నన్నయ్య

వికీపీడియా నుండి

ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది.
వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి.
నన్నయ్య
నన్నయ్య

నన్నయ్య గారు ఆది కవి. వీరు మహా భారతాన్ని తెలుగులో వ్రాయ ప్రారంబించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని(అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషులు అయ్యారు. వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య గారి అడుగు జాడలు ని అనుసరించిన వారే. నన్నయ్య గారు రాన్మహేంద్రవరం లేదా రాజమండ్రి లో వుండి ఈ మహా భారతాన్ని తెలుగులో వ్రాసినారు. తల్లి గోదావరి ఒడ్డున కూర్చోని, తన రాజయిన రాజ రాజ నరేంద్ర మహా రాజు గారికి చెప్పినదే ఈ మహా భారతము. నన్నయ గారు తెలుగు మాట్లాడేవారికి పూజనీయుడు.

రాజ రాజ నరేంద్రుడు నన్నయభట్టారకుని భారతాంధ్రీకరణకు ప్రోత్సహంచినాడు. అందుకు సరియైన వ్యక్తి నన్నయభట్టు, సంహితాభ్యాసుడు. నానాపురాణ విజ్ఞాన నిలయుడు; అవిరళ జపహోమ తత్పరుడైన వయ్యాకరణి నన్నయ. 'ఆంధ్రభాషానుశాసనం' అనే వ్యాకరణం రచించినాడని ప్రసిద్ధి. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచినాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించినారు; తెనుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి,పందితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ నారాయణులు యుగపురుషులు.

రాజరాజనరేంద్రుని పాలన కాలంలో సాహిత్యపోషణకు అనుకూలమైన ప్రశాంతవాతావరణం క్రీ.శ. 1045-1060 మధ్యలో ఉంది. ఆ కాలంలోనే భారతాంధ్రీకరణ జరిగి ఉంటుంది......

''ఆయన ఆంధ్ర మహాభారతము శ్రీకారము త్రిమూర్తులను స్తుతంచే ఈ సంస్కృత శ్లోకముతో  జరిగినది.''
'''శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే'''
'''లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం'''
'''తేవేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై'''
'''ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ  శ్రీకంధరా శ్శ్రేయసే'''

(లక్ష్మీ సరస్వతీ పార్వతులను వక్షస్థలమునందును, ముఖమునందును, శరీరము నందును ధరించి లోకములను పాలించువారును, వేదమూర్తులును, దేవపూజ్యులును, పురుషోత్తములును అగు విష్ణువు, బ్రహ్మ, శివుదు మీకు శ్రేయస్సు కూర్తురు గాక!)

భారతాంధ్రీకరణలో ఆయన మూడు లక్షణములు తన కవితలో ప్రత్యేకముగా చెప్పుకొన్నారు - (1) ప్రసన్నమైన కథాకలితార్థయుక్తి (2) అక్షర రమ్యత (3) నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వము.

అటువంటి నన్నయ్య గారి మహా భారతము నుండి మచ్చుకు కొన్ని పద్యాలు :-

ఉపరిచర మహారాజు అడవిలో తన రాణి గురించి కలలు కంటున్నప్పుడు :-

[[సీసము]]:
పలుకులముద్దును, గలికిక్రాల్గన్నుల, తెలివును, వలుదచన్నులబెడంగు
నలఘకాంచీపదస్థలములయెపును, లలితాననేందుమండలము రుచియు.
నళినీలకుటిలకుంతలములకాంతియు, నెలజవ్వనంబున విలసనమును,
నలసభావంబున బొలుపును, మెలుపును| గలుగు నగ్గిరికను దలచి తలచి,

[[ఆటవెలది]]:
ముదితయందు దనదు హృదయంబు నిలపుట | జేసి రాగ మడర భాసురముగ
రమణతో వనాంతరమున రేతస్స్యంద, మయ్యె నవనిపతికి నెయ్య మొనర.
వశిష్టుడి కొడుకు మత్స్య కన్యని చూసిన సంధర్బములో నన్నయ్య గారు రాసిన పద్యము

[[సీసము]]:
చపలాక్షిచూపులచాడ్పున కెడ మెచ్చు, జిక్కనిచనుగవజీఱగోరు.
నన్నువకౌదీగ యందంబు మది నిల్పు, జఘనచక్రంబుపై జలుపు దృష్టి.
యభిలాష మేర్పడు నట్లుండగా బల్కు, వేడ్కతో మఱుమాట వినగ దివురు,
నతిఘనలజ్జావనత యగు యక్కన్య, పై బడి లజ్జయు బాప గడగు

[[ఆటవెలది]]:-
నెంతశాంతు లయ్యు, నెంత జితేంద్రియు, లయ్యు, గడువివిక్త మయినచోట
సతులగోష్ఠి జిత్తచలన మోదుదు, రెందు గాముశక్తి నోర్వగలరె జనులు.

భారతంలో నన్నయగారి చివరిపద్యం - శారదరాత్రుల వర్ణన -

శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్
జారుతరంబులయ్యె  వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరి పూరితంబులై

(శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి. - అంటే వెన్నెలలో చుక్కలు బాగా కనుపించటము లేదు - వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే చల్లగాలి తో, పూల పరాగంతో ఆకాశం వెలిగి పోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడి వంటి వెన్నెలను విరజిమ్ముతున్నాడు)

[మార్చు] మూలములు

  • డా. బి.స్.యల్. హనుమంతరావు గారి "ఆంధ్రుల చరిత్ర"


టాంకు బండ పై విగ్రహాలు బొమ్మ:TankBund.jpg
సికింద్రాబాదు నుండి వరసగా

సమర్పణ ఫలకం | రుద్రమ దేవి | మహబూబ్ ఆలీఖాన్ | సర్వేపల్లి రాధాకృష్ణన్ | సి.ఆర్.రెడ్డి | గురజాడ అప్పారావు | బళ్ళారి రాఘవ | అల్లూరి సీతారామరాజు | ఆర్థర్ కాటన్ | త్రిపురనేని రామస్వామిచౌదరి | పింగళి వెంకయ్య | మగ్దూం మొహియుద్దీన్ | సురవరం ప్రతాపరెడ్డి |జాషువ | ముట్నూరి కృష్ణారావు | శ్రీశ్రీ | రఘుపతి వెంకటరత్నం నాయుడు |త్యాగయ్య| రామదాసు | శ్రీకృష్ణదేవరాయలు | క్షేత్రయ్య | పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి | బ్రహ్మనాయుడు | మొల్ల | తానీషా | సిద్ధేంద్ర యోగి | వేమన | పోతనామాత్యుడు | అన్నమాచార్య | ఎర్రాప్రగడ | తిక్కన సోమయాజి | నన్నయభట్టు | శాలివాహనుడు