హయాత్ బక్షీ బేగం

వికీపీడియా నుండి

మా సాహెబా గా ప్రసిద్ధి చెందిన హయాత్ బక్షీ బేగం భాగ్యనగర స్థాపకుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏకైక సంతానము. గోల్కొండ 6వ సుల్తాను సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా భార్య మరియు 7వ సుల్తాను అబ్దుల్లా కుతుబ్ షా యొక్క తల్లి.

కులీ కుతుబ్ షాకు మగ సంతానము లేనందున తన కూతురు హయాత్ బక్షీ బేగం ను మహమ్మద్ కుతుబ్ షాకు ఇచ్చి వివాహము చేసి తన వారసునిగా ప్రకటించాడు. మహమ్మద్ కుతుబ్ షాకు ముగ్గురు కుమారులు మరియు కుమార్తెలు. వీరిలో ఏడవ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా కూడా ఒకడు.

ఈమె తన పేరు మీదుగా భాగ్యనగరము శివార్లలో సూరత్ - మచిలీపట్నము చారిత్రక వర్తక రహదారి పైన హయాత్‌నగర్‌ స్థాపించినది. ఈమె ఎన్నడూ స్వయంగా పరిపాలించక పోయినా కుతుబ్ షాహీ సమాధులలో ఈమెకు ప్రత్యేక సమాధి ఉండటము విశేషము.