విశాఖపట్నం

వికీపీడియా నుండి

విశాఖపట్నం జిల్లా
రాష్ట్రము: ఆంధ్ర ప్రదేశ్
ప్రాంతము: కోస్తా
ముఖ్య పట్టణము: విశాఖపట్నం
విస్తీర్ణము: 11,161 చ.కి.మీ
జనాభా (2001 లెక్కలు)
మొత్తము: 37.89 లక్షలు
పురుషులు: 19.03 లక్షలు
స్త్రీలు: 18.86 లక్షలు
పట్టణ: 15.11 లక్షలు
గ్రామీణ: 22.77 లక్షలు
జనసాంద్రత: 340 / చ.కి.మీ
జనాభా వృద్ధి: 15.36 % (1991-2001)
అక్షరాస్యత (2001 లెక్కలు)
మొత్తము: 59.45 %
పురుషులు: 68.84 %
స్త్రీలు: 49.99 %
చూడండి: ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు

విశాఖపట్నం (విశాఖ , విశాఖపట్టణం , వైజాగ్‌) భారత దేశం లోని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లోని ప్రముఖ నగరం.ఆంధ్రప్రదేశ్ లో గ్రేటర్ సిటి హోదా పొందిన తొలి నగరం (హైదరాబాదు కంటే ముందే). బ్రిటిషు పాలనలో వాల్తేరుగా కూడా పిలువబడింది ఈ నగరం. బంగాళా ఖాతం ఒడ్డున కల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. స్వతంత్ర భారత దేశపు మొట్ట మొదటి ఓడ- "జల ఉష" ఇక్కడే తయారయి, అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేసింది. సుందరమైన సముద్ర తీరం, అహ్లాదకరమైన కొండలతో అలరారే విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల ఎన్నో ప్రసిద్ధ యాత్రా స్థలాలు ఉన్నాయి. అద్భుతమైన అరకు లోయ సౌందర్యం, మన్యం అడవుల సౌందర్యం, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు, 11 వ శతాబ్ది నాటి దేవాలయం, ప్రాచీన బౌద్ధ స్థలాలు మొదలైన ఎన్నో యాత్రా స్థలాలు విశాఖ చుట్టుపట్ల చూడవచ్చు. విశాఖపట్నం రేవుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది సహజ సిద్ధమైన నౌకాశ్రయం. సముద్రంలోకి చొచ్చుకొని ఉన్న కొండ కారణంగా నౌకాశ్రయానికి అలల ఉధృతి తక్కువగా ఉంటుంది. డాల్ఫిన్స్‌నోస్‌ అనే ఈ కొండ సహజ సిద్ధమైన బ్రేక్‌వాటర్స్‌ గా పని చేస్తుంది.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

శివ పార్వతుల తనయుడు, శుక్ర గ్రహాధినేత, యుద్ధాల దేవుడు, ధైర్య సాహసాలకు మారు పేరూ నైన, విశాఖ పేరిట నగరానికి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. ప్రాచీన గ్రంధాలైన రామాయణ, మహాభారతా లలో ఈ ప్రాంత ప్రస్తావన ఉన్నట్లు కనిపించుచున్నది. రాముడు సీత కొరకు వెదకుచూ ఈ ప్రాంతం గుండానే వెళ్ళినట్లు, ఈ పరిసరాల్లోనే శబరి ని కలవగా ఆమే హనుమంతుడు నివసించే కొండలకు దారి చూపినట్లు గా రామాయణం తెలియజేస్తున్నది. రాముడు జాంబవంతుని కలిసింది కూడా ఈ ప్రాంతం లోనే. ఈ ప్రాంతంలోనే భీముడు బకాసురుని వధించినాడని ప్రతీతి. ఇక్కడికి 40 కి మీల దూరంలోని ఉప్పలం గ్రామం లో పాండవుల ఆయుధాలను (రాతి)చూడవచ్చు.


స్థానికంగా వినవచ్చే కథ ఒకటి ఇలా ఉంటుంది.. (9-11 శతాబ్దపు) ఒక ఆంధ్ర రాజు, కాశీ కి వెళ్తూ ఇక్కడ విశ్రాంతి కొరకు ఆగాడు. ఆ ప్రదేశ సౌందర్యానికి ముగ్ధుడై తన ఆరాధ్య దైవమైన విశాఖకు ఇక్కడ ఒక గుడి నిర్మింపజేసాడు. కాని పురాతత్వ శాఖ ప్రకారం మాత్రం ఈ గుడి 11, 12 శతాబ్దాలలో కుళోత్తుంగ చోళునిచే నిర్మించబడినదని తెలుస్తోంది. శంకరయ్య చెట్టి అనే ఒక సముద్ర వ్యాపారి ఒక మండపాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ గుడి లేనప్పటికీ, - ఒక 100 ఏళ్ళ కిందట తుపానులో కొట్టుకు పోయి ఉండవచ్చు - ఈ ప్రాంతపు పెద్దవారు తమ తాతలతో ఈ గుడికి వెళ్ళినట్లుగా చెప్పే వృత్తాంతాలు ఉన్నాయి.


