మన్వంతరము
వికీపీడియా నుండి
ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మదినము లో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నామని హిందువులు భావిస్తారు. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది.
విషయ సూచిక |
[మార్చు] మన్వంతరాల పేర్లు
- స్వయంభువ
- స్వారోచిష
- ఉత్తమ
- తామస
- రైవత
- చక్షుష
- వైవస్వత (ప్రస్తుత మన్వంతరము)
- సావర్ణి
- దక్షసావర్ణి
- బ్రహ్మసావర్ణి
- ధర్మసావరణి
- రుద్రసావర్ణి
- దేవసావర్ణి
- ఇంద్రసావర్ణి
[మార్చు] ఎన్నెన్ని సంవత్సరాలు?
దేవతల కాల ప్రమాణము మన(మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగకాల సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.
- కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
- త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
- ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
- కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు
- మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు - ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)
ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి.ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.
కాలమానము | సౌర (మానవ) సంవత్సరాలు | దివ్య సంవత్సరాలు |
---|---|---|
ఒక చతుర్యుగము | 43,20,000 | 12,000 |
71 చతుర్యుగములు | 30,67,20,000 | 8,52,000 |
ప్రతి కల్పాదియందు వచ్చు సంధ్య | 17,28,000 | 4,800 |
14 సంధ్యా కాలములు | 2,41,92,000 | 67,200 |
ఒక సంధ్యాకాలముతో పాటు ఒక మన్వంతరము | 30,84,48,000 | 8,56,800 |
14 సంధ్యలతో పాటు కలిపిన 14 మన్వంతరములు | 4,31,82,72,000 | 1,19,95,200 |
14 మన్వంతరములు + కల్పాది సంధ్య = ఒక కల్పము = బ్రహ్మకు ఒక పగలు | 4,32,00,00,000 | 1,20,00,000 |
[మార్చు] ముఖ్య సంఘటనలు
వెనుకటి మన్వంతరాలలో జరిగిని కొన్ని ముఖ్య సంఘటనలు
- స్వయంభువ
- ధృవుడు దేవుని కొరకై తపస్సు చేసి, దేవుని దర్శనము పొందాడు
- ప్రహ్లాదుని జననము, నరసింహ అవతారము
- స్వారోచిష
- సురత చక్రవర్తి వృత్తాంతము
- తామస
- చక్షుష
- కూర్మావతారము
- దేవతలు, రాక్షసులు కలిసి అమృతము కొరకై క్షీరసాగర మథనము చేశారు
- లక్ష్మీ దేవి అవతరణ
- శివుడు కాలకూట విషము మింగాడు.
[మార్చు] వనరులు
చతుర్యుగాలు కూడా చూడండి
- శ్రీ జయదయాల్ గోయందకా రచన - శ్రీమద్భగవద్గీత తత్వవివేచనీ వ్యాఖ్య