ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం)

వికీపీడియా నుండి

ధర్మపురి మండలం
జిల్లా: కరీంనగర్
రాష్ట్రము: ఆంధ్ర ప్రదేశ్
ముఖ్య పట్టణము: ధర్మపురి
గ్రామాలు: 23
విస్తీర్ణము: చ.కి.మీ
జనాభా (2001 లెక్కలు)
మొత్తము: 73.23 వేలు
పురుషులు: 36.124 వేలు
స్త్రీలు: 37.106 వేలు
జనసాంద్రత: / చ.కి.మీ
జనాభా వృద్ధి: % (1991-2001)
అక్షరాస్యత (2001 లెక్కలు)
మొత్తము: 40.75 %
పురుషులు: 53.40 %
స్త్రీలు: 28.53 %
చూడండి: కరీంనగర్ జిల్లా మండలాలు

ధర్మపురి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. ధర్మపురి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం. శ్రీ యోగనృసింహుడు లక్ష్మీ సమేతుడై ఇక్కడ కొలువై ఉన్నాడు. కరీంనగర్ జిల్లాకు ఉత్తరంగా 65 కిలోమీటర్ల దూరంలో, జగిత్యాలకు 27 కిలోమీటర్లదూరంలో గోదావరి నదీతీరాన ఈ క్షేత్రరాజం కలదు. ఇక్కడ గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించుచు తన పవిత్రతను చాటుకొనుచున్నది. ఎంతో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రాచీన కాలంనుంచి వైదిక విద్యలకు ప్రముఖస్థలముగా పేరొంది నేటికీ సాంప్రదాయ వేదవిద్యలకు నెలవైయున్నది.

విషయ సూచిక

[మార్చు] స్థల పురాణము

పూర్వకాలములో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుడిని గూర్చి తపమాచరించగా, నృసింహుడు అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నారసింహుడుగా ఈ క్షేత్రమందు అవతరించెను. ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ధము. కుజదోషమున్న వారు ఈ క్షేత్రమందు స్వామివారికి కళ్యాణము చేయించిన వారి కుజదోష నివారణము జరిగి శీఘ్రంగా వివాహమవటం ఇక్కడి క్షేత్ర మహాత్మ్యం. సాధారణంగా కుజదోషం అంటే వివాహానికి ముందే దానికి సంబంధించిన పరిహారక్రియలు చేసుకోవటం చేస్తుంటారు. కొన్ని సార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోవటం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వివాహానంతరం వైవాహిక జీవితం సమస్యల పాలవటం కద్దు. ధర్మపురి క్షేత్రం వివాహానంతరం కుజదోషం కారణంగా వచ్చే సమస్యలకు మంచి పరిహారం. దంపతులు ఇక్కడ గోదావరి తీరంలో సరిగంగ స్నానాలాడి, స్వామివారిని అర్చించినచో ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి.

[మార్చు] మండలంలోని గ్రామాలు

[మార్చు] బయటి లింకులు

[మార్చు] కరీంనగర్ జిల్లా మండలాలు

ఇబ్రహీంపట్నం - మల్లాపూర్ - రైకల్ - సారంగాపూర్ - ధర్మపురి - వెలగటూరు - రామగుండము - కమానుపూర్ - మంథని - కాటారం - మహాదేవపూర్ - మల్హర్రావు - ముత్తరంమహాదేవపూర్ - ముత్తరంమంథని - శ్రీరాంపూర్ - పెద్దపల్లి - జూలపల్లి - ధర్మారం - గొల్లపల్లి - జగిత్యాల - మేడిపల్లి - కోరుట్ల - మెట్‌పల్లి - కత్లాపూర్ - చందుర్తి - కొడిమ్యాల్ - గంగాధర - మల్లియల్ - పెగడపల్లి - చొప్పదండి - సుల్తానాబాద్ - ఓడెల - జమ్మికుంట - వీణవంక - మనకొండూరు - కరీంనగర్ - రామడుగు - బోయినపల్లి - వేములవాడ - కోనరావుపేట - యల్లారెడ్డి - గంభీర్రావుపేట్ - ముస్తాబాద్ - సిరిసిల్ల - ఎల్లంతకుంట - బెజ్జంకి - తిమ్మాపూర్ - కేశవపట్నం - హుజూరాబాద్ - కమలాపూర్ - ఎల్కతుర్తి - సైదాపూర్ - చిగురుమామిడి - కోహెడ - హుస్నాబాద్ - భీమదేవరపల్లి

ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం), కరీంనగర్ జిల్లా, ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం) మండలానికి చెందిన గ్రామము

ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి.