రేచర్ల రెడ్డి వంశీయులు
వికీపీడియా నుండి
రేచర్ల రెడ్డి రాజులు, చక్కని ప్రతిభా పాటవాలతో, స్వామి భక్తితో కాకతి వంశీయుల వద్ద చాలా పలుకుబడికలిగి, మంత్రులుగా, సామంతులుగా, మహా సామంతులుగా ఉన్నారు. వీరు ముఖ్యముగా నల్గొండ నందలి ఆమనగల్లు, పిల్లల మర్రి, మిర్యాలగూడ, నాగులపాడు, సోమవరం: వరంగల్లు ప్రాంతమునందలి ఎలకుర్తి, ములుగు, నర్సంపేట, మాచాపూరు: కరీంనగరు ప్రాంతమునందలి హుజూరాబాదు ప్రాంతములను పరిపాలించినారు.
విషయ సూచిక |
[మార్చు] దేవాలయ నిర్మాణము
ఈ వంశజులు అనేక దేవాలయములు నిర్మించినారు. వీరి ప్రధానముగా శైవమత అవలంబీకులు. వీరు నిర్మించిన దేవాలయములు
- పిల్లలమర్రి నందలి త్రికూటేశ్వర, నామేశ్వర, ఎఱకేశ్వర ఆలయములు
- నాగులపాడునందలి నామేశ్వర, కాదేశ్వర, కాటేశ్వర, కామేశ్వర ఆలయములు
- పాలంపేటనందలి రుద్రేశ్వరాలయము
- గొడిశాలనందలి పంచలింగేశ్వరాలయము
- డిచ్చకుంట, రామన్న పేట, చిట్యాలంపాడు, ఎలకుర్తి, మాచాపూరు మొదలగు ప్రాంతములయందూ వీరు దేవాలయములు నిర్మించినారు.
[మార్చు] మత విషయములు
తమ ప్రభువులైన కాకతి వంశము వలే వీరు కూడా శైవ మతము ఆరాధించినారు. వీరి కాలమున జైనము అనాదరణకు గురియై క్రమముగా కనుమరుగైనది. అనేక జినాలయములు శైవాలయములుగా మార్చబడినాయి, జైన విగ్రహాలను తటాకములలోనూ, నూతులలోనూ పారవేసినారు, జైన సాధువులు అనేక కష్టనష్టాలకు గురిఅయి వలసపోయినారు, అదే సమయములు శైవానికి మంచి ఆదరణ దొరికినది, అనేక మఠాలు నిర్మించినారు, విద్యా పీఠాలు నిర్మించినారు విద్యాలయములకూ, అందలి ఉద్యోగులకూ వీరు భూదానాలు చేసినారు.
[మార్చు] నీటి పారుదల సౌకర్యములు
ప్రజల ముఖ్య ఆధారము వ్యవసాయము. దాని అభివృద్ది కోసం తద్వారా దేశ అభివృద్ది కోసం వీరు చాలా తటాకములు నిర్మించినారు ఈసంఖ్య వందలలోనే ఉంటుంది, కొన్ని చూడండి లోక సముద్రము, ఎఱక సముద్రము, మూసేటి కాలువలు, నామ సముద్రము, విశ్వనాథ సముద్రము, నాగ సముద్రము, చింతల చెఱువు, నేరెడ్ల చెఱువు, కత్యాకె చెఱువు, గుడ్ల చెఱువు, గౌర సముద్రము, సబ్బి సముద్రము, లక్ష్మీ సముద్రము, ఎర్రమరాజు కుంట, బొమ్మాయి కుంట కాలువ, రాజెనాయకుని చెఱువు, ఏలేశ్వరము కాలువ, చవుట కాలువ, పడాల చెఱువు, రామప్ప చెఱువు , కామ సముద్రము, మేడ సముద్రము వంటి అనేక చెరువులూ, కాలలు తవ్వించినారు.
