సిద్ధవటం
వికీపీడియా నుండి
సిద్ధవటం మండలం | |
---|---|
![]() |
|
జిల్లా: | కడప |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | సిద్ధవటం |
గ్రామాలు: | 18 |
విస్తీర్ణము: | చ.కి.మీ |
జనాభా (2001 లెక్కలు) | |
మొత్తము: | 35.261 వేలు |
పురుషులు: | 17.936 వేలు |
స్త్రీలు: | 17.325 వేలు |
జనసాంద్రత: | / చ.కి.మీ |
జనాభా వృద్ధి: | % (1991-2001) |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 61.68 % |
పురుషులు: | 75.92 % |
స్త్రీలు: | 46.95 % |
చూడండి: కడప జిల్లా మండలాలు |
సిద్ధవటం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లాకు చెందిన ఒక మండలము. కడప నుంచి భాకరాపేట మీదుగా బద్వేలు వెళ్ళే మార్గంలో పెన్నా నది ఒడ్డున సిద్ధవటం ఉంది. కడప నుంచి ఇక్కడికి 20 కి.మీ. దూరం. సిద్ధులు నివసిస్తున్న వట వృక్షాలు (మఱ్ఱి చెట్లు) విస్తారంగా ఉన్నందున ఈ ప్రాంతానికి సిద్ధవటం అని పేరు వచ్చింది. సిద్ధవటం పరిసర ప్రాంతాల్లో జైనులు నివసిస్తూ ఉండేవారు. 1807 నుంచి 1812 వరకు సిద్ధవటం జిల్లా కేంద్రంగా ఉండేది. అయితే పెన్నానది పొంగినప్పుడల్లా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతూ ఉండడంతో జిల్లా కేంద్రాన్ని అక్కడి నుంచి కడపకు మార్చారు. 1956లో సిద్ధవటం కోట పురావస్తుశాఖ ఆధీనంలోకి వచ్చింది. సిద్ధవటం సమీపంలో ఏటి పొడవునా దేవాలయాలున్నాయి. రంగనాథస్వామి ఆలయం చెప్పుకోదగినది. ఇక్కడి ష్మశానవాటికలో భాకరాపంతులు పేర నిర్మించిన 16 స్తంభాల మంటపం ఉంది. సిద్ధవటం దోసకాయలకు ప్రసిద్ధి.
[మార్చు] సిద్ధవటం కోట
ఇక్కడ మధ్యయుగం నాటి కోట ఒకటి ఉంది. దక్షిణం వైపు పెన్నా నది, మిగిలిన మూడు వైపుల లోతైన అగడ్తతో శతృవులు ప్రవేశించేందుకు వీలు కాని రీతిలో ఈ కోట నిర్మించబడింది.
చరిత్ర: మట్లి రాజులు నాయంకరంగా ఈ కోటను పాలించే నాటికి ఇది మట్టి కోట. శ్రీ కృష్ణదేవరాయల అల్లుడు వరదరాజు మొదట ఈ కోటను పాలించాడు. అంతకు ముందు ఈ కోట ఉదయగిరి రాజ్యంలో ఉండేది. రెండవ వెంకటపతిరాయలకు మట్లి ఎల్లమరాజు యుద్ధాల్లో బాగా సహకరించాడు. అందుకు గుర్తుగా ఎల్లమరాజుకు అమరనాయంకరంగా సిద్ధవటాన్ని ఇచ్చాడు. మరికొన్ని ప్రాంతాలను సిద్ధవటానికి చేర్చాడు. మట్లి అనంతరాజు మట్టికోటను శతృదుర్భేద్యమైన రాతికోటగా నిర్మించాడు. ఈయన తన తండ్రి పేర ఎల్లమరాజు చెరువును, తన పేర అనంతరాజు చెరువును త్రవ్వించాడు. అనంతరాజు 'కకుత్స్థ విజయము ' అనే కావ్యాన్ని రచించాడు. ఈయన ఆస్థానంలో ఉప్పుగుండూరు వెంకటకవి, కవి చౌడప్ప ఉండేవారు.
మట్లి రాజుల పతనం తర్వాత ఔరంగజేబు సేనాని మీర్ జుమ్లా సిద్ధవటాన్ని ఆక్రమించి పాలించాడు. ఆ తర్వాత ఆర్కాటు నవాబులు సిద్ధవటాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడపను పాలిస్తున్న అబ్దుల్ నబీఖాన్ 1714లో సిద్ధవటాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొన్నాడు. మయానా నవాబులు సిద్ధవటాన్ని పాలించారు. 1799లో సిద్ధవటం ఈస్టిండియా కంపెనీ వశమయింది.
కోట: కోటకు పడమట, తూర్పున రెండు ద్వారాలున్నాయి.ముఖద్వారం ఇరువైపులా ఆంజనేయుడు, గరుత్మంతుడు శిల్పాలు ఉన్నాయి. పశ్చిమ ద్వారం ఇరువైపులా నాట్య భంగిమలో అందమైన శిల్పాలు ఉన్నాయి. పశ్చిమ ద్వారం లోపలి పైభాగాన రాహు గ్రహణం పట్టువిడుపులు ఉన్నాయి. కోట మధ్య భాగంలోని అంతఃపురం శిథిలమై ఉంది. రాణి దర్బారు, ఈద్గా మసీదు, సమీపంలో నగారాఖానా ఉన్నాయి. నగారాఖానా వెనుక కోట గోడకు మధ్య తాగునీటి కోనేరు ఉంది. కోటలో సిద్ధవటేశ్వరస్వామి ఆలయం, ఎదురుగా నంది విగ్రహం ఉన్నాయి. శిథిలమవుతూ ఉన్న కామాక్షి ఆలయాన్ని మరమ్మత్తులు చేసి ఉంచారు. తూర్పు ద్వారానికి సమీపంలో బిస్మిల్లా షావలి దర్గా ఉంది. టిప్పు సుల్తాన్ కాలంలో దీన్ని నిర్మించారు. ప్రక్కనే మసీదు ఉంది. మసీదుకు తూర్పుగా కోటగోడలో సొరంగ మార్గాన్ని ఏట్లోకి నిర్మించారు. చక్రయంత్రం ద్వారా ఏట్లో నీటిని మసీదు తొట్టిలోకి తోడేవారు.
[మార్చు] గ్రామాలు
- గుండాలమూల
- జంగాలపల్లె
- జ్యోతి
- కడపాయపల్లె
- కనుమలోపల్లె
- లింగంపల్లె
- మాచుపల్లె
- మండపల్లె
- మూలపల్లె
- నేకనాపురం
- పెద్దపల్లె
- పొన్నవోలు
- ఎస్.రాజంపేట
- శాకరాజుపల్లె
- సిద్ధవటం
- తక్కోలు
- వెలుగుపల్లె
- వొంతటిపల్లె
[మార్చు] కడప జిల్లా మండలాలు
కొండాపురం | మైలవరం | పెద్దముడియం | రాజుపాలెం | దువ్వూరు | మైదుకూరు | బ్రహ్మంగారిమఠం | బి.కోడూరు | కలసపాడు | పోరుమామిళ్ల | బద్వేలు | గోపవరం | ఖాజీపేట | చాపాడు | ప్రొద్దుటూరు | జమ్మలమడుగు | ముద్దనూరు | సింహాద్రిపురం | లింగాల | పులివెందల | వేముల | తొండూరు | వీరపునాయునిపల్లె | యర్రగుంట్ల | కమలాపురం | వల్లూరు | చెన్నూరు | అట్లూరు | ఒంటిమిట్ట | సిద్ధవటం | కడప | చింతకొమ్మదిన్నె | పెండ్లిమర్రి | వేంపల్లె | చక్రాయపేట | లక్కిరెడ్డిపల్లె | రామాపురం | వీరబల్లె | రాజంపేట | నందలూరు | పెనగలూరు | చిట్వేలు | కోడూరు | ఓబులవారిపల్లె | పుల్లంపేట | టి.సుండుపల్లె | సంబేపల్లి | చిన్నమండెం | రాయచోటి | గాలివీడు | కాశి నాయన