును తెలివియు గల పురోహితులను దేవాలయార్చకులను అన్ని వర్ణములలోను బయలు దేరునట్లు చేయుట ప్రపంచములో తక్కినజాతుల మతములు, సాంఘికాచారములు, నీతి, వీనిపరిణామములు మొదలగునవి తెలియజేయుట. || and of the evolution of modern Hindu, customs. theological doctrines and supernatural beliefs, dogmatic rituals etc. and the turning out enlightened priesthood in every caste and sect by imparting a true and correct knowledge of the karmakanda and the Gnanakanda.
|-
| (సి) ఆర్యమతమునుండి బయల్వెడలిన బౌద్ధ, జైన, బ్రహ్మసమాజ ఆర్యసమాజమతములు మొదలగు వానిలోని సూత్రములను, తెలియజేసి విమర్శించుట, ప్రపంచములో వ్యాప్తినొందియున్న యితరమతములతో ఆర్యమతమును పోల్చి వానిని గురించి ప్రజలకు బోధించుట. || (c) A critical examination of the offshoots of Aryan religion such as Jainism, Budhism Brahmo samaj Arya
samaj etc. and a comparative study of the other important religious movements in the world.
|}<noinclude><references/></noinclude>
ter8r06cpoyzzn9qqro14fqwtoesyj3
569188
569161
2026-08-08T07:11:10Z
Rajasekhar1961
50
569188
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|117}}</noinclude>{| class="wikitable"
|+
|-
| యించి అనవసరమని తోచినకర్మకాండ విభాగములను సంకుచితపరచి వేదలక్షణ నేర్చుకొని తగువిమర్శనజ్ఞానమును తెలివియు గల పురోహితులను దేవాలయార్చకులను అన్ని వర్ణములలోను బయలు దేరునట్లు చేయుట ప్రపంచములో తక్కినజాతుల మతములు, సాంఘికాచారములు, నీతి, వీనిపరిణామములు మొదలగునవి తెలియజేయుట. || and of the evolution of modern Hindu, customs. theological doctrines and supernatural beliefs, dogmatic rituals etc. and the turning out enlightened priesthood in every caste and sect by imparting a true and correct knowledge of the karmakanda and the Gnanakanda.
|-
| (సి) ఆర్యమతమునుండి బయల్వెడలిన బౌద్ధ, జైన, బ్రహ్మసమాజ ఆర్యసమాజమతములు మొదలగు వానిలోని సూత్రములను, తెలియజేసి విమర్శించుట, ప్రపంచములో వ్యాప్తినొందియున్న యితరమతములతో ఆర్యమతమును పోల్చి వానిని గురించి ప్రజలకు బోధించుట. || (c) A critical examination of the offshoots of Aryan religion such as Jainism, Budhism Brahmo samaj Arya samaj etc. and a comparative study of the other important religious movements in the world.
|}<noinclude><references/></noinclude>
lquug0n1zm7cyywa3y0cl6wxhdysz9a
పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/128
104
217984
569150
2026-08-07T16:49:16Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '(డి) మనపూర్వులు రచించిన మాన సిక భౌతికశాస్త్రములు కళలు అధునిక పరి శోధనలనుబట్టి విమర్శించి వానిలో అవసర మగు నూర్పులను జేసి మన దేశీయ పారిభాషిక పదములతో ఆంధ్రములో గ్రంథములను వ...'
569150
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|118|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>(డి) మనపూర్వులు రచించిన మాన
సిక భౌతికశాస్త్రములు కళలు అధునిక పరి
శోధనలనుబట్టి విమర్శించి వానిలో అవసర
మగు నూర్పులను జేసి మన దేశీయ పారిభాషిక
పదములతో ఆంధ్రములో గ్రంథములను వ్రా
యించుట.
ల,
(ఇ) గాంధీ మహాత్ములవారి సత్యా
గ్రహతత్వములు, వానిలో నిమిడియున్న
వేదాంతము నానా రాష్ట్ర పరిపాలనా విధాన
ములు, ప్రపంచములో యిదివరకు జరిగిన,
యిప్పుడు జరుగుచున్న సమస్తసాంఘిక రాజ
కీయార్థిక విప్లవన్నులు, ఉద్యమములు, గ్రామ
పునర్నిర్మాణము, సహకార, అసహకారో
ద్యమములు, నానావిధ సమిష్టి వాదములు,
(d) The bringing out an up-to-date
knowledge imbedded in the ancient
works on material sciences and arts and
psychic researches, by getting small text
books written in easy Telugu with the
old and the newly coined Sanskrit nomen-
clature.
(e) Diffusion of knowledge of spirtu- అ
alised politics of Mahatma Gandhi, and
of the Gandhian philosophy, of the
political, social and economic revolutions
and movements of the world past and
present and of the modern systems of
political Government such as the various
forms of socialism, co-operative re-
publicanism, social and ethical recons-
truction, trade unionism, fascism<noinclude><references/></noinclude>
om58zi8c31xo05cb4449qr4o6gd1gbm
569159
569150
2026-08-07T18:27:43Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569159
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|118|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>{| class="wikitable"
|+
|-
| (డి) మనపూర్వులు రచించిన మానసిక భౌతికశాస్త్రములు కళలు అధునిక పరిశోధనలనుబట్టి విమర్శించి వానిలో అవసరమగు మార్పులనుజేసి మనదేశీయ పారిభాషిక పదములతో ఆంధ్రములో గ్రంథములను వ్రాయించుట. || (d) The bringing out an up-to-date knowledge imbedded in the ancient works on material sciences and arts and psychic researches, by getting small text books written in easy Telugu with the old and the newly coined Sanskrit nomenclature.
|-
| (ఇ) గాంధీమహాత్ములవారి సత్యాగ్రహతత్వములు, వానిలో నిమిడియున్న వేదాంతము నానారాష్ట్రపరిపాలనా విధానములు, ప్రపంచములో యిదివరకు జరిగిన, యిప్పుడు జరుగుచున్న సమస్తసాంఘిక రాజకీయార్థిక విప్లవములు, ఉద్యమములు, గ్రామ పునర్నిర్మాణము, సహకార, అసహకారోద్యమములు, నానావిధసమిష్టి వాదములు, || (e) Diffusion of knowledge of spirtualised politics of Mahatma Gandhi, and of the Gandhian philosophy, of the political, social and economic revolutions and movements of the world past and present and of the modern systems of political Government such as the various forms of socialism, co-operative republicanism, social and ethical reconstruction, trade unionism, fascism
|}<noinclude><references/></noinclude>
revf0ythxzgci9z1hlr2ekmq1mo2iai
పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/129
104
217985
569151
2026-08-07T16:51:04Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మొదలగు వానిని గురించి గ్రంథములను ప్రచురించుట. ణ 6. పైన వ్రాసిన విషయములను నిర్భ యముగను, నిష్పాక్షికముగము, నిర్మొగమా టముగను, సత్యముతప్పకుండ సప్రమాణముగ సంపూర్ణ మనోస్వాతంత్ర...'
569151
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|119}}</noinclude>మొదలగు వానిని గురించి గ్రంథములను
ప్రచురించుట.
ణ
6. పైన వ్రాసిన విషయములను నిర్భ
యముగను, నిష్పాక్షికముగము, నిర్మొగమా
టముగను, సత్యముతప్పకుండ సప్రమాణముగ
సంపూర్ణ మనోస్వాతంత్ర్యములతో, (Free
thought) ఆంధ్రులయెదుట వారిభాషలో
పెట్టుచుండవలెను. ఏ గ్రంథముగాని రూపా
యకంటె హెచ్చువెలను కలిగియుండకూడదు.
నా జీవిత కాలములో నే సంగీకరించిన గ్రంథ
ములనే ప్రచురించవలెను. నా జీవితానంత
రము విద్యాపీఠ పాలక సంఘమువారు యిప్పు
డేర్పరచు పండిత బృంద ము (Academic
Council) చేనంగీకరింపబడిన పిమ్మట ఆ
syndicalism, communism, Bolshevism
etc.
VI. The Books on the above subjects
should be written impartially, fearlessly
with citations of authorities, without
the slightest deviation from truth and
no book should be priced at
one rupee.
These books
more than
should be
approved of by me before publication
and after my death by the Academic
Council of the Vidyapitham, now to be
established and also by the majority of
the permanent members of the Vidya-
pitham.<noinclude><references/></noinclude>
ca94f3oqgmzagislb3yakhi9k8c0g7x
569158
569151
2026-08-07T18:19:03Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569158
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|119}}</noinclude>{| class="wikitable"
|+
|-
| మొదలగు వానిని గురించి గ్రంథములను ప్రచురించుట. || syndicalism, communism, Bolshevism etc.
|-
| 6. పైన వ్రాసిన విషయములను నిర్భయముగను, నిష్పాక్షికముగము, నిర్మొగమాటముగను, సత్యముతప్పకుండ సప్రమాణముగ సంపూర్ణ మనోస్వాతంత్ర్యములతో, (Free thought) ఆంధ్రులయెదుట వారిభాషలో పెట్టుచుండవలెను. ఏ గ్రంథముగాని రూపాయకంటె హెచ్చువెలను కలిగియుండకూడదు. నా జీవిత కాలములో నే నంగీకరించిన గ్రంథములనే ప్రచురించవలెను. నా జీవితానంతరము విద్యాపీఠపాలక సంఘమువారు యిప్పుడేర్పరచు పండితబృందము (Academic Council) చేనంగీకరింపబడిన పిమ్మట ఆ || VI. The Books on the above subjects should be written impartially, fearlessly with citations of authorities, without the slightest deviation from truth and no book should be priced at more than one rupee. These books
should be approved of by me before publication and after my death by the Academic Council of the Vidyapitham, now to be established and also by the majority of the permanent members of the Vidyapitham.
|}<noinclude><references/></noinclude>
pyomc0kcix1ou4enjh1vun7toc59hen
పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/130
104
217986
569152
2026-08-07T16:53:03Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సంఘము వారి శాశ్వత సభ్యుల మెజారటీవారి యామోదమును బడయనిదే యే గ్రంథము . గాని వెలువడకూడదు. ను. (7) నాపై యు దేశములను నెర వేర్చు టకు యితర దాతలనేకమంది ట్రస్టు ఫండుకు సహాయపడుదురని నేన...'
569152
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|120|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>సంఘము వారి శాశ్వత సభ్యుల మెజారటీవారి
యామోదమును బడయనిదే యే గ్రంథము
. గాని వెలువడకూడదు.
ను.
(7) నాపై యు దేశములను నెర వేర్చు
టకు యితర దాతలనేకమంది ట్రస్టు ఫండుకు
సహాయపడుదురని నేను నమ్ముచున్నాని
అప్పటి దేశ కాల పరిస్థితులనుబట్టి పై న నేను
తెలియ జేసిన విషయములలో దేనికైనను
యీ నిధిమీద వచ్చువడ్డీని అంతగాని కొంత
ని వీలుకొలది ప్రజోపయోగమునకు విని
యోగించవచ్చును. సాలుకు ఒక చిన్న గ్రంథము
వెలువడినను నా యాత్మ తృప్తినొందకలదు.
(8) నేనిదివరకు ది 16–5–1928 తే
దీని కొవ్వూరు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠము
VII. Ihope that many philanthro-
pists that sympathise with the above
objects may contribute their mite to this
nucleus and thus render this Vidypitham
a unique and progressive Institution
in the Andhra Desa. Any how, I consi-
der myself amply rewarded and my soul
will rest in peace even if one book be
published in an year, on any of the above
mentioned subjects in para V Supra
according to the necessities of the times'
VIII. On 16-5-1928 I created by a
registered deed a charge on my house at
Kovvur for payment of Rs 10 per month<noinclude><references/></noinclude>
8bhve5dca1weiuoept4nwik8lbk1wvs
569156
569152
2026-08-07T18:08:02Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569156
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|120|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>{| class="wikitable"
|+
|-
| సంఘమువారి శాశ్వతసభ్యుల మెజారటీవారి యామోదమును బడయనిదే యే గ్రంథముగాని వెలువడకూడదు. ||
|-
| (7) నాపై యుద్దేశములను నెరవేర్చుటకు యితర దాతలనేకమంది ట్రస్టుఫండుకు సహాయపడుదురని నేను నమ్ముచున్నాను. అప్పటిదేశకాల పరిస్థితులనుబట్టి పైననేను తెలియజేసిన విషయములలో దేనికైనను యీ నిధిమీద వచ్చువడ్డీని అంతగాని కొంతగాని వీలుకొలది ప్రజోపయోగమునకు వినియోగించవచ్చును. సాలుకు ఒకచిన్నగ్రంథము వెలువడినను నా యాత్మ తృప్తినొందకలదు. || VII. I hope that many philanthropists that sympathise with the above objects may contribute their mite to this nucleus and thus render this Vidypitham a unique and progressive Institution in the Andhra Desa. Any how, I consider myself amply rewarded and my soul will rest in peace even if one book be published in an year, on any of the above mentioned subjects in para V Supra according to the necessities of the times'
|-
| (8) నేనిదివరకు ది 16–5–1928 తేదీని కొవ్వూరు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠము || VIII. On 16-5-1928 I created by a registered deed a charge on my house at Kovvur for payment of Rs 10 per month|}<noinclude><references/></noinclude>
735pzst8relzkqxby52xxucu86f6bad
569157
569156
2026-08-07T18:10:08Z
శ్రీరామమూర్తి
1517
569157
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|120|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>{| class="wikitable"
|+
|-
| సంఘమువారి శాశ్వతసభ్యుల మెజారటీవారి యామోదమును బడయనిదే యే గ్రంథముగాని వెలువడకూడదు. ||
|-
| (7) నాపై యుద్దేశములను నెరవేర్చుటకు యితర దాతలనేకమంది ట్రస్టుఫండుకు సహాయపడుదురని నేను నమ్ముచున్నాను. అప్పటిదేశకాల పరిస్థితులనుబట్టి పైననేను తెలియజేసిన విషయములలో దేనికైనను యీ నిధిమీద వచ్చువడ్డీని అంతగాని కొంతగాని వీలుకొలది ప్రజోపయోగమునకు వినియోగించవచ్చును. సాలుకు ఒకచిన్నగ్రంథము వెలువడినను నా యాత్మ తృప్తినొందకలదు. || VII. I hope that many philanthropists that sympathise with the above objects may contribute their mite to this nucleus and thus render this Vidypitham a unique and progressive Institution in the Andhra Desa. Any how, I consider myself amply rewarded and my soul will rest in peace even if one book be published in an year, on any of the above mentioned subjects in para V Supra according to the necessities of the times'
|-
| (8) నేనిదివరకు ది 16–5–1928 తేదీని కొవ్వూరు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠము || VIII. On 16-5-1928 I created by a registered deed a charge on my house at Kovvur for payment of Rs 10 per month
|}<noinclude><references/></noinclude>
idkbh5uwrbw7ljn4u5vuvqsm3lzqnfw
పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/131
104
217987
569153
2026-08-07T16:55:28Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నకు కొవ్వూరులో నా యింటిమీద రిజిస్టర్లు డీడ్డుద్వారా యేర్పరచినరు 120 లు వార్షి కము ట్రస్టుడీడ్డు మొత్తములో నేచేరి యున్నం దున సదరు చార్జిరద్దు అయినట్లు భావించు కొని యీ ట్రస...'
569153
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|121}}</noinclude>నకు కొవ్వూరులో నా యింటిమీద రిజిస్టర్లు
డీడ్డుద్వారా యేర్పరచినరు 120 లు వార్షి కము
ట్రస్టుడీడ్డు మొత్తములో నేచేరి యున్నం
దున సదరు చార్జిరద్దు అయినట్లు భావించు
కొని యీ ట్రస్టును ఆంధ్రగీర్వాణ విద్యాపీఠ
పాలకసంఘమువారు అంగీకరించవలెను.
(9) ఏకారణమువలన నయినను నా పై
యు దేశములను కొవ్వూరు, ఆంధ్రగీర్వాణ
విద్యాపీఠ పరిపాలక సంఘమునారు సరిగా
నెర వేర్చజాలనిచో ఆంధ్రవిశ్వవిద్యాలయాధి
కారులు శివిల్ కోర్టుగుండా యీ ట్రస్టుఫం
డును స్వాధీనము చేసుకొని దీనిలో నుదహ
రించిన కార్యవర్గములను సక్రమముగ యీ
towards the salary of the teaching staff
in the Vidyapitham, but as that amount
is included in that of this trust deed, the
Vidyapitham authorities should elect
to give up their rights there-under if
they accept this trust deed and to free
my house from the above charge.
IX. If for any reason the Governing
Body of the Vidyapitham be unable to
discharge its functions properly the
Andhra University authorities are here
by authorised to get the above trust fund
into its own hands through Civil Courts
and manage this trust by using only the
annual income thereon for the above
mentioned objects at Kovvur alone.<noinclude><references/></noinclude>
nfnvnr0kes8kumw6f8y37bnmm1f0bk5
569155
569153
2026-08-07T17:57:56Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569155
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|121}}</noinclude>{| class="wikitable"
|+
|-
| నకు కొవ్వూరులో నా యింటిమీద రిజిస్టర్డు డీడ్డుద్వారా యేర్పరచిన రు 120 లు వార్షికము యీ ట్రస్టుడీడ్డు మొత్తములోనేచేరి యున్నందున సదరు చార్జిరద్దు అయినట్లు భావించుకొని యీ ట్రస్టును ఆంధ్రగీర్వాణ విద్యాపీఠ పాలకసంఘమువారు అంగీకరించవలెను. || towards the salary of the teaching staff in the Vidyapitham, but as that amount is included in that of this trust deed, the Vidyapitham authorities should elect to give up their rights there-under if they accept this trust deed and to free my house from the above charge.
|-
| (9) ఏకారణమువలన నయినను నాపై యుద్దేశములను కొవ్వూరు, ఆంధ్రగీర్వాణ విద్యాపీఠపరిపాలక సంఘమువారు సరిగా నెరవేర్చజాలనిచో ఆంధ్రవిశ్వవిద్యాలయాధికారులు శివిల్కోర్టుగుండా యీ ట్రస్టుఫండును స్వాధీనము చేసుకొని దీనిలో నుదహరించిన కార్యవర్గములను సక్రమముగ యీ || IX. If for any reason the Governing Body of the Vidyapitham be unable to discharge its functions properly the Andhra University authorities are here by authorised to get the above trust fund into its own hands through Civil Courts and manage this trust by using only the annual income thereon for the above
mentioned objects at Kovvur alone.|}<noinclude><references/></noinclude>
de7ao3a2jnm3pnwt1tbtfq2ke4bhmql
569189
569155
2026-08-08T07:17:36Z
Rajasekhar1961
50
569189
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|121}}</noinclude>{| class="wikitable"
|+
|-
| నకు కొవ్వూరులో నా యింటిమీద రిజిస్టర్డు డీడ్డుద్వారా యేర్పరచిన రు 120 లు వార్షికము యీ ట్రస్టుడీడ్డు మొత్తములోనేచేరి యున్నందున సదరు చార్జిరద్దు అయినట్లు భావించుకొని యీ ట్రస్టును ఆంధ్రగీర్వాణ విద్యాపీఠ పాలకసంఘమువారు అంగీకరించవలెను. || towards the salary of the teaching staff in the Vidyapitham, but as that amount is included in that of this trust deed, the Vidyapitham authorities should elect to give up their rights there-under if they accept this trust deed and to free my house from the above charge.
|-
(9) ఏకారణమువలన నయినను నాపై యుద్దేశములను కొవ్వూరు, ఆంధ్రగీర్వాణ విద్యాపీఠపరిపాలక సంఘమువారు సరిగా నెరవేర్చజాలనిచో ఆంధ్రవిశ్వవిద్యాలయాధికారులు శివిల్కోర్టుగుండా యీ ట్రస్టుఫండును స్వాధీనము చేసుకొని దీనిలో నుదహరించిన కార్యవర్గములను సక్రమముగ యీ || IX. If for any reason the Governing Body of the Vidyapitham be unable to discharge its functions properly the Andhra University authorities are here by authorised to get the above trust fund into its own hands through Civil Courts and manage this trust by using only the annual income thereon for the above mentioned objects at Kovvur alone.
|}<noinclude><references/></noinclude>
jf1s4ekxv1pgyz0cynd4br9kxt7zgsk
569190
569189
2026-08-08T07:18:18Z
Rajasekhar1961
50
569190
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|121}}</noinclude>{| class="wikitable"
|+
|- నకు కొవ్వూరులో నా యింటిమీద రిజిస్టర్డు డీడ్డుద్వారా యేర్పరచిన రు 120 లు వార్షికము యీ ట్రస్టుడీడ్డు మొత్తములోనేచేరి యున్నందున సదరు చార్జిరద్దు అయినట్లు భావించుకొని యీ ట్రస్టును ఆంధ్రగీర్వాణ విద్యాపీఠ పాలకసంఘమువారు అంగీకరించవలెను. || towards the salary of the teaching staff in the Vidyapitham, but as that amount is included in that of this trust deed, the Vidyapitham authorities should elect to give up their rights there-under if they accept this trust deed and to free my house from the above charge.
|- (9) ఏకారణమువలన నయినను నాపై యుద్దేశములను కొవ్వూరు, ఆంధ్రగీర్వాణ విద్యాపీఠపరిపాలక సంఘమువారు సరిగా నెరవేర్చజాలనిచో ఆంధ్రవిశ్వవిద్యాలయాధికారులు శివిల్కోర్టుగుండా యీ ట్రస్టుఫండును స్వాధీనము చేసుకొని దీనిలో నుదహరించిన కార్యవర్గములను సక్రమముగ యీ || IX. If for any reason the Governing Body of the Vidyapitham be unable to discharge its functions properly the Andhra University authorities are here by authorised to get the above trust fund into its own hands through Civil Courts and manage this trust by using only the annual income thereon for the above mentioned objects at Kovvur alone.
|}<noinclude><references/></noinclude>
3l2f8w38a2m0qei1qc2wkah3orw0ptt
569191
569190
2026-08-08T07:18:51Z
Rajasekhar1961
50
569191
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|121}}</noinclude>{| class="wikitable"
|+
|-
నకు కొవ్వూరులో నా యింటిమీద రిజిస్టర్డు డీడ్డుద్వారా యేర్పరచిన రు 120 లు వార్షికము యీ ట్రస్టుడీడ్డు మొత్తములోనేచేరి యున్నందున సదరు చార్జిరద్దు అయినట్లు భావించుకొని యీ ట్రస్టును ఆంధ్రగీర్వాణ విద్యాపీఠ పాలకసంఘమువారు అంగీకరించవలెను. || towards the salary of the teaching staff in the Vidyapitham, but as that amount is included in that of this trust deed, the Vidyapitham authorities should elect to give up their rights there-under if they accept this trust deed and to free my house from the above charge.
|-
(9) ఏకారణమువలన నయినను నాపై యుద్దేశములను కొవ్వూరు, ఆంధ్రగీర్వాణ విద్యాపీఠపరిపాలక సంఘమువారు సరిగా నెరవేర్చజాలనిచో ఆంధ్రవిశ్వవిద్యాలయాధికారులు శివిల్కోర్టుగుండా యీ ట్రస్టుఫండును స్వాధీనము చేసుకొని దీనిలో నుదహరించిన కార్యవర్గములను సక్రమముగ యీ || IX. If for any reason the Governing Body of the Vidyapitham be unable to discharge its functions properly the Andhra University authorities are here by authorised to get the above trust fund into its own hands through Civil Courts and manage this trust by using only the annual income thereon for the above mentioned objects at Kovvur alone.
|}<noinclude><references/></noinclude>
6zfc6azt4x766qiji8ew8dyapqgwxbv
పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/132
104
217988
569154
2026-08-07T16:58:13Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కోవ్వూరు విద్యాపీఠములోనే నెరవేర్చుచుం డవలెను. ఇది నా సమ్మతిని నా స్వదస్తూరీని వ్రాసియిచ్చిన డిక్ల రేషన్ ఆఫ్ ట్రస్టుదస్తా వేజు. అడ్వ కేటు వల్లూరి సూర్యనా రాయణ రావు. సెక్ర...'
569154
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|122|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>కోవ్వూరు విద్యాపీఠములోనే నెరవేర్చుచుం
డవలెను.
ఇది నా సమ్మతిని నా స్వదస్తూరీని
వ్రాసియిచ్చిన డిక్ల రేషన్ ఆఫ్ ట్రస్టుదస్తా
వేజు.
అడ్వ కేటు వల్లూరి సూర్యనా రాయణ రావు.
సెక్రటరీ
ఆంధ్రగీర్వాణ విద్యాపీఠము,
కో వూరు
పశ్చిమగోదాపరి జిల్లా,
3
9-4-31
I executed this deed of Declaration of
Trust with my free will and consent, on
the 9th April 1931, in my own hand
writing.
VALLURI SURYAVARAYANA RAO,
ADVOCATE, HIGH COURT
and
Secretary
ANDHRA GIRVANA VIDYAPITHAM,
ANDHRA
KOVVUR.
(West Godavari District)<noinclude><references/></noinclude>
elr7y2qutckoz52sqdqcwk0i036qe24
569162
569154
2026-08-07T18:48:07Z
శ్రీరామమూర్తి
1517
569162
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|122|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>{| class="wikitable"
|+
|-
| కోవ్వూరు విద్యాపీఠములోనే నెరవేర్చుచుండవలెను. ||
|-
| ఇది నా సమ్మతిని నా స్వదస్తూరీని వ్రాసియిచ్చిన డిక్ల రేషన్ ఆఫ్ ట్రస్టుదస్తావేజు. || I executed this deed of Declaration of Trust with my free will and consent, on the 9th April 1931, in my own hand writing.
|}
అడ్వ కేటు వల్లూరి సూర్యనా రాయణ రావు.
సెక్రటరీ
ఆంధ్రగీర్వాణ విద్యాపీఠము,
కో వూరు
పశ్చిమగోదాపరి జిల్లా,
3
9-4-31
I executed this deed of Declaration of Trust with my free will and consent, on the 9th April 1931, in my own hand writing.
VALLURI SURYAVARAYANA RAO,
ADVOCATE, HIGH COURT
and
Secretary
ANDHRA GIRVANA VIDYAPITHAM,
ANDHRA
KOVVUR.
(West Godavari District)<noinclude><references/></noinclude>
ehql8hrheno07wzkjoyfsepxmko2n72
569163
569162
2026-08-07T18:57:28Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569163
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|122|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>{| class="wikitable"
|+
|-
| కోవ్వూరు విద్యాపీఠములోనే నెరవేర్చుచుండవలెను. ||
|-
| ఇది నా సమ్మతిని నా స్వదస్తూరీని వ్రాసియిచ్చిన డిక్ల రేషన్ ఆఫ్ ట్రస్టుదస్తావేజు. || I executed this deed of Declaration of Trust with my free will and consent, on the 9th April 1931, in my own hand writing.
|}
{{rh|అడ్వకేటు వల్లూరి సూర్యనారాయణరావు.||VALLURI SURYANARAYANA RAO,}}
{{rh|శెక్రటరీ||ADVOCATE, HIGH COURT}}
{{rh|ఆంధ్రగీర్వాణ విద్యాపీఠము,||and}}
{{rh|కోవూరు||Secretary}}
{{rh|పశ్చిమగోదాపరి జిల్లా.||ANDHRA GIRVANA VIDYAPITHAM,
{{rh|9-4-31||KOVVUR.}}
{{rh|||(West Godavari District)}}<noinclude><references/></noinclude>
bm417zgcnh7c496tz3z5t9xq9df7jyw
569164
569163
2026-08-07T18:58:43Z
శ్రీరామమూర్తి
1517
569164
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|122|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>{| class="wikitable"
|+
|-
| కోవ్వూరు విద్యాపీఠములోనే నెరవేర్చుచుండవలెను. ||
|-
| ఇది నా సమ్మతిని నా స్వదస్తూరీని వ్రాసియిచ్చిన డిక్ల రేషన్ ఆఫ్ ట్రస్టుదస్తావేజు. || I executed this deed of Declaration of Trust with my free will and consent, on the 9th April 1931, in my own hand writing.
|}
{{rh|అడ్వకేటు వల్లూరి సూర్యనారాయణరావు.||VALLURI SURYANARAYANA RAO,}}
{{rh|శెక్రటరీ||ADVOCATE, HIGH COURT}}
{{rh|ఆంధ్రగీర్వాణ విద్యాపీఠము,||and}}
{{rh|కోవూరు||Secretary}}
{{rh|పశ్చిమగోదాపరి జిల్లా.||ANDHRA GIRVANA VIDYAPITHAM,}}
{{rh|9-4-31||KOVVUR.}}
{{rh|||(West Godavari District)}}<noinclude><references/></noinclude>
06s2ig6byx3bh28i1sl3gkq42ub5f41
569165
569164
2026-08-07T18:59:51Z
శ్రీరామమూర్తి
1517
569165
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|122|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>{| class="wikitable"
|+
|-
| కోవ్వూరు విద్యాపీఠములోనే నెరవేర్చుచుండవలెను. ||
|-
| ఇది నా సమ్మతిని నా స్వదస్తూరీని వ్రాసియిచ్చిన డిక్ల రేషన్ ఆఫ్ ట్రస్టుదస్తావేజు. || I executed this deed of Declaration of Trust with my free will and consent, on the 9th April 1931, in my own hand writing.
|}
{{rh|అడ్వకేటు వల్లూరి సూర్యనారాయణరావు.||<big>VALLURI SURYANARAYANA RAO,</big>}}
{{rh|శెక్రటరీ||ADVOCATE, HIGH COURT}}
{{rh|ఆంధ్రగీర్వాణ విద్యాపీఠము,||and}}
{{rh|కోవూరు||Secretary}}
{{rh|పశ్చిమగోదాపరి జిల్లా.||ANDHRA GIRVANA VIDYAPITHAM,}}
{{rh|9-4-31||KOVVUR.}}
{{rh|||(West Godavari District)}}<noinclude><references/></noinclude>
2da38evo5biorijdbffcwkqiaocxwia
569216
569165
2026-08-08T11:54:16Z
Rajasekhar1961
50
569216
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|122|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>{| class="wikitable"
|+
|-
| కోవ్వూరు విద్యాపీఠములోనే నెరవేర్చుచుండవలెను. ||
|-
| ఇది నా సమ్మతిని నా స్వదస్తూరీని వ్రాసియిచ్చిన డిక్ల రేషన్ ఆఫ్ ట్రస్టుదస్తావేజు. || I executed this deed of Declaration of Trust with my free will and consent, on the 9th April 1931, in my own hand writing.
|-
| అడ్వకేటు వల్లూరి సూర్యనారాయణరావు. శెక్రటరీ ఆంధ్రగీర్వాణ విద్యాపీఠము, కోవూరు పశ్చిమగోదాపరి జిల్లా. 9-4-31 || VALLURI SURYANARAYANA RAO, ADVOCATE, HIGH COURT and Secretary ANDHRA GIRVANA VIDYAPITHAM, KOVVUR. (West Godavari District)
|}<noinclude><references/></noinclude>
00ppxniws9nl4ii42hszxt7c42645zq
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/74
104
217989
569174
2026-08-07T21:17:48Z
శ్రీరామమూర్తి
1517
/* సమస్యాత్మకం */
569174
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>వినఁగనే ఎగిరిపడి, 'నన్ను ఎంతవడిగా పంపిన అంత మే'లని అంటిని. పరీక్షలు వడిగా ప్యాసగుట సులభము కాదు. కావున 'అయ్యా! నన్ను వైద్యమునకు పంపకూడదా?' అని అడిగితిని.
మా అన్న నా మాటకు అడ్డమువచ్చి “నాన్నకు వైద్యమనిస ఇష్టములేదు. 'మనము వైష్ణువులము. మనకు పీనుఁగులను కోయుట పాడికాదు' అని వారు చెప్పుట నిన్ను ఉద్దేశించియే. నీవు వకీలు వగుట వారి కభిమతము” అనెను.
జోషీజీయు మా అన్న గారి పాటనే మరల ఇటులు పాడిరి: "నేను మీతండ్రివలె వైద్యవృత్తిని ద్వేషింపను. శాస్త్రనిషేధమును నాకు కానరాదు. కాని నీవు వైద్యము ప్యాసు అయినను 'దివాను' కాలేవు. నీవు దివాను కావలయును. చేతయినచో అంతకంటె గొప్పవాఁడవు కావలెను. అటులయిననే విూ యీ గొప్పకుటుంబమును
కాపాడఁగలవు. కాలము వడిగా మార్పుపొందుచున్నది. దినములు గడచినకొలఁది కష్టము పెరుఁగుచున్నది. కావున బారిష్టరగుట తెలివిగల పని” అని యిటులుచెప్పి, మా అమ్మగారితో "ఇఁక నాకు
నేను చెప్పినది కొంచెము ఆలోచింపుఁడు. మరల నేను<noinclude><references/>
{{c|56}}</noinclude>
nnk28aynvhyn9wp5tbb0czskyavf7pq
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/77
104
217990
569176
2026-08-07T21:29:04Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569176
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>11 సీమకు ప్రయాణ సన్నాహము</big>}}</noinclude>ము చేయఁబడదు' అని రెండుమాటలు చెప్పి పైకి వెళ్లిపోయిరి. నేను దొరగారిని చూచుటకు చాల తయారుచేసికొంటిని. నేను మెలఁకువతో కొన్ని వాక్యములు వల్లించికొనిపోయితిని. వంగి వంగి రెండుచేతులతో సలాముచేసితిని. కాని అవి యన్నియు ఉప్పునకుఁగూడ కాలేదు.
