తెలుగు సాహితీకారులు

వికీపీడియా నుండి

ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది.
వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి.
ప్రముఖ తెలుగు కావ్యాల కొరకు ప్రముఖ కావ్యాలు చూడండి. 

ఆదికవి నన్నయ (నన్నయ భట్టారకుడు) కు ముందు తెలుగులో ప్రామాణిక గ్రంధాలు లేవు. మహా భారతము అనువాదానికి పూనుకొన్నపుడు రచనకు అవసరమైన కథాంశాన్ని సంస్కృత మూలం నుండి స్వీకరించినా, రచనకు అవసరమైన భాష, శైలి, వ్యాకరణం మొదలైన వాటిని తానే సృజించుకున్నాడు. అందుకే ఆయన ఆదికవి అయ్యాడు, వాగనుశాసనుడైనాడు. నన్నయ తరువాత కవిబ్రహ్మ తిక్కన (తిక్కన సోమయాజి) మహాభారత రచనను కొనసాగించాడు. ఎర్రన (ఎర్రాప్రగడ) పూర్తి చేసాడు. ప్రబంధ పరమేశ్వరుడు అని ఆయనకు పేరు. ఈ ముగ్గురినీ కవిత్రయం అంటారు.


తరువాతి కాలాల్లో తెలుగు భాష ఎన్నో మార్పులకు లోనైంది. తెలుగు సాహిత్యం లో ఎన్నో మార్పులు వచ్చాయి. పురాణాలు, భక్తి రస రచనలు దాటి, శ్రింగార రస ప్రధానమైన రచనల కాలం వచ్చింది. అదే ప్రబంధ యుగం. శ్రీనాథుడు ఈ యుగంలో ప్రముఖ రచయిత. ఈ కాలంలో శ్రీకృష్ణదేవ రాయల కాలం తెలుగు భాషకు ఒక స్వర్ణ యుగం గా పరిగణించవచ్చు. స్వయంగా కవీ, కవి పోషకుడూ నైన రాయలు తన ఆస్థానంలో అష్ట దిగ్గజాలనే ఎనిమిది మంది కవులను పోషించాడు.


తదుపరి కాలం వేమనది. వేమన చరిత్ర అస్పష్టంగా ఉంది. ప్రజలకు చక్కగా అర్ధమయ్యేలా, తేట తెలుగు లో వేమన చెప్పిన పద్యాలు ఈ నాటికీ ప్రజలను అలరిస్తున్నాయి.


తరువాతి కాలం ఆధునిక యుగం. భాషలోను, సాహిత్య రీతులలోను గణనీయమైన మార్పులు వచ్చిన కాలం ఇది. సామాన్య ప్రజలకు అర్ధం కాని గ్రాంధిక భాషను పక్కన పెట్టి, వాడుక భాషలో రచనలు చెయ్యడం మొదలైంది. గిడుగు రామమూర్తి వాడుక భాషా ఉద్యమానికి పితామహుడు. గురజాడ దీనికి మరింత ఊతమిస్తూ వాడుక భాషలోనే రచనలు చేసాడు.


భావ కవిత్వం, విప్లవ కవిత్వం, దిగంబరులు, పైగంబరులు, వచన కవిత, కథ, అవధానం, నవల, నవలిక, పేరడీ, ఘజల్‌, రుబాయీలు, హై-కు, కాల్పనికవాదం, వాస్తవికత, అధివాస్తవికత, దళిత వాదం, స్త్రీ వాదం ఇలా ఎన్నో సాహిత్య రూపాలు, ఎన్నో వాదాలు, ఇజాలు ఈ కాలం లో వచ్చాయి, వస్తున్నాయి.


ఎందరో మహాను భావులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు. వారి గురించి తెలుసుకొనడానికి ఇది ఒక వేదిక, ఒక సూచిక.

తెలుగు సాహితీకారులను కింది విధాలుగా వర్గీకరించవచ్చు.

విషయ సూచిక

[మార్చు] మొదటి తరానికి చెందిన కవులు (పురాణ కవులు)

  1. నన్నయ్య
  2. తిక్కన్న
  3. ఎఱ్రన్న

[మార్చు] మధ్య యుగమునకు చెందిన కవులు (ప్రబంధ కవులు)

  1. పోతన
  2. అన్నమయ్య
  3. శ్రీనాథుడు
  4. తెనాలి రామలింగడు
  5. నన్నెచోడుడు
  6. మొల్ల
  7. తాళ్ళపాక తిమ్మక్క
  8. వేమన
  9. ధూర్జటి
  10. అల్లసాని పెద్దన
  11. నంది తిమ్మన
  12. గోన బుద్దారెడ్డి
  13. చేమకూర వెంకటకవి
  14. ముద్దుపళని
  15. రంగాజమ్మ

[మార్చు] ఆధునిక కవులు, రచయితలు

  1. అడవి బాపిరాజు
  2. అబ్బూరి వరదరాజేశ్వరరావు
  3. ఆచార్య ఆత్రేయ
  4. ఆరుద్ర (భాగవతుల శంకరశాస్త్రి)
  5. ఇంద్రగంటి హనుమఛ్ఛాస్త్రి
  6. కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి
  7. కందుకూరి వీరేశలింగం పంతులు
  8. కాళీపట్నం రామారావు
  9. కాళోజీ నారాయణరావు
  10. కె.ఎన్‌.వై.పతంజలి
  11. కె.వి.రమణారెడ్డి
  12. రాబర్ట్ కాల్డ్వెల్
  13. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్
  14. పరవస్తు వెంకట రంగాచార్యులు
  15. కొమర్రాజు లక్ష్మణరావు
  16. డాక్టర్‌ కేశవరెడ్డి
  17. కొడవటిగంటి కుటుంబరావు
  18. కొసరాజు రాఘవయ్య చౌదరి
  19. గుంటూరు శేషేంద్రశర్మ
  20. చిన్న తిరుమలాచార్యులు
  21. తిరుపతి వేంకట కవులు
  22. తాళ్ళపాక చిన తిరు వేంగళనాథుడు
  23. గురజాడ అప్పారావు
  24. చలం (గుడిపాటి వెంకట చలం)
  25. చాగంటి సోమయాజులు
  26. చిన్నయసూరి
  27. జాషువా
  28. తుమ్మల సీతారామమూర్తి
  29. తిక్కవరపు పఠాభిరామిరెడ్డి
  30. త్రిపురనేని గోపీచందు
  31. త్రిపురనేని రామస్వామిచౌదరి
  32. దాశరథి కృష్ణమాచార్య
  33. దాశరధి రంగాచార్య
  34. దిగంబర కవులు
  35. దువ్వూరి రామిరెడ్డి
  36. దేవరకొండ బాలగంగాధర తిలక్‌
  37. దేవులపల్లి కృష్ణశాస్త్రి
  38. నండూరి సుబ్బారావు
  39. పుట్టపర్తి నారాయణాచార్యులు
  40. పురాణం సుబ్రహ్మణ్యశర్మ
  41. పెద్ద తిరుమలాచార్యులు
  42. బలివాడ కాంతారావు
  43. బుచ్చిబాబు
  44. బోయి భీమన్న
  45. మొక్కపాటి నరసింహ శాస్త్రి
  46. మల్లాది రామకృష్ణశాస్త్రి
  47. ముళ్ళపూడి వెంకటరమణ
  48. రాచకొండ విశ్వనాధ శాస్త్రి
  49. రాయప్రోలు సుబ్బారావు
  50. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
  51. రంగనాయకమ్మ
  52. వట్టికోట ఆళ్వారుస్వామి
  53. వడ్డెర చండీదాస్‌
  54. వరవరరావు
  55. విశ్వనాథ సత్యనారాయణ
  56. వేగుంట మోహన్‌ ప్రసాద్‌
  57. వేటూరి ప్రభాకరశాస్త్రి
  58. వేటూరి సుందరరామమూర్తి
  59. శంకరంబాడి సుందరాచారి
  60. శ్రీశ్రీ
  61. సత్యం శంకరమంచి
  62. సిద్దేంద్ర యోగి
  63. సినారె (సి నారాయణ రెడ్డి)
  64. సిరివెన్నెల సీతారామశాస్త్రి
  65. సంజీవదేవ్‌
  66. మిరియాల రామకృష్ణ
  67. బూదరాజు రాధాకృష్ణ
  68. కె.శివా రెడ్డి
  69. డా.పాపినేని శివశంకర్
  70. ఎం.వి. రామి రెడ్డి
  71. దేవి ప్రియ
  72. ఆశారాజు
  73. కందుకూరి శ్రీ రాములు
  74. నందిని సిద్దా రెడ్డి
  75. బండ్ల మాధవ రావు
  76. డా. వి. చంద్రశేఖర రావు
  77. నాళేశ్వరం శంకరం
  78. కొప్పర్తి వేంకట రమణ మూర్తి
  79. యాకూబ్
  80. శిలాలోలిత
  81. బి.నరసింగ రావు
  82. గద్దర్
  83. అఫ్సర్
  84. సీతారాం
  85. మంచికంటి

[మార్చు] తెలుగు వాగ్గేయకారులు

  1. క్షేత్రయ్య
  2. అన్నమయ్య
  3. రామదాసు
  4. త్యాగరాజు
తెలుగు సాహిత్యము|తెలుగు సాహితీకారులు|ప్రముఖ కావ్యాలు

peddibotla subbaramaiah