పాలమూరు సంస్థానాలు

వికీపీడియా నుండి

మహబూబ్ నగర్ జిల్లాలోని సంస్థానాల చరిత్ర ఈ జిల్లా చరిత్రతో పెనవేసుకుపోయింది. ఈ సంస్థానాల చరిత్ర అధ్యయనం ద్వారా పాలమూరు (మహబూబ్ నగర్) చరిత్ర తెలుసుకోవచ్చు.


నిజాము రాజ్యంలోని హిందూ ప్రభువుల సంస్థానాలు ఓరుగల్లును పాలించిన కాకతీయుల కాలం నాటినుండీ ఉండేవి. వీరు ప్రధానంగా చుట్టుపక్క ప్రాంతాలపై అధికారం సంపాదించుకున్న జమీందారులూ, సైనికాధికారులూను. వీళ్ళను పాలెగాళ్ళు అనీ, వీరి రాజ్యాలను పాలెములనీ అంటారు. స్వాతంత్ర్యం వచ్చేనాటికి అటువంటి సంస్థానాలు మొత్తం 16 ఉండేవి. ఈ ప్రాంతంలోని కొన్ని ప్రముఖ సంస్థానాలు - వనపర్తి, గద్వాల, జటప్రోలు, అమరచింత, పాల్వంచ, గోపాలపేట, గురుగుంట, కొల్లాపూర్, ఆనెగొంది. ప్రగతి కాముకులైన ఈ సంస్థానాల పాలకులు సమర్థవంతమైన పాలనను అందించారు.