ఒంటిమిట్ట
వికీపీడియా నుండి
ఒంటిమిట్ట మండలం | |
---|---|
![]() |
|
జిల్లా: | కడప |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | ఒంటిమిట్ట |
గ్రామాలు: | 12 |
విస్తీర్ణము: | చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 29.79 వేలు |
పురుషులు: | 15.026 వేలు |
స్త్రీలు: | 14.764 వేలు |
జనసాంద్రత: | / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 65.13 % |
పురుషులు: | 78.67 % |
స్త్రీలు: | 51.38 % |
చూడండి: కడప జిల్లా మండలాలు |
ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లాకు చెందిన ఒక మండలము.కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 20 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఇక్కడ ఉన్న కోదండ రామాలయం వల్ల ఈ గ్రామానికి ప్రసిద్ధి వచ్చింది. ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16వ శాతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించాడు. "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి." అని కీర్తించాడు.
ఒక మిట్ట పైన ఈ రామాలయం నిర్మించబడింది. అందుకని ఒంటిమిట్ట అని ఈ రామాలయానికి, గ్రామానికి పేరు వచ్చింది. మిట్టను సంస్కృతంలో శైలమంటారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశైలపురి వాసినని చెప్పుకున్నాడు. అంతే గాక తన భాగవతాన్ని ఈ కోదండ రామునికి అంకితం గావించాడు. దాన్ని బట్టి, భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు. ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు. కాబట్టి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది. హనుమంతుడు లేని రామాలయం భారత దేశంలో ఇదొక్కటే.
ఈ కోదండ రామాలయానికి మూడు గోపురద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణముంది. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడినాయి. రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు (1863 - 1936) ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు. స్వామికి ఆభరణాలను చేయించడంతో బాటు రామసేవా కుటీరాన్ని నిర్మించాడు. పోతన, అయ్యలరాజు రామభద్రకవి, ఉప్పు గుండూరు వేంకట కవి, వర కవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు. వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందరం అను పేర వ్యాఖ్యానం కూడా వ్రాశాడు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల - రథం ఉన్నాయి.
ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు. 2002 బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో మహాకవి పోతన విగ్రహాన్ని ఆవిష్కరించారు.
[మార్చు] గ్రామాలు
- బ్రాహ్మణపల్లె (నిర్జన గ్రామము)
- చింతరాజుపల్లె
- దర్జిపల్లె
- గంగపేరూరు
- గొల్లపల్లె
- గుండ్లమడ (నిర్జన గ్రామము)
- జౌకులపల్లె
- కోనరాజుపల్లె
- కోటపాడు (నిర్జన గ్రామము)
- కుడుమలూరు
- కురుగుంట్లపల్లె (నిర్జన గ్రామము)
- మాధవరం (నిర్జన గ్రామము)
- మంగంపేట
- మంటపంపల్లె
- నారాయణరాజుపేట (నిర్జన గ్రామము)
- పెన్నపేరూరు
- పొన్నపల్లె (నిర్జన గ్రామము)
- రాచగుడిపల్లె
- ఒంటిమిట్ట
[మార్చు] కడప జిల్లా మండలాలు
కొండాపురం | మైలవరం | పెద్దముడియం | రాజుపాలెం | దువ్వూరు | మైదుకూరు | బ్రహ్మంగారిమఠం | బి.కోడూరు | కలసపాడు | పోరుమామిళ్ల | బద్వేలు | గోపవరం | ఖాజీపేట | చాపాడు | ప్రొద్దుటూరు | జమ్మలమడుగు | ముద్దనూరు | సింహాద్రిపురం | లింగాల | పులివెందల | వేముల | తొండూరు | వీరపునాయునిపల్లె | యర్రగుంట్ల | కమలాపురం | వల్లూరు | చెన్నూరు | అట్లూరు | ఒంటిమిట్ట | సిద్ధవటం | కడప | చింతకొమ్మదిన్నె | పెండ్లిమర్రి | వేంపల్లె | చక్రాయపేట | లక్కిరెడ్డిపల్లె | రామాపురం | వీరబల్లె | రాజంపేట | నందలూరు | పెనగలూరు | చిట్వేలు | కోడూరు | ఓబులవారిపల్లె | పుల్లంపేట | టి.సుండుపల్లె | సంబేపల్లి | చిన్నమండెం | రాయచోటి | గాలివీడు | కాశి నాయన