పిదప నా భార్యనగలపై దృష్టిపోయెను. మాఅన్నగారి యెడ నాకు పరమవిశ్వాసము కలదు. ఆయన ఉదారత నిస్సీమము. ఆయనకు నాపై పుత్రవాత్సల్యము.
నేను పోరుబందరును విడిచి రాజకోటకు వచ్చి జరిగినదంతయు చెప్పితిని. నేను జోషీతో ఆలోచించితిని. అక్కఱయగుచో అప్పుచేసియేని ఇంగ్లాండు వెళ్లుమని ఆయన సలహా యిచ్చెను. నా భార్య నగకట్టు రెండుమూఁడు వేలు చేయుననియు, దానిని అమ్మి ఇంగ్లాండునకు పోదుననియు అంటిని. ఎటులేని ద్రవ్యమును సమకూర్తునని మా అన్న వాగ్దానము చేసెను.
కాని మా అమ్మకు ఇంకను ఇష్టము లేదు. ఆమె నలుసులు ఏఱఁదొడఁగెను. ఇంగ్లండులో యువకులు చెడిపోదురని ఆమె కెవరో చెప్పిరి. మరియొకఁడు గోమాంసము తిందురని, ఇంకొకఁడు కల్లులేనిది బ్రతుక నే లేరని చెప్పిరి. ‘ఇది యంతయు నేమి?' అని ఆమె ప్రశ్నించెను.
నే నంటిని - 'నన్ను నమ్మవా? నేను నీకడ బొంకను. నేను ఇవి యేమియు ముట్టనని ఒట్టు పెట్టుకొందును. మరియు అటువంటి అపాయ మేదేని ఉన్నయెడల జోషీజీ నన్ను వెళ్లు మనునా?'
'నాకు నీపై నమ్మిక ఉన్నది కాని అంతదూరదేశమున ఉన్నచో ఎటులు నమ్ముట ? నా కేమియు తోఁచుటలేదు. బేచరజీస్వామిని అడిగి చూతును' అని ఆమె యనెను.<noinclude><references/>
{{c|59}}</noinclude>
c7r58zrfnivr6byw3e4v624o9yk464o
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/78
104
217991
569177
2026-08-07T21:36:32Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569177
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>బేచరజీస్వామి అసలు మోఢ్వైశ్యుఁడు. పిదప జైన సాధువు ఆయెను. ఆయనయు జోషీజీవలెనే మాకుటుంబమునకు మేలు కోరువాఁడు. ఆయన నా పక్షమునకు వచ్చి, 'ఇతనినుండి మూఁడు వాగ్దానములు పుచ్చుకొని ఇంగ్లండునకు పంపవచ్చును' అని చెప్పి, ‘మద్యమును, మాంసమును, మహిళను ముట్టనని నాచే ప్రమాణము చేయించిరి. ఇది జరిగిన పిదప మా అమ్మ అంగీకరించెను.
హైస్కూలునందు నన్ను వీడుకొలుపుటకు సమ్మేళనము జరిగెను. రాజకోటలోని ఒకపిన్నవాఁడు ఇంగ్లాండు పోవుట ఒక అసాధారణ విషయము. నేను నాకృతజ్ఞత తెలుపుచు కొన్నిమాటలు వ్రాసితిని. కాని వానిని చదువ నాపని అట్టిట్టయినది. నాఁడు వానిని జదువ నాతల తిరిగినది. నామేను వడఁకినది. ఇది నాకు గుఱుతు.
పెద్దల దీవెనలతో బొంబాయికి పయనమైతిని. బొంబాయికి ఇదియే నాప్రధమప్రయాణము. మాయన్న నన్ను అనుగమించెను. కాని ఇల్లు అలుకఁగనే పండువా ? బొంబాయిలో కొన్ని గండములు గడవవలసియుండెను.<noinclude><references/>
{{c|60}}</noinclude>
1778fux6m5jw3glwz7xndsfa6uw8n07
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/75
104
217992
569178
2026-08-07T21:40:40Z
శ్రీరామమూర్తి
1517
/* సమస్యాత్మకం */
569178
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>కానిపింపదు. వారికి ఆహారము నెడ విధినిషేధములు లేవు. చుట్టలేక వారి నోరు ఎప్పుడును ఊరకుండదు. లజ్జ లేక వారు ఇంగ్లీషువారి ఉడుపులు ధరింతురు. ఇటు లుండుట మన కుటుంబసంప్రదాయము కాదు. నేను కొలఁదిలో తీర్థయాత్రకు పోవుచుంటిని. ఇఁక ఎన్నాళ్లొ<noinclude><references/>
{{c|58}}</noinclude>
56be3jg7oi1gvohx4raljrabjkx5myd
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/76
104
217993
569179
2026-08-07T21:46:30Z
శ్రీరామమూర్తి
1517
/* సమస్యాత్మకం */
569179
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>11 సీమకు ప్రయాణ సన్నాహము</big>}}</noinclude>మా అమ్మగారును చింతలో పడిరి. ఆమెకు నన్నెడఁబాయుట అనిష్టము. కాని నన్ను మానిపించుటకు ఇటు లొక యెత్తు ఎత్తైను: “మీపినతండ్రిగారు ఉన్నారుకదా కుటుంబజ్యేష్ఠులు! మొదట వారితో ఆలోచింప వలయును. వారికి అంగీకారము అయ్యె నేని పిదప ఆలోచింతము." అని.
మా అన్నగారికి మరియొక ఆలోచన కలిగెను. 'పోరుబందరుపై మనకు కొంతహక్కు ఉన్నది. అచట లేలీగారు వ్యవహారాధికారులు. వారికి మన కుటుంబమనిన గౌరవము. మరియు పినతండ్రి పై ఆయనకు విశేషాభిమానము. నీ విద్యావ్యయమునకు సంస్థానమువారు కొంత సాయము చేయునటులు వారు తోడుపడవచ్చును' అని మా యన్న నాతో ననెను.
నాకు ఈమాటలు బాగుగా ఉండెను. పోరుబందరునకు పోవ మూట కట్టితిని. ఆరోజులలో రైళ్లు లేవు. ఐదు దినములు ఎద్దుబండి<noinclude><references/>
{{c|57}}</noinclude>
cpa5b08ir3xp6zueahle2p1yd2w3zf9
పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.1 (1920).pdf/12
104
217994
569193
2026-08-08T08:23:36Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
569193
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>లను, పోలికలను, సంబంధ బాంధవ్యములను బాగుగ పరిశీలించుట (Comparitive Philology) మూలమున గూడ పూర్వచారిత్రము కొంత తేటపడఁగలదు.
మనమింకను వీనినన్నిటినిఁ గడచి యింకొక మెట్టుపైకి పోదము. ఈ పైన జెప్పిన సాధనముల ద్వారా కొంతకాలము వఱకే ప్రపంచస్థితి మనకు తెలియఁగలదు. అంతకంటెను యింకఁబూర్వకాలపు చరిత్రను తెలిసికొనుట కేమైన నాధారములుగలవా? మన మెప్పుడైనను భూమిని త్రవ్వుచుండఁగఁ బూర్వులచే బహుకాలము కిందట సుపయోగింపఁబడిన గొన్ని కొన్ని చిత్రమైన
వస్తువులు దొరకుచుండును. ఈవిధముగ భూమిలో నణఁగియున్న యనేకమైన వస్తువులను త్రవ్వి యెత్తి దానిని పరీక్షించుట వలన కూడ మనకు మన పూర్వుల చారిత్రమొక్కింత బోధపడఁగలదు. ఇట్లు "భూమిలో నుండు వస్తువులను త్రవ్వి యెత్తి, వానిని పరిశోధించి, తన్మూలమున పూర్వకాలపు చరిత్రను తెలిసికొనగలుగుట ”యనునది ప్రస్తుత మొక గొప్పశాస్త్రముగఁ బరిగణింపఁ బడుచున్నది. దీనికే "భూనిక్షేప పరిశోధక శాస్త్రము" (archaeology) అని పేరు. ఈశాస్త్ర పరిశోధనల వలన
బూర్వుచారిత్రమును మనము కొంతవఱకు దెలిసి కొనఁగలము. కాని యంతకంటేను యింకఁబూర్వయుగముల నాఁటీచరిత్రను దెలిసికొనుట కాధారములేమైన గలవా? దీనిని దెలిసికొనుటకు “భూగర్భశాస్త్రము” (Geology) కొంతవఱకు సహాయముఁ జేయఁగలదు. భూమిని మనము త్రవ్విచూచిన యెడల ననేకవిధములగు రాళ్ళు, రప్పలు, యిసుక, మన్ను, బురద
లోహములు, ఖనిజములు, చీకిపోయిన కొయ్యలు, బొగ్గులు మొదలగునవి పొరలు పొరలుగఁ గాన్పించును. వీనిని బరీక్షించి చూచికూడ పూర్వభూగోళ మేస్థితిలోనున్నదో తెలిసికొనవచ్చును. దీనిని దాఁటిపోయిన పిమ్మట మనకింక నేమియు నాధారములు లేవు. ఈ పైన చెప్పిన వివిధశాస్త్ర పరిశోధనలవలన చారిత్రయుగమునకు బూర్వ మీభూగోళ స్థితిలోనున్నట్లీ యాధునికులు సిద్ధాంతరీకరించిరో కొంచెము విచారించి చూచెదము.
భూగర్భశాస్త్రవేత్తలు భూమిలో నుండు వివిధమైన పొరలను పరీక్షించిచూచి, యీ భూగోళము పుట్టినది మొదలు యీగా ప్రస్తుత రూపమును ధరించు వఱకుఁ గడచిన కాలమును (ఆదిమపదార్ధము గాక) మహాయుగములుగ భాగించిరి భూమియొక్క పైభాగము నుండి త్రవ్వుకొనుచు లోపలికి పోవుచున్నా మనుకొనుడు! అప్పుడు మనకీవిధముగ నీయైదు యుగముల నాటి పొరలును
వరుసగఁ గానించును.
{{p|fs125}}భూగర్భశాస్త్ర విభజన</p>
I. చతుర్ధయుగము.
1. '''ప్రస్తుతకూపము'''
మంచుయుగానంతర యుగము.
(ఉత్తర హిమప వద్యుగము (Post Glacial)
హిమవద్యుగము.
మంచు యగము:జంతువుల యెముకలు మంచు
తో కప్పబడినది. జంతుసంతానము నివసించు
టకు యోగ్యము కాదు. (Glacial)
పూర్వహిమవద్యుగము.
జంతువుల ఎముకలు.
(Inter-glacial) జంతుసంతానము నివసించు
కనుల
కూలస్థితి.
II తృతీయ యుగము,
చీకుడు మట్టిపొర
అంత కెక్కువ చీకుడు పొర
అంత కెక్కువ చీకుడుపొర
చీకుడు మట్టిపొరః సన్న జీవములున్న వి:
III ద్వితీయయుగము.
సీమనున్న పుపొగ
నున్న పురాతిపొర
మూడుగకములు గలిగిన ఎర్ర క్రొత్తి యిసుక గాతి
పొర
IV ప్రధమయుగము.
క్రొత్త ఎర్రయిసుక గాతిపొర
బొగ్గుపొర
పాత ఎర్రయిసుక రాతిపొర
ఒకవిధమైన మట్టిపొర (Siluvian)
మరి యొక విధ మైనపొర (Cambrian)
:
୮<noinclude><references/></noinclude>
nufdx8twzkouivsrfu17gq6xr6egw5r
569198
569193
2026-08-08T09:31:43Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
569198
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>లను, పోలికలను, సంబంధ బాంధవ్యములను బాగుగ పరిశీలించుట (Comparitive Philology) మూలమున గూడ పూర్వచారిత్రము కొంత తేటపడఁగలదు.
మనమింకను వీనినన్నిటినిఁ గడచి యింకొక మెట్టుపైకి పోదము. ఈ పైన జెప్పిన సాధనముల ద్వారా కొంతకాలము వఱకే ప్రపంచస్థితి మనకు తెలియఁగలదు. అంతకంటెను యింకఁబూర్వకాలపు చరిత్రను తెలిసికొనుట కేమైన నాధారములుగలవా? మన మెప్పుడైనను భూమిని త్రవ్వుచుండఁగఁ బూర్వులచే బహుకాలము కిందట సుపయోగింపఁబడిన గొన్ని కొన్ని చిత్రమైన
వస్తువులు దొరకుచుండును. ఈవిధముగ భూమిలో నణఁగియున్న యనేకమైన వస్తువులను త్రవ్వి యెత్తి దానిని పరీక్షించుట వలన కూడ మనకు మన పూర్వుల చారిత్రమొక్కింత బోధపడఁగలదు. ఇట్లు "భూమిలో నుండు వస్తువులను త్రవ్వి యెత్తి, వానిని పరిశోధించి, తన్మూలమున పూర్వకాలపు చరిత్రను తెలిసికొనగలుగుట ”యనునది ప్రస్తుత మొక గొప్పశాస్త్రముగఁ బరిగణింపఁ బడుచున్నది. దీనికే "భూనిక్షేప పరిశోధక శాస్త్రము" (archaeology) అని పేరు. ఈశాస్త్ర పరిశోధనల వలన
బూర్వుచారిత్రమును మనము కొంతవఱకు దెలిసి కొనఁగలము. కాని యంతకంటేను యింకఁబూర్వయుగముల నాఁటీచరిత్రను దెలిసికొనుట కాధారములేమైన గలవా? దీనిని దెలిసికొనుటకు “భూగర్భశాస్త్రము” (Geology) కొంతవఱకు సహాయముఁ జేయఁగలదు. భూమిని మనము త్రవ్విచూచిన యెడల ననేకవిధములగు రాళ్ళు, రప్పలు, యిసుక, మన్ను, బురద
లోహములు, ఖనిజములు, చీకిపోయిన కొయ్యలు, బొగ్గులు మొదలగునవి పొరలు పొరలుగఁ గాన్పించును. వీనిని బరీక్షించి చూచికూడ పూర్వభూగోళ మేస్థితిలోనున్నదో తెలిసికొనవచ్చును. దీనిని దాఁటిపోయిన పిమ్మట మనకింక నేమియు నాధారములు లేవు. ఈ పైన చెప్పిన వివిధశాస్త్ర పరిశోధనలవలన చారిత్రయుగమునకు బూర్వ మీభూగోళ స్థితిలోనున్నట్లీ యాధునికులు సిద్ధాంతరీకరించిరో కొంచెము విచారించి చూచెదము.
భూగర్భశాస్త్రవేత్తలు భూమిలో నుండు వివిధమైన పొరలను పరీక్షించిచూచి, యీ భూగోళము పుట్టినది మొదలు యీగా ప్రస్తుత రూపమును ధరించు వఱకుఁ గడచిన కాలమును (ఆదిమపదార్ధము గాక) మహాయుగములుగ భాగించిరి భూమియొక్క పైభాగము నుండి త్రవ్వుకొనుచు లోపలికి పోవుచున్నా మనుకొనుడు! అప్పుడు మనకీవిధముగ నీయైదు యుగముల నాటి పొరలును
వరుసగఁ గానించును.
{{Center|{{p|fs125}}భూగర్భశాస్త్ర విభజన</p>}}
{{Center|{{p|fs125}}I. చతుర్ధయుగము</p>}}
1. ''''''ప్రస్తుతకూపము''''''
మంచుయుగానంతర యుగము.
(ఉత్తర హిమవద్యుగము (Post Glacial)
2.'''హిమవద్యుగము'''
మంచు యుగము:౼ జంతువుల యెముకలు మంచుతో కప్పబడినది. జంతుసంతానము నివసించుటకు యోగ్యము కాదు (Glacial)
3.'''పూర్వహిమవద్యుగము'''
జంతువుల ఎముకలు. (Inter-glacial) జంతుసంతానము నివసించుటకు అనుకూల స్థితి.
{{Center|{{p|fs125}}II తృతీయ యుగము</p>}}
::చీకుడు మట్టిపొర
::అంత కెక్కువ చీకుడుపొర
::అంతకంటే కెక్కువ చీకుడుపొర
::చీకుడు మట్టిపొరః౼ సన్న జీవములున్నవి.
{{Center|{{p|fs125}}III ద్వితీయయుగము</p>}}
::సీమ నున్నపుపొర
::నున్నపు రాతిపొర
::మూడు రకములు గలిగిన ఎర్ర క్రొత్త యిసుక రాతిపొర
{{Center|{{p|fs125}}IV ప్రధమయుగము</p>}}
::క్రొత్త ఎర్రయిసుక రాతిపొర
::బొగ్గుపొర
::పాత ఎర్రయిసుక రాతిపొర
::ఒకవిధమైన మట్టిపొర (Siluvian)
::మరియొక విధమైనపొర (Cambrian)<noinclude><references/></noinclude>
ni9yewueeng4wv9fvy6nf4jhmez5cj2
569200
569198
2026-08-08T09:38:00Z
Brjswiki
6801
569200
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>లను, పోలికలను, సంబంధ బాంధవ్యములను బాగుగ పరిశీలించుట (Comparitive Philology) మూలమున గూడ పూర్వచారిత్రము కొంత తేటపడఁగలదు.
మనమింకను వీనినన్నిటినిఁ గడచి యింకొక మెట్టుపైకి పోదము. ఈ పైన జెప్పిన సాధనముల ద్వారా కొంతకాలము వఱకే ప్రపంచస్థితి మనకు తెలియఁగలదు. అంతకంటెను యింకఁబూర్వకాలపు చరిత్రను తెలిసికొనుట కేమైన నాధారములుగలవా? మన మెప్పుడైనను భూమిని త్రవ్వుచుండఁగఁ బూర్వులచే బహుకాలము కిందట సుపయోగింపఁబడిన గొన్ని కొన్ని చిత్రమైన
వస్తువులు దొరకుచుండును. ఈవిధముగ భూమిలో నణఁగియున్న యనేకమైన వస్తువులను త్రవ్వి యెత్తి దానిని పరీక్షించుట వలన కూడ మనకు మన పూర్వుల చారిత్రమొక్కింత బోధపడఁగలదు. ఇట్లు "భూమిలో నుండు వస్తువులను త్రవ్వి యెత్తి, వానిని పరిశోధించి, తన్మూలమున పూర్వకాలపు చరిత్రను తెలిసికొనగలుగుట ”యనునది ప్రస్తుత మొక గొప్పశాస్త్రముగఁ బరిగణింపఁ బడుచున్నది. దీనికే "భూనిక్షేప పరిశోధక శాస్త్రము" (archaeology) అని పేరు. ఈశాస్త్ర పరిశోధనల వలన
బూర్వుచారిత్రమును మనము కొంతవఱకు దెలిసి కొనఁగలము. కాని యంతకంటేను యింకఁబూర్వయుగముల నాఁటీచరిత్రను దెలిసికొనుట కాధారములేమైన గలవా? దీనిని దెలిసికొనుటకు “భూగర్భశాస్త్రము” (Geology) కొంతవఱకు సహాయముఁ జేయఁగలదు. భూమిని మనము త్రవ్విచూచిన యెడల ననేకవిధములగు రాళ్ళు, రప్పలు, యిసుక, మన్ను, బురద
లోహములు, ఖనిజములు, చీకిపోయిన కొయ్యలు, బొగ్గులు మొదలగునవి పొరలు పొరలుగఁ గాన్పించును. వీనిని బరీక్షించి చూచికూడ పూర్వభూగోళ మేస్థితిలోనున్నదో తెలిసికొనవచ్చును. దీనిని దాఁటిపోయిన పిమ్మట మనకింక నేమియు నాధారములు లేవు. ఈ పైన చెప్పిన వివిధశాస్త్ర పరిశోధనలవలన చారిత్రయుగమునకు బూర్వ మీభూగోళ స్థితిలోనున్నట్లీ యాధునికులు సిద్ధాంతరీకరించిరో కొంచెము విచారించి చూచెదము.
భూగర్భశాస్త్రవేత్తలు భూమిలో నుండు వివిధమైన పొరలను పరీక్షించిచూచి, యీ భూగోళము పుట్టినది మొదలు యీగా ప్రస్తుత రూపమును ధరించు వఱకుఁ గడచిన కాలమును (ఆదిమపదార్ధము గాక) మహాయుగములుగ భాగించిరి భూమియొక్క పైభాగము నుండి త్రవ్వుకొనుచు లోపలికి పోవుచున్నా మనుకొనుడు! అప్పుడు మనకీవిధముగ నీయైదు యుగముల నాటి పొరలును
వరుసగఁ గానించును.
{{Center|{{p|fs125}}భూగర్భశాస్త్ర విభజన</p>}}
{{Center|{{p|fs125}}I. చతుర్ధయుగము</p>}}
1. ''''''ప్రస్తుతరూపము''''''
మంచుయుగానంతర యుగము. (ఉత్తర హిమవద్యుగము (Post Glacial)
2.'''హిమవద్యుగము'''
మంచు యుగము:౼ జంతువుల యెముకలు మంచుతో కప్పబడినది. జంతుసంతానము నివసించుటకు యోగ్యము కాదు (Glacial)
3.'''పూర్వహిమవద్యుగము'''
జంతువుల ఎముకలు. (Inter-glacial) జంతుసంతానము నివసించుటకు అనుకూల స్థితి.
