దాద్రా నగరు హవేలీ
వికీపీడియా నుండి
దాద్రా మరియు నగరు హవేలీ (Dadra & Nagar Haveli) పశ్చిమ భారత దేశములోని ఒక కేంద్ర పాలిత ప్రాంతము. దీని మొత్తం వైశాల్యం 491 చ.కి.మీ.
నగర్-హవేలీ అనేది మహారాష్ట్ర మరియు గుజరాత్ సరిహద్దులో ఒదిగి ఉన్న ఒక చిన్న ప్రాంతము. నగరుహవేలీకి కొన్ని కిలోమీటర్లు ఉత్తరాన గుజరాత్ రాష్ట్రం భూభాగం మధ్యలో దాద్రా అనే ప్రాంతమున్నది.
ఈ కేంద్ర పాలిత ప్రాంతము యొక్క రాజధాని సిల్వాస్సా.
1779 నుండి 1954లో భారత దేశము స్వాధీనము చేసుకునే వరకు ఇది పోర్చుగీస్ కాలనీగా ఉన్నది. 1961లో ఇది కేంద్ర పాలిత ప్రాంతము అయినది .గుజరాతీ ఈ ప్రాంతము యొక్క ముఖ్య భాష.
పారిశ్రామిక ఉత్పత్తులు ఇక్కడ ఆర్ధిక వ్యవస్థకు ప్రధానమైన వనరులు. ఎక్సైజు సుంకము లేదు.
అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలాగానే లెఫ్టినెంట్ గవర్నరు ఇక్కడ ప్రధాన ప్రభుత్వోద్యోగి.
[మార్చు] చరిత్ర
ఇంగ్లీషువారితోను, మొగలు చక్రవర్తులతోను తమకున్న వైరం, తరచు జరగే తగవులు కారణంగా మరాఠా పేష్వాలు వ్యూహాత్మకంగా పోర్చుగీసువారితో స్నేహం చేయాలనుకున్నారు. 1779 డిసెంబరు 17న ఒక ఒప్పందం కుదిరింది. ఆ ప్రకారం ఈ ప్రాంతం (దాద్రా, నగరు హవేలి) లోని 72 గ్రామాల పరగణాల్లో 1200 రూపాయలు శిస్తు ఆదాయాన్ని వసూలు చేసుకునే అధికారం పోర్చుగీసువారికి అప్పజెప్పడమైనది. అంతకు ముందు 'సంతన' అనే యుద్ధనౌకను పోర్చుగీసువారినుండి మరాఠాలు వశం చేసుకొన్నారు. అందుకు పరిహారం కూడా ఈ శిస్తు వసూలు ఒప్పందానికి ఒక కారణం.
1954 ఆగస్టు 2 వరకు ఇది పోర్చుగీసు వారి పాలనలోనే ఉన్నది. ప్రజలే దీనిని విముక్తి చేసి, తరువాత భారతదేశంలో విలీనం చేశారు. 1961 ఆగస్టు 11 న దీనిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. 1954 నుండి 1989 వరకు 'వరిష్ట పంచాయత్' అనే పాలనా సలహా మండలి పనిచేసింది. తరువాత దాద్రా జిల్లా పంచాయతి, నగరు హవేలీ జిల్లా పంచాయతి, మరో 11 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి.
భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు | ![]() |
---|---|
ఆంధ్ర ప్రదేశ్ | అరుణాచల్ ప్రదేశ్ | అస్సాం | బీహార్ | చత్తీస్గఢ్ | గోవా | గుజరాత్ | హర్యానా | హిమాచల్ ప్రదేశ్ | జమ్మూ మరియు కాశ్మీరు | జార్ఖండ్ | కర్నాటక | కేరళ | మధ్య ప్రదేశ్ | మహారాష్ట్ర | మణిపూర్ | మేఘాలయ | మిజోరాం | నాగాలాండ్ | ఒరిస్సా | పంజాబ్ | రాజస్థాన్ | సిక్కిం | తమిళనాడు | త్రిపుర | ఉత్తరాంచల్ | ఉత్తర ప్రదేశ్ | పశ్చిమ బెంగాల్ | |
కేంద్రపాలిత ప్రాంతములు: అండమాన్, నికోబార్ దీవులు | చండీగఢ్ | దాద్రా నగరు హవేలీ | డామన్, డయ్యు | లక్షద్వీపములు | పుదుచ్చేరి | |
జాతీయ రాజధాని ప్రాంతము: ఢిల్లీ |