శ్రీశైల క్షేత్రము

వికీపీడియా నుండి

విషయ సూచిక

[మార్చు] క్షేత్ర ప్రశస్తి

[మార్చు] చేరుకొను విధము

రోడ్డు మార్గములు
  • హైదరాబాదు నుండి శ్రీశైలం 200 కి.మీ. దూరంలో ఉంది.ఈ రోడ్డు అటవీ ప్రాంతం గుండా పోతుంది. అటవీశాఖ వారు రాత్రి వేళల్లో ఈ ప్రాంతం గుండా ప్రయాణానికి అనుమతించరు కనుక పగటి వేళ మాత్రమే ప్రయాణించాలి.
  • గుంటూరు నుండి శ్రీశైలం 225 కి.మీ. దూరంలో ఉంది. గుంటూరు నుండి నరసరావుపేట, వినుకొండ మీదుగా వచ్చే ఈ మార్గం దోర్నాల వద్ద కర్నూలు రోడ్డుతో కలుస్తుంది. అక్కడి నుండి శ్రీశైలంకు కొండ మార్గంలో ప్రయాణం (53 కి.మీ.) చాలా బాగుంటుంది.
రైలు మార్గములు
విమాన మార్గములు
వసతి సదుపాయములు

[మార్చు] చూడవలసినవి

మల్లికార్జున స్వామి గుడి
భ్రమరాంబిక అమ్మవారి గుడి

[మార్చు] మల్లికార్జునుని గుడి చుట్టూ ఉన్న విశేషాలు

మనోహర గుండము
శ్రీశైలములో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి. దీనిలో గొప్పతనము ఏమిటంటే చాలా స్వచ్చమైన నీరు ఈ గుండములో ఉంటుంది. శ్రీశైలము చాలా ఎత్తైన ప్రదేశములో ఉన్నది. అంత ఎత్తులో కూడా ఆ రాళ్ళలో ఇంత చక్కని నీరు ఉండటం నిజంగా చూడవలసినదే. ఈ నీరు చాలా స్వచ్చంగా ఉంటుంది. మహానంది లోని కోనేటి నీటిలో క్రింద రూపాయ వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది, అలాగే ఈ చిన్ని గుండంలో కూడా కనిపిస్తుంది.
పంచ పాండవులు ప్రతిష్టించిన లింగాలు
వృద్ద మల్లికార్జున లింగము
ఇది ముడతలు పడిన ముఖంలా ఉన్న శివ లింగం. ఇది చూస్తే అంత అందముగా ఉండదు. బహుశా ముసలితనాన్ని గుర్తు చేస్తుందేమో!
సాక్షి గణపతి ఆలయము
ఇది ముఖ్యాలయానికి కొద్ది రూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయము ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలములో శివుడిని దర్శించినంత మాత్రముననే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతె సాక్ష్యము చెపుతాడు, మనము శ్రీశైలము వచ్చినాము అని, అందుకే ఇతనిని సాక్షి గణపతి అంటారు.

గమనిక: సాక్షి గణపతి, శిఖర దర్శనము, శంకరులవారు తపస్సు చేసిన ప్రదేశము, పాలధార పంచదారలు అన్నీ ఒకే రోడ్డుపై ఉంటాయి. అన్నిటినీ ఒక వరుసలో చూడవచ్చు.

శిఖరమునుండి శ్రీశైల పర్వత దృశ్యము
శిఖరమునుండి శ్రీశైల పర్వత దృశ్యము
శిఖర దర్శన కొండ నుండి శ్రీశైల పర్వతాన్ని దర్శనము చేసుకొంటున్న యాత్రికులు.
శిఖర దర్శన కొండ నుండి శ్రీశైల పర్వతాన్ని దర్శనము చేసుకొంటున్న యాత్రికులు.
శిఖరేశ్వరం
శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది, ఈ శిఖరేశ్వరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు, దూరంగా ఉన్న ఎత్తైన కొండపై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే, శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారు.
పాలధార, పంచదార
ఆది శంకరాచార్యులవారు తపస్సు చేసిన ప్రదేశం
పాతాళ గంగ
శ్రీశైలం పక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే ఈ శ్రీశైలము చాలా ఎత్తులో ఉన్నది, నది మాత్రము క్రింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలము నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చెయ్యవచ్చు. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అనే సార్దక నామధేయముతో వ్యవహరిస్తారు. ఆ మెట్లు అన్నీ దిగి కృష్ణలో మునిగి తిరిగి ఎక్కినపుడు పాతాళగంగ అనునది ఎంత సార్ధక నామధేయమో తెలుస్తుంది.
ఆనకట్ట
శ్రీశైలం ప్రాజెక్టు చూడండి.
శ్రీశైలం ఆనకట్ట 2005లో గేట్లు తీసినప్పటి దృశ్యం
శ్రీశైలం ఆనకట్ట 2005లో గేట్లు తీసినప్పటి దృశ్యం
జల విద్యుత్ కేంద్రము

[మార్చు] ఇంకా చూడండి

[మార్చు] బయటి లింకులు