మోటుపల్లి
వికీపీడియా నుండి
మోటుపల్లి రేవు (Motupalli), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము ప్రకాశం జిల్లాలోని చినగంజాము నుండి 12 కిలోమీటర్ల దూరములో ఉన్నది. 1298 లో ప్రసిద్ధ యాత్రికుడు మార్కోపోలో ఇక్కడే తీరాన్ని చేరాడని భావిస్తారు. చరిత్రకారులకు, పరిశోధకులకు ఈ ప్రదేశము చాలా ముఖ్యమైనది. ప్రాచీన ఓడ రేవైన మోటుపల్లి 1వ శతాబ్దము నుండి అనేక రాజ వంశాల పాలనలో విరాజిల్లినది. పూర్వము బౌద్ధ క్షేత్రమైన మోటుపల్లిలో అనేక బౌద్ధ స్థూపాలు, శిల్పాలు కూడా ఉన్నాయి. మోటుపల్లి లో ఒక ప్రాచీన రామాలయము కూడా కలదు.
మార్కోపోలో సందర్శనా కాలములో మోటుపల్లిని ఒక తెలివైన రాణి పాలించేదని, ఆమె తన ప్రజలను న్యాయముగా సమానముగా పాలించేదని పేర్కొన్నాడు. ఆమె రాజ్యములోని ప్రజలు బియ్యము, మాంసము, పాలు, పండ్లు మరియు చేపలు తిని జీవించేవారని రాసాడు. ఇతరత్రా చెప్పుకోదగిన విషయాలలో రాజ్యంలోని వజ్రాల ఉత్పాదన గురించి, రాజులకు తగినటువంటి సున్నితమైన వస్త్రాల గురించి, పుష్కలమైన మృగసంపద, భారీ గొర్రెలను గురించిన సంగతులు రాసాడు. మోటుపల్లి, ప్రకాశం జిల్లా, చినగంజాము మండలానికి చెందిన గ్రామము
ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |