వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.14
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
పుట:Aananda-Mathamu.pdf/152
104
109488
569485
355962
2026-08-09T13:58:47Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
569485
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||ఇరువ దెనిమిదవ ప్రకరణము|147}}</noinclude>{{left margin|5em}}<poem>
ఈ యౌవన జలతరంగ వరోధిపుఁ డెవఁడో?
హరే మురారే! హరే మురారే!
మరల నెచ్చటనో సారంగ మధురధ్వని వినఁబడెను.
ఈ యౌవన జలతరంగ వరోధిపుఁ డెవఁడో?
హరే మురారే! హరే మురారే!
దానితో పురుషకంఠమును జేరి సంగీతము వినఁబడెను.
ఈ యౌవన జలతరంగ వరోధిపుఁ డెవఁడో?
హరే మురారే! హరే మురారే!</poem></div>
మూడు స్వరములు నొకటిగాఁ జేరి వనలతల నెల్లఁ గంపించెను. శాంతి గానము చేయుచు వెడలి పోయెను.
ఆ దట్టమగు వనమున నేమి యుండినదియు బయట నుండి చూచిన గోచరము కాదు. శాంతి, యా వనమధ్యమునఁ బ్రవేశించెను. అచ్చట శాఖాపల్లవరాశియందొక చిన్న కుటీర ముండెను. అది మ్రానికొమ్ములచేఁ గట్టఁబడి యాకులచేఁ గప్ప బడి యుండెను. అందలి గోడలు తడికెలు కట్టి మట్టిచే నలక బడినదిగ నుండెను. దానితలుపు లతలచే నల్లంబడి యుండెను. ఆ తలుపును దెఱచుకొని శాంతి ప్రవేశించెను. అచ్చట జీవానందుఁడు సారంగమును వాయించుచుఁ గూర్చుండి యుండెను.
జీవానందుఁడు శాంతినిఁ జూచి, ‘ఇన్ని దినములకు జల తరంగ ముప్పొంగి ప్రవహించెనా?’ యనెను.
శాంతి నవ్వి, ‘ఆనకట్ట కట్టఁబడినపిదప ఉప్పొంగి ప్రవహించు టెట్లు?’ అని యుత్తర మొసంగెను.<noinclude><references/></noinclude>
9xo4mxcq6alm8kznqwvll77r2nzt8th
పుట:Aananda-Mathamu.pdf/153
104
109489
569487
355963
2026-08-09T14:01:10Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
569487
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|148|ఆనందమఠము|}}</noinclude>జీవానందుఁడు కందిన మోముకలవాఁడై, చూడుము, ‘శాంతీ! ఒకనాఁడేమో నాకు వ్రతభంగము కలిగి నాప్రాణము ఉత్సర్గమై పోయి యుండెను. ఆపాపంబునకుఁ బ్రాయశ్చిత్తము కావలయును. ఇన్ని దినములకుఁ బ్రాయశ్చిత్తము జేసికొనుచున్నాను. కేవలము నీకోరిక చేతఁ జేసికొన లేదు. ఇఁక ఘోర యుద్ధము జరుగుటకు కాలవిళంబము లేదు. ఆయుద్ధ క్షేత్రముననే నాప్రాయశ్చిత్తము జేసికొనవలయును. ఈ ప్రాణమును ద్యజింపవలయును. నేను చచ్చుపర్యంతము ఈ బ్రహ్మచర్యమే’ అనెను.
శాంతి —— నేను నీ ధర్మపత్నిని; సహధర్మిణిని; ధర్మ కార్యమునందు సహకారిణినై యున్నాను. నీ వతిశయమైన గురుతర ధర్మంబును గ్రహించిన వాఁడవు. ఆధర్మమునకు సహాయము చేయుటకే నేను ధర్మంబును గృహమును త్యజించి వచ్చినదానను. ఇరువురును జేరి ధర్మాచరణము నాచరింత మనియే కదా యిల్లు విడిచివచ్చి వనమున వసించుచున్నాను. నీ ధర్మమును వృద్ధి చేసెదను. ధర్మపత్నినైయుండి ధర్మమును విఘ్నము చేయుదునా? వివాహము ఇహమునకు పరమునకు ప్రయోజనకారి. ఇహమునకు మాత్రమే నేను నిన్ను వివాహమాడ లేదు. దానిని నీ వెఱుంగుదువు, మన వివాహము పరలోక ప్రయోజనమునకునై యున్నది. పరమున ఫల మొకటికి రెండింత లగును. ప్రభూ! నీవు నాకు గురుఁడవు. నేను నీకు ధర్మమును జెప్పఁగలనా! మఱియు నీవు వీరుఁడవు, నీకు వీర వ్రతమును నేర్పఁగలనా?<noinclude><references/></noinclude>
6ai8t5z42axm6ferfv21iotubh5q9vg
పుట:Aananda-Mathamu.pdf/154
104
109490
569489
564622
2026-08-09T14:02:55Z
రవిచంద్ర
146
569489
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Rajasekhar1961" />{{rh||ఇరువదితోమ్మిదవ ప్రకరణము|149}}</noinclude><section begin="154A" />జీవానందుఁ డాహ్లాదముచే గద్గదకంఠుఁడై —— నీవు నేర్పియే నేను నేర్చికొంటిని, అనెను.
శాంతి ప్రఫుల్లచిత్తయై —— ఇంకను వినుము; గోసాయీ! ఇహమందే మన వివాహము నిష్ఫలమా? నీవు నన్నుఁ బ్రేమించుచున్నావు. నేను నిన్నుఁ బ్రేమించుచున్నాను. ఇంతకంటే ఇహమున నింకేమి యధిక ఫలము కావలయును? చెప్పుము ——“వందేమాతరం”
అపు డాయిరువురును జేరి యేకకంఠముతో “వందేమాతరం” అనుగీతమును పాడిరి. వారు గానము చేయుచు కన్నీరు నించి యేడ్చిరి.
{{rule|6em}}
<section end="154A" />
<section begin="154B" />{{p|fs125|ac}}ఇరువదితొమ్మిదవ ప్రకరణము,</p>
{{p|fs100|ac}}భవానందుఁడు రాజనగరంబున కల్యాణితో సంభాషించుట</p>
భవానందగోస్వామి, యొక్కసారి రాజనగరంబునకు వచ్చి ప్రశస్తమైన రాజవీథిని విడిచి చీఁకటిగా నుండు నొక సందున బోయెను. ఆ సందులోని ఇరుపార్శ్వములందును గొప్ప గొప్ప మేడయిండ్లు కలవు. సూర్యుఁడు మధ్యాహ్న సమయంబునమాత్ర మొక్కసారి తొంగి చూచును. మరల నెప్పటివలె నచ్చట నంధకారమే. ఆసందులో నొక రెండంతస్తుల సౌధమునందు భవానందుఁడు ప్రవేశించెను. మొదటియంతస్తులో నొక చిన్న యింటియందు ఏఁబది యేండ్ల యాఁడు దొకతె వంట
<section end="154B" /><noinclude><references/></noinclude>
qy9esrol642501b7h2emxqqy7d0prz9
పుట:Aananda-Mathamu.pdf/155
104
109491
569490
355965
2026-08-09T14:04:52Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
569490
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|150|ఆనందమఠము|}}</noinclude>చేయుచుండెను. అచ్చటికిఁబోయి భవానందమహా ప్రభువు దర్శన మొసంగెను. ఆయాఁడుది యర్ధవయస్కురాలును, నల్లని యాకారమును, బలిసినశరీరమును గల్గి, ఎఱ్ఱచీరెనుధరించి యుండెను. చెక్కిళ్లపై పచ్చ పొడిపించుకొని యుండెను. సీమంత ప్రదేశమున కేశదామము చూడాకారముగ శోభిల్లుచుండెను. గరిటెను తపెలయం దుంచి "రణరణ” శబ్దము చేయుచుఁ ద్రిప్పుచుండెను. అలకావళి కేశగుచ్ఛ మటునిటు నెగురుచుండెను. తనలో దానే యే మేమో చెప్పుచుండెను. ఆమె ముఖభంగి వికారమైనపు డంతయు తలమీఁది చూడాకారమైన ముడి నానాప్రకారములుగ నల్లాడుచుండెను. ఇట్టిసమయమున భవానంద ప్రభువు ప్రవేశించెను. ప్రవేశించి, ‘ఏమి, ఠాకూరాణీ! లేచి రా! నమస్కరించెద’ ననియెను.
ఠాకూరాణి భవానందునిఁ గాంచి, భయంపడి, చీరెను సవరించికొనుట కారంభించెను. మస్తకమున నున్న చూడాకార మగు ముడిని విప్పవలయు నని యిష్టము. అయినను అనుకూల పడ లేదు. ఏలన, చేతిలో గరిటె యుండినదేగాక చేయిని కడిగి కొనలేదు. నూనెచే మసృణమైన యా చికురుజాలమునందు, అయ్యో! అందులో పూజాసమయమున నొక వకుళ పుష్పము చిక్కుకొని యుండెను. చెఱఁగుతో మూయుటకు యత్నించెను. అదియు సాధ్యము కాలేదు. ఏల? ఆ ఠాకూరాణీ యైదుమూరల బట్టనే కట్టుకొని యుండెను. ఆ యైదుమూరల గుడ్డ మొదట గురుభార ప్రణత మైన యుదర ప్రదేశమును జుట్టుకొని వచ్చుటలోనే చాలవఱకు సరిపోయినది. ఆమీఁద మిగిలినగుడ్డ దుస్సహభారగ్రస్త హృ<noinclude><references/></noinclude>
73xdkpyd8daos57nyxxe9lf2c9q8smc
పుట:Aananda-Mathamu.pdf/156
104
109492
569493
355966
2026-08-09T14:08:02Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
569493
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||ఇరువది తొమ్మిదవ ప్రకరణము|151}}</noinclude>దయమండలమును దాటి భుజముపై కెక్కి బలాత్కారమున కుడి చెవివఱకు వచ్చి, యిక ముందు పోలేనని ఖండితముగఁ జెప్పెను. ఇక చేయున దేమి? గౌరీ ఠాకూరాణి వ్రీడావనతు రాలై చెఱఁగును చేతఁ బట్టుకొని, యికముం దెనిమిది మూరల వస్త్రమునే తీసికొనవలయు ననెడి దృఢ ప్రతిజ్ఞాబద్ధురాలై , ‘గోస్వామీ! నా కెందులకు నమస్కారమన్నా!” అనెను.
భవానంద —— నీవు అక్కవు కాదా?
గౌరి —— మీదయ. మీరుగోస్వాములు. దేవసమానులు. ఎట్లు చెప్పినను సరియే సరిగా నుండును. నమస్కారము చేసినను చేయవచ్చును. ఎటులైనను వయస్సున పెద్దదాననుకదా.
భవానందునికంటె గౌరీదేవి 30-35 సంవత్సరములు పెద్దది. అయినను, చతురుఁడైన భవానందుఁడు, ‘ఇదేమక్కా!
వినోదంబునకుఁ జెప్పుచున్నట్లున్నది. లెక్కించి చూచిన, నీవు నాకంటే ఆఱేండ్లు చిన్నదానవు కదా! జ్ఞాపకము లేదా! మా వైష్ణవజాతియం దన్ని మతముల వారును గలరు. మఠాధికారియగు బ్రహ్మచారి యనుమతి నొంది నిన్నును వైష్ణవులలోఁ జేర్చికొనవలయు నని యపేక్ష కలిగి చెప్పి పోవుద మని వచ్చితిని’ అనెను.
గౌరి —— ఛీ! అదెట్టిమాట! ఇట్లు చెప్పవచ్చునా? నేను ముసలిదానను కదా.
భవానంద —— అట్లయినచోఁ జేరఁగూడదా?
గౌరి —— మీ యిష్టము, మీకుఁ దెలిసినట్లు చేయుఁడు, మీరు పండితులు, నే నాఁడుదానను, నా కేమి తెలియును? అది యెప్పు డగును?<noinclude><references/></noinclude>
kix8u6y3saz41b1fzheg4mfemv4kwsc
పుట:Aananda-Mathamu.pdf/157
104
109495
569580
355976
2026-08-10T05:44:33Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
569580
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|152|ఆనందమఠము|}}</noinclude>భవానందుఁ డతికష్టముచే నవ్వు నాపుకొని, అక్కా! ఆ బ్రహ్మచారినిఁ జూచిన వెంటనే యగును, మరియు, అది యట్లుండని, ఆవిడ యెట్లున్నది?’ అని యడిగెను.
గౌరిదేవి వాడిన మోము గలదై మనస్సున, నన్నుఁ జేర్చి గొనుట పరిహాసముగా నుండునని యనుకొని, ‘యిక నెట్లుండఁగలదు? ఉన్నట్లే యున్న’ దనెను.
భవా —— నీవు పోయి, నేను వచ్చి యున్నానని చెప్పిరమ్ము.
గౌరీదేవి, చేతనున్న గరిటెను పాఱవైచి చేతులు కడిగి కొని, పైకి పోవునట్టి మిద్దెయొక్క పెద్ద పెద్ద మెట్లు వంగునట్లెక్కి పోయెను. ఒక చిన్న యింటియం దొక చింపిరి చాపపై సుందరీమణి యొకతె కూర్చుండి యుండెను. అయిన నాసౌందర్యము నొక ఘోరతరమగు ఛాయ నాచ్ఛాదించి యుండెను. మధ్యాహ్న కాలమునందు కులపరిపావనియు ప్రపన్న సలిలయు విపులజలకల్లోలినియు స్రోతస్వతియు నగు గంగావక్షమునందతి నిబిడ మైన మేఘఛాయవలె నేదో ఛాయ కప్పి యుండెను. నదీ హృదయంబున తరంగములు లేచుచుండెను; తీరంబునందలి పుష్పితతరుకులము వాయువు చేఁ దూఁగాడు చుండెను; మఱికొన్ని వృక్షములు ఘనపుప్ప భారముచే వంగు చుండెను; ఆ గట్టులోని అట్టాలకాశ్రేణి మిక్కిలి శోభించుచుండెను; ఆ నదియందు చనెడి తరణీ శ్రేణిచే తాడితమైన జలము తరంగ రూపమున నాందోళిత మగుచుండెను. మధ్యాహ్న కాలమయినను, ఆ నిబిడమైన మేఘపంక్తి నీలచ్ఛాయయందు; సకలమైన శోభాకాంతులును నీలవర్ణ మయ్యెను. అట్లే ఈమెయొక్క మనోహరమును స్నిగ్ధమును చంచలమును నిబిడమునైన అలక<noinclude><references/></noinclude>
jll4a1w69e2v9qxr5gkztdjf3sj6l6a
పుట:Aananda-Mathamu.pdf/158
104
109496
569581
355977
2026-08-10T05:47:19Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
569581
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||ఇరువది తొమ్మిదవ ప్రకరణము|153}}</noinclude>గుచ్ఛము కల్గియుండెను. ప్రశస్తమును పరిపూర్ణమునైన లలాట దేశంబునందు అతులమైన తూలికా (బ్రష్షు,లేక పెన్సిల్) లిఖిత భ్రూధనువుండెను. మునుపటివలెనే విస్ఫారిత సజలోజ్జ్వలక్కష్ణ తారాబృహచ్చక్షువు లుండినను, అంతటి కటాక్షమయము కాదు, అంతటి లోలతయుఁ గాదు, కొంచెము నమ్రముగానుండెను. అధరము రాగవర్ణముగ నుండెను. హృదయము శ్వాసానుగామియై దడదడ కొట్టుకొనుచుండెను. బాహువులు మొదటియట్లే వన్యలతలకు దుష్ప్రాప్యమైన కోమలతతోఁ గూడి యుండెను. అయినను, ఇప్పుడా కాంతియు, ఆ యుజ్జ్వలతయు, ఆ ప్రఖరతయు, ఆ చంచలతయు, ఆ లావణ్యమును లేదు. విస్తరించి చెప్పనేల? ఇపుడు ఆ యౌవనమే లేదు. ప్రకృతమునందు కేవలము సౌందర్యమును మాధుర్యమును మాత్రమే నూతనముగా సంకురించి యుండెను. ఇంతకు మునుపు ఈ యువతియొక్క ధైర్య గాంభీర్యములను జూచి యుండినచో, నీమె దేవలోకసుందరి యని దోచును. ఇపుడు చూడఁగా, నీమె శాపగ్రస్తురాలై దేవలోకమునుండి భూలోకమునకు వచ్చిన దేవి యని తెలియుచున్నది. ఈమె కూర్చుండి యుండిన నలుదిక్కులందును నాలుగైదు పెద్ద పెద్ద పుస్తకములు పడి యుండెను. గోడకు జగన్నాథ, బలరామ, సుభద్రాపటములు వ్రేలాడగట్టి యుండెను. మరియు కాళియ మర్దనము, నవనారీకుంజరము, వస్త్రాపహరణము, గోవర్ధనోద్ధారణము మొదలగు వ్రజలీలా చిత్రములు ప్రకాశించుచుండెను.
ఆచిత్రముల క్రింద “చిత్రమో లేక విచిత్రమో” యని వ్రాయం<noinclude><references/></noinclude>
n3vhgl7pqctdzilvucpjeqj3kpng7gi
పుట:Aananda-Mathamu.pdf/159
104
109497
569582
355978
2026-08-10T05:49:53Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
569582
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|154|ఆనందమఠము|}}</noinclude>బడి యుండెను. గౌరిభవానందునిరాక నెఱిఁగించి వచ్చిన పిదప, భవానందుఁడు ప్రవేశించెను.
భవానంద —— ఎట్లున్నది? కల్యాణీ! శరీర మారోగ్యముగ నున్నది కదా?
కల్యాణి —— ఈ ప్రశ్న నడుగుటను మీరు మానరు కదా? నాశరీరారోగ్యమునందు మీ కిష్టమా? లేక నాకిష్టమా?
భవానంద ——ఎవఁడు వృక్షమును వేయునో వాఁడు దానికి నీరు పోయును; చెట్టు వృద్ధియైనచో వానికి సుఖము; నీమృత దేహంబున నేను ప్రాణమును నాటినవాఁడను, వృద్ధియగు చున్నదో లేదో యని నే నడుగఁ గూడదా?
కల్యాణి —— విషవృక్షంబునకు క్షయము కలదా?
భవానంద —— జీవనము విషమా?
కల్యాణీ —— అట్లు కాకున్న యెడల అమ్రతనేచనముగ నుండుదానిని ధ్వంసము చేయవలయు ననెడి కోరిక నా కేల కల్గును?
భవానంద —— దానిని గుఱించి యడుగవలయునని చాల దినములనుండి నామనస్సునం దుండెను. అడుగుటకు ధైర్యము లేకుండెను, నీజీవనమును విషమయముగాఁ జేసినవా రెవరు?
కల్యాణి —— స్థిరభావముతో నాజీవనము నెవ్వరును విషమయముగాఁ జేయ లేదు. జీవనమే విషమయము; నాజీవనము విషమయము; తమ జీవనమును విషమయము; అందఱ జీవనమును విషమయమే.
భవానంద —— ఔను; కల్యాణీ! నాజీవనము విషమయము. ఏదినము మొదలుకొని —— నీ వ్యాకరణము ముగిసెనా?<noinclude><references/></noinclude>
h5m3b87j154tp27b330ymr0d4z525mk
పుట:Aananda-Mathamu.pdf/160
104
109498
569584
355979
2026-08-10T05:54:31Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
569584
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||ఇరువదితోమ్మిదవ ప్రకరణము|155.}}</noinclude>
కల్యాణి —— అంతయు ముగిసెను. కేవల స్త్రీత్వము ముగియ లేదు.
భవానంద —— అభిధానమో! (అమరమో).
కల్యాణి —— స్వర్గమో వర్గమో తెలియ నేరక పోయితిని. మీరు తెలియునట్లు చెప్పఁగలరా?
భవానంద —— నీకుఁ దెలియని దానిని నేనును తెలుపఁగలనా? సాహిత్యము మొదటివలె సాగుచున్నదా?
కల్యాణి —— పూర్వాపరము నాకుఁ దెలియదు, కుమార సంభవమును విడిచిపెట్టి హితోపదేశమును జదువుచున్నాను.
భవానంద —— ఏల? కల్యాణి!
కల్యాణి —— కుమారసంభవమునందు దేవచరిత్రము; హితోపదేశమునందు పశుచరిత్రము.
భవానంద —— దేవచరిత్రమును విడిచి పశుచరిత్రమం దనురాగ మేల?
కల్యాణి —— నానెత్తి వ్రాత నాస్వామిసమాచార మేమి?
భవానంద —— మాటిమాటికి వాని సమాచారము నేల యడిగెదవు? వాఁడేమో నీపాలిటికి జచ్చినట్లే
కల్యాణి —— నేనే అతనిపాలికిఁ జచ్చినట్లు; అతఁడు నా పాలిటికిఁ గాదు.
భవానంద —— అతఁడు నీపాలిటికిఁ జచ్చె ననికదా నీవు చచ్చినది? మాటిమాటి కామాట యేల కల్యాణీ!
కల్యాణి —— చచ్చినను సంబంధము తప్పునా? అతఁ డెట్లున్నాఁడు?
భవానంద —— బాగుగా నున్నాఁడు.<noinclude><references/></noinclude>
25mq9ql6vt2l9cfuw62ykjbmk3sv37f
పుట:Aananda-Mathamu.pdf/8
104
124475
569520
565142
2026-08-09T16:40:37Z
రవిచంద్ర
146
569520
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="రవిచంద్ర" /></noinclude>{{p|fs150|ac}}ఉత్సర్గము.</p>
{{rule|4em}}
<poem>శ్లో. క్వను మాం త్వదధీనజీవి తాం
వినికీర్య క్షణభిన్న సౌహృదః,
నలినీం క్షతసేతుబన్ధనే
జలసఙ్ఘాత ఇ వాసి విద్రుతః.</poem>
ఇహపరములు రెంటికిని సంబంధ మున్నది. అసంబంధముయొక్క జ్ఞాపకార్థము ఈ గ్రంథ మీవిధముగా ఉత్సర్గము చేయఁబడియె.
{{rule|5em}}
<poem>శ్లో. యేతు సర్వాణి కర్మాణి మయి సంనస్య మత్పరాః,
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయస్త ఉపాసతే.
తేషా మహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్,
భవామి నచిరా త్పార్థ మయ్యా వేశిత చేతసామ్.
మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ,
నివసిష్యసి మయ్యేవ అత ఊర్థ్వం న సంశయః.
అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్,
అభ్యసయోగేన తతో మ మిచ్ఛాప్తుం ధనఞ్జయ.</poem>
{{right|(శ్రీ భగవద్గీతా 12 అధ్యాయము.)}}
{{rule|6em}}<noinclude><references/></noinclude>
3mmn47hmxxd459gsdbkibgm16c94lo8
సూచిక:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf
106
132518
569591
406132
2026-08-10T07:48:25Z
Rajasekhar1961
50
569591
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:కొప్పరాజు నరసింహకవి|కొప్పరాజు నరసింహకవి]]
|అనువాదకులు=
|ఎడిటర్=[[రచయిత:భాగవతుల వేంకట సుబ్బారావు]]
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=[[రచయిత:భాగవతుల వేంకట సుబ్బారావు]]
|చిరునామా=
|సంవత్సరం=1959
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=2
|పురోగతి=MS
|పుటలు=<pagelist
1=-
2="ముఖచిత్రం"
3="ప్రవి"
4="విసూ"
5="చిత్రపటాలు"
6="బొమ్మ"
7=-
8=1
28="బొమ్మ" 29=- 30=1
94="బొమ్మ" 95=- 96=65
100="బొమ్మ" 101=- 102=69
154="బొమ్మ" 155=- 156=121
168="బొమ్మ" 169=- 170=133
182="బొమ్మ" 183=- 184=145
200=-
/>
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
ralcbb22khtfd1mjiam3f43fsq3wc1b
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/91
104
132667
569508
404600
2026-08-09T16:12:22Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569508
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{rh|62 ||శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము}}</noinclude>
{{left margin|5em}}
<poem>
ధర గలవుగాని యీ దృశ
గిరి సరి దారామ లింగ కీలితగతులే ?{{float right|102 }}
</poem>
మఱియుఁ గలియుగంబున మహాస్థలంబులందు దేవతలు తిరోహిత నిజ
మహిమానుభావులై ధర్మకర్త్రధీన నిజోత్సవాది కృత్యులగుదు రక్కా
లంబున జనంబుల లనధికారులయి శిశ్నోదర పరాయణులయి వృథాద్వైత
వచన రచనా ప్రవీణులై మహాస్థలస్థిత దేవతామూర్తులయందు శిలాబుద్ధి
గలిగి నిరీశ్వరవాదంబు సేయుదు రట్లవుట సర్వోపదేశ దేశికుండగు
దక్షిణామూర్తి కోటీశ్వరుండై త్రికూటాద్రియందు నిలిచి ప్రత్యక్ష ప్రమా
ణంబులు సూపి విజోత్సవాదికృత్యంబులకుఁ దాన ధర్మకర్తయై నిర్విఘ్నం
బుగాఁ జెల్లింపుచుండు నిట్టి దివ్యస్థలం బెందును లేదని చెప్పి శివుండు
వెండియు నమ్మహాదేవి కిట్లనియె.{{float right| 103}}
<poem>
గురుతరేశ్వరమూర్తియౌ కుధరమందు
హరి హర విధాతృరూప కూటాగ్రములను
మూఁడు లింగంబులై యుండి మూడులోక
ములను రక్షించు దక్షిణామూర్తి యెపుడు.{{float right|104 }}
</poem>
మఱియు నగ్గిరీంద్రంబునందుండు దివ్యకూట దివ్యలింగత్రయంబు కలియు
గంబునఁ దిరోహిత నిజమహిమంబై కేవల శిలారూపంబునఁ గనఁ
బడియు నిష్టసిద్ధు లొసంగు నా దివ్యకూటత్రయ లింగత్రయప్రభావం బెట్టి
దానిన.{{float right|105 }}
<poem>
{{left|'''త్రికోటీశ్వర మహిమ'''}}
ఆ రుద్రాత్మక మధ్యశృంగ మహిమం బత్యద్భుతం బెన్న దు
ర్వారప్రేమ విధీంద్ర ముఖ్య దివిషద్వారంబు కోటీశు దీ
క్షారూఢిన్ మది నిల్పి కొల్చుచుఁ దదంచద్ద్రోణికోపాంత సు
శ్రీరమ్యాయత బిల్వకాననములం. గ్రీడించు నశ్రాంతమున్ {{float right|106 }}
</poem><noinclude><references/></noinclude>
k30anpax3e4wpp3xnbo7i58eid17yd6
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/92
104
132668
569509
404603
2026-08-09T16:14:58Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569509
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />
{{rh|ద్వితీయాశ్వాసము||63}}</noinclude>{{left margin|5em}}
<poem>
వెండియు నఖండ పాండు డిండీరఖం డాఖండలోద్దండ వేదండ కుండ
లీంద్ర చంద్ర చంద్రఖండ తార హార హీర పారావార నీహారాచ్చచ్చవి.
భాసురంబై కైలాస శిఖరాకారంబగు నా రుద్రశిఖరంబున రుద్రుండుమా
స్కంద నంది గణనాథ చండి భృంగి మహాకాల ప్రముఖ ప్రమథగణనాథ
యూథంబులు కొలువ నిత్యసన్నిహితుండయి వసియించు నెంతయు.{{float right| 107 }}
గురు రత్న భాసుర గోపురంబులతోడ
పరితప్త హేమకుంభములతోడ
ప్రస్ఫుట స్ఫటికాశ్మ పటుభి త్తికలతోడ
విమల కర్బుర కవాటములతోడ
గోమేధికోపల కుట్టిమంబులతోడ
శశికాంత సోపాన సరణితోడ
వర పద్మరాగ శుంభత్ స్తంభములతోడ
హరినీలరుచిర గేహళులతోడ
నమరి యమరీ కదంబ గానావలంబ
ప్రాంగణ స్థల సంగత ప్రమథరాజీ
రాజితంబైన దివ్య హర్మ్యాగ్రసీమ
నవ్య నవరత్న సింహాసనంబునందు.{{float right|108 }}
శర దుజ్జృంభిత చంద్రకోటి రుచితోఁ జంద్రార్ధజూటంబుతో
నురగేంద్రోజ్జ్వల హారవల్లరులతో నుద్యత్కపర్దంబుతో
హరి నీలాంచిత నీలకంధరముతో నానందరూపంబుతో
గిరిజాకాంతను గూడియుండు నురుభంగిన్ రుద్రుఁ డశ్రాంతము.{{float right|109 }}
స్కంద భైరవ గణనాథ శాస్తృ వీర
భద్రులాదిగ శతకోటి రుద్రు లఖిల
దిశల గొలువంగ హర్యజాధిక సుపర్వ
సమితితోగూడి రుద్రుఁ డాసభ వసించు.{{float right|110 }}
</poem><noinclude><references/></noinclude>
iao7gm0przpnsjhcxg4np50wrhp634a
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/93
104
132669
569510
404605
2026-08-09T16:17:22Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569510
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{rh| 64 ||శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము}}</noinclude>
{{left margin|5em}}
<poem>
అందు మూఁడుదినంబు లతిభ క్తితో నిల్చి
ప్రాచీన కోటీశ భవ్యలింగ
మునకు నర్ఘ్యము పాద్యమును మధుపర్కము
స్నానంబు వస్త్రంబు జన్నిదంబు
భస్మ గంధాక్షతల్ బహు పుష్పమాలికల్
మారేడుదళములు భూరి ధూప
దీప నైవేద్యముల్ దివ్య తాంబూలంబు
నీరాజనంబును నెఱిఁ బ్రదక్షి
ణము లనంగను షోడశ క్రమవిధాన
పూజ లొనరించి తన్మంత్రమును సహస్ర
జపము గావించి ధ్యానంబు సలిపిరేని
భోగ మోక్షంబు లిహపరంబులను గలుగు.{{float right|111 }}
ఆ శిఖరరాజమందున
పాశచ్చేది శివమూర్తి పనుపడి నిలువన్
క్లేశంబుల నెడఁబాసి ది
గీశావళి మేలు నొందె కేవల మగజా !{{float right|112 }}
అందు నేను సదాశివఖ్యాతిఁ దనరి
లీలఁ బ్రాచీన కోటీశ లింగమగుచు
నుండి యుండుట ననుఁ గొల్చుచుందు రెపుడు
రుద్రు లాత్మగణాళితో రూఢి మెరసి.{{float right|113 }}
{{left|'''విష్ణు శిఖరము'''}}
అమ్మహారుద్ర వాసమైనట్టి, శిఖర
మునకు వలపల శ్రీ విష్ణుమూర్తి శిఖరం -
ముందు దానికిఁ గ్రిందుగా నుండు నొక్క
దొన సురాపగాంబు సమాన తోయ యగుచు,{{float right|114 }}
</poem><noinclude><references/></noinclude>
fki9oikyu5v4s7nn6cbx312z6b0nxw4
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/94
104
132670
569511
404606
2026-08-09T16:17:51Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569511
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>{{Css image crop
|Image = శ్రీమత్త్రికూటాచల_మాహాత్మ్యము.pdf
|Page = 94
|bSize = 380
|cWidth = 371
|cHeight = 558
|oTop = 29
|oLeft = 9
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
2ljvoaytr6z50ynwrwb163fl8nd13z1
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/96
104
132671
569512
404607
2026-08-09T16:21:29Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569512
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />
{{rh|ద్వితీయాశ్వాసము||65}}</noinclude>{{left margin|5em}}
<poem>
జలజాక్షు పాదమూలము
వలనం గనుపట్టు గంగవలెఁ దగ నేత
జ్జలజాక్షు శిఖర మూలము
వలనం గనుపట్టె దొనయు వైభవ మెసఁగన్.{{float right|115 }}
ఆ దొన పశ్చిమంబున మహాద్భుతమై శశికాంత కాంతి సం
పాదక దివ్యతేజమయి పాపవినాశన లింగ మొప్పు, న
చ్చోఁ దనరారు సిద్ధతతి సొంపగు నా దొనలోన దోఁగి య
త్యాదర భక్తి నాశివున కర్చన సేయు నభీష్టసిద్ధికై.{{float right|116 }}
కాలాభ్ర భ్రమరాభ్ర విభ్రమ మహాకాలోరుకంఠప్రభా
నీలాశ్మ ప్రతిభా తమాలలతికా నీలాబ్జ కాలాంజన
శ్రీ లాలిత్య విలాస విష్ణుశిఖర శ్రేష్ఠాంతర ప్రస్ఫుట
ప్రాలేయాంశుదృష ద్వినిర్మిత మహాప్రాసాద మధ్యంబునన్.{{float right|117 }}
సంతప్త హేమ నిర్మిత
చింతామణి ఖచిత దివ్యసింహాసన వి
శ్రాంతుం డగుచును లక్ష్మీ
కాంతుండు జగంబుఁ బ్రోచుఁ గరుణానిధియై.{{float right|118 }}
నీల నీరద నీల నీలాబ్జ వర్ణుండు
కటి తట సౌవర్ణ పటయుతుండు
శంఖ చక్ర గదాసి సాధన సహితుండు
కౌస్తుభాభరణ సత్కాంతియుతుఁడు
బహు రత్న నూపుర బాహాచతుష్కుండు
మకర కుండల గండ మండితుండు
శ్రీవత్స సింధు జాశ్రిత దివ్యవక్షుండు
భుజగరా ట్పర్యంక భూషణుండు
</poem><noinclude><references/></noinclude>
irv7uc77pex2vyws6xxhitrb65acv2e
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/97
104
132672
569513
404608
2026-08-09T16:23:33Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569513
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{rh| 66 ||శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము}}</noinclude>{{left margin|5em}}
<poem>
సకల లోకైకనాథుండు శార్గ్ఙ ధన్వి
గరుడ జయ విజయ సునంద పరమ భాగ
వత వతంసంబు లెంతయు బలసి చుట్టు
గొలువఁ గొలువుండు విష్ణుఁడ క్కూటమునను.{{float right|119 }}
అచ్చోట నతిభక్తి నైదుదినంబులు
నిల్చి త ద్రోణికానీరములను
స్నానంబు నేసి భస్మ త్రిపుండ్రాంకముల్
ధరియించి రుద్రాక్షధారి యగుచు
మునిసేవ్యు పాపనాశన లింగమూర్తిని
బిల్వదళంబులఁ బ్రీతితోడ
నర్చించి దృఙ్మనః ప్రాణంబు లొకచోటఁ
గలయ సమాధి సంకలితుఁడగుచు
తపముసల్పిన నష్టవిధంబులైన
సిద్ధులును గల్గు దగఁ గాయసిద్ధి దనరు
నితర సిద్ధులు సిద్ధించు నిచ్ఛలేక,
యుండెనేనియు మోక్షంబునొందు వేగ.{{float right|120 }}
అందు నేను మహేశ్వర్య కంచమగుచు
పాపనాశన లింగమై పరగుచుండ
నన్ను సేవింపుచుండు నా నలిననాభు
డధికభక్తిఁ ద్రికాల పూజాభిరతుల.{{float right|121 }}
{{left|'''బ్రహ్మశిఖరము'''}}
రుద్రశిఖరంబు వలపల భద్రదంబు
బ్రహ్మశిఖరంబు భాసిల్లుఁ బ్రస్ఫుటముగ
నెలమి నందుండు నూత్నకోటీశలింగ
మచటి మహిమంబు వర్ణింప నలవియగునె.{{float right| 122}}
</poem><noinclude><references/></noinclude>
maamkspmlc6q5mosiyl5q5gi78i417s
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/98
104
132673
569514
404609
2026-08-09T16:25:58Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569514
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />
{{rh|ద్వితీయాశ్వాసము||67}}</noinclude>{{left margin|5em}}
<poem>తరుణారుణారుణ ఘుసృణ
కిరణాకృతి సాంధ్యకాలకీలిచ్చాయా
స్ఫురణాఢ్య బ్రహ్మశిఖరా
వరణాంతర సౌధమధ్య వరపీఠమునన్.{{float right|123 }}
మంజుహాటక కంజ కింజల్క వర్ణుండు
పద్మరాగ కిరీట భాసితుండు
గండమండల రత్నకుండల లలితుండు
కేయూర మణిహార కీలితుండు
కల్పద్రుమాలికాకలిత వక్షోభాగుఁ
డుపవీత శోభితుఁ డున్నతాంసుఁ
డాజానుదీర్ఘ బాహా సముల్లాసుండు
వాణీవిలాసైక వదనకమలుఁ
డజుఁడు గొలువుండు వేదశాస్త్రాగమాది
విద్యలెల్లను దను జాల వినుతిసేయ
గరుడ గంధర్వ యక్ష కిన్నరులు సురలు
సిద్ధసాధ్య సమూహముల్ చేరి కొలువ.{{float right|124 }}
అచ్చోట నొకపక్ష మతిభ క్తితో నిల్చి
దొనలలో స్నానంబు దనరఁ జేసి
భూతిరుద్రాక్ష విభూషణుండయి దివ్య
పంచాక్షరీ మంత్ర పఠన మొప్ప
హృదయంబులోన కోటీశు నీశ్వరు నిల్పి
మానసపూజ నీమంబుతోడఁ
జేసి బాహ్యర్చన సిత పుష్ప నవ బిల్వ
దళములఁ గావించి లలిత నిష్ఠ
</poem><noinclude><references/></noinclude>
0wd1tgxr7rn00i2llq6rk8tp4o2a30q
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/99
104
132674
569515
404610
2026-08-09T16:28:47Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569515
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{rh|68 ||శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము}}</noinclude>{{left margin|5em}}
<poem>
సేవఁ జేసిన మాన సేప్సిత సమస్త
సిద్ధు లొనగూడు మోక్షసంసిద్ధి యగును
తద్గృహస్థల సంరూఢ తాపసాళి
దర్శనము గల్గు దుర్మోహతమము వాయు.{{float right| 125}}
అందు నేనును రుద్ర విఖ్యాతిఁ దనరి
నూత్న కోటీశ లింగ వినోదలీల
నొప్పుచుండుట నా లింగ మెప్పు డధిక
భక్తిఁ బూజింపుచుండు న ప్పద్మజుండు.{{float right|126 }}
</poem>
ఇట్లు రుద్ర విష్ణు విధాతృ శిఖరత్రయంబున రుద్ర విష్ణు విధాతలు స్వపరి
వార సమేతంబుగాఁ గొలువుండి సదాశివేశ్వర రుద్రరూప లింగమూర్తినై
యున్న నన్ను నిరంతరంబు భజియింపుచుందు రీ శిఖరత్రయ లింగత్రయ
ప్రభావంబు కలియుగంబునఁ దిరోహితంబైయుండు నీ శిఖరత్రయంబున
మనుష్య నిర్మిత శిలారూప ప్రాచీన కోటీశ పాపవినాశన నూత్న కోటీశ
లింగంబుల భక్తి యుక్తి నారాధించిన మానవులు భుక్తిముక్తులయత్నం
బునఁ గాంతు రీశ్వరప్రసాద సంపన్నుల కెప్పుడును ద ద్దివ్యకూటత్రయ
లింగత్రయ దర్శనంబగు ప్రాప్త ప్రసాదేతరులకు మంత్ర తంత్ర జప తపో
యోగాది సాధనంబులఁ దద్దర్శనం బగమ్యంబగు ననిచెప్పి శివుండు
వెండియు నిట్లనియె.
{{float right| 127}}
{{left|'''శివుని నృత్యవర్ణన'''}}
<poem>
అమ్మహా శైల శిఖరత్రయంబునందు
శ్రీ సదాశివేశ్వర రుద్ర భాసురాభి
ధాన లింగాకృతిని నిల్చి తత్ప్రదోష
కాలనృత్తంబు గావించుఁ గాలగళుఁడు.{{float right|128 }}
</poem><noinclude><references/></noinclude>
aggpa1ke3th5kf22yl8ow62lmnzmx2o
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/100
104
132675
569516
404611
2026-08-09T16:29:48Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569516
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>{{Css image crop
|Image = శ్రీమత్త్రికూటాచల_మాహాత్మ్యము.pdf
|Page = 100
|bSize = 380
|cWidth = 320
|cHeight = 540
|oTop = 32
|oLeft = 26
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
827n818li874batqam4tl2ot26lbp4j
రచయిత:కొప్పరాజు నరసింహకవి
102
132717
569593
404682
2026-08-10T07:50:01Z
Rajasekhar1961
50
569593
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = కొప్పరాజు
|అసలుపేరు = నరసింహకవి
|పేరు_మొదటి_అక్షరం = క
|పుట్టిన_యేడు = 19వ శతాబ్దం
|గిట్టిన_యేడు = 19వ శతాబ్దం
|వివరణ = ఒక తెలుగు కవి.
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = కొప్పరాజు నరసింహకవి
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము]] (1959 ముద్రణ) {{small scan link|శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf}}
==రచయిత గురించిన రచనలు==
* [[ఆంధ్ర చరిత్రము - మూడవ భాగము/గోపీనాథము వేంకటకవి]]
stefxml7jtx7htqgq8wrks7w91bn6k8
శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తొలిపలుకు
0
132718
569613
404684
2026-08-10T10:51:28Z
Rajasekhar1961
50
569613
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = కొప్పరాజు నరసింహకవి
|అనువాదం=
| విభాగము = తొలిపలుకు
| ముందరి = [[../]]
| తదుపరి =[[../ప్రథమాశ్వాసము/]]
| వివరములు =
|సంవత్సరం= 1959
}}
<pages index="శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf" from=8 to=26/>
frxps48j1gp1gmq3hn9llb5cpm3g7uv
569614
569613
2026-08-10T10:52:58Z
Rajasekhar1961
50
569614
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = కొప్పరాజు నరసింహకవి
|అనువాదం=
| విభాగము = తొలిపలుకు
| ముందరి = [[../]]
| తదుపరి =[[../ప్రథమాశ్వాసము/]]
| వివరములు =
|సంవత్సరం= 1959
}}
<pages index="శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf" from=8 to=22/>
icocs4to7ejoi6eorzbnthxeinyjbr1
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/131
104
132864
569517
405021
2026-08-09T16:34:19Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569517
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{rh|98||శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము}}</noinclude>{{left margin|5em}}
ఇట్లు ఘర్మకాలంబున నిర్మల చేతస్కుండై దుర్మలిన వినాకనియగు శంభు
పూజ సత్కర్మ నిరతుండై చేయుచుండె నంత.{{float right|53 }}
<poem>
కర్షకజన సంతతికిని
హర్షం బొదవంగ ప్రకటితాద్భుత లీలా
కర్షణమై సుకరంబగు
వర్షఋతువు వచ్చెఁ బథిక వర్గము బెగడన్ {{float right|54 }}.
కఠిన రవిరశ్మితప్త లోకంబునకును
తాప మణఁగింప నాఘనతతులుపూని
కఠిన జనతాభితప్త లోకంబునకును
తాప మణఁగింపవే ఘనతతులు జగతి.{{float right| 55 }}
</poem>
అట్లు కాదంబినీ ప్రకాండం బకాండ విలయ జలధిపోలిక నదీనదంబు
లేకంబు సేయుచు బ్రవర్షించు కాలంబున గిరిఝరి ప్రాంత కాంత కాంతా
రంబుల సరిత్సరోవర తీరంబులం దిరుగుచు సాలంకుండు నిర్విశంకుండై
కదంబ వాటికా కుసుమ కదంబంబుల దండలు గట్టి కోటీశ్వర శిరోభాగం
బనం జుట్టి పాటల రుచిరుచిర జటాజూట కోటరంబగు సదాశివమూర్తి
నలంకరింపంజేసి పూజింపుచుండు సమయంబున.{{float right|56 }}
''ఉత్సాహవృత్తము :''
<poem>
వారిదంబు లభ్రమం దవారితంబులై మరు
త్ప్రేరితంబులై యుగాంత భీమనీరదచ్చటా
స్ఫారితంబులై మసారసార నీలిమ ప్రభా
పూరితంబులై ధరాగ్రభూమి జేరె నుద్ధతిన్. {{float right|57 }}
''స్రగ్థర''
శుంభర్గంభీరగర్జాస్ఫురణయు చపలా శోభయున్ దిక్తటంబుల్
కుంభింపన్ సంభృతాంభః కులికములగుచున్ గుంభినీవ్యాప్తలీలా
</poem><noinclude><references/></noinclude>
iklx2ckung60oljo8xegct6658jby10
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/132
104
132865
569518
405022
2026-08-09T16:36:19Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569518
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />
{{rh|తృతీయాశ్వాసము|| 99 }}</noinclude>{{left margin|5em}}
<poem>
స్తంభాంభోవాహపంక్తుల్ చదల బౌదలుచున్ సైరికామోద వృత్తిన్
గుంభద్రోణంబుగాఁగన్ గురిసెను విమలాకుంఠ ధారాసమృద్ధిన్.{{float right| 58 }}
అట్లు సంవర్త సంవర్తకాది మేఘ
సమితి యొకసారి వర్షింప సాగినట్లు
భూరీ ధారాధరంబులు ఘోరవృష్టి
గురియ భీతిల్లి లోక మాకులత బూనె.{{float right|59 }}
అట్టి జడివానయందు దాననుజ సహిత
ముగను దిరుగుచుఁ జలికి బిట్టుగ చలించి
కఠిన పాషాణ వృత గుహాంగణము జేరి
యభవు కోటీశు నీకు నిట్లని నుతించె.{{float right|60 }}
జయజయ కోటీశ్వర శివ
జయజయ కోటీశ యీశ జయ సర్వేశా,
జయజయ కోటిసురార్చిత
జయజయ కోటీశలింగ స్మరమదభంగా!{{float right| 61 }}
ఆపదల నిన్నుఁ దలఁపుచు
నీ పదలక్ష్యంబు నెవఁడు నియతి భజించున్
శ్రీపదలబ్ధి దనర్పగ
సాపదలక్షితునిఁ జేసి సలుపుదు వతనిన్.{{float right| 62 }}
ఓ కోటీశ్వర, యో కృపాజలవిధీ, యో శైలకన్యాపతీ,
యో కోటీశ్వర, యో జగత్ప్రయగతీ, యో భక్తరక్షారతీ,
యో కోటీశ్వర, యో దయామయమతీ, యో కోటిచంద్రద్యుతీ
యో కోటీశ్వర, పాహిపాహి యని దా నుచ్చైస్వరం బొప్పఁగన్.{{float right| 63 }}
</poem><noinclude><references/></noinclude>
s84l0fp5pk4miidsqtfuz546oi5bh17
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/133
104
132866
569519
405023
2026-08-09T16:39:36Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569519
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{rh|100 ||శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము}}</noinclude>
{{left margin|5em}}
<poem>
పంచ స్తవములు జదుపుచు
పంచేంద్రియ విషయదూరుఁ బంచాస్యు శివున్
పంచాశుగహరు హరునిన్
బంచ బ్రహ్మస్వరూపుఁ బ్రస్తుతిఁ జేయున్ .{{float right| 64 }}
విశ్వవందిత, విశ్వాత్మ, విశ్వనాథ
విశ్వపాలక, విశ్వాఢ్య , విశ్వవినుత
దేవకోటీశ కోటీశదివ్యలింగ
యి మ్మహోపద్రవము బాపి యిపుడె బ్రోవు.{{float right|65 }}
అని చింతింపఁగ భక్తపుంగవున కాయాసంబు బుట్టించె నీ
ఘన వర్షోద్ధతియంచు నెంచి మదిలోఁ గారుణ్య మేపారఁ జ
య్యన వారించెఁ దటిల్లతాభయదగర్జారావ సంపాతయు
గ్ఘన సంఘాతము చంద్రశేఖరుఁడు భక్తానంద సంధాయియై.{{float right|66 }}
ఘనతరోద్ధాన మడఁగిన గానిపించు
పరమహంస స్వరూప విస్ఫురణ భంగి
ఘన తరోద్ధాన మడఁగిన గానిపించె
బరమహంస స్వరూప విస్ఫురణ మంత.{{float right| 67 }}
</poem>
అప్పుడు గుహాంతరాళంబు వెల్వడి దశదిశావలోకనంబు నేసి, యమ్మహో
త్పాతంబు కోటీశ్వరానుగ్రహంబునం బాసెగదా యవి దేవు జూడం జనునెడ
నడుమ నిర్ఝరనిర్ఘాత ప్రభిన్న కుట్టిమ స్థలంబున నతి స్థూలంబగు నొక్క
నిధానకలశం బీక్షించి యది శివాజ్ఞాగతంబని యెఱింగి తమ్ములుం దానును
దాని నతిప్రయత్నంబువ నిజగుహాంతరంబునకుం జేర్చి దానివలన దినదిన
ప్రవర్ధమాన మహైశ్వర్యవిభవుండై యఖండ మహిమానుభావంబున జంగ
మార్చనలు సేయుచు శివజ్ఞాన సంపన్నులగు మహాత్ములవలన శివపురాణ
శ్రవణంబు వేయుచు నిత్యంబును గోటీశ్వరారాధనం బొనర్చుచు, కాలంబు<noinclude><references/></noinclude>
mzr8vqsyu70fefsj7m9uyzuoip9puxs
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/134
104
132871
569521
405036
2026-08-09T16:42:24Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569521
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />
{{rh|తృతీయాశ్వాసము|| 101 }}</noinclude>{{left margin|5em}}
<poem>
సుఖానుకూలంబుగాఁగడుపుచుండి యొక వేళ జంగమార్చనంబును నొక
వేళ శివపూజయు, నొక వేళ శివమంత్రజపంబును నొక వేళ శివధ్యాన సమాధి
నిష్ఠయు నొకవేళ కోటీశ్వర లింగార్చనంబునుం గావింపుచుఁ బరమానంద
కందళిత స్వాంతుండై యొక్క నాఁడు –{{float right|68 }}
తన యిలు వెలువడి యొక్కఁడె
మునిసేవితుఁ గోటిలింగమును బూజింపన్
జనుచుండి నడుమఁ గాంచెను
వనమొక్కటి పత్రపుష్పఫలపూర్ణంబున్.{{float right|69 }}
ఆ వనరాజమందు భువనాపను శంకరుఁ బూజసేయఁగాఁ
భావన వృక్షశాఖల శుభప్రసవావళిఁ గోయుచున్న యా
ధీవనజాతగర్భులగు దిన్యమునీంద్రులఁ జూచి వారి స
త్పావన పద్యుగంబునకు భక్తిరతిన్ నఁతిజేసి ముందటన్,{{float right|70 }}
పోవ పోవఁగ నంత నపూర్వమహిమ
గలుగు సహకార వనరాజి గానుపించె
మదన సహకార మిది మధుమాసమునను
చోద్యమగు దీని మహిమంబుఁ జూతమనుచు.{{float right|71 }}
చని చని ముందట.{{float right|72 }}
అంత గమలాకరంబులై యలరునట్టి
చారు కమలాకరంబులు సరణి నరిగి
బిల్వ కాంతారమొక్కటి ప్రేమఁగాంచి
తద్ద్విలాసంబు వీక్షించి తనివిసనక.{{float right|73 }}
</poem>
''లయగ్రాహి ;''
అందుగల చిత్రముల యందముల జూచి తరుబృందముల నీడలను పొందుగ
మనోజ్ఞా ! నందరసమగ్నులయి యిందుధర పూజన మమందముగఁ జేయు<noinclude><references/></noinclude>
0zgg137i775u1r8oi6hljb10h4a3w7z
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/135
104
132873
569522
405039
2026-08-09T16:45:43Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569522
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{rh| ||శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము}}</noinclude>{{left margin|5em}}
<poem>
చును డెందములు సౌఖ్య | స్పందగతి లింగములయందు నలియింపుచు
పురందరముఖామరుల కందని మహత్త్వం | బందగల భక్తులను కొందఱిని
జూచీ మది సందడిలు భక్తి ముద మంది యతఁ డంతన్ .{{float right|74 }}
ఇచ్చటను శంకరార్చన
విచ్చల విడిఁజేయ మదికి వేడుకపుట్టెన్
సచ్చరితు లిచట నీశ్వరు
నచ్చుగఁ బూజింప మోక్షమందుట యరుదే ? :{{float right|75 }}
అనుచుఁ జింతించి సాలంకుఁ డాత్మలోన
సారసాకర కాసార సారతీర
భూరి శాఖాతిశయ బిల్వమూలమందు
మౌననియతి పద్మాసనాసీనుఁడగుచు.{{float right| 76 }}
ఉద్ధూళన త్రిపుండ్రము
లిద్ధ గతిన్ దాల్చి యతఁడు నీశ్వర సేవా
బద్ధాత్ముఁ డగుచు నెంతయు
సిద్ధాసనమందు నిల్చి శివుఁ జింతించెన్.{{float right|77 }}
కరతలంబుననున్న కలితేష్టలింగంబు,
దశవిధాలోకన దశను జూచి
చూపువెంబడి లింగరూపంబులోఁ జేర్చి,
లోసాక్షియగు తెల్విలో నమర్చి
ప్రాణలింగమునందుఁ బ్రామాణ్యగతిఁ గూర్చి,
భావలింగైక్యత పదిలపరచి
యందులోఁ దానైక్యమంది చిదాకాశ
మూర్తియై యానందభూతిఁ గాంచి
</poem><noinclude><references/></noinclude>
b34qil204pjfdgj5r8j2dcnhvwtm4g8
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/136
104
132875
569523
405041
2026-08-09T16:47:54Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569523
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />
{{rh|తృతీయాశ్వాసము||108 }}</noinclude>{{left margin|5em}}
<poem>
కొంతసేపు సమాధిచే గుణము లణఁచి
మరలఁ దెలివొంది కోటీశు మానసమున
పూజ గావింపఁదలఁచి యా పురవిరోధి
సుగుణరూపంబుఁ జింతించి స్వాత్మయందు.{{float right|78 }}
శరదిందుకోటిసుందరమూర్తి గలవాని
పటు జటామకుట విభ్రమమువాని
నీలకాదంబరీ నీలకంఠమువాని
భుజగేంద్రహార విస్ఫురణవాని
వరదాభయమృగాగ్నికరచతుష్కమువాని
వ్యాఘ్రాజినాంబర ప్రభలవాని
వేదమంజీరాఢ్య పాదపద్మమువాని
వేదాంతవేద్యుని వేదమయుని
ఆ పరాశక్తి సహితుని యా పరాత్ము
నా మహామహు కోటీశు నాత్మనిలిపి "
పూజగావించె నుపచారముల నొనర్చి
భక్తిశీలుండు సాలంక భక్త వరుఁడు.{{float right|79 }}
అంత గనువిచ్చి చూచిన యా క్షణంబ
యిష్టఫలదాయియైన కోటీశ్వరుండు
జంగమాకృతి దాల్చి విశాల బిల్వ
మూలవేదిక వసియించె ముదము గదుర.{{float right|80. }}
అంత నిర్వర్తితేశ్వరధానుండగు సాలంకుం డెదుటఁ గనఁబడు నాజంగమ
మూర్తి సాక్షాత్కోటీశ్వరుఁగాఁ దలంచి యభివాదనంబొనర్చి, తనయింటికిం
దోడితెచ్చి, నిత్యంబు జంగమార్చన వ్రతంబున కేర్పఱచుకొని యమ్మహా
పురుషున కర్పించిన పయశ్శేషంబాహారంబుగా నఖండ నిష్ణాపరుండై
యుండునంతఁ గొంతకాలంబున కతం డంతర్హితుండైన జింతాక్రాంతుండై
</poem><noinclude><references/></noinclude>
43gw6qq3stk3unt6uf9cgi06x336prx
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/137
104
132876
569524
405043
2026-08-09T16:50:31Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569524
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{rh| 104||శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము}}</noinclude>{{left margin|5em}}
<poem>
యగ్గిరి ప్రాంత వనాంతరంబులు వెదకి,యెందుం బొడగానక నిరశన
వ్రతుండై యుండు నా సమయంబున{{float right|81 }}
'''ఆనందవల్లి కథ'''
పుండరీకభవాండ కరండ నిహిత
మండితామూల్య రత్నప్రకాండ మనఁగ
నిండు సంపద జనులకు నుండఁదగిన
కొండకావూరు తద్గిరిదండ నుండు.{{float right|82}}
ఆ రమణీయ పట్టణమునందున నింద్రసమాన కీర్తి వి
స్తారుఁడు, మేరుధీరుడు, సుధాబ్ధిగభీరుఁడు, వీత దుష్క్రియా
చారుఁ డుదారుఁ డా త్తసువిచారుఁడు శాశ్వతభాగ్యయుఙ్మహా
భీరుఁడు దా సునందుఁడని పేరువహించి ధరిత్రి మించెడిన్.{{float right|83 }}
ఏ వంశమందు బెరిగెనో
శ్రీ వల్లభుఁడైన శౌరి శ్రీకరుఁడును ము
న్నే వంశమందుఁ బుట్టెనో
యా వంశమునను సునందుఁ డచట జనించెన్.{{float right|84 }}
కందరి యన నొకసతి సతి
సుందరి నుద్వాహమయ్యె, శుభగుణుఁ డతఁ డా
నందకధరుఁడు పయోనిధి
నందన నుద్వాహమైన నయముదలిర్పన్ .{{float right|85 }}
ఆ సతీమణి గలిసి నిత్యానురక్తి
నందనను గాంచె నాత డాఁనందవల్లి
యను లతాంగిని, నదియు దినాభివృద్ధి:
బడసె వాసంత మల్లికావల్లిబోలె.{{float right|86 }}
</poem><noinclude><references/></noinclude>
t8sma3l9c6h9ud7o5ztenq35qv2gvrk
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/138
104
132878
569525
405045
2026-08-09T16:54:34Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569525
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />
{{rh|తృతీయాశ్వాసము||105 }}</noinclude>{{left margin|5em}}
<poem>నంద నందనుఁడయ్యే నా నాథుఁ డల సు
నంద నందన నాదు నే ననుచు లక్ష్మీ
యా సునందున కాత్మజయై జనించె
ననఁగ నానందవల్లి తా నతిశయిల్లె.{{float right|87}}
హరుఁడు కోటీశుఁడై త్రికుటాద్రియందు
నిలువఁ దద్భక్తి తత్ప్రాంత కలిత నగరి
గరిమ నానందవల్లినా నెఱి జనించే
నట్లు గాకున్న బుధజనాహ్లాదమగునె.{{float right|88 }}
</poem>
మఱియు నబ్బాల శిశుత్వంబునందు నిచటి కోటీశనిలయ త్రికూట కూటం
బులం జూచు వైఖరి మెల్లనం గనువిచ్చి చూడఁ దొడంగె. శివభక్తి
రహితులై చెడు జనంబుల శిక్షించిన నవ్వు చందంబున నవ్వసాగె.
శివనామంబు వలుకు లీల మెల్లనం బలుకఁ బూనె. కోటీశ్వరదర్శనంబున -
కరుగు రీతిఁ దడబడుచు నడుగిడఁగఁ దొడఁగెఁ నంత కౌమారసమయం
బగుటయు నాభీరమతల్లి యానందవల్లి తల్లిదండ్రులు వేయు హారవల్లరులును
ఫుల్లకల్హార మల్లికా మాలికలనుం దిగనాడి భద్రరుద్రాక్షమాలికలు గ్రీవాలం
కారంబుగా ధరింపుచు మేనంబూయు కర్పూర కస్తూరికాపటీర గంధ
చర్చా చర్చ నుత్సాదనంబు చేసి భసితాంగరాగం బంగంబునం దనురాగంబునం
బూయుచు బోటు లాటలంబాడు జిలిబిలి పాటల నటులోటఁబుచ్చి మాటి
మాటికిఁ గోటీశమీఁది గాథల మాటలు నోటికి సూటిపఱచుచు నింద్రి
యంబులఁ దత్తద్విషయంబు లనుభవించునెడఁ గోటీశ్వరార్పణంబు సేసి
గ్రసింపుచు నిట్లఖండ భక్తి భావనావశంబుననుండు నవసరంబున వధూమ
తల్లియగు నానందవల్లికిఁ దల్లి యిట్లనియె.{{float right|89}}
<poem>
అమ్మ మనయింట సకల భాగ్యంబులుంట
నవియు భోగింప కీ లీల నవయదగునె
నవలతాతన్వి యీ తపోనటనలెల్ల
తాపసులకుగానిఁ చిన్నారి తరుణి కగునె ?{{float right|90 }}
</poem><noinclude><references/></noinclude>
ti75ie2b7hi5abx16dbnk0jq8dfcx3i
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/139
104
132879
569526
405046
2026-08-09T16:56:59Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569526
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{rh|108 ||శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము}}</noinclude>{{left margin|5em}}
అనిన నెయ్యంపుఁదల్లికి గారాబు కూతు రిట్లనియె.{{float right| 91 }}
<poem>
అమ్మ యిం దుండు భోగ భాగ్యంబులెల్లఁ
జెడును గూడంగ రావెందుఁ జెడదు శంభు
భక్తి కూడంగ వచ్చును ముక్తి నొసఁగు
దీని విడనాడ వచ్చునే మానవులకు?{{float right| 92 }}
శివభక్తి కలుగు మీఁదట
నవిరళ సద్భోగభాగ్య మబ్బినమేలౌ
ధవుఁడున్న మీఁద నింతికి
నవభూషణ స్రగ్విలేపనంబులువోలేన్ ,{{float right|93 }}
లోని నిక్షేపమెఱుఁగక దానిమీఁద
నిలిచి సంసారమొనరించు నిస్వునట్ల
హృదయగతుఁడైన యీశ్వరు నెఱుఁగలేక
బాహ్యమున నీశు వెదకును పామరుండు.{{float right|94 }}
జననీ : మనము కోటీశ్వర స్థలములోన
నుండి యద్దేవు గొల్వకయుండఁ దగునే ?
తుచ్ఛసంసార విషయ సందోహములను
మరగి యురగేంద్ర భూషణు మఱవఁదగునె?{{float right|95 }}
కామముఖారులం గెలిచి గాఢవిరక్తిని శంభుభక్తుఁడై
కామవిదారిఁ గొల్చినను గల్గును మోక్షసుఖంబు లిప్పుడే
కాముకుఁడై దురింద్రియ వికారములంబడి శంభుఁ గొల్చినం
గామసుఖంబులం దనిసి కాంచును దాఁ గ్రమముక్తి నెంతయున్ .{{float right|96 }}
గరిమతో భోగమోక్షముల్ గలుగఁజేయు
నిహపరంబుల శివభక్తి యేమి చెప్ప
</poem><noinclude><references/></noinclude>
qg77pmyn891efbo4t0jz6k8o2p6dc6a
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/140
104
132885
569527
405061
2026-08-09T17:01:03Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569527
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />
{{rh|తృతీయాశ్వాసము||107 }}</noinclude>{{left margin|5em}}
<poem>
నట్టి భక్తిని వర్జించి యల్పమతులు
విషయ విభ్రాంతిఁ జెడుదురు వెఱ్ఱులగుచు.{{float right|97 }}
ఇట్లు కావున, మనము కోటీశునందు
మనము గదియించి విషయవాసనలు త్రుంచి
పూజఁగావింతు మనిన నా పువ్వుటోడి
తల్లిదండ్రులు భక్తి చిత్తమున దాల్చి.{{float right|98 }}
పరమానంద మగ్నులై కోటీశ్వర ధ్యానలీన చిత్తులై యుండిరంత నా
సునందుండు.{{float right|99 }}
తనయావివేకపాకము
తనయాప్తుల కెల్లఁ దెలిపి తత్త్వస్థితిచే
త నయానురాగ వృత్తిని..
తన యాత్మఁ దలంచే శివునిఁ దద్దయుభక్తిన్ .{{float right|100 }}
బాలిక యిది శివభక్తి
శ్రీ లలితయ యగుట దీని శివభక్తునకున్
లీల వివాహము సేయుట
మేలంచుఁ దలంచె నతఁ డమేయ మనీషన్ .{{float right|101 }}
అంత నానందవల్లికి దిదృక్షు జనానందవల్లి ఫలప్రాయంబగు యౌవన
ప్రాయంబు దోపఁ ద్రిజగన్మోహిని యగు మోహినీకాంతయుం బోలె
నక్కాంత నితాంతకాంతికాంతయై విరాజిల్లుచుండె నంత.{{float right|102 }}
కమల కచ్ఛప కాహల కరభ పులిన
పుష్కరావర్త వీచికా భూభృ దబ్జ
బిస శశాంక వయోవాహ విజయకరము”
లలితపాదాది వేణికాంతాంగకములు.{{float right|103 }}
</poem><noinclude><references/></noinclude>
6ng7dxrc19x0xa5qij3ipdzuca8yspt
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/141
104
133012
569528
405286
2026-08-09T17:04:06Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569528
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{rh|108 ||శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము}}</noinclude>{{left margin|5em}}
<poem>
మగువ సౌందర్య వారాశి మథనజనిత
లక్ష్మీయో యన సౌభాగ్య లక్షణముల
కెల్ల నిల్లయి యౌవనం బేపుమీఱ
స్మరవిరోధిని మోహింపఁ జాలియుండె.{{float right| 104 }}
అట్టి వయః కాలంబున
గట్టిగఁ గోటీశు నభవు గామించఁగ నే
పట్టున నన్యుల పైఁదగఁ
బుట్టునె కామంబు భక్తి పూర్ణాత్ములకున్ .{{float right|105 }}
కోటీశున్ మదిఁ బూజనేయు, నభవుం గోటీశుఁ జింతించు,దాఁ
గోటీశున్ వెలి జూడనేగు, నుడువుం గోటీకు నామావళిన్ ,
గోటీశార్చన సేయుచుండును మనఃకోటిం దివారాత్రముల్
గోటీశుండె సమస్త విశ్వమని సంకోచంబు మానున్ మదిన్ . {{float right|106 }}
ఆ తలోదరి హృదయాంబుజాత పీఠి
గోటిలింగంబు నిల్పి యకుంఠ భక్తి
బూజఁ గావించు సంకల్ప పుష్పములను
ప్రకట జీవోపహార మప్పనము సేసి.{{float right| 107 }}
ఇభరాడ్గామిని బాహ్యదేశమున గోటీశార్చనల్ నేయఁగా
శుభ సద్వస్తు వితానముల్ గొనుచు నా క్షోణీధ్ర కూటాగ్ర భూ
విభవోపేత శివాలయంబునను, సంవిల్లింగముం జూడఁగా
నభయం గొప్పగ నేఁగుచుండును వయస్యానీక సంయుక్తయై. {{float right| 108 }}
భస్మత్రిపుండ్రాంక ఫాలభాగముతోడ
విమల రుద్రాక్షహారములతోడ
కోటీశ భావనాకుంఠితమతితోడ
పంచాక్షరీ జపప్రౌఢితోడ
</poem><noinclude><references/></noinclude>
2c2g85olmpcxw3rghiqu9tv9ukr7fby
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/142
104
133013
569529
405287
2026-08-09T17:06:41Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569529
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{rh|తృతీయాశ్వాసము||109 }}</noinclude>{{left margin|5em}}
<poem>
కరగత రుద్రాక్ష కంకణంబులతోడ
శివభక్తి లాంఛన స్థితులతోడ
నానంద హృష్టరోమాంచితాంగము తోడ
మహిత యోగారూఢ మహిమతోడ
దనరి యా యింతి కోటీశు దర్శనంబు
సేయఁగా నేఁగు నచ్చటి సిద్ధసమితి
భక్తి యీ లీల మూర్తియై వచ్చెననఁగ
భూమి నానందవల్లి, కాంతామతల్లి{{float right|109 }}
ప్రత్యహం బట్టు లయ్యింతి పర్వతేంద్ర
మెక్కి యచ్చట కోటీశు నిష్టలింగ
మూర్తిఁగాఁజేసి పూజించుఁ బూని ప్రాణ
భావలింగంబులం దైక్య పదవినొంద.{{float right|110 }}
సేయు నుత్తరశైవ సంసిద్ధి లేక
యుండియును, దాను సద్భక్తియుండు కతన
షట్థ్సలాధ్వావధానంబు చంద్రవదన
చిత్తమున చంద్రధారణచేసి నియతి.{{float right| 111 }}
పూజించున్ శివుఁ బుష్పదామములచేఁ బూబోఁడి కోటీశ్వరున్
రాజచ్చంద్ర కళావతంస సమమై రంజిల్ల మౌళిస్థలిన్
తేజస్ఫూర్జిత ధూపదీపముల నెంతే నిచ్చు మాధుర్య వి
భ్రాజ ద్దివ్యఫలోపహార మొసఁగున్ భక్త్యన్వితస్వాంతయై.{{float right| 112 }}
అతివ ! మధుమధుర ఫలోపహార మొసఁగి
విసము మెసఁగిన చేదు నిం పెసఁగ మాన్చె
నిరతమృష్టాన్న నైవేద్య నియతివలన
నాది భిక్షుత్వ ముడిగించె నభవునకును.{{float right|113 }}
</poem><noinclude><references/></noinclude>
5hbyrmh7me03tssozqr3v0fx1bn3b29
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/143
104
133022
569530
405300
2026-08-09T17:09:47Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569530
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{rh|110 ||శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము}}</noinclude>{{left margin|5em}}
ఇట్లు నిరంతరం బబ్బాల బాలేందు మకుటు నారాధింపుచుండి యంత నొక్క
నాఁడు మహాశివరాత్రియం దోంకార నదీజలంబుల స్నానంబుజేసి, సితభసితో
ద్ధూళన త్రిపుండ్ర రుద్రాక్షమాలికాలంకృతదేహయై శివనామామృతాంచిత
రసనయై శివధ్యానలీనచిత్తయగుచు, నొక్కతియ య క్కు ధరేంద్రంబెక్కి
యక్కడ రుద్ర శిఖరాగ్రస్థ కోటీశ్వర మహాలింగంబు షోడశోపచార పూజా
విధానంబుచే నారాధనంబుజేసి, తత్ప్రాంతకాంతబిల్వవనాంతర మధ్యంబు
నం దొక్క శ్రీతరుమూలంబున పద్మాసనాసీనయై, జితేంద్రియ మరున్మనో
వికారియై, కోటీశ్వరలింగంబు హృదయరంగంబున నిల్పి యంత మానస
పూజావిధానం బధిష్ఠించి మఱియు—{{float right|114 }}
<poem>
వటమూలరత్న విస్ఫుట వేదికామధ్య
హాటకోల్లసిత సింహాసనమున
శతకోటి కందర్ప సౌందర్యమహిమతో,
కలితశరన్మేఘ కాంతితోడ
సితభాను భానుశుచినయనములతోడ
దరహాసశోభి వక్త్రంబుతోడ
వరదాభయ మృగాగ్నికర చతుష్కంబుతో
మౌనముద్రాచ్ఛన్న మహిమతోడ
దనరి భక్తార్తి హారియౌ మునిశరణ్యు
మదనహరు నీలకంఠు నుమాసహాయు
హృదయగతుఁజేసి, తన్మూర్తిఁ జెదరకుండ
నిలిపి పూజించె నాభీర లలన భక్తి.{{float right|115 }}
జలజలోచన రాజోపచారములను
పూజఁ గావించి తల్లీన బుద్ధియగుచు
తన్ను జగములు మఱచి నేత్రములు మూసి
చొక్కి యంతట కనువిచ్చి చూచునపుడు.{{float right|116 }}
</poem><noinclude><references/></noinclude>
h6cp4k5ocon0gzsyfsbyapspswhg24y
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/144
104
133023
569531
405304
2026-08-09T17:12:55Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569531
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />
{{rh|తృతీయాశ్వాసము||111 }}</noinclude>{{left margin|5em}}
<poem>
ఆ లలన భక్తి యుక్తికిఁ
జాలంగా సంతసించి జంగమరూప
శ్రీలలితుఁడు కోటీశుడు
బాలామణి కెదుట నిలచె బ్రస్ఫుటలీలన్.{{float right|117 }}
ఆమూర్తిఁగాంచి డగ్గరి
భామిని సాలంక భక్తవరునకు వని ము
న్నీమూర్తిగాదె కన్పడె
నా మూ ర్తినిఁ గొలుతునే ననంతము ననుచున్.{{float right|118 }}
ఆమహాత్ముఁడు క్షీరోపహార మొకటి
దక్క నన్యంబు గొనఁడని తానెఱింగి
యుంట, గోక్షీరములు దెచ్చి యువిద భక్తి
నర్పణము సేయు నిత్యకృత్యంబుగాఁగ.{{float right|119 }}
మున్ను సాలంక సద్భక్త పుంగవుండు
క్షీర మాతని కొసఁగి తచ్ఛేష మాత్మఁ
దృప్తిగాఁజేసి శేషమప్రా ప్తమైన
వాసరంబుల నుపవాసవ్రతము జేసె .{{float right|120 }}
నేనును గోక్షీరము లీ
మౌనీంద్రున కొసఁగి శేషమాహారముగా
బూనెద తచ్ఛేషంబును
లేనియెడం దనువు విడుతు లీల దలిర్పన్ ..{{float right| 121 }}
అని యిట్లాభీరాంగన
ఘనమగు తద్వ్రతము బూనఁ గదలక యతఁడున్
దన యిచ్చజనక నిచ్చెను.
వనజాక్షికిఁ బ్రాణహాని వచ్చునటంచున్ .{{float right|122 }}
</poem><noinclude><references/></noinclude>
0poxggrohs7qnieila302hyfa0rw3y8
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/145
104
133025
569532
405306
2026-08-09T17:18:31Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569532
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{rh|112 ||శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము}}</noinclude>{{left margin|5em}}
ఇట్లు నిల్చిన నయ్యింతియుఁ బ్రతిదినంబును విష్ణుశిఖర ప్రాంత కాంత
బిల్వకాంతారాంతరస్థిత పాపవినాశన లింగాగార ప్రాగ్భాగస్థ ద్రోణికాంత
ర్జలంబులందోఁగి తదంబుపూర పూరిత పూర్ణకలశంబు శిరోభాగంబున
ధరియించి రుద్రశృంగసంగత ప్రాచీన కోటీశ్వరలింగాలయ సమీప బిల్వ
భూజాతస్థితుండగు నమ్మహాపురుషమూర్తికి ఉదత్కలశోదకంబుల నభి
షేకంబుఁజేసి తత్రస్థ బిల్వ వనదళంబులం బూజించి, ధూపదీపంబులిచ్చి,
క్షీరోపహారంబొసగి, తచ్చేషంబు తాను బానంబొనర్చుచు, నిరశనవ్రతంబుఁ
బూని, కొంతకాలంబిట్లు గడుప, సాలంకాభిఖ్య భక్తవరుం డది విని
యమ్మహాత్ముండు తనకు దర్శన మిచ్చిన జంగమమూర్తి యగునని
భావించి,యగ్గిరి కరిగి, యచట న న్నగారోహణంబు జేయఁబూను
నవ్వల్లవీ పల్లవాధరంగని, నిజోదంతంబెఱింగించి, యీ పర్వతాగ్రంబున
నీచేతఁ బూజఁబడయుచుండు నమ్మహాత్మునకు సమయంబెఱింగి, నన్నెఱిం
గింపు మంతఁదాక నిచటికి వచ్చుచుఁ బోవుచుండెద ననిన నయ్యింతియు
నట్ల చేసెదనని యమ్మౌనియు మౌనముద్రాధరుండగుట సమయంబుగామి
నెఱింగింపదయ్యె, నంతఁ గొంతకాలంబరిగిన గ్రీష్మసమయంబున నయ్యు
విద విష్ణుశిఖరప్రాంతస్థ ద్రోణికాజంపూరిత కలశంబు శిరంబున నిడికొని,
యమ్ముని సమీపంబువ కరుగునెడ నుష్టభాను రాను తప్తగాత్రయై
యలసి, యెట్టకేల కచ్చటి కరిగి యక్కలశం బచ్చోట నిలిపి బిల్వ
పత్రార్థం బరుగునంత నొక్క వాయసం బరుదెంచి యక్కలశంబు దొని
కినం గినిసి నేఁడాది ని న్నగేంద్రంబునకు వాయసంబు రాకుండెడు మని
శపించి బహుశ్రమాకలితయై యున్న యన్నాతికి దయాక్రాంతస్వాంతుండై.
యతం డిట్లనియె.{{float right|123 }}
<poem>
బాల నిజగృహంబున సుఖోపాయముగను
నిలిచి విషయాభిలాషమై నిఖిల సుఖము
లనుభవించెడి నిండు యౌవనమునందు
వనమునందున నాయాపపడగనేల ?{{float right|124 }}
</poem><noinclude><references/></noinclude>
6knook0b8kmt71mkqks8dcpcab8ezgq
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/146
104
133027
569533
405308
2026-08-09T17:21:13Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569533
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />
{{rh|తృతీయాశ్వాసము||113 }}</noinclude>{{left margin|5em}}
<poem>
అన విని జవ్వని యమ్ముని
గనుఁగొని తా నిట్టు లనియెఁ గాయము ప్రాయం
బను విషయములును, గాలం
బును సత్యంబగునె వట్టి మోహము లేలా ?{{float right|126 }}
వయసు వేళల ననశన వ్రత తపోగ్ర
వన నివాసాది కృత్యము ల్వదలి కామ్య
సుఖములే కోరి, భోగింపఁ జూచెనేని
ముదిమి వచ్చిన నింతైనఁ గదల వశమె ?{{float right|127 }}
కామ మెక్కువౌను, కడియు నోటికి బోదు
ధనమునందుఁ బ్రేమ దగులు మిగుల
చిక్కువడుచు నుండు జింతల వంతల
ముదిమి మోక్ష సౌఖ్యమునకు తెరవె ?{{float right|128 }}
అనిన విని యయ్యింతికి వైరాగ్యంబు గలుగుట నమ్మునీంద్రుండు దెలిసి,
జ్ఞానోపదేశంబు జేసియైన నీ వ్రతాయాసంబు మాన్పెదగాక యని తలంచి
యిట్లనియె {{float right|129 }}
నీకు వైరాగ్య ముండుట నీలవేణి
జ్ఞాన ముపదేశ మొనరింపఁ బూనినాఁడ
భూరి వైరాగ్యమే జ్ఞాన కారణంబు
జ్ఞాన మెక్కడ వైరాగ్య హీనునకును?{{float right|130 }}
</poem>
ముఱియు బాహాభ్యంతరమ్ముల దశదిశావకాశంబుల సంకట పరిపూర్ణంబై
చిదాకాశంబగు బ్రహ్మం బొక్కటియె విరాజిల్లు, నందుఁ ద్రిగుణాత్మకమైన
మాయాశక్తి తదభిన్నమై జనించిన నది యుపాధిగాగల చైతన్యం బీశ్వ
రుండై బ్రహ్మవిష్ణు రుద్రరూపంబుల జగత్సర్గస్థితిలయంబు లొనర్చుచుండు,
నమ్మాయాశక్తి యవ్యక్త మహదహంకార పంచమహాభూతంబులయ్యె,<noinclude><references/></noinclude>
2jo5sg7ue956pcwv412ph5q6eqp5v6q
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/147
104
133028
569534
405310
2026-08-09T17:26:00Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569534
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{rh| 114||శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము}}</noinclude>
నీ భూతంబులు సూక్ష్మస్థూలాంశలవలన సూక్ష్మస్థూలదేహంబులును, సకల
జగజ్జాలంబునయ్యె నయ్యచలంబగు చిదాకాశంబునందె సంకల్పశక్తి
యుదయించె నదియ యవిద్యయనంబడు. తదధిష్ఠానచైతన్యంబె జీవుండనఁ
బడి స్వరూప విస్మృతివలన ననేక కోటిజన్మంబులెత్తుచుండి సుకృత
పరిపాకంబున మనుష్యుండై గురుముఖంబున స్వరూపస్మృతి ముక్తుండగు;
నా ముక్తి ద్వివిధయగు నందు చిదాకాశంబున మనోలయంబు చేయుటయు,
సర్వంబును బ్రహ్మంబుగా సర్వావస్థలయందును విస్మృతిలేక చూచుటయు,
నందు రెండవముక్తి యుత్తమ మగు; నందు మొదటి ముక్తికి సంకల్ప
క్షయంబును, రెండవ ముక్తికి వాసనాత్యాగంబును జేయవలయు, మనోలయా
భ్యాసంబునంగాని వాసనాత్యాగముక్తి సంభవింపదు. వాసనాత్యాగంబునం
ధర్మవ్యాధ తులాభారంబున వసిష్టాదులు పుత్రదారాది సహితులై జీవన్ముక్తు
లైరి. కలియుగంబున సకలవర్ణాశ్రమంబులవారును శిశ్నోదరపరాయణు
లును కామక్రోధలోభమోహమదమత్సరావృత్తులునునై బహువిధ వేదాంత
గ్రంథశ్రవణంబునను మహా వ్యాఖ్యార్థోపదేశంబుల సేయు నయ్యధికారి
గురువ్రాతంబులవలనను, తత్త్వజ్ఞానంబు తమకు దృఢంబై నట్లు భ్రమించి
వాసనాత్యాగ యోగలక్షణం బెఱుంగకయె వసిష్ఠాదులంబోలి జీవన్ముక్తుల
మని పలుకుదు రది యసంగతంబు. వారలు వాసనాత్యాగశీలురును, నెడనెడ
మనోలయావధానులును భూత భవిష్యద్వర్తమాన జ్ఞానులును వర్ణాశ్రమా
చార విధికర్మరతులును నిత్యకర్మత్యాగులునై శాపానుగ్రహ సామర్థ్యంబులు
గలిగి యుందురు. వీరలు వాసనాగ్రస్తులై వర్ణాశ్రమ విధికర్మంబులు దొరంగి
నిషిద్ధకర్మంబు లాచరింపుచు నిమిషమాత్రంబైన మనోలయంబు సేయ
నేరక జ్ఞానులమని వృథాహంకారంబులం దిరుగుట వాసనాత్యాగ ముక్తిం
గనలేరు. కలిగెనేని నిమిషమాత్రంబైన చిత్తవిక్షేపంబులం బాసి మనో
లయానందంబేల యనుభవించ రట్లగుట కలియుగంబున మనోలయవాసనా
త్యాగంబులు సంభవింపవు, మోక్షేచ్ఛగలవాఁడు మోచకుండగు నీశ్వరు
నుపాసించినఁ దదనుగ్రహంబున గామియైనఁ గామిత సుఖంబులబొంది<noinclude><references/></noinclude>
osjq1y0nyhfn5lxay4etzgw723aj3lx
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/148
104
133029
569535
405312
2026-08-09T17:29:19Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569535
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />
{{rh|తృతీయాశ్వాసము||115 }}</noinclude>{{left margin|5em}}
<poem>
దప ముక్తుండగు, నకామియైన సద్యోముక్తుండగు; నయ్యీశ్వరుండును
బహ్మవిష్ణు రుద్రాత్మకుండై పంచవింశతి లీలాభేదంబుల రామకృష్ణాద్యవ
తారభేదంబులు నానావిధంబులఁ గ్రీడించు నందు దక్షిణామూర్తి లీలా
స్వరూపం బుపాసించిన శ్రీఘ్రంబుగా సర్వేష్టసిద్ధులం బడసి సద్యోముక్తి
గాంచు నదెట్లనిన——{{float right| 131 }}
మున్ను దక్షాధ్వరమున దక్షుఁడీశ్వరు
నిందింపగ విని యనింద్య యగుచు
దాక్షాయణీదేవి తనువు విసర్జించి
శీతాద్రిరాజ సంజాత యగుచు
వైరాగ్యమున మనోవైభవం బెడలింపఁ
బురవైరి దక్షిణామూర్తి యగుచు
వటమూల వేదిక వసియించి తను దానే
గను సమాధిని మహామునులు గొల్వ
బ్రహ్మమై యుండె నద్దేవు భజనచేత
నఖిల సిద్ధులు వాసనాత్యాగయోగ
ఘనసమాధి మనోలయక్రమము లిష్ట
సంపదున్నతి గల్గు నీజన్మమందె .{{float right|132 }}
ఆ దేవోత్తము డా సన
కాదుల క య్యాత్మవిద్య యలవడఁ బరపం
గా దయను ద్రికూటాద్రిని
బ్రొదిం గోటీశుఁడనఁగఁ బొలుపొందెఁగదాః{{float right| 133 }}
అట్టి కోటీశ్వరుఁడనేన యంబుజాక్షి :
నీదు సద్భక్తి కిని మెచ్చి నేఁడు జంగ
మాకృతి ధరించి సత్కృప నీకు బోధ
సేయ వచ్చితి మత్పూజఁ జేసి తీవు.{{float right|134 }}
</poem><noinclude><references/></noinclude>
aq249tayp9a64mcdpx3sgg4sy78fdtj
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/8
104
133059
569550
405432
2026-08-09T23:40:23Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569550
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{Center|'''తొలిపలుకు'''}}</noinclude>{{rh|శ్రీమత్త్రికూటాచల క్షేత్రము|| }}
{{left margin|5em}}
‘కోటప్పకొండ' అనబడు నీ క్షేత్రము గుంటూరుజిల్లాలోని నరసరావు పేట
తాలూకాకు దక్షిణమున నేడు మైళ్ళ దూరములో నున్నది. దీని చుట్టుకొలత 'అడుగు
తక్కువ యామడ' యని వాడుక. కాని యాఱుమైళ్ళుండవచ్చును. దీని యెత్తు
1587 అ. లు. వైశాల్యము 1500 ఎకరములు. ఇప్పుడెల్లరును బూజించు కోటీశ్వర
స్వామి దేవళము 600 అ. ల యెత్తునఁ గలదు. దీని కెగువభాగమున 'ప్రాఁత
కోటప్ప గుడి' కలదు, ఓపిక గలవా రచటికి వెళ్ళివత్తురు.
''సోపాన మార్గములు :''
ఈ కొండ నెక్కుటకు మూఁడు సోపాన మార్గములు కలవు. (1) పూర్వము
నరసరావుపేట రాజాగారి యొంటె లెక్కు నడకదారి, ఇది పైనిగల పాపనాశన
స్వామి గుడికి క్రిందుగఁ బోవును (2) ప్రస్తుత మందఱు నెక్కి పోవు దారి.
దీనిని 120 ఏండ్ల క్రిందట నిప్పటి జమీందారుగారి ముత్తాతగారు కట్టించిరందురు.
(3) రాధాకృష్ణ సోపాన మార్గము. రెండవదారికి కుడిప్రక్కను గలదు.
''దొనలు :''
ఇందు దైవనిర్మితము లయిన దొన లెన్నియో గలవు. ప్రస్తుత దేవాలయ
మున కెగువ నున్న యెనిమిది దొనలలో పెద్దవానియందు యాత్రికులు స్నాన
మాడుదురు. ప్రాఁత కోటప్ప గుడికిఁ బోవు త్రోవలో 'ఎద్దడుగు' అను దొన
యన్వర్థసంజ్ఞతో నొప్పును. బసవేశ్వరుఁ డచ్చట తపస్సుచేసె నందురు. ఇంకను
‘పుఱ్ఱచేతి దోన' - 'ఉబ్బులింగము దొన' మొదలగున వెన్నియో కలవు. ఇవి
గాక ఋష్యాదులకు తపోయోగ్యములగు గుహ లెన్నియో గలవు.
''త్రికూటాచల నామము :''
ఈ పర్వత మే వంకనుండి చూచినను మూఁడు కూటములు (బోళ్ళు) గఁ
గన్పట్టును. అదియే దీనికి 'త్రికూట పర్వత మనియు, నిందుఁ గల దేవునికి<noinclude><references/></noinclude>
jrhq17odr0o1rc8yn753wmqy5jrx4li
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/9
104
133061
569551
405434
2026-08-09T23:48:03Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569551
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>{{Center|2}}
'త్రికూటేశ్వరుఁ' డనియు, నీ స్థల పురాణమునకు 'త్రికూటాచల మాహాత్మ్య'
మనియుఁ బేరువచ్చుటకుఁ గారణమని తోఁచెడిని. కాని ఏ శాసనములలోను నిది
త్రికూటాచలముగఁ బేర్కొనఁబడలేదు. ఇందలి శిఖరములను బ్రహ్మ, విష్ణు,
రుద్ర శిఖరము లందురు.
'త్రికూట పర్వతము' గజేంద్రమోక్షణ స్థలమైనట్లు భాగవతమునఁ గలదు.
అందలి కూటములను 'గాయత్రి. సావిత్రి. సరస్వతి' అందురు. అది రాజపుటాన
లోని అజ్మీరున కేడుమైళ్ళలో పుష్కరక్షేత్ర మనఁ బరగుచున్నది.
ఇవిగాక 'త్రికూటాచల' మని మఱొక్కటి తిరునల్వేలి జిల్లాలో 'తెన్ కాసి'
స్టేషనుకు మూఁడు మైళ్ళలో తిరుకుర్తాలము నొద్దఁ గలదు. అందు తిరుకుర్తా
లేశ్వరునియు, రాజరాజేశ్వరియు కోవెలలును, అగస్త్యాశ్రమమును, గొప్ప నీటి
ధారలును గలవు.
శ్రీ కోటీశ్వరస్వామి క్షేత్రమే గజేంద్రమోక్షణ స్థానమని కొందఱందురు.
అది సరిగాదనిపించుచున్నది.
‘శ్రీ త్రికోటీశ్వరునికి క్రిష్ణదేవమహారాయలు ఆనతిని ప్రధాని తిమ్మరుసయ్యం
గారు దండం పెట్టి సమర్పించిన గ్రామం కొండకావూరు' అగ్రహారము సమీప
మైనసు, కొన్ని శాసనములలో 'కావూరి త్రికోటీశ్వర శ్రీ మహాదేవర' కని
యున్నను ఎల్లమంద కోటీశ్వరుఁ డనియే ప్రజల వాడుక.
ఇచ్చట కొండపైని గల కోటీశ్వరాలయములో వెలనాటి గొంకరాజు
మొదలగువారి నాఁటి దీప దాన శాసనములంబట్టి 840 సం. లకుఁ బూర్వమే
యీ యాలయ ముండినట్లు తెలియుచున్నది.
'''శిఖరములు :'''
''రుద్రశిఖరము '': ప్రాత కోటీశ్వరుని స్థలము. ఇచ్చట నొక చిన్న
గుడియు, లింగమును దాని కెదుట శిథిలావస్థలో నున్న దారుధ్వజమును గన్ప
ట్టును, ఇచ్చటి నుండియే కోటీశ్వరుఁడు గొల్లభామ యింటికి దిగివచ్చుచు నడుమ
నిల్చెనవి చెప్పుదురు. దీని నిర్మాణ మనూహ్యము.
''బ్రహ్మశిఖరము:'' ఇప్పు డందఱును బూజించు కోటీశ్వరాలయ ప్రదేశము.
''విష్ణుశిఖరము :'' ఇచ్చట పాపవినాశనస్వామి గుడి గలదు. దీనినే గద్దల
బోడందురు. దీని మహిమాతిశయము స్థల పురాణమునఁ జూడనగును.<noinclude><references/></noinclude>
8tqq82hbe59cbs1csx1aam7hqped0my
569610
569551
2026-08-10T10:47:12Z
Rajasekhar1961
50
569610
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{Center|2}}</noinclude>'త్రికూటేశ్వరుఁ' డనియు, నీ స్థల పురాణమునకు 'త్రికూటాచల మాహాత్మ్య'
మనియుఁ బేరువచ్చుటకుఁ గారణమని తోఁచెడిని. కాని ఏ శాసనములలోను నిది
త్రికూటాచలముగఁ బేర్కొనఁబడలేదు. ఇందలి శిఖరములను బ్రహ్మ, విష్ణు,
రుద్ర శిఖరము లందురు.
'త్రికూట పర్వతము' గజేంద్రమోక్షణ స్థలమైనట్లు భాగవతమునఁ గలదు.
అందలి కూటములను 'గాయత్రి. సావిత్రి. సరస్వతి' అందురు. అది రాజపుటాన
లోని అజ్మీరున కేడుమైళ్ళలో పుష్కరక్షేత్ర మనఁ బరగుచున్నది.
ఇవిగాక 'త్రికూటాచల' మని మఱొక్కటి తిరునల్వేలి జిల్లాలో 'తెన్ కాసి'
స్టేషనుకు మూఁడు మైళ్ళలో తిరుకుర్తాలము నొద్దఁ గలదు. అందు తిరుకుర్తా
లేశ్వరునియు, రాజరాజేశ్వరియు కోవెలలును, అగస్త్యాశ్రమమును, గొప్ప నీటి
ధారలును గలవు.
శ్రీ కోటీశ్వరస్వామి క్షేత్రమే గజేంద్రమోక్షణ స్థానమని కొందఱందురు.
అది సరిగాదనిపించుచున్నది.
‘శ్రీ త్రికోటీశ్వరునికి క్రిష్ణదేవమహారాయలు ఆనతిని ప్రధాని తిమ్మరుసయ్యం
గారు దండం పెట్టి సమర్పించిన గ్రామం కొండకావూరు' అగ్రహారము సమీప
మైనసు, కొన్ని శాసనములలో 'కావూరి త్రికోటీశ్వర శ్రీ మహాదేవర' కని
యున్నను ఎల్లమంద కోటీశ్వరుఁ డనియే ప్రజల వాడుక.
ఇచ్చట కొండపైని గల కోటీశ్వరాలయములో వెలనాటి గొంకరాజు
మొదలగువారి నాఁటి దీప దాన శాసనములంబట్టి 840 సం. లకుఁ బూర్వమే
యీ యాలయ ముండినట్లు తెలియుచున్నది.
'''శిఖరములు :'''
''రుద్రశిఖరము '': ప్రాత కోటీశ్వరుని స్థలము. ఇచ్చట నొక చిన్న
గుడియు, లింగమును దాని కెదుట శిథిలావస్థలో నున్న దారుధ్వజమును గన్ప
ట్టును, ఇచ్చటి నుండియే కోటీశ్వరుఁడు గొల్లభామ యింటికి దిగివచ్చుచు నడుమ
నిల్చెనవి చెప్పుదురు. దీని నిర్మాణ మనూహ్యము.
''బ్రహ్మశిఖరము:'' ఇప్పు డందఱును బూజించు కోటీశ్వరాలయ ప్రదేశము.
''విష్ణుశిఖరము :'' ఇచ్చట పాపవినాశనస్వామి గుడి గలదు. దీనినే గద్దల
బోడందురు. దీని మహిమాతిశయము స్థల పురాణమునఁ జూడనగును.<noinclude><references/></noinclude>
6vi6dpv0nu3fh10suar4jz30ny6iurb
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/10
104
133062
569552
405435
2026-08-09T23:52:06Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569552
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>{{Center|3}}
{{rh|శ్రీ త్రికోటీశ్వరాలయముు|| }}
ఇందలి శాసనాదులను బట్టి 11వ శతాబ్దమునాఁటికే యీ గుడి యున్నట్లు
స్పష్టము. కాని యొక్క కథమాత్రము చెప్పుదురు. గురవయ్యపాలెం కాపురస్థులు
గ్రంథెవారను వైశ్యులీ కొండపైకి కలపకొఱకు వెళ్ళఁగా హఠాత్తుగా పెద్దవాన గురిసి
యొక సెలయేటిగుండ లంకెబిందెలు కొట్టుకొని వచ్చినట్లును, వారి కారాత్రి కలలో
కోటీశ్వరుడు యోగివలె నగపడి తనకు గుడి కట్టించుమని చెప్పఁగా వారట్లొనర్చి
రనియు పరంపరగాఁ జెప్పుదురు. దీని కెట్టియాధారములు గానరావు. ఇందుఁగల
సాలంకయ్య యను భక్తుని చరిత్రమే యిట్లు చెప్పిరేమో: విమర్శనీయము,
క్రమముగా నా గుడిని కొందఱు భక్తు లొక్కొక్కభాగము కట్టించుచు వచ్చిరి.
అందు ముఖ్యులు మాదల శంభులింగమ్మ, సిద్ధుమల్లప్ప, మన గ్రంథకర్త
నరసింగయ్య, తిరుమలరాజు మొదలగువారెందఱో గలరు. 'ఎండోమెంటుబోర్డు'
వారి పరిపాలనకు వచ్చిననాఁటినుండి దేవాలయము సర్వవిధముల నుచ్చదశలోనికి
వచ్చినది. ప్రజలకు వలయు సౌకర్యము లెన్నఁదగినవిగ నున్నవనవచ్చును..
'''ఇతర దేవాలయములు :'''
కోటీశ్వరుని గుడికి దక్షిణమున గణనాథాలయము గలదు. పశ్చిమమున,
నుత్తరమున సాలంకేశ్వర సంతాన కోటీశ్వర లింగములు గలవు. ఎడమవైవున
దొనయొద్ద మార్కండేయ లింగము గలదు.. దిగువ మెట్లవరుసప్రక్కను
రామలింగేశ్వర లింగము గలదు. సోపానమార్గమున గొల్లభామ గుడి యున్నది.
సోపానమార్గమున ముందుగ బొచ్చుకోటీశ్వరునిగుడి గలదు. ఇందు
మ్రొక్కుబడులవారు కేశఖండనము చేయించుకొందురు.
ఇంక కొండక్రింద ప్రపన్న కోటీశ్వరుడు, వీలకంఠేశ్వరస్వామి మొదలగు
పేరు గల గుళ్ళు పెక్కులు గలవు.
ఇచ్చట 'ఓంకారనది' ఓగేరు అను పేరుతో చేజెర్లలోని కపోతేశ్వరుని
గుడిప్రక్కనుండి ప్రవహించి యీ కొండకు సమీపముగా వెడలి సముద్రమున
గలియుచున్నది. మఱియు శ్రీ త్రికోటీశ్వరస్వామి కర్పించిన భూముల వైనమును,
కోనేళ్ళు, బావులు, సత్రములు వానికి సంబంధించిన శాసనముల వివరములును
కీ. శే. మద్దులపల్లి గురుబ్రహ్మముగారి త్రికోటీశ్వర చరిత్రము (వచనము) నఁ
దెలియనగును.<noinclude><references/></noinclude>
7awhb2hloorz8i1285a1zf0j8b7ces1
569553
569552
2026-08-09T23:53:21Z
Ramesam54
3001
569553
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{Center|3}}</noinclude>
{{rh|'''శ్రీ త్రికోటీశ్వరాలయముు'''|| }}
ఇందలి శాసనాదులను బట్టి 11వ శతాబ్దమునాఁటికే యీ గుడి యున్నట్లు
స్పష్టము. కాని యొక్క కథమాత్రము చెప్పుదురు. గురవయ్యపాలెం కాపురస్థులు
గ్రంథెవారను వైశ్యులీ కొండపైకి కలపకొఱకు వెళ్ళఁగా హఠాత్తుగా పెద్దవాన గురిసి
యొక సెలయేటిగుండ లంకెబిందెలు కొట్టుకొని వచ్చినట్లును, వారి కారాత్రి కలలో
కోటీశ్వరుడు యోగివలె నగపడి తనకు గుడి కట్టించుమని చెప్పఁగా వారట్లొనర్చి
రనియు పరంపరగాఁ జెప్పుదురు. దీని కెట్టియాధారములు గానరావు. ఇందుఁగల
సాలంకయ్య యను భక్తుని చరిత్రమే యిట్లు చెప్పిరేమో: విమర్శనీయము,
క్రమముగా నా గుడిని కొందఱు భక్తు లొక్కొక్కభాగము కట్టించుచు వచ్చిరి.
అందు ముఖ్యులు మాదల శంభులింగమ్మ, సిద్ధుమల్లప్ప, మన గ్రంథకర్త
నరసింగయ్య, తిరుమలరాజు మొదలగువారెందఱో గలరు. 'ఎండోమెంటుబోర్డు'
వారి పరిపాలనకు వచ్చిననాఁటినుండి దేవాలయము సర్వవిధముల నుచ్చదశలోనికి
వచ్చినది. ప్రజలకు వలయు సౌకర్యము లెన్నఁదగినవిగ నున్నవనవచ్చును..
'''ఇతర దేవాలయములు :'''
కోటీశ్వరుని గుడికి దక్షిణమున గణనాథాలయము గలదు. పశ్చిమమున,
నుత్తరమున సాలంకేశ్వర సంతాన కోటీశ్వర లింగములు గలవు. ఎడమవైవున
దొనయొద్ద మార్కండేయ లింగము గలదు.. దిగువ మెట్లవరుసప్రక్కను
రామలింగేశ్వర లింగము గలదు. సోపానమార్గమున గొల్లభామ గుడి యున్నది.
సోపానమార్గమున ముందుగ బొచ్చుకోటీశ్వరునిగుడి గలదు. ఇందు
మ్రొక్కుబడులవారు కేశఖండనము చేయించుకొందురు.
ఇంక కొండక్రింద ప్రపన్న కోటీశ్వరుడు, వీలకంఠేశ్వరస్వామి మొదలగు
పేరు గల గుళ్ళు పెక్కులు గలవు.
ఇచ్చట 'ఓంకారనది' ఓగేరు అను పేరుతో చేజెర్లలోని కపోతేశ్వరుని
గుడిప్రక్కనుండి ప్రవహించి యీ కొండకు సమీపముగా వెడలి సముద్రమున
గలియుచున్నది. మఱియు శ్రీ త్రికోటీశ్వరస్వామి కర్పించిన భూముల వైనమును,
కోనేళ్ళు, బావులు, సత్రములు వానికి సంబంధించిన శాసనముల వివరములును
కీ. శే. మద్దులపల్లి గురుబ్రహ్మముగారి త్రికోటీశ్వర చరిత్రము (వచనము) నఁ
దెలియనగును.<noinclude><references/></noinclude>
c5ze3jhnhaai9zwm5k45vhisl6kdne8
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/11
104
133064
569554
405437
2026-08-09T23:57:20Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569554
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>{{Center|4 }}
కొండ పైని స్వామివారి సన్నిధి నర్చకులతోఁబాటు భక్తులుకూడ ప్రదక్షిణాది
సేవలొనర్చి కృతార్థులగుచున్నారు. ఇప్పటికి నఖండ దీపారాధన పూజాదికములు
జరుగుచున్నవి. ప్రతి మాఘ శు।।1 నుండి మాసాంతముదాఁక ప్రజలు పశువులతో
గిరిప్రదక్షిణము చేసి స్వామిని సేవించి, పలు విధములయిన మ్రొక్కుబడులు
తీర్చుకొందురు. దేశ దేశములనుండి సుమారు రెండులక్షల ప్రజలీ యొక్క నాఁటి
యుత్సవమునఁ బాల్గొందురు. సంకల్పము లేనివారికిని శివరాత్య్రు యుత్సవ సమయ
మునకు నిర్నిమిత్తముఁగ భక్త్యుద్రేకము గలిగి తక్షణము బయలుదేఱి వెళ్లుట
యిందలి ప్రత్యేకమహిమ యమటలో నతిశయోక్తి రవంతయులేదు. శివరాత్రినాఁటి
యుత్సవమును, రకరకముల ప్రభలను, వాద్యములను, జనబాహుళ్యమును జూడని
వాని జన్మము వ్యర్థమనియే చెప్పవచ్చును.
'''స్థలపురాణరచనలు :'''
ఈ స్థలమునకు యుగాంతరములనుండి మహిమ యున్నట్లు చెప్పుదురు.
దీని మాహాత్మ్యమును దెలిసికొనుటకు (i) కీ. శే. బ్ర॥ కొప్పరాజు నరసింహకవి
గారు వ్రాసిన ‘శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్య' మను మూడాశ్వాసముల పద్య
కావ్యము (ప్రకృత గ్రంథము) ముఖ్యాధారము.
(ii) మఱియు క్రీ శ. 1905 లో రూపెనగుంట సీతారామయ్యగారు గుమ్మెట
కథ (రగడ) నుత్సవాదులు వర్ణించుచు వ్రాసిరి.
(iii) డెబ్బదియేండ్ల క్రిందట బ్ర॥ తుళ్ళూరి మాధవరాయఁడుగా రీ కథను
కుంచించి “మనఃకాంతాముక్తికాంతాసంవాద' మని 12 చరణముల కీర్తన వ్రాసిరి.
(iv) 1922 లో కీ. శే. బ్ర॥ తాడేపల్లి వేంకటప్పయ్య శాస్త్రిచే రచింపబడిన
'శ్రీ కాకాని మల్లీశ్వర మాహాత్మ్యము"లో సుమారు 11 పేజీల కథను శ్రీ కోటీశ్వర
మాహాత్మ్యమని వ్రాసిరి. అది దేవినిబట్టి వ్రాసిరో తెలియదు. కథాభాగము వేఱు.
'''ప్రకృత గ్రంథకర్త :'''
ఈ గ్రంథకర్త వివాసస్థలము సత్తెనపల్లి తాలూకా కోసూరు. గ్రంథమునం
దీయబడిప వంశావళినిబట్టి యీ కవీంద్రుని వంశవృక్ష మీ ప్రక్కపుటలో నొసంగఁ
బడినది. ఆదిపురుషుడైన కొప్పరాజువామమే వీరి గృహనామముగ నేర్పడుట.
వలన నాయన ప్రసిద్ధపురుషుఁడై యుండనోపు.<noinclude><references/></noinclude>
i7uyifopork4hu9ayrvt6o1i5q71ogm
569611
569554
2026-08-10T10:48:00Z
Rajasekhar1961
50
569611
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{Center|4 }}</noinclude>
కొండ పైని స్వామివారి సన్నిధి నర్చకులతోఁబాటు భక్తులుకూడ ప్రదక్షిణాది
సేవలొనర్చి కృతార్థులగుచున్నారు. ఇప్పటికి నఖండ దీపారాధన పూజాదికములు
జరుగుచున్నవి. ప్రతి మాఘ శు।।1 నుండి మాసాంతముదాఁక ప్రజలు పశువులతో
గిరిప్రదక్షిణము చేసి స్వామిని సేవించి, పలు విధములయిన మ్రొక్కుబడులు
తీర్చుకొందురు. దేశ దేశములనుండి సుమారు రెండులక్షల ప్రజలీ యొక్క నాఁటి
యుత్సవమునఁ బాల్గొందురు. సంకల్పము లేనివారికిని శివరాత్య్రు యుత్సవ సమయ
మునకు నిర్నిమిత్తముఁగ భక్త్యుద్రేకము గలిగి తక్షణము బయలుదేఱి వెళ్లుట
యిందలి ప్రత్యేకమహిమ యమటలో నతిశయోక్తి రవంతయులేదు. శివరాత్రినాఁటి
యుత్సవమును, రకరకముల ప్రభలను, వాద్యములను, జనబాహుళ్యమును జూడని
వాని జన్మము వ్యర్థమనియే చెప్పవచ్చును.
'''స్థలపురాణరచనలు :'''
ఈ స్థలమునకు యుగాంతరములనుండి మహిమ యున్నట్లు చెప్పుదురు.
దీని మాహాత్మ్యమును దెలిసికొనుటకు (i) కీ. శే. బ్ర॥ కొప్పరాజు నరసింహకవి
గారు వ్రాసిన ‘శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్య' మను మూడాశ్వాసముల పద్య
కావ్యము (ప్రకృత గ్రంథము) ముఖ్యాధారము.
(ii) మఱియు క్రీ శ. 1905 లో రూపెనగుంట సీతారామయ్యగారు గుమ్మెట
కథ (రగడ) నుత్సవాదులు వర్ణించుచు వ్రాసిరి.
(iii) డెబ్బదియేండ్ల క్రిందట బ్ర॥ తుళ్ళూరి మాధవరాయఁడుగా రీ కథను
కుంచించి “మనఃకాంతాముక్తికాంతాసంవాద' మని 12 చరణముల కీర్తన వ్రాసిరి.
(iv) 1922 లో కీ. శే. బ్ర॥ తాడేపల్లి వేంకటప్పయ్య శాస్త్రిచే రచింపబడిన
'శ్రీ కాకాని మల్లీశ్వర మాహాత్మ్యము"లో సుమారు 11 పేజీల కథను శ్రీ కోటీశ్వర
మాహాత్మ్యమని వ్రాసిరి. అది దేవినిబట్టి వ్రాసిరో తెలియదు. కథాభాగము వేఱు.
'''ప్రకృత గ్రంథకర్త :'''
ఈ గ్రంథకర్త వివాసస్థలము సత్తెనపల్లి తాలూకా కోసూరు. గ్రంథమునం
దీయబడిప వంశావళినిబట్టి యీ కవీంద్రుని వంశవృక్ష మీ ప్రక్కపుటలో నొసంగఁ
బడినది. ఆదిపురుషుడైన కొప్పరాజువామమే వీరి గృహనామముగ నేర్పడుట.
వలన నాయన ప్రసిద్ధపురుషుఁడై యుండనోపు.<noinclude><references/></noinclude>
r79unhqxxiqh8rfeggsyl0iwuert7ca
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/13
104
133065
569556
405443
2026-08-10T00:10:06Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569556
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>
పడి యంతటి తిరునాళ్ళు జరుగుటకుఁ గల కారణ మచ్చటి విప్రోత్తముల నడిగి,
వారెఱుఁగ మన మఱునాఁడింటికి ప్రయాణమై వచ్చుచుండెను. త్రోవలో శ్రీశైల
ప్రాంత వాసియైన ముదిగొండ కేదారలింగమను ఆరాధ్య బ్రాహ్మణుఁ డెదురుపడెను.
కవి యా విప్రునికి నమస్కరించి తన కోర్కె వెల్లడించెను. తోడనే యాతడు
"ఇది శివుఁడు దక్షిణామూర్త్యవతారంబునఁ బండ్రెండేండ్ల వటుఁడై సమస్త
బ్రహ్మర్షి దేవర్షులకు బ్రహ్మోపదేశ మొనర్చిన పుణ్యక్షేత్రము. ఈ విషయము
చిదంబర నటన తంత్రమునఁ గలదు, సంపాదించి చూడుఁడు. బహు ప్రసిద్ధ
మైనది" అనివెడలిపోయెను. అంతఁ గవి దాని నెట్లో సంతరించి శ్రీ దక్షిణామూర్తి
స్వామికిఁ గృతిగ మూఁడాశ్వాసముల పద్యకావ్యమును వ్రాసెను. ఇందు కథాభాగ
మతిస్వల్పము. భక్తి స్తోత్రాదులు, వర్ణనలు విస్తారముగ వ్రాయఁబడెను.
ఈయన వేదాంతకవి. పరమ భక్తుఁడు, ఉభయభాషాభిజ్ఞుఁడు. శివపూజా
ధురంధరుఁడు. తపస్సంపన్నుడు. శిష్యపరంపరలో నీయన కిప్పటికి నారాధన
సాగుచున్నదని చెప్పుదురు. నరసింహకవి కొందఱు శిష్యులతో శ్రీ కోటీశ్వరుని
సన్నిధానమున నుండి కోవెల బాగుచేయించునప్పు డొకనాఁ డాయన ప్రాఁతకోటయ్య
గుడియొద్దఁ గల పానవట్టమును విష్ణు శిఖరమందున్న పాపవినాశనస్వామి గుడికి
తేఁదలంచి శిష్యులతోమ కూలివాండ్రతోమ ప్రయత్నించుచుండెనట. అచ్చటికొక
రెడ్డి వచ్చి 'మీరందఱకవైపున, నే నొక్కఁడ నొకవైపున నెత్తుకొని పోవుద'మని
వారినొప్పించి యెత్త నతనివైపు భారములేవ వారు తమ యసమర్థతకుఁ జింతించి
మఱునాఁటికి వాయిదా వేసిరి. ప్రక్షకుఁబోయి రెడ్డి మాయమయ్యెనఁటు ఎల్లరు నాఁటి
రాత్రి కోటీశ్వరాలయమున నిద్రించుచుండఁగా నర్ధరాత్రివేళ నరసింగయ్యగారు వెలు
పలికివచ్చి యెవరితోనో రహప్యాలాపము లాడుచుండుట పబ్బతి గురవయ్య యను
శిష్యుఁడెఱింగి లేచి మెల్లన బైటికేఁగి, యావలనున్న వ్యక్తిని గానక మఱలివచ్చి
వరుండి తెల్లవాఱినపిదప విషయమడుగఁగా గురులు "నాయనా! ఆదిదేవరహస్యము,
నీవెఱుఁగఁజాలవు. పానవట్టమును గుడియొద్దకుఁ జేర్చితినని యొక దివ్యపురుషుఁడు
చెప్పిపోయె" ననిరఁట. ఆ పిమ్మట నరసింగయ్యగారు తన కార్యక్రమమును
నెఱవేర్చుకొని ధన్యులయిరని చెప్పుదురు. ఈ చరిత్రమెంతయు ప్రశంసనీయము.
లోకమున మహాత్ములశక్తిని కొలుచుటకు సాధనములేదుగదా!!
''ఈ కవి యితర గ్రంథములు'' (1) మహాకవులెవ్వరుఁ దలపెట్టవీ సూత..
సంహిత నీ మహాకవి యాంధ్రీకరించెను. దీనిని కీ. శే. బ్ర. శ్రీ జానపాటి<noinclude><references/></noinclude>
o38cw9ql66d48v7fi51qookk8vrqaw4
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/14
104
133066
569557
405446
2026-08-10T00:14:40Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569557
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>{{Center|7}}
పట్టాభిరామశాస్త్రి గారు పరిష్కరించి ముద్రించిరి. (2) మల్హణసూక్తి సంగ్రహము.
(3) పుష్పరదోదిత స్తవము. (పుష్పదంతుని మహిమ్నస్తవము) (4) ప్రదోష
పూజామాహాత్మ్యము మొ. వి. ఇవి యలభ్యములు,
'''పురాణ కథావిధానము :'''
ప్రజలీ క్షేత్రస్వామినిగూర్చి వాడుకగఁ జెప్పుకొను కథను ముందు క్లుప్త
ముగఁ దెలిసికొని గ్రంథస్థ కథాభాగమును పిదపఁ దెలిసికొందము. కలియుగాదిని
కొందఱు జంగమయ్యలు శివధ్యాన తత్పరులై కాశికిఁబోవ సమకట్టి నడుమ నడుమ
మకాములు చేసికొనుచుఁ బోవుచుండిరఁట. ఈ త్రికూటాచలక్షేత్ర మిఁక పది
పదునైదుమైళ్ళ దూరములో నున్నదనఁగా నొక లింగధారి అపర శంకరుఁడన
నొప్పు నాతఁ డా గుంపునఁ గలిసి వారికి దివ్యబోధలు సేయుచు వెంటనంటెనఁట.
దానికి వారెల్ల రాశ్చర్యనిమగ్నులై యా సమీప గ్రామమునం దొక బసవని సంపా
దించి దానిపై నాతని గూర్చుండ నేర్పఱచి భజించుచు, మహిమలఁ జాటుచు
నీ క్షేత్రమునకు వచ్చిరఁట. వెంటనే యాజంగమయ్య వారితో 'భక్తులారా నే నీ
త్రికుటాచలమును వీడఁజాలను, చూచివత్తును. మీరిందేయుండుఁ'డని బసవనితో
గూడఁ బైకెక్కెనఁట. రెండుమూన్నాళ్ళకును వానిరాక గానక మిగిలినవారు తల
కొక దిక్కున కొండను ప్రాఁకి వెదుకఁగా వెదుకఁగా నొక్కచో నాతని రూపము
తళుక్కున మెఱపు మెఱసినట్లయి లింగమొకటి యబ్బురముగ గన్పించి, నాఁటి
రాత్రి వారి కొక యోగిరూపమున దర్శనమిచ్చి ధన్యులఁ జేసినట్లు చెప్పుదురు.
తదాదిగా దీనికి త్రికూటాచల క్షేత్రమనియు, లింగమునకు త్రికోటీశ్వరస్వామి
యవియు నామములేర్పడి భక్తులు తరించుచున్నట్లు చెప్పుదురు. అయ్యాదిలింగమే
రుద్రశిఖరమునఁగల ప్రాఁత కోటీశ్వరస్వామి యందురు.
'''గ్రంథస్థ కథావిధానము :'''
శ్రీ మహాదేవుఁడు పరాశక్తితో కైలాసమున నుండ పార్వతి శివుని గూర్చి
"దేవా ! నీవు దక్షిణామూర్త్యవతారమున వసించిన శ్రీమత్త్రికూటాచలము •
మహాత్మ్యమును విన్పింపు' మని వేఁడెను. అప్పుడు శివుఁడిట్లు చెప్పదొరఁకొనెను
'పూర్వము బ్రహ్మమానస పుత్త్రుఁడగు దక్షుఁడు మేరు పర్వతమున
శివునిగూర్చి గొప్ప తపమొనర్చి తత్ఫలితముగా ఆదిశక్తి కూతురును శివుఁ
డల్లుఁడును వగునట్లుగ వరముఁ బడసి, యట్లేకాఁగా వరగర్వంబునఁ గన్నుగాన<noinclude><references/></noinclude>
80r2z9wkhqhbirfl3ejs4o46nst2mxg
569608
569557
2026-08-10T10:44:59Z
Rajasekhar1961
50
569608
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{Center|7}}</noinclude>పట్టాభిరామశాస్త్రి గారు పరిష్కరించి ముద్రించిరి. (2) మల్హణసూక్తి సంగ్రహము.
(3) పుష్పరదోదిత స్తవము. (పుష్పదంతుని మహిమ్నస్తవము) (4) ప్రదోష
పూజామాహాత్మ్యము మొ. వి. ఇవి యలభ్యములు,
'''పురాణ కథావిధానము :'''
ప్రజలీ క్షేత్రస్వామినిగూర్చి వాడుకగఁ జెప్పుకొను కథను ముందు క్లుప్త
ముగఁ దెలిసికొని గ్రంథస్థ కథాభాగమును పిదపఁ దెలిసికొందము. కలియుగాదిని
కొందఱు జంగమయ్యలు శివధ్యాన తత్పరులై కాశికిఁబోవ సమకట్టి నడుమ నడుమ
మకాములు చేసికొనుచుఁ బోవుచుండిరఁట. ఈ త్రికూటాచలక్షేత్ర మిఁక పది
పదునైదుమైళ్ళ దూరములో నున్నదనఁగా నొక లింగధారి అపర శంకరుఁడన
నొప్పు నాతఁ డా గుంపునఁ గలిసి వారికి దివ్యబోధలు సేయుచు వెంటనంటెనఁట.
దానికి వారెల్ల రాశ్చర్యనిమగ్నులై యా సమీప గ్రామమునం దొక బసవని సంపా
దించి దానిపై నాతని గూర్చుండ నేర్పఱచి భజించుచు, మహిమలఁ జాటుచు
నీ క్షేత్రమునకు వచ్చిరఁట. వెంటనే యాజంగమయ్య వారితో 'భక్తులారా నే నీ
త్రికుటాచలమును వీడఁజాలను, చూచివత్తును. మీరిందేయుండుఁ'డని బసవనితో
గూడఁ బైకెక్కెనఁట. రెండుమూన్నాళ్ళకును వానిరాక గానక మిగిలినవారు తల
కొక దిక్కున కొండను ప్రాఁకి వెదుకఁగా వెదుకఁగా నొక్కచో నాతని రూపము
తళుక్కున మెఱపు మెఱసినట్లయి లింగమొకటి యబ్బురముగ గన్పించి, నాఁటి
రాత్రి వారి కొక యోగిరూపమున దర్శనమిచ్చి ధన్యులఁ జేసినట్లు చెప్పుదురు.
తదాదిగా దీనికి త్రికూటాచల క్షేత్రమనియు, లింగమునకు త్రికోటీశ్వరస్వామి
యవియు నామములేర్పడి భక్తులు తరించుచున్నట్లు చెప్పుదురు. అయ్యాదిలింగమే
రుద్రశిఖరమునఁగల ప్రాఁత కోటీశ్వరస్వామి యందురు.
'''గ్రంథస్థ కథావిధానము :'''
శ్రీ మహాదేవుఁడు పరాశక్తితో కైలాసమున నుండ పార్వతి శివుని గూర్చి
"దేవా ! నీవు దక్షిణామూర్త్యవతారమున వసించిన శ్రీమత్త్రికూటాచలము •
మహాత్మ్యమును విన్పింపు' మని వేఁడెను. అప్పుడు శివుఁడిట్లు చెప్పదొరఁకొనెను
'పూర్వము బ్రహ్మమానస పుత్త్రుఁడగు దక్షుఁడు మేరు పర్వతమున
శివునిగూర్చి గొప్ప తపమొనర్చి తత్ఫలితముగా ఆదిశక్తి కూతురును శివుఁ
డల్లుఁడును వగునట్లుగ వరముఁ బడసి, యట్లేకాఁగా వరగర్వంబునఁ గన్నుగాన<noinclude><references/></noinclude>
knbwu5rkvu01wtvzz876vigzw4r48aj
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/15
104
133072
569558
405453
2026-08-10T00:20:56Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569558
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>
కుండెను. శివుఁడు 'భిక్షుకుఁడు, శ్మశానవాసి, నీచుఁడు, గౌరవహీనుఁ’ డనియు,
తాము కైలాసమున కేఁగినప్పు డమర్యాద గావించెననియు పరమ శివద్వేషియై
వానిని బిలువకయే యజ్ఞమొకటి చేయ సంకల్పించి ప్రారంభించెను. బ్రహ్మాది
దేవతలు, మహర్ష్యాదులు వచ్చిరి. నారదుఁ డావార్త శివున కెఱింగింప సతి, పతి
వలదన్నను వినక గణపతితో నచ్చటికేఁగి స్వజనముచే నవమానితయై 'తండ్రీ :
నీ సంబంధమగు తనువు విడుతును. నీకనర్థకమగుఁగాక' యని కాలి బొటనవ్రేలి
గోట నేలరాయుచు యజ్ఞకుండమునఁబడి మాయమై పర్వతరాజునకుఁ గూతురై
పుట్టెను. శివుఁడు దానినంతను దివ్యదృష్టి నెఱిఁగి కోపించి చెమటనూడ్చి శిలపై
జల్లెను. తోడనే ప్రళయకాల రుద్రాకృతితో వీరభద్రుఁ డుద్భవించి తండ్రియానతిఁ
జని దక్షాధ్వరవాటమునఁ గలవారినెల్ల చిత్రవిచిత్రముగ హింసించి దక్షునిబట్టి
శిరము ఖండించి హోమమొనర్చి యజ్ఞధ్వంస మొనర్చెను. వెంటనే దక్షునిసతి
పతిభిక్షకోరి ప్రార్థించినఁ దలవంపులగునట్లు గొఱ్ఱెతలయుంచి బ్రతికించి వీర
భద్రుఁడు శివునిజేరెను. పిదవ శంకరుఁడు శాంతమూర్తియై తాను బండ్రెండేండ్ల
బాలుఁడుగ మాఱి బ్రహ్మచర్యమువ కైలాసంబున సప్తమావరణంబున సమాధి
నిష్ఠుఁడై యుండెను.
'''రుద్రశిఖరము :'''
అయ్యెడ సనకసనందవాది బ్రహ్మర్షి సంఘంబును , బ్రహ్మాది దేవతలును.
వాలఖిల్యాది యోగసిద్ధులు నా దక్షిణామూర్తిని జేరి మ్రొక్కి తమకు బ్రహ్మోప
దేశముఁ జేయ వేఁడిరి. ఆతఁ డందుల కంగీకరించి యెల్లరఁ దోడ్కొని చని
త్రికూటాద్రికి వచ్చి నిల్చెను. ఆ ప్రదేశమే ప్రాతకోటీశ్వరుని బోడు, రుద్ర
శిఖరము. అందు శివుఁడు బిల్వవనాంతరమున బ్రహ్మాసనాసీనుఁడై యోగనిష్ఠుఁడై
సర్వులకు మౌనముద్రచే బ్రహ్మోపదేశ మొనర్చెను. ఇయ్యది వటువగు
దక్షిణామూర్తిక్షేత్ర మగుటచే కల్యాణోత్సవమును, ధ్వజము నీ ప్రదేశమున లేవు.
'''విష్ణు శిఖరము :'''
రుద్ర శిఖరమునకుఁ బ్రక్కనున్న శిఖరమున విష్ణుదేవుఁడు శివుని గూర్చి
తపము సల్పి శివుని బ్రవన్నుని గా ఎంచుకొనేను. తోడనే దేవేంద్రాదు లచ్చటికి
వచ్చి తాము దక్షాధ్వరంబున హవిర్భక్షణము సలిపిన దోషంబు దొలఁగునట్లు. లింగ
రూపమున నందు నిత్యము దర్శనంబీయఁ బ్రార్థించిరి. శిపుఁ డప్పుడు చేతి త్రిశూ<noinclude><references/></noinclude>
6fedq3od67lz8ocw61v5uwbx5euoq8t
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/16
104
133073
569559
405455
2026-08-10T00:24:46Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569559
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>{{Center|9}}
లము నొక చట్రాతిపైఁ బొడిచెను. అచ్చట జల ముద్భవించెను. శివుఁడందు
లింగరూపమున వెలసెను. ఆతఁడు వారి కందు స్నాన మొనర్చి తన్నారాధించి
దోషవిముక్తులుకం డని చెప్పి మాయమయ్యెను. వారట్లొనర్చి ధన్యులయిరి. నాఁటి
నుండి యచ్చటి లింగమును పాపవినాశనేశ్వర లింగమనుట వాడుక. ప్రజలిందు
తొలుదొల్త స్నానమాచరించి శివుని సేవించుట ముఖ్యమని పురాణస్థ విషయము.
దీనినే గ్రద్దల బోడనియు, విష్ణుశిఖర మనియు నందురు.
'''బ్రహ్మశిఖరము :'''
రుద్ర శిఖరమునకుఁ గ్రిందుగా నైరృతిభాగమున బ్రహ్మ వసించి, జ్యోతి
ర్లింగ మచ్చట లేకుండుటకుఁ జింతించి శివునిఁ గూర్చి ఘోర తపస్సు చేసెను,
శివుఁడును బ్రత్యక్షమై బ్రహ్మకోర్కె చెల్లించుట కట్టులే వెలసెను. అదియే నేఁడు
సర్వులు పూజించు నూత్న కోటీశ్వరలింగము. ఈ లింగమును స్థల పురాణమున
వచ్చు సాలంకయ్య యను భక్తుఁడు ప్రతిష్ఠించినట్లు గలదు. ఇచ్చట శివుఁడు
తాండవము సల్పుచుండును. దీనికి ఉత్తరమున సమీపస్థ గ్రామము 'ఎల్లమంద'
లేక 'మునిమంద’, ఇందు మునులు గుంపుగా నివసించెడివారఁట. ఈ గ్రామ
సంబంధముచే నీ దేవునికి 'ఎల్లమంద కోటీశ్వరుఁ" డని వాడుక యైనది. ఇందలి
జ్యోతిర్లింగము లగోచరమైన కారణమున మనుష్యులు శిలాలింగముల నేర్పఱచి
పూజించుచుండిరి. వివరములు తెలియవు. ఇవి సురనర సేవ్యములై మోక్షప్రదము
లగుచున్నవి. ఈ గిరి స్థలమున నిప్పటికి నొక సిద్ధుఁ డదృశ్య రూపమునఁ తిరుగు
చుండునని చెప్పుచుందురు.
'''ఓంకార నది (ఓగేరు) :'''
దేహమునకు త్రికూట స్థానమందు ఓంకారము ప్రముఖమైనట్టు లీ
త్రికూటాద్రికి దక్షిణముగ ఓంకారనది పాఱుచున్నది. ఇందు తైర్థికులు స్నానమాడి
తీర్థశ్రాద్ధములొనర్చి దేవుని సేవించిన స్వర్గము కరతలామలకము.
పూర్వము శిబిచక్రవర్తి యను రాజు అగస్త్యోపదేశమున జగదేకదాతయై
ఆర్తరక్షణ బిరుదాంకితుఁడై యుండెను. అతని దానశీలమును పరీక్షించుటకై
ఇంద్రుఁడు శ్యేనమై, యగ్నిహోత్రునిఁ గపోతముగఁ జేసి వేటాడుచు వచ్చెను.
ఆకపోతము కిరాతరూపమున నున్న శివునిచేఁ బడి తప్పి శిబినిఁ జేరి శరణు
2<noinclude><references/></noinclude>
r0soyzk6lxygmf1a4r8mlg5ghriza2m
569609
569559
2026-08-10T10:46:17Z
Rajasekhar1961
50
569609
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{Center|9}}</noinclude>లము నొక చట్రాతిపైఁ బొడిచెను. అచ్చట జల ముద్భవించెను. శివుఁడందు
లింగరూపమున వెలసెను. ఆతఁడు వారి కందు స్నాన మొనర్చి తన్నారాధించి
దోషవిముక్తులుకం డని చెప్పి మాయమయ్యెను. వారట్లొనర్చి ధన్యులయిరి. నాఁటి
నుండి యచ్చటి లింగమును పాపవినాశనేశ్వర లింగమనుట వాడుక. ప్రజలిందు
తొలుదొల్త స్నానమాచరించి శివుని సేవించుట ముఖ్యమని పురాణస్థ విషయము.
దీనినే గ్రద్దల బోడనియు, విష్ణుశిఖర మనియు నందురు.
'''బ్రహ్మశిఖరము :'''
రుద్ర శిఖరమునకుఁ గ్రిందుగా నైరృతిభాగమున బ్రహ్మ వసించి, జ్యోతి
ర్లింగ మచ్చట లేకుండుటకుఁ జింతించి శివునిఁ గూర్చి ఘోర తపస్సు చేసెను,
శివుఁడును బ్రత్యక్షమై బ్రహ్మకోర్కె చెల్లించుట కట్టులే వెలసెను. అదియే నేఁడు
సర్వులు పూజించు నూత్న కోటీశ్వరలింగము. ఈ లింగమును స్థల పురాణమున
వచ్చు సాలంకయ్య యను భక్తుఁడు ప్రతిష్ఠించినట్లు గలదు. ఇచ్చట శివుఁడు
తాండవము సల్పుచుండును. దీనికి ఉత్తరమున సమీపస్థ గ్రామము 'ఎల్లమంద'
లేక 'మునిమంద’, ఇందు మునులు గుంపుగా నివసించెడివారఁట. ఈ గ్రామ
సంబంధముచే నీ దేవునికి 'ఎల్లమంద కోటీశ్వరుఁ" డని వాడుక యైనది. ఇందలి
జ్యోతిర్లింగము లగోచరమైన కారణమున మనుష్యులు శిలాలింగముల నేర్పఱచి
పూజించుచుండిరి. వివరములు తెలియవు. ఇవి సురనర సేవ్యములై మోక్షప్రదము
లగుచున్నవి. ఈ గిరి స్థలమున నిప్పటికి నొక సిద్ధుఁ డదృశ్య రూపమునఁ తిరుగు
చుండునని చెప్పుచుందురు.
'''ఓంకార నది (ఓగేరు) :'''
దేహమునకు త్రికూట స్థానమందు ఓంకారము ప్రముఖమైనట్టు లీ
త్రికూటాద్రికి దక్షిణముగ ఓంకారనది పాఱుచున్నది. ఇందు తైర్థికులు స్నానమాడి
తీర్థశ్రాద్ధములొనర్చి దేవుని సేవించిన స్వర్గము కరతలామలకము.
పూర్వము శిబిచక్రవర్తి యను రాజు అగస్త్యోపదేశమున జగదేకదాతయై
ఆర్తరక్షణ బిరుదాంకితుఁడై యుండెను. అతని దానశీలమును పరీక్షించుటకై
ఇంద్రుఁడు శ్యేనమై, యగ్నిహోత్రునిఁ గపోతముగఁ జేసి వేటాడుచు వచ్చెను.
ఆకపోతము కిరాతరూపమున నున్న శివునిచేఁ బడి తప్పి శిబినిఁ జేరి శరణు<noinclude><references/></noinclude>
o38mtkca388wfb4mdn2yc3nkx4mtvox
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/17
104
133074
569560
405456
2026-08-10T00:30:08Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569560
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{Center|10}}</noinclude>
వేఁడెను. కిరాతుఁడు పక్షి నిమ్మనెను. శిబి "నా శరీరము నుండి దాని యెత్తు
మాంసమైన విత్తుఁగాని పక్షి నీయననెను. ఎట్టకేలకు కిరాతు డందుల కొప్పుకొనఁగా
రాజు పక్షిని త్రాసున నుంచి దానియెత్తు మాంసము తన దేహమునుండి తఱిగి
రెండవ వైపునఁ బెట్టసాగెను. ఎంతకును లాభములేక తలయందలి మెదడు నౌక
వైపు గోసిపెట్టిన నదియు నిష్ఫలమయ్యెను, రెండవ వైపునఁ గోయఁబోవ శివుఁడు
మెచ్చి ప్రత్యక్షమై రాజు నతని కోరికపై తనయం దైక్యముగావించుకొనెను.
అంత శిబిచక్రవర్తి లింగరూపమై కపోతేశ్వరుఁడను పేర వెలసెను. ఇది
గుంటూరు జిల్లా - నర్సరావుపేట తాలూకాలోని చేజర్ల గ్రామమునఁ గలదు. దీవినే
దక్షిణకాశి యందురు. దేవాదులెల్ల నా లింగము నోంకారశబ్దమున నభిషేకించిన
జలము భూగతమై లింగము క్రిందుగ వెల్వడి ఓంకార నది యన నొప్పేను.
'''సాలంకయ్య :'''
ఈ సాలంకయ్య కాలము తెలియదు. ఈతఁడు త్రికూటాద్రికి నుత్తరమునఁ
గల ఎల్లమంద గ్రామమున లింగబలిజ కులమున నుద్భవించేను. ఈతఁడు గొప్ప
శివభక్తుఁడు. ఇతనికి నల్గురు తమ్ములుండిరి. వారితో నీతఁ డడవికేఁగి కట్టెలేఱి
యమ్ముకొని జీవించుచు, జంగమార్చన సేయుచుండెను.
ఆతఁడు రుద్రశిఖరమునఁ గల లింగము నర్చించి, యమిత ధనము నార్జిం
చుచు, నిత్యము దాని నేమరక మెలఁగుచుండెను. తమ్ములతో నొకనాఁ డతఁడు
పూలు తేర విష్ణుశిఖరమున కేఁగెను. అపుడు విపరీతమగు వర్షము గురిసెను.
ఆ ధాటికి వారొక గుహఁ జేరియును ప్రాణములు నిలుపుకొనఁజాలక కోటీశ్వరుని
శరణుజొచ్చిరి. కొంతవడికి వాన వెలిపెను. వారు శివుని దలంచుచు త్రోవఁబట్టి
నడువ సెలయేటిచే భిన్నమైన యొక తిన్నెయందు ధనపుబిందె లభించెను.
సాలంకయ్య దానిని శివప్రసాదమని గ్రహించి, స్వామి నారాధించి యింటికిఁ జని.
సమస్త వైభవోపేతుఁడై జంగమారాధన వీడక కాలముఁ బుచ్చుచుండెను.
సాలంకయ్య యొక్కతఱి రుద్రశిఖరమునఁ బూజ గావింపుచుండ నక్కడ
నొక జంగమయ్య ప్రత్యక్షమయ్యెను. అతఁడు వానివి పరశివునిగా మనోవాక్కాయ
కర్మములఁ బూజించి తనయింటికి వచ్చి ధన్యుఁ జేయఁగోరెను. అతడు వల్లెయని
యింటికివచ్చి భక్తుఁడిచ్చు వేఱుపదార్థము లొల్లక క్షీరమాత్రాహారుఁడై కొన్నాళ్ళుండి
యుండి యొక్కనాడు మాయమయ్యెను. సాలంకుఁడాతని నిందునందు వెదకి
వేసారి విరాహారుఁడై యుండెను.<noinclude><references/></noinclude>
9ag8mmhnwc6pntzvlm8f3zok0i2q4xx
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/18
104
133075
569561
405457
2026-08-10T00:52:45Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569561
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{Center|11 }}</noinclude>'''ఆనందవల్లి (గొల్లభామ) కథ :'''
ఇట్లుండ నీ కొండకు దక్షిణమున ‘కొండకాపూ'రను గ్రామమున
‘సునందుఁ‘డను యాదవుఁడొకఁడుండెను. అతనిభార్య 'కుందరి', ఆమె ఆనందవల్లి'
యను పుత్త్రికంబడసి యఖిల భోగభాగ్యములఁ దులఁదూఁగుచుండెను. ఆ బాలిక
దినదిన ప్రవర్ధమాన యగుచు సర్వకాల సర్వావస్థలయందును 'శివార్పణబుద్ధితో
సమస్త వ్రతదానము లొనర్చుచు విభూతి రుద్రాక్షలు దాల్చి చెలులతోఁ గొండనెక్కి
శ్రీ కోటీశు నర్చించి వచ్చుచుండెను. తల్లిదండ్రులా బాలిక నట్లుండవలదని
వారించిరి. ఎంత చెప్పిన నామె వినక వారికిఁ దగు వైరాగ్యబోధలొనర్చి తల్లి
దండ్రులఁ గూడ శివభక్తులుగ మార్చివైచెను. ఒక్కనాఁ డా బాలిక శివరాత్య్రుత్స
వమున కేఁగి ఓంకారనదిని స్నానమాడి రుద్రశిఖరమున బిల్వవనాంతరమున
దక్షిణామూర్తి స్వరూపముననున్న శ్రీ (పాత) కోటీశ్వరుని బూజించి, యించు
కంత సేపు నిమీలిత నేత్రయై తిరిగి కన్నులు విచ్చినంతనే వెనుక సాలంకయ్యకు
గన్పట్టి విందారగించిన జంగమయ్యరూపున నొక దివ్యపురుషుఁడు సాక్షాత్క
రించెను. ఆనందవల్లి నిత్య మాతనికా పాపవినాశన ద్రోణీకనుండి తీర్థము రుద్ర
శిఖరమునకుఁ దెచ్చి యభిషేకించి క్షీరములొసంగి, తద్భుక్తశేషమును దాను
భుజించుచు కాలముఁ గడపుచుండెను.
సాలంకయ్య కీ వృత్తాంతము తెలిసి వచ్చి యామెకుఁ గన్పట్టి పూజగొను
జంగమయ్యకుఁ దన్నెఱింగింపఁ బ్రార్థించి నిత్య మామెకడకు వచ్చుచుఁ బోవు
చుండెను. జంగమమూర్తి మౌనముద్ర దాల్చియుండుటవలనఁ గాఁబోలు నామెకు
సమయము పొనుపడదయ్యెను. అంతలో గ్రీష్మర్తువు వచ్చెను. అప్పటికి నామె
నిత్యనైమిత్తికాదిక్రియలలో లోప మేమాత్రము రానీక యాతని నర్చించుచుండెను.
ఒక్కనాఁ డామె తీర్థఘటమును దెచ్చి వానికి సమీపమున డించి, మఱచివచ్చిన
బిల్వదళములకై పోఁవ నొకకాకి యాఘటముపై వ్రాలెను. కుండ బోర్లబడి
నీరము నేలపాలయ్యెను. దాని కా ముగుద చింతిల్లి నేఁడు మొదలు వాయసములిటకు
రాకుండుఁగాక' యని శపించెను. ఇయ్యది నేఁటికిని నిదర్శనమని యందురు.
దీనినెల్లఁ జూచుచున్న జంగమయ్య 'ఆనందపల్లీ: బాలికవు. ఇంటనుండక
నీవిట్లు శ్రమపడిన మావల్ల నీకు రాఁదగు సుఖము లేమి? నిష్ప్రయోజనము,
ఇంటికేగుము' అనియెను. ఆమెయు దానికొల్లక యెప్పటియట్ల సేవింపుచుండెను.
అంత నా దివ్యపురుషుఁడు జ్ఞానోపదేశమున నామె తన పూజ మానునవి
యెంచి యట్లొనర్ప , నా బాల మిగుల భక్తి కలిగి వర్తింపుచుండెను. మఱియు<noinclude><references/></noinclude>
bbky11as2lm9vxl90y7a7yedp5293x9
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/19
104
133076
569562
405458
2026-08-10T00:56:35Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569562
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{Center|12}}</noinclude>
నామె 'స్వామీ! మీరు దైవస్వరూపులు. అందుపై గురువులరు. వీడిన గురు
ద్రోహ మగు' నని చెప్పుచు నిత్యార్చన మానకుండెను. అందుల కా సిద్ధపురుషుఁ
డామె పడు శ్రమలనుండి తప్పింపఁ దలఁచి, ఒకనాఁడు తన యోగమాయచే
నస్థలిత బ్రహ్మచారిణి యగు నామెకు మాయా గర్భమును గల్పించెను. నవమాస
మలు వచ్చి గర్భభరాలస యయ్యెము. అష్టకష్టముల కోర్చి యామె నిత్యవ్రత
ముఘు మానకుండెను, దాని కా యోగపురుషుఁడు సంభ్రమాశ్చర్యములంది, 'తల్లీ :
నీవింత శ్రమపడి యిచ్చటికి రానేల? నేనే నీ యింటికి వచ్చెదను. నీ వ్రత
మచ్చటనే నెఱవేర్చుకొమము. కాని నీవు వెనుదిరిగి చూడకుండఁ బొమ్ము. చూచి
తివో నే నందే నిలచెదను' అని చెప్పి యొప్పించి ముందు గొల్లభామయు
వెనుక ప్రళయధ్వనులు మ్రోఁగుచుండఁ దానును రుద్రశిఖరమునుండి బ్రహ్మ
శిఖరముదాఁక రాగా, నామె యా ఘోరధ్వనుల కోర్వలేక వెనుదిరిగి చూడఁగా
నాతఁ డందేయుండి 'అబలా ఇంక నేనిందే సమాధినిష్ఠఁ జెందెదను. వ్రత
భంగమైనది' అని యా శిఖరమునఁ గల బిలముఁ జొచ్చెను అదియే నేటి నూత్న
కోటీశ్వరాలయ స్థలము, గొల్లభామయు నందేయుండి యచటఁ బ్రసవించి కుమా
రుని గవి, వ్రతభంగమునకుఁ గుమిలి యందే ప్రాయోపవేశ మొనర్ప నెంచి
మౌనముద్రం దాల్చి, యోగమూని కనులు దెఱచునంతలో ప్రక్కనున్న కుమారుఁ
డదృశ్యుఁ డయ్యెను. వెంటనే యామె యదియంతయు దివ్యపురుషుని మహిమగాఁ
దలంచి జన్మము ధవ్యమయ్యెనవి యెంచి యచ్చటనే సమాధిఁ బూని శివైక్యముం
జెందెను.
'''సాలంకయ్య చివరి కథ :'''
ఇచ్చట సాలంకయ్యయు విత్యము గొల్లభామ యోగికితన చరిత్రము విన్పిం
చుట కవకాశము కలుగలేదని చెప్పుచు నుండియుండి నేఁడు గొల్లభామ కూడ
కన్పింపమికి వేచివేచి వెదకుచు బ్రహ్మశిఖరమున నున్న గుహకడకు రాఁగా
నందున్న దివ్యపురుషుఁడు 'నేను నీ యింట విందారగించినవాఁడను, శివుఁడను,
గొల్లభామకువ్రత సమాప్తి జేసితిని. ఆమె శివైక్యానుసంధానముఁ జెందెను. నేనిందే
యుందును. దీనిపై దేవళ మొండు గట్టించి త్రికోటీశ్వర లింగమును బ్రతిష్ఠించి
పూజింపుము. ఉత్సవ దినమున ఓంకార నదీస్నానము జేవి, నన్నభిషేకించి,
ఉపవాస జాగరణాదు లొనర్చి, ప్రభలు గట్టించి, వీరాంగాది వాద్యముల నన్నల
రించి మఱునాఁ డన్నదాన మొనర్పుము. గొల్లభామ నా భక్తురాలు, త్రోవలో<noinclude><references/></noinclude>
sugaqutxxb9dnmhwm9tda66x9pdvhnh
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/20
104
133163
569563
405609
2026-08-10T01:01:08Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569563
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{Center|13 }}</noinclude>
నామెను దర్శించిన పిదప ప్రజలు నన్ను దర్శించున ట్లచ్చట గుడి గట్టించి
విగ్రహమును బ్రతిష్ఠింపు' మని యానతిచ్చి, సాలంకయ్య కోరికపై శివైక్యాను
సంధాన స్థితి నుపదేశించి మాయమయ్యెను.
అంత సాలంకయ్య భగవదాజ్ఞ కతిశయముగఁ గోవెలలు నిర్మించి యుత్స
వాదుల జేయుచు కాలముఁ బుచ్చుచుండెను. అచ్చట స్వామికి కల్యాణోత్సవము
లేకునికి చింతిల్లి శివునకుఁ బడమర నొక కోవెల గట్టి పార్వతిని బ్రతిష్ఠింపఁ
బూనఁగనే ఆకాశవాణి "ఈ స్థలము బ్రహ్మచారి యగు దక్షిణామూర్తి క్షేత్రము.
ఇందు కల్యాణము నెఱపఁదగ" దని చెప్పెను. అయిన నాతడు తన వాంఛాప్రాబల్య
వశమునఁ బ్రతిష్ఠింపఁగావిగ్రహము మాయమయ్యెను. వెంటనే సాలంకయ్య విరక్తి
గలిగి శివసాయుజ్యముం బొందెను. తమ్ములు ముగ్గురు నందే శివైక్యమందిరి.
వానినే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర లింగములని యందురు, సాలంకుఁడు సాలం
కేశ్వరుఁడను పేరను, తత్ప్రతిష్ఠిత లింగము త్రికోటీశ్వరుఁడను పేరను వెలసిరి,
కావున దీనిని పంచబ్రహ్మస్థానమని యనిరి. సమస్త దేవత లిందు జరుగు
నిత్యోత్సవ మాసోత్సవ వర్షోత్సవములందుఁ బాల్గొందురని స్థలపురాణమునఁ
గలదు.
'''త్రికూటాచల మాహాత్మ్యము - ప్రచురణ కృషి :'''
ఏతత్సుశ్రావ్య కథా మధుర పదబంధ బంధురమగు నీ గ్రంథ మొకటి
బహు శిథిలావస్థలో నా ప్రాణమిత్రులు కీ. శే. మద్దులపల్లి గురుబ్రహ్మశర్మగారి
యొద్ద కెట్లో చేరినది. దానిని వారు భద్రముగ దాఁచియుంచి తదాధారముగ
తెలుఁగువచనమున 1939 లో 'శ్రీ త్రికోటీశ్వర చరిత్రము' అను గ్రంథమును
పెక్కు విషయములతో వ్రాసి ప్రచురించిరి. వీరికిఁ బూర్వ కవులనిన మహా
ప్రేమ. అప్పుడప్పుడు మూలములో కొన్ని పద్యములను జదివి వినిపించుచుఁ
గడు నివ్వెఱపడుచుఁ గవి బుద్ధి కుశలతకు జోహారు లిచ్చుచుండెడివారు.
అప్పటికే యా పద్యములు కొన్ని యాద్యంతములు లేక, ఉన్నవానిలో ప్రత్యయ
లోపమో, పదలోపమో, ఛందోలోపమో. భావలోపమో యేదో యొకటి గన్నట్టు
చుండెడిది. అప్పుడప్పుడు మాటల సందర్భమున "నా కీ వయసున బుద్ధి పని
చేయుటలేదు. దీనిని మీరు తీసికొనిపోయి పరిష్కరించి యేనాటికైన నచ్చు
వేయింపుఁడు. లేదేని నావలె మీరుకూడ దాఁచియుంచుఁ"డని చెప్పుచువచ్చి, యొక
నాఁడు దానిని వారు నాకొసంగిరి. ఆపిమ్మట కొద్దిరోజులకే వారు దివంగతులైరి.<noinclude><references/></noinclude>
k2oz1akk9jdmbusoxc20yax4urg2mrb
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/21
104
133164
569564
405610
2026-08-10T01:04:01Z
Ramesam54
3001
569564
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="GGK1960" /></noinclude>{{Center|14}}
నేనును పది పండ్రెండేండ్లు దాని ప్రస్తావనయేలేక యొకసారి వేసవి సెలవులలో
జూడ నారంభించి యున్నంతవఱకు జాగ్రత్తగా నొక 'కాపీని’ వ్రాసి దానిలో
సవరణల కారంభించి యెట్లో సంవత్సరమున్నఱ కొక పద్ధతిలోనికిఁ దెచ్చితివి.
ఒకనాఁడు దానిని మహానందముతోఁగొని నా కాశ్రయులైన నర్సరావుపేట జమీం
చారు మ. రా. రా. శ్రీ మల్రాజు వేంకట రామకృష్ణ కొండల్రావు బహద్దరు
గారిని సమీపించి, గ్రంథ విషయము సర్వమును నివేదించి యెట్లయిన నచ్చొ
త్తింపఁగోరి కొంతభాగము చదివి విన్పించితిని. అప్పుడు వారా పాఁ తప్రతిని,
క్రొత్తప్రతిని జూచి సంతసించి 'మీరింతశ్రమ యెట్లు పడితిరో' యనుచు, ఎండో
మెంటు బోర్డువారికి సిఫార్సుచేసి కోటప్పకొండకు సంబంధించిన 'ఫండ్పు' నుండి
మీకు వలసినంత ద్రవ్య మిప్పింతుమని వాగ్దానముచేసి నాదగ్గర నప్పుడప్పుడు
5, 6 అప్లికేషనులు తీసికొనిరి. కాని యెన్నాళ్ల కది యొక స్వరూపమునకు
రాదయ్యెను. దాని కింకను మంచిరోజు రాలేదని తలంచితిని. పిమ్మట శిష్యుల
నాశ్రయించినఁ గొదువయుండదను వెనుకటి మర్యాదతోఁ గొందఱి వెంటఁబడి
మోసపడితిని. 'కాలాయ నమః' అనుకొంటిని. కొంతకాలము వితగ
కడచిన కాలమునకు విలువగట్టి భగవంతునిపై భారముంచి
యొకనాడు నరసరావుపేట మునిసిపల్ చైర్మన్ చిరంజీవి శ్రీ కొత్తూరి
వెంకటేశ్వర్లను సమీపించి, పూర్వగాథ వివేదించి సాయము చేయఁగోరితిని,
వెంటనే యాతఁడు__‘ వినయమతితో" "మన మిత్రులు పెక్కుమంది కలరు. మీ
కోరిక తీర్తును. మీరు కించపడవల" దనెను. పూర్వకవుల గ్రంథములను పైకిఁ
దెచ్చు నా యభిలాష యాతని సాదరవాక్యమున వర్ధిల్లి శ్రీ త్రికోటీశ్వరుని యను
గ్రహము లోకమునకే కల్గినట్లు పొంగిపోయితిని. 'శుభమస్తు' అని వెడలితివి.
ఆతఁడే ఒక నాఁడు నన్ను బిలిపించి నాకుఁ దెలియకుండఁగ నాతఁడు వేయించిన
చందాదారుల పట్టిక నిచ్చి 'ఇంతవఱకయినది. మిగిలినది నాలుగైదు రోజులు తిరిగి
పూర్తిచేయుదము' ఆనెను. నేనప్పు దాతని యుత్సాహమునకును, కార్యదీక్షకును,
పరోపకారపరాయణత్వమునకును, గుండె దిటవునకును, గురుభక్తికిని, వృద్ధోప
సేవకు నబ్బురపడి, నా మిత్రులతో నతని గుణములను గొండాడితిని. చిన్నతనము
లోనే వానిని పురపాలక సంఘాధ్యక్ష పదవి వలచి వలపించినదమటలో నాతని
లోని సుగుణములే నిదానమవి యా నాఁడు తలంచితిని. ప్రజలు- అందును
శత్రువులై నవారు గూడ నాతని పరిపాలనా విధానములో వ్రేలుపెట్టి లోపమును
చూపించినవారు లేకుండునట్లు పాలనకుఁగడంగి యచిరకాలముననే యాతఁడు పేరు
గడచెను.<noinclude><references/></noinclude>
675za6whr0wwc8m22y9b6b43otb1qdc
569566
569564
2026-08-10T01:29:48Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569566
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>{{Center|14}}
నేనును పది పండ్రెండేండ్లు దాని ప్రస్తావనయేలేక యొకసారి వేసవి సెలవులలో
జూడ నారంభించి యున్నంతవఱకు జాగ్రత్తగా నొక 'కాపీని’ వ్రాసి దానిలో
సవరణల కారంభించి యెట్లో సంవత్సరమున్నఱ కొక పద్ధతిలోనికిఁ దెచ్చితివి.
ఒకనాఁడు దానిని మహానందముతోఁగొని నా కాశ్రయులైన నర్సరావుపేట జమీం
చారు మ. రా. రా. శ్రీ మల్రాజు వేంకట రామకృష్ణ కొండల్రావు బహద్దరు
గారిని సమీపించి, గ్రంథ విషయము సర్వమును నివేదించి యెట్లయిన నచ్చొ
త్తింపఁగోరి కొంతభాగము చదివి విన్పించితిని. అప్పుడు వారా పాఁ తప్రతిని,
క్రొత్తప్రతిని జూచి సంతసించి 'మీరింతశ్రమ యెట్లు పడితిరో' యనుచు, ఎండో
మెంటు బోర్డువారికి సిఫార్సుచేసి కోటప్పకొండకు సంబంధించిన 'ఫండ్పు' నుండి
మీకు వలసినంత ద్రవ్య మిప్పింతుమని వాగ్దానముచేసి నాదగ్గర నప్పుడప్పుడు
5, 6 అప్లికేషనులు తీసికొనిరి. కాని యెన్నాళ్ల కది యొక స్వరూపమునకు
రాదయ్యెను. దాని కింకను మంచిరోజు రాలేదని తలంచితిని. పిమ్మట శిష్యుల
నాశ్రయించినఁ గొదువయుండదను వెనుకటి మర్యాదతోఁ గొందఱి వెంటఁబడి
మోసపడితిని. 'కాలాయ నమః' అనుకొంటిని. కొంతకాలము వితగ
కడచిన కాలమునకు విలువగట్టి భగవంతునిపై భారముంచి
యొకనాడు నరసరావుపేట మునిసిపల్ చైర్మన్ చిరంజీవి శ్రీ కొత్తూరి
వెంకటేశ్వర్లను సమీపించి, పూర్వగాథ నివేదించి సాయము చేయఁగోరితిని,
వెంటనే యాతఁడు__‘ వినయమతితో" "మన మిత్రులు పెక్కుమంది కలరు. మీ
కోరిక తీర్తును. మీరు కించపడవల" దనెను. పూర్వకవుల గ్రంథములను పైకిఁ
దెచ్చు నా యభిలాష యాతని సాదరవాక్యమున వర్ధిల్లి శ్రీ త్రికోటీశ్వరుని యను
గ్రహము లోకమునకే కల్గినట్లు పొంగిపోయితిని. 'శుభమస్తు' అని వెడలితివి.
ఆతఁడే ఒక నాఁడు నన్ను బిలిపించి నాకుఁ దెలియకుండఁగ నాతఁడు వేయించిన
చందాదారుల పట్టిక నిచ్చి 'ఇంతవఱకయినది. మిగిలినది నాలుగైదు రోజులు తిరిగి
పూర్తిచేయుదము' ఆనెను. నేనప్పు దాతని యుత్సాహమునకును, కార్యదీక్షకును,
పరోపకారపరాయణత్వమునకును, గుండె దిటవునకును, గురుభక్తికిని, వృద్ధోప
సేవకు నబ్బురపడి, నా మిత్రులతో నతని గుణములను గొండాడితిని. చిన్నతనము
లోనే వానిని పురపాలక సంఘాధ్యక్ష పదవి వలచి వలపించినదనుటలో నాతని
లోని సుగుణములే నిదానమవి యా నాఁడు తలంచితిని. ప్రజలు- అందును
శత్రువులైనవారు గూడ నాతని పరిపాలనా విధానములో వ్రేలుపెట్టి లోపమును
చూపించినవారు లేకుండునట్లు పాలనకుఁగడంగి యచిరకాలముననే యాతఁడు పేరు
గడచెను.<noinclude><references/></noinclude>
g309exrtykgrr9henvkj45ofatxshu8
569567
569566
2026-08-10T01:32:21Z
Ramesam54
3001
569567
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>{{Center|14}}
నేనును పది పండ్రెండేండ్లు దాని ప్రస్తావనయేలేక యొకసారి వేసవి సెలవులలో
జూడ నారంభించి యున్నంతవఱకు జాగ్రత్తగా నొక 'కాపీని’ వ్రాసి దానిలో
సవరణల కారంభించి యెట్లో సంవత్సరమున్నఱ కొక పద్ధతిలోనికిఁ దెచ్చితివి.
ఒకనాఁడు దానిని మహానందముతోఁగొని నా కాశ్రయులైన నర్సరావుపేట జమీం
చారు మ. రా. రా. శ్రీ మల్రాజు వేంకట రామకృష్ణ కొండల్రావు బహద్దరు
గారిని సమీపించి, గ్రంథ విషయము సర్వమును నివేదించి యెట్లయిన నచ్చొ
త్తింపఁగోరి కొంతభాగము చదివి విన్పించితిని. అప్పుడు వారా పాఁ తప్రతిని,
క్రొత్తప్రతిని జూచి సంతసించి 'మీరింతశ్రమ యెట్లు పడితిరో' యనుచు, ఎండో
మెంటు బోర్డువారికి సిఫార్సుచేసి కోటప్పకొండకు సంబంధించిన 'ఫండ్పు' నుండి
మీకు వలసినంత ద్రవ్య మిప్పింతుమని వాగ్దానముచేసి నాదగ్గర నప్పుడప్పుడు
5, 6 అప్లికేషనులు తీసికొనిరి. కాని యెన్నాళ్ల కది యొక స్వరూపమునకు
రాదయ్యెను. దాని కింకను మంచిరోజు రాలేదని తలంచితిని. పిమ్మట శిష్యుల
నాశ్రయించినఁ గొదువయుండదను వెనుకటి మర్యాదతోఁ గొందఱి వెంటఁబడి
మోసపడితిని. 'కాలాయ నమః' అనుకొంటిని. కొంతకాలము వితగ
కడచిన కాలమునకు విలువగట్టి భగవంతునిపై భారముంచి
యొకనాడు నరసరావుపేట మునిసిపల్ చైర్మన్ చిరంజీవి శ్రీ కొత్తూరి
వెంకటేశ్వర్లను సమీపించి, పూర్వగాథ నివేదించి సాయము చేయఁగోరితిని,
వెంటనే యాతఁడు__‘ వినయమతితో" "మన మిత్రులు పెక్కుమంది కలరు. మీ
కోరిక తీర్తును. మీరు కించపడవల" దనెను. పూర్వకవుల గ్రంథములను పైకిఁ
దెచ్చు నా యభిలాష యాతని సాదరవాక్యమున వర్ధిల్లి శ్రీ త్రికోటీశ్వరుని యను
గ్రహము లోకమునకే కల్గినట్లు పొంగిపోయితిని. 'శుభమస్తు' అని వెడలితివి.
ఆతఁడే ఒక నాఁడు నన్ను బిలిపించి నాకుఁ దెలియకుండఁగ నాతఁడు వేయించిన
చందాదారుల పట్టిక నిచ్చి 'ఇంతవఱకయినది. మిగిలినది నాలుగైదు రోజులు తిరిగి
పూర్తిచేయుదము' ఆనెను. నేనప్పు దాతని యుత్సాహమునకును, కార్యదీక్షకును,
పరోపకారపరాయణత్వమునకును, గుండె దిటవునకును, గురుభక్తికిని, వృద్ధోప
సేవకు నబ్బురపడి, నా మిత్రులతో నతని గుణములను గొండాడితిని. చిన్నతనము
లోనే వానిని పురపాలక సంఘాధ్యక్ష పదవి వలచి వలపించినదనుటలో నాతని
లోని సుగుణములే నిదానమవి యా నాఁడు తలంచితిని. ప్రజలు- అందును
శత్రువులైనవారు గూడ నాతని పరిపాలనా విధానములో వ్రేలుపెట్టి లోపమును
చూపించినవారు లేకుండునట్లు పాలనకుఁగడంగి యచిరకాలముననే యాతఁడు పేరు<noinclude><references/></noinclude>
r8foafkbe5oejcrlfs15qfi277sii7r
569612
569567
2026-08-10T10:49:04Z
Rajasekhar1961
50
569612
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{Center|14}}</noinclude>నేనును పది పండ్రెండేండ్లు దాని ప్రస్తావనయేలేక యొకసారి వేసవి సెలవులలో
జూడ నారంభించి యున్నంతవఱకు జాగ్రత్తగా నొక 'కాపీని’ వ్రాసి దానిలో
సవరణల కారంభించి యెట్లో సంవత్సరమున్నఱ కొక పద్ధతిలోనికిఁ దెచ్చితివి.
ఒకనాఁడు దానిని మహానందముతోఁగొని నా కాశ్రయులైన నర్సరావుపేట జమీం
చారు మ. రా. రా. శ్రీ మల్రాజు వేంకట రామకృష్ణ కొండల్రావు బహద్దరు
గారిని సమీపించి, గ్రంథ విషయము సర్వమును నివేదించి యెట్లయిన నచ్చొ
త్తింపఁగోరి కొంతభాగము చదివి విన్పించితిని. అప్పుడు వారా పాఁ తప్రతిని,
క్రొత్తప్రతిని జూచి సంతసించి 'మీరింతశ్రమ యెట్లు పడితిరో' యనుచు, ఎండో
మెంటు బోర్డువారికి సిఫార్సుచేసి కోటప్పకొండకు సంబంధించిన 'ఫండ్పు' నుండి
మీకు వలసినంత ద్రవ్య మిప్పింతుమని వాగ్దానముచేసి నాదగ్గర నప్పుడప్పుడు
5, 6 అప్లికేషనులు తీసికొనిరి. కాని యెన్నాళ్ల కది యొక స్వరూపమునకు
రాదయ్యెను. దాని కింకను మంచిరోజు రాలేదని తలంచితిని. పిమ్మట శిష్యుల
నాశ్రయించినఁ గొదువయుండదను వెనుకటి మర్యాదతోఁ గొందఱి వెంటఁబడి
మోసపడితిని. 'కాలాయ నమః' అనుకొంటిని. కొంతకాలము వితగ
కడచిన కాలమునకు విలువగట్టి భగవంతునిపై భారముంచి
యొకనాడు నరసరావుపేట మునిసిపల్ చైర్మన్ చిరంజీవి శ్రీ కొత్తూరి
వెంకటేశ్వర్లను సమీపించి, పూర్వగాథ నివేదించి సాయము చేయఁగోరితిని,
వెంటనే యాతఁడు__‘ వినయమతితో" "మన మిత్రులు పెక్కుమంది కలరు. మీ
కోరిక తీర్తును. మీరు కించపడవల" దనెను. పూర్వకవుల గ్రంథములను పైకిఁ
దెచ్చు నా యభిలాష యాతని సాదరవాక్యమున వర్ధిల్లి శ్రీ త్రికోటీశ్వరుని యను
గ్రహము లోకమునకే కల్గినట్లు పొంగిపోయితిని. 'శుభమస్తు' అని వెడలితివి.
ఆతఁడే ఒక నాఁడు నన్ను బిలిపించి నాకుఁ దెలియకుండఁగ నాతఁడు వేయించిన
చందాదారుల పట్టిక నిచ్చి 'ఇంతవఱకయినది. మిగిలినది నాలుగైదు రోజులు తిరిగి
పూర్తిచేయుదము' ఆనెను. నేనప్పు దాతని యుత్సాహమునకును, కార్యదీక్షకును,
పరోపకారపరాయణత్వమునకును, గుండె దిటవునకును, గురుభక్తికిని, వృద్ధోప
సేవకు నబ్బురపడి, నా మిత్రులతో నతని గుణములను గొండాడితిని. చిన్నతనము
లోనే వానిని పురపాలక సంఘాధ్యక్ష పదవి వలచి వలపించినదనుటలో నాతని
లోని సుగుణములే నిదానమవి యా నాఁడు తలంచితిని. ప్రజలు- అందును
శత్రువులైనవారు గూడ నాతని పరిపాలనా విధానములో వ్రేలుపెట్టి లోపమును
చూపించినవారు లేకుండునట్లు పాలనకుఁగడంగి యచిరకాలముననే యాతఁడు పేరు<noinclude><references/></noinclude>
ity71g06n6omje51ecfxd3csgo5wi4s
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/22
104
133165
569568
405611
2026-08-10T01:45:44Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569568
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{Center|15}}</noinclude>
ప్రతిష్ఠలు గడించుట యెంతయుఁ బ్రశంసనీయము. నేనాతని శిష్యత్వము నేనాఁడో
మఱచితివి. కాని గురుత్వముమాత్ర మాతఁడు విస్మరించినవాఁడు కాఁడు. ఇంతకుఁ
బరమేశ్వరుని యనుగ్రహ మీ విధమునఁ దోడయినది. నాలుగైదు నాళ్లలో వలసిన
ధనము ప్రోగయినది. దాతలు గూడ ప్రయత్నమునకుఁ దగినటు లడుగుటతోనే
‘లేదు.కాదు' అనకుండ నిచ్చిరి. ఈ గడ్డు రోజులలో నిది యొక విశేషము. ఈ
కార్యక్రమములో నాకు శిష్యతుల్యులును పరమాప్తులునైన శ్రీ మారేపల్లి శ్రీరామ
మూర్తి గారు మాకు నిక్కార్యమున చేదోడు వాదోడుగాఁ దోడ్పడి గ్రంథము
సమగ్ర రూపము దాల్చువఱకు దీక్షతో నిల్చిరి. ఇది శివానుగ్రహమని తలంతును.
కార్యానుకూల్యమున కన్నియుఁ గలిసివచ్చునను పెద్దలమాట యనుభవైకవేద్యము
గదా!
ఈ గ్రంథమునఁ బ్రచురించిన బొమ్మలు నాకుఁ బరమ మిత్రులును,
నర్సరావుపేట ఛాయాచిత్రశాలాధిపతులునగు బ్ర. వే. వళ్లె బిందుమాధవాచార్యులు
గారు స్వయముగా కొండ దగ్గఱకు వెళ్లి ఫోటోలు తీసికొనివచ్చి సమయమున
కుచితముగా నందించిరి. ఇది తలవనితలంపుగా జరిగిన విషయము.
వీరెల్లరి యాశయముల కెల్లప్పుడును పరమేశ్వరుఁడు ’శ్రీరామరక్ష' యై
శాశ్వతాయురారోగ్యైశ్వర్యముల నిచ్చి సర్వదా వీరిని, వీరి కుటుంబములను
కాపాడుఁగాత యని ప్రార్థించుచున్నాను.
తమ ప్రపితామహులు రచించిన ఈ గ్రంథమును బ్రకటించుటకు సర్వాధికార
ములు నా కొసంగిన శ్రీ కొప్పరాజు వీరభద్రరావుగారి మహౌదార్యభరిత సారస్వ
తాభినివేశమునకు నా నమోవాకములు. పరమేశ్వరుఁడు వారికి చిరాయురైశ్వర్యము
లొసఁగి రక్షించుఁ గాక
ఈ గ్రంథమును ముద్దులు మూటగట్టునట్లు ముద్రించి యిచ్చిన మదీయ
సోదరులు, అజంతా ముద్రణాలయాధిపతులు, శతావధానులు, శ్రీశ్రీనివాససోదరు
లకు మిక్కిలి కృతజ్ఞుఁడను.
{{right|''సంపాదకుఁడు''}}<noinclude><references/></noinclude>
0mcp6sbvrvdgcq0v54rz9c6tv57uzwt
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/12
104
133287
569555
405821
2026-08-10T00:06:28Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569555
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" />{{Center|5}}</noinclude>{{Css image crop
|Image = శ్రీమత్త్రికూటాచల_మాహాత్మ్యము.pdf
|Page = 12
|bSize = 380
|cWidth = 332
|cHeight = 447
|oTop = 57
|oLeft = 26
|Location = center
|Description =
}}
ఈకవి క్రీ.శ. 1852 (శా.శ. 1774) విరోధికృత్ సం. మాఘ బ 14 లు సోమవారమునాఁడు శివరాత్య్రుత్సవమునకు సకుటుంబముగ శ్రీ త్రికోటీశ్వరుని సన్నిధానమునకు బోయి, యుపవాసాదులుసల్పి, యుత్సవమును గాంచి నివ్వెఱ<noinclude><references/></noinclude>
6gd89kxkfcz31ra5jepnppbm05c4w41
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/23
104
133289
569569
405823
2026-08-10T01:49:41Z
Ramesam54
3001
/* మూల్యాంకన చేసారు */
569569
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Ramesam54" /></noinclude>{{p|ac|fs125}}మేలిపలుకు</p>
శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యమను నీగ్రంథమును ఆమూలాగ్రముగాఁ జూచితిమి. రచయిత కొప్పరాజు నరసింహకవి గొప్పశివభక్తుఁడు. శైవవేదాంతము సరహస్యముగ నెఱింగినవాఁడనుటకు గ్రంథమంతయును ముఖ్యముగా ద్వితీయాశ్వాసమును ప్రమాణము. విషయమందలి యత్యంతాభినివేశముచే వ్రాసినకావ్య మగుటచే కవిత యావేశపూరితము. తృతీయాశ్వాసమున 215 నుండి 228 వఱకు గల పద్యభాగ మందులకు నిదర్శనము. శివరాత్రి యుత్సవమును వర్ణించుఘట్టము మఱియొక మేలుబంతి. రచన సర్వత్ర గంగాప్రవాహమువలె సాగిపోయినది. తృతీయాశ్వాసములో 302 వ పద్యము కవి భావనాశక్తి కొకమేలియుదాహరణము :
{{Telugu poem|type=|lines=<poem>పై నున్న జనము లాపైన నిల్చినయట్టి
ప్రభలకుఁ గట్టు దర్పణములందు
క్రింది యుత్సవములఁ బొందుగా వీక్షించి
బహుళోత్సవంబు లీ పర్వతమునఁ
బరగుచున్నవటంచు భ్రాంతిచే భావించి
యందె నిల్చిరి; గిరిక్రింద జనులు
క్రిందటి ప్రభల నింపొందు నద్దములందు
కుధరంబుపై నుండు గుడిని గాంచి
ఇచటి భక్తులఁ బ్రోవఁ గోటీశ్వరుండు
పరగ గుడితోడఁ గ్రిందికి వచ్చె ననుచు
భ్రాంతి నీక్షించి యచటనే పాయకుందు
రద్భుతముగాదె యాచంద మరసిచూడ.</poem>|ref=}}
ప్రభలకు గట్టిన యద్దములను జూచి కవి చేసిన కల్పన గొప్పగా నున్నది. కొండపైని ప్రభల యద్దములలో కొండక్రింది యుత్సవములు గాంచి కొండమీఁది జను లా యుత్సవము లచటనే జరుగుచున్నవని భ్రమించి యచ్చటనే యుండిరి. కొండక్రింది ప్రభల యద్దములలో పైనున్న దేవాలయములు మొదలగు దృశ్యములఁ గాంచి ప్రజలు తమమీఁది యనుగ్రహమున కోటీశ్వరుఁడు తన యాలయములను గ్రిందికి దీసికొనివచ్చినట్లు భ్రమించి యచ్చోటు వాయకుండిరఁట: ఎంత చక్కనికల్పన! ఇంకను ఈ కవి కల్పనాచమత్కారమునకు తృతీయాశ్వాసమున 46, 49<noinclude><references/></noinclude>
ouecjjuscfjp1g43qd3oavmebcvqkg0
పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/47
104
143592
569488
442471
2026-08-09T14:01:28Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దారు */
569488
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>సమయమంతా వారిద్దరికీ కనిపిస్తోంది ఒక్కటే... వారి గమ్యం సొంతూరి పొలిమేర.
“ఒరేయ్.. ఈరేశం అదిగో దూరంగా ఏదో ఊరు కనిపిత్తాంది.. పొద్దు పొడుత్తాడంది.. ఆ ఊరెళ్ళి అడిగితే ఏ మంచి మనిషో మనకి సాయం చేయకపోడు. తినడానికి ఏం దొరక్క పోయినా. కాసిని నీళ్లన్నా దొరికితే కాస్త సత్తా వత్తది. ఏ గుడికాణ్ణొ పడుకుని పొద్దున్నే ఎలాదం” అన్నాడు రాధయ్య,. “అట్నే మావాా,... అటే ఎళ్దాం పదా”. అని అటుగా నడక మొదలెట్టాడు మామ రాధయ్యని అనుసరిస్తూ వీరేశం. నడిచి నడిచి చెప్పులు కరచి కాలిన బొబ్బల్లా మారిన పాదాలు పగిలి రక్తపుగూడు కట్టుకున్నాయి. అప్పటికే దాదాపూ రెండు వందల కిలోమీటర్లు వారం రోజులుగా నడుస్తున్న ఆ కాళ్ళు శ్రమని మరచిపోయాయ్.
కనిపించిన గ్రామంలోకి వెళ్ళామనుకుంటే.. గ్రామం మొదల్లోనే పెద్ద ముళ్ల కంచె వేశారు.. ప్రపంచం నుంచి తనని తానే వెలేసుకున్న ఆ గ్రామ పొలిమేర చూసి బాధేసింది ఇద్దరికీ. అంతలో అక్కడ కాపలా ఉన్న పోలీసు కానిస్టేబుల్ “ఎవర్రా మీరు గ్రామంలోకి రావడానికి వీలులేదు వెళ్లండీ.. వెళ్ళండీ...” అని గదమాయించాడు.
“అయ్యా మంచినీళ్ళు కూడా దొరకలేదు పొద్దుటాల్నుంచి, కాస్త మంచిళ్ళు ఇప్పించండీ” అన్నాడు. వీరేశం. ఏమనుకున్నాడో గానీ ఆ ఖాకీ దుస్తుల్లోని పెద్దమనిషి వెంటనే “నాకూ నీళ్ళు లేవయ్యా పొద్దున తెచ్చుకున్న నీళ్లూ అడుక్కు వచ్చినయ్.. ఓ పని చేయండి ఈ మూలాటంగా ఎళితే మంచి నీళ్ళ 'సెరువుంది.. అక్కడికెళ్ళి నీళ్ళు తెచ్చుకోండి” అని సలహా ఇచ్చాడు... చెరువు అనగానే పని దగ్గరమినరల్ వాటర్ బబూల్స్ లోని నీళ్ళు తాగటం అలవాటైన ఇద్దరూ ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు.” ఏం కాదు సామీ .. అది మంచి నీటి చెరువే మా ఊరోళ్ళు బాగు చేసుకున్నారీ మధ్య ఎల్లండి, త్వరగా నీళ్ళు తీసుకుని వెళ్ళిపోండి” అన్నాడు.
కానిస్టేబుల్ చెప్పినట్లే... కొద్ది దూరంలో ఉన్న చెరువు చూసి ఉబ్బి తబ్బిబ్బాయ్యారిద్దరూ..ఆ చెరువు నీరే పరమానందంగా తాగి ముఖాలు కడుక్కుని తమ వద్ద ఉన్న రెండు బాటిళ్లలో నీరు నింపుకుని కొద్ది దూరం వెళ్ళి హైవే పైకి ఎక్కి మరలా నడక మొదలెట్టారు. అంతలో వెనుక నుండి వెళ్తున్న రిక్షా వీరిద్దరినీ దాటినాక ఆగింది.ఎవరో ఇద్దరు ముసలోళ్ళు. రిక్షా తొక్కుతున్న చిన్న కుర్రోడు రిక్షా ఆపి దిగి పరిగెత్తుకుంటూ రాధయ్య వాళ్ల దగ్గరికి వచ్చాడు. " ఓ భయ్యా.. పీనేకా పానీ దోనా.. మేరా నానాం నానీకో ప్వాస్ లగే హై యే బంద్ కే వజైసే సుఖాసే పానీచ్ నై మిలా” అన్నాడు... వాణ్ణి చూడగానే ముచ్చటేసింది.. హైద్రాబాదీ హిందీ అలవాటైన రాధయ్యా..” క్యోం నహీ.. మీలేగా.. జరూర్.. ఆప్ లోగో కహాసే కహా తక్ జానే వాలే..?” అని అడిగాడు... ఎలా అర్ధమైందో వెంటనే “ఓ తెలుగు వాలా.. మేమూ ఉత్తరప్రదేశ్ నుంచి వస్తయ్.. తమిళనాడు వెళ్లై..” అని తెలిసీ తెలీని తెలుగు భాషలో ఎంచక్కా చెప్పాడు.. వాణ్ణి చూస్తూనే చేతికి బాటిల్ అందించాడు రాధయ్య. టమ మాత్రు భాష వారికి జీవితంలోని అత్యంత అవసరమైన పరిస్థితుల్లో ఎంతగ్గా ఉపయోగపడిందో.. ఆ పిల్లాడి కళ్ళను చూసే వారికి మాత్రమే అర్థమవుతుంది.<br>
వాడు పరిగెత్తుకెళ్ళి రిక్షాపై పడిపోయి ఉన్న వాడి నాయానమ్మకు బాటిల్ లోని నీళ్ళు తాగించాడు.. “ బంద్ కే వజైసే సబ్ లోగ్ చలే గయే. హం అకేలే హోగయే.. బచ్చే కే వజైసే హమారా దేశ్ చలా
జారే..! అని చెప్పాడు ముసలాయన అప్పటికే రిక్షాని సమీపించిన వీరిద్దరితో..! “షుక్రియా.. అని దణ్ణం పెట్టి " లేలో యే ఫల్...“ అనీ చేతిలో యాపిల్ ఇవ్వ బోయాడు.. “నై నై బహుత్ దూర్
జారే.. రఖ్ లే భయ్..” అని చెప్పి వారిని పంపి .. తమ నడకను కొనసాగించారు. నిరాటంకంగా నడక కొనసాగిన కొన్ని గంటల తర్వాత ఓ బస్ షెల్టర్ కనిపించడంతో అక్కడ పడుకుందామని నిర్ణయించుకున్నారు ఇద్దరూ.
“సరే మావా నేనుకూర్చుంటా నువ్ కాసేపు తొంగో..” అంటూ అప్పటికే ఆగిపోయిన సెల్ వంక చూస్తూ “ తొందరగా ఇంటికాచ్చేయండయ్యా చంటిది ఎదురుచూస్తున్నాది” అన్న భార్య మాట్లాడిన చివరి మాటలు గుర్తు తెచ్చుకుంటూ తుండు బస్టాండ్ అరుగుపై విధిలించి కూలబడ్దాడు. అప్పటికే మరో సిమెంట్ అరుగు మీద వాలిన రాధయ్యకు తన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. మనం ముందుకెళుతున్నామా.. ? వెనక్కా.? పదవ తరగతి రెండు సార్లు తప్పిన రాథయ్య, అల్లోచన వెల్లువలో కొట్టు మిట్టాడాడు.. తన చిన్నతనంలో చూసిన రోజులు ఇప్పుడు మరలా గమనీంచడం
ఆశ్చర్యం వేసింది. గ్రామాల్లో వెలేసిన కుటుంబాల పరిస్దితి గురొచ్చింది.. చెరువులో నీరు త్రాగటం... పచ్చని చెట్ల నీడలూ గురొచ్చాయ్.. ఆ ఆలోచనల వరదలో పొలం గట్టున బురద పూవై పూసిన నాయన గుర్తొచ్చాడు.
{{c|X X X}}
“నాయానా... అమ్మా. నేనాచ్చాం.. ఆం తిందాం రా” అన్న 7 ఏళ్ళ రాధయ్య పిలుపుతో “వచ్చున్నారయ్యా.. చెట్టుకిందకూకోండి.. వచ్చేచ్చున్నా.” అంటూ పచ్చని పొలాల్లోకి కాలువ నుంచి నీరొదిలి.. పారతో గాళ్ళు సర్ధి... కాలువ నీళ్ళతో చేతులు కడుక్కుని వచ్చి పెళ్ళాం తెచ్చిన బువ్వ తింటూ కొడుకుని ప్రేమతో చూస్తూ... కళ్ళెగరేసిన వీరయ్యతో... “చేతికున్న మట్టి కడుక్కో నాయనా, కూల్లో అయ్యోరు సెప్తిరిగందా” అన్న రాధయ్య తో....”ఈ మట్టేరా మనకి అన్నం పెడతాంది.. మనకేమైద్ది.. ఏంగాదు నాయనా “ అన్నాడు వీరయ్య.
ఆశ్చర్యంగా చూస్తున్న రాధయ్యను.. “ఇదిగో చూడు సిన్నోడా.. బూమితల్లిని నమ్ముకున్నోడికి ఎప్పుడూ అన్నాయం జరగదురా.. కట్టాలంటావా వత్తంటయ్ ఫోతాంటయ్.. ఏం రమనమ్మా..” అన్నాడు మధ్యలో పెళ్ళాన్ని పలకరించి... “అవునయ్యా సత్తెం” అంది పెనివిటి పలుకే పరమాన్నమన్నట్లు. తానుతింటూ తింటూ మధ్యలో చెరో ముద్ద మెట్టాడు వీరయ్య..! రమణమ్మ సిగ్గుతో కొంగర్లు చుట్టుకుపోగా.. వీరయ్య బుజమెక్కి ఉప్పమ్మ ఉప్పు.. అని ఊగసాగాడు రాధయ్య,.
“సరే నేను సాయంకాలం వస్తా గందా.. మీరు ఇంటికి పోండి.. జాగ్రత్తగా సరేనా... నువ్ కాసేపు అయ్యోరు జెప్పింది సదువుకో... నువ్ సదువుకుంటే మనకట్టాలు దీరతాయ్” అన్న వీరయ్యతో "
సరే నువ్ తొరగా ఇంటికి రా నాయనా..”అంటూ నవ్వుకుంటూ వెళ్తూ తండ్రిని చూస్తూ.. “టాటా” అంటూ తల్లితో వెళ్ళిన రాధయ్య తండ్రి నవ్వుని మఠలా చూళ్ళేదు... పలుకు వినలేదు. అప్పటికే<noinclude><references/>
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్-2021 |</noinclude>
nrvyefghjh6yyjplu7fh90at20dc2j2
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/563
104
154617
569494
448425
2026-08-09T14:08:11Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569494
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కన్హేరీ||సంగ్రహ ఆంధ్ర}}</noinclude><section begin="563A" />అమితత్వదోషమునకు గురియై యెరుగడు. కన్ఫ్యూషియస్ తన శిష్యులతో మిక్కిలి చనువుతో ప్రవర్తించెడి
వాడు. వారందరును ఆయనను మిక్కిలి లక్ష్య గౌరవములతోడను, భయభక్తులతోడను సేవించెడివారు. ఉజ్జ్వలమును, పవిత్రమునైన సూర్యబింబమును దూరమునుండి కాంచి నమస్కరించునట్లే, అందరును అతని జ్ఞానసంపదను, ధర్మపరాయణతను పురస్కరించుకొని, ఆతని నొక మహాత్మునిగ నెంచి పూజింపదొడగిరి.
కన్ఫ్యూషియస్ దేవతాంశ సంభూతుడు కాడు. ఈయన తనయం పెట్టి అతిమానుష శక్తులున్నట్లును చెప్పు
కొనలేదు. ఇతడొక మతస్థాపకుడు కాదు. మానవులకు ఈశ్వరునితో నుండవలసిన సంబంధమునుగూర్చి కూడ
ఈయన బోధింపలేదు. సత్ప్రవర్తనము, సత్పరిపాలనము అను నీ రెండు విషయములనే ఈ మహాజ్ఞాని బోధించెను. ఈ విషయములలో నైనను తానెట్టి నూతనాంశములను స్థాపించినట్లు ఈతడు చెప్పుకొనలేదు. జ్ఞానులును, మహానీయులునైన ఆర్యులు తెల్పిన విషయములనే తాను మరల బోధించుచుంటినని అతడు పల్కుచుండెడివాడు. మానవసంఘము భగవన్నిర్మితము, ఈసంఘమును ఆశ్రయ, ఆశ్రిత సంబంధముగల అయిదు ద్వంద్వములుగ విభజింపవచ్చును. పాలకుడు, పాలితుడు; భర్త, భార్య: తండ్రి, కుమారుడు; జ్యేష్ఠభ్రాత, కనిష్ఠ భ్రాత; మిత్రుడు, మిత్రుడు; వీరి పరస్పర సంబంధమే మానవ సంఘమునకు పునాది.
ఇందు ఆశ్రయభూతులైనవారు ధర్మబుద్ధితోడను, కరుడార్ద్ర హృదయముతోడను ఆశ్రితులను రక్షింపవలెను.
ఆశ్రితులైన వారు. భక్తి వినయములతో ప్రవర్తింపవలెను. మిత్రులన్యోన్యసద్గుణములను వృద్ధినొందింపవలెను. ఎవరి ధర్మమును వారు సక్రమముగ నిర్వర్తించిన యెడల భూలోకము స్వర్గతుల్యమగును. ప్రపంచములో పలువురు తమ తమ ధర్మములను సక్రమముగ నిర్వర్తించనిమాట వాస్తవమేగాని, మానవస్వభావము సహజముగ దుష్టమైనది కాదు, శ్రేష్ఠులగువారు ధర్మమార్గము ననుసరించిన యెడల సామాన్యప్రజలెల్లరు వారిని అనుసరింతురు. రాజు ధర్మ పరాయణుడైననాడు ప్రజలెల్లరును సన్మార్గావలంబకు లగుదురు. "ఆదర్శ ప్రాయుడగు ప్రభు వెట్లుండవలెనో 'నే వెరుగుదును. నా బోధనల ననుసరించి వర్తించేడు రాజు లభించినచో నా ఆదర్శము లభ్యమగును." అని కన్ఫ్యూషియస్ పల్కెడివాడు.
ఆత్మోదాహరణముచే ధర్మమును పెంపొందింప వచ్చు సని కన్ఫ్యూపియస్ యొక్క దృఢమైన విశ్వాసము.
కావుననే పాలకుడు సర్వసద్గుణశోభితుడై యుండవలెను. గుణహీనుడు రాజత్వమున కనర్హుడు. "ఇతరులు
మన విషయమున ఎట్లు ప్రవర్తింపవలయునని మనము కోరుదుమో, ఆ రీతిగనే మనము ఇతరులయెడ ప్రవర్తింప వలయును" అనునది ఆయన కావించిన ముఖ్యమైన బోధనలలో ఒకటి.
'మానవస్వభావము భగవదాజ్ఞకు ప్రతిబింబము. మానవ స్వభావము ననుసరించి వర్తించుట భగవతీతికరము;
తద్విరుద్ధముగ మెలగుట భగవంతుని యెడల అపచారము కావించుటయే. సత్కర్మలకును, దుష్కర్మలకును తగిన ఫలము ఇహముననే లభించును. ఆ ఫలము మనకు కాకపోయినను, మన వంశస్థులకైన చెందితీరును' అని కన్ఫ్యూషియస్ బోధించెను.
ఈ మహాజ్ఞాని అతీంద్రియ విషయములనుగూర్చి ఎట్టి బోధనను కావింపలేదు. దైవప్రీతికై కావింపవలసిన
క్రియాకలాపమును ఆతడు సక్రమముగ నిర్వర్తించెడివాడు. కాని ఈ దైవతములనుగూర్చి మనకు విశేషముగ
తెలియదు. కావున ఆ విషయములో నెట్టి జోక్యమును కల్పించుకొనక విధ్యుక్త స్వీయధర్మమును నిర్వర్తించు
టయే బుద్ధిమంతుని కర్తవ్యమని కన్ఫ్యూషియస్ అభిప్రాయపడెను.
ఈశ్వరునిగూర్చి, ఈశ్వరమానవులకునుగల సంబంధము మున్నగు విషయములనుగూర్చి మౌనమును వహించి,
మానవధర్మముల పైననే దృష్టిని కేంద్రీకరించి, అనశ్వరమగు ఒక నైతిక సంప్రదాయమును స్థాపించిన బుద్ధ
భగవాసునితో కన్ఫ్యూషియస్ ను పోల్చుట అసమంజసము కానేరదు. వీరిరువురును ఇంచుమించుగ సమకాలికులే.
{{right|ఖం.బా.శే.}}
<section end="563A" />
<section begin="563B" />'''కన్హేరీ:'''
కన్హేరీ గుహలు బొంబాయి పట్టణ పరిసరమగు బోరివిల్లీకి 6 మైళ్ళ దూరములో నున్నవి. ఈ బౌద్ధ గుహలు
కలిగిన రాతిగుట్ట చెట్లు చేమలులేని శూన్య శిఖరమును
<section end="563B" /><noinclude><references/></noinclude>
jlso09d21owr29by3nqryg76tfqykv8
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/564
104
154618
569498
448426
2026-08-09T14:30:12Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569498
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||కన్హేరీ}}</noinclude>
గలిగియున్నది; దీని మిక్కిలి ఎత్తయిన కొస సముద్ర మట్టమునకు రమారమి 1,000 అడుగుల ఎత్తున నున్నది. ఈ గుహలు దాదాపు 109 వరకు ఉన్నవి; కొండలపై మలచబడిన దేవాలయములలో నిది బహుశః అత్యంత విస్తీర్ణమైన పరంపర కావచ్చును; కాని వీనిలో నెక్కువ భాగము చిన్నవి. దూరమునుండి వచ్చు ప్రేక్షకులకు నివి ప్రసిద్దములగు దాపుననున్న ఎలిఫెంటా గుహలవలెను లేదా బాగా దూరముననున్న అజంతా, ఎల్లోరా గుహల వలెను అధిక ఆకర్షణీయములుగా లేవు.
శాసన సాక్ష్యమును బట్టి యీ గుహలలో నొకటి యగు నొక చైత్యశాల క్రీ.శ. 180 ప్రాంతమున మలచ
బడినట్లుగా రుజువగుచున్నది. వాస్తుశైలిలో నది కార్లీ వద్దనున్న గుహకంటె ఎక్కువ విభిన్నముగా లేదు. పరిమాణములొ మాత్ర మిది సుమారు దానిలో మూడింట రెండువంతు లుండును. ఏ కారణమువల్లనో ఇది మొదట అసంపూర్ణముగా వదలి పెట్టబడినట్లును, హీనయానశాఖకు చెందిన బౌద్ధ సన్యాసులచే కొంతకాలము వాడబడిన తర్వాత నీది నిరుపయోగ స్థితిలో ఉన్నట్లును కనబడుచున్నది. పెక్కు శతాబ్దముల తర్వాత క్రీ. శ. ఐదవ శతాబ్ది ప్రాంతమున నడవకు రెండు కొనలయందును సుమారు 25 అ. ఎత్తు గల బ్రహ్మాండములగు బుద్ధ శిలా విగ్రహములతో గూడిన అనేక శిల్పరూపములను ప్రవేశపెట్టి మహాయాన సన్యాసులు ముఖద్వారము, గుహ యొక్క వెలుపలి భాగములందును, విస్తీర్ణములగు మార్పులను కావించిరి. అదృష్టవశమున లోపలిభాగము మాత్రము స్పృశింపబడక, హీనయాన శైలిలో కట్ట కడపటి శిల్పరీతులకు అది చక్కని యుదాహరణముగా ఉన్నది..
ఈ గుహలలో కనుగొనబడిన యనేక శాసనములను బట్టియు, ఈ గుహలయందలి ప్రతిదాని యొక్క విశిష్ట
లక్షణములను బట్టియును ఇది సుమారు క్రీస్తు శకారంభము నుండి క్రీ.త. తొమ్మిదవ శతాబ్దపు మధ్యభాగము వరకును చారిత్రకముగా విస్తరించి యున్నట్లు తెలియుచున్నది. ఈ పరంపరలో మిక్కిలి ప్రాచీన తరగతికి చెందినవిగా తేటపడుచున్న సామాన్యపు గదులు కొన్ని కలవు. మరికొన్ని సన్నని ద్వారానుబంధ నిర్మాణము, లేక గోడల పొడవునను అరుగులను గలిగి, క్రీ.త. రెండునుండి నాల్గవ శతాబ్దములకు సంబంధించిన గుహలై యున్నవి. ఇంకను కొన్ని గుహలు క్రీ.త. తొమ్మిదవ శతాబ్దమువరకును విస్తరించుచు. మహాయాన విశిష్ట శిల్పమునకు దృష్టాంతములు కాదగిన రచనలు కలిగియున్నవి.
ఫెర్గుసన్ వీని నీ క్రింది విధముగా వర్గీకరించుచున్నాడు: (1) సన్ననిలో తైన కొండదారిలో నున్న గుహలు క్రీ. త. 4 వ శ తాబ్దికి చెందినవి; (2) మహాగుహకు రెండువై పులను సున్నవియును, మరియు "దర్బారు" గుహ కెదురుగా నున్నవియును, అగు గుహలు క్రీ.త . 5 లేక 6 వ శతాబ్దికి చెందినవి. (3) మహాగుహ పైన చెప్పబడిన రెండవ వర్గము కంటె తరువాతి కాలమునకు చెందినవి. (4) గుట్టను మనము సమీపించగానే మొట్టమొదటగా కనబడెడి అసంపూర్ణముగా వదలి పెట్టబడిన గుహ. ఇది అదేశాలమునకు చెందినట్లున్న స్తంభములను వెలుపల భాగమున కలిగి యున్నది.
రూపకల్పన, నిర్మితాకృతి, వాస్తు వివరముల యొక్కయు, శిల్ప కేంద్ర వస్తువుల యొక్కయు రచనా
నిర్వహణమున కన్లేరి వద్దనున్న చైత్యశాల నిర్మాణములో కార్లీ గుహల వద్దనున్న సుప్రసిద్ధ చైత్యశాలను పూర్తిగ
అనుకరించినను, ఆయనుకరణము కొంతవరకు లోపభూయిష్ఠముగా నున్నదని చెప్పెదరు. అయినను శిఖరము
విరిగిపడి, రెండు వైపులను సమత్వముగా నుండు రూపకల్పన నాశనము కాక పూర్వము, కార్ల్ యొక్క ముందు
భాగమున నుండెడి ఏర్పాటును ఇది మనకు వెల్లడి చేయుచున్నది. అంతేకాక ఈ చైత్యశాలల బయటి భాగమున నుండు ఏర్పాటులను గూర్చికూడ, కన్హేరీ చైత్యశాలమునకు కొంత ఉపయోగకరమైన విషయ పరిజ్ఞానమును సమకూర్చుచున్నది.
కన్హేరి వద్ద బయటి భాగమునకు ముందు సుస్పష్టముగా ఏర్పాటైన ఒక సభాంగణము ఒకానొక పొట్టిగోడచే
నావరింపబడి రచింపబడియున్నది. ఒక మెట్లవరుస దానిలో ప్రవేశించుచున్నది. రెండు వైపులను ద్వారపాలకుల బొమ్మలను ఉబ్బెత్తుగా నుండునట్లు చెక్కబడిన తోరణ స్తంభముల వరుసలతో కలిగిన గోడలతో ఈ మొత్తపు నిర్మాణ విధానము ముందునుండి ప్రవేశించునప్పుడు ఆకర్షణీయ<noinclude><references/></noinclude>
o1uyjd7pji5f05u7awk79irnqxzc8h4
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/565
104
154619
569500
448427
2026-08-09T14:47:31Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569500
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కన్హేరీ||సంగ్రహ ఆంధ్ర}}</noinclude>
ముగా నున్నది. సభారంగపు ముందుభాగములో, రెండు వైపులను కార్లీ వద్దవలెనే సింహ స్తంభము లున్నవి ; కాని అనేక సూక్ష్మాంశములయందు భేదములు ఉండుటయే కాక, ఈ స్తంభములు స్వతంత్రముగా నిలబడు నట్టివికాక, పెద్దవియును, ప్రముఖములును అగు చతురపు టాకారము కలిగి రాతిలోనికి చెక్కి రాతినుండి పైకి మలచిన రచనా విశేషములవలె కొండరాతితో అనుబంధితములై యున్నవి. ఎనిమిది భుజములుగా చెక్కబడిన యీ స్తంభకాండము యొక్క మధ్యప్రదేశమున "దిండు" వంటి ఉపాంగ మున్నది. గణన ఫలకముపైన రచింపబడిన తదితర ఆధార శిల్పములు లేక ధన పిశాచములవంటి పురుషాకృతిగా చెక్కబడిన స్తంభ శిల్పముల శిథిలములు దృష్టి నరికట్టుచున్నవి.
ఈ కళారీతులు 'భావివికాసమునకు ఆధారములై సుప్రసిద్ధములగు మధ్యయుగములోని గోడలనుండి చదును
ప్రదేశముపై నమర్చిన చిత్ర విశేషములకు త్రోవతీసినట్లు కనబడుచున్నవి. ఆ స్తంభములు కావల బాహ్య ముఖ
ద్వారము కలదు. ఇది ఒక సామాన్యమైన అడ్డగోడగా నున్నది. ఈ గోడకు దిగువభాగమున చతురపుటాకారము
కలిగిన మూడు పొడపుద్వారములు కలవు ; పై భాగమున ఐదు కిటికెల వరుసతో ఒక పై అంతస్తుగల నిర్మాణ మేర్పడు చున్నది. ఈ గుట్ట యొక్క ఉపరితలము వేరొక నిర్మాణమున కుద్దేశింపబడిన రంధ్రములను చాల
కలిగియుండుటచే, విశేష పరిమితిగల కఱ్ఱపని నిర్మాణముల ఆధారముగా నిది యుండెడిదని తెల్లమగు చున్నది. ఈ కఱ్ఱపనిలో నొకటి గాయకులకొర కేర్పరచిన వ్రేలాడెడి 'గేలరీ' అయియున్నది.
ముందుగోడకు వెనుక ఒక నడవకలదు. దాని వెనుక గోడలో పైన చైత్య - వాతాయనములతో గూడిన
మూడుద్వారములు కలవు. ఇక్కడి చైత్య వాతాయనము సాధారణముగా నుండెడి విశేషమగు చెక్కడపు పనిని కలిగియుండక, సామాన్యమగు నర్థవర్తులమగు ద్వార వివరమును మాత్రము కలిగియుండి, అనంపూర్ణముగా
నున్నట్లు స్పష్టమగుచున్నది. లోపలిభాగము సర్వ సామాన్యమై, సంప్రదాయానుసారమగు పైన నర్ధవర్తులా
కృతీగా వంచి కట్టబడిన శాల స్తంభములచే నానరింపబడి యున్నది. దీని కొలతలు 86 అ. పొడవు, 40 అ. వెడల్పు, 50 అ. ఎత్తు అర్ధవర్తులాకార నిర్మాణము (Dagoba) 49 అ. ల పరిథిని కలిగియున్నది. గుహను పూర్తిగా వర్తులాకృతిగా చుట్టియున్న 34 స్తంభములును దగ్గర దగ్గరగానున్నవి. పొట్టివియు, బరువుగలవియు నగు వీనిలో కొన్నిమాత్రమే ఆలంకారిక రచన కలిగియుండి, కార్లీ వద్దనున్న విధానమునే చాలవరకు పోలి యున్నవి. ఈ చైత్యశాలను పరిశీలించినప్పుడు వాస్తుశాస్త్ర ప్రజ్ఞ పతన లక్షణములను సూచించుచున్నను, మలచి, కూర్చిన అలంకారము -ముఖ్యముగా బొమ్మలకు సంబంధించినది... తన గుణ విశేషమును నిలబెట్టుకొన్నదన్న అభిప్రాయము కలుగుచున్నది. మొత్తముమీద నీ చైత్యశాల కార్లి వద్దనున్న మూల
రూపముయొక్క ఉన్నత ప్రమాణమునుండి కలిగిన పతనమును స్పష్టముగా సూచించుచున్నది. హీనయాన బౌద్ధమత క్షీణతకు ఫలితముగా శిలా - వాస్తు శాస్త్రము యొక్క ప్రాథమిక దశ అంతము నొందుటకు ముందు
కావింపబడిన ఒక తుది ప్రయత్నముగా నీ చైత్యశాల స్పష్టముగా కనబడుచున్నది.
దర్బారు గుహా కొన్ని గదులు కలిగియున్నను, అది సాధారణముగా నుండెడి విహారము కాదు, బహుశః ఇది
దీనిని పోలిన అజంతా గుహలలోని 20 వ గుహవలెను, ఎల్లోరాలోని సుప్రసిద్ధమగు మహార్వాడీ గుహవలేను, ఒక సభారంగమై యుండియుండవచ్చును.
ఈ శాల యొక్క మధ్యభాగమున ప్రముఖస్థానము వహించేది ఒక పూజా మందిరము గలదు. ఆచట 500
సన్యాసుల అవసర సమావేశమునకు సులభముగా వధ్యక్షు స్థానము వహింపదగు ప్రదేశములో నొక బుద్ధ విగ్రహము కలదు. ఒక ప్రక్క బుద్ధ విగ్రహము అట్టిదే ఒక యర్థవర్తుల నిర్మాణముపై పద్మపాణితో ఉన్నది. వేరొక ప్రక్క చౌరి (Cauri) ని ధరించిన మరొక బోధిసత్త్వుని విగ్రహము కలదు. శాల యొక్క క్రింది భాగములో
గదులు లేని ఒక ఖాళీస్థలము మత బోధకుడు నిలబడు వేదికకు చక్కగా సరిపడియున్నది. 100 మంది మాత్రము కూర్చుండగలిగిన రెండు రాతి "బెంచీలు" మాత్రమే ఉన్నను, శాల యొక్క మధ్యభాగము 73 అ. పొడవు 32 అ. వెడల్పు కలిగినదై 500 సన్యాసులు సుఖముగా<noinclude><references/></noinclude>
kbyvappjqidd1sahemh96wgm6nik5a7
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/566
104
154620
569501
448429
2026-08-09T14:49:10Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569501
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{Css image crop
|Image = Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf
|Page = 566
|bSize = 600
|cWidth = 540
|cHeight = 728
|oTop = 40
|oLeft = 25
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
pv0pp0xp26nlo1f3drj7sgy4lrqazrj
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/569
104
154623
569502
448432
2026-08-09T14:50:54Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569502
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{Css image crop
|Image = Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf
|Page = 569
|bSize = 600
|cWidth = 528
|cHeight = 739
|oTop = 30
|oLeft = 35
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
e5039vyaflvwp34dtzu7fwbwygz4rms
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/570
104
154624
569503
448433
2026-08-09T15:15:58Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569503
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||కన్హేరి}}</noinclude>
కూర్చుంచదగిన వసతిని కలిగియున్నది. వరండా స్తంభములు అష్టభుజాకారము గలిగి, వేదికకు, స్తంభ కాండమునకు మధ్యనుండు భాగములు కాని, స్తంభశిరో భాగములు కాని లేక నిరాడంబరముగా నున్నవి. లోపలి స్తందములు దిగువ, పై భాగములయందు చతురవుటా కారము కలిగియున్నవి ; వీనిలోనికి మలచబడిన గుండని రూప నిర్మాణము లున్నవి; మధ్యభాగమున వంపు కలిగిన 16 దిశలుకలవై సామాన్యమైన శిరోభాగము లను కలిగియున్నవి.
వీని రచనా శైలి ఎల్లోరావద్ద 10 నెం. గుహయగు విశ్వకర్మను స్మరణకు తెచ్చుచున్నది.
కన్హేరి శిల్పము అజంతా మొదలగు తదితర స్థలములతో పోల్చుటవలన తక్కువ స్థాయిలో సున్నదను నభిప్రా
యము కలిగించుచున్నది. ఫెర్గుసన్ దీనిని గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు : 'అవి బౌద్ధ కళ యొక్క చాల
ప్రాథమిక శైలిని కలిగియున్నవి. నిజమునకు ఇంత దౌర్భాగ్యస్థితిలో నున్న గుహ మరొకటి నాకు తెలిసిసంతలో లేదు" తరువాత ఇంకొకచోట వ్రాయుచు ఈ యభిప్రాయమును అతడు కొంచెముగా సవరించు కొన్నాడు: "చైత్యశాల ముందు గోడపై నున్న శిల్పము ఒక కొంత ప్రశస్తతరముగానున్నది; నిజమున కవి యీ గుహలలోని చెక్కడపు బొమ్మలన్నిటిలోను మేలిరకముగా నున్నవి. ఈ స్థలములోని శిల చిత్రముగా అత్యంత సన్నిహితము లైన అణువులను కలిగియున్నది. ఈ బొమ్మల వస్త్రధారణళైలి మహాశాతవాహనుల యుగమునకు
సంబంధించి యున్నది.'
"వస్త్రధారణమును, అలంకారములనుబట్టి ఈశిల్పము చాల తొలి కాలమునాటి దనియు, గుహ యొక్క తొలి
చెక్కడముతో సమకాలిక మనియు తేటబడుచున్నది. కర్ణభూషణములు బరువుగాను, కొన్ని పొడవెక్కువ,
వెడల్పు తక్కువగలవిగాను ఉన్నవి. స్త్రీల కాలియందెలు చాల బరువుగా నున్నవి. తలపొగలు మిక్కిలి శ్రద్ధతో
మలచబడి యున్నవి” వస్త్రధారణ శైలి శాతవాహన రీతికి దృష్టాంతముగా నున్నది. తరువాతి కాలపు గుహలలో
కాని, రంగుబొమ్మలను మలచుటయందు కాని యిది మనకు తిరిగి కనబడుట లేదు.
వానిపై నున్న విగ్రహములు స్పష్టముగా తరువాత కాలమునకు సంబంధించినవి; వానిలో ననేకములగు
బుద్ద రూపములును, బొధిసత్వ- అవలోకితేశ్వరుడు, నిలబడి యున్న రెండు విగ్రహములును కలవు. ముందు గోడలో వరండాకు, ఎడమ చివర నున్న ఒక బుద్ధ విగ్రహము క్రింద బుద్ధఘోషుని పేరు కలిగి. క్రీ.శ. అరమశతాబ్దపు, లిపిలో వ్రాయబడిన ఒక శాసనము కలదు. వరండా యొక్క సభారంగములో ఎడమవైపున తరువాతి కాలమునకు సంబంధించి, సాధారణమైన శిల్పముతో కూడిన రెండు గదు లున్నవి.
సహస్రబాహు లోకేశ్వరుని ప్రత్యేక శిల్పమొకటి పేర్కొన దగియున్నది; 21-వ గుహలో ద్వారానుబంధ
నిర్మాణమునకు కుడిప్రక్కనున్న పెద్ద ఖాళీస్థలములో గల ఆసీనమగు బుద్ధవిగ్రహమునకు ఎడమభాగమున
చెక్కబడిన పద్మపాణి రూపములలో నిదియొకటి. పద్మపాణియొక్క యీ ప్రత్యేకరూపము చాల బాహువులను
(లెక్క ప్రకారము 1000) కలిగి యుండవలెను. అంతేకాదు. ప్రధాన శిరస్సుపై కూర్పబడిన పది అదనపుతలలు కూడ గమనింపదగి యున్నవి. ఈ శాల కావలిదిక్కువ రెండువైపులను నాలుగేసి గదులతోడి సాముదాయిక ప్రార్థనాస్థలము గలదు.
21-వ సంఖ్యగల గుహవద్దనున్న సన్ననిలోతైన కొండదారి ముఖమువద్దనున్న గుహాసమూహములో కనబడు
చున్న స్త్రీ విగ్రహములు బౌద్ధశిల్పములో గుహ యొక్క నిర్మాణమునకు తరువాతికాలమునాటి వనుట నిస్సం
యము, 64, 66, 67 సంఖ్యలుగల గుహలలోనున్న బహ సంఖ్యాకములగు శిల్పములు ఇదే తరగతికి జెందియున్నవి. వీనిలో 66 వ సంఖ్యగల దానిలో, రెండు వైపులను ఒక్కొక్క తారయును, సాముదాయిక ప్రార్థనా స్థల విషయమున వర్ణింపబడిన యెనిమిది వేర్వేరు దృశ్యముల యొక్క చిత్రఫలకములు గల అవలోకి తేశ్వరుని చక్కని రూపరచనకూడ గలదు.
చిట్టచివర గమనింపదగిన విషయమేమనగా- ఎలిఫెంటా వద్దనున్న రాశిలో మలచబడిన దేవాలయముల నుండి, నేనెటీలోని కన్హేరి దేవాలయముల చుట్టుప్రక్కల నెక్కడో అంతమై బొంబాయి దగ్గరనున్న భారతదేశపు<noinclude><references/></noinclude>
2jny0y6aplvdistcohuhl40xkcmmr2w
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/571
104
154625
569504
448434
2026-08-09T15:38:04Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569504
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కపిస్థలం దేశికాచార్యులు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude>
<section begin="571A" />పడమటితీర రేఖ, వాస్తు కళ యొక్కయు, శిల్పకళ యొక్కయు, రూపములు, అల్లికలు, వివరములు, రచసలు మొదలగువాని ప్రయోగ క్రమపరిణామములకు ముఖ్య ప్రయోగరంగములలో నొకటియై యుండినట్లుగా
కనబడుచున్నది. ఈ మహాప్రయోగములో 'అనుకరింపబడిన' దేవాలయ విషయములో కళా సంబంధమైన అపజయమునకు మహాచైత్యశాల సాధ్యముగా నున్నది. ఈసాక్ష్యము వాస్తుకళా విద్యార్థులకు చాల ఆసక్తి జనకమై ప్రాముఖ్యము కలదిగా నున్నది. దర్బారుశాల బౌద్ధ భవనపు టేర్పాటులనుగూర్చి మనకు కలిగించు పరిజ్ఞానము వలన సమానమైన లేక అధికతరమైన ప్రాముఖ్యమును కలిగియున్నది. ఇట్లు కన్హేరీ భారతకళ, వాస్తుశాస్త్రముల చరిత్రలో మరొక అత్యంత ప్రధానమైన అధ్యాయముగా విలసిల్లుచున్నది.
{{right|డా. పు. శ్రీ.}}
<section end="571A" />
<section begin="571B" />'''కపిస్థలం దేశికాచార్యులు:'''
:జననము: క్రీ.శ. 15-10-1855.
:మరణము : క్రీ.శ. 7-1-1988.
'''కుటుంబము :''' 'మహామహోపాధ్యాయ' 'కళాప్రపూర్ణే' త్యాది బిరుద విరాజితులగు ఈ సుప్రసిద్ధ విద్వాంసులు తిరుపతిలో శ్రోత్రీయ విద్వత్కుటుంబమున జన్మించిరి. వీరిది కౌళికసగోత్రము. వేంకట రాఘవమ్మ, గోపాలాచార్యులు వీరి తలిదండ్రులు. వీరి తమ్ముడు శ్రీ రంగాచార్యులు సరసవిద్వత్కవీశ్వరుడు. అతడు కొంతకాలము తిరుపతి కళాశాలలో పండితుడుగ నుండి, అలంకార సంగ్రహము మున్నగు గ్రంథములను రచించెను. శ్రీ దేశికా చార్యులవారికి మొదటి భార్యయందు ఇరువురు సుతులును, ఒక సుతయు; రెండవ భార్యయందు ఇరువురు పుత్రులును, ఇరువురు పుత్రికలును కలిగిరి.
'''విద్యాభ్యాసము:''' శైశవమునుండియు సునిశిత శేముషీ విలాస సంపన్నులగు వీరన్నదమ్ము లిద్దరును, రామలక్ష్మణులవలె సుస్నిగ్ధులై, క్రుంగదీయు దారిద్య్రక్లేశమును సరకుచేయక, సంతతము విద్యావ్యాసంగ తత్పరులై, బాట్యముననే సంస్కృత సాహిత్యమున సంపూర్ణ ప్రావీణ్యమును సంపాదించుకొనుటయే కాక, సరసకవితా రచన యందును బాగుగ నారితేరిరి. అటుపై విద్యార్థి జన కల్పతరువు లని ప్రసిద్ధిచెందిన, సర్వతంత్ర పారావార పారీణేత్యాది బిరుద విరాజితు లయిన శ్రీమాన్ పురీశై శ్రీ రంగాచార్యస్వామివారి సన్నిధిలో 18 వ సంవత్సర ప్రాయమునకే తర్కవ్యాకరణాది శాస్త్రములందు అసమాన పాండిత్యమును గడించిరి. పిమ్మట తిరుచానూరిలో శ్రీమాన్ లాడవరం గోపాలాచార్యస్వామివారి సన్నిధానమునను, వారి ప్రోద్బలమున శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య (కేతాండపట్టి) శ్రీరంగ రామానుజ యతీంద్రులవారి దివ్యసన్నిధానమునను సకల వేదాంత సంప్రదాయ రహస్యముల నధిగమించి సకలశాస్త్ర పొరగులై 8.
'''నాదగోష్ఠులు: 27 సంవత్సరముల ప్రాయముననే 1882 లో తిరువనంతపురమున మహారాజుచే నేర్పాటు
గావింపబడిన వేదాంతవాదగోష్ఠిలో నవనవోన్మేష యుత యుక్తి జాలముల ప్రయోగించి, ప్రతివాదులను నీరుత్తరు
లను జేసి, జయభేరిని మ్రోగించి, శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంత విజయధ్వజమును నెలకొల్పి, వీరశృంఖలమును,
ఏబది శంఖపద్మనాభ నామాంకిత స్వర్ణపతకములను బడసిరి. కొచ్చి సంస్థానమున తోడా, దుశ్శాలువ మొదలగునవి స్వీకరించిరి. మైసూరు, గద్వాల, వనపర్తి, రీవా మొదలగు సంస్థానములయందును, ద్వైతాద్వైత విశిష్టాద్వైత మత మందిరములయందును అనేక విధ సత్కారములను బొంది జగద్విఖ్యాతులైరి. 1892లో సర్ ఎస్. సుబ్రహ్మణ్య అయ్యర్ వీరి ముఖమున అద్వైత సిద్ధాంత పరమ రహస్యములను విని, అత్యాశ్చర్యకరమగు వీరి ప్రతిభావిశేషమునకును, సకల దర్శన ధురంధరత్వమునకును అబ్బురపడి వీరిని విశేషముగ సత్కరించిరి. 1911-1918 లోపల మూడు పర్యాయములు కొందరు విద్వాంసుల ఆహ్వానము పై కాశికేగి అద్భుతరీతిని వాదించి, ప్రతివాది పంచాననులై సకల విద్వజ్జనముల బహుమానమునకు పాత్రులై గజారోహణోత్సవమును బొందిరి. 1.1-1917 నాడు ప్రభుత్వము వారు వీరికి 'మహామహోపాధ్యాయ' బిరుదము నొసగిరి. 1927 లో మైలాపూరు శ్రీనివాసస్వామి దేవాలయమున ఏబది గంభీర వేదాంతోపన్యాసములనిచ్చి అందరికిని శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంత రహస్యముల శ్రుతిస్మృతి సూత్రాది సమన్వయ పురస్సరముగ కరతలామలక మొద
<section end="571B" /><noinclude><references/></noinclude>
pg5hwnoyhm62vvndj7fsdmzqdjzhvc4
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/572
104
154626
569577
448435
2026-08-10T05:03:33Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569577
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము -౨||కపోతేశ్వర క్షేత్రము}}</noinclude><section begin="572A" />{{Css image crop
|Image = Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf
|Page = 572
|bSize = 600
|cWidth = 217
|cHeight = 365
|oTop = 74
|oLeft = 199
|Location = center
|Description =
}}
రించిరి. ప్రిన్సాఫ్ వేల్సు (ఎనిమిదవ ఎడ్వర్డు) భారత దేశమునకు వచ్చి మద్రపురికి వచ్చినపుడు (1922) రత్నఖచిత సువర్ణకంకణము, దుశ్శాలువలు మొదలగు బహుమానములతో వీరిని సత్కరించిరి. 1931 లో 'శ్రీరుక్మిణీ దేవి' ఉపన్యాసముల నిచ్చి సకల సహృదయ హృదయముల పల్ల వింపజేసిరి. 31-8-1934 లో
కాంచీనగరమున శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంతసభలలో " శ్రీ రామానుజ సిద్ధాంత విజయధ్వజ "అను గొప్ప
బిరుదమును, విశేష సత్కారములను బడసిరి. 1937 లొ ఆంధ్ర విశ్వవిద్యాలయము వారు వీరికి “కళాప్రపూర్ణ" బిరుదము నిచ్చిరి.
'''ఉద్యోగములు;''' మొదటకొంత కాలము కాళహస్తిలో నుండిరి. 1885 లో శ్రీ మహంతువారి ఆహ్వానము పై శ్రీ రంగాచార్యస్వామివారిచే నారంభింపబడి శ్రీ తేవ రంగాచార్యులవారి పర్యవేక్షణలో నున్న శ్రీ వేంకటేశ్వర
సంస్కృత పాఠశాలలో పండితులుగ జేరిరి, తదుపరి ప్రధానపండితులై, పాఠశాల కళాశాలగ మారగా, ప్రిన్సి
పాలై, కళాశాలను సర్వతోముఖముగ అభివృద్ధికి దెచ్చిరి. 40 సంవత్సరములకు పైగా నచ్చట అమోఘమగు సేవచేసి 1925 లో నివృత్తులైరీ, శ్రీ మహంతుగారు వీరిని దేవస్థానమునందు ఆస్థాన విద్వాంసులుగు నియమించి పరమ వదించువరకును వీరికి ప్రతిమాసము సమ్మాన వేతనము లభించు ఏర్పాటు చేసిరి.
వీరి గ్రంథములు : 1. కార్యాధికరణాశ్వాసము మూడు సంపుటములు (1909), 2. శ్రావణీ నిర్ణయము, 3. శ్రుతి సిద్ధాంత చంద్రిక- ఉపనిష ద్వ్యాఖ్యానము (1930) 4. సిద్ధాంతత్రయ సంగ్రహము- అరవము (1934),
5. వ్యాససిద్ధాంతమార్తాండము (1928), 6. శారీరక అధికరణ రత్నమాల (1937), 7. న్యాయసిద్దాంజన భూమిక (1937}, 8. నారాయణానువాక భాష్యము (1938). ఇవి ముద్రితములు. ఆ ముద్రితములు మరి కొన్ని గలవు.
'''శిష్యులు:''' శ్రీవారి చెంత చదువుకొన్న వారు పలువురు దిగంత విశ్రాంత యశో విరాజమానులైరి, అట్టి వారిలో శంకరంబాడి కృష్ణమాచార్యులు, మాడభూమి వేంకట వరదాచార్యులు, పట్టువల్లె నరకంకీరవ శాస్త్రి, విజయేంద్రాచార్యులు, వేదాంతం జగన్నాథాచార్యులు ముఖ్యులు.
'''ఉపసంహారము:''' వీరు తమ మరణకాల మాసన్నమైనదని తెలిసికొని అంతిమనారాయణ స్మృతికై నారాయణానువాకమును అనుసంధించుచు భాష్యరూపమున గ్రంథమును ప్రసాదించిరి. సమాప్తి మంగళ శ్లోకమును పెదవులతో నుచ్చరించుచు 7-1-1938 నాడు పరమపదమునకు విచ్చేసిరి. ఇట్లు 82 సంవత్సరముల పరిమితికల వీరిజీవితమంతయును వేదాంతశాస్త్ర విమర్శనమునందే గడచెను.
{{right|టి. కే. వి. యన్. సు.}}
<section end="572A" />
<section begin="572B" />'''కపోతేశ్వర క్షేత్రము :'''
ఆంధ్రప్రదేశమునందలి గుంటూరు మండలమున నరసరావు పేట తాలూకాలో గల చేజెర్లయను గ్రామము
కపోతేశ్వర క్షేత్రమని ప్రసిద్ధి గాంచినది. ఇది నరసరావు పేటకు నైరృతిభాగమున పండ్రెండు మైళ్ళ దూరమున
నున్నది. ప్రస్తుతమిది మూడు వేల జనసంఖ్యగల సామాన్య గ్రామము. ఇందు కపోతేశ్వరాలయము కలదు. ఆ దేవుని కీర్తిచే నిది దక్షిణకాశీ యని వాసిగాంచిన శివక్షేత్రము. ఆలయము చతుర్భుజాకారముగ నుండి, ప్రాకారము నందు ఆగ్నేయభాగమున మూడుగజముల యెత్తుగల
<section end="572B" /><noinclude><references/></noinclude>
kq19bbc2s9sg3l7o1yjaflzrcw9zk3j
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/573
104
154627
569578
448436
2026-08-10T05:25:26Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569578
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కపోతేశ్వర క్షేత్రము||సంగ్రహ ఆంధ్ర}}</noinclude>
సహస్రలింగ శిలావిగ్రహమును, నైరృతీభాగమున సప్త మాతృకల శిలావిగ్రహములను కలిగియున్నది. దీనికి
దక్షిణమున నున్న 'మల్లి కాగుంట' మను పుష్కరిణి, పశ్చిమముననున్న తటాకమును పేర్కొనదగినవి. ఈ గుడి ప్రక్కన నొక వాగు కలదు. దానిని 'ఓగౌరని పిలచెదరు. దీని అసలు పేరు ఓంకారనది యనియు, పూర్వ
మిచట మునులాచరించిన యభిషేకజలము నదీరూపమున ప్రవహించెననియు దీని పూర్వగాథ. ఇచ్చట శివరాత్రి, ముక్కోటి ఏకాదశి పుణ్యపర్వములం దుత్సవములు జరుగుచున్నవి. పూర్వమునుండి ఇది నరసరావు పేట జమీందారులగు శ్రీ శ్రీ మల్రాజువారి యాధిపత్యమున నుండెను. క్రీ. శ. 1950 ప్రాంతమున ప్రభుత్వ దేవాదాయ శాఖ క్రిందికి వచ్చినది.
కపోతేశ్వరాలయమునకు ముందు భాగమున 1933 వరకు నొక గొప్ప వృక్షముండెను. దాని యాకులు బిల్వ
దళములవలె 3 చీలికలు మొదలు 11 చీలికలవరకు బేసి సంఖ్యలో చీలి యుండెడివి. ఆ చెట్టున అనేక విధములగు పూవులు పూచెడివి. కాయలు, పిందెలు ఎన్నడును కనపడవు. 12 సం. ల కొకసారి ఒక ఫలము కాయు ననియు అది దేవతలచే నీశ్వరునకు సమర్పింపబడుచుండెననియు వాడుక. ఈ వృక్షమును 'పేరులేని పెద్దమాను' అని జనసామాన్యము వ్యవహరించుచుండెను.ఈ మాను మొదలునం దొక తొఱ యుండెను.
అందుండి భూమిలోనికి సొరంగము లుండెననియు, అందొకత్రోవ గుత్తి కొండకు, మరియొకటిశ్రీశైలమునకు,
వేరొకటి శాశీ క్షేత్రమునకు గొంపోవుననియు ప్రసిద్ధి. 1881 సం. వరకు జీవించియున్న శ్రీ తుంగదుర్తి బుచ్చయ్యగారు అనునొక సిద్ధపురుషుడీ క్షేత్రముసనే విశేషముగ నివసించుచుండెను. ఆ మహనీయుడు
జనులు చూచుచుండగనే ఈ చెట్టుతొర్రలోనికిపోయి అదృశ్యు డగుచుండెను. తిరిగి 6 నెలలకో, సంవత్సరము
నకో అందుండి వెలుపలకు వచ్చువాడట. ఆ మధ్య కాలమున కొందరకు కాశి యందును, కొందరకు
శ్రీశైలముందును, మరికొందరకు గుత్తికొండ యందును శ్రీ బుచ్చయ్యగారు దర్శన మిచ్చుచుండిరట. పైని చెప్పిన పేరు లేని పెద్ద మ్రాను గత రాక్షసనామ సంవత్సరమున ప్రజానీకమునకు వింతకొల్పుచు భస్మమయ్యెను. ఎట్లన మొదట సన్నకొమ్మలు పెద్దకొమ్మలలోనికి ప్రవేశించెను. పెద్దకోమ్మలు మ్రానిలోనికి ముడుచుకొని ఒక పెద్ద మొండెమువలె తయారయ్యెను. అంతట దిక్కులు పిక్కటిల్ల ఫెళ ఫెళ ధ్వనితో ఆ మ్రాను ఉత్తర దక్షిణములుగ క్రిందపడెను. సుమారు మూడుమానికల నెత్తురు క్రిందపడెను. అందుండి స్వయముగనే అగ్ని రగుల్కొని మ్రాను తగులబడజొచ్చెను. అది తగులబడినంత సేపు శవ దహనమువలె దుర్వాసన నలుగడల వ్యాపించెను. ఈ యద్భుతస్థితిని జూచుటకు ప్రజలు తండోపతండములుగా వచ్చి ఆశ్చర్య విషాదములను చెందిరి. సుమా రది పది పదునైదుదినములు తగులబడి బూదియయ్యెను. ఈ లక్షణ
ములను బట్టి ఆ వృక్ష రాజము శాపగ్రస్తుడగు మానవుడో, దానవుడో యై యుండునని తోచెడిది. ఇప్పుడా చెట్టుండిన ప్రదేశముతక్క తక్కిన వెవ్వియు గాన రావు.
{{Css image crop
|Image = Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf
|Page = 573
|bSize = 600
|cWidth = 327
|cHeight = 248
|oTop = 489
|oLeft = 139
|Location = center
|Description =
}}
చేజెర్ల యొక పురాతన దుర్గము. పల్లవు లీప్రాంతమును బాలించినట్లు శాసనాధారములు కలవు. ఆనందఋషి
గోత్రజుడును, అత్తివర్మ తండ్రియు<noinclude><references/></noinclude>
jvm83hn7dfqai6qd3m7z58ll4vwllko
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/574
104
154628
569587
448437
2026-08-10T07:03:19Z
A.Murali
3019
/* సమస్యాత్మకం */
569587
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము -౨||కప్తాన్ చార్లెస్ స్ట్రీట్}}</noinclude><section begin="574ఆ" />నను కంచరనృపతి వేయించిన సంస్కృతశాసన మొకటొ ఇచ్చట కాననగుటచే క్రీ. శ. 3వ శతాబ్దికి పూర్వమే
ఈ దేవాలయము కట్టబడినదనియు, చేజెర్ల చరిత్రప్రసిద్ధమగు నగరమనియు తెలియుచున్నది. ఈ దుర్గమును
చాళుక్య రాజవంశపు మూలపురుషుడు కుబ్జ విష్ణువర్ధనుడు పరిపాలించెనని చరిత్ర ప్రసిద్ధము. ఇతని తిమ్మా
పుర శాసనమునుబట్టి ఈతని రాజ్యము విశాఖపట్టణ మండల పర్యంతము వ్యాపించియుండెననిదమగుచున్నది.
చేజెర్లకు చేరుంజర్లయను నామము పురాసిన ప్రసిద్ధము. ఇచ్చట క్రీ. శ. 1165, 1140, 1247 సం. ల ప్రాంతమున వేయించిన శాసనములు దేవాలయమున గానబడుచున్నవి. ఇందు 1247 నాటి శాసనమున “చేంజర్ల” గ్రామమున కపోతేశ్వరుడు 4,444 లింగములచే పరివృతుడై యుండెనని తెల్పబడినది. దీనినిబట్టి ఆనాటికి “చేరుంజెర్ల" అను పదము "చేంజర్ల"గా మారినదని ఇందుమూలమున తెలియుచున్నది. తరువాత నదియే 'చేంజర్ల' అయినది.
శా. శ. 1085 (క్రీ. శ:-1163) నాటి ఇచ్చటి శాసనమొకటి 'మరుమ' వంశజుడగు కేతిరెడ్డి యొసర్చిన దీప
దానమును వివరించుచున్నది. శ్రీ తుంగతుర్తి బుచ్చయ్య గారి శాసనమువలన పూర్వ మీ క్షేత్రము మహాపట్టణ
మనియు, అందు అనేక దేవాలయములున్నట్లును తెలియుచున్నది. కోటిలింగములు, 78 గుళ్ళు, 28 వీథులు, 11 వినాయకులు, 10 భైరవులు, 1 కుమారస్వామి, 1 మాధవుడు, 1 గరుత్మంతుడు, 62 దుర్గలు, 20 వీరులు, 20 నాగన్నలు, 7 సూర్యులు, 11 చంద్రులు, 1 వీరన్న, 24 అక్క దేవతలు, 2 కృష్ణ విగ్రహములు, 4 రామలక్ష్మణులు, 3 హనుమంతులు, 2 వెంక టేశ్వరులు, 6 శాసనములు, 1 వృక్షము, 8 ద్వారపాలకులు, 1 శూలము, 5 స్తంభములు, 4 గుహలు, 4 మఠములు, 101 బావులు, 1 ఓ గౌరు, 3 చెరువులు, 3 కుంటలు ఇవన్నియు నున్నట్లా శాసనము తెల్పుచున్నది.
కపోతేశ్వర క్షేత్ర మాహాత్మ్యమునుగూర్చి యొక అద్భుతగాథ కలదు. కాశ్మీరము నేలుచున్న సూర్యవంశజుడు, యయాతిపౌత్రుడు, మాంథాతృ పుత్రుడు నగు శిబిచక్రవర్తి తన పెద్ద తమ్ముడగు మేఘాడంబరుడు,
రెండవ తమ్ముడగు జీమూతవాహనుడు అనువార లిద్దరును తీర్ధయాత్ర దక్షిణ భారతముకనుక
'చెరుంజర్ల' పర్వత గుహయందు గుపొనిస్టులై దేహత్యాగ మొనర్ని లింగాకారులై వెలయుటరుగాంచి యిచ్చటికి
పదిలక్షల సైన్యను వచ్చేను. మేమారన లింగాకృతియు, శ్రీ మాహాత్యమును తెలుసికొని అచ్చోటు శతయ్య, దీక్షాగతుడయ్యెను. తుట్టకుని యజ్ఞమును ప్రారంభించుట 'తొడనే దేవతలు, దానితో నాతడు నిత్య
బ్రహ్మలోక ప్రాప్తి నందునని కలవరమందిరి. త్రినివాస్తు లాతనిని పరీక్షించ నెంచి రూపు రేఖలు మార్చికొని 'కూ పెనగుంట' గ్రామము ప్రవేశించి, పై క్రీగంట వారించిరి. అచ్చోటనే నేటి 'కండ్లగుంట' గ్రామ మున్నది. అచ్చటినుండి త్రిమూర్తులు విప్పర్లకు చేరి అచ్చట బ్రవల్ల బాణముగను,శివుడు కిరాతుడుగను, విష్ణువు పావురముగను మారిరకని కొంద రందురు. కొందరు పరీక్షార్థము ఇంద్రాగ్ను లరు చెంచి డేగ పావురములుగ రూపొందిరని తలంచుచున్నారు.
ఎట్లైనను శిబి తనను శరణువేడిన పావురమును రక్షింప సమకట్టి, దాని ఎత్తు మాంసమును పరిహారముగా
నిచ్చుట కొడంబడి, దానినొక త్రాసున నుంచి తూచుచు తన యొడలి మాంసము వెంత యుంచినను దానికి సరితూగకపోవుటచే, చివరకు తానే స్వయముగా నందు కూర్చుండెననియు, అప్పుడు దేవతలు ప్రత్యక్షమై కీర్తించి రనియు ననెడి ఈతని గాథ జగత్ప్రసిద్ధము.
ఆ సమయమున శివుడు శిబికి పరము ప్రసాదింప సిద్ధపడగా నాతడు తనకు, తన పరివారమునకు కైలాస
సుఖమును, చేరుం జెర్లలో తమ శరీరములు లింగాకృతులై ఆచంద్రతారార్కముగ నిలచుటను అభ్యర్థించెను. అందువలననే ఇచ్చట కోటిలింగములు వెలసెనని ప్రసిద్ధి. ఇట్లు కపోతమును రక్షించిన కారణమున శిబి లింగాకారమగు రూపమును దాల్చి ధన్యుడగుటచే నాతని దేహము పొందిన లింగమునకు కపోతేశ్వరుడని నామము వహించెను. ఆ స్వామి మాహాత్మ్యము కారణముగా వా క్షేత్రము కపోతేశ్వర క్షేత్రమని ప్రసిద్ధివడసినది.
{{right|ద.శే.}}
<section end="574ఆ" />
<section begin="574B" />'''కప్తాన్ చార్లెస్ స్ట్రట్ (1765-1869):'''
కప్తానా చార్లెస్ స్ట్రట్ ఇంగ్లీషు పరిశోధకుడు. ఇంగ్లాండులో 1795 ఏప్రిల్ 28 వ తేదీన జన్మించినాడు. సైనిక
<section end="574B" /><noinclude><references/></noinclude>
7kx9e390enkb95s8xunnfaeswlws512
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/575
104
154629
569589
448438
2026-08-10T07:43:08Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569589
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కబీరు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude><section begin="575A" />వృత్తిలో ప్రవేశించి 39 వ రెజిమెంటుతో పాటు ఆస్ట్రేలియా వెళ్ళి 1828 లో ఆ దేశ నైసర్గిక వివరములు తెలిసికొనుటకు ప్రయత్నించి ముందు డార్లింగు నదిని కనుగొనినాడు. తరువాత అలెగ్జాండ్రినా సరస్సు యొక్క ఉనికిని కనిపెట్టినాడు. మూడవ పర్యాయము ముర్రే నదీలోయను కనిపెట్టుచుండగా (1844-1845) అనేక శారీరక క్లేశముల ననుభవించి, దృష్టి భాగ్యమును పోగొట్టుకొనెను.. చివర వరకు అతనికి కనుచూపు లభించలేదు. ఇతడు దక్షిణ ఆస్ట్రేలియాకు సర్వేయరు - జనరలుగా 1833 లో నియమింపబడినాడు. ప్రజాస్వామ్య ప్రభుత్వము వచ్చిన తరువాత 1856 వరకు ఛీఫ్ సెక్రటరీగా పనిచేసినాడు. కప్తాన్ ఛార్లెస్ స్ట్రట్ ఇంగ్లాండులో చెల్టన్ హాంలో 1899 జూన్ 16 వ తేదీన మరణించాడు.
{{right|పు, హ, రా.}}
<section end="575A" />
<section begin="575B" />'''కప్తాన్ జేంస్ కుక్ :'''
కప్తాన్ కుక్ పేరుపొందిన నావికుడు. ఇతని జీవితము సముద్రయానమునకు, కొత్తకొత్త ద్వీపములను, ప్రదేశ
ములను కనుగొనుటకు అంకితమైపోయినది. ఇతడు క్రీ.శ. 1728 లో ఇంగ్లండులో జన్మించినాడు. ఇతనికి 'ఎండవర్ ' అనెడు సొంతఓడ ఒకటి యుండెను. అదే అతని ప్రియతమమైన యానసాధనము. ఆ 'ఎండవర్ ' లో ఎక్కి తన జీవితకాలములో మూడుసార్లు సముద్రాలమీద పయనించినాడు.మొట్టమొదటిసారిగా 1768 లో ఇంగ్లండులో బయలుదేరెను. అతని ప్రయాణము దక్షిణ పసిఫిక్ మహా సముద్రముమీద. అక్కడ తిరుగుచు తిరుగుచు పెక్కు ద్వీపములను కనుగొన్నాడు. న్యూజిలాండ్ చుట్టును ప్రయాణముచేసి 'చాటనీబే' దగ్గర ఆగి గుడ్ హోప్ అగ్రముమీదుగా ఇంటికి చేరుకొన్నాడు. ఇది మొదటి ప్రయాణము. రెండవప్రయాణము 1772లో జరిగినది. ఈసారి కొత్తప్రదేశాలను, కనుగొన్న ద్వీపాలను గూర్చి నికరమైన అంచనా వేసుకోవాలనే ఆశయము అతనిది, ఈ ఆశయముతోనే అంటార్కిటిక్ సముద్రము దాక ప్రయాణముచేసి దక్షిణాఫ్రికా మీదుగా మళ్ళీ ఇంటికి తిరిగివచ్చినాడు. మూడవసారి ప్రయాణము 1776 లో జరిగినది. ఇదే అతని జీవితములో చివరి ప్రయాణము. ఈసారి అతని ముఖ్యాశయము ఫసిఫిక్ సముద్రములో ఉత్తర పశ్చిమాలుగా ఒక దారి కనుగొందా మని అట్లా బయలుదేరి బేరింగ్ స్ట్రెయిట్ అంతయు అవలోకనము చేయుచు, కం చాట్కా (Kam Chatka), అలూషియన్ ద్వీపాలు తాకుచు, ఇంటికి వస్తూవస్తూ దారిలో హవాయి ద్వీపములో ఆగినాడు. ఆ ద్వీపవాసు లకును, అతనికిని జరిగిన సంఘర్షణములో కప్తాన్ జేమ్సుకుక్ వారికి దొరికిపోయినాడు. వారిచేత ఘోరముగా చంపబడినాడు.
{{right|నా. కృ, కు.}}
<section end="575B" />
<section begin="575C" />'''కబీరు :'''
ప్రసిద్ధ హిందీకవులలో కబీరొకడు. ఇతడు హిందీ సాహిత్యమున నిర్గుణ శాఖకు సంబంధించిన భక్తి వాఙ్మయ
ప్రవర్తకుడుగ భావింపబడుచున్నాడు. అతడు అసాధారణ శక్తి సంపన్నుడు; సంఘసంస్కర్త; సూఫీ వేదాంతి
యని ముస్లిములును, ఏకేశ్వరోపాసకుడని హిందువులును భావించుచున్నారు. ఇతడు హిందూ-ముస్లిం మత సామరస్యమును చేకూర్చినవారిలో నగ్రగణ్యుడు.
