ఉత్తరాంచల్
వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి,తరువాత ఈ మూసను తీసివేయండి |
ఉత్తరాంచల్ | |
రాజధాని - Coordinates |
Dehradun† - |
పెద్ద నగరము | Dehradun |
జనాభా (2001) - జనసాంద్రత |
8,479,562 (19th) - 159/చ.కి.మీ |
విస్తీర్ణము - జిల్లాలు |
53,566 చ.కి.మీ (18th) - 13 |
సమయ ప్రాంతం | IST (UTC +5:30) |
అవతరణ - గవర్నరు - ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
2000-11-09 - Sudarshan Aggarwal - Narayan Dutt Tiwari - Unicameral (30) |
అధికార బాష (లు) | Hindi, Garhwali, Kumaoni |
పొడిపదం (ISO) | IN-UL |
వెబ్సైటు: ua.nic.in | |
ఉత్తరాంచల్ రాజముద్ర |
|
† డెహ్రాడున్ రాష్ట్రము యొక్క తాత్కాళిక రాజధాని. కొత్త రాజధాని ఇంకా ఎంపిక చేసుకోవలసి ఉన్నది. |
ఉత్తరాంచల్ (उत्तरांचल) 2000 సంవత్సరము నవంబరు 9న భారతదేశంలో 27వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇది అంతకు ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక భాగము. 1990నుండి కొద్దికాలం శాంతియుతంగా సాగిన ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం విజయవంతం అయ్యి ఉత్తరాంచల్ రాష్ట్రం ఆవిర్భవించింది. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లు ఉత్తరాంచల్ రాష్ట్రానికి హద్దులు. ఉత్తరాన చీనా (టిబేట్), నేపాల్ దేశాలతో సరిహద్దులున్నాయి. తాత్కాలిక రాజధాని డెహ్రాడూన్. ఇదే ఈ రాష్ట్రంలో అతి పెద్ద నగరం. హైకోర్టు మాత్రం నైనిటాల్ లో ఉన్నది. గైర్సాయిన్ అనే చిన్న గ్రామాన్ని ముందుముందు రాజధానిగా తీర్చిదిద్దాలనే ప్రతిపాదన ఉంది.
ఉత్తరాంచల్ లో పశ్చిమప్రాంతాన్ని గర్వాల్ అనీ, తూర్పు ప్రాంతాన్ని కుమావన్ అనీ అంటారు. ఉత్తరాంచల్ ఎంతో అందమైన రాష్ట్రం. ఉత్తర ప్రాంతం హిమాలయ పర్వత సానువుల్లో హిమవాహినులతోనూ, దక్షిణ ప్రాంతం దట్టమైన అడవులతోనూ కనుల పండువుగా ఉంటుంది. ఎన్నో ప్రత్యైకమైన జీవజాలాలు (భరల్, మంచుపులి వంటివి), వృక్ష సంతతి ఈ ప్రాంతానికి పరిమితం. భారతదేశానికి జీవనాడులైన గంగా, యమునానదులు ఉత్తరాంచల్ లోని హిమవాహినులలో పుడుతున్నాయి. తరువాత అవి ఎన్నో ఏరులు, సరసులు, హిమపాతాలతో కలసి మహానదులై మైదానంలో ప్రవేశిస్తున్నాయి.
ఉత్తరాంచల్ రాష్ట్రానికి పర్యాటకుల వల్ల వచ్చే ఆదాయం ఒక ముఖ్యమైన ఆర్ధికవనరు. బ్రిటిష్ కాలం నుండి ముస్సోరీ, ఆల్మోరా, రానిఖేట్ లు వేసవి యాత్రికులకు మంచి ఆకర్షణలుగా అభివృద్ధి చెందాయి. అంతే కాకుండా హరిద్వార్, ఋషీకేశ్, బదరీనాధ్, కేదారనాధ్ వంటి చాలా పుణ్య క్షేత్రాలు వేల సంవత్సరాలుగా భక్తులకు దర్శనీయ స్థానాలుగా పేరుగొన్నాయి. టూరిజమ్ ను మరింత అభివృద్ధి చేయడానికి రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తున్నది.
ఇంకా వివాదాస్పదమైన తెహ్రీ ఆనకట్ట నిర్మాణం ఈ రాష్ట్రంలో భాగీరధీ-భిలంగనా నదిపై 1953లో ప్రారంభమైంది.
విషయ సూచిక |
[మార్చు] ప్రజలు
స్థానిక ప్రజలు తమను తాము "గరహ్వాలీలు", "కుమావొనీలు" అని చెప్పుకుంటారు. కుమావొనీలలో కొంతమంది "పహారీ" అని చెప్పుకొంటారు. ఎక్కువమంది హిందూ మతస్థులు. ఇంకా గడచిన శతాబ్దంలో వలస వచ్చిన నేపాలీ జాతివారున్నారు. జధ్, మర్చా, సౌకా తెగలవారు భారత్-టిబెట్ సరిహద్దులలో నివశిస్తున్నారు. వీరందరినీ కలిపి "భోటియా"లంటారు. తెరాయి పర్వతప్రాంతాలలో "తారు", "భుక్షా" తెగలవారున్నారు. దక్షిణ తెరాయి ప్రాంతంలో "గుజ్జర్"లనే సంచార పశుపాలకజాతులవారు న్నారు.
[మార్చు] భౌగోళికము
ఉత్తరాంచల్ రాష్ట్రము అధికభాగం హిమాలయ పర్వతసానువులలో ఉన్నది. ఎత్తునుబట్టి వాతావరణమూ, భూతలమూ మారుతూ ఉంటాయి. ఎత్తయిన ప్రాంతాలలో మంచు కొండలూ, హిమానదాలూ ఉండగా, తక్కువ ఎత్తులున్నచోట ఉష్ణమండలవాతావరణమూ, దట్టమైన అడవులూ ఉన్నాయి. మరీ ఎత్తయిన స్థలాలూ మంచుకొండలతోనూ, రాతినేలతోనూ ఉన్నాయి.
- 3000 - 3500 మీటర్ల ఎత్తున: హిమాలయ ఆల్పైన్ మైదానాలు, ఇంకా ఎత్తైన చోట్ల టుండ్రా మైదానాలు
- 2600-3000 మీటర్ల ఎత్తిన: కోనిఫెరస్ అటవీ ప్రాంతాలు
- 1500-2600 మీటర్ల ఎత్తున: వెడల్పు ఆకుల చెట్లున్న అడవులు
- 1500 మీటర్ల లోపు ఎత్తున: తెరాయి-దువార్ సవన్నా మైదానాలు
- ఇంకా దిగువన: గంగామైదానాలు, డెసిడువస్ అడవులు - వీటిని "భాభర్"లు అంటారు.
అక్కడి ప్రత్యేక భౌగోళిక లక్షణాల కారణంగా ఉత్తరాంచల్ రాష్ట్రంలో చక్కని రాష్ట్రీయ ఉద్యానవనాలున్నాయి.
- పూలలోయ (వాలీ ఆఫ్ ఫ్లవర్స్) నేషనల్ పార్కు
- నందాదేవి నేషనల్ పార్కు (చమోలీ జిల్లా)
- జిమ్ కార్బెట్ నేడనల్ పార్కు (నైనితాల్ జిల్లా)
- రాజాజీ నేషనల్ పార్కు (హరిద్వార్ జిల్లా)
- గోవింద పశువిహార్ నేషనల్ పార్కు (ఉత్తరకాశి జిల్లా)
- గంగోత్రి నేషనల్ పార్కు (ఉత్తరకాశి జిల్లా)
[మార్చు] గణాంకాలు
- మొత్తం విస్తీర్ణం: 51,125 చదరపు కి.మీ.
