ఆర్యభట్టారకుడు

వికీపీడియా నుండి

ఆర్యభట్ట భారతదేశ అత్యున్నత గణిత శాస్త్రవేత్తలలో అగ్రగణ్యుడు. ఇతను క్రీ.శ. 476-550 ప్రాంతంలో నివసించినట్లు అంచనా. ఆర్యభట్ట కుసుమపుర (ఈనాటి పాట్నా) లో నివసించాడు. ఇతను ఆర్యభట్టీయ, ఆర్య సిధ్ధాంత, గోళాధ్యాయ మరియు సంస్కృత గణిత సంఖ్యా శాస్త్రాన్ని రచించాడు. ఇవే కాక ఆర్యభట్ట పై విలువని సుమారుగా కనుకున్నట్లు చెప్తారు. గణితం లో మనం నేర్చుకున్న సైన్ మరియు కొసైన్ లను ఇతను "జ్యా" మరియు "కొజ్యా" గా నిర్వచించాడు.


ప్రపంచంలో చాలా మంది ప్రముఖ గణిత శాస్త్రవేత్తల కష్టాలకు కారణమైన భూమి యొక్క ఆకారాన్ని గోళాకారంగా ఆనాడే తన గోళాధ్యాయలో నిర్వచించాడు. అంతేకాదు మన గ్రహాల యొక్క ప్రకాశం స్వయంప్రకాశం కానే కాదని, అది కేవలం సూర్యకాంతి పరివర్తన వలన అని చెప్పాడు. సూర్య గ్రహణాలను ఖచ్చితంగా లెక్క కట్టాడు.


భూమి ఏదైనా స్థిర నక్షత్రం చుట్టూ తిరగటానికి పట్టే సమయం 23 గంటల, 56 నిమిషాల, 4.1 సెకనులు గా లెక్కగట్టాడు. ఈనాటి ఆధునిక లెక్కల ప్రకారం అది 23 గంటల, 56 నిమిషాల, 4.091 గా తేలింది.