ర్యాలి

వికీపీడియా నుండి

జగన్మోహిని కేశవస్వామి గుడి
పెద్దది చెయ్యి
జగన్మోహిని కేశవస్వామి గుడి

ర్యాలి, తూర్పు గోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలానికి చెందిన గ్రామము. ఇది గోదావరికి ఉపనదులైన వశిష్ఠ, గౌతమిల నడుమ ఉంది. ఈ గ్రామములో ప్రసిద్ధ జగన్మోహిని కేశవస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ శివ కేశవ ఆలయాలు ఎదురెదురుగా ఉండటం విశేషం.

[మార్చు] చరిత్ర

  • మోహిని జడ నుండి రాలిన ఓ పువ్వు ఈ స్థలంలో పడటం వలన ఈ గ్రామానికి ర్యాలి అన్న పేరు వచ్చిందని ఇక్కడి వారు చెబుతారు.
  • 11వ శతాబ్దంలో ఈ ప్రదేశం ఓ అడవిలో భాగం. ఇది చోళరాజు ఆదీనంలో ఉండేది. ఒకసారి శ్రీ రాజవిక్రమదేవుడు వేటాడుతూ ఈ ప్రదేశానికి చేరుకున్నాడట. బాగా అలసిపోయి ఉండటంతో ఓ పొన్న చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఓ కల వచ్చిందట. ఆ కలలో శ్రీ మహా విష్ణువు తన గుడి అక్కడి భూగర్భంలోనే ఉందని చెప్పడంతో అక్కడ తవ్వించి చూస్తే విగ్రహం దర్శనమిచ్చిందంట. అప్పుడు ఈ గుడిని నిర్మించారంట.

[మార్చు] బాహ్య లింకులు