గోదావరి నది వరకు విస్తరించిన ప్రాచీన కళింగ సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతపు ప్రస్తావన క్రీ. పూ. 5, 6 శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంధాలలోను, క్రీ.పూ. 4 వ శతాబ్ది కి చెందిన సంస్కృత వ్యాకరణ పండితులైన పాణిని, కాత్యాయనుని రచనల లోను కలదు.


ఈ ప్రాంతాన్ని ఎన్నో ప్రముఖ వంశాల వారు పరిపాలించారు. వాటిలో కొన్ని: 7 వ శతాబ్దం లో కళింగులు, 8 వ శతాబ్దం లో చాళుక్యులు, తరువాతి కాలంలో రాజమండ్రి రెడ్డి రాజులు, చోళులు, గోల్కొండకు చెందిన కుతుబ్‌ షాహి లు, మొగలులు, హైదరాబాదు నవాబులు.


18 వ శతాబ్దంలో విశాఖపట్నం ఉత్తర సర్కారులలో భాగంగా ఉండేది. కోస్తా ఆంధ్ర లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత బ్రిటిషు వారి అధీనంలోకి వెళ్ళాయి. మద్రాసు ప్రెసిడెన్సీ లో విశాఖపట్నం ఒక జిల్లాగా ఉండేది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి విశాఖపట్నమే దేశంలోకెల్లా అతి పెద్ద జిల్లా. తరువాత దానిని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలుగా విడగొట్టారు.

vysakeshwara swamy valana visakhapatnam ani peru vachindi, vysakeshwara swamy vigrahamu samudramulo kottuku vachindi.ippude aaa vigraham sagaradurga gudi lo undi

[మార్చు] ఘటనలు

  • ప్రతి సంవత్సరం సంక్రాంతి (జనవరిలో) సందర్భంగా విశాఖ ఉత్సవ్‌ జరుగుతుంది.
  • 2004 డిసెంబరు నాటి సునామీ దుర్ఘటన సందర్భంగా తీరప్రాంతంలో ఉన్నప్పటికీ, ఎండబెట్టిన చేపలు కొట్టుకొని పోవడం తప్పించి, విశాఖపట్నం ఏమంత దెబ్బ తినలేదు.

[మార్చు] విశాఖపట్నం చరిత్ర గతి

  • క్రీ.పూ.260: అశోకుడు కళింగ రాజ్యాన్ని జయించాడు.
  • క్రీ.పూ.208: చంద్ర శ్రీ శాతకర్ణి ఏలుబడి.
  • క్రీ.శ.14 వ శతాబ్దం: సింహాచల దేవాలయ నిర్మాణం.
  • 1515: శ్రీ కృష్ణదేవ రాయల ఏలుబడి
  • క్రీ.శ.17వ శతాబ్ది మధ్య భాగం: బ్రిటిషు వారి ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారిచే కర్మాగార స్థాపన.
  • 1689: ఔరంగజేబు సేనలచే ఈ కర్మాగార ఆక్రమణ.
  • 1735: డచ్చి వారిచే స్థావర నిర్మాణం.
  • 1765: బ్రిటిషు వారి ఏలుబడిలోకి ఉత్తర సర్కారులు. తదనంతరం వారు తమ స్థావరం ఏర్పాటు చేసుకున్నారు.
  • 1904: మద్రాసు నుండి విశాఖపట్నం ద్వారా కలకత్తా కు రైలు మార్గం ప్రారంభం.
  • 1926: ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపన.
  • 1933: విశాఖపట్నం నౌకాశ్రయం స్థాపన.
  • 1942: జపాను యుద్ధ విమానాల దాడి.
  • 1947: తూర్పు నావికా దళ స్థాపన. 1947 కు పూర్వం రాయల్‌ నేవీ కి హఈశ్‌ సర్కార్స్‌ రూపంలో స్థావరం ఉండేది.
  • 1949: సింథియా నౌకా నిర్మాణ కేంద్ర స్థాపన. జాతియం చేసిన తరువాత అది హిందుస్థాన్‌ షిప్‌యార్డు గా మారింది.
  • 1957: కాల్టెక్స్‌ చమురు శుద్ధి కర్మాగార స్థాపన.
  • 1981: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం స్థాపన.
  • [1998]: Yuvabharathi anu samstha stapinchabadinadi

[మార్చు] పరిశ్రమలు

విశాఖ ప్రముఖ పారిశ్రామిక కేంద్రం. ఎన్నో భారీ పరిశ్రమలు ఇక్కడ నెలకొని ఉన్నాయి. వాటిలో కొన్ని:

  • HPCL— చమురు శుద్ధి కర్మాగారం
  • విశాఖపట్నం ఉక్కు సంస్థ
  • జింకు శుద్ధి కేంద్రం
  • భారత్‌ హెవీ ప్లేట్స్‌ అండ్‌ వెస్సెల్స్‌ లిమిటెడ్‌
  • హిందూస్థాన్‌ షిప్‌యార్డు
  • కోరమండల్‌ ఫెర్టిలైజర్సు

IT/ITES రంగంలో శీఘ్రంగా పురోగమిస్తున్న నగరాలలో విశాఖ ఒకటి. ఇక్కడ స్థావరం ఏర్పరచుకున్న ప్రముఖ సంస్థలు:

విశాఖపట్నంలో తమ కార్యకలాపాలను ప్రారంభించే విషయమై వివిధ సంస్థలతో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం సంప్రదిస్తూ ఉంది. భారత ప్రభుత్వపు భాభా అణు పరిశోధనా సంస్థ (BARC) వారు తమ పరిశోధనా కేంద్రాన్ని, ఒక అణు విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విషయం పరిశీలిస్తున్నారు భారత నౌకా దళ తూర్పు కమాండుకు విశాఖపట్నం కేంద్ర స్థానం.

[మార్చు] కొన్ని గణాంకాలు, వాస్తవాలు

  • రెవిన్యూ డివిజన్లు (3): విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు
  • లోక్‌సభ స్థానాలు (2): విశాఖపట్నం, అనకాపల్లి
  • శాసనసభ స్థానాలు (13): విశాఖపట్నం, భీమునిపట్నం, పెందుర్తి, పాడేరు, మాడుగుల, చోడవరం, అనకాపల్లి, పరవాడ, ఎలమంచిలి, పాయకారావుపేట, నర్సీపట్నం, చింతపల్లి.
  • మండలాలు - 43
  • నదులు: నెల్లిమర్ల, చంపావతి, గోస్తని, గంభీరాలగడ్డ, నరవగడ్డ, శారద, వరాహ, తాండవ.
  • దర్శనీయప్రదేశాలు: అనకాపల్లి, పద్మనాభం గ్రామం, భీమునిపట్నం, రాజేంద్రపాళెం గ్రామం, అరకులోయ, సింహాచలం, బొర్రాగుహలు, అనంతగిరి, రామకృష్ణామిషన్ బీచ్, కైలాసగిరి.

[మార్చు] మండలాలు

భౌగోళికంగా విశాఖపట్నం జిల్లాను 43 రెవిన్యూ మండలములుగా విభజించినారు.

 విశాఖపట్నం జిల్లా మండలాలు
సంఖ్య పేరు సంఖ్య పేరు సంఖ్య పేరు
1 ముంచంగిపుట్టు 15 గొలుగొండ 28 విశాఖపట్నం మండలం
2 పెదబయలు 16 నాతవరం 29 విశాఖపట్నం (పట్టణ)
3 హుకుంపేట 17 నర్సీపట్నం 30 గాజువాక
4 డుంబ్రిగుడ 18 రోలుగుంట 31 పెదగంట్యాడ
5 అరకులోయ 19 రావికమతం 32 పరవాడ
6 అనంతగిరి 20 బుచ్చెయ్యపేట 33 అనకాపల్లి
7 దేవరాపల్లి 21 చోడవరం 34 మునగపాక
8 చీడికాడ 22 కె.కోటపాడు 35 కశింకోట
9 మాడుగుల 23 సబ్బవరం 36 మాకవరపాలెం
10 పాడేరు 24 పెందుర్తి 37 కోట ఉరట్ల
11 గంగరాజు మాడుగుల 25 ఆనందపురం 38 పాయకరావుపేట
12 చింతపల్లి 26 పద్మనాభం 39 నక్కపల్లి
13 గూడెం కొత్తవీధి 27 భీమునిపట్నం 40 శృంగరాయవరం
14 కొయ్యూరు 41 ఎలమంచిలి 42 రాంబిల్లి
43 అచ్యుతాపురం

[మార్చు] చిత్రాల్లో విశాఖపట్నం

[మార్చు] బయటి లింకులు


ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు పూర్ణ కుంభం
అనంతపురం | అదిలాబాదు | కడప | కరీంనగర్ | కర్నూలు | కృష్ణ | ఖమ్మం | గుంటూరు | చిత్తూరు | తూర్పు గోదావరి | నల్గొండ | నిజామాబాదు | నెల్లూరు | పశ్చిమ గోదావరి | ప్రకాశం | మహబూబ్ నగర్ | మెదక్ | రంగారెడ్డి | వరంగల్ | విజయనగరం | విశాఖపట్నం | శ్రీకాకుళం | హైదరాబాదు

విశాఖపట్నం, ఖమ్మం జిల్లా, భద్రాచలం మండలానికి చెందిన గ్రామము

ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి.