భారత దేశ రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానులు
వికీపీడియా నుండి
భారతదేశ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానుల జాబితా ఇది.
భారతదేశం 28 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడి ఉంది. రాష్ట్రాలకు స్వంత ప్రభుత్వాలు ఉండగా కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వమే పాలిస్తుంది. అయితే పుదుచ్చేరి కేం.పా.ప్రా అయినప్పటికీ దానికి స్వంత ప్రభుత్వం ఉంది. మాత్రం స్వంత ప్రభుత్వం కలిగిన ఢిల్లీ అటు రాష్ట్రం కాక, ఇటు కేం.పా.ప్రా కాక మధ్యస్తంగా ఉంటుంది.
[మార్చు] రాజధానులు
వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలన, చట్టసభల, న్యాయ కేంద్రాల జాబితా ఇది. ప్రభుత్వ కార్యాలయాలు ఉండే స్థానాన్ని పరిపాలక కేంద్రం గాను, శాసనసభ ఉండే ప్రదేశాన్ని శాసన కేంద్రం గాను, హైకోర్టు ఉండే ప్రదేశాన్ని న్యాయ కేంద్రం గాను గుర్తించబడ్డాయి.
రాజధానిగా ఎప్పటినుండి ఏర్పడింది అనేది "ఎప్పటి నుండి" అనే నిలువులో ఇవ్వబడింది. వేసవి, శీత అనేవి వేసవికాలం, శీతకాలం లను, బ అంటే శాసన సభ బడ్జెట్ సమావేశాలను సూచిస్తాయి.
పరిపాలనా కేంద్రం రాష్ట్ర రాజధానిగా గుర్తించబడుతుంది. పూర్వ రాజధాని అంటే ప్రస్తుత రాజధానికి ముందు లేదా భారత్ లో విలీనానికి ముందు ఉన్న రాజధాని అని అర్థం. చట్ట రాజధాని స్థానం ఖాళీగా ఉంటే దానర్థం.. అది కేంద్ర పాలనలో ఉందని..
రాష్ట్రం/కే.పా.ప్రా | పరిపాలన కేంద్రం | శాసన కేంద్రం | న్యాయ కేంద్రం | ఎప్పటి నుండి | పూర్వ రాజధాని |
---|---|---|---|---|---|
అండమాన్ నికోబార్ దీవులు | పోర్ట్ బ్లెయిర్ | — | కోల్కతా | 1956 | — |
అరుణాచల్ ప్రదేశ్ | ఇటానగర్ | ఇటానగర్ | గౌహతి | 1972 | — |
ఆంధ్ర ప్రదేశ్ | హైదరాబాదు | హైదరాబాదు | హైదరాబాదు | 1956 | కర్నూలు[1] |
అసోం | గౌహతి | దిస్పూర్ | గౌహతి | 1972 | షిల్లాంగ్[2] (1874-1972) |
బీహార్ | పాట్నా | పాట్నా | పాట్నా | 1936 | — |
చత్తీస్గఢ్ | రాయిపూర్ | రాయిపూర్ | బిలాస్పూర్ | 2000 | — |
చండీగఢ్ | చండీగఢ్[3] | — | చండీగఢ్ | 1966 | — |
దాద్రా నగరు హవేలీ | సిల్వాస్సా | — | ముంబై | 1961 | — |
డామన్ డయ్యు | డామన్ | — | ముంబై | 1987 | — |
ఢిల్లీ | ఢిల్లీ | ఢిల్లీ | ఢిల్లీ | 1956 | — |
గోవా | పనాజి[4] | పోర్వోరిం | ముంబై | 1961 | — |
గుజరాత్ | గాంధీనగర్ | గాంధీనగర్ | అహమ్మదాబాదు | 1970 | అహ్మదాబాదు (1960-1970) |
చండీగఢ్ | చండీగఢ్ | చండీగఢ్ | చండీగఢ్ | 1966 | — |
హిమాచల్ ప్రదేశ్ | సిమ్లా | సిమ్లా | సిమ్లా | 1948 | — |
జమ్మూ కాశ్మీరు | • శ్రీనగర్ (వేసవి) • జమ్మూ (శీత) |
• శ్రీనగర్ (వేసవి) • జమ్మూ (శీత) |
శ్రీనగర్ | 1948 | — |
జార్ఖండ్ | రాంచీ | రాంచీ | రాంచీ | 2000 | — |
కర్ణాటక | బెంగళూరు | బెంగళూరు | బెంగళూరు | 1956 | — |
కేరళ | తిరువనంతపురం | తిరువనంతపురం | ఎర్నాకులం | 1956 | కొచ్చి[5] (1949-1956) |
లక్షద్వీపాలు | కావరత్తి | — | ఎర్నాకులం | 1956 | — |
మధ్య ప్రదేశ్ | భోపాల్ | భోపాల్ | జబల్పూర్ | 1956 | నాగపూర్ [6] (1861-1956) |
మహారాష్ట్ర | ముంబై[7] |
• ముంబై (వేసవి+బ) |
ముంబై | 1818 1960 |
— |
మణిపూర్ | ఇంఫాల్ | ఇంఫాల్ | గౌహతి | 1947 | — |
మేఘాలయ | షిల్లాంగ్ | షిల్లాంగ్ | గౌహతి | 1970 | — |
మిజోరం | ఐజాల్ | ఐజాల్ | గౌహతి | 1972 | — |
నాగాలాండ్ | కొహిమా | కొహిమా | గౌహతి | 1963 | — |
ఒరిస్సా | భుబనేశ్వర్ | భుబనేశ్వర్ | కటక్ | 1948 | కటక్ (1936-1948) |
పుదుచ్చేరి | పుదుచ్చేరి | పుదుచ్చేరి | చెన్నై | 1954 | — |
పంజాబ్ | చండీగఢ్ | చండీగఢ్ | చండీగఢ్ | 1966 | • లాహోర్[10] (1936-1947) • సిమ్లా (1947-1966) |
రాజస్థాన్ | జైపూర్ | జైపూర్ | జోధ్పూర్ | 1948 | — |
సిక్కిం | గాంగ్టక్[11] | గాంగ్టక్ | గాంగ్టక్ | 1975 | — |
తమిళనాడు | చెన్నై[12] | చెన్నై | చెన్నై | 1956 | — |
త్రిపుర | అగర్తలా | అగర్తలా | గౌహతి | 1956 | — |
ఉత్తరాంచల్ | డెహ్రాడూన్[13] | డెహ్రాడూన్ | నైనీతల్ | 2000 | — |
ఉత్తర ప్రదేశ్ | లక్నో | లక్నో | అలహాబాదు | 1937 | — |
పశ్చిమ బెంగాల్ | కోల్కతా | కోల్కతా | కోల్కతా | 1905 | — |
[మార్చు] గమనికలు
- ↑ 1956 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడక ముందు ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రం అని రెండు రాష్ట్రాలుగా ఉండేది. ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగాను, హైదరాబాదు రాష్ట్రానికి హైదరాబాదు రాజధాని గాను ఉండేవి.
- ↑ 1971 లో అసోం నుండి మేఘాలయ విడిపోక ముందు వరకు సంయుక్త రాష్ట్రానికి షిల్లాంగ్ రాజధానిగా ఉండేది.
- ↑ చండీగఢ్ పంజాబు, హర్యానాలు రెండింటికీ రాజధాని. ఈ రెండింటికి చెందకుండా అది ఒక కేంద్రపాలిత ప్రాంతం.
- ↑ 1843 నుండి (పోర్చుగీసు పాలనలో) గోవాకు పనాజి రాజధానిగా ఉంటూ వచ్చింద.
- ↑ 1956 లో కేరళ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న టిరువాన్కూరు-కొచ్చిన్ రాష్ట్రానికి కొచ్చి రాజధానిగా ఉండేది.
- ↑ 1861 నుండి 1950 వరకు ప్రత్యేక రాష్ట్రం గా ఉన్న మధ్య ప్రావిన్సులు, బేరారు కు నాగపూరు రాజధానిగా ఉండేది. 1950 లో ఏర్పడిన మధ్య ప్రదేశ్ లో ఇది ప్రముఖ భాగంగా ఉండేది. కొత్త రాష్ట్రానికి కూడా నాగపూరే రాజధానిగా ఉండేది. 1956 లో బేరారును విడదీసి, బాంబే రాష్ట్రం లో కలిపాక, నాగపూరు రాజధాని హోదాను కోల్పోయింది. 1960 లో కుదిరిన నాగపూరు ఒప్పందం ద్వారా నాగపూరు మహారాష్ట్రకు రెండో రాజధాని అయింది.
- ↑ 1956 వరకు ఉనికిలో ఉన్న బాంబే ప్రావిన్సుకు ముంబై రాజధానిగా ఉండేది. తరువాత, బాంబే రాష్ట్రం ఏర్పడినపుడు ముంబై రాజధాని అయింది. తరువాత బాంబే రాష్ట్రం చీలి మహారాష్ట్ర, గుజరాత్ లు ఏర్పడ్డాయి.
- ↑ 1960 లో కుదిరిన నాగపూరు ఒప్పందం ద్వారా నాగపూరు మహారాష్ట్రకు రెండో రాజధాని అయింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన 1988 లో వెలువడింది. అయినా భారత ప్రభుత్వం ప్రచురించే భారత సంవత్సర పుస్తకం లో నాగపూరు యొక్క రాజధాని ప్రత్రిపత్తి గురించిన ప్రస్తావన ఉండదు.
- ↑ నాగపూరు ఒప్పందం ప్రకారం విదర్భ మహారాష్జ్ట్రలో విలీనమౌతున్నందుకు గాను ఏటా జరిగే శాసనసభ సమావేశాల్లో కనీసం ఒకటైనా నాగపూరులో జరగాలి. ఆ సమావేశం ప్రత్యేకించి విదర్భ సమస్యలపై జరగాలి. ఈ సమావేశాలపై మహారష్ట్ర ప్రభుత్వాల అలసత్వ ధోరణి కారణంగా చివరివి "పిక్నిక్ సమావేశాలు" గా పేరుపడ్డాయి.
- ↑ 1936 లో పంజాబు రాష్ట్రం ఏర్పాటయినపుడు లాహోరు దాని రాజధానిగా ఉండేది. ప్రస్తుతం లాహోరు పాకిస్తానులో ఉంది
- ↑ 1890 నుండి గాంగ్టక్ సిక్కీంకు రాజధానిగా ఉంటూ వచ్చింది. 1975 లో సిక్కిం భారత్లో అంతర్భాగమయింది.
- ↑ 1839 నుండి మద్రాసు ప్రెసిడెన్సీ కి చెన్నై రాజధానిగా ఉంటూ వచ్చింది. 1950 లో మద్రాసు ప్రెసిడెన్సీ నుండి సర్కారు జిల్లాలు వ్చేరుపడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయింది. మిగిలిన ప్రాంతం 1956 లో తమిళనాడు గా ఏర్పడింది..
- ↑ డెహ్రాడూన్ ఉత్తరాంచల్ కు తాత్కలిక రాజధాని. రాష్ట్ర కొత్త రాజధానిగా గైర్సే అనే పట్టణం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది.