ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ

వికీపీడియా నుండి

గిన్నిస్ బుక్ లోగో
పెద్దది చెయ్యి
గిన్నిస్ బుక్ లోగో
గిన్నిస్ బుక్ పత్రం
పెద్దది చెయ్యి
గిన్నిస్ బుక్ పత్రం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎ.పి.యస్.ఆర్.టి.సి), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ. ప్రపంచంలోనే ప్రభుత్వ రంగంలో నడుస్తున్న అతి పెద్ద రోడ్డు రవాణా సంస్థగా గిన్నిస్ బుక్ లో నమోదైనది. 1932 లో 27 బస్సులతో ప్రారంభమైన ఈ రవాణా సంస్థ ఇప్పుడు 19,000 బస్సులతో ప్రతి రోజు 1.2 కోట్లమంది జనాలను, 1 లక్షా 17 వేలమంది సిబ్బంది సహాయముతో రవాణ చేస్తుంది.

రాష్ట్రములోని జిల్లాలు, పట్టణాలు, గ్రామాలను అనుసంధానించడమే కాక పెద్ద నగరములలో సిటీ బస్సు సేవలను మరియు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఒరిస్సా, చత్తీస్‌ఘడ్, గోవా, కర్ణాటక, తమిళనాడు మరియు పాండిచ్చేరిలకు కూడా బస్సులు నడుపుతున్నది.


[మార్చు] ఎర్ర బస్సు పుట్టుక

1932లో నిజాం సర్కారు ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆర్టీసి బస్సు
పెద్దది చెయ్యి
1932లో నిజాం సర్కారు ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆర్టీసి బస్సు

తెలంగాణాను నైజాం ప్రభువులు పాలించే రోజులలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు రాష్ట్రంలో ఉండేవి. నైజాంలో అప్పటికె " నిజాం స్టేట్ రైల్వేస్ " అనే సంస్థ రైళ్ళు నడుపుతోంది. అందులో ఒక భాగంగానే 1932లో జూన్‍లో " రోడ్ ట్రాన్స్‍పోర్టు " ప్రారంభించారు. మూడులక్షల తొంబైమూడువేల రూపాయల మూల పెట్టుబడితో , మూడు డిపోలు, 27 బస్సులు , 166 మంది కార్మికులతో అది ప్రారంభమైనది. నవంబర్ 1వ తారీఖు 1951 నుండి 1958 వరకు హైదరాబాద్ రాష్ట్ర రవాణాసంస్థగా ఉండేది.





[మార్చు] ప్రెవేటు రవాణా జాతీయం

 1932లో బస్సు
పెద్దది చెయ్యి
1932లో బస్సు
1946 లో బస్సు
పెద్దది చెయ్యి
1946 లో బస్సు
1946 లో మేడ బస్సు
పెద్దది చెయ్యి
1946 లో మేడ బస్సు
1950 లో బస్సు
పెద్దది చెయ్యి
1950 లో బస్సు
1952 లో బస్సు
పెద్దది చెయ్యి
1952 లో బస్సు


దేశస్వాతంత్ర్యం , ఆ తర్వాత తెలంగాణా , కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్ని ఏకం చేస్తూ ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిపోయాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ప్రెవేటు రవాణాను జాతీయం చేస్తూ 1958 జనవరి 11న " ఆంధ్ర ప్రదేశ్ రోడ్దు రవాణా సంస్థ " ఏర్పాటైంది. ఆంద్ర ప్రాంతంలో దశల వారీగా ప్రైవేటు రవాణాను జాతీయుం చేశారు. 1950లో కేంద్రప్రభుత్వం ఆర్.టి.సి. చట్టం చేసింది. దాని ప్రకారం ఆర్టీసీలో రాష్ట్రం, కేంద్రం 2:1 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ విషయానికొచ్చేసరికి 1988 వరకు ఈ నిష్పత్తి కొనసాగింది. ఆ తర్వాత కేంద్రం, రాష్ట్రం కూడా ఆర్టీసీకి నిధులు కేటాయింపు నిలిపేశాయి. అంత వరకు రాష్ట్రప్రభుత్వం 140 కోట్లు, కేంద్రం 70 కోట్లు కలపి మొత్తం 210 కోట్ల రూపాయలు ఆర్టీసీకి పెట్టుబడి పెట్టాయి. 1989నుంచి ఈ పెట్టుబడుల కోసం ఆర్టీసీ అప్పులు చేయడం ప్రారంభించింది.

 గ్రామీణ బస్సు
పెద్దది చెయ్యి
గ్రామీణ బస్సు
మేడ బస్సు
పెద్దది చెయ్యి
మేడ బస్సు
ఎక్స్‌ప్రెస్ బస్సు
పెద్దది చెయ్యి
ఎక్స్‌ప్రెస్ బస్సు
డీలక్స్ బస్సు
పెద్దది చెయ్యి
డీలక్స్ బస్సు
గరుడా ఎ.సి. బస్సు
పెద్దది చెయ్యి
గరుడా ఎ.సి. బస్సు


ప్రస్తుతం 95 శాతం బస్సు రూట్ల, లక్షా 17వేల సిబ్బందితో, 19700 బస్సులతో, 212 డిపోలతో, 202 కోట్ల రూపాయల మూల ధనంతో ఆర్టీసీ విస్తరించింది. ఇప్పుడు ఆర్టీసీ ఆస్తుల వలువ 8వేల కోట్ల రూపాయలపైమాటె.

[మార్చు] బయటి లింకులు

ఇతర భాషలు