లాల్ బహదూర్ శాస్త్రి
వికీపీడియా నుండి
![]() |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
లాల్ బహదూర్ శాస్త్రి (హిందీ लालबहादुर शास्त्री) (అక్టోబర్ 2, 1904 - జనవరి 11, 1966) భారత దేశ రెండవ శాస్వత ప్రధానమంత్రి మరియు దేశ స్వాతంత్ర్యోధ్యమములో ప్రముఖ పాత్రధారి.
[మార్చు] తొలి జీవితము మరియు స్వాతంత్ర్యోధ్యమము
శాస్త్రిజీ, యునైటెడ్ ప్రావిన్స్ (ప్రస్తుత ఉత్తర ప్రదేశ్) లోని మొఘల్సరాయి లో జన్మించాడు. 1921 లో మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమములో పాల్గొనుటకై కాశీలోని జాతీయవాద కాశీ విధ్యాపీఠములో చదడము ప్రారంభించాడు. అక్కడ విద్యాభ్యాసము అనంతరము 1926లో శాస్త్రి అనే పట్టభద్రుడయ్యాడు. స్వాంతంత్ర్యోధ్యమ పొరాట కాలములో మొత్తము తొమ్మిది సంవత్సరాలు జైలులోనే గడిపాడు. సత్యగ్రహ ఉద్యమము తర్వాత 1940 నుండి 1946 వరకు ఈయన జైళ్లోనే ఉన్నాడు.[1].
[మార్చు] రాజకీయ జీవితము
స్వాతంత్ర్యము తర్వాత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మంత్రివర్గములో గృహ మంత్రిగా పనిచేశాడు. 1951లో లోక్ సభ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. ఆ తరువాత కేంద్ర రైల్వేశాఖా మంత్రిగా పనిచేశాడు. తమిళనాడు లోని అరియళూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. సాధారణ ఎన్నికల తర్వాత తిరిగి కేంద్ర మంత్రివర్గములో చేరి తొలుత రవాణా శాఖ మంత్రి 1961 నుండి గృహ మంత్రిగా పనిచేశాడు.
భారత ప్రధానమంత్రులు |
---|
జవహర్లాల్ నెహ్రూ • గుల్జారీలాల్ నందా • లాల్ బహదూర్ శాస్త్రి • ఇందిరా గాంధీ • మొరార్జీ దేశాయ్ • చరణ్సింగ్ • రాజీవ్ గాంధీ • వి.పి.సింగ్ • చంద్రశేఖర్ • పి.వి.నరసింహారావు • వాజపేయి • దేవెగౌడ • ఐ.కె.గుజ్రాల్ • డా.మన్మోహన్ సింగ్ |