డొక్కల కరువు
వికీపీడియా నుండి
డొక్కల కరువు అంటే చాలా తీవ్రమైన కరువు అని అర్థము. ఈ కరువును అలా పిలవడానికి కారణం, కరువు ఎంత తీవ్రంగా ఉంటుందంటే జనాలు ఒకరు తిన్న తరువాత వారి డొక్క చీల్చుకోని ఆ ఆహారం తింటారు అని చెపుతారు. ఇలాంటి కరువు గుంటూరు జిల్లాలో ఒక సారి వచ్చింది. 1831లో వచ్చిన అతివృస్టి, ఆ తరువాత 1833వచ్చిన అనావృస్టి దీనికి కారణం. ఆ కరువు సమయంలో సుమారు 5లక్షలమంది చనిపోయారు. 20 సంవత్సరాలవరకు జనజీవనం సాధారణ స్థితికి రాలేక పోయింది. ఇలాంటి తీవ్ర పరిస్తితుల కారణంగా ప్రజలు ఇంకొకరిని తినే దుస్తితికి దిగజారుతారు.