సర్వేపల్లి రాధాకృష్ణన్

వికీపీడియా నుండి

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
జననం: సెప్టెంబర్ 5, 1888
మరణం: ఏప్రిల్ 17, 1975
భారత దేశపు రెండవ రాష్ట్రపతి

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (Dr. Sarvepalli Radhakrishnan) (సెప్టెంబర్ 5, 1888ఏప్రిల్ 17, 1975) భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి కూడా. అంతేకాదు భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టినాడని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో(చైనా, పాకిస్తానులతో యుద్ద సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశాదు.

అప్పటి ధక్షిణభారతదేశంలో మద్రాసుకు ఈశాన్యంగా 64కీమీల దూరమున ఉన్న తిరుత్తనిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు[1]. ఇతని మాతృభాష తెలుగు. సర్వేపల్లి బాల్యము మరియు విద్యాబ్యాసము ఎక్కువగా తిరుత్తని మరియు తిరుపతిలోనే గడిచెపోయాయి. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి కళలులో(arts) పట్టభద్రుడు అయ్యాడు. 1906లో 18 సంవత్సరాల చిరుప్రాయంలో శివకామమ్మతో వివాహము జరిగింది. వీరికి ఐదుగు కూతుళ్ళు ఒక కుమారుడు కలిగారు.

1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతి అయిన తరువాత కొందరు శిశ్యులు మరియు మిత్రులు, పుట్టిన రోజు జరపటానికి అతనివద్దకు వచ్చినప్పుడు, "నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే నేను ఎంతో గర్విస్తాను", అని చెప్పి ఉపాధ్యాయ వృత్తి పట్ల తన ప్రేమను చాటారు. అప్పటినుండి ఆయన పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము.[2]

ఈయన పాశ్చాత్య తత్వవేత్తలు ఎలా తమ భావనలను తమ సంస్కృతిలో అప్పటికే ఉన్న వేదాంత ప్రభావానికి ఎలా లోనవుతున్నారో చూపించాడు. అతని దృస్టిలో తత్వము అనేది జీవితాన్ని అర్ధంచేసుకోవటానికి ఒక మార్గము, భారతీయ తత్వమును అర్ధం చేసుకోవటం అనేది ఒక సాంస్కృతిక చికిత్సగా భావించేవాడు. భారతీయ ఆలోచనా దృక్పదాన్ని పాశ్చాత్యా పరిభాషలో చెప్పి, అందులో వివేకము, తర్కము ఇమిడి ఉన్నాయని చూపించి, భారతీయ తాత్వికచింతన ఏమాత్రం తక్కువ కాదని నిరూపించాడు. [3]

విషయ సూచిక

[మార్చు] చేపట్టిన పదవులు

ట్యాంకు బండ్ పైన ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహము
ట్యాంకు బండ్ పైన ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహము
  • మద్రాసు ప్రెసిడెంసీ కలాశాలలో తాత్విక శాస్త్రానికి ఉపన్యాసకుడిగా, ఉపప్రాధ్యాపకుడుగా, ప్రాధ్యాపకుడిగా వివిద పదవులను అలంకరించాడు.
  • 1918 నుండి 1921 వరకు మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రానికి ప్రాధ్యాపకుడిగా(professor) పనిచేసాడు.
  • 1921లో, అప్పటి భారతదేశంలోని కలకత్తా విశ్వవిద్యాలయంలో ముఖ్య తాత్విక పీఠమైన, కింగ్ జార్జ్ 5 చెయిర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్(King George V Chair of Mental and Moral Science), కు రాధాకృష్ణన్ను నియమించాడు.
  • 1926 జూన్‌లో బ్రిటనులో జరిగిన విశ్వవిద్యాలయాల కాంగ్రేసులో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. తరువాత ప్రపంచ ప్రఖ్యాత హార్వార్డు విశ్వవిద్యాలయం నిర్వహించే అంతర్జాతీయ తాత్విక కాంగ్రేసు (International Congress of Philosophy)లో సెప్టెంబర్ 1926లో కూడా కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించాడు.
  • 1929లో, ఆక్స్‌ఫార్డులోని మాంచిస్టరు కలాశాలకు ప్రిన్సిపలుగా పనిచేయుటకు ఆయనను ఆహ్వానించారు. దీనివలన ఆక్స్‌ఫార్డు విశ్వవిద్యాలయంలోని విద్యార్దులకు "తూలనాత్మక మతము"(Comparative Religion)అనే విషయం మీద ఉపన్యాసము ఇవ్వగలిగే అవకాశము వచ్చింది.
  • 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపాద్యక్షుడుగా(Vice-Chancellor) పనిచేసాడు.
  • 1936లో, Spalding Professor of Eastern Religions and Ethicsఅనే పేరులో ఆక్స్‌ఫార్డు విశ్వవిద్యాలయంలో భారతదేశ ఉపరాస్ట్రపతి పదవిని అలంకరించే వరకు, అంటే 1952 వరకు, ఒక పదవిని నిర్వహించాడు.
  • 1939 నుండి 1948 వరకు బెనారసు హిందూ విశ్వవిద్యాలయానికి ఉపాద్యక్షుడుగా పనిచేసాడు.
  • 1949 నుండి 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా పనిచేసాడు.
  • 1946 నుండి 1950 వరకు పలుమార్లు భారతదేశం తరుపున UNESCO సభ్య బృందానికి అధ్యక్షుడు.
  • 1948లో విశ్వవిద్యాలయాల విద్యా కమీషనుకు అధ్యక్షుడిగా భారత ప్రభుత్వంచే నియమింపబడ్డాడు.
  • 1948లో UNESCO కార్యనిర్వాహక బృందానికి అధ్యక్షుడిగా ఉన్నాడు.
  • 1952లో UNESCO అధ్యక్షుడు అయ్యాడు.
  • 1962లో బ్రిటీషు ఎకాడమీకి Honorary Fellowగా ఎన్నుకోబడ్డాడు.

[మార్చు] గౌరవములు

మూర్తీభూత సమగ్ర భారతీయ సంస్కృతి వేదాంత విజ్ఞాన సందీప్త సుకృతి
మూర్తీభూత సమగ్ర భారతీయ సంస్కృతి వేదాంత విజ్ఞాన సందీప్త సుకృతి
  • ఉపాధ్యాయ వృత్తికి ఆయన తెచ్చిన గుర్తింపు, గౌరవమునకుగాను ప్రతీ సంవత్సరం ఆయన పుట్టిన రోజయిన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుకుంటారు.
  • 1931లో బ్రిటీషు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్టాత్మక సర్ బిరుదు ఈయనను వరించింది.
  • 1954లో మానవ సమాజానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదు పొందాడు.
  • 1961లో జర్మనీ పుస్తక సదస్సు యొక్క శాంతి బహుమానం(Peace Prize of the German Book Trade) పొందాడు.
  • 1963 జూన్ 12న బక్కింగ్‌హం రాజగ్రుహాంలోని Order of Meritకి గౌరవ సభుడిగా ఎన్నుకోబడ్డాడు.
  • ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలయిన ఆక్స్‌ఫర్డు, కేంబ్రిడ్జి, మొదలయినవాటి నుండి వందకు పైగా గౌరవ పురస్కారాలు మరియు డాక్టరేటులు సంపాదించాడు.
  • ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయము సర్వేపల్లి రాధాకృష్ణన్ సంస్మరణార్ధం రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్‌షిప్ను ప్రకటించింది.

[మార్చు] ఉల్లేఖనములు (Quotes)

  • "It is not God that is worshipped but the group or authority that claims to speak in His name. Sin becomes disobedience to authority not violation of integrity." [4]తెలుగు అనువాదము: దేవుడు కాదు పూజింపబడేది, కానీ అతని తరుపున వకాల్తా పుచ్చుకున్న కొంతమంది పెద్దవారు పూజింపబడుతున్నారు. అలాంటప్పుడు, పాపం అనేది ఈ పెద్దవారిని ధికరించటమేగానీ, న్యాయవర్తనను నాశనంచేయటం పాపం అవ్వదు.

[మార్చు] రచనలు

  • The Ethics of the Vedanta and Its Material Presupposition (వేదాంతాలలోని నియమాలు మరియు వాటి ఉపయోగము ఒక తలంపు)(1908) - M.A. పర్రిశోధనా వ్యాసం.
  • The Philosophy of Rabindranath Tagore (రవీంద్రుని తత్వము)(1918).
  • The Reign of Religion in Contemporary Philosophy (సమకాలీన తత్వములో మతము యొక్క ఏలుబడి)(1920).
  • Indian Philosophy (భారతీయ తత్వము)(2 సంపుటాలు) (1923 మరియు 1927).
  • The Hindu View of Life (హిందువుల కోణంలో జీవితము)(1926).
  • The Religion We Need (మనకు కావలిసిన మతము)(1928).
  • Kalki or The Future of Civilisation (కల్కి లేదా నాగరికత యొక్క భవిష్యత్తు)(1929).
  • An Idealist View of Life (ఆదర్శవాదుని కోణంలో జీవితం)(1932).
  • East and West in Religion (తూర్పు మరియు పడమరాలలో మతము)(1933).
  • Freedom and Culture (స్వతంత్ర్యం మరియు సంస్కృతి)(1936).
  • The Heart of Hindusthan (భారతీయ గుండె)(1936).
  • My Search for Truth (Autobiography)(నిజం కోసం వెతుకులాట(ఆత్మకధ))(1937).
  • Gautama, The Buddha (గౌతమ బుద్దుడు)(1938).
  • Eastern Religions and Western Thought (తూర్పు మతాలు మరియు పాశ్చాత్య చింతన) (1939, రెండవ కూర్పు 1969).
  • Mahatma Gandhi (మహాత్మా గాంధీ)(1939).
  • India and China (భారత దేశము మరియు చైనా)(1944).
  • Education, Politics and War (విద్య, రాజకీయం మరియు యుద్దము)(1944).
  • Is this Peace (ఇది శాంతేనా)(1945).
  • The Religion and Society (మతము మరియు సంఘము)(1947).
  • The Bhagwadgita (భగవత్గీత)(1948).
  • Great Indians (గొప్ప భారతీయులు)(1949).
  • East and West: Some Reflections (తూర్పు మరియు పడమర: కొన్ని ప్రతిబింబాలు)(1955).
  • Religion in a Changing World (మారుతున్న ప్రపంచంలో మతము)(1967).


[మార్చు] మూలాలు

  1. ^ liveindia.comలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి
  2. ^ భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం
  3. ^ డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత చరిత్ర(సమగ్రంగా) sify.comలో
  4. ^ నాస్తికత్వంపైన ఉల్లెఖనములు
  5. ఇంతకుముందు ఉన్న రాష్ట్రపతుల గురించి భారత ప్రభుత్వంవారి అధికారిక వెబ్‌సైటులో చూడండి
  6. సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతి రాత మరియు ఆయన గొంతును కూడా ఇక్కడ వినవచ్చు


ఇంతకు ముందు ఉన్నవారు:
రాజేంద్ర ప్రసాద్
భారత రాష్ట్రపతి
1962 మే 131967 మే 13
తరువాత వచ్చినవారు:
జాకీర్ హుస్సేన్


భారత రాష్ట్రపతులు

రాజేంద్ర ప్రసాద్సర్వేపల్లి రాధాకృష్ణన్జాకీర్ హుస్సేన్ • వి.వి.గిరి • ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ • నీలం సంజీవరెడ్డి • జ్ఞాని జైల్ సింగ్ • ఆర్.వెంకటరామన్ • శంకర దయాళ్ శర్మ • కె.ఆర్.నారాయణన్ • అబ్దుల్ కలామ్


టాంకు బండ పై విగ్రహాలు బొమ్మ:TankBund.jpg
సికింద్రాబాదు నుండి వరసగా

సమర్పణ ఫలకం | రుద్రమ దేవి | మహబూబ్ ఆలీఖాన్ | సర్వేపల్లి రాధాకృష్ణన్ | సి.ఆర్.రెడ్డి | గురజాడ అప్పారావు | బళ్ళారి రాఘవ | అల్లూరి సీతారామరాజు | ఆర్థర్ కాటన్ | త్రిపురనేని రామస్వామిచౌదరి | పింగళి వెంకయ్య | మగ్దూం మొహియుద్దీన్ | సురవరం ప్రతాపరెడ్డి |జాషువ | ముట్నూరి కృష్ణారావు | శ్రీశ్రీ | రఘుపతి వెంకటరత్నం నాయుడు |త్యాగయ్య| రామదాసు | శ్రీకృష్ణదేవరాయలు | క్షేత్రయ్య | పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి | బ్రహ్మనాయుడు | మొల్ల | తానీషా | సిద్ధేంద్ర యోగి | వేమన | పోతనామాత్యుడు | అన్నమాచార్య | ఎర్రాప్రగడ | తిక్కన సోమయాజి | నన్నయభట్టు | శాలివాహనుడు