సింహాచలం

వికీపీడియా నుండి

ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి.


సింహాచల దేవాలయం
సింహాచల దేవాలయం
వరాహ లక్ష్మీనరసింహ స్వామి
వరాహ లక్ష్మీనరసింహ స్వామి

సింహాచలము విశాఖపట్టణము నకు 11 కి.మీ. దూరంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రము. ఈ క్షేత్రమున శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారు కొలువై ఉన్నారు.ఈ దేవాలయము 244 మీటర్లు ఎత్తున సింహగిరి పర్వతంపై ఉన్నది.ఇది దక్షిణ భారతదేశ ముఖ్య శైవ పుణ్యక్షేత్రాలో ఒకటి.తిరుపతి తర్వాత అధిక ఆదాయం (520 మిలియన్ రూపాయిలు) కలిగిన దేవాలయము ఇది.సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది; మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనం తో కప్పబడి ఉంటుంది.నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసంలో (మే నెలలో) వస్తుంది.


హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని సంహరించడానికి విష్ణువు ఉగ్ర నరసింహావతారం దరిస్తాడు; ఆ రూపమే ఇక్కడ వెలసినది.ఆయనలోని వేడిని చల్లార్చడానికి ప్రతీరోజు చందనం తో పూతపూస్తుంటారు.నరుడు మరియు సింహము రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్ర లో (ఆసనంలో) సింహము తల కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో ఉంటుంది.

సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖముగా కాకుండా, ఎడమ వైపు ముఖమును కలిగి ఉంటుంది.సాధారణంగా తూర్పున ముఖద్వారము ఐశ్వర్యమును ప్రసాదిస్తే, పడమర ముఖద్వారము విజయాన్ని ఒసగుతుందని హిందువుల నమ్మకం.

విశిష్టాద్వైతము నకు ఆద్యుడైన శ్రీ రామానుజ ఇక్కడ ఉండే పురాతన శివలింగాన్ని వరాహనరసింహుని రూపముగా (ప్రస్తుతం గర్భగుడిలో ఉండే విగ్రహం) మార్చారని ఇక్కడి పరిసర ప్రాంతాల ప్రజలు చెబుతుంటారు.ఇది కామదహన ఉత్సవాన్ని (మన్మథుడిని శివుడు తన మూడో కంటితో భస్మం చేసిన సందర్భం) తెలయజేస్తుంది.


క్రీ.శ.1098 నాటి చోళరాజు కులొత్తుంగ వేయించిన శాసనం ద్వారా ఈ ఆలయ నిర్మాణంలో ఆయన పాత్ర ఉన్నట్టు విశదమవుతుంది.మరికొన్ని శాసనముల ద్వారా ఈ ఆలయ నిర్మాణంలో 11వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు, 13వ శతాబ్దంలో తూర్పు గంగా సామ్రాజ్యాధిపతి మొదటి నరసింహుడు పాలు పంచుకున్నట్టు తెలుస్తుంది.ఈ ఆలయ ప్రాంతంలోనున్న దాదాపు 252 శాసనాలు సింహాచలం పురాణతను వివరిస్తున్నాయి.

శ్రీ కృష్ణదేవరాయలు గజపతి ప్రతాప రుద్రుడుని ఓడించిన తర్వాత సింహాచల పుణ్యక్క్షేత్రాన్ని రెండు సార్లు (క్రీ.శ.1516 మరియు క్రీ.శ.1519) దర్శించుకుని స్వామివారి సేవల కోసం కొన్ని గ్రామాలను ఏర్పాటు చేసాడు. స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణములను సమర్పించాడు. ఇప్పటికీ ఒక పచ్చల హారం ఆలయంలో ఉంది. గత రెండు శతాబ్దాలుగా విజయనగర రాజుల కుటుంభ సభ్యులు ఈ ఆలయానికి ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు.

ఇతర భాషలు