పల్నాటి యుద్ధము
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
పల్నాటి యుద్ధము ఆంధ్ర దేశములోని పల్నాడు ప్రాంతములో 1180 వ సంవత్సరములో జరిగినది. మహాభారతమునకు, పల్నాటి వీరుల చరిత్రకు దగ్గరి పోలికలు ఉండటము చేత దీనిని ఆంధ్ర భారతము అనికూడా అంటారు.
[మార్చు] సాహిత్యములో పల్నాటి యుద్ధము
పల్నాటి వీరుల చరిత్రను తొలిసారి శ్రీనాథుడు మూడు వందల సంవత్సరాల తర్వాత మంజరీ ద్విపద కావ్యముగా రచించాడు. ఇది ఆయన చివరి రచన. శ్రీనాథుని తర్వాత కొండయ్య, మల్లయ్య (16వ శతాబ్దము) అను కవులు రచించారు. ఆ తర్వాత 1862 ప్రాంతములో ముదిగొండ వీరభద్రకవి ఈ కథను వీర భాగవతము అను పేరుతో మనోహరమైన పద్యకావ్యముగా రచించాడు.
పల్నాటి వీరచరిత్రలో బాలచంద్రుని యుద్ధ ఘట్టము మాత్రమే శ్రీనాథుడు రచించాడని పరిశోధకుల అభిప్రాయము. మిగిలిన కథా భాగాలు కొండయ్య,మల్లయ్య రచించినవి. శ్రీనాథుడు పూర్తి గ్రంథము రచించిఉంటే అది కాలగర్భములో కలిసిపోయిందేమో తెలియదు. అక్కిరాజు ఉమాకాంతం మొట్టమొదట పల్నాటి వీరచరిత్ర యొక్క ప్రతులు సంపాదించి, సంస్కరించి 1911 లో అచ్చువేయించాడు. కొండయ్య, మల్లయ్య రచనలను కూడా చేర్చి సంపూర్ణ గ్రంథాన్ని సంస్కరించి 1961 లో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం ప్రచురించాడు.
[మార్చు] మూలములు
- పల్నాటి వీరచరిత్ర - రెంటాల గోపాలకృష్ణ (1971)