అమరచింత సంస్థానము

వికీపీడియా నుండి

అమరచింత సంస్థానము, ఇప్పటి మహబూబ్ నగర్ జిల్లాలో 69 గ్రామాలు కలిగి దాదాపు 190 చ.కి.మీ.ల విస్తీర్ణములో వ్యాపించి ఉండేది. ఈ సంస్థానము యొక్క రాజధాని ఆత్మకూరు. 1901 జనాభా లెక్కల ప్రకారము 34,147 జనాభాతో మొత్తము 1.4 లక్షల రెవిన్యూ ఆదాయము కలిగి ఉండేది. అందులో 6,363 రూపాయలు నిజాముకు కప్పముగా కట్టేవారు. సంస్థానము యొక్క రాజుల నివాస గృహమైన ఆత్మకూరు కోట ఇప్పటికీ పఠిష్టముగా ఉన్నది. ఆమరచింత సంస్థానము చాలా పురాతనమైన సంస్థానము. కానీ చారిత్రక అధారాలు ఏమీ లభ్యము కాలేదు. సంస్థానము యొక్క దక్షిన భాగమున గద్వాల సంస్థానము సరిహద్దున కృష్ణా నది ప్రవహిస్తున్నది. నదీ తీరము యొక్క ఎత్తు వలన నది జలాలు వ్యవసాయమునకు ఉపయోగించుటకు సాధ్యము కాదు. అమరచింత మరియు ఆత్మకూరు అంత్యంత నాణ్యమైన మేలు మస్లిన్‌ బట్టతో నేసిన దస్తీలు, ధోవతులు, బంగారు మరియు పట్టు అంచులతో నేసిన తలపాగలకు ప్రసిద్ధి చెందినవి.

అమరచింత సంస్థాన వంశము యొక్క వారసులలో ఒకడైన రాజా శ్రీరాం భూపాల్‌ మరణించిన తర్వాత అతని భార్యకు న్యాయబద్ధముగా సంస్థానము యొక్క వారసత్వము సంక్రమించినది.