రాజమండ్రి
వికీపీడియా నుండి

గోదావరి నది వడ్డున ఉన్న ఒక పెద్ద పట్టణము. ఉభయ గోదావరి జిల్లాలకు వాణిజ్య కేంద్రము.పేరుకు కాకినాడ తూర్పు గొదావరి రాజధాని అయినా రాజమండ్రి కే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది.రాజముండ్రి అర్థిక సాంఘిక చారిత్రిక రాజకీయా ప్రాముక్య కత కలిగిన నగరం. రాజమండ్రి పుర్వపు పేరు రాజమహేంద్రి.
[మార్చు] చరిత్ర
రాజమండ్రి ని రాజమహేంద్రి అని పిలిచేవారు.కవి త్రయంలొ మెదటి కవి అయిన నన్నయ్య ఇక్కడే మహాభారతాన్ని తెనిగించడం ప్రారంభించాడు. ప్రఖ్యాత సంఘసంస్కర్త, రచయిత శ్రీ కందుకూరి వీరశలింగం పంతులు రాజమండ్రీ వాసులే. రాజమండ్రి గోదావరి తీరం లో చెన్నై కోల్ కత్తా జాతీయ రహదారి పై ఉంది.
ఇక్కడే ధవళేశ్వరం వద్ద గోదావరి నది పై కాటన్ దొర అనకట్ట కట్టాడు.దిని వల్ల ఎన్నొ వేల ఎకరాల కి సాగు నీరు లభ్యమయ్యింది. ఇక్కడ అఖండ గౌతమి పై గల రైలు మరియు రోడ్డు బ్రిడ్జ్ భారత దేశం లో రెండవ పొడవైన బ్రిడ్జ్ . ఈ పట్టణంలోని గౌతమీ గ్రంధాలయం ప్రసిధ్దమైనది. ఇక్కడ పేరుగాంచిన గుళ్ళు గోపురాలు చాలా ఉన్నాయి. అందుకే గోదావరి పుష్కరాలకి రాజముండ్రికి వచ్చే భక్తుల సంఖ్య చాలా ఎక్కువ. తీయని స్వీట్ - పూత రేకులకి ప్రఖ్యాతి గల ఆత్రేయపురం గ్రామము రాజమండ్రి సమీపంలో ఉంది.