ప్రాచీన భారత దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాకేంద్రాలు
వికీపీడియా నుండి
విషయ సూచిక |
[మార్చు] కనౌజ్
ఇది హిందూ విద్యాకేంద్రముగా విలసిల్లినది. ముఖ్యముగా యశోవర్థనుడు దీని ప్రాముఖ్యతలో ప్రశంశనీయమైన స్థానం వహించినాడు. ఇతను దీనిని సుమారుగా క్రీస్తు శకం 675 నందు అభివృద్ది చేసినాడు. ఇక్కడ ముఖ్యమైన అభివృద్ది పూర్వ మీమాంస. ఇక్కడి ప్రముఖ గురువులు బహుభూతి, అతని గురువు కుమార లీలాభట్టు.
[మార్చు] కంచి
కంచి మరొక ప్రముఖ విద్యా కేంద్రం. ఇక్కడ హుయాన్ త్సాంగ్ వచ్చినప్పుడు ధర్మపాల అను పండితుడు నూరుమంది సింహళ దేశ పండితులను ఓడించినాడు, ఈ వాదం ఒక వారం రోజులు జరిగినది.
[మార్చు] కాశి
కాశీ లేదా బెనారస్, ఓ ప్రముఖ విద్యా కేంద్రం. ముఖ్యముగా ఏడవ శతాబ్దం నుండే దీనిలో విద్యా సువాసనలు దేశమంతా వ్యాపించినాయి. అశోకుని కాలంలో దీని ఖ్యాతి దశదిశలా వ్యాపించినది. ఇక్కడ పదిహేను వందల మంది బౌద్ద సన్యాస విద్యార్థులు ఉండేవారు. పన్నెండవ శతాబ్దం అరకూ ఇది బౌద్ద విద్యా క్షేత్రంగా ఉండేది, తరువాత హిందూ విద్యా నిలయంగా మారినది. పదకుండవ శతాబ్దంలో ఇది ప్రముఖ స్థానం వహించినది. శంకరావార్యులు కూడా ఇక్కదికి వచ్చి ఇక్కడి పండితులను ఓడించినారు. ఇక్కడి పండితులతో వాదన ఓ ప్రముఖమైన ప్రక్రియ. దక్షినాది నుండి చాలా మంది పండితులు వచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్బరు, షాజహాను, ధారా వంటి ముస్లిం ప్రభువులు కూడా దీనికి ధన సహాయం చేసినారు.
[మార్చు] మిథిల
మిథిల లేదా విదేహ, ప్రాచీన కాలం నుండి ఓ ప్రముఖ విద్యా కేంద్రము. ఇక్కడి జనకుదు జగద్విఖ్యాతుడు. తరువాత కామేశ్వర వంశం (1350 - 1515) కాలంలో మరింత ప్రసిద్ది పొందినది. ఇక్కడి జగద్దర పండితునికి చాలా కీర్తి ఉన్నది. ప్రముఖ కవి విద్యాపతి కూడా ఇక్కడి వాడే. న్యాయ విభాగం యొక్క అభివృద్ది ఇక్కడ జరిగినది. దీనిని గంగేశ పండితుడు మరియూ పక్షధార పండితుడు కలిసి అభివృద్ది చేసినారు.
ఇక్కడ పరిక్ష పద్దతులలో ఓ చమత్కారం ఉన్నది, ఓ పెద్ద పుస్తకాన్ని తెచ్చి ఓ సూదిని దానిలోనికి గుచ్చుతారు, ఆ సూది ఎంతవరకూ వెళ్తే ఆ తరువాత తాళ పత్రాన్నుండి ప్రశ్నలు వేస్తారు. దీనిని శాలక పరిక్ష అనేవారు.
[మార్చు] నదియ
లక్ష్మణ సేన పండితుడు, 1106 - 1138, ఇక్కడివాడు. హల్యాయుద్ద అను గొప్ప జ్ఞాని మరియూ ప్రధానమంత్రీ, శూల పాణి అను న్యాయ శాస్త్ర నిపుణుడు, గీతా గోవిందం విరచించిన జయదేవ కవీ ఇక్కడివారే.
నదియా భారత సాంఘీక వ్యవస్తలో జోక్యం చేసుకోని ముస్లిం పరిపాలకుల కాలంలో చాలా ప్రఖ్యాతి వహించినది. ఇందు హిందూ శాస్త్ర పరిశోధనకూ, వాగ్యుద్దాలకూ, వేదికగా నిలిచినది. ఈ కాలంలో మిథిల చాలా జటిలంగా తయరయింది. ఎందుకంటే అక్కడనుండి ఏ శాస్త్రాన్నీ కూడా బయటకు పంపేవారు కాదు. కనీసం చిన్న తాళపత్ర గ్రంథాన్ని కూడా పంపించేవారు కాదు. ఇటువంటి పరిస్థితులలో నదియాకి చెందిన ప్రఖ్యాత సార్వభౌమ భట్టారకుడు రెండు పుస్తకాలను మిథిలలో చదివి తరువాత వాటిని తు చ తప్పకుండా లిఖించినారు. ఈ సార్వభౌమ భట్టారకుడినే నిమాయి పండితుడుగా పేరుగాంచిన శ్రీ చైతన్య మహా ప్రభువు వాదనలో ఓడించినాదు. ఈ వివరాలు చైతన్య చరితామృతం మరియూ చైతన్య భాగవతం అను పుస్తకాలలో చెప్పబడినాయి.
[మార్చు] నలంద
ఆహా! నలందా ఖ్యాతి తెలియనిది ఎవరికి? దేశ విదేశాలనుండీ ఇక్కడికి పండితులు వచ్చేవారు, విద్యార్థులు వచ్చేవారు. వైశాల్యంలోకానీ, సంఖ్యలలో కానీ గుణంలోకానీ, నిర్వహణలో కానీ ఇది ఇప్పటి విశ్వవిద్యాలయాలకు ఏమాత్రం తీసిపోదు.
===భవనాలు=== పాట్నాకు నలభై మైళ్ళ దూరంలో దక్షిణంగా ఉండేది. ఇక్కడి త్రవ్వకాల ఆధారంగా ఓ మైలు పొడవు, అరమైలు వెడల్పు ఉన్న ఓ పెద్ద భవనము ఉండేదని నిర్థారణ అవుతున్నది. ఏడు హాళ్ళు కల పెద్ద కేంద్ర కాలేజీ, మూడు వందల చిన్న తరగతి గదులూ కలవు. ఎన్నో అంతస్తులు కల అద్భుతమైన నిర్మాణం ఇది.
ఇక్క నివాస వసతులు అన్నీ రెండంతస్తుల భవనాలు. ఇందు ఒకటి లేదా రెండు మంచాలు కల గదులు కలవు. ఇక్కడి వంటశాల చాలా పెద్దది.
[మార్చు] ఆదాయ మార్గాలు
దీనికి ఆదాయ వనరులుగా రెండు వందల గ్రామాలు ఉండేవి, అంతే కాకుండా రాజులు, ధనికులు ఇతోధికంగా సహాయం చేస్తుండేవారు.
[మార్చు] వస్తౌలు
ఇక్కడి విద్యార్థులకు పూర్తిగా ఉచిత భోజనం, వసతి, బట్టలూ ఇచ్చేవారు.
[మార్చు] విద్యార్థుల సంఖ్య
హుయన్ త్సాంగ్ చెప్పిన ప్రకారం ఏడవ శతాబ్దంలో ఇక్కడ సుమారుగా పదివేల మంది విద్యార్థులు ఉండేవారు.
[మార్చు] గ్రంథాలయం
ఇక్కడ ఓ పెద్ద గ్రంథాలయం ఉండేది, చైనా విద్యార్థులు ఎన్నో నకల్లు ఇక్కడనుండి తయారు చేసుకోని వెళ్ళేవారు.
[మార్చు] పాఠ్యాంశాలు
ఇది ముఖ్యముగా మహాయాన తెగకు చెందినది, అయినా హీనాయాన కూడా భోధించేవారు. హిందూ మత విషయములు కూడా బోధించేవారు. తరువాత వ్యాకరణము, లాజిక్, సాహిత్యం, వేదాలు, వేదాంతాలు, సాంఖ్య మొదలగున్నవి భోధించేవారు.
[మార్చు] టీచర్ల సంఖ్య
ఇక్కడ సుమారుగా వెయ్యి మంది మంచి అనుభవం కల సన్యాస ఉపాధ్యాయులు ఉండేవారు. ప్రైతోజూ నూరు తరగతులు ఉండేవి, విద్యార్థులు ఎన్నుకోవచ్చు.
[మార్చు] తక్ష శిల
ఇది రావల్ఫిండి నుండి పశ్చిమంగా ఇరవై మైళ్ళ దూరంలో ఉండేది. ఇది గాంధార రాజ్యానికి రాజధాని. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలోనే ఇక్కద్ ప్రముఖమైన నిర్మాణాలు ఉండేవి అనడానికి ఆధారాలు ఉన్నాయి. అలెక్షాండరు ఇక్క్కడ చాలా గొప్ప తత్వ శాస్త్ర పండితులను తన రాజ్యానికి తీసుకొని వెళ్ళీనాడు. ఇది ఓ పెద్ద విశ్వ విద్యాలయంలాగా కాకుండా, చిన్న చిన్న సంస్థలు ఓ వ్యక్తి ద్వారా నడపబడుతూ ఉండేవి. ఎక్కువలో ఎక్కువ ఇక్కడ ఓ సంస్థకు ఐదు వందల మంది విద్యార్థులు ఉండేవారు. ఇక్కడ కేవలం ఉన్నత విద్య మాత్రమే లభించేది. కేవలం జిజ్ఞాసులు, అధికమైన జ్ఞానము కలవారు మాత్రమే ఇక్కడికి మరింత జ్ఞానానికి వెళ్ళేవారు.
[మార్చు] పాఠ్యాంశాలు
తత్వ శాస్త్రము, పద్దెనిమిది శిల్పాలు, వైద్యము, శస్త్ర చికిత్స, విలు విద్య, ఖగోళ శాస్త్రము, జ్యోత్శ్శాస్త్రము, రేఖా గణితము, భూగోళ శాస్త్రము, ఆర్థిక శాస్త్రము, వ్యవసాయము, మాజిక్, నాట్యం, బొమ్మలు వేయుట
[మార్చు] వల్లభి
ఇది ఒక పురాతన విశ్వ విద్యాలయం. ఇది క్రీసు శకం ఐద్వ శతాబ్దం నుండి క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం వరకూ ప్రఖ్యాతి గాంచినది. ఇది హీనయాన బౌద్ద మతానికి చెందినది. ఇక్కడ ధర్మ, మత విషయాలు, నీతి చిషయాలు ఆయుర్వేదం ణోధించేవారు.
[మార్చు] విక్రమశిల
దీనిని ధర్మపాల మహారాజు ఎనిమిదవ శతాబ్దంలో అభివృద్ది పరచినాడు. నాలుగు శతాబ్దాలు ఇది అంతర్జాతియ స్థాయిలో ప్రఖ్యాతి వహించినది. ముఖ్యముగా టిబెట్ నకు ఇక్కడికీ మంచి సంభంధాలు ఉండేవి. ఇక్కడ పన్నెండవ శతాబ్దంలో సుమారుగా మూడువేల విద్యార్థులు ఉండేవారని తెలుస్తుంది. ఇక్కడ ఉన్న గ్రంథాలయం చాలా పెద్దది. ఇక్కడ మంచి నిర్మాణాత్మక నిర్వహణ ఉండెది. కానీ ఖిల్జీ దీనిని ఓ కోటగా పొరబడి నాశనం చేసినాడు, అని చెప్తారు.
ఇందు డిగ్రీలూ, డిప్లమాలు ఇచ్చేవారు!