జొయంతో నాథ్ చౌదరి

వికీపీడియా నుండి

జనరల్‌ జొయంతో నాథ్ చౌదరి భారత దేశ 8వ పదాతి దళ సైన్యాధ్యక్షుడు. పద్మ విభూషణ పురస్కార గ్రహీత మరియు హైదరాబాదు రాష్ట్ర తొలి సైనిక అధ్యక్షుడు. ఈయన భారత జాతీయ కాంగ్రేస్ అధ్యక్షుడు డబ్ల్యూ.సి.బెనర్జీ మనుమడు. ఈయన తండ్రి అమియ నాథ్ చౌధరీ ప్రఖ్యాత బెంగాలీ బారిష్టరు.

చౌదరి ప్రస్తుతము బంగ్లాదేశ్లో ఉన్న పబ్నా జిల్లాలోని హరీపూర్ లో 1908లో జన్మించాడు.

జనరల్ చౌదరి నేతృత్వములో సెప్టెంబర్ 12, 1948 భారత సైన్యము హైదరాబాదుపై సైనిక చర్య జరిపి నిజాంను గద్దె దించి హైదరాబాదును భారతదేశములో విలీనము చేసుకొన్నది. సెప్టెంబర్ 18న ఆపరేషన్ పోలోను విజయవంతమైనదిగా ప్రకటించి మేజర్ జనరల్ చౌదరిని హైదరాబాదు రాష్ట్ర తొలి సైనిక పాలకునిగా నియమించారు.

జనరల్ చౌదరి నవంబర్ 19, 1962 నుండి జూన్ 7, 1966 వరకు పదాతి దళ 8వ సర్వసైన్యాధ్యక్షునిగా భాధ్యతులు నిర్వహించాడు.

[మార్చు] బయటి లింకులు

ఇతర భాషలు