సిద్దేంద్ర యోగి
వికీపీడియా నుండి
విషయ సూచిక |
[మార్చు] సిద్దేంద్ర యోగి
[మార్చు] కాలం
1672 - 1685
[మార్చు] రచనలు
- భామా కలాపం
- గొల్ల కలాపం
[మార్చు] విశేషాలు
వీరు కూచిపుడి గ్రామానికి చెందినవారు, కూచిపుడి నృత్య ప్రదర్శకుకు
వీరు గురించి ఒక కథ ప్రచారంలో ఉన్నది, వీరు కాశీ లో చదువుకుంటున్నప్పుడు, భార్య గర్బదానానికి సిద్దమైనది అని కబురు వస్తుంది, యువ రక్తంలోని సహజ సిద్దమైన తొందరతో వేగంగా, ఆతురతతో, ఉత్సాహంగా బయలుదేరి వస్తాడు, కానీ కూచిపుడి దగ్గరకు రాగానే కృష్ణ పొంగుతుంది పరవళ్ళు తొక్కుతూ, ఉర్కలమీద అయినా సిద్దేంద్ర గారు నది ఈదుదామని లోనికి దుముకుతారు. కానీ దురదృష్టవశాత్తూ నది మద్యలోకి రాగానే మునిగిపోసాగినాడు ఇహ చావు తప్పదు అని అనుకొని "కనీసం పుణ్యమైనా వస్తుందని" అక్కడికక్కడే సన్యాసం తనంతట తనే మంత్రం చెప్పుకొని స్వీకరిస్తాడు. సంసారసాగరాన్ని దాటించగల ఆ కృష్ణ భగవానుడు, కృష్ణా నదిని కూడా దాటిస్తాడు.
ఇహ ఇంటికి వెళ్ళి పీటలపై కూర్చోమంటే సిద్దేంద్రుని భార్య "ఇతనెవరో గడ్డాలు, మీసాఅలు ఉన్న సన్యాసి, నా మొగుడు కాదు అని పీటలపై కూర్చోదు. అప్పుడు సిద్దేంద్ర జరిగిన కథ చెప్పి భార్యకి కృతజ్ఞతలు చెప్పి, మరళా పెద్దలందరి అనుమతితో సన్యాసం తీసుకుంటాడు। తరువాత కూచిపూడి నృత్యానికి ఆద్యుడై భామా కలాపం రచించినాడు। తన ఊరిలోని మగవారితోనే ఆడవేషాలు వేయించినాడు। తెలుగువారికి చిరస్మరణీయుడైనాడు।
హంసలదీవి దీవి సుబ్బారావు గారు రచించిన కవితల పుస్తకం నుండి
చెప్పబోయేది
సుమారు మూడు వందల యేబది యేళ్ళ క్రితం సంగతి
చదువు కోసం కాశీ వెళ్ళి
కూచిపూడి నుండి ఓ అబ్బాయి
అక్కడే వున్నాడు పదిపన్నెండేళ్ళు
అక్కడుండగా వచ్చింది కబురు
ఇంటి దగ్గర భార్య ఈడేరిందనీ
గర్భాదానానికి ముహూర్తం కూడా కుదిరిందనీ
ఇంకేం బయలుదేరాడు సంతోషంగా
ఉరుకులు పరుగులు దారంతా
ఊరు దగ్గర పడుతుండగా
కృష్ణ కనిపించింది వురవళ్ళు పరవళ్ళుగా
యువకుడు గదా
దిగాడు ధైర్యం చేసి
తెలిసింది గాదు వరద వుధృతం దిగాక గాని
సగం దూరం పనికి వచ్చింది వచ్చిన ఈత
ఇక ఖాయమనుకొన్నాడు మునక
సన్యాసం పుచ్చుకొన్నాడు అక్కడికక్కడ
తనకు తానే మంత్రం చెప్పుకొని
పోయే ముందు పుణ్యమన్నా దక్కుతుందని
ఒకే సారి జరిగాయి
అట్లా ఆయన చేతులెత్తేయటం
ఇట్లా ఒక పెద్ద కెరటం వచ్చి ఒడ్డుకు తోసెయ్యటం
ఇంటికొచ్చి పడ్డాడు
బ్రతుకు జీవుడా అంటూ
పీటల మీదకొచ్చి కూర్చోవాల్సిన భార్య
ససేమిరా రానన్నది
అనుకొన్న ముహూర్తానికి
ఈయన ఎవరో గడ్డాలూ మీసాలూ ఉన్న సన్యాసిగాని
నా భర్తకాదు పొమ్మన్నది
అంతా తలో మాటా అన్నారు
చిన్నపిల్ల మంకుపట్టు పట్టిందని కొందరు
గాలో ధూళో సోకిందని ఇంకొందరు
ఆ పిల్లదొక్కటే పాట
ఎవరెన్ని అన్న
ఈయనెవరో సన్యాసి
నా భర్త కానే కాదు అని
అప్పుడు
పీటల మీద కూర్చొన్న యువకుడు
పంచె వుత్తరీయం తీసి పక్కన పెట్టాడు
వట్టి గోచీతో లేచి నుంచొన్నాడు
అక్కడున్న పెద్దలందరికీ నమస్కారాలు చెప్పాడు
వరదతో వున్న కృష్ణను
దాటలేక పోయిన వైనమూ
ఆఖరు క్షణంలో
ఆతుర సన్యాసం తీసుకొన్న తీరూ
దాచకుండా చెప్పాడు
ఇంకా
శ్రీ కృష్ణ భగవానుడే తనను
సంసారం నుండి రక్షించి ఒడ్డున పడేశాడనీ
తన భార్యే తనను
అధోగతి పాల్గోకుండా రక్షించిందనీ
చెప్పాడు
అట్లా చెప్పి అన్ని విషయాలు
సన్యాసం స్వీకరించాడు యథావిధిగా
అందరి అంగీకారంతో మరలా
అతడే యోగి సిద్దేంద్రుడు
జగన్నాటకంలో నిమిత్తమాత్రుడు
యౌవనంలో శృంగార వాంఛ పూర్తిగా పోక
అది పోయేటందుకుగా
శృంగార రసప్రధానంగా
సత్యభామా శ్రీ కృష్ణులు నాయికా నాయకులుగా
పారిజాతాపహరణం యక్షగానం కూర్చాడనీ
అదే భామకలాపమనీ
ఆ వూరి మగవాళ్ళతోనే వేషం కటించి ఆడింపజేస్తూ వచ్చాడనీ
చెబుతారు విజ్ఞులు