తంజావూరు

వికీపీడియా నుండి

బృహదీశ్వరాలయము
పెద్దది చెయ్యి
బృహదీశ్వరాలయము

తంజావూరు దక్షిణ భారత దేశము నందలి తమిళనాడు రాష్ట్రములోని ఒక పట్టణము. ఈ పట్టణము కావేరి నది దక్షిణ ఒడ్డున ఉన్నది. చెన్నై నుండి 218 మైళ్ళ దూరంలో ఉన్నది. తంజావూరు జిల్లాకు ఈ పట్టణము రాజధాని.

తంజావూరునకు ఈ పేరు తంజన్‌-అన్‌ అను రాక్షసుని నుండి వచ్చినది. ఈ రాక్షసుడు శ్రీ ఆనందవల్లి అమ్మ మరియూ శ్రీ నీలమేగప్పెరుమాల్‌ ల చేత చంపబడ్డాడు. ఆ రాక్షసుని చివరి కోరికపై ఈ పట్టాణానికి తంజావూరు అని పేరు పెట్టినారు.

విషయ సూచిక

[మార్చు] చూడవలసిన ప్రదేశాలు

తంజావూరు, రాజ రాజ చోళుడు కట్టించిన ఇక్కడి బృహదీశ్వరాలయమునకు ప్రసిద్ది. యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశములలో ఈ దేవాలయము కూడా ఉన్నది. ఈ దేవాలయములో సుభ్రమన్యస్వామి ప్రధాన దేవుడు.

ఇంకా ఇక్కడి విజయ నగర కోట కూడా చాలా ప్రసిద్ది. ఇక్కడనే ప్రఖ్యాత సరస్వతీ మహల్‌ గ్రంథాలయము ఉన్నది. ఈ గ్రంథాలయమున సుమారుగా 30,000 పైబడిన గ్రంథాలు ఉన్నాయి.

[మార్చు] సంస్కృతి

భారతదేశపు సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక కేంద్రాలలో తంజావూరు ఒకటి. ఈ నగరము ముఖ్యముగా కర్నాటిక సంగీతానికి చేసిన సేవలకూ, భరత శాస్త్రానికి చేసిన సేవలకు నిలుస్తుంది. అలాగే తంజావూరు పెయింటింగు చాలా ప్రసిద్ది. ఇంకా వీణ, తంజావూరు బొమ్మలు, తవిల్‌ ఇక్కడి ప్రముఖమైన విషయములు.

[మార్చు] చరిత్ర

చారిత్రకముగా ఈ నగరము ఒకప్పుడు చోళ రాజులకు బలమైన కేంద్రము. తరువాత నాయక రాజులు తరువాత విజయ నగర రాజులు ఈ నగరాన్ని పాలించినారు. తరువాత మరాఠా రాజులు కూడా ఈ నగరాన్ని ఏలినారు.

1674 వ సంవత్సరములో మరాఠాలు ఈ నగరాన్ని వెంకాజీ నాయకత్వములో ఆక్రమించుకున్నారు. వెంకాజీ శివాజీ మహా రాజు నకు తమ్ముడు. 1749 వ సంవత్సరములో భ్రిటీషు వారు మొదట ఇక్కదికి వచ్చినారు కాని విఫలం చెంది తరువాత 1799 లో విజయం సాధించినారు.

[మార్చు] భౌతిక వివరణలు

ఈ నగరము తమిళనాడు నందలి నగరాలలో ఎనిమిదవ పెద్దది. జనాభా సుమారుగా 2,25,000 మంది. ఇక్కది ప్రజలలో తమిళులు, తెలుగు వారు ఎక్కువగా ఉంటారు. తరువాత సౌరాష్ట్రీయులు, మరాఠీలు ఉంటారు.

[మార్చు] ఉద్యోగాలు

ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయదారులు. ఇక్కడ్‌ ఉన్న నలభైకిపైబదిన మెడికల్‌ కాలేజీల వల్ల ఎక్కువ సంఖ్యలో డాక్టర్లను కూడా చూడ వచ్చు.

[మార్చు] భౌగోళికంగా

నగరం ఓ ఫ్ల్య్‌ ఓవరు వల్ల రెండుగా విభజించబడినది. పాత నగరం వ్యాపార కేంద్రము, కొత్త నగరం ఎక్కువగా నివాస కేంద్రము. ఈ జిల్లా సరిహద్దులుగా 'వాయలూరు, గురువడి, పల్లియగ్రారం, కరంథై, పాత నగరం, నంజికోట్టై, విలార్‌, కీలవస్తచావిడీ ఉన్నాయి.

[మార్చు] విద్యా కేంద్రముగా

తంజావూరు ప్రముఖ విద్యాకేంద్రముగా వెలుగొందుతున్నది. తంజావూరు నందు రెండు యూనివర్సిటీలు కలవు. tamil yUnivarsiTI సస్త్ర డీండ్‌ యూనివర్సిటీ

ఇంకా ఎన్నో కాలేజీలు ఉన్నాయి.

[మార్చు] బాయ్హ లింకులు