గోపవరం, ముసునూరు
వికీపీడియా నుండి
'గోపవరం' గ్రామము కృష్ణా జిల్లా ముసునూరు మండలంలో ఉన్నది. దగ్గరలో బలివే తిరణాలు జరిగే గూరు ఉన్నందున దీనిని బలివే గోపవరం (బలేగోపారం) అనికూడా అంటారు. పెదపాటివారి గూడెం దీని శివారు గ్రామము.
ఈ వూరిలో పుగాకు, మామిడి ప్రధానమైన పంటలు. ఇంకా కూరగాయలు, (కనకాంబరం)ఫూలు, వరి, కొబ్బరి, ప్రొద్దు తిరుగుడు వ్యవసాయం కూడా జరుగుతున్నది. ఈ మధ్యకాలంలో పామాయిల్ సాగు పెరుగుతున్నది. చుట్టుప్రక్కల అడవి భూముల్లో జీడిమామిడి తోటలు బాగా ఉన్నాయి. వ్యవసాయం ప్రధానంగా కరెంటు బావులద్వారా జరుగుతున్నది. చెరువులక్రింద కొద్దిపాటి వ్యవసాయం ఉన్నది.
ఈ వూరిలో వెంకటేశ్వరస్వామి గుడి, నాగేంద్రస్వామి గుడి ప్రధానమైన ఆకర్షణలు. ఒక బ్యాంకు, ఒక ప్రాధమిక పాఠశాల ఉన్నాయి. గోపవరం, ముసునూరు, కృష్ణా జిల్లా, ముసునూరు మండలానికి చెందిన గ్రామము
ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |