పరిశుద్ధ బాప్తీస్మము

వికీపీడియా నుండి

పరిశుద్ధ బాప్తీస్మ సంస్కారం - ఆచార్య మార్టిన్ లూథర్ వివరణ (చిన్న ప్రశ్నోత్తరి నుంచి)

అత్యంత సులభమైన పద్దతిలో ఇంటి యజమాని తన ఇంట్లోవాళ్ళందరికీ నేర్పించాల్సింది

మొదటిగా

బాప్తీస్మమంటే ఏంటి?

బాప్తీస్మమంటే వట్టి నీళ్ళు మాత్రమే కాదు. అవి దేవుని ఆజ్ఞ ప్రకారం ఉపయోగించబడ్డ నీళ్ళు. అంతేకాక దేవుని వాక్యంతో కూడిన సంస్కారం.

ఆ దైవవాక్యమేది?

మత్తయి సువార్త చివరి అధ్యాయంలో మన ప్రభువైన యేసు ఇలా చెపుతాడు “మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము లోనికి వారికి బాప్తీస్మ మియ్యుడి.”

బాప్తీస్మం ఇచ్చే మేళ్ళు

రెండోదిగా

బాప్తీస్మం మనకేం చేస్తుంది?

బాప్తీస్మం పాప క్షమాపణ నిస్తుంది. మరణం నుండి సాతాను నుండి విడిపిస్తుంది. దేవుని మాటలు వాగ్ధానాలు ప్రకటించినట్లుగా దీన్ని నమ్మే వాళ్ళందరికీ నిత్య రక్షణ నిస్తుంది.

దేవుడిచ్చిన ఈ వాగ్ధానపు మాటలు ఏవి?

మన ప్రభువైన క్రీస్తు మార్కు సువార్త చివరి అధ్యాయంలో ఇలా చెపుతాడు, “నమ్మి బాప్తీస్మం పొందిన వాడు రక్షింపబడును. నమ్మని వానికి శిక్ష విధింప బడును.

బాప్తీస్మానికున్న శక్తి

మూడోదిగా

ఇన్ని గొప్ప కార్యాలను నీళ్ళెలా చేస్తాయి?

కచ్చితంగా ఇంత గొప్ప కార్యాలను చేసేది నీళ్ళు కాదు. అయితే నీళ్ళలోను, నీళ్ళతోను ఉన్న దేవుని వాక్యం ఇంకా దేవుని వాక్యంపట్ల ఉన్న విశ్వాసం మనలో ఈ కార్యాలను జరిగిస్తాయి. ఎందుకంటే దేవుని వాక్యం చేర్చబడనప్పుడు అవి వట్టి నీళ్ళే తప్ప బాప్తీస్మం కాదు. అయితే నీటికి వాక్యం చేర్చబడి నప్పుదు అది బాప్తీస్మం అవుతుంది. అప్పుడది క్రుపగల జీవజలమై పరిశుద్ధాత్ముని బట్టి పునర్జన్మ సంబంధమైన స్నానమౌతుంది.

ఇది ఎక్కడ రాయబడింది?

తీతుకు వ్రాసిన పత్రిక మూడో అధ్యాయంలో పరిశుద్ధుడైన పౌలు ఇలా రాస్తాడు. “మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక,తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను (దేవుడు) మనలను రక్షించెను. మనమాయన క్రుప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బాట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమ్రుద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది.”

మన అనుదిన జీవితంలో బాప్తీస్మం యొక్క అర్థం.

నాలుగోదిగా

నీటితో బాప్తీస్మం ఇవ్వడంలో ఉన్న అర్థమేంటి?

బాప్తీస్మం అంటే - మనం ప్రతిరోజూ మనసులో దుఖపడుతూ హ్రుదయమందు పఛ్ఛాత్తాప పడటం ద్వారా మనలో ఉన్న పాత ఆదాము పాతిపెట్టబడి ఆ పాత ఆదామును బట్టి కరిగిన దుర్మార్గపు క్రియలు, దురాచారాలు చంపబడాలని అర్థం. అంతే కాకుండా దేవుని యెదుట పవిత్రంగా, నీతిగా బ్రతికే ఓ క్రొత్త వ్యక్తి ప్రతిరోజూ పైకి లేవాలని అర్థం.

ఇది ఎక్కడ రాయబడింది?

రోమా పత్రిక ఆరో అధ్యాయంలో పరిశుద్ధుడైన పౌలు ఇలా చెపుతాడు, “తండ్రి మహిమ వలన క్రీస్తు మ్రుతులలో నుండి ఏలాగు లేపబడెనో అలాగె మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనునట్లు మనము బాప్తీస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి.”

క్రైస్తవ ప్రార్ధన కూడా చూడండి