- పర్వత ప్రాంతం: 92.57%
- మైదాన ప్రాతం: 7.43%
- అడవి ప్రాతం: 63%
- స్థానిక వివరాలు
- రేఖాంశము తూర్పు 77° 34' 27" నుండి 81° 02' 22"
- అక్షాంశము: ఉత్తరం: 28° 53' 24" నుండి 31° 27' 50"
- మోత్తం జనాభా: 7,050,634 (పురుషులు, స్త్రీల నిష్పత్తి = 1000 : 976)
- పురుషులు % 51.91
- స్త్రీలు % 48.81
- గ్రామీణ జనాభా: 76.90 %
- నగర జనాభా: 23.10 %
- మైనారిటీ వర్గాలు: షుమారు 2.0 %
- అక్షరాస్యత 65%
- గ్రామాలు: 15620
- నగరాలు, పట్టణాలు: 81
- రైల్వే స్టేషనులు: కొత్వారా, డెహ్రాడూన్, హరిద్వార్, రిషీకేష్, హల్ద్వానీ, లాల్ కువాన్, కాథ్ గొడామ్K, తనక్ పూర్
- విమానాశ్రయాలు : పంత్ నగర్, నైనిసాయిన్, జాలీగ్రాంట్
- ముఖ్యమైన పర్వతాలు ( సముద్ర మట్టం నుండి ఎత్తు)
- గౌరీ పర్వత్ (6590), గంగోత్రి (6614), పంచ్ చూలి( 6910), నందాదేవి (7816), నందాకోట్ (6861), కామెట్( 7756), బద్రీనాధ్ (7140),త్రిశూల్ (7120), చౌఖంబా(7138), దునాగిరి (7066)
- ముఖ్యమైన లోయలు (పర్వత మార్గాలు)
- మనా (5450), నితీపాస్ (5070), లిపులేఖ్( 5122), లుంపియాధుర (5650)
- పరిశ్రమలు
- పర్యాటక రంగము, పాడి పరిశ్రమ, వ్యవసాయం, పూలు పండ్ల తోటలు, చెఱకు, కొన్ని చిన్న పరిశ్రమలు
- పండుగలు
- ఉత్తరాణి, నందదేవి మేళా, హోలి, దీపావళి, దసరా, కందాలీ, కొండజాతర, బిఖోటి, బగ్వాల్, హరేలా, ఘుగుటీ
- ఉత్సవాలు
- సర్దోత్సవ్, వసంతోత్సవ్, నందాదేవీ రాజ్ జాత్, చిప్లా కేదార్ జాత్, కేదారనాధ యాత్ర, బదరీనాధ యాత్ర, కుంభమేళా, అర్ధ కుంభమేళా, రామలీల
- వాణిజ్య కేంద్రాలు
- హల్ద్వానీ, రుద్రపూర్, తనక్ పూర్, డెహ్రాడూన్, హరిద్వార్, కొట ద్వార్, హృషీకేశ్
[మార్చు] జిల్లాలు
ఉత్తరాంచల్ 13 జిల్లాలుగా విభజించ బడినది. అవి: ఆల్మోరా, బాగేశ్వర్, Chamoli, Champawat, Dehradun, Haridwar, Nainital, Pauri (Pauri Garhwal), Pithoragarh, Rudraprayag, Tehri (Tehri Garhwal), Udham Singh Nagar, and Uttarkashi. These districts form two divisions; Garhwal division includes Chamoli, Dehradun, Haridwar, Pauri Garhwal, Rudraprayag, Tehri, and Uttarkashi districts, and Kumaon division includes Almora, Bageshwar, Champawat, Nainital, Pithoragarh, and Udham Singh Nagar.
భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు | ![]() |
---|---|
ఆంధ్ర ప్రదేశ్ | అరుణాచల్ ప్రదేశ్ | అస్సాం | బీహార్ | చత్తీస్గఢ్ | గోవా | గుజరాత్ | హర్యానా | హిమాచల్ ప్రదేశ్ | జమ్మూ మరియు కాశ్మీరు | జార్ఖండ్ | కర్నాటక | కేరళ | మధ్య ప్రదేశ్ | మహారాష్ట్ర | మణిపూర్ | మేఘాలయ | మిజోరాం | నాగాలాండ్ | ఒరిస్సా | పంజాబ్ | రాజస్థాన్ | సిక్కిం | తమిళనాడు | త్రిపుర | ఉత్తరాంచల్ | ఉత్తర ప్రదేశ్ | పశ్చిమ బెంగాల్ | |
కేంద్రపాలిత ప్రాంతములు: అండమాన్, నికోబార్ దీవులు | చండీగఢ్ | దాద్రా నగరు హవేలీ | డామన్, డయ్యు | లక్షద్వీపములు | పుదుచ్చేరి | |
జాతీయ రాజధాని ప్రాంతము: ఢిల్లీ |