{{Center|{{p|fs125}}II.తృతీయ యుగము</p>}}
::చీకుడు మట్టిపొర
::అంత కెక్కువ చీకుడుపొర
::అంతకంటే కెక్కువ చీకుడుపొర
::చీకుడు మట్టిపొరః౼ సన్న జీవములున్నవి.
{{Center|{{p|fs125}}III.ద్వితీయ యుగము</p>}}
::సీమ నున్నపుపొర
::నున్నపు రాతిపొర
::మూడు రకములు గలిగిన ఎర్ర క్రొత్త యిసుక రాతిపొర
{{Center|{{p|fs125}}IV.ప్రధమ యుగము</p>}}
::క్రొత్త ఎర్రయిసుక రాతిపొర
::బొగ్గుపొర
::పాత ఎర్రయిసుక రాతిపొర
::ఒకవిధమైన మట్టిపొర (Siluvian)
::మరియొక విధమైనపొర (Cambrian)<noinclude><references/></noinclude>
37kfzw857errbsd3poj75lvfm47fpw5
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/79
104
217995
569196
2026-08-08T09:23:08Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569196
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}12</p>
{{rh|||<big>జాతి బహిష్కారము</big>}}
{{Largeinitial|మా}}అమ్మ ఆజ్ఞను, ఆశీర్వాదమును బడసి పసుఁబాపను, భార్యను విడిచి అధికోత్సాహముతో బొంబాయికి బయలుదేఱితిని. జూన్ జులై నెలలలో భారతసముద్రము (Indian Ocean) చాల ఒడుదుడుకుగా నుండును. 'మీ తమ్మునికి సముద్రయానము ఇదియే మొదలు గాన నవంబరువఱకును వెళ్లుట మంచిది కాదు; మొన్న నీనడుమనే తుపానుచే ఒక స్టీమరుకూడ మునిఁగిపోయినది' అని కొందఱు మిత్రులు బొంబాయిలో మాఅన్నకు చెప్పిరి. కావున వెంటనే వెళ్లుటకు మా అన్న అంగీకరింపలేదు. అచట ఒక మిత్రునియింట నాకు బస ఏర్పఱచి మా అన్న రాజకోటకు మరలి తన యుద్యోగమునఁ జేరెను. నాకుఁ గావలసిన ప్రయాణ వ్యయమును మాబావదగ్గఱ నిచ్చి నా కిమ్మనియు, వలసిన సాయమునంతయు చేయుఁడని తనమిత్రులతోడను చెప్పి పోయెను.
బొంబాయిలో నాకు ప్రొద్దు పోయెడిది కాదు. రేయుంబవలు సీమ ప్రయాణపు కలవరింతలే.
ఇంతలో మా కులమువారిలో నా సముద్రయానమునుగూర్చి ఆందోళనముసాగెను. అంతవఱకు మా వర్ణమువారైన మోడ్ బనియాలు ఎవరును సీమ త్రొక్క లేదు. నేను సీమకు పోఁదలఁచితిఁ గాన నన్ను వెలివేయ వలయునని కులమున కొందఱకు ఆవేశము కలిగెను. అందులకు ఒకసభ జరిగెను. కులస్థులు చాలమంది వచ్చిరి. నన్ను పిలువనంపిరి. నాకు<noinclude><references/>
{{c|61}}</noinclude>
3p35imevbnt7pw9c0xtbwdhlf3i9gq6
569197
569196
2026-08-08T09:24:40Z
శ్రీరామమూర్తి
1517
569197
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}12</p>
{{rh|<big>జాతి బహిష్కారము</big>||}}
{{Largeinitial|మా}}అమ్మ ఆజ్ఞను, ఆశీర్వాదమును బడసి పసుఁబాపను, భార్యను విడిచి అధికోత్సాహముతో బొంబాయికి బయలుదేఱితిని. జూన్ జులై నెలలలో భారతసముద్రము (Indian Ocean) చాల ఒడుదుడుకుగా నుండును. 'మీ తమ్మునికి సముద్రయానము ఇదియే మొదలు గాన నవంబరువఱకును వెళ్లుట మంచిది కాదు; మొన్న నీనడుమనే తుపానుచే ఒక స్టీమరుకూడ మునిఁగిపోయినది' అని కొందఱు మిత్రులు బొంబాయిలో మాఅన్నకు చెప్పిరి. కావున వెంటనే వెళ్లుటకు మా అన్న అంగీకరింపలేదు. అచట ఒక మిత్రునియింట నాకు బస ఏర్పఱచి మా అన్న రాజకోటకు మరలి తన యుద్యోగమునఁ జేరెను. నాకుఁ గావలసిన ప్రయాణ వ్యయమును మాబావదగ్గఱ నిచ్చి నా కిమ్మనియు, వలసిన సాయమునంతయు చేయుఁడని తనమిత్రులతోడను చెప్పి పోయెను.
బొంబాయిలో నాకు ప్రొద్దు పోయెడిది కాదు. రేయుంబవలు సీమ ప్రయాణపు కలవరింతలే.
ఇంతలో మా కులమువారిలో నా సముద్రయానమునుగూర్చి ఆందోళనముసాగెను. అంతవఱకు మా వర్ణమువారైన మోడ్ బనియాలు ఎవరును సీమ త్రొక్క లేదు. నేను సీమకు పోఁదలఁచితిఁ గాన నన్ను వెలివేయ వలయునని కులమున కొందఱకు ఆవేశము కలిగెను. అందులకు ఒకసభ జరిగెను. కులస్థులు చాలమంది వచ్చిరి. నన్ను పిలువనంపిరి. నాకు<noinclude><references/>
{{c|61}}</noinclude>
2zaw256owlq4pcvzyy741qbcbnmbv0t
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/80
104
217996
569199
2026-08-08T09:34:13Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569199
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>అంత సాహసము ఎటులు వచ్చెనో నాకే తెలియదు; నే నాసభకు నిర్భయముగా వెళ్లితిని. ఆ కులపు పెద్దయగు సేటునకును, మాతండ్రికిని నెయ్యము కలదు. మరియు ఆయన మాకు దూరబంధువు.
'కులధర్మమునుబట్టి నీవు సీమ కేఁగుట పాడిగాదు. సముద్రయానము మనకు నిషేధము. మరియు అచట ధర్మపాలనము చేయుట అశక్యమనియు వింటిమి. అచట దొరలతో కలిసి తినుట, త్రావుట తప్పని సరి' అని సేటు నాతో అనెను.
నేనిటులు బదులు పల్కితిని: - 'సీమకు వెళ్లుట ఎంతమాత్రము ధర్మేతరము కాదు. నే నచటికి విద్యకొఱకే పోవుచున్నాను. తాము వేనికి భయపడుచున్నారో వానిని తాఁకనని మా అమ్మచెంత శపథము చేసితిని. అది నన్ను కాపాడఁగలదు'.
'నీ వక్కడికి వెళ్లిన పిదప ధర్మమెంతయు సాగకుండుట నిక్కువము. మీతండ్రిగారికిని, నాకును ఎట్టిచెలిమి కలదో నీ వెఱుఁగుదువు గాన నామాట నీవు వినవలెను' అని సేటు పల్కెను.
'అయ్యా, నే నాచెలిమి నెఱుఁగుదును. మీరు నాతండ్రివంటివారే కాని సీమకు వెళ్లవలె నను నానిశ్చయమును మార్చుకొనఁజాలను. వేఱుఉపాయము లేదు. మా తండ్రిగారికి మిత్రుఁడును, సలహా చెప్పువాఁడును, విద్వాంసుఁడును అగు ఒక బ్రాహ్మణుఁడు కలఁడు; ఆయనకు సీమకు వెళ్లుటయం దేమియు దోషము కానరాలేదు. మా అమ్మగారును, అన్న గారును అంగీకరించిరి' అని నే నంటిని.
'కులమువారి ఆజ్ఞను నీవు మన్నింపవా?'
'నాకు వేఱుదారి లేదు. కులమువారు దీనిలో కల్పించుకొనఁగూడ దనియే నా తలఁపు'.<noinclude><references/>
{{c|62}}</noinclude>
00aapud0r5j97h64q554ohe1dfchwe3
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/81
104
217997
569202
2026-08-08T09:48:13Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569202
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>12 జాతి బహిష్కారము</big>}}</noinclude>ఈ ప్రత్యుత్తరముతో సేటునకు ఆగ్రహము కలిగి నాలుగు చీవాట్లు వేసినాఁడు. నేను నిబ్బరముగా కూర్చుంటిని.
'నేఁడు ఇతనిని వెలివేసితిని. వీనికి సాయముచేయువారికిని, వీనిని సాగనంపుటకు స్టీమరురేవునకు పోవువారికిఁగూడ ఒకరూపాయి పావలా జరిమానా వేసితిని' [సాలగ్రామదానము] అని సేటు ఆజ్ఞాపించెను.
నేను ఇసుమంతయు చలింపలేదు. సేటుకడ సెలవు గైకొని వెడలివచ్చితిని. మా అన్నకు ఈవిషయము తెలిసినచో వెనుకకు పీఁకునేమో అని అనుకొంటిని గాని ఆయన 'కులమువారు వెలివేసినను భయపడవలదు; నీవు సీమకు వెళ్లుట మానవలదు.' అని వ్రాయుట పరమభాగ్యము.
ఇది జరిగిన పిమ్మట నాకు తొందర ఎక్కువ ఆయెను. వీరందఱును మా అన్నగారికి ఎక్కువ ఒత్తిడి కలిగించినచో వారి అభిప్రాయము ఎక్కడ మాఱునో యని నేను తొట్రుపడుచుండఁగా, జునఘడు వకీలు ఒకఁడు ఇంగ్లండునకు బారిస్టరు పరీక్షకుఁగాను సెప్టెంబరు నాలుగవతేదీని బయలుదేఱు ఓడపై పోవుచున్నాఁడని
వార్తవచ్చెను. నే నావార్త మా యన్నగారి మిత్రులకు ఎఱిఁగించితిని. ఇట్టి సహవాసము పోఁగొట్టుకొనఁ గూడదని వారును అంగీకరించిరి. ఇఁక అవకాశము ఎంతయో లేదు. మా అన్నకు తంతి నీయఁగా ఆయనయు అంగీకరించెను. మాబావను పైక మిమ్మని అడిగితిని. అతఁడు సేటు ఆజ్ఞ ప్రస్తావించి, 'నన్ను వెలివేసెదరు గాన ఈయఁజాల'ననెను. పిదప నేను మా కుటుంబమునకు మిత్రులగు ఒకరి యింటికి వెళ్లి, నా పయనమునకు ఆవశ్యకమగు సొమ్మును బదులిచ్చి మా అన్నవద్ద వసూలుచేసికొనుఁడని<noinclude><references/>
{{c|63}}</noinclude>
t2w4yr6xlycqgm0y8eptiptt0ptoy0o
పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.1 (1920).pdf/13
104
217998
569203
2026-08-08T09:50:20Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
569203
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs125}}V.ఆదిమపదార్థము. (మూలప్రకృతి)</p>}}
::ప్రాణముతో గూడుకున్న వస్తువు లున్నట్లు నూచనలు.
{{Center|{{p|fs125}}భూనిక్షేపశాస్త్రవిభజన</p>}}
1. ఇనుపయుగము (మనుష్య సంచారము)
2. కంచు (కాంశ్య) యుగము
3. శిలాయుగము
::(క) ఉత్తరశిలాయుగము (5 వేల సంవత్సరములు, మనుష్యసంచారము)
::(ద) పూర్వశిలాయుగము (7, 8, 10 వేల సం॥ములు మనుష్యసంచారము)
భూగర్భశాస్త్రప్రకారముఁ గావింపఁబడిన కాలవిభాగము, పైపట్టీ చూచినయెడల, తెలియగలదు. ఇక చతుర్థయుగపునాటి మట్టిపొరలలోఁ గాన్పించిననువి విధములగు వస్తు సామిగ్రినిబట్టి భూనిక్షేపరిశోధక శాస్త్రజ్ఞులెట్లు కాలవిభాగమును చేసిరో చూచెదము గాక. మంచు
యుగపుపొరలలోను, తత్పూర్వయుగపు పొరలలోను
యిప్పుడు ప్రస్తుతము మనకు తెలిసియున్నట్టి జంతువుల
యెముకలు మొదలగునవి మట్టితో గలిసి యున్నట్లు
భూగర్భశాస్త్ర పరిశోధనల వలన నే తెలియవచ్చినది,
ఆదిగాక యీచతుర్థ యుగములలోను తత్పూర్వ యుగ
ములోను గూడ యీ భూమిపైమనుష్యులు నివసించి
నట్లు సైతము సూచనలు గలవు. ఈ యుగముల నాఁటి
నట్టిపొరలలోఁ దొరకిన వస్తుసామగ్రిని ని శేషేపములను
బట్టి భూని క్షేపపరిశోధక శాస్త్రజ్ఞులు, ఆదిను మానవుల
కాలమును మూఁడు తరగతులుగా భాగించియుండిరి.
(1) శిలాయుగము, (3) కంచు లేక (కాంశ్య) యుగము,
(3) ఇనుప యుగము. శిలాయుగములోని మనుష్యులకు
లోహపు పనిముట్లు చేసికొనుట తెలియనందున,
రాతితోడను, కొమ్ములతోడను, కొయ్యలతోడను, తమ
పనిముట్లను జేసికొనుచుండిరి. ఈపనిముట్లు చాల మోటు
గనుండెను, ఈకాలమునాఁటి మట్టిపొరలలో కొయ్యల
తోడను రాతితోడను, చేయఁబడిన మోటుకత్తులు,
అంబులు, మొద లైన పనిముట్లు దొరకిన వేగాని లోహపు
సామగ్రిదొరక లేదు. అంతకంటే వైపొరలలో లోహపు
00
సామగ్రి దొరకినది. ఆయాపొరలలో దొరకిన వస్తువు
లనుబట్టియే యీ పై విభ జనం గావింపబడినది.
ఈ శిలాయుగమును తిరిగి పూర్వ శిలాయుగము,
ఉత్తరశిలాయుగము అని రెండువిధములుగ భాగించిరి.
(Palaeolithic) పూర్వశిలాయుగపు రాతి పనిముట్లు
ఉత్తరశిలాయుగపు పనిముట్లకంటే నెక్కువ మోటుగ
నున్నవి. పూర్వశిలాయుగపు పనిముట్లు, ఉత్తరశిలాయణ
గపు పనిముట్లకంటే క్రింది (ప్రాఁత) పొరలలో గనుపిం
చినవి. పూర్వశిలాయుగపు నాఁటి జంతువులు ఉత్తర
శిలాయుగములోఁ గాన్పించుట లేదు. ఉత్తరళిలా
యగమునాఁటికే ఆ పెద్ద పెద్దజంతువు లన్నియు పూర్తిగ
నశించినట్లు కనఁబడుచున్నది.. ఈ రెండుయుగములకును
మధ్య ననేక గొప్ప మార్పు లీ భూగోళముమీఁద సంభ
వించినట్లు సూచనలు గలవు. అప్పటి శీతోష్ణస్థితి వేరు.
అప్పుడు యీ గోళముమీఁద భూ, జల భాగము లీవిధ
ముగ లేవు. అప్పటి సముద్రములు వేరు. అప్పటి దేశ
ములు వేరు. ఇవన్నియు ఉత్తరశిలా యుగములో మారి
పోయి నేఁటివఱకును ఒకేవిధముగ తిరిగి మార్పు లేమియ
లేక నిలచి యున్నవి. భూగర్భశాస్త్ర పరిశోధనలకును
భూని క్షేపశాస్త్ర పరిశోధనలకును గల సంబంధమును
కొంచె మిచ్చట విచారించి చూచెదము. పూర్వశిలా
యుగములోని మానవులు మంచు యుగములోను, తత్పూ
ర్వయుగములోను
నివసించినట్లు గానఁబడుచున్నది.
అత్పూర్వయుగములో దేశములోని శీతోష్ణస్థితి మిక్కిలి
యసుకూలముగ నుండి, హిమవద్యుగము వచ్చుటతోడ నే
ఊత్తర దేశమంతయు మంచుతోఁ గప్పబడిపోవుట చేతి,
నచ్చటివారు బహుయిక్కట్టుల పాలైనట్లు జ్యోచు
చున్నది. ఈ మంచుయుగములోనే దేశములోని జంతు
వులన్నియు నశించి నట్లైంచవలెను.
పూర్వశిలాయుగపు మనుష్యులలో కొందఱు హిమ
వద్యుగమును గడచిబ్రతికినట్లు కనఁబడుచున్నది. ఉత్త గ
శిలాయుగము, కాంశ్య యుగము, ఇనుపయుగము యీ
మూఁడును మంచుయు గానంతర యుగములో ప్రబలినవి.
రమున్నట్లు నిదర్శనములు గలవు. అది గాక తృతీయ
దీనిని బట్టి చతుర్థ యుగమునందంతటను మని
మనుష్య సంచా
యుగములో సైతము మనుష్య సంచారమున్న ట్లిప్పుడు
నూతన పరిశోధనల వలన తేటబడుచున్నది.<noinclude><references/></noinclude>
9sxjwo5vzz3810cdarwk3nlr15l6bow
569211
569203
2026-08-08T11:03:22Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
569211
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs125}}V.ఆదిమపదార్థము. (మూలప్రకృతి)</p>}}
::ప్రాణముతో గూడుకున్న వస్తువు లున్నట్లు నూచనలు.
{{Center|{{p|fs125}}భూనిక్షేపశాస్త్రవిభజన</p>}}
::1. ఇనుపయుగము (మనుష్య సంచారము)
::2. కంచు (కాంశ్య) యుగము
::3. శిలాయుగము
::(క) ఉత్తరశిలాయుగము (5 వేల సంవత్సరములు, మనుష్యసంచారము)
::(ద) పూర్వశిలాయుగము (7, 8, 10 వేల సం॥ములు మనుష్యసంచారము)
భూగర్భశాస్త్రప్రకారముఁ గావింపఁబడిన కాలవిభాగము, పైపట్టీ చూచినయెడల, తెలియగలదు. ఇక చతుర్థయుగపునాటి మట్టిపొరలలోఁ గాన్పించిననువి విధములగు వస్తు సామిగ్రినిబట్టి భూనిక్షేపరిశోధక శాస్త్రజ్ఞులెట్లు కాలవిభాగమును చేసిరో చూచెదము గాక. మంచు యుగపుపొరలలోను, తత్పూర్వయుగపు పొరలలోను యిప్పుడు ప్రస్తుతము మనకు తెలిసియున్నట్టి జంతువుల యెముకలు మొదలగునవి మట్టితో గలిసి యున్నట్లు భూగర్భశాస్త్ర పరిశోధనల వలననే తెలియవచ్చినది. ఆదిగాక యీచతుర్థ యుగములలోను తత్పూర్వ యుగములోను గూడ యీ భూమిపై మనుష్యులు నివసించినట్లు సైతము సూచనలు గలవు. ఈ యుగముల నాఁటి నట్టిపొరలలోఁ దొరకిన వస్తు సామగ్రిని నిక్షేపములను బట్టి భూనిక్షేపపరిశోధక శాస్త్రజ్ఞులు, ఆదిను మానవుల కాలమును మూఁడు తరగతులుగా భాగించియుండిరి.
(1) శిలాయుగము, (2) కంచు లేక (కాంశ్య) యుగము (3) ఇనుప యుగము. శిలాయుగములోని మనుష్యులకు లోహపు పనిముట్లు చేసికొనుట తెలియనందున, వారు రాతితోడను, కొమ్ములతోడను, కొయ్యలతోడను, తమ పనిముట్లను జేసికొను చుండిరి. ఈపనిముట్లు చాల మోటుగనుండెను, ఈకాలమునాఁటి మట్టిపొరలలో కొయ్యల తోడను రాతితోడను, చేయఁబడిన మోటుకత్తులు, అంబులు, మొదలైన పనిముట్లు దొరకినవేగాని లోహపు సామగ్రిదొరక లేదు. అంతకంటే వైపొరలలో లోహపు
సామగ్రి దొరకినది. ఆయాపొరలలో దొరకిన వస్తువులనుబట్టియే యీ పై విభజనఁ గావింపబడినది.
ఈ శిలాయుగమును తిరిగి పూర్వ శిలాయుగము, ఉత్తరశిలాయుగము అని రెండువిధములుగ భాగించిరి. (Palaeolithic) పూర్వశిలాయుగపు రాతి పనిముట్లు ఉత్తరశిలాయుగపు పనిముట్లకంటే నెక్కువ మోటుగ నున్నవి. పూర్వశిలాయుగపు పనిముట్లు, ఉత్తరశిలాయుగపు పనిముట్లకంటే క్రింది (ప్రాఁత) పొరలలో గనుపించినవి. పూర్వశిలాయుగపు నాఁటి జంతువులు ఉత్తర
శిలాయుగములోఁ గాన్పించుట లేదు. ఉత్తరళిలా యగమునాఁటికే ఆపెద్ద పెద్దజంతువు లన్నియు పూర్తిగ నశించినట్లు కనఁబడు చున్నది.. ఈ రెండుయుగములకును మధ్య ననేక గొప్ప మార్పులీ భూగోళముమీఁద సంభవించినట్లు సూచనలు గలవు. అప్పటి శీతోష్ణస్థితి వేరు. అప్పుడు యీ గోళముమీఁద భూజలభాగము లీవిధముగ లేవు. అప్పటి సముద్రములు వేరు. అప్పటి దేశములు వేరు. ఇవన్నియు ఉత్తరశిలా యుగములో మారి పోయి నేఁటివఱకును ఒకేవిధముగ తిరిగి మార్పు లేమియు లేక నిలచి యున్నవి. భూగర్భశాస్త్ర పరిశోధనలకును భూనిక్షేపశాస్త్ర పరిశోధనలకును గల సంబంధమును కొంచె మిచ్చట విచారించి చూచెదము. పూర్వశిలాయుగములోని మానవులు మంచు యుగములోను, తత్పూర్వయుగములోను నివసించినట్లు గానఁబడు చున్నది. అత్పూర్వయుగములో దేశములోని శీతోష్ణస్థితి మిక్కిలి యసుకూలముగ నుండి, హిమవద్యుగము వచ్చుటతోడనే
ఊత్తర దేశమంతయు మంచుతోఁ గప్పబడిపోవుటచేత, నచ్చటివారు బహుయిక్కట్టుల పాలైనట్లు తోచుచున్నది. ఈ మంచు యుగములోనే దేశములోని జంతువులన్నియు నశించి నట్లైంచవలెను.
పూర్వశిలాయుగపు మనుష్యులలో కొందఱు హిమవద్యుగమును గడచి బ్రతికినట్లు కనఁబడుచున్నది. ఉత్తర శిలాయుగము, కాంశ్య యుగము, ఇనుపయుగము యీ మూఁడును మంచుయుగానంతర యుగములో ప్రబలినవి. దీనిని బట్టి చతుర్థ యుగానంతటను మనుష్యసంచారమున్నట్లు నిదర్శనములు గలవు. అది గాక తృతీయ యుగములో సైతము మనుష్యసంచారమున్నట్లిప్పుడు
నూతన పరిశోధనల వలన తేటబడుచున్నది.<noinclude><references/></noinclude>
glzxjyy9ff04ijz2oun5a22jz82t5be
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/82
104
217999
569204
2026-08-08T09:57:47Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569204
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>కోరితిని. ఆయన నాకోరిక నెఱవేర్చుటయ కాక నన్ను చాల ప్రోత్సహించెను. వారి కెంతయు కృతజ్ఞత తెలుపుకొంటిని. వారు ఇచ్చినడబ్బును పుచ్చుకొని వెంటనే టిక్కెట్టు కొంటిని. నే నిఁక ప్రయాణమునకు
సరంజామా సిద్ధముచేసికొనవలెను. అనుభవశాలియగు ఒక మిత్రుఁడు బట్టలు మున్నగు వానిని తయారుచేయించెను. అవి చాలా వింతగా నుండెను. అందు కొన్ని నాకు బాగున్నవి; కొన్ని బాగులేవు.
ఇటీవల నేను తాల్చుటకు అంగీకరించు నెక్ టై ఆనాఁడు ఏవగించుకొంటిని. పొట్టి చొక్కా (జ్యాకెట్టు) తొడుగుకొనుట నాకు సిగ్గాయెను. ఇంగ్లాండునకు పోవు ఉత్కటమగు ఇచ్ఛముందు ఈ అనిచ్ఛకు ఆట్టే తావు లేదు. ఇఁక పయనమున కావలసిన తినుబండము నాకడ నిండుగాఁ గలదు, జునఘుడ్ వకీలు త్ర్యంబకరాయి మజముదారుగారి గది (కేబిను) లోనే నామిత్రులు నాకొక శయ్యను (బెర్తు) పుచ్చుకొనిరి; మఱియు వారితో నాకు పరిచయము గలిగించిరి. ఆయన వయసు వాఁడు; జ్ఞానము, లోకానుభవము కలవాఁడు. నేను ఇంకను లోకానుభవము లేని పదునెనిమిదేండ్ల కసరుగాయను. మజముదారుగారు 'ఇతని
గుఱించి మీరు భయపడవల' దని చెప్పిరి.
ఇటులు నేను 1888 సం. 4 వ సెప్టెంబరునాఁడు బొంబాయి నుండి బయలు దేఱితిని.<noinclude><references/>
{{c|64}}</noinclude>
gqkfdszvpn83fb977z3n3wajo9cb1uj
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/83
104
218000
569205
2026-08-08T10:10:39Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569205
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}13</p>
{{rh|<big>తుదకు సీమ</big>||}}
{{Largeinitial|నా}}కు సముద్రయానమువలన తఱుచు అందఱకు వచ్చు వాంతి మొదలగు వ్యాధి రానేలేదు. కాని దినములు గడచిన కొలఁది ఆరాటముగా నుండెను. కొట్టు పెత్తనగానితో మాటలాడుటకుఁ
గూడ నాకు కొంకు. నాకు ఇంగ్లీషు మాటలాడుట ఎప్పుడును అలవాటు లేదు. రెండవ సెలూనులో ఒక్క మజముదారుగారు తక్క తక్కినవారందఱు ఆంగ్లేయులే. వారితో నేను మాటలాడఁజాలకుంటిని. వారు నాతో మాటలాడ తటస్థించినపుడు వారి ఉద్దేశము తెలియునది కాదు. తెలిసినపుడును బదులు చెప్పఁజాల కుంటిని. నేను పైకి తెలియఁజెప్పుటకు ముందు ప్రతివాక్యమును లోపల కూడఁబలికికొనవలసినచ్చెడిది. భోజనసమయములందు కత్తులను, ముల్లుగరిటెలను వాడుట నే నెఱుఁగను; మఱియు చేసినపదార్థములలో మాంసము లేని పదార్థ మేదో అడుగుటకు నాకు ధైర్యము చాలదు. అందువలన నే నెన్నఁడును భోజనశాలలో పదిమందితో కలిసి భుజింప లేదు. ఎప్పుడును నా గదిలోనే భుజించుచుంటిని. భోజ్యము లన్ననో, ముఖ్యముగా నేను తెచ్చుకొన్న చిఱుదిండ్లును, పండ్లును. మజముదారుగారికి ఇట్టి బాధలేదు. ఆయన అందఱలోను కలిసిపోఁగలఁడు. ఆయన అందఱతోను కలిసి మెలిసి స్టీమరు పైతట్టున సంచరించుచుండఁగా నేను పగలు నా గదిలో దాగియుండి, సాయంకాలమున కొలఁదిమంది ఉన్నపుడే పైకిఁ బోవ సాహసించుచుండువాఁడను. మజముదారుగారు నీవును<noinclude><references/>
{{c|65}}</noinclude>
jmi0502zqgukb5njwn0ozgub6kxdowm
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/84
104
218001
569206
2026-08-08T10:23:03Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569206
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>బాటసారు లందఱతో కలిసిమెలిసి యుండుమనియు, బిడియపడక మాటాడుమనియు ఎల్లపుడు చెప్పుచుండెను. మఱియు లాయరులు నోరు కలవారుగ ఉండవలయునని తన అనుభవములు కొన్ని చెప్పెను.
మఱియు అవకాశము చిక్కినపుడెల్ల ఇంగ్లీషు మాటలాడుమనియు, తప్పులకు లెక్క గొనవలదనియు, పరభాషలో తప్పులు రాక మానవనియు వారు బోధించిరి. కాని ఏదియు నా జంకును తీర్చలేదు.
ఒక ఆంగ్లేయుఁడు దయతో నన్ను మాటలలోనికి దింపెను. ఆతఁడు నా కంటె పెద్ద. నీవు ఏమి తింటివి ? నీ కేమిపని? నీవెక్కడికి వెళ్లుచుంటివి ? నీ కీ మోమోట మేమిటి? ఈరీతిగా ప్రశ్నించెను. ఆయన నన్ను అందఱతో పాటు పంక్తికి రమ్మనియు సలహా ఇచ్చెను. నా మాంసత్యాగదీక్షకు నవ్వి, మిత్రునివిధమున, మేము ఎఱ్ఱసముద్రము (Red Sea) లో ఉండఁగా, ఇటులు చెప్పెను — 'బిస్కే సముద్రమును చేరనంతవఱకు నీ వనుకొన్నటు లుండును గాని పిమ్మట నీ నియమమును మార్చుకొనవలసి యుండును. మాంసము తిననియెడల బ్రతుకఁజాలనంత చలి ఇంగ్లండులో ఉండును.'
'అచట మాంసము వర్జించియు బ్రతుకవచ్చునని జనులు చెప్పఁగా వింటి నే' అని నే నంటిని.
‘అది వట్టి కల్ల. నా యెఱుకలో అట్టివా రెవరును లేరు. ఒకటి చూడు: నేను సారా త్రావుచున్నను నిన్ను త్రావుమంటినా? కాని మాంసముతిని తీరవలెను. తినకున్న బ్రదుకఁజాలవు.'
'మీ ఉపదేశమునకు వందనములు కాని నేను మాంసము ముట్టనని మా అమ్మగారికడ యథావిధిగ ప్రమాణము చేసితిని కావున తినఁజాలను. అది లేకుండ జరుగదేని ఇంటికి తిరిగి వెళ్లుటయే మేలని తలఁతును.'<noinclude><references/>
{{c|66}}</noinclude>
830xe26ceeguvuvep7vrniubgbp99gl
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/85
104
218002
569208
2026-08-08T10:39:51Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569208
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>13 తుదకు సీమ</big>}}</noinclude>మేము బిస్కేసముద్రమునఁ జొఱఁబడితిమి కాని మద్యమాంసముల అక్కఱ కానరాలేదు. మాంసము ముట్టలేదని ఉల్లాకులు (సర్టిఫికేటులు) పుచ్చుకొమ్మని ఇంటికడ చెప్పిరి. కావున నే నా ఆంగ్లమిత్రుని ఒక సర్టిఫికెట్టు ఇమ్మని కోరితిని. అతఁడు సంతోషముతో ఇచ్చెను. నేను దానిని కొంతకాలము ముల్లెవలె దాఁచుకొంటిని. మాంసభోజులు కూడ మాంసభోజులు కానియటులు సర్టిఫికేటులను సంపాదించుచుండుట చూచినపిమ్మట నాకు దానిపై మోజు తగ్గెను. నా మాటను నమ్మనిచో సర్టిఫికేటు సంపాదించుకొని మాత్రము లాభమేమి ?
ఎట్లో ప్రయాణము ముగిసి మేము సౌతాంప్టన్ చేరితిమి. అది శనివారమని అనుకొందును. నా మిత్రులు తెల్ల ఉన్ని సూటు (లాగు,కోటు, వేస్టుకోటు) తయారు చేయించి యిచ్చిరి. ఓడలో నల్ల సూటే ధరించితిని. రేవులో దిగినపుడు సూటు బాగుగా ఉండునని దాని తాల్చితిని. అవి సెప్టెంబరు తుది దినములు. అచట నున్న
వారిలో నేను గాక మఱి యెవ్వరును అట్టిదుస్తులఁ దాల్ప లేదు. చాలమంది తమ సామగ్రిని తాళపుచెవులతో కూడ గ్రిండ్లే కంపెనీ ఏజంటు వశమున ఉంచిపోవుచుండుట చూచి నేనును అట్లు చేయవలయునని నా సామానును తాళపుఁజెవులతో అతని వశముననే ఉంచితిని.
నా కడ డాక్టరు వ్రాణజీవన మెహతా, దలపతరాం శుక్ల, రణజిత్ సింహ మహారాజు, దాదాభాయి నౌరోజీగార్ల పేర నామిత్రులు ఇచ్చిన సిఫార్సు ఉత్తరము లున్నవి. లండనులో విక్టోరియా హోటేలులో బసచేయుఁడని ఓడలో ఒకరు మాకు సలహా ఇచ్చిరి. దాని ననుసరించి నేనును, మజముదారు గారును ఆ హొటేలునకే వెళ్లితిమి. ఏఱీవే<noinclude><references/>
{{c|67}}</noinclude>
7hpji7gib5pm1si8ughocnm4m5ez4qr