తిక్కన

వికీపీడియా నుండి

తిక్కన్న(1205 - 1288) మహాభారతము లోని నన్నయ్య పర్వాలు కాకుండా మిగిలిన పర్వాలు పూర్తిచేసినాడు. తిక్కన భారతంలో పదిహేను పర్వాలు రచించినాడు.

ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి.


తిక్కన
తిక్కన

ఆది కవి నన్నయ గారు ఆది పర్వము, అరణ్యపర్వము కొంతభాగము రచించి గతించిరి.

తిక్కనగారు అరణ్యపర్వమును వదలి, మిగిలిన పర్వములు రచించిరి. ముందుగా యజ్ఞము చేసి, సోమయాజియై, పిదప ఈ బృహత్తర కార్యక్రమమునకు ఉపక్రమించిరి.ఈయనకు "కవి బ్రహ్మ", "ఉభయ కవి మిత్రుడు" అను బిరుదులు కలవు.


అరణ్యపర్వములో మిగిలిన భాగమును ఎఱ్ఱన గారు రచించిరి

శివకేశవుల అభేదమును తెల్పు హరిహరనాధుని స్తుతితో తిక్కన గారు భారతము ప్రారంభించారు:

శ్రీయన గౌరినాబరగు చెల్వకు చిత్తము పల్లవింప భ
ద్రాయితమూర్తియై హరిహరంబగు రూపము దాల్చి 'విష్ణు రూ
పాయ నమశ్శివాయ' యని పల్కెడు భక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్టసిద్ధికిన్

తిక్కన గారి మరి కొన్ని కొన్ని పద్యములు:


ద్రౌపది కీచకునితో:
దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫురత్
గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యాపారగుల్ మత్పతుల్
గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దోర్లీలన్ వెసంగిట్టి గం
ధర్వుల్ మానము బ్రాణమున్ గొనుట తధ్యంబెమ్మెయిన్ గీచకా  

ఉత్తర గోగ్రహణ సమయమున ద్రోణుడు:
సింగంబాకటితో గుహాంతరమునన్ జేర్పాటుమై యుండి మా
తంగ స్ఫూర్జిత యూధ దర్శన సముద్యత్క్రోధమై వచ్చు నో
జం గాంతార నివాస ఖిన్న మతి యస్మత్ సేనపై వీడె వ
చ్చెం గుంతీ సుత మధ్యముండు సమర స్థేమాభిరామాకృతిన్ 




టాంకు బండ పై విగ్రహాలు బొమ్మ:TankBund.jpg
సికింద్రాబాదు నుండి వరసగా

సమర్పణ ఫలకం | రుద్రమ దేవి | మహబూబ్ ఆలీఖాన్ | సర్వేపల్లి రాధాకృష్ణన్ | సి.ఆర్.రెడ్డి | గురజాడ అప్పారావు | బళ్ళారి రాఘవ | అల్లూరి సీతారామరాజు | ఆర్థర్ కాటన్ | త్రిపురనేని రామస్వామిచౌదరి | పింగళి వెంకయ్య | మగ్దూం మొహియుద్దీన్ | సురవరం ప్రతాపరెడ్డి |జాషువ | ముట్నూరి కృష్ణారావు | శ్రీశ్రీ | రఘుపతి వెంకటరత్నం నాయుడు |త్యాగయ్య| రామదాసు | శ్రీకృష్ణదేవరాయలు | క్షేత్రయ్య | పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి | బ్రహ్మనాయుడు | మొల్ల | తానీషా | సిద్ధేంద్ర యోగి | వేమన | పోతనామాత్యుడు | అన్నమాచార్య | ఎర్రాప్రగడ | తిక్కన సోమయాజి | నన్నయభట్టు | శాలివాహనుడు