ఇతని జనన మరణ స్థల కాలములను గుఱించి వాదములు కలవు. ఇతని జన్మస్థానము మగహర్ అని కొందరు, ఆజమ్గఢ్ కు చెందిన బేలహరా గ్రామమని కొందరు, కాశీ యని కొందరు భావించుచున్నారు. కానీ ఇప్పుడు లభించుచున్న ఆధారములను బట్టి కబీరు విక్రమశకము 1455 లో కాశీలో జన్మించెనని పెక్కురు నమ్ముచున్నారు.
ఇతడు ప్రహ్లాదుని అపరావతార మనియు, వైష్ణవ మత ప్రవక్త యగు శ్రీ రామానందులవారి యాశీర్వాదముచే హిందూదేవాంగ స్త్రీ యగు ప్రతిచి యను వితంతు గర్భమున జన్మించెననియు ప్రతీతి కలదు. ఆమె తనకు
గలిగిన విపత్తునకు వగచి, లోకభీతిచే నా శిశువు నెత్తుకొని పోయి శాశీకి సమీపమున నున్న 'లహర్ తారా' అను చెరువుగట్టుపై నొక తామరాకుపై నుంచి నిశీధమున పారిపోయెను. ఆ మార్గమున పోవుచున్న నూర్ అలీ,
నీమా యను మహమ్మదీయ దంపతులా శిశువును భగవత్ప్రసాదముగా భావించి, పోష్యపుత్రునిగా పెంచి, ఆ
యూరి కాజీచేత 'కబీర్ ' అని నామకరణము చేయించిరి. ఈ వృత్తాంతమును గూర్చిన సత్యాసత్యము లెట్లున్నను కబీరును పెంచినవారు నూర్ అలీ, నీమా దంపతు లనుట నిర్వివాదము.
<section end="575C" /><noinclude><references/></noinclude>
0t69a9hxloq22lj1xwbbxi6oqd1byvg
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/576
104
154630
569594
448439
2026-08-10T07:57:35Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569594
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||కబీరు}}</noinclude>
కబీరునకు లోయీ, ధనియా అను నిద్దరు భార్య లుండెడివారు. కమాల్ అను పుత్రుడు, కమాలీ అను
పుత్రిక ఇతని సంతానము. ఇతడు తన కులవృత్తి యగు సాలె పనిని చేసి తన్మూలమున కుటుంబపోషణ మొనరించు కోనెడివాడు. ఈతని జీవితమంతయు పేదరికముననే గడచినది.
కబీరునకు గురు వెవ్వరను విషయమున కొన్ని గాథలు కలవు. కబీరు పిన్ననాటినుండియు భక్తియుక్తు డగుటచే
హిందూ మతానుసారము గురూపదేశము పొందవలెనని తలంచెను. అందుకై సద్గురువు నన్వేషించుచుండెను. మహనీయులగు శ్రీ రామానందులు నిత్యము కాశీ యందలి పంచగంగా ఘట్టమున గంగాస్నాన మొనరింతురని తెలిసికొని ఒక వేకువన కబీరు ఆ స్నానఘట్టపు సోపానముపై పరుండెను. రామానందులు అలవాటు చొప్పున నచటి కరుదెంచగా వారిపాద మాతనికి సోకెను. రామానందుడు 'రాం రాం' అని స్మరించెను. దానినే కబీరు మంత్రోపదేశముగా భావించి వారిని గురువుగా నెంచి స్మరించెను. రామానందులు కబీరు యొక్క పవిత్ర హృదయమునకు మెచ్చి అతనికి గురుదీక్ష నిచ్చెను. కబీరు తనగురుదేవునికిని, కాశీ పండితులకును జరుగు వాదోపవాదములను విసుచు వేదాంత, సాంఖ్య సూత్రార్థములు గ్రహించెను. ప్రఖ్యాత సూఫీయును, ముస్లిం ఫకీరును అగు షాక్ తాకీ అనువాని వలన ఇస్లాము మత విషయము లీతనికి జ్ఞాతము లయ్యెను. కాని ఇతనికి రామానందులవారిపైనను, ఫీర్ పీతాంబకులపైనను గొప్ప గౌరవ భావనములు కలవని సూచించుట కీతని రచనలే సాక్షి,
కబీరనేక పుణ్యక్షేత్రములను, సత్పురుషులను సందర్శించెను. అందువలన భారతదేశమునందు వ్యాపించి
యున్న అప్పటి వివిధ సంప్రదాయ రహస్యములను, మతతత్త్వములను నీతని కవగతమాయెను. ఈతని కాలమున మన దేశమున దాదాపు పదునాలుగు ముఖ్యమైన ధార్మిక సంప్రదాయములు ప్రచారమున నుండెను.
హిందూధర్మమున శైవ, వైష్ణవ, శాక్తేయ నాథ సంప్రదాయములు, మహమ్మదీయ మతమున షియా, సున్నీ
భేదములు సూఫీ సంప్రదాయము మొదలగునవి వానిలో ప్రధానములు. వీటి మూలసూత్రము లుత్తమములయి
యున్నను, తదనుయాయులయందు పెక్కు మూఢ నమ్మకములు, మూఢాచారములు ప్రబలియుండ వానిని
కబీరు తీవ్రముగా విమర్శించెను; జనసామాన్యమున సదాచారములను స్థాపించుటకు ప్రయత్నించేను. అందు
వలన హిందువులు, మహమ్మదీయులు ఇద్దరును కబీరును ద్వేషించెడివారు. ఇది కారణముగా నతడు కాశీని వదలవలసి వచ్చెను. అయినను తాను సత్యమని నమ్మిన దానిని కబీరు వదలడయ్యెను. తన ముప్పదియవ సంవత్సరమున నాతడు వైరాగ్యవృత్తి నవలంబించెను. హిందూ మహమ్మదీయ మతములలో దేనినిగూడ సనుసరించ లేదు.
ఏకేశ్వరవాదము, సామ్యవాదము, భక్తివాదము, జన్మాంతరవాదము, అహింసావాదము, ప్రపంచ నిస్సారత్వము, మాయావాదము, అవతారవాదము, హింసావాదము మున్నగువాని నీతడు ప్రతిపాదించెను. కర్మకాండ, వ్రతములు, తీర్థయాత్రలు, విగ్రహారాధన, వర్ణాశ్రమధర్మములు అతనిచే నిరసింపబడినవి. వైష్ణవులు శ్రీరాముని సాకేతనివాసియని కీర్తించు విధముననే ఈతడు తనప్రభువును 'సత్యలోకవాసి, మాత, పిత, పత్ని,
మిత్ర,' అని సంబోధించెను. తన రచనలలో దేవుని హరినారాయణ, సారంగపాణి, సమర్ధ, కర్త, కరతార,
బ్రహ్మ, పరబ్రహ్మ, నిరక్షర, సత్యనామక. మురారి. ఇత్యాది నామములచే కొనియాడెను. ఇతడు భక్తికి అగ్ర
స్థానమిచ్చెను. మక్కా యాత్రకు పోవుటను, మసీదులో 'అల్లాహో అక్బర్'' అని అరచుటనుకూడ ఇతడు నిరసించెను. తాను దేవదూత నని నమ్మించి, హిందూ మహమ్మదీయ మతములకు సామరస్యము కల్గించి మత సంబంధమైన అశాంతిని పోగొట్టినాడు. హిందూ మహమ్మదీయమతాధిపతులను, పవిత్ర మతగ్రంథము లను నిరసించి రెండు మతములవారును నిస్సంశయముగా అవలంబింపదగిన నూతన మతమును నెలకొల్పెను. సంఘ సంస్కారదృష్టితో పరిశీలించినచో నిష్కళంకమగు నితనిరచనలు అమూల్యములని చెప్పవచ్చును. ఇతడు తారక మంత్రమును జపించుచుండుటచే తురక లితనిని 'కాఫిర్ ' (విగ్రహారాధకుడు)
అనియు, మహమ్మదీయుడై యుండి హిందూ దేవతలను స్తుతించుచుండుటచే హిందువులును ఇతనిని దూషింపసాగిరి, దానికి సమాధానముగా 'నానాల్క పైని విష్ణువు,<noinclude><references/></noinclude>
aq83bxyg90co4i53mo1ackcdfqhmyah
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/577
104
154631
569595
448440
2026-08-10T08:11:51Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569595
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కబీరు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude>
కన్నులతో నారాయణుడు, హృదయములో గోవిందుడు నివసించేద' రని జవాబుచెప్పెను.
కబీరు విద్యావంతుడు కాడు; శాస్త్ర పరిచయము లేదు. కాని తాను సంపాదించుకొన్న జ్ఞానమును, తనకు
కలిగిన అనుభూతులను ప్రజల కర్థమగు పద్ధతిలోను, భాషలోను వివరించు విషయమున నాతని కతడే సాటి. కబీరు పెక్కు పదములను, గేయములను, పాటలను రచించెను. ఇవి పంజాబీ, రాజస్థానీ, అవధీ, ఖడిపోలి, ప్రజభాష, పూరభిభాష అనువానిచే మిశ్రితములయి యున్నవి. రస పూరితములును, భావగర్భితములును నైన ఈతని పాటలలోని పవిత్రభావములు జనుల నాకర్షించుటచేత పెక్కు రీతని ననుసరించిరి. ఈతని రచనలు 'కబీరు వాణిసంగ్రహ' మను పేర బీజక్, ఇనిరమైనీ, సబద్ సాణీ అని మూడుభాగములుగా విభజింపబడినవి. ఇందు సిజక్ ప్రథమ గ్రంథమును, కబీర్ అనుయాయుల మత గ్రంథమునునై వరలుచున్నది. ఈతని రచనలలో మూడు పద్ధతులు గోచరించును. అవి సౌఖీ, రమెనీ, సబ్ద్ అనునవి. సాటి అనగా సాక్షి యని అర్ధము. సాక్షివలె నుండి తన అనుభవములోనికి వచ్చిన పరమార్థతత్వమును వ్యక్తపరచుటకు కబీరు ఈ
సాఖి విధానము నుపయోగించెను. కొన్ని చేపాయీల తరువాత ఒక దోహాను చేర్చుటయే రమైనీ విధానము,
సబ్ దులు గానానుకూలములు. కబీరు రచన లింకను పూర్తిగ దొరుకలేదు, లభ్యములైన వాటియందును
ప్రక్షిప్తములు లెక్కకు పెక్కు ఇంకను నిర్దుష్టములైన పాఠములు వెలువడవలసి యున్నది.
ఇతని యుపదేశములలో సన్నిమతముల సారము, వానిలోని మంచి విశేషములు మనకు లభించును. ఇదియే
కబీరుపంథయందలి ప్రత్యేకత. ఇతని యుపదేశములు ఆధ్యాత్మికములుగను, సాంఘిక సమస్యా పరిష్కారాత్మక
ములుగ నున్నవి. కబీరు పరమాత్మ జీవాత్మలు భిన్ను అని భావించువాడు కాడు. శరీరస్థుడయిన జీవుడు తెలిసికొనెడి వాడు, తెలిసికొనబడెడివాడు నని యాతడు నిర్వచించెను. తన నిర్వచనమును స్పష్టపరచుటకు ప్రతిబింబసాదృశ్యమును గ్రహించెను. జీవాత్మ పరమాత్మ లొక్కరే యను భావము కలుగకుండ మాయాతత్వము 'జనులను భ్రమలో వేయుచున్న దనెను. మాయ త్రిగుణాత్మక యనియు, విశ్వమోహిని యనియు ఒక చోట నుడివెను. ఈతత్త్వ నిర్వచనమునుబట్టి చూచినచో కబీరు సంపూర్ణముగా సర్వైవ వాదియని చెప్పవచ్చును. అద్వైత సిద్ధివొందుటకు సహజయోగ మవసరమనియు, సహజసమాధి ముఖ్యమనియు నుపదేశించెను చిత్తవృత్తినిరోధాదులను నిరసించి, భగవన్నామస్మరణచే సహజ యోగమును సాధించవచ్చుననెను. కబీరు తరచుగా తన రచనలలో సహజసమాధిని గురించి చర్చించివాడు. సమాధియందు ధ్యానము చేయువాడు, ధ్యానించబడెడి లక్ష్యము ఈ ద్వయమును ఏకాకృతి దాల్చును. అట్టి స్థితిని కృత్రిమో పాయముల మూలమునగాక సహజముగనే సాధించవలెసని కవీరు సిద్ధాంతీకరించెను. భగవత్సాక్షాత్కారమునకు 'భావభక్తి' అవసరమని యాతని యుపదేశము.
సాధన ప్రక్రియలో సహజశీలముల ప్రాధాన్యము నీతడు వివరించెను. సతీత్వము, సంతోషము, జాగరూకత,
శబ్దభేదనము (శబ్దరహస్య పరిచయము), సువిచారము అనునవి సహజశీలములు, సాధకుడు వీటిని సదా తన
జీవితమున అనుసరించవలెనని కబీరు సుస్పష్టపరచెను.
కబీరు శిష్యులు మధ్యప్రదేశ్, బీహారు, సంయుక్త రాష్ట్రములలో బహుసంఖ్యాకులుగా నున్నారు. ఈ
పంథీయులు 12 తెగలవారు. అవి: కబీరు, మూలకబీర్, సంతకబీర్, రాంకబీర్, దాసకబీర్, మౌలాకబీర్,
సాహెబు కబీరు, గురుకబీర్, బాబా, సాధు, నానాలీ మాల కబీర్ అనునవి. వీరిలో సన్న్యాసులును, గృహస్థు
లును కలరు. ఈతని శిష్యులలో ప్రధానులు కమాల్, జమాల్, విమల్, బోధను దాదు, పద్మనాథ్, ధర్మదాసు,
సురజగోపాల్, రాంవిలాసు అనువారలు.
కబీరు వి.శ. 1505 సం॥లో మగహర్ గ్రామమున ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశినాడు పరమపదించెనని 'భక్త
సుధాబిందు స్వాద' మను గ్రంథమువలన తెల్లమగుచున్నది. అచ్చట అతని గోరికలదు; ప్రతియేట నక్కడ మేళా జరుగును.
హిందూ మహమ్మదీయు లితనిభక్తులై యుండుటచే ఇతడు మరణించినప్పుడు శవసంస్కార విషయమున పేచీ
వచ్చినది. మృతకాయమును దహనము చేయవలయునని హిందువులును, ఖననము చేయవలయునని ముసల్మాను<noinclude><references/></noinclude>
n9hv6hpkkz537qf98dhbi0rgyb2zjuo
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/578
104
154632
569626
448441
2026-08-10T11:51:06Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
569626
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము -౨||కమీనియస్ జాన్ ఆమస్}}</noinclude><section begin="578A" />లును పట్టుపట్టిరి. కాశీరాజు వీరసింగు బిజిలీఖాను కత్తులతో పోరాడసాగిరి. ఆదారిని పోవుచున్న ఒక మహా
త్ముడు ఆజగడము చూచి, 'శవముపై కప్పియున్న దుప్పటిని తీయు డనెను. అంతట చుప్పటి క్రింద పూవులు కనపడెను. వారందరు వాటిని చెరిసగము పంచుకొనిరి. కాశీలో నితనిశిష్యులు ఆపూవులను దహనముచేసి, ఆభస్మమునుపూడ్చి దానిపై సమాధి నిర్మించిరి. మిగిలిన సగము పూవులను తురకలు మగహర్ లో పూడ్చి గోరీని కట్టిరి.
కబీరు సత్యసంధుడు, సరళస్వభావుడు. సాధుత్వము, నిశ్చలభక్తి మున్నగు గుణసముచ్చయము కారణముగా
భక్తులితనిని ‘భక్త ధ్రువతార'గా పరిగణించుచున్నారు. విదేశీయులుగూడ ఇతని మహత్తును తెలిసికొని గౌరవించుచున్నారు.
{{right|వే. ఆ.,}}
{{right|యం. రా.}}
<section end="578A" />
<section begin="578B" />'''కమీనియస్ జాన్ ఆమస్ (1592- 1671) :'''
'''జీవిత సంగ్రహము :''' ఆధునిక బోధన విధానమునకు మూలపురుషు డనదగు జాన్ ఆమస్ కమీనియస్ 1592 లో మొరేవియా దేశమందలి "నివినిట్జ్” (Nivinitz) గ్రామమున జన్మించెను. బాల్యమునం దీతనికి సరియగు పోషణ లభింపకపోవుటచే గాబోలు పదునారవయేటి వరకును ఇతడు లాటిన్ భాషాభ్యాసమును ప్రారంభింపజాలక పోయెను. ఆ కాలమున లాటిన్ భాషాజ్ఞానమునకు ప్రాముఖ్యము మెండు. 'పెద్దవాడైన తరువాత ఆ భాషను నేర్చుకొన మొదలిడినందున ఆనాటి బోధన విధానమందుగల యనవసర వ్యాకరణ ప్రాబల్యమును, అసహజ బోధన పద్ధతులను గ్రహింపగలిగెను. లాటిన్ పాఠశాలలో విద్య పూర్తి చేసికొని యతడు "హెర్బార్న్ " (Herborn) పట్టణమందలి కళాశాలలో రెండు సంవత్సరములు చదివి. పిమ్మట "హీ డెల్బర్లు" (Heidelberg) విశ్వవిద్యాలయ మందు ఉన్నతవిద్యను, దానితోపాటు ప్రొటెస్టెంటు మత విద్యను బడసెను. తరువాత నాలుగు సంవత్సరముల పాటు “ప్రేరో” (Prerau) యందలి పాఠశాలలో ఉపాధ్యాయుడు గా పనిచేసెను. తన ప్రథమ గ్రంథమగు (Precepts of Easier Grammar) "సులభ వ్యాకరణ సూత్రములు" అనుదాని నిచ్చటనే రచించెను. పిమ్మట1618 నుండి 1821 వరకును "ఫుల్నెక్" (Fulneck) పురమున మతబోధకుడుగా నుండెను. యూరపునం దా తరువాత నేర్పడిన యుద్ధ పరిస్థితులలో నెన్నియో ఇక్కట్టు
లకు లోనయి తుదకు 1627 లో పోలెండునందలి “లెజ్నో"(Lejno) పట్టణమందు నివాస మేర్పరచుకొనేను,
'''ఈతని రచనలు :''' కమీనియస్ ఈలెజ్నొ పట్టణమందు గల "మొరేవియన్ జిమ్నాజియం" అను పాఠశాల యందు 14 సంవత్సరములు ప్రధానోధ్యాయుడుగా పని చేసిన కాలములో నూతన పద్ధతులపై లాటిన్ బోధించుటకై వాచకములను వ్రాసెను. ఇందలి ప్రథమ గ్రంథము "భాషా కవాటములను తెరచుట" (Janua Linguarum) యను దానియందు అతిసామాన్య భావములకును, వస్తువులకును జెందిన సుమారు ఎనిమిదివేల
పదములను వాక్యములద్వారా ప్రవేశ పెట్టెను. ప్రతి పుటకును కుడివైపున, లాటిన్ పదమును ఎడమవైపున
మాతృభాషలో దాని యర్థమును ఇచ్చెను. ఈ వాచకముల యుపయోగము వలన విద్యార్థులకు లాటిన్ భాషతో
పాటు సామాన్య వస్తుజ్ఞానముకూడ కలుగగలదు. ఈ వాచకరచనలో నీతనిపై పూర్వ విద్యావేత్తలగు 'రాటిక్
(Ratick), బేటస్ (Baetus) ల ప్రభావము గన్పడును.
ఈ వాచకము ప్రారంభకులకు కఠినమని గ్రహించి కొలది కాలములోనే ప్రవేశిక (Vestibule) గ్రంథమును
రచించెను. దీనియందు అతి సాధారణమగు కొన్ని వందల పదములను మాత్రమే యుంచెను. 1642 నుండి 1650 వరకును నీ రెండు గ్రంథములను బోధించుటకు కావలసిన నిఘంటువులను, వ్యాకరణములను గూడ ప్రకటించెను. తరువాత 1950 లో “నరాస్ పాటక్" (Saros Patak) పురమున నివసించుచు, "జాన్యువా" గ్రంథమునకు తరువాతిదగు "ప్రవేశహాలు" (Atrium) అను పుస్తకమును రచించెను. దాని తరువాతిదగు "జ్ఞానసౌధము" (Palace of wisdom) అను పుస్తకమును రచించనెంచెను గాని కొనసాగలేదు. ఈ తుది పుస్తకమందు వివిధ ప్రఖ్యాత రచయితల గ్రంథములనుండి సేకరణలు పొందు పరుప నెంచెను. పిమ్మట "పాఠశాలో నాటికలను”, “చిత్ర మయ జగత్తు" (Orbis Pictus) అను ఉద్గ్రంథమును రచించెను. ఈతడు "జాన్యువా” నే చిత్రములతో చేర్చి "చిత్రమయ జగత్తు" అను పేర ప్రకటించే సనవచ్చును.
<section end="578B" /><noinclude><references/></noinclude>
ioqwl53b2xjkwtq3duv7waozgo9izru
పుట:Grandhalaya Sarvasvamu - Vol.5, No.1 (1921).pdf/36
104
204785
569469
533320
2026-08-09T12:35:37Z
Brjswiki
6801
569469
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>సీ౹ నవనిధుల్ గలలో నాధునానని జేరి రాజశేఖరులు మిత్రత ఘటింప
సురభిసంతానముల్ నెఱయు గోపరియుచు మొనసి యు పేంద్రుండు పని వినంగ
నిరుపను వాహినీశ్వర సేవితుడఁటంచు భువనముల్ తనపర్పుఁ బూనిసేయ
పరమపావనుఁడయి ప్రబలెడిబలుఁ డంచు తనచే ధనుంజయోద్దతులువెలయ
గీ౹ భవ్యతేజంబు సత్కాశావళి శుచిత్వ | పూర్తి నుగ్రాంబకస్ఫూర్తి పొలుపుఁ గాంచు
ధర్మభవ లోకపాలకోత్తముని యెదుట | మోపు ఖద్యోతిమ్రోల ఖద్యోత మైత్రి
సీ౹ రాజసూయాాత్త సామ్రాజ్య సింహాసన ఖచితరత్నంబు లేకడవెలుంగ
సాత్యకి కిరధృతోజ్యొల మౌక్తికచ్ఛత్ర దీధితిప్రతితి చంద్రికలనీన
భీమార్జునావర్తి తామలచామర క్రమము వపంతవారముల నింప
శౌదిమాద్రేయ దష్టధ్యమ్య వినతభూ భృన్మాళిరుచులు నీ రెండగాయ
గీ౹ ససను వైభవిసాంద్రఁడై యమసుతుఁడు | నిండుకొలువున్న విన్నవై నిలుచునన్ను
కృష్ణ కృష్ణానుజులు కృష్ణ కృష్ణ దీమ | ముఖులు గని నవ్వ నవమానమును మునింగి |
ఉ౹ అంగము రొసియుండియు సభాంగణమున్నబోయి నప్పుడం
డంగద యెంద లేని మణు లయ్య! నను ఔను వెట్టిజేయ నే
భింగ్పడంగి నన్నగని పక్కున నవ్వెను భీముఁ గూడి మై
పొంగఁగ నేవుర౯గవయు భోగిని గౌరవ మెంచి కొంకక
ఉ౹ రాయలకీ గియన్ సురనుతంఒగుభాగ్యము లెండలై సభన్
దాయలకైన వారిపెనువ్వులు దాపశిఖాలియై కడు౯
హేయపుఁ దొత్తుఁ గేలఁగోనుటెంతయు దుర్దనవర్షమైన భూ
నాయక మానవల్లిక వినమ్రత నెండియుఁ గాలిరూపరె౯
గీ౹ వసుచయంనిచ్చి | ప్రాణఁబు ప్రాణంబు | నిచ్చి మానమును మహీశ గావ
వలయుఁ గాన మానవిలయమై మఱినేల | కొనకయున్న ప్రాణ మునుపఁదగునె
కం౹ కావు సుధర్మవిభవము | చేవ౯గోన రామి శకునీచే పనిచే ద్యూతమునన్
కైవసమొనర్చి వారల | సేవలకున్ జొనుపకున్న జీవము నొల్లన్ |
కం౹ సెలవిమ్మని యేడ్చుచు నల | జలిబడి పలవించుసుతుని సంభ్రమమునఁగౌఁ
గిలినుంచి యాంబినేయుడు | తులువలవలఁచిక్కి భీతితో నిట్లనియెన్ |
ఉ౹ జూదము ఖేదమున్ బెనిచి సుస్థిరధర్మమునొంచి పిమ్మటన్
వాదము బేదమున్గలుగఁ బార్థుల ధర్మమువంచి నీ మహా
హ్లాదము మోదమున్ జెరువునటుల బుత్ర కళత్ర రోదనో
వ్మాదము నాదమున్ బలధనక్షయమున్ ఘటియింపకుందునే|
చ౹ వలసిన నీవు దిగ్విజయ వైభవమ౯గని ధీరవృత్తి న
వ్వల సిరిగూర్చి చేయు మొక భవ్యముఖంబు సుఖంబుగాఁగఁ గే
వల సితపక్ష చంద్రప్రతి భవ్యయశంబుఁ జెలంగఁ జిన్నిత్రో
వల శివమెత్తినట్లరుగవచ్చును జిచ్చును హెచ్చుపుచ్చఁగ౯ |<noinclude><references/></noinclude>
bqus6o7mxzd2ibhc6isdf6wdcqgo1gf
569596
569469
2026-08-10T09:14:25Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
569596
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem> నవనిధుల్ గలలో నాధునానని జేరి రాజశేఖరులు మిత్రత ఘటింప
సురభిసంతానముల్ నెఱయు గోపరియుచు మొనసి యు పేంద్రుండు పని వినంగ
నిరుపను వాహినీశ్వర సేవితుడఁటంచు భువనముల్ తనపర్పుఁ బూనిసేయ
పరమపావనుఁడయి ప్రబలెడిబలుఁ డంచు తనచే ధనుంజయోద్దతులువెలయ</poem>|ref=}}
{{Telugu poem|type=గీ.|lines=<poem> భవ్యతేజంబు సత్కాశావళి శుచిత్వ | పూర్తి నుగ్రాంబకస్ఫూర్తి పొలుపుఁ గాంచు
ధర్మభవ లోకపాలకోత్తముని యెదుట | మోపు ఖద్యోతిమ్రోల ఖద్యోత మైత్రి</poem>|ref=}}
{{Telugu poem|type=సీ.|lines=<poem> రాజసూయాాత్త సామ్రాజ్య సింహాసన ఖచితరత్నంబు లేకడవెలుంగ
సాత్యకి కిరధృతోజ్యొల మౌక్తికచ్ఛత్ర దీధితిప్రతితి చంద్రికలనీన
భీమార్జునావర్తి తామలచామర క్రమము వపంతవారముల నింప
శౌదిమాద్రేయ '''దుష్టదుృధ్యమ్య వినతభూ భృనౌళిరుచులు''' నీరెండగాయ</poem>|ref=}}
గీ౹ ససను వైభవిసాంద్రఁడై యమసుతుఁడు | నిండుకొలువున్న విన్నవై నిలుచునన్ను
కృష్ణ కృష్ణానుజులు కృష్ణ కృష్ణ దీమ | ముఖులు గని నవ్వ నవమానమును మునింగి |
ఉ౹ అంగము రొసియుండియు సభాంగణమున్నబోయి నప్పుడం
డంగద యెంద లేని మణు లయ్య! నను ఔను వెట్టిజేయ నే
భింగ్పడంగి నన్నగని పక్కున నవ్వెను భీముఁ గూడి మై
పొంగఁగ నేవుర౯గవయు భోగిని గౌరవ మెంచి కొంకక
ఉ౹ రాయలకీ గియన్ సురనుతంఒగుభాగ్యము లెండలై సభన్
దాయలకైన వారిపెనువ్వులు దాపశిఖాలియై కడు౯
హేయపుఁ దొత్తుఁ గేలఁగోనుటెంతయు దుర్దనవర్షమైన భూ
నాయక మానవల్లిక వినమ్రత నెండియుఁ గాలిరూపరె౯
గీ౹ వసుచయంనిచ్చి | ప్రాణఁబు ప్రాణంబు | నిచ్చి మానమును మహీశ గావ
వలయుఁ గాన మానవిలయమై మఱినేల | కొనకయున్న ప్రాణ మునుపఁదగునె
కం౹ కావు సుధర్మవిభవము | చేవ౯గోన రామి శకునీచే పనిచే ద్యూతమునన్
కైవసమొనర్చి వారల | సేవలకున్ జొనుపకున్న జీవము నొల్లన్ |
కం౹ సెలవిమ్మని యేడ్చుచు నల | జలిబడి పలవించుసుతుని సంభ్రమమునఁగౌఁ
గిలినుంచి యాంబినేయుడు | తులువలవలఁచిక్కి భీతితో నిట్లనియెన్ |
ఉ౹ జూదము ఖేదమున్ బెనిచి సుస్థిరధర్మమునొంచి పిమ్మటన్
వాదము బేదమున్గలుగఁ బార్థుల ధర్మమువంచి నీ మహా
హ్లాదము మోదమున్ జెరువునటుల బుత్ర కళత్ర రోదనో
వ్మాదము నాదమున్ బలధనక్షయమున్ ఘటియింపకుందునే|
చ౹ వలసిన నీవు దిగ్విజయ వైభవమ౯గని ధీరవృత్తి న
వ్వల సిరిగూర్చి చేయు మొక భవ్యముఖంబు సుఖంబుగాఁగఁ గే
వల సితపక్ష చంద్రప్రతి భవ్యయశంబుఁ జెలంగఁ జిన్నిత్రో
వల శివమెత్తినట్లరుగవచ్చును జిచ్చును హెచ్చుపుచ్చఁగ౯ |<noinclude><references/></noinclude>
0nl7j11mqn277vq96ju6u4989v3d05f
569629
569596
2026-08-10T11:54:57Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
569629
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem> నవనిధుల్ గలలో నాధునానని జేరి రాజశేఖరులు మిత్రత ఘటింప
సురభిసంతానముల్ నెఱయు గోపరియుచు మొనసి యు పేంద్రుండు పని వినంగ
నిరుపను వాహినీశ్వర సేవితుడఁటంచు భువనముల్ తనపర్పుఁ బూనిసేయ
పరమపావనుఁడయి ప్రబలెడిబలుఁ డంచు తనచే ధనుంజయోద్దతులువెలయ</poem>|ref=}}
{{Telugu poem|type=గీ.|lines=<poem> భవ్యతేజంబు సత్కాశావళి శుచిత్వ | పూర్తి నుగ్రాంబకస్ఫూర్తి పొలుపుఁ గాంచు
ధర్మభవ లోకపాలకోత్తముని యెదుట | మోపు ఖద్యోతిమ్రోల ఖద్యోత మైత్రి</poem>|ref=}}
{{Telugu poem|type=సీ.|lines=<poem> రాజసూయాాత్త సామ్రాజ్య సింహాసన ఖచితరత్నంబు లేకడవెలుంగ
సాత్యకి కిరధృతోజ్యొల మౌక్తికచ్ఛత్ర దీధితిప్రతితి చంద్రికలనీన
భీమార్జునావర్తి తామలచామర క్రమము వపంతవారముల నింప
శౌదిమాద్రేయ '''దుష్టదుృధ్యమ్య వినతభూ భృనౌళిరుచులు''' నీరెండగాయ</poem>|ref=}}
{{Telugu poem|type=గీ.|lines=<poem> ససను వైభవిసాంద్రఁడై యమసుతుఁడు | నిండుకొలువున్న విన్నవై నిలుచునన్ను
కృష్ణ కృష్ణానుజులు కృష్ణ కృష్ణ బీమ | ముఖులు గని నవ్వ నవమానమును మునింగి |</poem>|ref=}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem> అంగము రొసియుండియు సభాంగణము౯గనబోయి నప్పుడం
డంగద యెందులేని మణు లయ్యనను౯ ఔనువెఱ్ఱిజేయ నే
భంపడంగ నన్నగని పక్కున నవ్వెను భీముఁగూడి మై
పొంగంగ నేవుర౯గవయు భోగిని గౌరవమెంచికొంకక౯</poem>|ref=}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem> రాయలకీర్తియన్ సురనుతంఒగుభాగ్యము లెండలై సభన్
దాయలకైన వారిపెనువ్వులు దాపశిఖాలియై కడు౯
హేయపుఁ దొత్తుఁ గేలఁగోనుటెంతయు దుదుర్దినవర్షమైన భూ
నాయక మానవల్లిక వినమ్రత నెండియుఁ గాలిరూపరె౯</poem>|ref=}}
{{Telugu poem|type=గీ.|lines=<poem> వసుచయంనిచ్చి | ప్రాణఁబు ప్రాణంబు | నిచ్చి మానమును మహీశ గావ
వలయుఁ గాన మానవిలయమై మఱినేల | కొనకయున్న ప్రాణ మునుపఁదగునె </poem>|ref=}}
{{Telugu poem|type=కం.|lines=<poem> కావు సుధర్మవిభవము | చేన౯గోన రామి శకునీచే పనిచే ద్యూతమునన్
కైవసమొనర్చి వారల | సేవలకున్ జొనుపకున్న జీవము నొల్లన్|</poem>|ref=}}
{{Telugu poem|type=కం.|lines=<poem> సెలవిమ్మని యేడ్చుచు నల | జలిబడి పలవించుసుతుని సంభ్రమమునఁగౌఁ
గిలినుంచి యాంబినేయుడు | తులువలవలఁచిక్కి భీతితో నిట్లనియెన్ |</poem>|ref=}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem> జూదము ఖేదమున్ బెనిచి సుస్థిరధర్మమునొంచి పిమ్మటన్
వాదము బేదము౯లుగఁ బార్థుల ధర్మమువంచి నీ మహా
హ్లాదము మోదమున్ జెరువునటుల బుత్ర కళత్ర రోదనో
న్మాదము నాదమున్ బలధనక్షయమున్ ఘటియింపకుందునే|</poem>|ref=}}
{{Telugu poem|type=చ.|lines=<poem> వలసిన నీవు దిగ్విజయ వైభవమ౯గని ధీరవృత్తి న
వ్వల సిరిగూర్చి చేయుమొక భవ్యముఖంబు సుఖంబుగాఁగఁ గే
వల సితపక్ష చంద్రగతి భవ్యయశంబుఁ జెలంగఁ జిన్నిత్రో
వల శివమెత్తినట్లరుగవచ్చును జిచ్చును హెచ్చుపుచ్చఁగ౯|</poem>|ref=}}<noinclude><references/></noinclude>
6grkxdsjmsvzdwjrslxroy3cyg9gkc0
పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/290
104
209081
569482
567058
2026-08-09T13:54:16Z
Ramesam54
3001
569482
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ద్వి తీ యా శ్వా స ము. |271 }}</noinclude>ఆఈశ్వరు(బ్రహ్మప్రతిబింబము)న కుపాధి యగు శుద్ధసత్త్వప్రధానయును , కూడన్ = కలసి, మాయావియైన = మాయకలవారని వ్యవహరింపఁబడుచున్న, ఈశుఁడు = ఈశ్వరుడు, అగున్ , (“మాయాంతు ప్రకృతిం వింద్యాన్మాయినం తు మహేశ్వరం” అను శ్రుతి యిందుకు ప్రమాణము.) అతఁడు = ఆ ఈశ్వరుఁడు, బ్రహ్మమయుఁడై = బ్రహ్మరూపుఁడై, ఉంటన్ = ఉండుటచేత, అమాయికుఁడగున్ = (యథార్థమును విచారించిన) మాయాసంబంధము లేనివాఁడగును. (మాయ శుద్ధసత్త్వరూపిణి కావున నందు గుణవిజృంభణము లేకపోవుటచేత నందలి ప్రతిబింబమునకు, లేక దాని యాధారమునకు, భ్రాంతి లేదని భావము.)
'''తా'''. ఇట్లు ప్రతిబింబించుటవలన మాయయు నందఱి ప్రతిబింబంబును దాని కాధారమగు శుద్ధచైతౝయంబును గలసి యీశ్వరశబ్దముచే వ్యవహరింపఁబడుచున్నవి. ఆయీశ్వరుఁడే మాయ కధిపతి యనియు మాయను బ్రేరేపించువాఁడనియుఁ జెప్పఁబడుచుౝనాఁడు. ఆమాయ శుద్ధసత్వప్రధాన కావున నా యీశ్వరునకు దానివలన నుపద్రవ మేమియు లేదు. జీవునివలె నాయీశ్వరుఁడు మాయకు లోఁబడఁడు. బ్రహ్మరూపుఁడైయే యుండును.
{{Telugu poem|type=క.|lines=<poem>ఆయీశ్వరుండ నేనా
మాయయె సీతావధూటి మదిఁ దలఁప మహా
మాయుఁడ వయ్యు వశీకృత
మాయుఁడనై యవతరింతు మహి ని ట్లనఘా.</poem>|ref=31}}
'''టీ'''. అనఘా = పాపరహితుఁడా! ఆ యిశ్వరుండన్ = పైఁ జెప్పినయీశ్వరుఁడను, నేనా = నేను, ఆ మాయయే = పైఁజెప్పినమాయ, సీతావధూటి = సీతయే, మదిౝ = మనస్సునందు, తలంపన్ = విచారింపఁగా, మహామాయుడవయ్యున్ = అపరిమిత మగు మాయ గలవాఁడ నయ్యును, వశీకృతమాయుఁడనై = ఆమాయను లోబఱచుకొనినవాఁడనై (అనఁగా దానివలన నేవికారములను జెందక), (యథార్థస్థితిలో దానియం దేవికారములు లేవు.) మహిన్ = భూమియందు, ఇట్లు = ప్రస్తుతరామావతారమువలె, అవతరింతున్ = పుట్టుచుందును.
'''తా'''. ఓజ్ఞానవంతుఁడా! ఆంజనేయా! పైఁజెప్పఁబడినయీశ్వరుడను నేను (శ్రీరాముఁడు) “నన్నావరించెను" అని చెప్పఁబడి యున్నమాయయే సీత. నేను మాయావినయ్యును ఆమాయకు లోఁబడక దానిని లోఁబఱచుకొని యీ విధముగా లోకోపకారార్థమై భూలోకమున నవతరించుచుందును.
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు శుద్ధసత్వప్రధానమాయోపాధికుండును సర్వేశ్వరుండ నైననేను
వశీకృతమాయుండ నగుటం జేసి జగంబులు సృజియించి తద్రక్షణంబు
కొఱకుఁ దొల్లి మత్స్యకూర్మవరాహనారసింహవామనపరశురామా</poem>|ref=}}<noinclude><references/></noinclude>
hagmthmuce8yqk50hswhw6vda4yz0hf
పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/291
104
209082
569484
567065
2026-08-09T13:57:20Z
Ramesam54
3001
569484
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 272 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>{{Telugu poem|type=|lines=<poem>వతారంబులు ధరియించి దుష్టనిగ్రహశిష్టానుగ్రహంబులు గావించి
యిప్పుడు శ్రీరామరూపంబుచే నవతరించి రావణకుంభకర్ణాదిరాక్ష
సుల సంహరించి భూభారంబు నివారించితి నింక నిటమీఁదట బల
రామకృష్ణబుద్ధకల్కిరూపంబుల నే నవతరింపఁగలవాఁడ నాచరిత్రం
బులు లోకత్త్రయపవిత్రంబులు భవలతాలవిత్రంబులై యొప్పు నని
చెప్పి వెండియు.</poem>|ref=32}}
'''టీ'''. ఇట్లు.ఈవిధముగా, శుద్ధ...కుండౝ — శుద్ధ = నిర్మలమైన, సత్త్వప్రధాన = సత్త్వగుణమే ప్రధానముగాఁ గల, మాయ = మాయయే, ఉపాధి కుండన్ = ఉపాధిగాఁ గలిగినట్టియు, సర్వేశ్వరుండున్ = సకలప్రపంచమునకును ప్రభువైనట్టియు, ఐన నేను, వశీకృతమాయుఁడౝ = మాయను స్వాధీనపఱచుకొనినవాఁడను, అగుటం జేసి = అయియుండుట చేత, జగంబులు సృజించి = జగత్తులఁ బుట్టించి, తద్రక్షణంబుకొఱకుౝ = దానిని రక్షించుటకొఱకై, తొల్లి = పూర్వమున, మత్స్యకూర్మవరాహనరసింహవామనపరశురామరూపములను = మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామావతారములను, ధరించి = తాల్చి, దుష్ప్ర...లౝ — దుష్టనిగ్రహ = దుష్టసంహారమును, శిష్టానుగ్రహంబులౝ = శిష్టరక్షణంబును, కావించితిౝ = చేసితిని, ఇప్పుడు, శ్రీరామరూపంబుచేౝ = శ్రీరామరూపముతో, అవతరించి = పుట్టి, రావణకుంభకర్ణాదిరాక్షసులౝ = రావణుఁడు, కుంభకర్ణుఁడు మొదలగు రాక్షసులను, సంహరించి, భూభారంబు — భూ = భూమియొక్క, భారంబు = భారమును, నివారించితిౝ = పోగొట్టితిని. ఇక నిటమీఁదట = ఇంక నీపై, బలరామకృష్ణబుద్ధకల్కిరూపంబులౝ = బలరామకృష్ణబుద్ధకల్కిరూపములతో, ఏ నవతరింపంగలవాఁడౝ = నేను అవతరింపఁబోయెదను నాచరిత్రంబులు = నానడవడులు, లోకత్రయపవిత్రంబులు — లోకత్రయ = మూఁడులోకములను,
(అనఁగా వర్ణించువారిని గాని వినువారిని గాని ప్రశ్నఁజేయువారిని గాని) పవిత్రంబులు = పవిత్రముఁ జేయు సామర్థ్యము గలవి. భవలతాలవిత్రంబులై — భవ = సంసారమనెడు, లతా = తీఁగెకు, లవిత్రంబులై = కొడవలివంటివియునై, ఒప్పుౝ = ప్రకాశించును, అనిచెప్పి, వెండియుౝ = మఱియును.
'''తా'''. ఈ విధముగా శుద్ధసత్వప్రధానయగు మాయావరణమునకుఁ జిక్కి యీశ్వరుఁడ నైననాకు నామాయ స్వాధీనయైయున్నది. కావున దాని సహాయమువలన సమస్తలోకమును సృజించితిని. దుష్టులవలన నా ప్రపంచమునకుఁ గలుగుబాధను దొలఁగించి రక్షించుటకై పూర్వకాలంబున నాయాయవసరముల ననుసరించి మత్స్యకూర్మవరాహనృసింహవామనపరశురామరూపములఁ దాల్చితిని. ప్రస్తుతము రామరూపమున జనించి దుష్టులగు రావణకుంభకర్ణాదుల వధించి భూభారమును దొలఁగించితిని. ఇఁకమీఁద<noinclude><references/></noinclude>
gjo0y72graolorq38ek9484v0svp94q
పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/305
104
209096
569616
569095
2026-08-10T10:55:40Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
569616
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 286 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>
భాసికుఁ డగును, సూక్ష్మశరీరమునందు అంతఃకరణమే ప్రధానావయనము గావున జీవునకు తదనుగుణముగానే పేరు కలిగినది.) స్వప్నకల్పితుఁడు - (స్వప్న మనఁగా నజ్ఞానము నిద్ర; వానిచే కల్పింపఁబడినవాఁడు కావున) స్వప్నకల్పితుడనియు, తైజసుండు = (తేజోరూపమగు నంతఃకరణమున ప్రతిబింబించియుండువాడు కావున) తైజసుడనియు, అనన్ , ప్రవర్తిల్లున్ = వ్యవహరింపబడుచున్నాడు, అసమష్టి. సూక్ష్మకాయస్వప్నవిశిష్టుండనై = ప్రైజెప్పిన సూక్ష్మశరీరములయొక్క సమష్టితోను స్వప్నావస్థలయొక్క సమష్టితోను కూడినవాఁడనై, ఈశ్వరుఁడైన నేను, హిరణ్యగర్భుండు = హిరణ్య మనఁగా జ్ఞానము. దానిచే ప్రకాశించువాఁడను కావున) హిరణ్యగర్భుండననియు, సూత్రాత్మకుండు (మణులయందు దారమువలె సర్వభూతములయందును వ్యాపించియున్నవాడను కావున) సూత్రాత్మకుండ ననియు,ప్రాణుఁడు
అనన్ = (ప్రాణములకు ప్రేరకుఁడనై యింద్రియాదులచే సర్వకార్యములఁ జేయించుచు స్థూలశరీరమును చలింపఁజేయుచున్నాను గావున) ప్రాణుఁడ ననియు, సర్వజీవోపాస్యుండనై - సర్వజీవ = సమస్తజీవులచే, ఉపాస్యుఁడనై = సేవింపఁబడువాఁడనై, ఉండుదున్ = ఉన్నాను. ఇది = ఈ చెప్పినది, సూక్ష్మసృష్టి తెఱంగు = సూక్ష్మప్రపంచసృష్టిప్రకారము, ఇంకన్ = ఇకఁమీఁద, స్థూలప్రపంచప్రకారంబు = స్థూలప్రపంచము సృష్టియైనవిధమును, వినుపించెదన్ = చెప్పెదను వినుము.
'''తా'''. ఇట్లు ప్రేరేపేంపఁగానే తమోగుణప్రధానయగు నా మాయచే నావరింపఁబడియున్న బ్రహ్మమునుండి యాకాశము (అవఁగా నాకాశ నామరూపములు) గలిగెను. (అభివ్యక్తము లయ్యును) ఆయాకాశమునకు శబ్దము గుణము, పిదప నాయాకాశముచే (అనఁగా నాయాకాశనామరూపములచే) నావరింపఁబడిన బ్రహ్మమునుండి స్పర్శగుణము కలవాయువును, దానిచే నావరింపఁబడిన చైతన్యమునుండి రూపగుణము కలయజ్ఞయు, దానినుండి (అనఁగా దానిచే నావరింపఁబడిన బ్రహ్మమునుండి) రసగుణము గల జలంబులును, వానినుండి గంధగుణము గల పృథివియు జనించెను. జనించుట యనఁగా నంతకుఁ బూర్వ మప్రకాశములై యున్న నామరూపము లభివ్యక్తము అగుటయె. ఇట్లు జనించిన నైదును భూతములు. ఇవి సూక్ష్మము లగుటచే నపంచీకృతభూతము లనియు పంచతన్మాత్ర లనియుఁ జెప్పఁబడుచున్నవి. ఆయవిద్యయందు లేక మాయయందు తమోగుణముమాత్రమే సృష్ట్యర్థము ప్రధానమైనను సత్త్వాదిగుణములు మూఁడును కలవు గావున పైఁ జెప్పఁబడిన పంచభూతములయందును సత్త్వాదిగుణాంశములు మూఁడు కలవు. అందు పంచభూతములును గలసిన మొత్తమునకు సమష్టి యనియు భూతములకు వ్యష్టియనియుఁ బూర్వమువలెనే వ్యవహార మని తెలిసికొనవలయును.<noinclude><references/></noinclude>
izmenm5f04bgx7hy6glpf5j90wp0wvi
పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/306
104
209097
569617
546625
2026-08-10T11:11:28Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569617
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>దీనివలన నీభూతములయందు సత్వగుణాంశవ్యష్టియు సత్త్వగుణాంశసమష్టియు రజోగుణాంశవ్యష్టియు రజోగుణాంశసమష్టియు నేర్పడునుకదా. ఇందు సప్తగుణాంశవ్యష్టి వలన శ్రోత్రత్వక్చక్షుర్జిహ్వాఘ్రాణంబు లను జ్ఞానేంద్రియము లైదును తమయధిదేవత లగు దిశలు వాయువు సూర్యుఁడు పుణ్యుడు ఆశ్వినులు అనువారలతోఁ గలసి క్రమముగ (అనఁగా “ఆకాశమునుండి శ్రోత్రము దిశలు" అనువరుసగ జనించినవి. సత్త్వాంశసమష్టి వలన నంతఃకరణము జనించెను. అది యొక్కటి యయినను మనోబుద్ధి చిత్తాహంకారములను నాలుగు భేదములు కలిగి యున్నది కావునఁ జంద్రుఁడు బృహస్పతి జీవుఁడు రుద్రుఁడు అను వా రంతఃకరణమున కధిదేవతలు. ఈయధిదేవతలు కూడ నంతఃకరణముతోఁ గలసి సత్త్వాంశసమష్టివలననే జనించిరి. సంకల్పించునప్పుడు మన స్సనియు నిశ్చయించునప్పుడు బుద్ధి యనియు సంశయించునప్పుడు చిత్త మనియు నభిమానించునప్పు డహంకార మనియు నొక్క యంతఃకరణమునే వ్యవహరించుచున్నా రని తెలిసికొనుము. ఇంక రజోగుణాంశవ్యష్టి వలన వాక్పాణిపాదపాయూపస్థ లనుకర్మేంద్రియములును వాని కధిదేవత లగు అగ్ని యింద్రుఁడు విష్ణువు మృత్యుదేవితో చతుర్ముఖుఁ డనువారలును క్రమముగ జనించిరి. రజోగుణాంశసమష్టివలన ప్రాణవాయువు కలిగెను. అదియు వృత్తిభేదములవలన ప్రాణాపానవ్యానోదానసమానము అను నైదువిధములై యున్నది. కావున దానికిని వసిష్ఠుడు విశ్వకర్త విశ్వయోని అజుఁడు జయుఁడు నను నేవు రధిదేవతలు గలరు.” ప్రాణమునకు వసిష్ఠుఁడు అను మొదలగునది వారలక్రమము. (ఈయధిదేవతలు కూడ ప్రాణముతో కలసి రజోగుణాంశసమష్టివలననే జనించిరి. ఇట్లు జనించిన జ్ఞానేంద్రియము లైనను గర్మేంద్రియము లైదును బ్రాణము లైదును అంతఃకరణములు నాల్గును గలసి పందొమ్మిదియు సూక్ష్మశరీరమున కవయవములు. ఈసూక్ష్మశరీరము కూడ వృక్షవనములయట్లు ప్రత్యేకమై వ్యష్టి సూక్ష్మశరీర మనియు సముదాయరూపమై సమష్టిసూక్ష్మశరీర మనియుఁ జెప్పఁబడును. ఈసూక్ష్మశరీరమునకు స్వప్న మనస్థ అదియు సమష్టివ్యష్టిభేదములచే రెండువిధములై యుండును. అందు వ్యష్టిసూక్ష్మస్వప్నముల నభిమానించి ప్రాజ్ఞుఁడు ప్రాతిభాసికుం డనియు స్వప్నకల్పితుండనియు దైజసుఁ డనియుఁ బిలువఁబడుచున్నాఁడు. ఈశ్వరుఁడ నగు నేనును సమష్టిసూక్ష్మస్వప్నముల నభిమానించి హిరణ్యగర్భుఁ డనియు ప్రాణుఁడనియు సూత్రాత్మ యనియుఁ బిలువఁబడుచున్నాను. జీవు లందఱు బ్రహ్మవిష్ణ్వాదిరూపములతో సూక్ష్మశరీరవిశిష్టుఁడ నగు నన్నే యుపాసించుచున్నారు. ఓపార్వతీ ఇట్లు రాముఁడు సూక్ష్మసృష్టిని వివరించి స్థూలసృష్టినిఁ జెప్ప నిట్లని యుపక్రమించెను.<noinclude><references/></noinclude>
rm9y5u0hqrlkan2t0d5yj0gw1d53iwa
పుట:ఆంధ్ర భగవద్గీత.djvu/13
104
215753
569464
563756
2026-08-09T12:07:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
569464
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{c|6}}</noinclude>8. Accordingly, the stimulus that should be given to Arjuna was not of a temporal nature. It was of a higher nature i.e., spiritual and philosophical nature. Arjuna did not care for earthly pleasures, with all his might and valour. But, the stimulus to be given would lead to earthly pleasures. Vice should be punished and virtue rewarded. To this end, the Kauravas must be slain and Yudhishtir restored to Kingdom. Thus, the revival of earthly pleasures to Arjuna would, in the long run, be the result of the stimulus to be given to him. But, Arjuna should not know this. If he knew, he could not be brought round. He should be made to be oblivious of it. He should be made to understand that what, according to him, was his wisdom was nothing but folly. He should be made to understand that his grief and attachment were the result of his egoism, and that he was consequently in a state of delusion, which brought about in him a subordination of higher aspirations to lower aspirations. He should be made to understand that, while seeming to possess self-denial out of duty to kith and kin, he was, strictly speaking, selfish, having lost sight of the broad fact that, as Kshatriya, his duty was to fight for the deliverance of his nation and that to abandon it was sin. He should be made to understand that man should do his duty without caring for the consequence. He should also be made to understand that man is no agent but a tool in the hand of the Almighty. He should be made to see action in inaction and inaction in action. He should
be made to understand that the soul is immortal and that what dies is only the mould or form, which it dons or doffs like stage property. He should be made to understand that killing is no sin and that, on the other hand, it is only liberation. He should be made to understand that there is no such thing as death at all. Thus it needed not only the most<noinclude><references/></noinclude>
058v2udyj86m04v3s0ntj84ehu7f2ko
పుట:ఆంధ్ర భగవద్గీత.djvu/14
104
215754
569465
563761
2026-08-09T12:09:37Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
569465
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{c|7}}</noinclude>subtle mind, the most politic mind and the most sagacious mind of a great human being, but also the controlling mind of a supernatural being, who could teach the whole world. To this task, no less a being than Lord Krishna is equal. And he successfully did this task by silencing the various scruples of Arjuna, raised during the long discourse of the Gita. In doing it, he played the part of a sincere friend, the part of a noble statesman, the part of a shrewd politician, the part of a holy teacher of the world.
9. Some might think that the Gita would teach renunciation and that the man of the world would be at a disadvantage by its study. They are sadly mistaken. Consider the Arjuna who, before hearing the Lord's Gita lies confused in the chariot renouncing all action, out of commisseration, and consider the Arjuna who, with scruples silenced after hearing the same, becomes sensible of duty and, with redoubled energy, slays his kith and kin to the last man and not only regains his lost kingdom but also conquers a vast empire. Thus, far from leading the reader to renunciation, the Gita would be a source of temporal as well as spiritual blessings to him. The moral deducible from it is, simply and in one word,
"Do thy duty come what may" and do it with devotion to God and without
selfishness.
And the beneficial results arising from an observance of this moral cannot be over-estimated.
10. Some might think that the Gita should not be translated into Telugu, lest its divinity should be detracted from, and that it was for this very reason that Tikkana omitted it in his translation. There is also a story current<noinclude><references/></noinclude>
h3lofi5421ax8igfic4dhw2r9whaplx
పుట:ఆంధ్ర భగవద్గీత.djvu/12
104
215755
569463
563755
2026-08-09T12:06:38Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
569463
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{c|5}}</noinclude>maternal uncle Kamsa, the demoniac prince, might be mentioned as one. If, at this juncture, he kept quiet, Arjuna would omit to do his duty as warrior and as prince. The great Mahabharata war would end in its embryo stage. The
righteous and valiant Pandus would sink into insignificance; and unrighteousnes and cowardice would prevail over righteousness and valour. Consequently, Krishtna was determined to give stimulus to Arjuna.
7. But Arjuna was not a coward. He had conquered the whole of India. He could use the bow with both hands. He was a terror to the foe in the field. He was ever victorious. The gods would seek his help in their wars with
demons, and he had won the diadem and the chariot of Indra, the king of Heaven, as presents for services rendered in a particular war. In fact, he had never, in his life, had an apprehension of defeat in wars. His valiant and noble mind, which was superhuman, was always above apprehensions. The question put by him to Krishna was which of the two alternatives was better, whether to conquer the enemy or be conquered by them. This question was propounded not by want of valour, not by want of moral courage (for he needed neither of them), not by fear of the foe (for he never had it), but by generous motives of the heart, by the tie of fraternity, by a sense of duty to the grandsire Bhishma, by a sense of duty to the elders, by a sense of duty to honored tutors, and by a sense of duty to friends. Thus, owing to attachment to his kith and kin, he was in a state of delusion, which made him forget his higher duties — duties he ought to perform as Kshatria.
{{nop}}<noinclude><references/></noinclude>
dvwj09fuvrbqrobkrtoiil9ujzhrgh1
పుట:ఆంధ్ర భగవద్గీత.djvu/11
104
215756
569462
563685
2026-08-09T12:04:38Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
569462
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{c|4}}</noinclude>5. In the war, Lord Krishna was the charioteer of Prince Arjuna, On the battle field, while on the eve of darting his volleys of shafts at the enemy, Arjuna sees their legions consisting of his own cousins, venerable grandsire Bhishma and honored teachers Drona and others, among other relations, when his heart is melted by motives of compassion and he feels hopelessly despondent. On no occasion had he ever shrunk in his mind and in no war had he ever been unsuccessful. Among other titles, he had won that of
Vijaya meaning "the conquerer." He feels that the earthly pleasures to be won at the cost of his kith and kin are unenviable. He views it as sinful to kill his kindred and flatly refuses to fight. He throws down his bow and
arrow in the chariot and sits confused with his eyes whirling in tears. Lord Krishna, with a jocular smile, asks him "How is it you are effeminate at this critical juncture?" and advises him to banish his abject fear, and Arjuna tells him he holds a doubt as to which is the better of the two, whether to conquer or be conquered by the enemy, for in the former case he shall have to kill the Kauravas, who are standing before his very face on the field, and if he killed them he would not be inclined to live.
6. Now it is a task for Lord Krishna. He was Arjuna's cousin — maternal uncle's son. He was his brother-in-law — wife's brother. He was his constant friend. He was his teacher and guide in the affairs of life. He had saved him on every occasion of adversity. He was his charioteer in this particular war. He was an incarnation of Vishnu — God of the universe. His mission or rather his will was to punish guilt and save righteousness. He had shown proof of his mission in his various deeds, of which the killing of his own<noinclude><references/></noinclude>
7bxe7lp54a7uq8hwd2gcwrfvo4m0b0r
పుట:ఆంధ్ర భగవద్గీత.djvu/10
104
215757
569461
563588
2026-08-09T12:01:39Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
569461
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{c|3}}</noinclude>coveted the Pandava kingdom but, being unequal to the task of fighting the valiant Pandus, who had conquered the whole of India, got Yudhishtir sent for by his father and asked him to game with dice. In those days, refusal to play with dice when invited for it was considerd to be an act of humiliation or rather impoliteness on the part of kings. Yudhishtir accordingly gave consent though against his will. The wager was that the unsuccessful party should give up his kingdom to the successful party and that he should, with all his brothers, live the life of an ascetic in the forest for a period of twelve years and in disguise during the thirteenth year in a town. In the case of Yudhishtir, it was added that he should take along with him his queen Draupady as well. If detected during the term of disguise, the party should re-peat this course of ascetic life and disguised life until the disguised life was successfully lived, when his kingdom would be restored. Without himself playing the game, as he ought to have done, according to the understanding between them, Duryodhana played by proxy. He appointed his maternal uncle Sakuni to play for him. This Sakuni had learnt the tricks of dice, and, in one throw thereof, he gained all the kingdom of Yudhishtir.
Yudhistir successfully passed through the ordeal of the twelve years ascetic life in various wilds and the one year disguised life in town, and sent word to Duryodhana to restore his kingdom. Lord Krishna himself went on the errand. Duryodhana refused. The just expostulations of the Lord, garbed in his wonted sweet speech, had no effect on the evil minded Duryodhana. On the other hand, he took the Lord to be a juggler and even foolishly and sinfully attempted in vain to capture Him. Hence the Bharata war.
{{nop}}<noinclude><references/></noinclude>
77bo16vg4n4298ig3ry9e8mnu57pfpt
పుట:ఆంధ్ర భగవద్గీత.djvu/9
104
215758
569460
563585
2026-08-09T11:59:49Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
569460
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{c|2}}</noinclude>has also ignored it, although he supplied the omission scrupulously made by him in leaving untranslated a portion of the Aranyaparvam — Canto III — the undertaking the translation of which parvam was considered to be so ominous as to have caused the death of Nannaya.
4. The circumstances which led to the teaching of the Gita on the part of Kristna were briefly as follow.
The Pandavas and the Kauravas were cousins or sons of brothers. The former were five while the latter were one hundred, in number. The father of the former was King Pandu: that of the latter was Dhritarastra, a born-blind an. King Pandu died when his sons were tender children, and both they and the Kauravas were brought up together by Dhritarashtra, who survived his brother. Both were taught the art of war together and by one and the same teacher, Drona. Yudhistir was the head of the Pandavas, and Duryodhana the head of the Kauravas. Yudhishtir was the Indian Aristides, while Duryodhana was a wicked prince. Arjuna was one of Yudhishtira's brothers and was the greatest archer the world has ever produced.
Owing to jealousy, Duryodhana had, several times, attempted against the lives of the Pandavas, and his father Dhritarashtra, who, with all his blindness, was a politic and avaricious man, had always been conniving at it, sometimes passively and sometimes actively. But the mercy of God, who is the father and ruler of the whole Universe, and who will always be on the side of virtue, had saved them every time. Finally, as Yudhishtir and Duryodhana were ruling their respective kingdoms, entrusted to their charge by Dhritarastra, on their attaining majority, Duryodhana<noinclude><references/></noinclude>
k4fyltbv473vxyuq1i5w0hh35vh5bvm
పుట:ఆంధ్ర భగవద్గీత.djvu/15
104
215760
569466
563762
2026-08-09T12:12:15Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
569466
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{c|8}}</noinclude>that Tikkana, after translating the Bharatam, went to Benaras and prayed to the Goddess of the river Ganges, who appeared in human form to him. Upon his submission that he had translated the Bharatam, the goddess asked him if he had translated the Bhagavad-Gita. He answered in the negative and the goddess blessed his work with immortality.
This story is nothing but a myth. It is also inconsistent with the view of Vyasa. According to Vyasa himself, his Bharatam was intended especially for women and Non-Brahmans, who were prohibited from reading the Vedam. But he wrote it in Sanskirt, a language with which the woman and the Non-Brahman in general are not conversant and it must be translated into a spoken language. Even Tikkana did translate a few of the verses of the Gita, though in his book he put some of them in their proper place, and let in some in a subsequent canto-Santiparvam-by putting them into the mouths of Bhishma and others.
It may also be mentioned that Tikkana has omitted the Viduranity too — the morals inculcated by Vidura to Dhritarashtra. Vidura was a Sudra and there was no divinity in his nity or teaching. The secret is it would be a task to
translate such abstruse portions as the Gita and others, and the free translator Tikkana did not like to take the trouble of doing the task.
11. The Gita is said to be an epitome of the Vedas and the Upanishads; and it is the existence of this Gita that has given to the Bharatam the title of the Fifth Vedam. Wtihout it, the Bharatam would be insipid.<noinclude><references/></noinclude>
p4aohxx63ycctdyq7522jrl3a5yw34v
పుట:ఆంధ్ర భగవద్గీత.djvu/16
104
215761
569467
563563
2026-08-09T12:13:38Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
569467
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{c|9}}</noinclude>{{left|}}
12. Under these circumstances, it is highly desirable, nay absolutely necessary, that the omission made by the triad of Telugu poets should be supplied by translating the Gita into Telugu. I have now accordingly undertaken the task. And unlike the triad in the case of the remaining Bharatam, I have translated it verse for verse.
13 It must also be noted that, from the difference of opinions held by the respective schools to which they belonged, the three great commentators of the Gita, Sankara, Madhwa and Ramanuja, took advantage of the flexibility of the Sanskirt language in which it had been written, broke their heads on cartain shlokas and interpreted them in their respective favour. They sometimes also begged the question and made lucid stanzas most obscure by making far-fetched construction. But, I have simply followed the original, most faithfully and most closely; and I trust that my translation may meet with the reader's approval to whatever school of philosophy he may belong.
{{rh|RAJAHMUNDRY,||<big><big>TADURY LAKSHMI NARASIMHA RAO.</big></big>}}
{{rh|May 1907.|||}}
{{Css image crop
|Image = ఆంధ్ర భగవద్గీత.djvu
|Page = 16
|bSize = 600
|cWidth = 155
|cHeight = 80
|oTop = 735
|oLeft = 216
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
qkajjucyfa6pur9uwqc1teirmbo36lk
పుట:ఆంధ్ర భగవద్గీత.djvu/2
104
215763
569623
569456
2026-08-10T11:46:52Z
Rajasekhar1961
50
569623
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Css image crop
|Image = ఆంధ్ర భగవద్గీత.djvu
|Page = 2
|bSize = 600
|cWidth = 600
|cHeight = 968
|oTop = 2
|oLeft = 0
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
oplxur26jbdl4jt7j1o790n0rwcwghw
పుట:ఆంధ్ర భగవద్గీత.djvu/18
104
215779
569468
563573
2026-08-09T12:22:28Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
569468
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Css image crop
|Image = ఆంధ్ర భగవద్గీత.djvu
|Page = 18
|bSize = 600
|cWidth = 458
|cHeight = 61
|oTop = 88
|oLeft = 76
|Location = center
|Description =
}}
{{c|శ్రీ}}
{{c|నారాయణాయనమః}}
{{p|fs150|ac}}శ్రీమదాంధ్రమహభారతము.</p>
{{p|fs150|ac}}భీష్మపర్వము.</p>
{{Css image crop
|Image = ఆంధ్ర భగవద్గీత.djvu
|Page = 18
|bSize = 600
|cWidth = 158
|cHeight = 29
|oTop = 312
|oLeft = 213
|Location = center
|Description =
}}
{{p|fs125|ac}}భగవద్గీత.</p>
<poem>
{{left margin|5em}}
{{Largeinitial|శ్రీ}}యుత మై భుజాంతరము చెన్నెసలారఁగఁ శాంతసంవిదం
బై యఖిలంబునుం జఠరమందు నడంగఁగనప్రమేయుఁడై
యేయెడనొక్కఁడైస్వరతినెంతయు వెల్గుగుణాలవాలునా
రాయణుఁదొంటిబ్రహ్మముఁబరాత్ఫరుఁగొల్తునభీష్టసిద్ధికిన్. {{float right|I}}
</poem>
అని పరమబ్రహ్మప్రార్థనంబుచేసి తత్ప్రసాదసమాసాదికవితానురూపంబగు నానందమహాసముద్రంబున నోలలాడుచుండి యొక్కనాఁడు నామనంబున
<poem>
{{left margin|5em}}
మ॥ అనఘుండైనపరాశరాత్మజుడు ము న్నత్యాదరంబారఁగా
జనలోకంబుహితంబుపొంటె సురభాషంబంచమామ్నాయమ
న్వినుతిం గాంచిన భారతంబనుకృతిన్నిర్మించె నద్దానినిం
దెనుగుంజేసిరి నన్నయార్యుఁడును నత్తిక్కార్యుఁ డెఱ్ఱార్యుఁడున్ {{float right|II}}
మ॥ తెనుఁగుంజేసెడుకార్యమందుఁ దమరీతిం బోయిరే కాక యా
ఘనులైనట్టి కవీశ్వరుల్ ముగురు విఖ్యాతంపుమూలంబునం
దున నెట్లున్నది యెంతయున్న దెదయందుం దప్ప కట్లంతయుం
జనఁజెప్పంగఁ దొడంగరైరి మదిలోఁజర్చించివీక్షింపఁగన్. {{float right|III}}
</poem><noinclude><references/></noinclude>
eke3agdc8rid53j2o0d0vz93ydfoyqb
పుట:ఆంధ్ర భగవద్గీత.djvu/19
104
215780
569470
563572
2026-08-09T12:44:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
569470
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh|2|భగవద్గీత|}}</noinclude>{{c|మఱియును}}
<poem>
{{left margin|5em}}
సీ॥ ఇలమహాభారతం బే యోగశాస్త్రంబు
తనలోనఁ గల్మివేదమనఁబరఁగె
నేయోగశాస్త్రంబునెఱుకలేమిని సవ్య
సాచిరథంబుపైఁ జదికిలఁబడె
నేయోగశాస్త్రంబునెఱుకచే సోత్సాహి
యై యతఁడనిలోన నరులఁగూల్చె
నేయోగశాస్త్రంబు నిల భగవంతుడొ
కృష్ణుండు నరునకై కృపనుజెప్పె
నొనర నిహపరసుఖము లేయోగశాస్త్ర
మభ్యసింపంగ దొరఁకొను నల్లయోగ
శాస్త్రమగు భగవద్గీత సర్వ మకట
వారుమువ్వురు విడిచినవారలైరి. {{float right|IV}}
ఆ॥ వె॥ పప్పులేనికూఁడు పరికింపఁగా నుప్పు
లేనికూర కొప్పులేనిశిరము
నెట్టు లుండు నుండు పట్టులా గీతయు
లేనిభారతంబులీల యెల్ల. {{float right|V}}
కం॥ తగు నది గావున నాకును
భగవద్గీతలను దెనుఁగుబాస వినిర్మిం
పఁగ మూలానుసరణముగ
జగద్ధితముకొఱకు మిగుల సరసమృదూక్తిన్. {{float right|VI}}
</poem>
అనియాలోచించుచుఁ బరమానందంబున నేనించుక కనుమూయుటయు<noinclude><references/></noinclude>
84rxatlepbk4ygds4rc26i13kj4g137
పుట:ఆంధ్ర భగవద్గీత.djvu/20
104
215781
569471
563576
2026-08-09T12:45:58Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
569471
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh||మొదటి అధ్యాయము|3}}</noinclude><poem>
{{left margin|5em}}
సీ॥ అమరి రేగోత్రంబునందు భార్గవవీత
హవ్యసావేతసులనెడిఋషులు
తత్సువాధూలగోత్రంబునఁ బుట్టి యా
పస్తంబసూత్రుడై పరఁగెనెవ్వఁ
డమరంగ యోగంబు నభ్యసించి యెవండు
నిత్యహరిధ్యాననిరతుఁ డయ్యెఁ
బరభామఁ బరధనంబరయనొల్లక నిత్య
సత్యవ్రతుండయ్యె జగతినెవఁడు
భువనమందుండి యెవ్వఁడుదివికిఁబోవు
నప్పుడెక్కంగఁ బువుఁదేరు హరియ పంపె
ధరణి కట్టి నాజనకుండుపరమపావ
నుండు రామనభట్టారకుండు వచ్చి. {{float right|VII}}
</poem>
పాదంబులు భూమిమీఁద మోపకనిలిచి నానమస్కారంబులంగైకొని నన్ను దీవించి
<poem>
{{left margin|5em}}
తే॥ గీ॥ ధరణియందుండి దివమునకరుగుదెంచు
పుణ్యపురుషులు దేవేంద్రుపుణ్యసభను
నీదుక్షేమంబు లెస్స వర్ణింపఁగా న
నారతము సంతసించుచున్నాఁడఁ బుత్ర. {{float right|VIII}}
</poem>
మఱియునేను సత్యలోకమ్మున కొక్కనాఁడగస్త్యాదులతో నరుగుటయు భగవద్గీత నాంధ్రభాషయందు నీవుచేయంగలవాఁడవనిబ్రహ్మ సభలోఁ బ్రశంసింపంబడియె నీమీదిప్రేమాతిశయంబున నినుఁజూడవచ్చితి ననుసమయంబున<noinclude><references/></noinclude>
efak27i5zbgq6tnrattunscom8ptk10
పుట:ఆంధ్ర భగవద్గీత.djvu/21
104
215782
569472
563577
2026-08-09T12:47:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
569472
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh|4|భగవద్గీత|}}</noinclude><poem>
{{left margin|5em}}
సీ॥ నీలమేఘముఁబోలు మేలినెమ్మెయివాఁడు
కౌస్తుభదీప్తవక్షమ్మువాఁడు
బంగారువన్నియ పట్టుఁబుట్టమువాఁడు
మొలకనవ్వుల ముద్దు మొగమువాఁడు
తెల్లదామరపూల తేఁటకన్నులవాఁడు
ససిగ ముంగురులాడు నొసలువాఁడు
బొమ్మయోలగమున్న బొడ్డుఁదామరవాఁడు
సిరియాడుచున్నట్టి యురమువాఁడు
మురళినాదంబు చేసెడు మోవివాఁడు
నెమలిపింఛంబుతోడి పెన్నెరులవాఁడు
శంఖచక్రాది దీప్త హస్తములవాఁడు
నగుచు నారాయణుండు ప్రత్యక్షమయ్యె. {{float right|IX}}
అయినాదండప్రణామంబాదరించి నన్నుదీవించి
తే॥ గీ॥ కర్మయజ్ఞంబు చేసి తిక్కన్న నాఁడు
తగియెఁ దెనిఁగింపఁగా భారతంబునేఁడు
జ్ఞానయజ్ఞంబునంజేసి దానిఁ జక్కఁ
జేయఁదగుదువు లక్ష్మీనృసింహనీవు. {{float right|X}}
కం॥ కావున భగవద్గీతం
గావింపు మదంకితంబుగా దానిని నేఁ
డావనజాప్తసుధాకర
మైవెలసెడున ట్లనుగ్రహమ్ము సలిపితిన్. {{float right|ΧΙ}}
</poem>
అనిప్రసాదించి నాజనకునితో నదృశ్యుండయ్యె నంతనేనుగన్నుదెఱచి పరమభక్తి భరితాంతరంగుండనై<noinclude><references/></noinclude>
8c0kdft9ys3rfa5z12zeln2fjs1w98r
పుట:ఆంధ్ర భగవద్గీత.djvu/22
104
215783
569473
563580
2026-08-09T12:48:18Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
569473
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh||మొదటి అధ్యాయము|5}}</noinclude><poem>
{{left margin|5em}}
ఉ॥ ఎవ్వనిచేతనిజ్జగములెల్ల సృజింపఁబడెం దలంపఁగా
నెవ్వఁడొకండ యిజ్జగములెల్లను నిండి వెలుంగుచుండువాఁ
డెవ్వఁడుసాక్షిమాత్రుఁడుగ నెల్లచరాచరకోటికెప్పుడు
న్నివ్వటిలుం బ్రవృత్తియలనిత్యునకు న్భువనైకభర్తకున్. {{float right|XII}}
కం॥ సురకోట్యధ్యక్షునకుం
బరమపురుషునకును భూతభావనునకు న
క్షరునకు వేదాంగున కీ
శ్వరునకు జగదాదిజునకు సర్వవిదునకున్. {{float right|XIII}}
కం॥ స్థిరునకు సిద్ధార్థునకున్
హిరణ్యనాభునకు నార్తహితునకును మహా
పరమదయాశరనిధికిన్
శరణాగతరక్షకునకు శౌరికి హరికిన్. {{float right|XIV}}
</poem>
సమర్పితంబుగా నాయొనర్పంబూనిన మహాభారతాంతర్గత భగవద్గీతకుఁ గథాక్రమంబెట్టిదనిన.
ఒక్కమహాఫలంబుగోరి జనమేజయుండు మహాభారతము వినఁగోరుటయు వైశంపాయనుండు వినిపించెను. అందుఁగురుపాండవుల యుద్ధోద్యోగంబును వారు తమతమబలంబులతో యుద్ధరంగంబున యుద్ధ
సన్నద్ధులైయుండుటయు సవిస్తరంబుగావిని జనమేజయుండు పిదపటికథయడుగుటయు వైశంపాయనుండిట్లనియె.
యుద్ధంబుజరగు సమయంబున దానితెఱంగెల్లఁగని ధృతరాష్ట్రునకు వినిపించుటకుఁ దనశిష్యుండైన సంజయుని నియమించి వ్యాసమహాముని నిజేచ్ఛంజనినవెనుక
ధృతరాష్ట్రుఁడు సంజయునితో నిట్లనియె<noinclude><references/></noinclude>
g4nsy4emb2w4eaz7k0fmmg46ikmhcwb
పుట:భగవద్గీత.pdf/16
104
217822
569507
569422
2026-08-09T15:58:55Z
దేవీప్రసాదశాస్త్రి
4290
569507
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|శ్రీరస్తు}}
{{p|ac|fs150}}శ్రీభగవద్గీతాశాస్త్రము</p>
{{Center|అను}}
{{p|ac|fwb|fs125}}మోక్షగ్రంథము</p>
{{Css image crop
|Image = భగవద్గీత.pdf
|Page = 16
|bSize = 600
|cWidth = 120
|cHeight = 21
|oTop = 317
|oLeft = 241
|Location = center
|Description =
}}
{{Telugu poem|type=శా.|lines=<poem>శ్రీకైవల్యరమాధినాథుఁడు లసచ్ఛృంగారరేఖామనో
జ్ఞాకారుండు భవాబ్ధితారణచణానంతప్రభావుండు లో
కైకత్రాణపరాయణుండు ఘనసత్యానందచిద్రూపుడున్
శ్రీకృష్ణుండు కుమారయాచనృపతిం జెల్వొందఁ బ్రోచున్ గృపన్.</poem>|ref=1}}
{{Telugu poem|type=క.|lines=<poem>శ్రీవసుదేవకుమార ర
మావల్లభ భక్తలోకమందార హరీ
పావనచరిత్ర విధిముఖ
సేవితచరణారవింద శ్రీగోవిందా.</poem>|ref=2}}
{{Telugu poem|type=వ.|lines=<poem>దేవా యవధరింపుము శ్రీ వేదవ్యాసవరప్రసాదలబ్ధవిజ్ఞాన
విదిత వాసుదేవధనంజయచరిత్రుండగు సూతపుత్త్రుండు
విచిత్రవీర్యపుత్త్రున కిట్లనియె.</poem>|ref=3}}
{{p|ac|fwb|fs120}}ద్వితీయాధ్యాయము — సాంఖ్యయోగము</p>
{{p|ac|fwb}}అర్జునుండు తనవారిపై యుద్ధంబు సేయ సంశయించుట</p>
{{Telugu poem|type=గీ.|lines=<poem>అటు కృపావిష్టమానసుం డగుటఁజేసి
యశ్రుపూర్ణాకులేక్షణుండై దురంత</poem>|ref=}}<noinclude><references/></noinclude>
1h2oh17djmiz4ho1rkr6m6k9agmehte
పుట:భగవద్గీత.pdf/24
104
217830
569474
568881
2026-08-09T12:55:57Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569474
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=గీ.|lines=<poem>వేదములు చూడఁ ద్రైగుణ్యవిషయము లగు
వినుము నీవు గుణత్రయవిరహితుఁడవు
సరవి నిర్ద్వంద్వుఁడవు నిత్యసత్త్వగతుఁడ
వరయ నిర్యోగుఁడవు నాత్మపరుఁడ వగుమ.</poem>|ref=37}}
{{Telugu poem|type=వ.|lines=<poem>మరియు బ్రహ్మజ్ఞానసంపన్నుండైన బ్రాహ్మణునకు ముఖపాద
ప్రక్షాళనాదిస్వల్పకార్యోపయోగి యైనకూపంబునం దెంత
మాత్రంబు ప్రయోజనంబుగలిగి యుండు నంత ప్రయోజ
నంబు వేదచోదితంబులైన సర్వకర్మంబులందునుం గలిగి
యుండు. స్నానపానవస్త్రక్షాళనాది సర్వకార్యోపయోగి
యైనవిశాలతటాకాదికంబునం దెంతప్రయోజనంబు గలిగి
యుండు నంత ప్రయోజనంబు బ్రహ్మవిషయకజ్ఞానంబునందుఁ
గలిగి యుండు. నీకుఁ గర్మంబునందె యధికారంబు గలుగుం
గాని కర్మఫలంబునం దొకానొకప్పుడైన నధికారంబు లేదు
గావున నీవు కర్మఫలహేతువుగా వలవదు ఫలపరిత్యాగ
పూర్వకంబుగా సముచితకర్మంబు లాచరింపు మని పలికి
వెండియు ని ట్లనియె.</poem>|ref=38}}
{{p|ac|fwb}}అతియోగలక్షణము</p>
{{Telugu poem|type=చ.|lines=<poem>ఉడుగక సంగము న్విడిచి యోగగతుండవునై సముండవై
కడువడి సర్వకర్మములు గైకొని సేయుము సిద్ధ్యసిద్ధులం
గడఁగి సమంబుగా మదిని గన్గొను టంతియె యోగమంచు నే
ర్పడరఁగ నాత్మతత్త్వవిదు లైనబుధుల్ వచియింతు రర్జునా.</poem>|ref=39}}
{{p|ac|fwb}}కర్మయోగముకంటె జ్ఞానయోగం బెక్కుడనుట</p>
{{Telugu poem|type=గీ.|lines=<poem>పుడమి బుద్ధి యోగమునకంటెఁ గడు దూర
మగుటవలనఁ గర్మ మల్ప మెందు</poem>|ref=}}<noinclude><references/></noinclude>
mi7szghbw332ydrcwekpwjvgqe4o5le
పుట:భగవద్గీత.pdf/25
104
217831
569475
568882
2026-08-09T13:07:27Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569475
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>వలనఁ గృపణు లుర్వి ఫలహేతులై యుందు
రందువలన బుద్ధి నాశ్రయింపు.</poem>|ref=40}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>బుద్ధితోఁ గూడుకొన్నట్టిపురుషుఁ డిచట
సుకృతదుష్కృతముల రెంటి సొరిది విడుచుఁ
గాన యోగంబు నొందుము కలఁక విడిచి
కర్మములయందు యోగంబు కౌశలంబు.</poem>|ref=41}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>అనఘ బుద్ధియుక్తుఁ డైన విద్వాంసుండు
పరఁగఁ గర్మజాతఫలము విడిచి
పుడమి జన్మబంధముక్తుఁడై దగ ననా
మయపదంబుఁ జేరు మహితుఁడగుచు.</poem>|ref=42}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>నృపవరకుమార యెప్పుడు నీదుబుద్ధి
మోహకాలుష్యమును దాఁటి మొనయు నపుడు
వినఁగఁదగినదానికి మరి వినినదాని
కెలమి వైరాగ్యమును బొందఁగలవు నీవు.</poem>|ref=43}}
{{Telugu poem|type=క.|lines=<poem>శ్రుతివిప్రతిపన్నంబై
యతినిశ్చలమై సమాధియం దచలంబై
మతి నీకెప్పుడు కుదురును
జితవైరీ యపుడు యోగసిద్ధియుఁ గలుగున్.</poem>|ref=44}}
{{p|ac|fwb}}స్థితప్రజ్ఞాలక్షణము</p>
{{Telugu poem|type=వ.|lines=<poem>అనిన నర్జునుండు వాసుదేవుం జూచి కేశవా సమాధియందు
నిశ్చల యైనబుద్ధిగలపురుషునకు సంభాషణం బెద్ది యేమి
పలుకు నెట్లు గూర్చుండు నెట్లు నడుచు నని యడిగిన భగ
వంతుం డిట్లనియె.</poem>|ref=45}}<noinclude><references/></noinclude>
mxq4i8m9plj8vxnbt0ndg6fm20hrkav
పుట:భగవద్గీత.pdf/26
104
217832
569476
568883
2026-08-09T13:17:39Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569476
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=మ.|lines=<poem>అరుదారం గురువర్యదేహినియతుండై యాత్మయందాత్మచేఁ
బరితుష్టుండయి చిత్తసంకలితసర్వవ్యాప్తులౝ వీడి తాఁ
బరిశుద్ధుండయి యెప్పుడొప్పు నపు డాప్రజ్ఞాసమాయుక్తుఁడు
త్వరలో నార్యులచేతఁ బేర్కొను స్థితప్రజ్ఞుండునా నెంతయున్.</poem>|ref=46}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>తవిలి సుఖములయందు గతస్పృహుండు
వితతదుఃఖములం దుద్విగ్నచిత్తుఁ
డపగతక్రోధభయరాగుఁడై తనర్చు
నతఁడు స్థితధి యనంగ విశ్రుతి వహించు.</poem>|ref=47}}
{{Telugu poem|type=క.|lines=<poem>పొందుగ నెవ్వఁడు సర్వము
నం దనభిన్నేహుఁడై శుభాశుభములఁ దా
నొందియు హర్షద్వేషము
లొందఁ డతనిప్రజ్ఞ చాల నొప్పు నచలయై.</poem>|ref=48}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>అవని నెవ్వఁడు కూర్మావయవము లట్ల
యింద్రియార్థంబులవలన నింద్రియములఁ
గడిమి నుపసంహరించు నాఘనునిబుద్ధి
పాండుతనయ సుస్థిరయయి పరఁగుచుండు.</poem>|ref=49}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>మానితముగ నిరాహారుఁడైనఁదేహి
కరయ రక్తి దక్కగ విషయములు మరలుఁ
బరఁగ నవ్వల వీనికిఁ బరముఁ జూచి
వరుస రక్తియు మరలింపఁబడుఁ గిరీటి.</poem>|ref=50}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఒనర యత్నము సేయుచున్నవాఁడైనఁ గా
కేమి విద్వాంసునియింద్రియంబు
లతిబలవంతంబులై మనంబును బలా
త్కారంబు గాఁగ నొక్కట హరించుఁ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
7afvd38xhhbogwityuydzvmz3hxkjdu
569479
569476
2026-08-09T13:27:27Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569479
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=మ.|lines=<poem>అరుదారం గురువర్యదేహినియతుండై యాత్మయందాత్మచేఁ
బరితుష్టుండయి చిత్తసంకలితసర్వవ్యాప్తులౝ వీడి తాఁ
బరిశుద్ధుండయి యెప్పుడొప్పు నపు డాప్రజ్ఞాసమాయుక్తుఁడు
త్వరలో నార్యులచేతఁ బేర్కొను స్థితప్రజ్ఞుండునా నెంతయున్.</poem>|ref=46}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>తవిలి సుఖములయందు గతస్పృహుండు
వితతదుఃఖములం దుద్విగ్నచిత్తుఁ
డపగతక్రోధభయరాగుఁడై తనర్చు
నతఁడు స్థితధి యనంగ విశ్రుతి వహించు.</poem>|ref=47}}
{{Telugu poem|type=క.|lines=<poem>పొందుగ నెవ్వఁడు సర్వము
నం దనభిస్నేహుఁడై శుభాశుభములఁ దా
నొందియు హర్షద్వేషము
లొందఁ డతనిప్రజ్ఞ చాల నొప్పు నచలయై.</poem>|ref=48}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>అవని నెవ్వఁడు కూర్మావయవము లట్ల
యింద్రియార్థంబులవలన నింద్రియములఁ
గడిమి నుపసంహరించు నాఘనునిబుద్ధి
పాండుతనయ సుస్థిరయయి పరఁగుచుండు.</poem>|ref=49}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>మానితముగ నిరాహారుఁడైనఁదేహి
కరయ రక్తి దక్కగ విషయములు మరలుఁ
బరఁగ నవ్వల వీనికిఁ బరముఁ జూచి
వరుస రక్తియు మరలింపఁబడుఁ గిరీటి.</poem>|ref=50}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఒనర యత్నము సేయుచున్నవాఁడైనఁ గా
కేమి విద్వాంసునియింద్రియంబు
లతిబలవంతంబులై మనంబును బలా
త్కారంబు గాఁగ నొక్కట హరించుఁ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
06elau5plrrerxwodb2lx12izi8awln
పుట:భగవద్గీత.pdf/27
104
217833
569486
568884
2026-08-09T14:00:37Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569486
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>గావున యోగి తక్కక యింద్రియంబుల
నేమించి నాయందుఁ బ్రేమ గలిగి
యలరు నెవ్వని కింద్రియములు స్వాధీనంబు
లగు వానిమతి నిశ్చయాత్మిక యగు
విషయములను జింతించుపురుషున కందుఁ
గలుగుసంగంబు మరియు సంగంబువలనఁ
గలుగుఁ గామంబు కామంబు వలనఁ గ్రోధ
మందువలన జనించు మోహంబు పార్థ.</poem>|ref=51}}
{{p|ac|fwb}}విషయచింతనచేఁ గలుగుచెరుపు</p>
{{Telugu poem|type=గీ.|lines=<poem>పరఁగ మోహంబుచే స్మృతిభ్రంశనంబు
గలుగు మరియు స్మృతిభ్రమవలన బుద్ధి
నాశము జనించు తద్బుద్ధినాశనమునఁ
బురుషుఁడు నశించు నిక్కంబు కురువరేణ్య.</poem>|ref=52}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అర్జునా రాగద్వేషవిహీనంబులై తనకు వశ్యంబులైన
యింద్రియంబులచేత విషయంబు లనుభవింపుచుండియు
స్వాధీనం బైనయాత్మగల పురుషుండు నిర్మలుండగు నట్టినిర్మల
పురుషుని దుఃఖంబులన్నియు హైన్యంబు నొందు నిర్మల
చిత్తుండైనవానికి శీఘ్రంబున బుద్ధి నిశ్చలమై ప్రకాశించు.</poem>|ref=53}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>పుడమి యోగహీనున కెన్న బుద్ధి లేదు
లేదు భావన భావన లేనివాని
కతులితంబుగఁ జిత్తోపరతియు లేదు
శాంతి లేనివానికి నెట్లు సౌఖ్య మొదవు.</poem>|ref=54}}
{{Telugu poem|type=క.|lines=<poem>చలియింపుచున్న యింద్రియ
ములవెంటౝ దిరుగు మనము బుద్ధిని మిగులౝ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
ktez01f8pqbh10ultkfrzmmoiihn8hv
పుట:భగవద్గీత.pdf/28
104
217834
569505
568885
2026-08-09T15:47:39Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569505
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>దలకొని యాకర్షించును
నిలువుగ మున్నీట గాడ్పు నావం బోలెన్.</poem>|ref=55}}
{{Telugu poem|type=వ.|lines=<poem>కావున.</poem>|ref=56}}
{{Telugu poem|type=క.|lines=<poem>తలపఁగ నెవ్వనియింద్రియ
ములు దుర్విషయేంద్రియార్థములవలన రహిం
దొలఁగింపఁగఁబడునాబుధ
తిలకునిమతి యొప్పుఁ గడుఁబ్రతిష్టిత యగుచున్.</poem>|ref=57}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>సర్వభూతంబులకు నెద్ది శర్వరి యగు
నందు మేల్కొని యుండు సంయమివరుండు
అనఘ భూతంబు లెందు మేల్కొని వసించు
నదియె నిశ యగుఁ బరికించు నట్టిమునికి.</poem>|ref=58}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>మెండుగ వృష్టికాలమున మిన్నక పాఱునదీప్రవాహముల్
నిండి చలింపకున్న నీయలనీరధిఁ జేరినమాడ్కి నెవ్వనిం
దండిగ సర్వకామములు తప్పక చేరు నతండు శాంతుఁడై
యుండు సకాముఁడైననరుఁ డొందఁడు శాంతిని బాండునందనా.</poem>|ref=59}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>అరయ నెవ్వఁడు నిస్పృహుండై సమస్త
కామముల దిగ నాడి నిష్కాముఁ డగుచు
తగ నహంకారమును లేక దనరు నతఁడు
పుడమిలోపల నుపరతిఁ బొందు సుమ్మి.</poem>|ref=60}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అర్జునా యీస్థితి బ్రహ్మవిషయంబైనయది. దీని నధిగమిం
చినపురుషుండు మోహంబు నొందఁడు. దీనియం దవసాన
కాలంబునందైన నిల్చి బ్రహ్మసుఖంబు పడయం గలఁ డని
యిట్లు ద్వితీయాధ్యాయంబునందు సాంఖ్యయోగం బుపదే
శించెను.</poem>|ref=61}}
{{Center|———————}}<noinclude><references/></noinclude>
tdd87agdzu4bbejcmdpsmrc8vvgb59g
పుట:భగవద్గీత.pdf/29
104
217835
569506
568886
2026-08-09T15:56:31Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569506
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fs100}}తృతీయాధ్యాయము ― కర్మయోగము</p>
{{Telugu poem|type=|lines=<poem>అది విని యర్జునుండు గోవిందునిం జూచి దేవా
మీకుఁ గర్మంబుకంటె జ్ఞానంబు శ్రేష్ఠతరంబైన దాని సమ్మతం
బగునేని ఘోరంబైన యాకర్మంబునందు నన్నేల నియమింపు
చున్నవాఁడవు. వ్యామిశ్రంబైన దాని యట్లు ప్రతీయ
మానం బగు వాక్యంబుచేత మద్బుద్ధిని మోహింపం జేయు
వానిపోలిక నున్నవాఁడవు నాకు నెద్దానిచేత శ్రేయంబు
నొంద శక్యం బగు నట్టిదాని నొక్కటి నిశ్చయించి చెప్పు
మని యడిగిన నయ్యర్జునునికిఁ గృష్ణుం డిట్లనియె.</poem>|ref=61}}
{{Telugu poem|type=మ.|lines=<poem>విలసద్విక్రమ తొల్లి సాంఖ్యులకు నుర్విౝ జ్ఞానయోగంబుచేఁ
దిలకింపం దగు నట్టి యోగులకుఁ బ్రీతిం గర్మయోగంబుచే
నలు వొప్పౝ స్థితి రెండుమార్గములుగా నాచేతఁ జెప్పంబడెం
దెలియం జెప్పెద దాని విస్తరగతిౝ ధీవర్య యాలింపుమా.</poem>|ref=62}}
{{Telugu poem|type=క.|lines=<poem>కర్మము లొనర్పకుండిన
నిర్మలమతి గలుగ దెపుడు నిష్కర్మత్వం
బర్మిలి సన్యాసంబున
శర్మదమగు సిద్ధి వడయఁజాలఁడు విజయా.</poem>|ref=63}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ప్రకృతిగుణంబులఁ బ్రాపించి యవశులై
సర్వజనంబులు సంతతంబు
నుడుగక కర్మంబు లొనరింపుచున్నారు
గణుతింప నొకత్రుటికాలమైన
గర్మప్రవిష్టుంఁడు గానివాఁ డొకఁడైన
నీలలోన లేఁడు కర్మేంద్రియముల</poem>|ref=}}<noinclude><references/></noinclude>
996u81ktdjx6nobz2flldjyzkii0qqs
569539
569506
2026-08-09T22:03:00Z
దేవీప్రసాదశాస్త్రి
4290
569539
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb|fs120}}తృతీయాధ్యాయము ― కర్మయోగము</p>
{{Telugu poem|type=వ.|lines=<poem>అది విని యర్జునుండు గోవిందునిం జూచి దేవా
మీకుఁ గర్మంబుకంటె జ్ఞానంబు శ్రేష్ఠతరంబైన దాని సమ్మతం
బగునేని ఘోరంబైన యాకర్మంబునందు నన్నేల నియమింపు
చున్నవాఁడవు. వ్యామిశ్రంబైన దాని యట్లు ప్రతీయ
మానం బగు వాక్యంబుచేత మద్బుద్ధిని మోహింపం జేయు
వానిపోలిక నున్నవాఁడవు నాకు నెద్దానిచేత శ్రేయంబు
నొంద శక్యం బగు నట్టిదాని నొక్కటి నిశ్చయించి చెప్పు
మని యడిగిన నయ్యర్జునునికిఁ గృష్ణుం డిట్లనియె.</poem>|ref=61}}
{{Telugu poem|type=మ.|lines=<poem>విలసద్విక్రమ తొల్లి సాంఖ్యులకు నుర్విౝ జ్ఞానయోగంబుచేఁ
దిలకింపం దగు నట్టి యోగులకుఁ బ్రీతిం గర్మయోగంబుచే
నలు వొప్పౝ స్థితి రెండుమార్గములుగా నాచేతఁ జెప్పంబడెం
దెలియం జెప్పెద దాని విస్తరగతిౝ ధీవర్య యాలింపుమా.</poem>|ref=62}}
{{Telugu poem|type=క.|lines=<poem>కర్మము లొనర్పకుండిన
నిర్మలమతి గలుగ దెపుడు నిష్కర్మత్వం
బర్మిలి సన్యాసంబున
శర్మదమగు సిద్ధి వడయఁజాలఁడు విజయా.</poem>|ref=63}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ప్రకృతిగుణంబులఁ బ్రాపించి యవశులై
సర్వజనంబులు సంతతంబు
నుడుగక కర్మంబు లొనరింపుచున్నారు
గణుతింప నొకత్రుటికాలమైన
గర్మప్రవిష్టుంఁడు గానివాఁ డొకఁడైన
నిలలోన లేఁడు కర్మేంద్రియముల</poem>|ref=}}<noinclude><references/></noinclude>
61iag9we585yrn7eu3ml9e1rvbqncod
పుట:భగవద్గీత.pdf/30
104
217836
569541
568887
2026-08-09T22:11:48Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569541
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>మునుకొని నియమించి మనముచే నింద్రియ
చయవిషయంబుల సంస్మరించు
నెవ్వఁ డతఁడు వివేకవిహీనుఁ డగునుఁ
గలఁకతోడ మిథ్యాచారకలితుఁ డనఁగఁ
బృథివిలో నెన్నఁబడుఁ దత్త్వవిదులచేతఁ
బార్థివస్తుత్య సుచరిత్ర పాండుపుత్త్ర.</poem>|ref=64}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>అనఘ జ్ఞానేంద్రియంబుల మనముచేత
నాఁగి యెవ్వాఁడు కర్మేంద్రియములచేత
మమత నాసక్తి లేక కర్మంబు సేయు
నట్టిపురుషుండు విద్వాంసుఁ డనఁగఁ బరఁగు.</poem>|ref=65}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>కర్మ మతిఘనం బకర్మంబుకంటెఁ గ
ర్మంబు లేనినీకు మహి శరీర
యాత్రసిద్ధి గలుగ దటు గావున నియత
కర్మ మిపుడు సల్పఁ గడఁగు మీవు.</poem>|ref=66}}
{{p|ac|fwb}}కర్మయజ్ఞఫలము</p>
{{Telugu poem|type=గీ.|lines=<poem>మఱియు యజ్ఞార్థ మైనకర్మమునకంటె
తరకర్మంబు లని బంధహేతువు లగుఁ
గాన నీశ్వరార్థంబైన కర్మమీవు
ముక్తసంగుండవై సలుపుము కిరీటి.</poem>|ref=67}}
{{Telugu poem|type=క.|lines=<poem>అజుఁడు మును యజ్ఞయుతముగఁ
బ్రజలౝ సృజియంచి పలికెఁ బదపడి మీరల్
సృజియింపుఁ డిమ్మఖముచే
నిజముగ నిది మీకుఁ బిదుకు నిఖిలార్థంబుల్.</poem>|ref=68}}<noinclude><references/></noinclude>
nya6t5u0bcaqcuivrwvoezu0kh9ix3n
పుట:భగవద్గీత.pdf/31
104
217837
569543
568888
2026-08-09T22:22:22Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569543
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>దేవతల నిమ్మఖంబున
భావన నేయుండు మిమ్ము బాగుగ వారల్
భావన సేతు రుభయు లటు
భావితులై పరమసిద్ధిఁ బడయుఁడు పేర్మిన్.</poem>|ref=69}}
{{Telugu poem|type=|lines=<poem>యజ్ఞసంయుతులై మీకు నమరు లఖిల
భోగము లొసంగుదురు వారు పొసఁగ నిచ్చి
నట్టివాని వారల కీక యనుభవించు
నట్టిపురుషుండు తస్కరుం డనఁగఁ బరఁగు.</poem>|ref=70}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>సవనశిష్టాన్నభోక్తలౌ సాధుజనము
లఘచయంబులచే ముక్తు లగుదు రెలమిఁ
బుడమి నేదుర్జనుఁడు తనపొట్టకొఱకుఁ
బాక మొనరించు నాతడు పాప మొందు.</poem>|ref=71}}
{{p|ac|fwb}}అన్నాదులయుత్పత్తి</p>
{{Telugu poem|type=క.|lines=<poem>అన్నమున సకలభూతము
లన్నము పర్జన్యువలన నాపర్జన్యుం
డెన్నగ యజ్ఞమువలనను
జన్నము కర్మమునఁ బుట్టె శక్రజ వరుసన్.</poem>|ref=72}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>వేదమునఁ బుట్టెఁ గర్మంబు వేద మరయ
నాత్మయం దుద్భవంబయ్యె నట్లుగాన
సర్వగతమును నిత్యంబు సర్వసంప్ర
తిషితంబయి వేదంబు తేజరిల్లు.</poem>|ref=73}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఈపగిది నొప్పు చక్రం
బేపురుషుం డనుసరింపఁ డిల నామూఢుం</poem>|ref=}}<noinclude><references/></noinclude>
dfqyztamylhb0nvrknec1xvhu447lc8
569544
569543
2026-08-09T22:22:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
569544
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>దేవతల నిమ్మఖంబున
భావన నేయుండు మిమ్ము బాగుగ వారల్
భావన సేతు రుభయు లటు
భావితులై పరమసిద్ధిఁ బడయుఁడు పేర్మిన్.</poem>|ref=69}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>యజ్ఞసంయుతులై మీకు నమరు లఖిల
భోగము లొసంగుదురు వారు పొసఁగ నిచ్చి
నట్టివాని వారల కీక యనుభవించు
నట్టిపురుషుండు తస్కరుం డనఁగఁ బరఁగు.</poem>|ref=70}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>సవనశిష్టాన్నభోక్తలౌ సాధుజనము
లఘచయంబులచే ముక్తు లగుదు రెలమిఁ
బుడమి నేదుర్జనుఁడు తనపొట్టకొఱకుఁ
బాక మొనరించు నాతడు పాప మొందు.</poem>|ref=71}}
{{p|ac|fwb}}అన్నాదులయుత్పత్తి</p>
{{Telugu poem|type=క.|lines=<poem>అన్నమున సకలభూతము
లన్నము పర్జన్యువలన నాపర్జన్యుం
డెన్నగ యజ్ఞమువలనను
జన్నము కర్మమునఁ బుట్టె శక్రజ వరుసన్.</poem>|ref=72}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>వేదమునఁ బుట్టెఁ గర్మంబు వేద మరయ
నాత్మయం దుద్భవంబయ్యె నట్లుగాన
సర్వగతమును నిత్యంబు సర్వసంప్ర
తిషితంబయి వేదంబు తేజరిల్లు.</poem>|ref=73}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఈపగిది నొప్పు చక్రం
బేపురుషుం డనుసరింపఁ డిల నామూఢుం</poem>|ref=}}<noinclude><references/></noinclude>
py2q33g5j1nn51j1o9a2imes0wj042o
569545
569544
2026-08-09T22:23:39Z
దేవీప్రసాదశాస్త్రి
4290
569545
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>దేవతల నిమ్మఖంబున
భావన సేయుండు మిమ్ము బాగుగ వారల్
భావన సేతు రుభయు లటు
భావితులై పరమసిద్ధిఁ బడయుఁడు పేర్మిన్.</poem>|ref=69}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>యజ్ఞసంయుతులై మీకు నమరు లఖిల
భోగము లొసంగుదురు వారు పొసఁగ నిచ్చి
నట్టివాని వారల కీక యనుభవించు
నట్టిపురుషుండు తస్కరుం డనఁగఁ బరఁగు.</poem>|ref=70}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>సవనశిష్టాన్నభోక్తలౌ సాధుజనము
లఘచయంబులచే ముక్తు లగుదు రెలమిఁ
బుడమి నేదుర్జనుఁడు తనపొట్టకొఱకుఁ
బాక మొనరించు నాతడు పాప మొందు.</poem>|ref=71}}
{{p|ac|fwb}}అన్నాదులయుత్పత్తి</p>
{{Telugu poem|type=క.|lines=<poem>అన్నమున సకలభూతము
లన్నము పర్జన్యువలన నాపర్జన్యుం
డెన్నగ యజ్ఞమువలనను
జన్నము కర్మమునఁ బుట్టె శక్రజ వరుసన్.</poem>|ref=72}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>వేదమునఁ బుట్టెఁ గర్మంబు వేద మరయ
నాత్మయం దుద్భవంబయ్యె నట్లుగాన
సర్వగతమును నిత్యంబు సర్వసంప్ర
తిషితంబయి వేదంబు తేజరిల్లు.</poem>|ref=73}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఈపగిది నొప్పు చక్రం
బేపురుషుం డనుసరింపఁ డిల నామూఢుం</poem>|ref=}}<noinclude><references/></noinclude>
7lybjcqedjmuq5m6k4100vbkc06ey6v
పుట:భగవద్గీత.pdf/32
104
217838
569546
568889
2026-08-09T22:59:28Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569546
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>డేపున నింద్రియవశుఁడై
పాపాయువ్యంతుఁ డగుచు బ్రతుకును వృథగాన్.</poem>|ref=73}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>ఆత్మచేతఁ దృప్తుఁ డాత్మయం దాసక్తుఁ
డాత్మయందే తుష్టుఁడై చెలంగు
నెవ్వఁ డట్టివాని కించుకయైనను
మొనసి సేయఁదగినపనులు లేవు.</poem>|ref=74}}
{{Telugu poem|type=చ.|lines=<poem>ఘనతఁ గృతాకృతం బయిన కార్యముచే భువి వానికిౝ బ్రయో
జన మది లేదు భూతముల సంతత మర్థనిమిత్త మాశ్రయిం
పను బని లేదుగానఁ బరిపాటిగఁ గర్మ మొనర్పు మీవు సం
గనిరతి మాని యుక్తమగుకర్మ మొనర్పఁ బరంబు చేకుఱున్.</poem>|ref=75}}
{{Telugu poem|type=క.|lines=<poem>జనకాదినృపులు కర్మం
బుననె పరముఁ గాంచి రట్లు భూసంగ్రహముం
గని యైన నీతి విడువక
ఘన మతిఁగర్మంబు సల్పఁగాఁ దగు నీకున్.</poem>|ref=76}}
{{p|ac|fwb}}దొడ్డవాని కర్మ ననుసరించి లోకంబు వర్తించుట</p>
{{Telugu poem|type=గీ.|lines=<poem>శ్రేష్టుఁ డగునరుఁ డెద్దానిఁ జేయు దాని
నితరజనములు గావింతు రెల్లప్రొద్దు
నతఁడు గావించు నట్టిమర్యాద ననుస
రించి వర్తించు లోకంబు ప్రీతితోడ.</poem>|ref=77}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ముల్లోకములయందు మునుకొని నాకుఁ జే
యఁగఁ దగు కార్య మింతైన లేదు
పొందినయది లేదు పొంద నున్నది లేదు
కర మకర్ముఁడ నయ్యుఁ గర్మమందె</poem>|ref=}}<noinclude><references/></noinclude>
qb71hxiw39pelvndy7jss6ccpxvyumq
569547
569546
2026-08-09T23:01:01Z
దేవీప్రసాదశాస్త్రి
4290
569547
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>డేపున నింద్రియవశుఁడై
పాపాయుష్మంతుఁ డగుచు బ్రతుకును వృథగాన్.</poem>|ref=73}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>ఆత్మచేతఁ దృప్తుఁ డాత్మయం దాసక్తుఁ
డాత్మయందే తుష్టుఁడై చెలంగు
నెవ్వఁ డట్టివాని కించుకయైనను
మొనసి సేయఁదగినపనులు లేవు.</poem>|ref=74}}
{{Telugu poem|type=చ.|lines=<poem>ఘనతఁ గృతాకృతం బయిన కార్యముచే భువి వానికిౝ బ్రయో
జన మది లేదు భూతముల సంతత మర్థనిమిత్త మాశ్రయిం
పను బని లేదుగానఁ బరిపాటిగఁ గర్మ మొనర్పు మీవు సం
గనిరతి మాని యుక్తమగుకర్మ మొనర్పఁ బరంబు చేకుఱున్.</poem>|ref=75}}
{{Telugu poem|type=క.|lines=<poem>జనకాదినృపులు కర్మం
బుననె పరముఁ గాంచి రట్లు భూసంగ్రహముం
గని యైన నీతి విడువక
ఘన మతిఁగర్మంబు సల్పఁగాఁ దగు నీకున్.</poem>|ref=76}}
{{p|ac|fwb}}దొడ్డవాని కర్మ ననుసరించి లోకంబు వర్తించుట</p>
{{Telugu poem|type=గీ.|lines=<poem>శ్రేష్టుఁ డగునరుఁ డెద్దానిఁ జేయు దాని
నితరజనములు గావింతు రెల్లప్రొద్దు
నతఁడు గావించు నట్టిమర్యాద ననుస
రించి వర్తించు లోకంబు ప్రీతితోడ.</poem>|ref=77}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ముల్లోకములయందు మునుకొని నాకుఁ జే
యఁగఁ దగు కార్య మింతైన లేదు
పొందినయది లేదు పొంద నున్నది లేదు
కర మకర్ముఁడ నయ్యుఁ గర్మమందె</poem>|ref=}}<noinclude><references/></noinclude>
0syon00rxrgcp3lqmf30hztb8y2odlw
569548
569547
2026-08-09T23:01:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
569548
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>డేపున నింద్రియవశుఁడై
పాపాయుష్మంతుఁ డగుచు బ్రతుకును వృథగాన్.</poem>|ref=73}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>ఆత్మచేతఁ దృప్తుఁ డాత్మయం దాసక్తుఁ
డాత్మయందె తుష్టుఁడై చెలంగు
నెవ్వఁ డట్టివాని కించుకయైనను
మొనసి సేయఁదగినపనులు లేవు.</poem>|ref=74}}
{{Telugu poem|type=చ.|lines=<poem>ఘనతఁ గృతాకృతం బయిన కార్యముచే భువి వానికిౝ బ్రయో
జన మది లేదు భూతముల సంతత మర్థనిమిత్త మాశ్రయిం
పను బని లేదుగానఁ బరిపాటిగఁ గర్మ మొనర్పు మీవు సం
గనిరతి మాని యుక్తమగుకర్మ మొనర్పఁ బరంబు చేకుఱున్.</poem>|ref=75}}
{{Telugu poem|type=క.|lines=<poem>జనకాదినృపులు కర్మం
బుననె పరముఁ గాంచి రట్లు భూసంగ్రహముం
గని యైన నీతి విడువక
ఘన మతిఁగర్మంబు సల్పఁగాఁ దగు నీకున్.</poem>|ref=76}}
{{p|ac|fwb}}దొడ్డవాని కర్మ ననుసరించి లోకంబు వర్తించుట</p>
{{Telugu poem|type=గీ.|lines=<poem>శ్రేష్టుఁ డగునరుఁ డెద్దానిఁ జేయు దాని
నితరజనములు గావింతు రెల్లప్రొద్దు
నతఁడు గావించు నట్టిమర్యాద ననుస
రించి వర్తించు లోకంబు ప్రీతితోడ.</poem>|ref=77}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>ముల్లోకములయందు మునుకొని నాకుఁ జే
యఁగఁ దగు కార్య మింతైన లేదు
పొందినయది లేదు పొంద నున్నది లేదు
కర మకర్ముఁడ నయ్యుఁ గర్మమందె</poem>|ref=}}<noinclude><references/></noinclude>
sfc1628h4iop3oz2yiie55xeyvv4d6n
పుట:భగవద్గీత.pdf/33
104
217839
569549
568890
2026-08-09T23:09:49Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569549
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>వర్తింపుచున్నాఁడ వరుసతో నేన ప్ర
మాదుండనై కర్మమార్గమందుఁ
బూని ప్రవర్తింప నేని లోకం బెల్ల
ననిశంబు నామార్గ మనుసరించు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నేర్పుతో నేను గర్మం బొనర్పకున్న
జగములన్నియు నశియించు సంకరమున
కవనిలోఁ గర్త నగుదు నే నందువలనఁ
బ్రజల నందఱఁ జంపినవాఁడ నగుదు.</poem>|ref=78}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>ధరణి నాసక్తులై యవిద్వాంసు లెట్లు
కర్మ మొనరింతు రట్లు జగద్దితంబు
కొఱకు విద్వాంసుడును నిజకులసముచిత
కర్మ మొనరించు నందు సంగంబు విడిచి.</poem>|ref=79}}
{{p|ac|fwb}}కర్మాసక్తులైనవారికి బుద్ధి చెఱుపఁగూడదు</p>
{{Telugu poem|type=వ.|lines=<poem>మఱియు విద్వాంసుండగువాఁడు తాను సావధానుండై
కర్మంబు లాచరింపుచు నొరుల నాచరించువారిఁగా నియో
గింపవలయుం గాని కర్మమం దాసక్తులై సేయు నట్టి యజ్ఞు
లకైనను బుద్ధిభేదంబు పుట్టింపఁదగదు. మఱియు మూఢాత్ముం
డగువాఁ డహంకారంబునఁ బ్రకృతిగుణంబులచేత బహు
రూపంబులుగా నాచరింపంబడు కర్మంబుల కేను గర్త నని
తలంచుఁ దత్త్వవిదుం డగువాఁడు సత్త్వాదిగుణవిభాగంబు
నందు గుణంబులు గుణంబులయం దావిర్భవించు నని దలంచి
యాసక్తుండు గాకయుండుఁ బ్రకృతిగుణంబులచే మోహితులై
గుణంబుల యందుఁ గర్మంబునందు నాసక్తు లగుదు రేమియు
నెఱుంగని మూఢజనంబుల సర్వజ్ఞుం డగువాఁడు చలింపఁ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
tgw8g8f4p1hv12juhzbc5rccuhjgjqx
పుట:భగవద్గీత.pdf/34
104
217840
569565
568891
2026-08-10T01:18:31Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569565
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>జేయం దగదు వివేకివై నాయందు సర్వకర్మంబు లర్పణంబు
గావించి నిరాశుండవై మమత్వంబు విడిచి విగతసంతా
పుండవై యుద్ధంబుసేయు మని పలికి వెండియు నిట్లనియె.</poem>|ref=80}}
{{p|ac|fwb}}ఇట్టివారు చెడుదురు</p>
{{Telugu poem|type=సీ.|lines=<poem>అనఘ శ్రద్ధావంతు లనసూయులైన యే
మనుజు లీనాదైనమతము నిత్య
మనుసరించి చరింతు రట్టివారలు కర్మ
బంధవిముక్తులై పరఁగుచుందు
రవని నసూయకులై యెవ్వ రీనాదు
మతమును గైకొని మమతతోడ
వర్తింప లే రట్టివారలు కడు బుద్ధి
హీనులుగా జ్ఞానహీనులుగను</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>వారు నష్టులైనవారుగా నెఱుఁగుము
జ్ఞానవంతుఁ డైనస్వప్రకృతికి
సదృశముగఁ జరించు సకలభూతములందుఁ
బ్రకృతి నిగ్రహంబు వలవ దెందు.</poem>|ref=81}}
{{Telugu poem|type=క.|lines=<poem>అనఘ ప్రతీంద్రియవిషయం
బున రాగద్వేషము లటు పూనుకయుండుౝ
వినువానికి లోఁబడఁ దగ
దనిశం బవిరెండు వైరు లగుఁ బురుషునకున్.</poem>|ref=82}}
{{p|ac|fwb}}కులధర్మమే శ్రేష్ఠం బనుట</p>
{{Telugu poem|type=గీ.|lines=<poem>అనఘచరిత స్వనుష్ఠితంబైన యన్య
ధర్మమున కంటెఁ దనకులధర్మ మగుణ
మైనఁ గడు లెస్స తనధర్మమందు నిధన
మధిక మన్యధర్మంబు భయావహంబు.</poem>|ref=83}}<noinclude><references/></noinclude>
sf8jb2euj3ac9rdmx1pnrqkxlezq60p
పుట:భగవద్గీత.pdf/35
104
217841
569570
568892
2026-08-10T03:30:06Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569570
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>అనిన నర్జునుం డిట్లనియె.</poem>|ref=83}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఈపురుషుఁ డిచ్ఛ లేకయె
ప్రాపుగ భువి దేనిచేతఁ బ్రసభంబుగ నా
జ్ఞాపింపఁబడిన కైవడిఁ
బాపంబులు సేయు మాధవా వినఁదలఁతున్.</poem>|ref=84}}
{{p|ac|fwb}}కామంబు సర్వదోషమూలం బనుట</p>
{{Telugu poem|type=చ.|lines=<poem>అన విని కృష్ణుఁ డిట్లనియె నర్జున చూడ రజో గుణంబునౝ
జననము నొందెఁ గామమదె చయ్యనఁ గ్రోధముఁ జూడఁగా మహా
శన మతిపాపరూప మవిషహ్యము నిచ్చట దీని వైరిఁగా
మసమునఁ జూడు మిత్తెఱఁగు మానుగ నీకు నెఱుంగజెప్పితిన్.</poem>|ref=85}}
{{Telugu poem|type=క.|lines=<poem>ధూమముచే ననలముక్రియ
నామలినముచేత ముకుర మట్టుల గర్భం
బామాయచేతఁబోలెను
గ్రామముచే జ్ఞాన మెల్లఁ గప్పంబడియెన్.</poem>|ref=86}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>అనఘ కామరూప మనలంబు దుష్పూర
మాత్మవిదున కరియునైన యట్టి
కామమునను దెల్వి గప్పఁగఁబడుదాని
నిగ్రహింపవలయు నేర్పుతోడ.</poem>|ref=87}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>ఇంద్రియంబులు బుద్ధియు హృదయ మెపుడు
కామమున కాశ్రయంబగుఁ గామ మింద్రి
యములచే నావరించి జ్ఞానమును దేహిఁ
బాయ కెప్పుడు మోహింపఁజేయుచుండు.</poem>|ref=88}}
{{Telugu poem|type=వ.|lines=<poem>కావున నీవు మొదలు నింద్రియంబుల నియమించి జ్ఞానవిజ్ఞాన
నాశనంబును బాపస్వరూపంబైన యీకామంబును జయిం</poem>|ref=}}<noinclude><references/></noinclude>
saq1srwbq0u51ty22h7d46b683lfymo
పుట:భగవద్గీత.pdf/36
104
217842
569571
568893
2026-08-10T03:44:48Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569571
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>పుము మఱియు దేహంబుకంటె నింద్రియంబులు నింద్రి
యంబులకంటె మనంబు మనంబుకంటె బుద్ధియుఁ బరంబనియు
బుద్ధికిఁ బరుఁ డెవ్వఁడో వాఁ డాత్మ యనియు నిట్లు బుద్ధి
కంటెఁ బరుండగునాత్మ నెఱింగి యాత్మను దనయాత్మచేత
లెస్సగా నిల్పి దురాసదమైన కామరూపశత్రువును జంపుమని
యిట్లు తృతీయాధ్యాయంబునందుఁ గర్మయోగం బుపదేశించి
భగవంతుండు వెండియు నర్జునున కిట్లనియె.</poem>|ref=89}}
{{p|ac|fwb|fs120}}చతుర్థాధ్యాయము ― జ్ఞానయోగము</p>
{{Telugu poem|type=సీ.|lines=<poem>అనఘ యీయోగంబు మును వివస్వంతున
కెఱిఁగించితి నతండు కరము ప్రీతి
మనువున కెఱిఁగించె మనువు సంప్రీతితో
నిక్ష్వాకునకుఁ జెప్పె నింపు మీఱ
రహి మీఱ నిట్లు పరంపరాసంప్రాప్త
మైన దీని నెఱిఁగి రఖిలనృపులు
గడుఁబెద్దగాలంబు గడచుటవలన నీ
యోగంబు ఖిలమయ్యె నుర్వియందు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>ననుపమం బీపురాతన మైనయోగ
మనఘ భక్తుండవు సఖుండ వగుటఁ జేసి
నీకుఁ జెప్పితి నిప్పుడు నెమ్మితోడ
నిది కడురహస్య మెవ్వార లెఱుఁగ రిందు.</poem>|ref=90}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అనిన నర్జునుం డిట్లనియె.</poem>|ref=91}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>అనఘ నీవు పుట్టినట్టికాలము కొంచె
మినుఁడు పుట్టి పెక్కుదినము లయ్యెఁ</poem>|ref=}}<noinclude><references/></noinclude>
5clledp1gg4gvayoywwxc8vwcki17y3
పుట:భగవద్గీత.pdf/37
104
217843
569572
568894
2026-08-10T03:56:39Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569572
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>జెలఁగి యతని కేను జెప్పితి నంటి వీ
వెవ్విధమున దీని నెఱుఁగువాఁడ.</poem>|ref=91}}
{{Telugu poem|type=వ.|lines=<poem>అని యడిగిన వాసుదేవుం డిట్లనియె.</poem>|ref=}}
{{Telugu poem|type=క.|lines=<poem>సువిచార నీకు నాకును
భువిలోపలఁ బెక్కుజన్మములు కడచనె నే
నవియన్ని యెఱిఁగి యుండుదుఁ
బ్రవిమలమతి నెఱుఁగ నీవు ప్రాజ్ఞత లేమిన్.</poem>|ref=92}}
{{p|ac|fwb}}ధర్మసంస్థాపనకై భగవంతుండు పుట్టు ననుట</p>
{{Telugu poem|type=గీ.|lines=<poem>అవ్యయాత్ముండనయ్యు నే నజుఁడనయ్యు
భూతముల కీశ్వరుఁడనయ్యు భువి స్వకీయ
మైన ప్రకృతిని దగబొంది మానితముగ
నాత్మమాయచే సారెకు నవతరింతు.</poem>|ref=93}}
{{Telugu poem|type=క.|lines=<poem>ఎపు డెపుడు ధర్మమున కిల
సుపహతియు నధర్మమునకు నుపచయ మగు నే
నపుడెల్ల నవతరింపుదు
విపులౝ నిజమాయచేత వీరవరేణ్యా.</poem>|ref=94}}
{{Telugu poem|type=క.|lines=<poem>విను పార్థ సాధురక్షణ
మును దుష్కృతిజనవినాశమును ధర్మస్థా
వనమును గావించుటకై
పనివడి యే నవతరింతుఁ బ్రతియుగమందున్.</poem>|ref=95}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>మరియు దివ్య మయిన మజ్జన్మకర్మంబు
నిట్లు తత్త్వబుద్ధి నెవ్వఁ డెఱుఁగు
నతఁడు మేను విడిచి యవ్వల జన్మంబు
డుర్వి నన్నుఁ బొందు ననఘ.</poem>|ref=96}}<noinclude><references/></noinclude>
bt314pjqm4du4ey96ys5plethmy72zg
పుట:భగవద్గీత.pdf/38
104
217844
569573
568895
2026-08-10T04:21:08Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569573
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=ఉ.|lines=<poem>రాగము క్రోధముౝ భయము గ్రక్కునఁ బోనిడి మత్స్వరూపులై
బాగుగ నన్ను సంతత ముపాసన చేయుచు నిష్కళంకులై
యోగులు జ్ఞానయోగమున నుర్వి ననేకులు పూతచిత్తులై
వేగమె నాదుభావమును విశ్రుతభంగి గమించి రర్జునా.</poem>|ref=97}}
{{Telugu poem|type=చ.|lines=<poem>తడయక యెవ్వ రెట్లు వితతంబుగ నన్ను భజింతురట్లు నే
నుడుగక వారి నందఱ సముత్సుకతౝ గరుణింతు నెప్పుడుౝ
బుడమి సమస్తమానవులు పోఁడిమితోడ మదీయమార్గముౝ
విడువక సంచరించెదరు వీరవరేణ్య సమస్తభంగులన్.</poem>|ref=98}}
{{Telugu poem|type=చ.|lines=<poem>నలువుగ నిమ్మనుష్యభువనంబున మానవకోటి కెంతయుౝ
జెలువుగఁ గర్మసిద్ధి బలుశీఘ్రమునౝ లభియించుఁ గావునౝ
దలఁగక కర్మసిద్ధిని మనంబునఁ గోరుచు నిర్మలాత్ములై
పొలుపుగ సర్వదేవతలఁ బూజ యొనర్పఁగఁ బోలు నర్జునా.</poem>|ref=99}}
{{Telugu poem|type=చ.|lines=<poem>ఘనతరయుక్తి నేను గుణకర్మవిభాగముచే ధరిత్రిలోఁ
బనివడి నాల్గువర్ణములవారి సృజించితి దాని కెంతయుౝ
మునుకొని కర్తనై సకలము న్వెలిఁగించెడు నన్న కర్తగా
ఘనముగ నవ్యయాత్మకుని గాఁగ నెఱుంగుము పాండునందనా.</poem>|ref=100}}
{{Telugu poem|type=క.|lines=<poem>కర్మంబులు నన్నంటవు
కర్మఫలం బందుఁ గాంక్ష గలుగదు నా కి
ట్లర్మిలి ననుఁ గనుపురుషుఁడు
కర్మంబులఁ గట్టఁబడఁడు కౌరవముఖ్యా.</poem>|ref=101}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>ఈగతి నెఱింగి పూర్వికులెల్ల మోక్ష
కాములయ్యును జేసిరి కర్మచయము
గాన నీవును బూర్వులకరణిఁ దెలిసి
చెలఁగి ప్రాచీనకర్మంబు సేయు మనఘ.</poem>|ref=102}}<noinclude><references/></noinclude>
ap18ocgtqu39zwox1soulloag41qk83
పుట:భగవద్గీత.pdf/39
104
217845
569574
568896
2026-08-10T04:28:27Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569574
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}కర్మాకర్మవికర్మస్వరూపము</p>
{{Telugu poem|type=గీ.|lines=<poem>కర్మ మెయ్యది మఱియు నకర్మ మెద్ది
యనుచుఁ గవులును మోహితులైరి గాన
నెద్ది దెలిసిన నశుభంబు లెల్లఁ దొలఁగు
నట్టికర్మంబు నెఱిఁగింతు ననఘ వినుము.</poem>|ref=103}}
{{Telugu poem|type=క.|lines=<poem>కర్మము నిషిద్ధకర్మము
కర్మాభావంబు దెలియఁగాఁ దగు నెపుడుౝ
గర్మగతి గహన మందురు
నిర్మలమతిఁ దత్త్వ మనుచు నెఱిఁ గనవలయున్.</poem>|ref=104}}
{{Telugu poem|type=సీ.|lines=<poem>అవని నెవ్వఁడు కర్మమందుఁ గర్మాభావ
మరయఁ గర్మాభావమందుఁ గర్మ
మును జూచు నాతండు మనుజులలోఁ గడు
బుద్ధిమంతుఁడు వాఁడె పూర్ణయోగి
యతఁడె కర్మములన్ని యాచరించినవాఁడు
మఱియు నెవ్వాని కర్మంబు లన్ని
ఘనతరకామసంకల్పవర్జితములై
యలరారు నతని జ్ఞానాగ్నిదగ్ధ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కరుఁడైన విద్వాంసునిగా గణింతు
రార్యులు ఫలార్థి గాక నిరాశ్రయుండు
నిత్యతృప్తుఁడై యెవ్వాఁడు నిలుచు నతఁడు
చేసియును గర్మ మింతైన జేయకుండు.</poem>|ref=105}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>ఆశ విడిచి మనోబుద్ధు లాఁగిపట్టి
వీతసర్వపరిగ్రహుండై తనర్చు</poem>|ref=}}<noinclude><references/></noinclude>
m6xveu1y5aa4rflcguoqmrndhekr1xj
పుట:భగవద్గీత.pdf/40
104
217846
569575
568897
2026-08-10T04:39:53Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569575
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>యోగియు శరీరమాత్రోపయోగకర్మ
మది యొనర్చియుఁ దాఁ బొందఁ డఘము లనఘ.</poem>|ref=106}}
{{Telugu poem|type=వ.|lines=<poem>మఱియు నమ్మహాత్ముండు యదృచ్ఛాలాభసంతుష్టుండై సుఖ
దుఃఖశీతోష్ణాదిద్వంద్వాతీతుండై వీతమత్సరుండై సిద్ధ్య
సిద్ధులందు సముండై కర్మంబు గావించియు బద్ధుండు గాక
యుండు బరిత్యక్తసంగుండై ముక్తుండై జ్ఞానప్రతిష్ఠచిత్తుండై
యజ్ఞంబుకొఱకుఁ జేయుచున్నవానికర్మంబు బంధహేతువు
గాక నశించు.</poem>|ref=107}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>బ్రహ్మమె హోమసాధనము బ్రహ్మమె చూడ హవిష్పదార్థముౝ
బ్రహ్మముచేత బ్రహ్మమనుపావకునం దటు వేల్వఁగాఁ బడుౝ
బ్రహ్మమయోక్తకర్మము సమాధిగఁ గైకొనునట్టి బ్రహ్మచే
బ్రహ్మమె పొందశక్యమగు బ్రహ్మమె సర్వము వేరెయున్నదే.</poem>|ref=108}}
{{p|ac|fwb}}యోగులు చేయు ద్రవ్యయజ్ఞజ్ఞానయజ్ఞములు</p>
{{Telugu poem|type=క.|lines=<poem>ధరలోఁ గొందఱు యోగులు
కర మొప్పగ దైవమఖము గావింతురు కొం
దఱు యజ్ఞముచే యజ్ఞము
వెరవున బ్రహ్మాగ్నియందు వేల్తురు విజయా.</poem>|ref=109}}
{{Telugu poem|type=క.|lines=<poem>కొందఱు శ్రవణాదీంద్రియ
బృందము నియమాగ్నులందు వేల్తురు మఱియుౝ
గొందఱు శబ్దాదివిషయ
బృందము కరణాగ్నులందు వేల్తురు పార్థా.</poem>|ref=110}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>గరిమతోఁ గొంద ఱింద్రియకర్మములను
గడిమిఁ జలనాదికప్రాణకర్మములను</poem>|ref=}}<noinclude><references/></noinclude>
ikpujskofvqctq9yjhg56ul5wumc066
569576
569575
2026-08-10T04:41:48Z
దేవీప్రసాదశాస్త్రి
4290
569576
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>యోగియు శరీరమాత్రోపయోగకర్మ
మది యొనర్చియుఁ దాఁ బొందఁ డఘము లనఘ.</poem>|ref=106}}
{{Telugu poem|type=వ.|lines=<poem>మఱియు నమ్మహాత్ముండు యదృచ్ఛాలాభసంతుష్టుండై సుఖ
దుఃఖశీతోష్ణాదిద్వంద్వాతీతుండై వీతమత్సరుండై సిద్ధ్య
సిద్ధులందు సముండై కర్మంబు గావించియు బద్ధుండు గాక
యుండు బరిత్యక్తసంగుండై ముక్తుండై జ్ఞానప్రతిష్ఠచిత్తుండై
యజ్ఞంబుకొఱకుఁ జేయుచున్నవానికర్మంబు బంధహేతువు
గాక నశించు.</poem>|ref=107}}
{{Telugu poem|type=ఉ.|lines=<poem>బ్రహ్మమె హోమసాధనము బ్రహ్మమె చూడ హవిష్పదార్థముౝ
బ్రహ్మముచేత బ్రహ్మమనుపావకునం దటు వేల్వఁగాఁ బడుౝ
బ్రహ్మ మయోక్తకర్మము సమాధిగఁ గైకొనునట్టి బ్రహ్మచే
బ్రహ్మమె పొంద శక్యమగు బ్రహ్మమె సర్వము వేరె యున్నదే.</poem>|ref=108}}
{{p|ac|fwb}}యోగులు చేయు ద్రవ్యయజ్ఞజ్ఞానయజ్ఞములు</p>
{{Telugu poem|type=క.|lines=<poem>ధరలోఁ గొందఱు యోగులు
కర మొప్పగ దైవమఖము గావింతురు కొం
దఱు యజ్ఞముచే యజ్ఞము
వెరవున బ్రహ్మాగ్నియందు వేల్తురు విజయా.</poem>|ref=109}}
{{Telugu poem|type=క.|lines=<poem>కొందఱు శ్రవణాదీంద్రియ
బృందము నియమాగ్నులందు వేల్తురు మఱియుౝ
గొందఱు శబ్దాదివిషయ
బృందము కరణాగ్నులందు వేల్తురు పార్థా.</poem>|ref=110}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>గరిమతోఁ గొంద ఱింద్రియకర్మములను
గడిమిఁ జలనాదికప్రాణకర్మములను</poem>|ref=}}<noinclude><references/></noinclude>
aqx3084ef4szs2uvg4y7xmtuyj43yq6
పుట:భగవద్గీత.pdf/41
104
217847
569579
568898
2026-08-10T05:39:15Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569579
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>జ్ఞానదీపితచిత్తనిగ్రహ మనియెడి
యోగవహ్నిలో వేల్తురు యోగివర్య.</poem>|ref=111}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>అవనిలో సంశితవ్రతు లైనయట్టి
యతులు ద్రవ్యయజ్ఞులు తపోయజ్ఞులు శ్రుతి
యజ్ఞులును జ్ఞానయజ్ఞులునట్లు యోగ
యజ్ఞులన నొప్పుదురు కౌరవాగ్రగణ్య.</poem>|ref=112}}
{{Telugu poem|type=వ.|lines=<poem>మఱియుఁ గొందఱు ప్రాణాయామపరాయణులైనయభ్యాస
యోగులు ప్రాణాపానంబులగతి నిరోధించి ప్రాణవృత్తియం
దపానంబును నపానవృత్తియందుఁ బ్రాణంబును లయంబు
నొందింతు రదియునుంగాక కొందఱు నియతిపరులై ప్రాణం
బులు ప్రాణంబులయందె హోమంబు గావింతురు నాచేత
జెప్పంబడిన వీరందఱు యజ్ఞక్షాళితకర్ములై యజ్ఞకోవిదు లని
వక్కాణింపంబడుదురు. యజ్ఞశిష్టామృతంబు భుజించిన
వారలు సనాతనం బైన బ్రహ్మపదంబు ప్రాపింతురు. యజ్ఞంబు
లేనివాని కిహపరంబులు రెండును లేవు. వేదముఖంబునందు
నివ్విధంబున బహుయజ్ఞంబులు విస్తరింపంబడియె. వీని నన్నింటి
గర్మంబువలనం బుట్టినవానిఁగా నెఱుంగు మట్లెఱింగిన నీవు
బంధవిముక్తుండ వగుదువు సమస్తకర్మంబును నాశంబు నొంద
నిదై జ్ఞానంబునందుఁ బరిసమాప్తి నొందుఁ గావున ద్రవ్య
యజ్ఞంబుకంటె జ్ఞానయజ్ఞం బుత్తమంబై యుండు.</poem>|ref=113}}
{{p|ac|fwb}}ఆచార్యునియొద్ద జ్ఞానోపదేశంబు చేసికొనుట</p>
{{Telugu poem|type=గీ.|lines=<poem>తత్త్వవేత్తలైనధన్యులు నీ కెద్ది
గఱపుదురు నితాంతకరుణ నట్టి</poem>|ref=}}<noinclude><references/></noinclude>
aiqjub0c2jhdqsb0zf9yyv960y6nyko
పుట:భగవద్గీత.pdf/42
104
217848
569583
568899
2026-08-10T05:50:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
569583
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>జ్ఞాన మెఱుఁగు మీవు కడుభక్తి సంప్రశ్న
చేత వినతిచేత సేవచేత.</poem>|ref=114}}
{{Telugu poem|type=గీ.|lines=<poem>మఱియు నేజ్ఞానము నెఱింగి మరల నీవు
తవిలి మోహంబు నొందవు దానిచేత
నాత్మనైనట్టి నాయందు నఖిలభూత
వితతిఁ జూచెద వెంతయు వీరవర్య.</poem>|ref=115}}
{{Telugu poem|type=క.|lines=<poem>పాపులకంటెను మిక్కిలి
పావుఁడవైనను వివేకబంధురతరిచేఁ
బాపాంబుధిఁ దరియించి య
పాపుఁడ నయ్యెదవు నీవు పాండుకుమారా.</poem>|ref=116}}
{{Telugu poem|type=క.|lines=<poem>అనఘా మండెడు శిఖి వే
ల్చినయింధనములను నీఱుఁ జేసినమాడ్కిౝ
మునుకొని కర్మచయంబుల
ఘనముగ జ్ఞానాగ్ని నీఱు గావించు భువిన్.</poem>|ref=117}}
{{Telugu poem|type=క.|lines=<poem>జ్ఞానముతోడ సమానం
బైన పత్ర మగువస్తు వది లేదు మహిౝ
బూనుకొని యోగసిద్ధుఁడు
దానింగను నాత్మయందె తగుకాలమునన్.</poem>|ref=118}}
{{Telugu poem|type=క.|lines=<poem>జ్ఞానాసక్తుం డింద్రియ
మానసముల నాఁగి శ్రద్ధ మల్లడిగొన ను
జ్ఞానమును బడయు నవ్వల
జ్ఞానముచేఁ జిత్తశాంతి గలుగు నతనికిన్.</poem>|ref=119}}<noinclude><references/></noinclude>
cggcx7uq8pcut2mfwkdjz82dj2v7r41
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/99
104
218066
569477
2026-08-09T13:21:00Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569477
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>16 మార్పులు/big>}}</noinclude>పించినవి. మఱియు నే నొక కుటుంబములో నివసించుచున్నందున ప్రతివారము వారికి ధన మీవలసివచ్చెను. మఱియు మర్యాదకొఱకు ఆ కుటుంబమువారితో విందులకుఁ బోవుటయు, విందులకుఁ గొంపోవుటయు తటస్థించెడిది. ఈ రెండు పక్షములలోను వ్యయము నేనేభరింపవలసివచ్చెడిది. ఏలన, విందునకు పిలిచినఆమె స్త్రీయైనచో పురుషుఁడే వ్యయము భరించుట దేశాచారము. కుటుంబమువారు ప్రతివారము
పుచ్చుకొను డబ్బులో విఱుగఁగోసికొనరు. కావున ఇట్టి వ్యయము పరిహరింపవచ్చునని తోఁచెను. మఱియు ఈ దూఁబఱదిండిచే ధనికుఁడనను దురూహకు కారణ మగుచున్నదనియు తోఁచెను.
ఈ కుటుంబమున ఇఁక నివసింపక ప్రత్యేకముగా గదుల నద్దెకుఁగొనుట నిశ్చయించితిని. నేను చేయవలసిన పనినిబట్టి అనుకూలముగా అచటికచటికి మాఱుటకు నిశ్చయించితిని. దానివలన సమకాలముననే
అనుభవమును గడింపవచ్చునని తోఁచెను. పని ఉన్న స్థలములకు కాలినడకలో అరగంటకు చేరుటకు వీలైనంత దాపున గదులను అద్దెకుఁగొనుచుంటిని. దాన బండ్లబాడుగ తగ్గినది. ఇంతకు ముందు నే
నెక్కడికి వెళ్లినను ఏదో యొకవిధ మగు యానముమీఁదనే పోవుచుంటిని. దాన గమనవ్యాయామమునకు
కొంతకాలము వ్యయపఱపవలసివచ్చుచుండెను. ఈ యేర్పాటుచే ధనము, తీఱికయు కూడివచ్చెను. ఇట్లు ప్రతిదినము చాలదూరము నడుచుచుండుటవలననే ఆంగ్ల దేశమున నాకు జబ్బు రాకుండుటయే కాక చాలవఱకు దార్ఢ్యమును కలిగెను.
నేను రెండుగదులు తీసికొంటిని. ఒకటి కూర్చుండుటకు, రెండవది పన్నుండుటకు. ఇది రెండవ దశ. మూఁడవది ముందు.<noinclude><references/>
{{c|81}}</noinclude>
26wurkq47s1ehi58x9gbg57npfyg8bq
569478
569477
2026-08-09T13:21:32Z
శ్రీరామమూర్తి
1517
569478
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>16 మార్పులు</big>}}</noinclude>పించినవి. మఱియు నే నొక కుటుంబములో నివసించుచున్నందున ప్రతివారము వారికి ధన మీవలసివచ్చెను. మఱియు మర్యాదకొఱకు ఆ కుటుంబమువారితో విందులకుఁ బోవుటయు, విందులకుఁ గొంపోవుటయు తటస్థించెడిది. ఈ రెండు పక్షములలోను వ్యయము నేనేభరింపవలసివచ్చెడిది. ఏలన, విందునకు పిలిచినఆమె స్త్రీయైనచో పురుషుఁడే వ్యయము భరించుట దేశాచారము. కుటుంబమువారు ప్రతివారము
పుచ్చుకొను డబ్బులో విఱుగఁగోసికొనరు. కావున ఇట్టి వ్యయము పరిహరింపవచ్చునని తోఁచెను. మఱియు ఈ దూఁబఱదిండిచే ధనికుఁడనను దురూహకు కారణ మగుచున్నదనియు తోఁచెను.
ఈ కుటుంబమున ఇఁక నివసింపక ప్రత్యేకముగా గదుల నద్దెకుఁగొనుట నిశ్చయించితిని. నేను చేయవలసిన పనినిబట్టి అనుకూలముగా అచటికచటికి మాఱుటకు నిశ్చయించితిని. దానివలన సమకాలముననే
అనుభవమును గడింపవచ్చునని తోఁచెను. పని ఉన్న స్థలములకు కాలినడకలో అరగంటకు చేరుటకు వీలైనంత దాపున గదులను అద్దెకుఁగొనుచుంటిని. దాన బండ్లబాడుగ తగ్గినది. ఇంతకు ముందు నే
నెక్కడికి వెళ్లినను ఏదో యొకవిధ మగు యానముమీఁదనే పోవుచుంటిని. దాన గమనవ్యాయామమునకు
కొంతకాలము వ్యయపఱపవలసివచ్చుచుండెను. ఈ యేర్పాటుచే ధనము, తీఱికయు కూడివచ్చెను. ఇట్లు ప్రతిదినము చాలదూరము నడుచుచుండుటవలననే ఆంగ్ల దేశమున నాకు జబ్బు రాకుండుటయే కాక చాలవఱకు దార్ఢ్యమును కలిగెను.
నేను రెండుగదులు తీసికొంటిని. ఒకటి కూర్చుండుటకు, రెండవది పన్నుండుటకు. ఇది రెండవ దశ. మూఁడవది ముందు.<noinclude><references/>
{{c|81}}</noinclude>
30s52j2rixp973vxt6jlu39k221o5ky
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/100
104
218067
569480
2026-08-09T13:34:33Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569480
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>ఈ మార్పులు నా వ్యయములో సగము తగ్గించెను. బారిస్టరు పరీక్షకు ప్రతిదినము కొలఁదికాలము వినియోగించినఁ జాలును. దీని విషయమై నాకు అధైర్యము లేదు. ఇఁక మిగులుకాలము? ఇంగ్లీషుభాషలో
ప్రవేశము తక్కువ అను విచారము నన్ను మెండుగ ఏడిపించుచుండెను. 'మొదట బి.ఏ. ప్యాసుకమ్ము. పిదప నాకడకురమ్ము' అను సర్ ఫ్రెడరిక్ లేలీగారిమాటలు నే మఱవలేదు. (ఆయన కప్పటికి సర్ బిరుదము లేదు. పిదప వచ్చెను.) కావున బారిస్టరుపట్టా కాక మఱియొకటి సంపాదింపవలెను అని తలఁచి ఆక్స్ ఫర్డ్, కేంబ్రిడ్జి విద్యాలయములను గూర్చి నా మిత్రులతో సంప్రతింపఁగా, వారు ధనవ్యయమును, కాలవ్యయమును అధికముగ చేయఁగలుగుచో అట్లే చదువవచ్చు ననిరి. 'కఠినపరీక్షలో కృతార్థుఁడవు కాఁగోరినచో లండన్ మెట్రిక్యులేషన్ పరీక్షకు పెట్టుట మంచి' దని ఒక మిత్రుఁ డనెను. అందు ధనవ్యయము లేదు ; పైఁగా మంచి కాలక్షేపము; మంచి లోకజ్ఞానమును కలుగును - అని మొదట నేను సంతోషముతో అంగీకరించితిని గాని, పాఠ్యగ్రంథపట్టిక చూడఁగా అమ్మో అనిపించెను. లాటినుభాషయు, మఱియొక ఆధునికభాషయు
అనివార్యములు. నాకు లాటి నెట్లు కొఱుకఁబడును అని నే ననుకొనఁగా, నామిత్రుఁడు 'లాయరులకు లాటిను ఆవశ్యకము. దానివలన లా పుస్తకములు చక్కగా అర్థనుగును. రోమనులా పరీక్షాపత్రము లాటినుభాషలోనే ఉండును. ఇంతియకాక లాటినువచ్చుచో ఇంగ్లీషు కరతలామలకమే' అని చెప్పెను. అది నాకు బాగుగా నచ్చెను. ఎంతకష్టమైనను లాటిను చదువ నిశ్చయించితిని. ఫ్రెంచిభాషను అదివఱకే ప్రారంభించితిఁ గాన అది మఱియొక భాషక్రింద ఉపయోగించునని తలంచితిని, ఒక ప్రైవేట్ మెట్రిక్యులేషన్ క్లాసులో చేరితిని.<noinclude><references/>
{{c|82}}</noinclude>
o6r8ygn7ab5icbew08jqgw3a6pz8vz8
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/101
104
218068
569481
2026-08-09T13:48:03Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569481
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>16 మార్పులు</big>}}</noinclude>హము తగ్గలేదు. నాకు లాటినులో ఆసక్తి కలిగెను. 'మరల --- వచ్చు వఱకు ఫ్రెంచికూడ వృద్ధియగును. సైన్సుగ్రూపులోమఱొక క్రోర్సు విషయము తీసికొన నగును' అని తలఁచి మొదట కెమిస్ట్రీని (రసాయనశాస్త్రము) తీసికొంటిని. అది మంచివిషయమే కాని ఎక్స్ పెరిమెంట్లు లేవు కాన నాకు రుచింపలేదు. ఇండియాలో కెమిస్ట్రీ అనివార్యము కావున ఆంగ్ల దేశమునఁగూడ దానినే తీసికొంటిని. రెండవసారి 'వేఁడి-వెలుఁగు' అను విషయముల తీసికొంటిని. అది సులభమని మిత్రు లనుటయు కాక నాకును అటులే యుండెను.
మరల పరీక్షకు పెట్టఁదలఁచితిని గాన నా వ్యయ మింకను తగ్గింపఁదలఁచితిని. ఇంకను నా ఖర్చుకరామతులు నాకుటుంబమునకు తగినటులు లే వనుకొంటిని. తాను జీవనమునకు ఎంత త్రొక్కటపడుచున్నను నే నడిగినపుడెల్ల ధనము పంపు మా యన్నను తలఁచికొన్న కష్టముగా నుండెడిది. ఇచట నెలకు ఎనిమిది మొదలు పదియేను పౌనులవఱకు ఖర్చు పెట్టువారిలోపలువురు శిష్యభృతి (scholarship) పడసినవారే యని తెలిసికొంటిని. నా కంటె తక్కువఖర్చు పెట్టువారిని ఎఱుఁగుదును. ఒక విద్యార్థి బీద లుండు పేఁట (slum) లో వార<noinclude><references/>
{{c|83}}</noinclude>
tb89zsntxjr0xy3fug04h8kdcuc37py
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/102
104
218069
569483
2026-08-09T13:54:20Z
శ్రీరామమూర్తి
1517
/* సమస్యాత్మకం */
569483
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>
ఆహారము వండుకొనుటయు ఆరంభించితిని. ఓటుపిండి పులుసును కోకోను తయారు చేయుటకు ఇరువది నిముషములకంటె ఎక్కువ పట్టలేదు. మధ్యాహ్నభోజనము పరత్ర. సాయంభోజనము ఇంటికడ. కోకో రొట్టెలతో సరిపెట్టుకొంటిని. ఇందులకు దినమునకు సుమారు పదియేను పెన్నీలు సరిపోవుచుండెను. మఱియు నేను
బాగుగా వ్యాసంగము చేసినకాల మదియే, మితవ్యయముతో సౌమ్యజీవనము చేయుటవలన విద్యావ్యాసంగమునకు నాకు కావలసినంత తీఱిక ఉండెడిది. నేను పరీక్ష నెగ్గితిని.
నే నిటులు పొదుపుగా ఉండుటవలన చాల కష్టముల పాలైతినని పాఠకుఁడు తలఁపకుండుఁగాక ! అందులకు బదులుగా ఈమార్పు నా ఆంతరజీవితమునకును బాహ్యజీవితమునకును ఐక్య మాపాదించెను.
నా కుటుంబాదాయమునకు తగిన రీతిగా వ్యయమును సమకూర్చెను. జీవనము అధికసత్యమయ మాయెను.
నా ఆనందమున కంతము లేకుండెను.<noinclude><references/>
{{c|84}}</noinclude>
gnjfhlnz5ri2xvjcuvg5tvrytbnu3po
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/103
104
218070
569491
2026-08-09T14:05:06Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569491
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}17</p>
{{p|fs125}}భక్ష్యపరిశీలనము</p>
{{Largeinitial|నే}}ను లోఁతుగా పరిశీలించికొనినకొలఁది బాహ్యాభ్యంతరములైన ఆచారములను మార్చుకొనవలసిన ఆవశ్యకత గోచరింపఁజొచ్చెను. ఉనికియందును, వ్యయమునందును మార్పు చేయుటతోపాటుగనో, అంతకు ముందుగనో భక్ష్యములలోఁగూడ మార్పుచేయ మొదలిడితిని. శాకాహారమును గుఱించి వ్రాసిన గ్రంథకర్తలు మతవైద్యప్రకృతిశాస్త్రానుగుణ్యముగను, ఆచరణానుగుణ్యముగను, లోఁతుగా
పరిశీలించియే వ్రాసిరి. ‘మానవుఁడు తక్కిన జంతువులకంటె అధిఁకుడై కాపాడవలెను. మానవులలో మానవులకు పరస్పరము ఎట్టి సాహాయ్యకము ఉండునో మిగిలిన అన్నింటియెడలఁగూడ అట్టి సాహాయ్యకము
ఉండలయును' అని వారు నైతికముగా నిర్ధారించిరి. మఱియు మానవుఁడు తినుట రుచికి కాదు, మఱి బ్రతుకుటకు, అను సత్యమును వారు పైకిఁ దీసిరి. ఆ గ్రంథకర్తలలో చాలమంది మాంసమునే కాక, గ్రుడ్లను, పాలను నిషేధించిరి. తామును అట్లు నడుచుకొనిరి. మనుష్యుని శరీరనిర్మాణమునుబట్టి చూచినచో వండినపదార్థము సరిపడదనియు, పళ్లు వచ్చువఱకు తల్లిపాలు త్రావవలెననియు, పిమ్మట ఫలాదులను తినవలెననియు కొందఱు వ్రాసిరి. వైద్యశాస్త్రమునుబట్టి ఊరుఁగాయలు, పచ్చళ్లు, పోపులు, మసాలాలు మొదలగునవి పరిత్యాజ్యము లనిరి. శాకాహారము అందఱకు అందుబాటులోనిదనియు, వెల తక్కువ యగుననియు వారు నిర్ణయించిరి. ఈ నాలుగు విషయములు.<noinclude><references/>
{{c|85}}</noinclude>
lfylikm1m49by9zphajod60cquaf01l
పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/29
104
218071
569492
2026-08-09T14:05:17Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అడల్ట్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (SPACE) 1-8-4/డి, రవీంద్రనగర్ కాలనీ, 8వ వీధి, హబ్సిగుడా, హైదరాబాదు - 500007, తెలంగాణ రాష్ట్రం. ఫోన్లు : 040-27159911, 27159996 ఆంధ్రమహిళాసభ ప్రోత...'
569492
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అడల్ట్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్
(SPACE)
1-8-4/డి, రవీంద్రనగర్ కాలనీ, 8వ వీధి, హబ్సిగుడా, హైదరాబాదు - 500007, తెలంగాణ రాష్ట్రం.
ఫోన్లు : 040-27159911, 27159996
ఆంధ్రమహిళాసభ ప్రోత్సాహంతో స్థాపింపబడిన స్వతంత్ర ప్రతిపత్తి గల రిజిష్టర్డు సొసైటీ - సొసైటీ
ఫర్ ప్రమోషన్ ఆఫ్ అడల్ట్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (స్పేస్) హైదరాబాదులోని రాష్ట్ర వయోజన
విద్యావనరుల కేంద్ర నిర్వహణను భారత ప్రభుత్వం 'స్పేస్'కు అప్పగించింది. ఈ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో హైదరాబాదులోని రాష్ట్ర వయోజన విద్యావనరుల కేంద్రాన్ని 'స్పేస్' నిర్వహిస్తున్నది.
'స్పేస్' లక్ష్యాలు అక్షరాస్యతను, నిరంతరవిద్యను పెంపొందించే క్షేత్రస్థాయి కార్యక్రమాలెన్నో కలిగివున్నాయి.
* అక్షరాస్యత, నిరంతర విద్యకు సంబంధించిన విద్యావనరుల అభివృద్ధి, క్షేత్ర కార్యక్రమాల నిర్వహణ వ్యవస్థల శిక్షణ మొదలైనవి 'స్పేస్' సంస్థ ప్రధాన లక్ష్యాలు.
* అక్షరాస్యత, నిరంతర విద్యల ఆవశ్యకత ప్రచారం.
* నాణ్యవంతమైన, సమర్థవంతమైన అక్షరాస్యత, నిరంతర విద్యాకార్యక్రమాల అమలుకు దోహదం
చేయడం.
* కార్యకర్తలకు శిక్షణను ఇవ్వడం.
* మారుతున్న సామాజిక అవసరాలకు తగ్గవిధంగా అక్షరాస్యత, నిరంతర విద్యా ఏజెన్సీలు, గ్రూపులతో సమన్వయం, సహకారం.
* అక్షరాస్యతారంగంలో ఒక సమన్వయ కేంద్రం (నోడల్ ఏజెన్సీ) గా పనిచేయడం.
* అక్షరాస్యత, నిరంతర విద్యారంగంలో ఒక సలహాకేంద్రంగా వ్యవహరించడం.
* అక్షరాస్యత, నిరంతర విద్యల రంగంలో 'పరిశోధన-అభివృద్ధి' విషయాల్లో క్రియాశీలపాత్రను
నిర్వహించడం.
డా॥ సామల రమేష్ బాబు
అధ్యక్షులు
| తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015
ఆచార్య పి. పూర్ణచంద్రరావు
కార్యదర్శి
29<noinclude><references/></noinclude>
n13nyaqvm9vjafht5pr2opnvuqycd2d
పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/30
104
218072
569495
2026-08-09T14:11:13Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'స్టేట్ రిసోర్స్ సెంటర్ ఫర్ అడల్ట్ & కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (SRC) ఫోన్లు : 040-27097129, 27090029 సాక్షర భారత్ ఆహ్వానం * భారత ప్రభుత్వం 2009 సెప్టెంబరు 8వ తేదీన అంతర్జాతీయ అక్షరాస్యతాదినం సంద...'
569495
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>స్టేట్ రిసోర్స్ సెంటర్ ఫర్ అడల్ట్ & కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్
(SRC)
ఫోన్లు : 040-27097129, 27090029
సాక్షర భారత్ ఆహ్వానం
* భారత ప్రభుత్వం 2009 సెప్టెంబరు 8వ తేదీన అంతర్జాతీయ అక్షరాస్యతాదినం సందర్భంగా “సాక్షర భారత్" పథకాన్ని ఆవిష్కరించింది.
* 2012 నాటికి 15 సంవత్సరములకు పైబడిన మహిళలలో అక్షరాస్యతను పెంచి, అక్షరాస్యతలో స్త్రీ పురుష భేదాలను (కనీసం 10%) ప్రాంతీయ, వర్గాల భేదాలను తగ్గించడం ఈ సాక్షర భారత్ మిషన్ 2012 ప్రధాన ఉద్దేశ్యం.
లక్ష్యాలు :
* 2010 నాటికి ఆరుకోట్లమంది స్త్రీలకు, ఒకకోటిమంది పురుషులకు ప్రయోజన అక్షరాస్యత అందించడం సాక్షర భారత్ ప్రధాన లక్ష్యం. వీరిలో ఎస్.సి., ఎస్.టి. కులాలకు, ముస్లిం మైనారిటీలకు, ఇతరులకు ప్రత్యేకంగా నిర్దేశితమైన కేటాయింపుల ద్వారా లక్ష్యసాధన జరుగుతుంది.
* అక్షరాస్యతానంతరం చదువును కొనసాగించి పాఠశాల స్థాయితో సమానమైన స్థాయి గల ప్రాథమిక విద్యను నేర్చుకోవాలనుకునే ఒక కోటీ యాభైలక్షల మందివయోజనులకు విద్యావకాశాలను కల్పించడం మరొక లక్ష్యం.
* వృత్తి విద్యానైపుణ్యాలను సంపాదించి తద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలనుకునే ఒక కోటీ యాభైలక్షలమంది వయోజనులకు వృత్తి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం మరొక లక్ష్యం.
మహిళలకు ప్రాధాన్యత :
* "సాక్షర భారత్ మిషన్ 2012” కార్యక్రమంలో మహిళలే ప్రధాన లబ్దిదారులు. ఈ కార్యక్రమం మొత్తం మహిళా ప్రాధాన్యతాయుతంగా రూపొందించబడింది. మహిళల అక్షరాస్యతా శాతం 50 కన్నా దిగువన గల 365 జిల్లాలలో ఈ కార్యక్రమం ప్రధానంగా నిర్వహింపబడుతుంది. మనరాష్ట్రంలో ఈ కార్యక్రమం 18 జిల్లాలలో అమలు చేయబడుతుంది.
పంచాయితీరాజ్ సంస్థల ద్వారా, స్వచ్ఛంద కార్యకర్తలచే అమలు :
* పంచాయితీరాజ్ వ్యవస్థకు చెందిన సంస్థల ద్వారా ముఖ్యంగా గ్రామ పంచాయితీ ద్వారా అమలుచేయడం సాక్షర భారత్ ప్రత్యేకత. సమాజంలోని అన్ని వర్గాలను, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలను, స్వయం సహాయక సంఘాలను ఈ ప్రజా ఉద్యమంలో భాగస్వాములుగా చేసి కార్యక్రమం అమలు జరుపుతారు. సాక్షర భారత్ కార్యక్రమం స్వచ్ఛంద కార్యకర్తల ద్వారా నడుపబడుతుంది. సేవాభావం, పట్టుదల గల స్వచ్ఛంద కార్యకర్తలే సాక్షర భారత్ కార్యక్రమాన్ని నడిపే రథసారథులు.
సాక్షర భారత్ లక్ష్యాలు సాకారమై మనదేశం "సాక్షర భారతం" కావాలంటే మనందరం స్వచ్ఛందంగా ముందుకు రావాలి. మనవంతు సహకారం అందించాలి. అక్షరాస్యతకు కృషిచేస్తే అక్షరం నిలుస్తుంది. మన భాష, మన సంస్కృతి నిలుస్తుంది. మన జాతి గౌరవం పెరుగుతుంది. అందరూ బాగుంటారు.
వాడవాడలా పల్లెపల్లెలా విద్యావంతులు రారండీ !
సాక్షర భారత నిర్మాణానికి నడుంకట్టి అడుగేయండీ !
ఆచార్య డా॥ రమేష్ ఘంటా
ఛైర్మన్
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015
డా॥ పి.వి. సుబ్బారెడ్డి
30<noinclude><references/></noinclude>
rwnnp3mi74trn7h4f0liisyfsi1pcyk
పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/35
104
218073
569496
2026-08-09T14:17:42Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వారసత్వ సంపద - సంకేపల్లి నాగేంద్రశర్మ కరీంనగర్ జిల్లాలో చారిత్రక గుట్టల విధ్వంసం తెలంగాణా ఆవిర్భావం తర్వాత పెరిగిన గ్రానైట్ మాఫియా ఆగడాలు తొలి శాతవాహనరాజులకు రాజధానియ...'
569496
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>వారసత్వ సంపద
- సంకేపల్లి నాగేంద్రశర్మ
కరీంనగర్ జిల్లాలో చారిత్రక గుట్టల విధ్వంసం
తెలంగాణా ఆవిర్భావం తర్వాత పెరిగిన గ్రానైట్ మాఫియా ఆగడాలు
తొలి శాతవాహనరాజులకు రాజధానియైన కోటిలింగాల భూగర్భనగరం, వేములవాడ చాళుక్యుల రాజధానియైన వేములవాడ, కాకతీయ రాజుల వైభవం, చారిత్రాత్మకమైన బొమ్మలమ్మగుట్ట, నిజాం
రాజుల కాలంలో జిల్లా కేంద్రంగా వెలుగు వెలిగిన ఎలగందుల ఖిల్లా, అడవుల్లో నెలకొన్న పౌరాణేతిహాస రామగిరి ఖిల్లాలు, వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం, కొండగట్టు వంటి దివ్యక్షేత్రాలు, విస్తారమైన గోదావరి పరీవాహక ప్రాంతం కలిగిన కరీంనగర్ జిల్లా రూపురేఖలు
మారిపోతున్నాయి. ఈ జిల్లాలోని ప్రకృతి రమణీయమైన కొండలు, గుట్టలు గత పది పన్నెండేళ్ల
కింద నుండి జాడాపత్తా లేకుండా పోతున్నాయి. తెలంగాణా నూతన రాష్ట్రా విర్భావం జరిగాక కూడా, అదుపు లోకి రావాల్సిన గ్రానైట్ మాఫియా ఆగడాలు, భిన్నంగా మరింతగా పెరిగిపోయి పలు చారిత్రాత్మకమైన గుట్టల విధ్వంసం కొనసాగుతూనే వుంది. పర్యావరణ పరిరక్షణకు, ప్రస్తుతం వున్న నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాల్సిన అధికార యత్రాంగం అన్ని చట్టాలను, నిబంధనలకు పక్కన బెట్టి గ్రానైట్ మాఫియా ఆగడాలకు వంతపాడుతున్నది. మే 2013లో 17 గుట్టల విధ్వంసానికి అనుమతులిచ్చిన జిల్లా కలెక్టర్ మరిన్ని గుట్టలను గ్రానైట్ అనుమతులివ్వడానికి రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ప్రస్తుతం ఒక్క కరీంనగర్ జిల్లాలోనే సుమారు ఆరువందల గుట్టలు గ్రానైట్ మాఫియా చేతుల్లో విధ్వంసానికి గురవుతున్నాయని, కరీంనగర్ జిల్లాలోని రైల్వేస్టేషన్లన్నీ ఈ గ్రానైట్ రాళ్ళను మద్రాస్, కాకినాడ, కృష్ణపట్నం వంటి సముద్ర నౌకాశ్రయాల కేంద్రాలకు తరలిస్తూ అధిక ఆదాయాన్ని
పొందుతున్నాయని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలో జడ్పిటీసీలు గుట్టల విధ్యంసం గూర్చి విస్తృతమైన చర్చ లేవదీసినా ఫలితం మాత్రం శూన్యం. ఇంతేకాక ప్రతినిత్యం
వందలాది గ్రానైట్ రాళ్ళ ట్రక్కులు యధేచ్చగా తిరుగుతూ, గ్రానైట్
రాళ్లను సముద్ర నౌకా తీరాలకు చేర్చుతున్నాయి. జిల్లాలోని రోడ్లు,
వంతెనలన్నీ గ్రానైట్ ట్రక్కుల రవాణావల్ల శిధిలమైపోతున్నాయి. చైనా,
| తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015
మలేషియా, హాంకాంగ్, థాయ్లాండ్, జపాన్ వంటి సుదూర దేశాలకు
ఈప్రాంతంలోని రాళ్ళు ఎగుమతి అవుతున్నాయి. రంగుగ్రానైట్ రాళ్ళకు,
నల్లరాళ్ళకు విదేశాలలో విపరీతమైన మార్కెటింగ్ పెరిగిపోవడంతో
తెలంగాణా ప్రాంతంలోని గుట్టలన్నీ కరిగి పోతున్నాయి. అందులో
చారిత్రాత్మకమైన గుట్టలు దెబ్బతింటున్నాయి. రాబోయే కాలంలో
తెలంగాణాలో రోడ్లు వేయడానికి, ఇళ్ళు కట్టుకోవడానికి, రైల్వే లైన్లు
వేయడానికి కంకర, బండరాళ్ళు దొరికే అవకాశం మృగ్యమైపోతున్నది.
నూతనంగా వచ్చిన తెలంగాణా ప్రభుత్వ సారధి కెసిఆర్ గారు, చెరువులు
మరమ్మత్తులు, చెరువుల
పరిరక్షణ పేరిట కాకతీయ
మిషన్, ప్రతి గ్రామానికి
మంచినీరు అందించే వాటర్
గ్రిడ్ పథకాలను సుమారు
యాభై వేల కోట్ల
రూపాయలతో ప్రారం
భించారు. ఇందుకు పెద్ద
ఎత్తున సన్నాహాలు జరుగు
తున్నాయి. కాకతీయులు
చెరువులను గుట్టల జాలు
ఆధారంగా కట్టిన విషయాన్ని
పొట్లపల్లిలోని ఎల్లమ్మ గుట్టు ఎవ్వరు కాదన లేరు.
తెలంగాణా ప్రాంతం లోని
గుట్టల జాలుతోనే చెరువులు నిండుతాయన్నది కాదనలేని సత్యం.
వరంగల్ జిల్లాలోని లక్కవరం, భద్రకాళి,
పాకాల, ధర్మసాగరం,
రామప్ప చెరువులు గుట్టల మధ్యే నిర్మించబడ్డాయి. తెలంగాణా
ప్రాంతంలోని గుట్టలన్నీ ఎడాపెడా మట్టుబెట్టుకుంటూ పోతే, ఈప్రాంతం
త్వరలోనే భూకంపాల జోనులోకి చేరిపోగలదని నిపుణులు ఆందోళన
చెందుతున్నారు. ఈ వ్యాసం రాస్తున్న సమయంలోనే తెలంగాణా
ప్రభుత్వం మైనింగ్ అనుమతుల విధానాన్ని మరింత సులభతరం చేస్తూ
తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఆయా మండలాల తాసిల్దార్లు,
ఆర్డివో, కలెక్టర్లు నిరభ్యంతర సర్టిఫికేట్లు ఇవ్వవచ్చు, తద్వారా గుట్టల
విధ్వంసానికి ఈ జీవో ఊతమిస్తుందని పర్యావరణ వేత్తలు విమర్శిస్తు
న్నారు. హుస్నాబాద్, హుజూరాబాద్ ప్రాంతంలోని గుట్టల హారాలను
దోచుకోవడానికి గ్రానైట్ మాఫియా కన్నుపడటంతో పర్యావరణ వేత్తలు
తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. నెలరోజుల కిందట
శంకరపట్నం మండలంలో గుట్టల వద్ద జరిగిన పేలుళ్ళలో ముగ్గురు
35<noinclude><references/></noinclude>
165mj41xtg8p3oo7k8g9ckx7vdzil19
569497
569496
2026-08-09T14:28:58Z
Rajasekhar1961
50
569497
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>వారసత్వ సంపద
- సంకేపల్లి నాగేంద్రశర్మ
కరీంనగర్ జిల్లాలో చారిత్రక గుట్టల విధ్వంసం
తెలంగాణా ఆవిర్భావం తర్వాత పెరిగిన గ్రానైట్ మాఫియా ఆగడాలు
తొలి శాతవాహనరాజులకు రాజధానియైన కోటిలింగాల భూగర్భనగరం, వేములవాడ చాళుక్యుల రాజధానియైన వేములవాడ, కాకతీయ రాజుల వైభవం, చారిత్రాత్మకమైన బొమ్మలమ్మగుట్ట, నిజాం
రాజుల కాలంలో జిల్లా కేంద్రంగా వెలుగు వెలిగిన ఎలగందుల ఖిల్లా, అడవుల్లో నెలకొన్న పౌరాణేతిహాస రామగిరి ఖిల్లాలు, వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం, కొండగట్టు వంటి దివ్యక్షేత్రాలు, విస్తారమైన గోదావరి పరీవాహక ప్రాంతం కలిగిన కరీంనగర్ జిల్లా రూపురేఖలు
మారిపోతున్నాయి. ఈ జిల్లాలోని ప్రకృతి రమణీయమైన కొండలు, గుట్టలు గత పది పన్నెండేళ్ల
కింద నుండి జాడాపత్తా లేకుండా పోతున్నాయి. తెలంగాణా నూతన రాష్ట్రా విర్భావం జరిగాక కూడా, అదుపు లోకి రావాల్సిన గ్రానైట్ మాఫియా ఆగడాలు, భిన్నంగా మరింతగా పెరిగిపోయి పలు చారిత్రాత్మకమైన గుట్టల విధ్వంసం కొనసాగుతూనే వుంది. పర్యావరణ పరిరక్షణకు, ప్రస్తుతం వున్న నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాల్సిన అధికార యత్రాంగం అన్ని చట్టాలను, నిబంధనలకు పక్కన బెట్టి గ్రానైట్ మాఫియా ఆగడాలకు వంతపాడుతున్నది. మే 2013లో 17 గుట్టల విధ్వంసానికి అనుమతులిచ్చిన జిల్లా కలెక్టర్ మరిన్ని గుట్టలను గ్రానైట్ అనుమతులివ్వడానికి రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ప్రస్తుతం ఒక్క కరీంనగర్ జిల్లాలోనే సుమారు ఆరువందల గుట్టలు గ్రానైట్ మాఫియా చేతుల్లో విధ్వంసానికి గురవుతున్నాయని, కరీంనగర్ జిల్లాలోని రైల్వేస్టేషన్లన్నీ ఈ గ్రానైట్ రాళ్ళను మద్రాస్, కాకినాడ, కృష్ణపట్నం వంటి సముద్ర నౌకాశ్రయాల కేంద్రాలకు తరలిస్తూ అధిక ఆదాయాన్ని
పొందుతున్నాయని పర్యావరణవేత్తలు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలో జడ్పిటీసీలు గుట్టల విధ్యంసం గూర్చి విస్తృతమైన చర్చ లేవదీసినా ఫలితం మాత్రం శూన్యం. ఇంతేకాక ప్రతినిత్యం వందలాది గ్రానైట్ రాళ్ళ ట్రక్కులు యధేచ్చగా తిరుగుతూ, గ్రానైట్ రాళ్లను సముద్ర నౌకా తీరాలకు చేర్చుతున్నాయి. జిల్లాలోని రోడ్లు, వంతెనలన్నీ గ్రానైట్ ట్రక్కుల రవాణావల్ల శిధిలమైపోతున్నాయి. చైనా, మలేషియా, హాంకాంగ్, థాయ్లాండ్, జపాన్ వంటి సుదూర దేశాలకు
ఈప్రాంతంలోని రాళ్ళు ఎగుమతి అవుతున్నాయి. రంగుగ్రానైట్ రాళ్ళకు, నల్లరాళ్ళకు విదేశాలలో విపరీతమైన మార్కెటింగ్ పెరిగిపోవడంతో తెలంగాణా ప్రాంతంలోని గుట్టలన్నీ కరిగి పోతున్నాయి. అందులో చారిత్రాత్మకమైన గుట్టలు దెబ్బతింటున్నాయి. రాబోయే కాలంలో తెలంగాణాలో రోడ్లు వేయడానికి, ఇళ్ళు కట్టుకోవడానికి, రైల్వే లైన్లు వేయడానికి కంకర, బండరాళ్ళు దొరికే అవకాశం మృగ్యమైపోతున్నది. నూతనంగా వచ్చిన తెలంగాణా ప్రభుత్వ సారధి కెసిఆర్ గారు, చెరువులు
మరమ్మత్తులు, చెరువుల పరిరక్షణ పేరిట కాకతీయ మిషన్, ప్రతి గ్రామానికి మంచినీరు అందించే వాటర్ గ్రిడ్ పథకాలను సుమారు యాభై వేల కోట్ల రూపాయలతో ప్రారంభించారు. ఇందుకు పెద్ద
ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. కాకతీయులు చెరువులను గుట్టల జాలు ఆధారంగా కట్టిన విషయాన్ని పొట్లపల్లిలోని ఎల్లమ్మ గుట్టు ఎవ్వరు కాదన లేరు. తెలంగాణా ప్రాంతం లోని
గుట్టల జాలుతోనే చెరువులు నిండుతాయన్నది కాదనలేని సత్యం. వరంగల్ జిల్లాలోని లక్కవరం, భద్రకాళి, పాకాల, ధర్మసాగరం, రామప్ప చెరువులు గుట్టల మధ్యే నిర్మించబడ్డాయి. తెలంగాణా
ప్రాంతంలోని గుట్టలన్నీ ఎడాపెడా మట్టుబెట్టుకుంటూ పోతే, ఈప్రాంతం త్వరలోనే భూకంపాల జోనులోకి చేరిపోగలదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యాసం రాస్తున్న సమయంలోనే తెలంగాణా ప్రభుత్వం మైనింగ్ అనుమతుల విధానాన్ని మరింత సులభతరం చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఆయా మండలాల తాసిల్దార్లు, ఆర్డివో, కలెక్టర్లు నిరభ్యంతర సర్టిఫికేట్లు ఇవ్వవచ్చు, తద్వారా గుట్టల విధ్వంసానికి ఈ జీవో ఊతమిస్తుందని పర్యావరణ వేత్తలు విమర్శిస్తున్నారు. హుస్నాబాద్, హుజూరాబాద్ ప్రాంతంలోని గుట్టల హారాలను దోచుకోవడానికి గ్రానైట్ మాఫియా కన్నుపడటంతో పర్యావరణ వేత్తలు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. నెలరోజుల కిందట శంకరపట్నం మండలంలో గుట్టల వద్ద జరిగిన పేలుళ్ళలో ముగ్గురు<noinclude><references/>
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015 35</noinclude>
p48cs8c62ihfvix80fzc71yjgbbba6m
పుట:Ammanudi March 2015 - Samala Rameshbabu.pdf/36
104
218074
569499
2026-08-09T14:37:22Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'క్వారీ కార్మికులు నేలకొరిగిన సంఘటన జిల్లాలో గ్రానైట్ మాఫియా ఆగడాలను వెలికి తెచ్చినట్లయింది. జిల్లాలోని ములంగూర్ జిల్లా, హుజూరాబాద్ ప్రాంతంలోని రాకాసిగుండ్లు, ఎలగందుల ఖ...'
569499
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>క్వారీ కార్మికులు నేలకొరిగిన సంఘటన జిల్లాలో గ్రానైట్ మాఫియా ఆగడాలను వెలికి తెచ్చినట్లయింది. జిల్లాలోని ములంగూర్ జిల్లా, హుజూరాబాద్ ప్రాంతంలోని రాకాసిగుండ్లు, ఎలగందుల ఖిల్లా గ్రానైట్
మాఫియా చేతిలో విధ్వంస రచనలో భాగమయ్యాయి. ఎలగందుల ఖిల్లా చుట్టువున్న ఇరవై గుట్టలను గ్రానైట్ కు ఇచ్చిన విషయం తెలిసిందే. సైదాపూర్ మండలంలోని సర్వాయి పాపన్న గుట్టలను, హుస్నాబాద్ ప్రాంతంలోని పొట్లపల్లి ఎల్లమ్మగుట్టలను విధ్వంసం చేయడానికి గ్రానైట్ మాఫియా పెద్ద ఎత్తున ప్రయాత్నాలు సాగిస్తోంది. ఇక్కడి గుట్టలను గ్రానైట్ పరం చేయడానికి ఆర్డివోలు, ఇతర రెవిన్యూ, మైనింగ్ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కోసం పర్యటించి వెళ్లారు. అంతేకాక
పొట్లపల్లిలోని ఎల్లమ్మగుట్టలను గ్రానైట్ పర్మిషన్పై మైనింగ్ శాఖకు 20కి పైగా అర్జీలు వచ్చినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఎనిమిది వందల ఎకరాలలో విస్తరించివున్న ఎల్లమ్మగుట్టల విధ్వంసానికి బడాబాబులు తీవ్రంగా తెలంగాణా సర్కార్ పై వత్తిడి తెస్తున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఇక్కడ సుమారు రెండువేల సంవత్సరాల పూర్వంకు చెందిన చరిత్ర దాగి వుందని, ఇక్కడ ఆదిమానవుల బృహత్ శిలా సమాధులు, ఎల్లమ్మగుట్ట వద్ద బయల్పడిన ఎల్లమ్మ, నాగ విగ్రహాలు వున్నాయని, మరో నాగపట్నమని, ఎల్లమ్మగుట్టపైన అపూర్వ సారంగం వుందని, ఎందరెందరో విదేశీ చరిత్రకారులు సైతం ఎల్లమ్మగుట్టపైన పరిశోధనలు చేశారని ఈ గుట్ట ప్రాంతాన్ని జనవరి 13న సందర్శించిన
పరిశోధకులు జయధీర్ తిరుమలరావు, సూరేపల్లి సుజాత, పర్యావరణవేత్తలు తోటపల్లి జగన్మోహనరావు, మాదన కుమారస్వామి, మార్వాడి సుదర్శన్ తదితరులు అభిప్రాయపడ్డారు. తెలంగాణా బహుజన పోరాటయోధుడు సర్వాయి పాపన్న 16-17 శతాబ్దాలలో స్థావరంగా
ఏర్పరచుకొని, గుట్టపై ఖిల్లాను నిర్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గుట్టలను కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుందని వీరన్నారు. తెలంగాణా ఉద్యమ తొలి పోరాట యోధుడు అనభేరి ప్రభాకరరావు
నిజాం సర్కార్ కాలంలో జరిగిన తొలి ఎన్కౌంటర్లో ఈగుట్టల్లోనే అమరుడయ్యారు. మాజీ ప్రధాని పి.వి. జన్మస్థలమైన భీమదేవరపల్లి ప్రాంతంలోని వంగర ఈ గుట్టల సమీపంలోనే వుంది. ఇంతటి
చారిత్రాత్మక ప్రాధాన్యం వున్న పొట్లపల్లి ఎల్లమ్మ, సర్వాయి పాపన్న గుట్టలను పరిరక్షించాలని, గ్రానైట్ మాఫియా ప్రమాదం నుండి కాపాడాలని చరిత్రకారులు కోరుతున్నారు. పాపన్న గుట్టపై గీతకార్మిక
సంఘాల నాయకులు నెలకొల్పిన పాపన్న విగ్రహాన్ని ఎవ్వరో పేల్చివేయడం పలు అనుమానాలకు దారితీస్తోంది. అంతేకాక గంగాధర మండలంలోని త్రిభాషాశాసనమైన బొమ్మలమ్మగుట్టపైన జైన చక్రేశ్వరి పాదాలను రెండు సార్లు దుండగులు పేల్చి వేశారు. గత నాలుగేళ్ల కిందట ఈ గుట్టను గ్రానైట్ వరం చేయడానికి సర్కార్ అనుమతులివ్వగా చరిత్రకారులు, రచయితలు ఉద్యమించి అడ్డుకున్నారు. అంతేకాక కరీంనగర్ మండలంలోని ఎలగందుల ఖిల్లా గుట్టలను గ్రానైట్ పరం చేయడానికి గుట్టల రాళ్లను సులభంగా రవాణా చేసుకోవడానికి 32కోట్లతో కరీంనగర్ పద్మనగర్ నుండి నాలుగులైన్ల రహదారిని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈరహదారి నిర్మాణమైతే సిరిసిల్ల డివిజన్లో గుట్టనీటికి విధ్వంసంచేసి గురై, సులభంగా రవాణా చేసుకోవడానికి వీలవుతుంది. జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాలలోని గుట్టలన్నీ విధ్వంస రచనలో భాగమవుతున్నాయి. జలపాతం, కవ్వాల్ అభయారణ్యంకు గురికాకుండా ఈ అడవి తెలంగాణా రాష్ట్రం రాకముందు రామప్ప దేవాలయాలు, కుంతల పరిరక్షణకు ఉద్యమించిన తెలంగాణా చరిత్రకారులు, తెలంగాణా నేతలు మళ్లీ తెలంగాణా సహజ వనరుల పరిరక్షణకై తిరిగి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. కరీంనగర్ జిల్లాలోని మానేరు వంతెన, తంగిళ్లపల్లి, రేణిగుంట వంటి పొడవైన వంతెనలు గ్రానైట్ విపరీతమైన
రవాణావల్ల స్తంభాలు కుంగి, ధ్వంసమైపోగా, వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నారు. కోట్ల చెట్ల పెంపకానికి అటవీశాఖామంత్రి జోగురామన్న చర్యలు తీసుకుంటున్నట్లు, అటవీ ఉత్పత్తుల పరిరక్షణకు సాయుధదళాలను పెడతామని అంటున్న కెసిఆర్ సర్కారు, మరోపక్కన వేలాది చెట్లు, జీవజాలాలున్న గుట్టలను మట్టుపెట్టే గ్రానైట్ మాఫియా చర్యల గూర్చి పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. పర్యావరణవేత్తలపై కేసులు పెట్టి రకరకాల ఇబ్బందులకు గురిచేస్తున్న గ్రానైట్ మాఫియా చేతుల్లోనే సర్కారు నడుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్క నల్గొండ జిల్లాలోని రాచకొండ గుట్టలను ఫిల్మ్ సిటీ పేరిట, యాదగిరి గుట్ట ప్రాంతంలోని గుట్టలను దివ్యక్షేత్రం పేరిట మట్టుబెట్టే
సన్నాహాలు ఊపందుకున్నాయి. దీని వెనుక రియల్ ఎస్టేట్ల మాయాజాలం వున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరో పది పన్నెండేళ్లయితే తెలంగాణా ప్రాంతంలోని గుట్టలన్నీ మాయం కావడం
ఖాయం.
రచయిత ఫోన్ : 09441797650<noinclude><references/>
తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి 2015
36</noinclude>
ei7hkd9e3prqok3zmktqx9poki83tqc
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/104
104
218075
569536
2026-08-09T21:32:24Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569536
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>నా అనుభవమునకు వచ్చెను. శాకాహారభోజనశాలలలో ఈ నియమములు పాటించువారిని పలువుర కలిసికొంటిని. ఆంగ్ల దేశమున శాకాహారప్రచారకసంఘముకూడ ఉన్నది. వా రొక వారపత్రిక ప్రకటింతురు. నే నాసంఘమున చేరితిని. నే నాపత్రికకు చందాదారుఁడను. కొలఁదినాళ్లలో నేను కార్యనిర్వాహక సంఘసభ్యుఁడఁగా ఎన్నుకొనఁబడితిని. అందు శాకాహారమును బహునిష్ఠతో పరిపాలించువారు నాకు పరిచితులైరి. నేనును భక్ష్యపదార్థశోధన మొదలుచేసితిని.
ఇంటినుండి వచ్చిన చిఱుతిండివస్తువులు, ఊరుఁగాయలు మొదలగు వానిని మానితిని. మనస్సు మాఱుటచే వానిపై విరక్తి కలిగి, వెనుక రిచ్మండులో ఉన్న పుడు నా జిహ్వకు చప్పగా కానిపించిన మసాలాలేని స్పినక్ (బచ్చలి) ఇపుడు రుచిగా ఉండెను. ఇట్టి శోధనలవలన రుచికి ముఖ్యస్థానము మనస్సుకాని నాలుక కాదని తెలిసెను.
ఆర్థికదృష్టి సర్వదా నా దృష్టిలో నుండెను. ఆరోజులలో కొందఱు కాఫీలు, టీలు హానికరములని నిరసించి కోకోను స్వీకరించు చుండువారు. తినుట శరీర వ్యాపారమునకే అని నిశ్చయించి, టీ కాఫీలు వదలి కోకో పుచ్చుకొనుచుంటిని.
శాకాహారభోజనశాలలో రెండు విభాగము లుండును. ఒకదానియందు కావలసినపదార్దములు తిని తిన్నవానికి
మూల్య మీవలెను. అందు పూఁటకు ఒకటి రెండు పిల్లింగులుగూడ పట్టును. దానికి ధనికులు పోవుచుందురు. రెండవ విభాగమున 6 పెన్నీలకు ఒక రొట్టె ముక్కయు, మఱి మూఁడు పదార్థములను పెట్టుదురు. నేను మిత వ్యయదీక్షఁ బూనిన పిదప వాడుకగా ఆఱణాల (పెన్నీల) నిచ్చియే భుజింప మొదలిడితిని.<noinclude><references/>
{{c|86}}</noinclude>
1asndpyg80gyfb0zcgvhek92yk5hpdh
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/105
104
218076
569537
2026-08-09T21:46:28Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569537
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>17 భక్ష్యపరిశీలనము</big>}}</noinclude>ఈ పరిశీలనముతో ఉపపరిశీలనములుకూడఁ గొన్నికలవు. కొంతకాలము గంజి (starch) గల పదార్థములు వీడితిని. కొంతకాలము రొట్టె, పండ్లుమాత్రము తినియుంటిని. కొంతకాలము జున్ను, పాలు, గ్రుడ్లు, ఈచివరపరిశోధనము గమనింపఁదగినది. ఇది పదియేనునాళ్లకన్న ఎక్కువకాలము సాగలేదు. గంజిలేని పదార్థములు తినవలెనని బోధించిన సంస్కర్త గ్రుడ్లుతినుట మంచిదనియు, అది మాంసాహారము కాదనియు సమర్ధించెను. గ్రుడ్లు తినుచో జీవజ్జంతువులకు హానిచేయుపని లేదుగదా అని సామాన్యముగా తోఁచెను. అందువలన కక్కుఱితి పడితిని. ఈ ప్రమాద మెంతో కాలము ఉండలేదు. నా ప్రమాణమునకు
క్రొత్తవ్యాఖ్యానము చెప్పుట నా పని కాదు. ప్రమాణము చేయించిన మా అమ్మగారి ఉద్దేశము నాకు తెలియదా? గ్రుడ్లుకూడ మాంసమనియే ఆమె యుద్దేశము. ఈ ప్రమాణముయొక్క సత్యమగుఉద్దేశము స్ఫురింపఁగనే గ్రుడ్లను, గ్రుడ్లతోపాటు పరిశోధనమును మానితిని.
ఈ విషయము గమనింపఁదగినది. ఇంగ్లండులో మాంసమును గుఱించి మూఁడు లక్షణములు చూచితిని. మొదటి లక్షణమున పశుపక్షుల మాంసమే మాంసము. ఈ లక్షణానుయాయులగు శాకాహారులు
పశుపక్షిమాంసము పరిత్యజించి మత్స్యముల స్వీకరించిరి; ఇఁక గ్రుడ్లను స్వీకరించిరని చెప్పనక్కఱలేదు గదా! రెండవలక్షణము సకలజీవజ్జంతువుల మాంసము మాంసము. ఈ లక్షణమున మత్స్యాహారము నిషిద్ధము కాని గ్రుడ్లు తినవచ్చును. ఇఁక మూఁడవది: సకలజీవజ్జంతుమాంసమును, వానివలన ప్రభవించు పదార్థమును - అనఁగా, గ్రుడ్లు, పాలు మొదలైనవి, అంతయు మాంసకోటిలో పరిగణిత మగును. నేను మొదటిలక్షణ
మంగీకరింతునేని గ్రుడ్లేకాక చేఁపలఁ గూడ గొనవలసియుందును. నా ప్రమాణమునుబట్టి గ్రుడ్లు పనికిరావు. కాన నేను వాని వీడితిని. శా<noinclude><references/>
{{c|87}}</noinclude>
5uhk7tw9sgqmdr7m3i0jylt99nsllc1
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/106
104
218077
569538
2026-08-09T21:57:25Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569538
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>ఖాహారభోజనాగారములలో చాల పదార్థములలో గ్రుడ్లు కలియునని తేలినది. కావున నే నచట ప్రతిపదార్థమును గ్రుడ్లు కలిసెనా, లేదా అని అడుగవలసివచ్చినది. దీనివలన నా కొకవిధముగా చిక్కు తొలఁగినది: ఏలయన, నా ఆహారమును సాదావస్తువులకు నియమించుకొనఁ గల్గితిని. నాకు రుచించు చాల పదార్థములు పరిహరింపవలసిన చిక్కు కూడ పొసఁగెను. కాని నా ప్రమాణమును సరిగా అనుష్ఠించుచుండుట
వలన ఈ చిక్కులు క్రమక్రమముగా తొలఁగి విస్పష్టముగా ఆరోగ్యకరమును, సూక్ష్మమును, స్థాయియు నగు చవియెడ అధికప్రీతి ఏర్పడెను.
ఇంకను సత్యపరీక్ష ముందున్నది. అది రెండవ ప్రమాణము గుఱించి. భగవంతుఁడు కాపాడుచుండఁగా ఎవరు హాని చేయఁగలరు?
ఈ ప్రకరణము ముగించుటకు, రెండవ ప్రమాణమునకు సంబంధించిన విషయములు చెప్పుట ఆవశ్యకము. ప్రమాణములకు తమకు తమకనుకూలముగా క్రొత్తక్రొత్త అర్ధములు తీయుట జగత్తునం దంతటను గలదు. అది కలహకారణము. ప్రమాణము ఎంత విస్పష్టముగా నున్నను మూలమునకు తమకు అనుకూలమగునట్లు అర్థము చెప్పుదురు. మహాధనికులనుండి నిఱు పేదలవఱకును ఇట్టివారు కలరు. స్వార్థపరాయణత్వము వారిని అంధులఁ గావించును. వారు దానికి గోడమీఁది పిల్లి వాటముగా అర్థము చెప్పి, ఆత్మవంచన చేసికొని, లోకమును, దైవమును వంచింపఁ బ్రయత్నింతురు. ప్రమాణము చేసినవాఁడు ప్రమాణము చేయించిన వాని
అర్థమును అనుసరించుటయే ఉత్తమపద్ధతి. ఈరెండుఅర్ధములు చెప్ప వీలుకలిగినచోట దుర్బలుని అర్థము
అంగీకరించుట ఒక పద్ధతి. ఈ రెండు పద్ధతులను త్రోసివేయుచో అన్యాయమునకును, కలహమునకును ఆస్పదమగును. సత్యమునే కోరువాఁడు సులభముగా ఉత్తమపద్ధతి నవలంబిం<noinclude><references/>
{{c|88}}</noinclude>
olzm0ylqwo8d2wfofb3vmro2igtbxll
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/107
104
218078
569540
2026-08-09T22:09:04Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569540
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>17 భక్ష్యపరిశీలనము</big>}}</noinclude>చును. అతనికి క్రొత్త అర్ధములకు విద్యావంతుల సలహాతో పనిలేదు. మాంసమునకు ఉత్తమపద్ధతి ననుసరించి మా అమ్మగారి అర్థమేనాకును అర్ధము గాని ఇఁక నాగొప్పఅనుభవము గాని, పాండిత్యగర్వము గాని చెప్పు అర్ధము ఒక అర్ధము కాదు.
ఇంగ్లండులో ఆర్ధికదృష్టిని, ఆరోగ్యదృష్టిని పురస్కరించుకొని నా పరిశోధనములు జరిగినవి. ధర్మదృష్టి ననుసరించి ఈవిషయము దక్షిణ-ఆఫ్రికాకు వెళ్లకముందు పరిశోధింపఁబడలేదు కాని వెళ్లినపిమ్మట తీవ్రముగా పరిశోధనములు చేసితిని. వానిని ముందు తెల్పెదను. ఎటులేని వీని యన్నిటికిని బీజము ఇంగ్లాండులోనే నాటఁబడెను. మతములో ఉన్నవానికంటె క్రొత్తగా మతములో చేరినవానికే పట్టుదల ఎక్కువ. ఇంగ్లండులో శాకాహారము అనునది సరిక్రొత్త. ఇంచుమించు నాకును అట్టిదే. ఏలనఁగా, నాకు మాంసాహారమే మంచిదని
నమ్మకము. కాని పిదప బుద్ధిచేత శాకాహారములోనికి మాఱితిని. కావున నేను నూతనముగా మతములో కలిసిన వాని అభిమానముతో నాకు నివాసమైన బేసువాటరుపేఁటలో ఒక శాకాహారపు క్లబ్బు పెట్టఁదలఁచితిని. అచట కాఁపురమున్న సర్ ఎడ్విన్ ఆర్నాల్డుగారిని ఉపాధ్యక్షునిఁగాఁ గోరితిని. వెజిటేరియన్ పత్రికాసంపాదకుఁడు
ఓల్ డ్ ఫీల్ డ్ గారు అధ్యక్షులు. నేను కార్యదర్శిని. కొంతకాలము ఆక్లబ్బు బాగనే నడచెను. కాని కొలఁదినెలలలో అంతరించెను. ఏలనఁగా, కాలక్రమమున ఒకచోటి నుండి మఱియొకచోటునకు నేను మాఱుట నియమముగా పెట్టుకొన్నందువలన నే నా ప్రదేశము వీడితిని. కాని వినయముత కూడుకొనిన ఈ కొలఁది అనుభవము కొన్ని సంస్థలు స్థాపించి ప్రచారములోనికి తేఁగలుగు శక్తిని నాకు ప్రసాదించెను.<noinclude><references/>
{{c|89}}</noinclude>
aohee613mk7wbta7jjap32tn78olq9p
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/108
104
218079
569542
2026-08-09T22:21:20Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569542
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}18</p>
{{p|fs125}}బిడియము నా డాలు</p>
{{Largeinitial|శా}}కాహారసంఘసభ్యులు నన్ను కార్యనిర్వాహకసభ్యులలో ఒకనిఁగా ఎన్నుకొనిరి. నేను ప్రతిసభకు వెళ్లుట పెట్టుకొంటిని. కాని ఎల్లపుడును నాకు వాగ్బంధము. డాక్టరు ఓల్ డ్ ఫీల్ డ్ గారు 'నీవు నాతో మాటలాడునపుడు చక్కగామాటలాడుదువుకదా! సభలో ఒక నాఁడేని పెదవి కదుపవేమి? నీవు మగ తేనెటీఁగవు' అని మందలించిరి. ఈ పరిహాసమునకు నే నానందించితిని. తేనెటీఁగలు ఎప్పుడును
పనిచేయు చుండును; మగ తేనెటీఁగమాత్రము పెద్దసోమరిపోతు. అందఱు సభలో తమతమ ఉద్దేశము లుద్ఘాటించుమండఁగా నేను మెదలక కూర్చుండుట కొంత వింత కాకపోదు. నాకు మాటలాడవలయునని
ఆశలేక కాదు, మఱి మాటలాడలేక; అభిప్రాయమును సరిగా మాటలలో పెట్టలేక. సంఘములో అందఱకును విషయగ్రహణము కలదనియు, నాకుమాత్రము లేదనియు నా ఊహ. ఎటులో మాటలాడి తీఱవలెను అని సాహసించువఱకు విషయము మాఱి మఱొకవిషయమునఁ బడుట పొసఁగెడిది. ఇటులు కొంతకాలము జరిగెను.
ఒకతూరి మాసంఘమున ఒక గంభీరవిషయము చర్చకు వచ్చెను. ఆసభకు వెళ్లకుండుట అనుచితమును, అవినయమును. మఱి మాటాడక మూఁగవోటు ఇచ్చుట పిఱికితన మనుకొంటిని. అందలి విషయ మిది:
థేమ్స్ ఐరన్ వర్క్ సు కంపెనీ అధ్యక్షుఁడగు హిల్ సుగారు ఆసభకు అధ్యక్షుఁడు. అతఁడు నీతివాది (Puritan). కేవలము వారి ద్రవ్య<noinclude><references/>
{{c|90}}</noinclude>
e4d6zor3rmrgudkcum1jdm2l75gofkq
పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/4
104
218080
569585
2026-08-10T06:40:16Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{Center| {{p|fs150}}విషయసూచిక</p> }} {{dotted TOC page listing| |{{sc|[[కంకణము/పూర్వ చరిత్రము|1. పూర్వచరిత్రము]]}} |{{DJVU page link|1|10}} }} తొలిపలుకు మేలిపలుకు చందాదారుల పట్టిక ప్రథమాశ్వాసము కృత్యాది కవి వంశావళి విషయ సూచిక...'
569585
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center|
{{p|fs150}}విషయసూచిక</p>
}}
{{dotted TOC page listing|
|{{sc|[[కంకణము/పూర్వ చరిత్రము|1. పూర్వచరిత్రము]]}}
|{{DJVU page link|1|10}}
}}
తొలిపలుకు
మేలిపలుకు
చందాదారుల పట్టిక
ప్రథమాశ్వాసము
కృత్యాది
కవి వంశావళి
విషయ సూచిక
ప్రబంధరచనావిషయము
షష్ఠ్యంతములు
కథాప్రారంభము
వీరభద్ర జననము
శివుఁడు వీరభద్రుని దక్షునికడ కంపుట
ఆశ్వాసాంతము
ద్వితీయాశ్వాసము
త్రికూటాద్రి మహిమ
ఓంకారనదీవృత్తాంతము
శిబికడ కగస్త్యుడు వచ్చుట
శివుఁడు శిబికిఁ బ్రత్యక్ష మగుట
త్రికోటీశ్వరమహిమ
విష్ణుశిఖరము
బ్రహ్మశిఖరము
శివుని నృత్యవర్ణన
అష్టోత్తర శతనామావళి
పాపవినాశన స్థలమహిమ
ఇంద్రుఁడు శివుని స్తుతించుట
ఆశ్వాసాంతము
తృతీయాశ్వాసము
సాలంకయ్య కథ
ఆనందవల్లి కథ
ఆశ్వాసాంతము .
అష్టోత్తర శతనామావళి – ౧
అష్టోత్తర శతనామావళి _ ౨<noinclude><references/></noinclude>
42zvtptibq2qum3puwk4lmrhfr81ejy
569586
569585
2026-08-10T06:43:14Z
Rajasekhar1961
50
569586
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center|
{{p|fs150}}విషయసూచిక</p>
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తొలిపలుకు|తొలిపలుకు]]}}
|{{DJVU page link|1|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/మేలిపలుకు|మేలిపలుకు]]}}
|{{DJVU page link|1|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/చందాదారుల పట్టిక|చందాదారుల పట్టిక]]}}
|{{DJVU page link|1|10}}
}}
ప్రథమాశ్వాసము
కృత్యాది
కవి వంశావళి
విషయ సూచిక
ప్రబంధరచనావిషయము
షష్ఠ్యంతములు
కథాప్రారంభము
వీరభద్ర జననము
శివుఁడు వీరభద్రుని దక్షునికడ కంపుట
ఆశ్వాసాంతము
ద్వితీయాశ్వాసము
త్రికూటాద్రి మహిమ
ఓంకారనదీవృత్తాంతము
శిబికడ కగస్త్యుడు వచ్చుట
శివుఁడు శిబికిఁ బ్రత్యక్ష మగుట
త్రికోటీశ్వరమహిమ
విష్ణుశిఖరము
బ్రహ్మశిఖరము
శివుని నృత్యవర్ణన
అష్టోత్తర శతనామావళి
పాపవినాశన స్థలమహిమ
ఇంద్రుఁడు శివుని స్తుతించుట
ఆశ్వాసాంతము
తృతీయాశ్వాసము
సాలంకయ్య కథ
ఆనందవల్లి కథ
ఆశ్వాసాంతము .
అష్టోత్తర శతనామావళి – ౧
అష్టోత్తర శతనామావళి _ ౨<noinclude><references/></noinclude>
gfinphmhr7y5c0awk8w77o9lk60slzl
569588
569586
2026-08-10T07:22:46Z
Rajasekhar1961
50
569588
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center|
{{p|fs150}}విషయసూచిక</p>
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తొలిపలుకు|తొలిపలుకు]]}}
|{{DJVU page link|1|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/మేలిపలుకు|మేలిపలుకు]]}}
|{{DJVU page link|16|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/చందాదారుల పట్టిక|చందాదారుల పట్టిక]]}}
|{{DJVU page link|18|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|ప్రథమాశ్వాసము]]}}
|{{DJVU page link|18|10}}
}}
కృత్యాది
కవి వంశావళి
ప్రబంధరచనావిషయము
షష్ఠ్యంతములు
కథాప్రారంభము
వీరభద్ర జననము
శివుఁడు వీరభద్రుని దక్షునికడ కంపుట
ఆశ్వాసాంతము
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|ద్వితీయాశ్వాసము]]}}
|{{DJVU page link|18|10}}
}}
త్రికూటాద్రి మహిమ
ఓంకారనదీవృత్తాంతము
శిబికడ కగస్త్యుడు వచ్చుట
శివుఁడు శిబికిఁ బ్రత్యక్ష మగుట
త్రికోటీశ్వరమహిమ
విష్ణుశిఖరము
బ్రహ్మశిఖరము
శివుని నృత్యవర్ణన
అష్టోత్తర శతనామావళి
పాపవినాశన స్థలమహిమ
ఇంద్రుఁడు శివుని స్తుతించుట
ఆశ్వాసాంతము
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|తృతీయాశ్వాసము]]}}
|{{DJVU page link|18|10}}
}}
సాలంకయ్య కథ
ఆనందవల్లి కథ
ఆశ్వాసాంతము
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/అష్టోత్తర శతనామావళి-1|అష్టోత్తర శతనామావళి-1]]}}
|{{DJVU page link|18|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/అష్టోత్తర శతనామావళి-2|అష్టోత్తర శతనామావళి-2]]}}
|{{DJVU page link|18|10}}
}}<noinclude><references/></noinclude>
7gpt4pv6syadhe5fu2ueb4u7dh8y4xo
569600
569588
2026-08-10T10:28:34Z
Rajasekhar1961
50
569600
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center|
{{p|fs150}}విషయసూచిక</p>
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తొలిపలుకు|తొలిపలుకు]]}}
|{{DJVU page link|1|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/మేలిపలుకు|మేలిపలుకు]]}}
|{{DJVU page link|16|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/చందాదారుల పట్టిక|చందాదారుల పట్టిక]]}}
|{{DJVU page link|18|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|ప్రథమాశ్వాసము]]}}
|{{DJVU page link|18|10}}
}}
కృత్యాది
కవి వంశావళి
ప్రబంధరచనావిషయము
షష్ఠ్యంతములు
కథాప్రారంభము
వీరభద్ర జననము
శివుఁడు వీరభద్రుని దక్షునికడ కంపుట
ఆశ్వాసాంతము
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|ద్వితీయాశ్వాసము]]}}
|{{DJVU page link|37|10}}
}}
త్రికూటాద్రి మహిమ
ఓంకారనదీవృత్తాంతము
శిబికడ కగస్త్యుడు వచ్చుట
శివుఁడు శిబికిఁ బ్రత్యక్ష మగుట
త్రికోటీశ్వరమహిమ
విష్ణుశిఖరము
బ్రహ్మశిఖరము
శివుని నృత్యవర్ణన
అష్టోత్తర శతనామావళి
పాపవినాశన స్థలమహిమ
ఇంద్రుఁడు శివుని స్తుతించుట
ఆశ్వాసాంతము
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|తృతీయాశ్వాసము]]}}
|{{DJVU page link|87|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|సాలంకయ్య కథ]]}}
|{{DJVU page link|93|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|ఆనందవల్లి కథ]]}}
|{{DJVU page link|104|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|ఆశ్వాసాంతము ]]}}
|{{DJVU page link|156|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/అష్టోత్తర శతనామావళి-1|అష్టోత్తర శతనామావళి-1]]}}
|{{DJVU page link|157|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/అష్టోత్తర శతనామావళి-2|అష్టోత్తర శతనామావళి-2]]}}
|{{DJVU page link|159|10}}
}}<noinclude><references/></noinclude>
b1vkhbvtof3r6ddlsbzrf59kp12txzt
569601
569600
2026-08-10T10:29:26Z
Rajasekhar1961
50
569601
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center|
{{p|fs150}}విషయసూచిక</p>
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తొలిపలుకు|తొలిపలుకు]]}}
|{{DJVU page link|1|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/మేలిపలుకు|మేలిపలుకు]]}}
|{{DJVU page link|16|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/చందాదారుల పట్టిక|చందాదారుల పట్టిక]]}}
|{{DJVU page link|18|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|ప్రథమాశ్వాసము]]}}
|{{DJVU page link|18|10}}
}}
కృత్యాది
కవి వంశావళి
ప్రబంధరచనావిషయము
షష్ఠ్యంతములు
కథాప్రారంభము
వీరభద్ర జననము
శివుఁడు వీరభద్రుని దక్షునికడ కంపుట
ఆశ్వాసాంతము
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|ద్వితీయాశ్వాసము]]}}
|{{DJVU page link|37|10}}
}}
త్రికూటాద్రి మహిమ
ఓంకారనదీవృత్తాంతము
శిబికడ కగస్త్యుడు వచ్చుట
శివుఁడు శిబికిఁ బ్రత్యక్ష మగుట
త్రికోటీశ్వరమహిమ
విష్ణుశిఖరము
బ్రహ్మశిఖరము
శివుని నృత్యవర్ణన
అష్టోత్తర శతనామావళి
పాపవినాశన స్థలమహిమ
ఇంద్రుఁడు శివుని స్తుతించుట
ఆశ్వాసాంతము
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|తృతీయాశ్వాసము]]}}
|{{DJVU page link|87|10}}
}}
:{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|సాలంకయ్య కథ]]}}
|{{DJVU page link|93|10}}
}}
:{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|ఆనందవల్లి కథ]]}}
|{{DJVU page link|104|10}}
}}
:{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|ఆశ్వాసాంతము ]]}}
|{{DJVU page link|156|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/అష్టోత్తర శతనామావళి-1|అష్టోత్తర శతనామావళి-1]]}}
|{{DJVU page link|157|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/అష్టోత్తర శతనామావళి-2|అష్టోత్తర శతనామావళి-2]]}}
|{{DJVU page link|159|10}}
}}<noinclude><references/></noinclude>
msxej1h1r9pg1wg8irh9czsncfh3dbd
569602
569601
2026-08-10T10:29:47Z
Rajasekhar1961
50
569602
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center|
{{p|fs150}}విషయసూచిక</p>
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తొలిపలుకు|తొలిపలుకు]]}}
|{{DJVU page link|1|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/మేలిపలుకు|మేలిపలుకు]]}}
|{{DJVU page link|16|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/చందాదారుల పట్టిక|చందాదారుల పట్టిక]]}}
|{{DJVU page link|18|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|ప్రథమాశ్వాసము]]}}
|{{DJVU page link|18|10}}
}}
కృత్యాది
కవి వంశావళి
ప్రబంధరచనావిషయము
షష్ఠ్యంతములు
కథాప్రారంభము
వీరభద్ర జననము
శివుఁడు వీరభద్రుని దక్షునికడ కంపుట
ఆశ్వాసాంతము
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|ద్వితీయాశ్వాసము]]}}
|{{DJVU page link|37|10}}
}}
త్రికూటాద్రి మహిమ
ఓంకారనదీవృత్తాంతము
శిబికడ కగస్త్యుడు వచ్చుట
శివుఁడు శిబికిఁ బ్రత్యక్ష మగుట
త్రికోటీశ్వరమహిమ
విష్ణుశిఖరము
బ్రహ్మశిఖరము
శివుని నృత్యవర్ణన
అష్టోత్తర శతనామావళి
పాపవినాశన స్థలమహిమ
ఇంద్రుఁడు శివుని స్తుతించుట
ఆశ్వాసాంతము
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|తృతీయాశ్వాసము]]}}
|{{DJVU page link|87|10}}
}}
;{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|సాలంకయ్య కథ]]}}
|{{DJVU page link|93|10}}
}}
:{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|ఆనందవల్లి కథ]]}}
|{{DJVU page link|104|10}}
}}
:{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|ఆశ్వాసాంతము ]]}}
|{{DJVU page link|156|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/అష్టోత్తర శతనామావళి-1|అష్టోత్తర శతనామావళి-1]]}}
|{{DJVU page link|157|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/అష్టోత్తర శతనామావళి-2|అష్టోత్తర శతనామావళి-2]]}}
|{{DJVU page link|159|10}}
}}<noinclude><references/></noinclude>
qrg6eqry6yo0wt30lrhnnm3eer3fl5n
569603
569602
2026-08-10T10:30:22Z
Rajasekhar1961
50
569603
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center|
{{p|fs150}}విషయసూచిక</p>
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తొలిపలుకు|తొలిపలుకు]]}}
|{{DJVU page link|1|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/మేలిపలుకు|మేలిపలుకు]]}}
|{{DJVU page link|16|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/చందాదారుల పట్టిక|చందాదారుల పట్టిక]]}}
|{{DJVU page link|18|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|ప్రథమాశ్వాసము]]}}
|{{DJVU page link|18|10}}
}}
కృత్యాది
కవి వంశావళి
ప్రబంధరచనావిషయము
షష్ఠ్యంతములు
కథాప్రారంభము
వీరభద్ర జననము
శివుఁడు వీరభద్రుని దక్షునికడ కంపుట
ఆశ్వాసాంతము
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|ద్వితీయాశ్వాసము]]}}
|{{DJVU page link|37|10}}
}}
త్రికూటాద్రి మహిమ
ఓంకారనదీవృత్తాంతము
శిబికడ కగస్త్యుడు వచ్చుట
శివుఁడు శిబికిఁ బ్రత్యక్ష మగుట
త్రికోటీశ్వరమహిమ
విష్ణుశిఖరము
బ్రహ్మశిఖరము
శివుని నృత్యవర్ణన
అష్టోత్తర శతనామావళి
పాపవినాశన స్థలమహిమ
ఇంద్రుఁడు శివుని స్తుతించుట
ఆశ్వాసాంతము
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|తృతీయాశ్వాసము]]}}
|{{DJVU page link|87|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|సాలంకయ్య కథ]]}}
|{{DJVU page link|93|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|ఆనందవల్లి కథ]]}}
|{{DJVU page link|104|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|ఆశ్వాసాంతము ]]}}
|{{DJVU page link|156|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/అష్టోత్తర శతనామావళి-1|అష్టోత్తర శతనామావళి-1]]}}
|{{DJVU page link|157|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/అష్టోత్తర శతనామావళి-2|అష్టోత్తర శతనామావళి-2]]}}
|{{DJVU page link|159|10}}
}}<noinclude><references/></noinclude>
b1vkhbvtof3r6ddlsbzrf59kp12txzt
569604
569603
2026-08-10T10:34:37Z
Rajasekhar1961
50
569604
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center|
{{p|fs150}}విషయసూచిక</p>
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తొలిపలుకు|తొలిపలుకు]]}}
|{{DJVU page link|1|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/మేలిపలుకు|మేలిపలుకు]]}}
|{{DJVU page link|16|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/చందాదారుల పట్టిక|చందాదారుల పట్టిక]]}}
|{{DJVU page link|18|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|ప్రథమాశ్వాసము]]}}
|{{DJVU page link|18|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|కృత్యాది]]}}
|{{DJVU page link|1|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|కవి వంశావళి]]}}
|{{DJVU page link|4|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|ప్రబంధరచనావిషయము]]}}
|{{DJVU page link|15|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|షష్ఠ్యంతములు]]}}
|{{DJVU page link|17|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|కథాప్రారంభము]]}}
|{{DJVU page link|18|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|వీరభద్ర జననము]]}}
|{{DJVU page link|29|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|శివుఁడు వీరభద్రుని దక్షునికడ కంపుట]]}}
|{{DJVU page link|30|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|ఆశ్వాసాంతము]]}}
|{{DJVU page link|35|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|ద్వితీయాశ్వాసము]]}}
|{{DJVU page link|37|10}}
}}
త్రికూటాద్రి మహిమ
ఓంకారనదీవృత్తాంతము
శిబికడ కగస్త్యుడు వచ్చుట
శివుఁడు శిబికిఁ బ్రత్యక్ష మగుట
త్రికోటీశ్వరమహిమ
విష్ణుశిఖరము
బ్రహ్మశిఖరము
శివుని నృత్యవర్ణన
అష్టోత్తర శతనామావళి
పాపవినాశన స్థలమహిమ
ఇంద్రుఁడు శివుని స్తుతించుట
ఆశ్వాసాంతము
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|తృతీయాశ్వాసము]]}}
|{{DJVU page link|87|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|సాలంకయ్య కథ]]}}
|{{DJVU page link|93|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|ఆనందవల్లి కథ]]}}
|{{DJVU page link|104|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|ఆశ్వాసాంతము ]]}}
|{{DJVU page link|156|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/అష్టోత్తర శతనామావళి-1|అష్టోత్తర శతనామావళి-1]]}}
|{{DJVU page link|157|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/అష్టోత్తర శతనామావళి-2|అష్టోత్తర శతనామావళి-2]]}}
|{{DJVU page link|159|10}}
}}<noinclude><references/></noinclude>
eyyjfhbnf1dcbudbvewljuz88n0vqtn
569605
569604
2026-08-10T10:38:35Z
Rajasekhar1961
50
569605
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center|
{{p|fs150}}విషయసూచిక</p>
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తొలిపలుకు|తొలిపలుకు]]}}
|{{DJVU page link|1|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/మేలిపలుకు|మేలిపలుకు]]}}
|{{DJVU page link|16|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/చందాదారుల పట్టిక|చందాదారుల పట్టిక]]}}
|{{DJVU page link|18|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|ప్రథమాశ్వాసము]]}}
|{{DJVU page link|18|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|కృత్యాది]]}}
|{{DJVU page link|1|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|కవి వంశావళి]]}}
|{{DJVU page link|4|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|ప్రబంధరచనావిషయము]]}}
|{{DJVU page link|15|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|షష్ఠ్యంతములు]]}}
|{{DJVU page link|17|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|కథాప్రారంభము]]}}
|{{DJVU page link|18|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|వీరభద్ర జననము]]}}
|{{DJVU page link|29|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|శివుఁడు వీరభద్రుని దక్షునికడ కంపుట]]}}
|{{DJVU page link|30|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|ఆశ్వాసాంతము]]}}
|{{DJVU page link|35|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|ద్వితీయాశ్వాసము]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|త్రికూటాద్రి మహిమ]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|ఓంకారనదీవృత్తాంతము]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|శిబికడ కగస్త్యుడు వచ్చుట]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|శివుఁడు శిబికిఁ బ్రత్యక్ష మగుట]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|త్రికోటీశ్వరమహిమ]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|విష్ణుశిఖరము]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|బ్రహ్మశిఖరము]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|శివుని నృత్యవర్ణన]]}}
|{{DJVU page link|37|10}}
}}
అష్టోత్తర శతనామావళి
పాపవినాశన స్థలమహిమ
ఇంద్రుఁడు శివుని స్తుతించుట
ఆశ్వాసాంతము
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|తృతీయాశ్వాసము]]}}
|{{DJVU page link|87|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|సాలంకయ్య కథ]]}}
|{{DJVU page link|93|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|ఆనందవల్లి కథ]]}}
|{{DJVU page link|104|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|ఆశ్వాసాంతము ]]}}
|{{DJVU page link|156|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/అష్టోత్తర శతనామావళి-1|అష్టోత్తర శతనామావళి-1]]}}
|{{DJVU page link|157|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/అష్టోత్తర శతనామావళి-2|అష్టోత్తర శతనామావళి-2]]}}
|{{DJVU page link|159|10}}
}}<noinclude><references/></noinclude>
kw1ss7b7zeu4je6u52h0ar8y7umnjx2
569606
569605
2026-08-10T10:40:08Z
Rajasekhar1961
50
569606
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center|
{{p|fs150}}విషయసూచిక</p>
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తొలిపలుకు|తొలిపలుకు]]}}
|{{DJVU page link|1|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/మేలిపలుకు|మేలిపలుకు]]}}
|{{DJVU page link|16|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/చందాదారుల పట్టిక|చందాదారుల పట్టిక]]}}
|{{DJVU page link|18|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|ప్రథమాశ్వాసము]]}}
|{{DJVU page link|18|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|కృత్యాది]]}}
|{{DJVU page link|1|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|కవి వంశావళి]]}}
|{{DJVU page link|4|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|ప్రబంధరచనావిషయము]]}}
|{{DJVU page link|15|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|షష్ఠ్యంతములు]]}}
|{{DJVU page link|17|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|కథాప్రారంభము]]}}
|{{DJVU page link|18|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|వీరభద్ర జననము]]}}
|{{DJVU page link|29|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|శివుఁడు వీరభద్రుని దక్షునికడ కంపుట]]}}
|{{DJVU page link|30|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|ఆశ్వాసాంతము]]}}
|{{DJVU page link|35|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|ద్వితీయాశ్వాసము]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|త్రికూటాద్రి మహిమ]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|ఓంకారనదీవృత్తాంతము]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|శిబికడ కగస్త్యుడు వచ్చుట]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|శివుఁడు శిబికిఁ బ్రత్యక్ష మగుట]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|త్రికోటీశ్వరమహిమ]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|విష్ణుశిఖరము]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|బ్రహ్మశిఖరము]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|శివుని నృత్యవర్ణన]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|ద్వితీయాశ్వాసము]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|ద్వితీయాశ్వాసము]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|ద్వితీయాశ్వాసము]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|ద్వితీయాశ్వాసము]]}}
|{{DJVU page link|37|10}}
}}
పాపవినాశన స్థలమహిమ
ఇంద్రుఁడు శివుని స్తుతించుట
ఆశ్వాసాంతము
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|తృతీయాశ్వాసము]]}}
|{{DJVU page link|87|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|సాలంకయ్య కథ]]}}
|{{DJVU page link|93|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|ఆనందవల్లి కథ]]}}
|{{DJVU page link|104|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|ఆశ్వాసాంతము ]]}}
|{{DJVU page link|156|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/అష్టోత్తర శతనామావళి-1|అష్టోత్తర శతనామావళి-1]]}}
|{{DJVU page link|157|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/అష్టోత్తర శతనామావళి-2|అష్టోత్తర శతనామావళి-2]]}}
|{{DJVU page link|159|10}}
}}<noinclude><references/></noinclude>
fzharnlwk2gfu6rvew04kwf97j9oj38
569607
569606
2026-08-10T10:41:50Z
Rajasekhar1961
50
569607
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{Center|
{{p|fs150}}విషయసూచిక</p>
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తొలిపలుకు|తొలిపలుకు]]}}
|{{DJVU page link|1|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/మేలిపలుకు|మేలిపలుకు]]}}
|{{DJVU page link|16|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/చందాదారుల పట్టిక|చందాదారుల పట్టిక]]}}
|{{DJVU page link|18|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|ప్రథమాశ్వాసము]]}}
|{{DJVU page link|18|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|కృత్యాది]]}}
|{{DJVU page link|1|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|కవి వంశావళి]]}}
|{{DJVU page link|4|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|ప్రబంధరచనావిషయము]]}}
|{{DJVU page link|15|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|షష్ఠ్యంతములు]]}}
|{{DJVU page link|17|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|కథాప్రారంభము]]}}
|{{DJVU page link|18|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|వీరభద్ర జననము]]}}
|{{DJVU page link|29|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|శివుఁడు వీరభద్రుని దక్షునికడ కంపుట]]}}
|{{DJVU page link|30|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ప్రథమాశ్వాసము|ఆశ్వాసాంతము]]}}
|{{DJVU page link|35|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|ద్వితీయాశ్వాసము]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|త్రికూటాద్రి మహిమ]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|ఓంకారనదీవృత్తాంతము]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|శిబికడ కగస్త్యుడు వచ్చుట]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|శివుఁడు శిబికిఁ బ్రత్యక్ష మగుట]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|త్రికోటీశ్వరమహిమ]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|విష్ణుశిఖరము]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|బ్రహ్మశిఖరము]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|శివుని నృత్యవర్ణన]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|పాపవినాశన స్థలమహిమ]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|ఇంద్రుఁడు శివుని స్తుతించుట]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|అష్టోత్తర శతనామావళి]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము|ఆశ్వాసాంతము]]}}
|{{DJVU page link|37|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|తృతీయాశ్వాసము]]}}
|{{DJVU page link|87|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|సాలంకయ్య కథ]]}}
|{{DJVU page link|93|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|ఆనందవల్లి కథ]]}}
|{{DJVU page link|104|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము|ఆశ్వాసాంతము ]]}}
|{{DJVU page link|156|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/అష్టోత్తర శతనామావళి-1|అష్టోత్తర శతనామావళి-1]]}}
|{{DJVU page link|157|10}}
}}
{{dotted TOC page listing|
|{{sc|[[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/అష్టోత్తర శతనామావళి-2|అష్టోత్తర శతనామావళి-2]]}}
|{{DJVU page link|159|10}}
}}<noinclude><references/></noinclude>
mhj7jczdbs8rc7cx2cal1ou8a082fp7
రచయిత:భాగవతుల వేంకట సుబ్బారావు
102
218081
569590
2026-08-10T07:47:24Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{రచయిత |ఇంటిపేరు = భాగవతుల |అసలుపేరు = వేంకట సుబ్బారావు |పేరు_మొదటి_అక్షరం = భ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = భాగవతుల వేంకట సుబ్బారావు |వికీవ్య...'
569590
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = భాగవతుల
|అసలుపేరు = వేంకట సుబ్బారావు
|పేరు_మొదటి_అక్షరం = భ
|పుట్టిన_యేడు =
|గిట్టిన_యేడు =
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = భాగవతుల వేంకట సుబ్బారావు
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
===రచనలు===
# [[నరశింహదాసు కీర్తనలు]]
[[వర్గం:రచయితలు-భ]]
2dzv5dnydd3gv1kandosw7sf3ujpei7
569592
569590
2026-08-10T07:49:25Z
Rajasekhar1961
50
/* రచనలు */
569592
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = భాగవతుల
|అసలుపేరు = వేంకట సుబ్బారావు
|పేరు_మొదటి_అక్షరం = భ
|పుట్టిన_యేడు =
|గిట్టిన_యేడు =
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = భాగవతుల వేంకట సుబ్బారావు
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
===సంపాదకులుగా రచనలు===
# [[శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము]]
[[వర్గం:రచయితలు-భ]]
ewjqgecl9cikj5a73lg8g1fqjtqzfr8
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/109
104
218082
569597
2026-08-10T09:55:10Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569597
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>18 బిడియము నా డాలు</big>}}</noinclude>సాహాయ్యముచేత నే ఆసంఘము నిలిచియున్న దనవచ్చును. సభ్యులలో చాలమంది ఆయన గొడుగునీడలలో ఉండునట్టివారే. శాకాహార విషయమున సుప్రసిద్ధుఁడగు అల్లిన్సన్ గారు కూడ కార్యసంఘమున ఒక సభ్యుఁడు. అపుడు సంతానము కలుగకుండు ఉపాయములు చేయవలయునను విషయము కొత్తక్రొత్తగా మొలకెత్తినది. డాక్టరు అల్లిన్సన్ గారికి సంతాననిరోధ మభిమతము. దానినిగూర్చి ఆయన పాటకపు వారికి బోధించుచుండెను. ఈపద్ధతులు నీతిమూలఛ్ఛేదకరములు అని డాక్టరు హిల్ సుగారి ఆశయము. ఈశాకాహారసంఘము కేవలము
ఆహార ప్రచారమే కాక నీతిప్రచారము కూడ చేయవలయుననియు వారి ఉద్దేశము. ఇట్టి విపరీతభావములు కల అల్లిన్ సన్ గారివంటి మనుష్యుల నీతిబాహ్యములైన ఉద్దేశములు సంఘమున ఉండరాదని హిల్సుగారి తలఁపు. కావున అల్లిన్ సన్ గారిని ఆసభనుండి పాటాకొట్టుటకు తీర్మాన ముపపాదింపఁబడెను. ఈచర్చ నాహృదయము
నాకర్షించెను.
సంతానము కలుగకుండ ఉపాయములు చేయవలయునను అల్లిన్ సన్ గారి ఉద్దేశములు భయంకరములనియే నే నెంచితిని. హిల్సు గారు నీతివాది (Puritan) కావున అల్లిన్ సన్ గారికి ప్రతికూలుఁడగుట ఒ ప్పనుకొంటిని. హిల్సుగారి ఔదార్యమునుబట్టి వారియందు నాకు ఆదరము కలదు. కాని నీతివిషయమున అభిప్రాయభేద మున్నంతమాత్రమున శాకాహారసంఘమునుండి ఒక సభ్యుని తొలఁగించుట పాడిగాదని నాకు తోఁచెను. హిల్సుగారు నీతివాది కాన వారికి ప్రత్యేకము ఆననుకూలత ఉండవచ్చునుగాని దానికిని, సంఘోద్దేశమునకును పొంతు లేదు. సంఘముయొక్క ఉద్దేశము శాకాహారమును విఱివిచేయుట గాని మఱి ఏనీతిమార్గమును విఱివిచేయుటగాదు. కాన నీతినిగూర్చిన<noinclude><references/>
{{c|91}}</noinclude>
czjcmc4ksq5bx8o7bljgdw0342z8vhc
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/110
104
218083
569598
2026-08-10T10:06:51Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569598
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>అభిప్రాయము లెటు లున్నను శాకాహారులైనవారందఱును ఈ సంఘమున ఉండ నర్హు లనియే నేను తలఁచితిని.
ఈ విషయమున సంఘసభ్యులలోఁ గూడఁ గొందఱు నాతో ఏకీభవించియున్నను ఈతూరి నేనే మాటలాడఁ దలఁచితిని. అదియెటులు పొసఁగును ? నాకు ధైర్యము లేదు. కావున వ్రాసి జేబులో పెట్టి తీసికొని వెళ్లితిని. దానిని గూడఁ జదువలేక అధ్యక్షున కిచ్చితిని. అతఁ డింకొకరిచే చదివించెను. డా. అల్లిన్ సన్ గారి పక్ష మోడినది. మొదటి ప్రయత్నముననే నాకు పరాజయము కలిగెనుగాని నా అభిప్రాయము సరియైనదని సంతృప్తి నాకుఁ గలదు. పిదప నా సభ్యతకు నేను విడుదల కోరినటులు కొంచెము గుఱుతు.
ఆంగ్ల దేశమునందు ఉన్నంతవఱకు నాకు ఆ బిడియము వదలనే లేదు. మిత్రుల యింటికి వెళ్లినఁగూడ పదిమంది చేరుచో నాకు వాగ్బంధ మయ్యెడిది.
నే నొకతూరి 'వెంటనర్' అను ఊరు వెళ్లితిని. కూడ మజముదారుగారును గలరు. బస ఒక శాకాహారి యింట. 'ది ఎతిక్స్ ఆఫ్ డయట్' అను గ్రంధము వ్రాసిన హోవర్డుగారు గూడ అచటనే నివసించుచుండిరి. ఇది రేవును, ఆరోగ్యస్థానమును మేము హోవర్డుగారితో మాటలాడితిమి. ఆయన శాకాహారప్రవర్తకసభలో ఉపన్యసింప మ మ్మాహ్వానించెను. అట్టి సభలలో వ్రాసికొనివెళ్లి చదువుట తప్పుగాదని తెలిసికొంటిని. పరస్పరసంబంధము పోకుండనుండుటకును, క్లుప్తముగ నుండుటకును పలువురు అట్లే చేయుదురని నాకు తెలిసెను. ఆశువుగా ఉపన్యసించుట నా కసంభవము కాన అనుకొనిన విషయములను వ్రాసి తీసికొని వెళ్లితిని. అది ఒక ఫూల్ స్కేప్ టావుకంటె<noinclude><references/>
{{c|92}}</noinclude>
r4yhf7zzmiprhu3g26l4rnvsmvvonod
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/111
104
218084
569599
2026-08-10T10:20:07Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
569599
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>18 బిడియము నా డాలు</big>}}</noinclude>హెచ్చు లేదు కాని లేచి నిలువఁబడుసరికి నాకనులు పచ్చ బడెను. నేను వణఁకు లాడితిని. అటులు కాఁగా మజముదారుగారు దాని చదివిరి. వారు ప్రత్యేకముగను ఉపన్యసించిరి. అపుడు శ్రోతలు కరతాళధ్వనులు చేసిరి. నాకు చాల లజ్జ పొడమెను. నా అసమర్థతకు విచారము కలిగెను.
నే నాంగ్ల దేశము విడుచునపుడు ఉపన్యాసమునకు చరమప్రయత్నము చేసితిని. అపుడు గూడ అస్తవ్యస్త మైనది. శాకాహారు లగు మిత్రులకు హల్ బర్ను రెస్చ్యురెంటులో విందు ఏర్పాటు చేసితిని, అది శాకాహార గారము కాకున్నను నేను తదధిపతితో చెప్పి శాకాహారములనే చేయించితిని. నా మిత్రు లీక్రొత్తపద్ధతికి చాల సంతసించిరి. విందులన్నియు వినోదమునకే యైనను పాశ్చాత్యులు దాని నొక విద్యగా పట్టిరి. అవి చాల వైభవముతో, సంగీతములతో, ఉపన్యాసములతో జరుపఁబడును నేను చేసిన ఈ చిన్నవిందులోఁ గూడ అట్టివి కొన్ని లేకపోలేదు. అందు కొన్ని ఉపన్యాసములు కావలసివచ్చెను. నావంతు రాఁగనే నేను లేచితిని. ఆలోచించి ఆలోచించి ఒకవిషయమును కొలఁది వాక్యములలో సిద్ధముచేసికొంటిని. నాకు మొదటివాక్యముపైని ఇఁక సాగలేదు. తొల్లి అడిసన్ గారిమాదిరి అయినది. హౌస్ అఫ్ కామన్సులో ఆయన ఉపన్యసింపలేచెను. అదియే ఆయనకు
ఉపన్యసింప తొలిసారి. ఆయన అటులు లేచి, - 'నేను కనుచున్నాను నేను కనుచున్నాను నేను కనుచున్నాను' అని ముమ్మాఱు అనిరి. ఇఁక పైని మాట నడవలేదు. అది చూచి ఒక పరిహాసకుఁడు లేచి, 'ఇతఁడు ముమ్మాఱు
కనెనుగాని పుట్టినదేదియు కానరాదే?' అనెను. నేనీవిషయమును మూలముగా తీసికొని హాస్యరసము ఊరునటులు మాటాడఁదలఁచితిని. దీనితో గణాధిపతిపూజ చేసితిని గాని వెంటనే స్వస్తి అయి<noinclude><references/>
{{c|93}}</noinclude>
7dtly5m5dsxrz4w6lsr90wds1m1ym13
శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము/మేలిపలుకు
0
218085
569615
2026-08-10T10:54:20Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = కొప్పరాజు నరసింహకవి |అనువాదం= | విభాగము = మేలిపలుకు | ముందరి = [[../తొలిపలుకు/]] | తదుపరి =[[../ప్రథమాశ్వాసము/]] | వివరములు = |సంవత్సరం= 1959 }} <pages index="శ్రీమత్త్రి...'
569615
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = కొప్పరాజు నరసింహకవి
|అనువాదం=
| విభాగము = మేలిపలుకు
| ముందరి = [[../తొలిపలుకు/]]
| తదుపరి =[[../ప్రథమాశ్వాసము/]]
| వివరములు =
|సంవత్సరం= 1959
}}
<pages index="శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf" from=23 to=24 />
bp1ad7szxvni5v6gcld7vl7gvi4ym8e
ఆంధ్ర భగవద్గీత
0
218086
569618
2026-08-10T11:39:19Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[ఆంధ్ర భగవద్గీత]] | రచయిత = తాడూరి లక్ష్మీనరసింహరాయకవి | అనువాదం= | విభాగము = | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం= }} <pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=1 to=13 /> {{PD-India}}'
569618
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[ఆంధ్ర భగవద్గీత]]
| రచయిత = తాడూరి లక్ష్మీనరసింహరాయకవి
| అనువాదం=
| విభాగము =
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=
}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=1 to=13 />
{{PD-India}}
krhug2m0w4zjudyvhuyp5yw09guu2qe
569619
569618
2026-08-10T11:41:09Z
Rajasekhar1961
50
569619
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[ఆంధ్ర భగవద్గీత]]
| రచయిత = తాడూరి లక్ష్మీనరసింహరాయకవి
| అనువాదం=
| విభాగము =
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1911
}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=1 to=13 />
{{PD-India}}
bbkrfotsi4b9kesdh3r08z94vst8d5q
569620
569619
2026-08-10T11:42:06Z
Rajasekhar1961
50
569620
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[ఆంధ్ర భగవద్గీత]]
| రచయిత = తాడూరి లక్ష్మీనరసింహరాయకవి
| అనువాదం=
| విభాగము =
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1911
}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=1 to=16 />
{{PD-India}}
avzxe5xmfdt1l2ydr3116r3ve2q7xxy
569621
569620
2026-08-10T11:43:18Z
Rajasekhar1961
50
569621
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[ఆంధ్ర భగవద్గీత]]
| రచయిత = తాడూరి లక్ష్మీనరసింహరాయకవి
| అనువాదం=
| విభాగము =
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1911
}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=1 to=8 />
{{page break}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=9 to=16 />
{{PD-India}}
4jk4lhxbyd7bfhee6f2nkb3r1hyvev7
569622
569621
2026-08-10T11:44:00Z
Rajasekhar1961
50
569622
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[ఆంధ్ర భగవద్గీత]]
| రచయిత = తాడూరి లక్ష్మీనరసింహరాయకవి
| అనువాదం=
| విభాగము =
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1911
}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=1 to=7 />
{{page break}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=8 to=16 />
{{PD-India}}
tc4srir6pkgiiggomyym8ulm73rxs5a
569624
569622
2026-08-10T11:48:11Z
Rajasekhar1961
50
569624
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[ఆంధ్ర భగవద్గీత]]
| రచయిత = తాడూరి లక్ష్మీనరసింహరాయకవి
| అనువాదం=
| విభాగము =
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1911
}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=2 to=2 />
{{page break}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=4 to=4 />
{{page break}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=6 to=7 />
{{page break}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=8 to=16 />
{{PD-India}}
ln1qcv1ed8bn0q3py46f1me3a7uzldk
569625
569624
2026-08-10T11:48:39Z
Rajasekhar1961
50
569625
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[ఆంధ్ర భగవద్గీత]]
| రచయిత = తాడూరి లక్ష్మీనరసింహరాయకవి
| అనువాదం=
| విభాగము =
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1911
}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=2 to=2 />
{{page break}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=4 to=4 />
{{page break}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=6 to=6 />
{{page break}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=8 to=16 />
{{PD-India}}
5r8b2cufennu1ddu1ydq8qqna72tdi5
569627
569625
2026-08-10T11:54:09Z
Rajasekhar1961
50
569627
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[ఆంధ్ర భగవద్గీత]]
| రచయిత = తాడూరి లక్ష్మీనరసింహరాయకవి
| అనువాదం=
| విభాగము =
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1911
}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=2 to=2 />
{{page break}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=4 to=4 />
{{page break}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=6 to=6 />
{{page break}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=8 to=16 />
{{padded page break}}
{{AuxTOC|
#[[/పీఠిక/]]
#[[/ప్రథమాశ్వాసము/]]
#[[/ద్వితీయాశ్వాసము/]]
#[[/తృతీయాశ్వాసము/]]
#[[/చతుర్థాశ్వాసము/]]
#[[/పంచమాశ్వాసము/]]
}}
{{PD-India}}
lt1bt470mwxtkgug3yy2kgllgsvxt7c
569628
569627
2026-08-10T11:54:52Z
Rajasekhar1961
50
569628
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[ఆంధ్ర భగవద్గీత]]
| రచయిత = తాడూరి లక్ష్మీనరసింహరాయకవి
| అనువాదం=
| విభాగము =
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1911
}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=2 to=2 />
{{page break}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=4 to=4 />
{{page break}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=6 to=6 />
{{padded page break}}
{{AuxTOC|
#[[/Preface/]]
#[[/ప్రథమాశ్వాసము/]]
#[[/ద్వితీయాశ్వాసము/]]
#[[/తృతీయాశ్వాసము/]]
#[[/చతుర్థాశ్వాసము/]]
#[[/పంచమాశ్వాసము/]]
}}
{{PD-India}}
gdx5ipfkcq1q5cyr4oq5c9mtxzk8iji
569631
569628
2026-08-10T11:57:13Z
Rajasekhar1961
50
569631
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[ఆంధ్ర భగవద్గీత]]
| రచయిత = తాడూరి లక్ష్మీనరసింహరాయకవి
| అనువాదం=
| విభాగము =
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1911
}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=2 to=2 />
{{page break}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=4 to=4 />
{{page break}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=6 to=6 />
{{padded page break}}
{{AuxTOC|
#[[/Preface/]]
#[[/ప్రథమాశ్వాసము/]]
#[[/రెండవ అధ్యాయము/]]
#[[/తృతీయాశ్వాసము/]]
#[[/చతుర్థాశ్వాసము/]]
#[[/పంచమాశ్వాసము/]]
}}
{{PD-India}}
57q4pdfvbipqvvcdu5xlib28ssk23qa
ఆంధ్ర భగవద్గీత/Preface
0
218087
569630
2026-08-10T11:56:04Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[ఆంధ్ర భగవద్గీత]] | రచయిత = తాడూరి లక్ష్మీనరసింహరాయకవి | అనువాదం= | విభాగము = Preface | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం=1911 }} <pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=8 to=16 />'
569630
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[ఆంధ్ర భగవద్గీత]]
| రచయిత = తాడూరి లక్ష్మీనరసింహరాయకవి
| అనువాదం=
| విభాగము = Preface
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1911
}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=8 to=16 />
hn78zm4zkjnlp6s3ztep6st92ubho6h
ఆంధ్ర భగవద్గీత/రెండవయధ్యాయము
0
218088
569632
2026-08-10T11:58:11Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[ఆంధ్ర భగవద్గీత]] | రచయిత = తాడూరి లక్ష్మీనరసింహరాయకవి | అనువాదం= | విభాగము = రెండవ అధ్యాయము | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం=1911 }} <pages index="ఆంధ్ర భగవద్గీత.djv...'
569632
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[ఆంధ్ర భగవద్గీత]]
| రచయిత = తాడూరి లక్ష్మీనరసింహరాయకవి
| అనువాదం=
| విభాగము = రెండవ అధ్యాయము
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1911
}}
<pages index="ఆంధ్ర భగవద్గీత.djvu" from=29 to=46 />
tjqr267l45y2prits8fqylfbyu0a38p