ఆర్యసమాజ్
వికీపీడియా నుండి
విషయ సూచిక |
[మార్చు] ఆర్యసమాజము
- ఆర్యసమాజము 10 ఏప్రిల్ 1875 న , బొంబాయి (ముంబాయి) లో మహర్షి స్వామి దయానంద సరస్వతి చే స్థాపించబదినది, ఆర్యులనగా శ్రేష్ఠులు.
- ఆర్యసమాజము స్వాతంత్ర్యానికి పూర్వం స్థాపించబడినది. హిందు ధర్మాన్ని సమస్త మూఢనమ్మకాలకు దూరముగా, మరియు వేదాలకు దెగ్గరగా తీసుకెల్లడమే దీని
[మార్చు] ముఖ్యోద్దేశ్యము
- ఆర్యసమాజ సిద్ధాంతము ఎల్లప్పటికిని, " కృణ్వం తో విశ్వమార్యం " ,అనగా.. సమసమాజ స్థాపన.
- ఆర్యసమాజనికి మూలము వేదాలు, వాటి బోధనలను పది సూత్రాలుగా క్రోఢీకరించారు.
- ఆర్యసమాజము అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే. వైదిక ధర్మాన్ని గ్రహించుట, కాపాడుట మరియు ప్రచారం చేయుటకు ఎప్పటికి యత్నించుచున్నది.
- ఆర్యసమాజము నేడు ప్రపంచమంతటయు వ్యాపించి యున్నది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, గయానా, మెక్సికో, బ్రిటన్, నెదర్ల్యాండ్స్, కెన్యా, టాంజేనియా, దక్షిణ ఆఫ్రికా, మారిషియస్, పాకిస్తాన్, బర్మా, సింగాపుర్, హంగ్కాంగ్ లలోనేకాక ఇంకా చాలా దేశాలలో ఆర్యసమాజము విస్తరించియున్నది.
- ఆర్యసమాజము వేదాలు మరియు ఉపనిషత్తులలో మనిషికి కావలసిన సమస్త మరియు అచ్యుత్త జ్ఞానము ఇమిడి ఉన్నదని గ్రహించినది. వేదములలో భూత, భవిష్యత్తులే కాకుండా, సరిగా అవగాహన చేసుకుంటే గణిత , రసాయన, సాంకేతిక, సైనిక శాస్త్రాల్లోని చాలా సూక్ష్మాలు తెలుసుకున వచ్చును.
[మార్చు] సమాజములో ఆర్యసమాజము
- వేదాలు చేప్పిన దాన్నిబట్టి చూస్తే మన భారతీయ సంస్కృతి ఇప్పుడు కనిపిస్తున్నదాని కన్నా భీన్నముగా ఉండేది అని నమ్ముతుంది.
- మూర్తిపూజ, హిందు సంస్కృతి పై బ్రాహ్మణ పూజారుల పెత్తనం అసమర్థిస్తుంది.
- స్త్రీ లకు, హరిజనులకు స్వాతంత్ర్యం, విద్యను సమర్థిస్తుంది.
- దేశము నలుమూలలా పాఠశాలలు స్థాపించినది.
- స్త్రీ పురుషుల సమాన హక్కులకై పోరాడింది.
- మూర్తి పూజ, నరబలి, సతి సహగమనము అసమర్థించినది.
- సమస్త సత్య విద్యల గ్రంథమైన " సత్యార్థ ప్రకాశ్ " ను ప్రచారము చేసినది.
- భారత వర్షాన్ని విస్తృత మరియు సమ సమాజముగా తిర్చిదిద్దాలనుకుంటుంది, దీనికి సమాధానము పాశ్చాత్తీకరణ లేదా నవీనీకరణ కాదని తిరిగి వేదాలవైపు చూపుతున్నది.
- సమజ్ లక్ష్యం భారత వర్షానికి సంఘీక మరియు ధర్మ సంస్కరణ
- సమజ్ హిందువులకు హిందు ధర్మం పట్ల అవగాహన, అభిమానము పెంచడానికి ప్రయత్నించింది.
- హిందు ధర్మంపట్ల ప్రమాణాల వలన సమాజ్ కేవలం హిందువులనే ఆకర్షించింది. ముసల్మానులు మరియు హిందు లౌకికవాదులకు దూరమైనది.
- భారత చరిత్రలో కాలక్రమేణ సమాజ్ ఎంతోమంది ప్రముఖ స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణకలిగించినది.
- ఆర్యసమాజ్ శాఖల పరిధులలో ని యువకుల తో ఆర్యవీర్ దళ్ ను స్థాపించినది. ఇందులో యువకులకు ఆత్మరక్షణ, యోగాభ్యాసం లో శిక్షణ ఇచ్చేవారు. స్వాతంత్ర్య పోరాటంలో, తెలంగాణ సాయుధ పోరటం సమయంలో ఆర్యవీర్ దళ్ త్యాగాలు ఎనలేనివి.
[మార్చు] బృహత్కార్యములు
- అజ్ఞానము, దారిద్యము, అన్యాయమును నిర్మూలించుట. ఈ బృహత్కార్యచరణ కై పది సూత్రాలను క్రోఢీకరించినది.
- నాలుగు వేదాలైన ౠగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము లే ఆర్యసమాజానికి నాలుగు స్థంబములు.
- భగవంతుడు ఒక్కడే, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞానానికి మూలము, దయాలు, ఆనందమయుడు అని నమ్ముతుంది.
- ఓంకారమే నినాదముగా, " సత్యార్థ ప్రకాశ్ " ను సమస్త సత్య విద్యల గ్రంథముగా భావిస్తున్నది.
- విద్య ఆర్యసమాజము యొక్క ముఖ్యోద్దేశ్యము. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య సమకూర్చడంలో భారత దేశములో ముఖ్యమైనవాటిలో ఆర్యసమాజ్ ఒకటి
- సరిహద్దులుదాటి ఎన్నో దూరతీరాలు చేరుతున్న భారతీయుల్లో పలువురు ఆర్యసమాజ విలువలు సిద్ధాంతాలను కూడా వెంట తీసుకుని వెళ్లారు.
- వలసవెళ్లిన దేశాల్లో, ఆర్యసమాజ శాఖలు స్థాపించి, సత్కార్యములు కొనసాగిస్తూ వారి సంతతికి వైదిక ధర్మం, భారతీయ సంస్కృతి గూర్చి బోధిస్తున్నారు, అటుపిమ్మట వారి విశ్వాసాలను, సంప్రదాయలను కొనసాగించుటకు ప్రేరేపి్స్తున్నారు.
[మార్చు] వైదిక దినచర్య
- ప్రాత ః స్మరణ
- సంధ్యా వందనము (గాయత్రీ మంత్రము తో మొదలవుతుంది)
- హవనము
- భజనములు
- సత్సంగము
[మార్చు] ఆర్యసమాజముతో ప్రేరణ పొందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు
- లాలాలజపతి రాయ్
- రాం ప్రసాద్ బిస్మిల్
- చంద్ర శేఖర్ ఆజాద్
- వీర సావర్కర్
[మార్చు] ఆర్యసమాజ ప్రముఖులు
- మహర్షి స్వామి విరజానంద సరస్వతి (దయానంద సరస్వతి గురువు)
- మహర్షి స్వామి దయానంద సరస్వతి (ఆర్యసమాజ్ స్థాపకుడు)
- స్వామి రామానందతీర్థ
- శ్రద్ధానంద సరస్వతి
- పండిత గోపదెవ్ శాస్త్రి
- పండిత్ నరేంద్రజీ (హైదరాబాద్ లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు)