హరిదాసుపురం
వికీపీడియా నుండి
హరిదాసుపురం, శ్రీకాకుళం జిల్లాలోని నందిగం మండలంలోని గ్రామము. ఇది ప్రధానముగా వ్యవసాయిక గ్రామము. ఈ గ్రామానికి తూర్పున విష్ణు దేవాలయము, సుప్రసిద్ధమైన శ్రీ శ్రీ అసిరి పొలమ్మ గ్రామదేవత దేవాలయము, శివదేవాలయము మరియు పలు గ్రామదేవత ఆలయములు కలవు. ఈ గ్రామము నుంచి కవులు, వైద్యులు, ఇంజినీర్స్, ఉపాధ్యాయులు మరియు ఇతర ఉన్నత విధ్యావంతులు దేశ విదేశములలో ఉన్నారు. ఈ గ్రామంలో ముఖ్యంగా కళింగ, బంగారు, వడ్రంగి, ఫొందర, రజక, మంగల మరియు హరిజనులు కలిసిమెలిసి జీవనము సాగిస్తున్నారు.