[మార్చు] దుర్గములు లేదా కోటలు
వీరికి అమనగల్లు, పిల్లల మర్రి, ఉండ్రుగొండ, ఉర్లు కొండ, వాడ్వల్లి, ఎలకుర్తి మొదలగు దుర్గములు కలవు.
[మార్చు] పరకామణి
పరకామణి, లేదా ఈ కాలమునాటి నాణెములు వీటిని నిష్కమ అను బంగారునాణెములుగా ఉండెడివి. ఆ తరువాత రూక, అడ్డుగ, వీసము, చిన్నము అను నాణెములు ఉండెడివి. [[నిష్కము] = మాడ = బంగారు నాణెము రూక = వెండి నాణెము పది రూకలు = ఒక మాడ అడ్డుగ = అర్థ = 1/2 రూక పాదిక = పాతిక = 1/4 రూక వీసము, చిన్నము, రూకలోని భాగములు.
ఓ విషయము గమనీచినారా? ఇప్పటికీ ఈ వొకాబులరీ లేదా పదములు తెలుగువారిని వదలలేదు ఉదాహరణకు రూక, రూపాయ లాగా ద్వనించడములేదు! వీసమెత్తు బంగారం కూడా ఇవ్వను - అను వాడు కలదు కదా (అంటే ఇప్పటి భాషలో నయాపైసా కూడా ఇవ్వను అని ) మాడలు జానపద కథలలో మాత్రము మిగిలినట్లున్నాయి.
[మార్చు] సైనిక విశేషములు
వీరు సైన్యమును స్వంతముగా పోషించి, కాకతి వంశజులకు తలలో నాలుకగా ఉండేవారు. అనేక సమయములో వీరు చాలా ప్రముఖ భూమికను పోషించినారు, ముఖ్యముగా మొదటి బేతరాజు కంచి దండయాత్రలోనూ, రుద్రదేవ మహారాజు మరణాంతరము గణపతిదేవ మహారాజు నకు రాజ్యమునప్పగించడములోనూ, వీరి పాత్ర చాలా ముఖ్యమైనది.
వీరు స్వంత సైన్యముతో పాటుగా తమ తమ దుర్గములందు సైన్యము పెంచేవారు, ఈ సైన్యమును దుర్గాదిపతులు చూసేవారు, వారు దుర్గము అధీనములోని గ్రామాలనుండి పన్నులు వసూలు చేసేవారు. ఓ చిన్న విషయము ఏమిటంటే, ఈ కాలములో పన్నులు ఎక్కువగానే ఉండెడివి అని తెలుస్తుంది, కాకపోతే పాడి పంటలు, చాలా సమృద్దిగా ఉండుటవల్ల ప్రజలు సుఖశాంతులతోనే ఉన్నారు, అదియే కాకుండా వీరు వ్యవసాయమును చాలా బాగుబా పోషించినారు అని చెప్పుకున్నాము కదా!
వీరు సైనికులకు జీతములు ఇచ్చేవారు. యుద్దములందు విజయము సాధించిన పిదప వీరులకు సన్మానములు జరిపేవారు. సైన్యమునందు ఉన్నత పదోన్నతులతో పాటు రకరకాలైన కనుకలూ ఇతర బహుమతులూ ఇచ్చేవారు.
అసి, ముసల, కణయ, కంపణ, ముద్గర, తోమర, భిండివాల, క్రకచ, నారాచ, ముషిండి మొదలైన పేర్లతో సైన్యమును విభజించేవారు, ఇది ఇప్పటి మన రకరకాల ప్రమోషను పద్దతివంటిది అనుకోవచ్చు.
[మార్చు] చూడండి
- రేచర్ల రెడ్డి రాజుల వంశ వృక్షము
- రేచర్ల రెడ్డి రాజుల కాలమునాటి శాసనాలు
- రేచర్ల రెడ్డి రాజుల పేర్లు
- రేచర్ల రెడ్డి రాజుల శాసనములందలి గ్రామముల పేర్లు
మూస:కాకతి వంశ సామంతులు
మూస:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర